-
Fact Check: ఊహించినదే వార్తలుగా.. ‘ఈనాడు’ రామోజీ ఇక మారవా?
సాక్షి, అమరావతి: గత ప్రభుత్వంలో విచ్చలవిడిగా జరిగిన ఇసుక దోపిడీకి చెక్ పెడుతూ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత పారదర్శకంగా అమలు చేస్తున్న ఇసుక పాలసీపై మరోసారి 'ఈనాడు' పత్రిక అసత్యాలు, అభూత కల్పనలతో తప్పుడు కథనాన్ని ప్రచురించడాన్ని గనులశాఖ సంచాలకులు వీజీ వెంకటరెడ్డి ఒక ప్రకటనలో తీవ్రంగా ఖండించారు. 'దోచుకో... పంచుకో... తినుకో...’ అనే శీర్షికతో ‘ఈనాడు’ పత్రిక పూర్తి అవాస్తవాలతో కూడిన కథనం రాశారని, వాస్తవాలను వక్రీకరిస్తూ... అబద్దాలతో కూడిన ఆరోపణలను తమ పత్రికలో ప్రచురించారన్నారు. గతంలో జేపీ, టర్న్కీ సంస్థలపై పదేపదే తప్పుడు వార్తలు ప్రచురించిన ఈనాడు పత్రిక ఇప్పుడు అధికార పార్టీ ముఖ్య నేతలు, సిండికేట్లు అంటూ మరోసారి ఊహాత్మక ఆరోపణలతో, కట్టుకథలతో వార్తను ప్రచురించడం పట్ల ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వంలో జరిగింది ఇదే.. గత ప్రభుత్వంలో ప్రారంభంలో మహిళా సంఘాలకు ఇసుక ఆపరేషన్స్ను అప్పగించి, ఇసుక మాఫియా ధాటికి వారు పనిచేయలేని పరిస్థితిని కల్పించింది. తరువాత ప్రభుత్వం తీసుకువచ్చిన ఉచిత ఇసుక విధానంతో ఇసుక మాఫియా ఇష్టారాజ్యంగా ప్రజలను దోచుకుంది. వినియోగదారులు బ్లాక్ మార్కెట్ నుంచి అధిక ధరలకు ఇసుకను కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. కొందరు వ్యక్తుల జేబులు నింపేందుకే ఉచిత ఇసుక విధానం ఉపయోగపడింది. అటు ప్రభుత్వానికి ఐదేళ్లలో రావాల్సిన దాదాపు రూ.3825 కోట్ల ఆదాయానికి గండి పడింది. ఈ సొమ్ము ఇసుక మాఫియా జేబుల్లోకి వెళ్లింది. ఏకంగా ఒక మహిళా ఎమ్మార్వో పైనే మరోవైపు ప్రజలు అధిక ధరల్లో బ్లాక్ మార్కెట్లో ఇసుకను కొనుగోలు చేయాల్సిన పరిస్థితిని కల్పించారు. ఇసుక మాఫియాను అడ్డుకున్నందుకు పశ్చిమ గోదావరి జిల్లాలో ఏకంగా ఒక మహిళా ఎమ్మార్వో పైనే అప్పటి ప్రభుత్వ విప్, దెందులూరు ఎమ్మెల్యేగా ఉన్న చింతమనేని ప్రభాకర్ దాడి చేసిన ఘటన ఇసుక మాఫియా ఆగడాలకు అద్దం పట్టింది. గత ప్రభుత్వంలో పెద్ద ఎత్తున ఇసుక లారీలు పొరుగు రాష్ట్రాలకు తరలిపోయాయి. లెక్కా పత్రం లేకుండా విచ్చల విడిగా ఇసుక తవ్వకాలు జరిగాయి. ఈ మొత్తం విధానాన్ని మార్చేందుకు సీఎం జగన్ నూతన ఇసుక పాలసీని తీసుకువచ్చారు. ఈ విషయం 'ఈనాడు' పత్రికకు తెలియదా? కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా రాష్ట్రంలో ఇసుక టెండర్లను నిర్వహింపచేయడం, పారదర్శక విధానం, సులభతరంగా ఇసుక లభ్యత, అందుబాటు ధరల్లో వినియోగదారులకు చేరువ చేయడానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇచ్చింది. అదే క్రమంలో పర్యావరణానికి ఎటువంటి విఘాతం ఏర్పడకుండా, పూర్తి అనుమతులతో ఇసుక ఆపరేషన్స్ జరిగేలా చర్యలు తీసుకుంది. గత ప్రభుత్వంలో ఇష్టారాజ్యంగా జరిగిన ఇసుక తవ్వకాల కారణంగా ఎన్జీటి ఏకంగా రూ.100 కోట్ల జరిమానాను విధించిన సంగతి తెలిసిందే. ప్రస్తుత ప్రభుత్వం ఇసుక పాలసీ ద్వారా తీసుకున్న చర్యలను పరిశీలించిన ఎన్జీటి సంతృప్తి వ్యక్తం చేస్తూ, గత ప్రభుత్వం తప్పిదాల వల్ల విధించిన రూ.100 కోట్ల జరిమానాను కూడా రద్దు చేసింది. ఈ విషయం 'ఈనాడు' పత్రికకు తెలియదా? ఎక్కడా ఇసుక కొరత అనేది లేకుండా.. టెండర్ల ద్వారా రాష్ట్రంలో ఇసుక ఆపరేషన్స్ను దక్కించుకున్న జేపీ సంస్థ ఆధ్వర్యంలోనే ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయి. సదరు సంస్థ ప్రతి ఏటా ప్రభుత్వానికి రూ.765 కోట్లు రెవెన్యూగా చెల్లిస్తోంది. టన్ను ఇసుక ఓపెన్ రీచ్లలో రూ.475 కి విక్రయిస్తున్నారు. అలాగే రీచ్లు, డిపోల వద్ద రవాణా చార్జీలతో కలిపి ఇసుక ధరలను కూడా ప్రతివారం పత్రికల ద్వారా ప్రభుత్వం ప్రకటిస్తోంది. అంతకన్నా ఎక్కువకు ఎవరు విక్రయించినా, ఇసుక కొనుగోళ్లు రవాణాలో ఎటువంటి సమస్యలు ఉన్నా టోల్ ఫ్రీ నెంబరు ద్వారా ఫిర్యాదు చేసే సదుపాయం కల్పించాము. వినియోగదారులు నేరుగా డిపోలు, రీచ్ ల వద్దకు వెళ్ళి ఇసుక నాణ్యతను పరిశీలించి, కావాల్సినంత ఇసుకను బుక్ చేసుకునేందుకు వీలు కల్పించాం. రాష్ట్రంలో ఎక్కడా ఇసుక కొరత అనేది లేకుండా సులభతర విధానాన్ని తీసుకువచ్చాం. ఎప్పటికప్పుడు తనిఖీలు ప్రతినెలా జేపీ సంస్థ తమకు అప్పగించిన రీచ్లకు గానూ ఎంత పరిమాణంలో పర్యావరణ అనుమతులు పొందింది, ఎంత మేర ఇసుక తవ్వకాలు చేసింది, ఎంత మేర విక్రయాలు చేసిందో గనులశాఖకు నివేదిస్తుంది. గనులశాఖ అధికారులు దీనిని పరిశీలించిన తరువాతే తరువాత తవ్వకాలకు అనుమతులు మంజూరు చేస్తున్నారు. అంతేకాదు రాష్ట్రం దాటి ఇసుకను పొరుకు రాష్ట్రాలకు రవాణా చేసేందుకు వీలు లేకుండా ప్రభుత్వం జిఓ నెం.71 ద్వారా ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర సరిహద్దుల వద్ద చెక్ పోస్ట్ లను ఏర్పాటు చేసింది. గనులశాఖ రీజనల్ స్వ్కాడ్స్, ఎస్ఇబి కూడా దీనిపై ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహిస్తున్నాయి. పనికట్టుకుని తప్పుడు కథనాలు.. ఇంత పకడ్భందీగా ఇసుక విధానాన్ని అమలు చేస్తుంటే... ఈనాడు పత్రిక పనికట్టుకుని వరుసగా తప్పుడు కథనాలను ప్రచురించడం బాధాకరం. ఈ ప్రభుత్వంపై ఏదో ఒక రీతిలో బుదరచల్లే ఉద్దేశంతోనే ఇటువంటి అసత్య కథనాలను ఈనాడు పత్రిక వండి వారుస్తోంది. నియోజకవర్గాల్లో అధికారపార్టీ నేతలే సిండికేట్లుగా మారి ఇసుక తవ్వకాలు జరుపుతున్నారని ఏ సమాచారంతో ఈనాడు పత్రిక ఆరోపిస్తోంది? రాష్ట్రంలో ఏటా 2 కోట్ల టన్నుల ఇసుక వినియోగం ఉంది. దానికి అనుగుణంగానే ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయి. ఎక్కడా ఇసుక కొరత అనేది లేదు. ఏ ఆధారాలతో ఈ ఆరోపణలు.. వర్షాకాలం కోసం కూడా ముందుగానే డిపోల్లో ఇసుక నిల్వలను అందుబాటులో ఉంచుతున్నాం. 2 కోట్ల టన్నుల ఇసుక తవ్వకాలకు గానూ రూ.765 కోట్లు రెవెన్యూ వస్తుందని అంచనా. ఈనాడు పత్రిక మాత్రం ఏకంగా ఏడాదికి రూ.1800 కోట్లు ఆదాయం వస్తోందని ఏ లెక్కల ప్రకారం చెబుతోంది? పక్క రాష్ట్రాలకు ఇసుక తరలిపోకుండా ప్రభుత్వం జిఓ 71 ని జారీ చేసి, దానిని అమలు చేస్తోంది. అటువంటప్పుడు పొరుకు రాష్ట్రాలకు భారీగా అక్రమ రవాణా జరుగుతోందని ఏ ఆధారాలతో ఈనాడు పత్రిక ఆరోపణలు చేస్తోంది ఈనాడు పత్రిక చేసిన ఆరోపణల ప్రకారం పొరుగు రాష్ట్రాలకు ఇసుక తరలిపోతే, రాష్ట్రంలో అవసరాలకు ఇసుక కొరత ఏర్పడి ఉండేది కాదా? ఏ రీచ్లో అయినా కావాల్సినంత ఇసుక అందుబాటులో ఉంది. అంటే ఈనాడు పత్రిక తన కథనంలో రాసినదంతా అసత్యాలు అని అర్థమవుతోంది. ‘ఈనాడు’ రాతలకు అర్థం ఉందా? ప్రతి రీచ్ లోనూ పర్యావరణ అనుమతులు పొందిన తరువాత ఇసుక తవ్వకాలు ప్రారంభమవుతున్నాయి. ఇసుక పరిమాణం, రేటు కూడా ఖరారు అయిన తరువాత దానిపై వచ్చే ఆదాయం కూడా ముందుగానే నిర్ణయించడం జరిగింది. ఇవ్వన్నీ తెలిసి కూడా జిల్లాల్లో రీచ్ ల వారీగా అత్యధిక రేట్లకు ఇసుక తవ్వకాలు చేస్తామని ఎవరైనా ముందుకు వస్తారా? జిల్లాల వారీగా కోట్ల రూపాయల రేట్లను ఖరారు చేసి, అధికార పార్టీ నేతలకు ఇచ్చారు. వారి నుంచి ముఖ్య నేతలు లక్ష్యాలు విధించి మరీ కోట్లాది రూపాయలను వసూలు చేస్తున్నారనే రాతలకు అర్థం ఉందా? జేపీ సంస్థ నిబంధనల ప్రకారం తాను చెల్లించాల్సిన మొత్తాలను నేరుగా ప్రభుత్వానికి జమ చేస్తోంది. అన్ని రీచ్ లు వారి ఆధీనంలోనే ఉన్నాయి. అలాంటప్పుడు బయటి వ్యక్తులు ఇసుక ఆపరేషన్స్ ఎలా చేస్తారు? నెలకు జిల్లాకు రూ.150 కోట్లు ఎలా వసూలు చేస్తారు? దానిని హైదరాబాద్ లోని ముఖ్య నేతలకు ఏ విధంగా చెల్లిస్తారు? ఊహలను వార్తలుగా రాస్తూ... ఈనాడు పత్రిక తమ ఊహలను వార్తలుగా రాస్తూ.... రాజకీయ ప్రయోజనాల కోసం ఈ ప్రభుత్వానికి చెడ్డపేరు తీసుకురావాలని, ప్రజల్లో తప్పుడు అభిప్రాయాలు కలిగించాలనే ఉద్దేశంతోనే ఇసుక పేరుతో పదేపదే తప్పుడు కథనాలను ప్రచురిస్తోంది. దీనిపై వాస్తవాలను తెలుసుకునేందుకు సంబంధిత అధికారులను కూడా కనీసం వివరణ కూడా కోరలేదు. ఉద్దేశపూర్వకంగా ఇటువంటి తప్పుడు కథనాలను ప్రచురిస్తే ఈనాడు పత్రికపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని వీజీ వెంకటరెడ్డి హెచ్చరించారు. -
అసెంబ్లీ సాక్షిగా వీడియోలతో వాస్తవాలను బయటపెట్టిన మంత్రి బుగ్గన
సాక్షి, అమరావతి: గవర్నర్ ప్రసంగంపై ఎల్లో మీడియా దుష్ప్రచారాన్ని అసెంబ్లీలో మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ తిప్పికొట్టారు. గవర్నర్ ప్రసంగాన్ని కొందరు హేళనగా మాట్లాడుతున్నారని మంత్రి మండిపడ్డారు. గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానం చర్చలో ఆయన మాట్లాడుతూ, గవర్నర్ ప్రసంగంపై ఎల్లోమీడియా దుష్ప్రచారం చేస్తోందన్నారు. పయ్యావుల బండారాన్ని మంత్రి బుగ్గన బయటపెట్టారు. గవర్నర్కు సీఎం స్వాగతం పలకలేదనే టీడీపీ తప్పుడు ప్రచారంపై వీడియోలతో సహా వాస్తవాలను మంత్రి బయటపెట్టారు. టీడీపీవి అన్నీ తప్పుడు ఆరోపణలు. గవర్నర్కు మేము ఇచ్చినంత మర్యాద ఎవరూ ఇవ్వలేదని మంత్రి బుగ్గన వివరించారు. గవర్నర్కు స్వాగతం పలికిన వీడియోను ఆయన ప్రదర్శించారు. గవర్నర్ పట్ల గౌరవ సభ పట్ల అమర్యాదగా ప్రవరిస్తున్నారని, టీడీపీ తన వక్రబుద్ధిని మార్చుకోవాలని మంత్రి బుగ్గన హితవు పలికారు. ‘‘అవాస్తవ ప్రచారాలపై స్పీకర్ కఠిన చర్యలు తీసుకోవాలి. ఎల్లో మీడియా కూడా బాధ్యతరహితంగా వార్తలు రాసింది. టీడీపీ వ్యవహారశైలి సభా హక్కుల ఉల్లంఘనే. తప్పుడు ఆరోపణలు చేసినవారితో పాటు అవాస్తవాలు ప్రచురించిన వారిపైనా తీవ్ర చర్యలు తీసుకోవాలి. అసత్య ప్రచారాలపై ప్రివిలేజ్ కమిటీకి రిఫర్ చేయాలి’’ అని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ స్పీకర్ను కోరారు. చదవండి: జెండా పవన్ది.. అజెండా టీడీపీది: మంత్రి అమర్నాథ్ -
చంద్రబాబు పోతే తప్ప రాష్ట్రం దరిద్రం పోదు: సీదిరి అప్పల రాజు
సాక్షి, శ్రీకాకుళం/విశాఖపట్నం: టీడీపీ ఇండస్ట్రీస్ ఫ్యాక్ట్ చెక్ అనే పుస్తకం విడుదల చేయడంపై మంత్రి సీదిరి అప్పలరాజు మండిపడ్డారు. వైజాగ్లో ఇన్వెస్టర్స్ సమ్మిట్ జరుగుతున్న గొప్ప సందర్బంలో ప్రజలను తప్పుదారి పట్టించేలా తప్పుడు బుక్లెట్స్తో ప్రచారం చేయటాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. 'సత్యం రామలింగ రాజు, కోనేరు ప్రసాద్, నిమ్మగడ్డ ప్రసాద్ను వేదించామంటున్నారు. వారికి మాకు సంబంధం ఏంటి? చంద్రబాబు హయాంలోనే కదా వారిని వేధించింది. మా మనిషి ముఖ్యమంత్రిగా లేరు కాబట్టి అబద్ధాలు ప్రచారం చేస్తాం అన్నట్లుగా ఉంది. అదానీ లాంటి వ్యక్తి రాష్ట్రంలో లక్షల కోట్ల పెట్టుబడులు పెడుతున్నారు. అంబానీ, టాటా, బిర్లా, జిందాల్ వంటి వారు రాష్ట్రం వైపు చూస్తున్నారు. రిలయన్స్ని వెనక్కి పంపామంటున్నారు. చంద్రబాబు హయాంలో లిటిగేషన్ ఉన్న ల్యాండ్ని రిలయన్స్కి కేటాయించారు. కోర్టు కేసులతో ఇబ్బందులు పడి రిలయన్స్ వెనక్కి వెళ్లింది. ఇది మీ తప్పిదం కాదా..? జాకీ సైతం మాకు మార్కెట్ లేదంటూ వెనక్కి తగ్గారు. చంద్రబాబు హయాంలోనే లేఖ రాసి వెళ్లిపోయారు. ప్రాంక్లిన్ టెంపుల్ టేన్ దివాలా ప్రక్రియలో ఉన్న కంపెనీ. అమర్ రాజా వారు ఏపీలోనే పెట్టుబడి పెట్టాలని రూల్ ఉందా..? విస్తరణలో బాగంగానే తెలంగాణకు వెళ్లారు. అమరాజా కంపెనీ లెడ్ వల్ల ప్రజలకు ఇబ్బందులు అని పీసీబీ నోటీస్ ఇస్తే.. మేం ఇబ్బందులు కు గురి చేసారంటారా? అన్ని అబద్దాలు ప్రచారం చేస్తున్నారు. ఇన్ఫోసిస్ వారి క్యాంపస్.. మొదలుపెడుతోంది. అనేక దిగ్గజ కంపెనీలు విశాఖ కేంద్రంగా వస్తున్నాయి. ఏడు నెలల్లో 40 వేల కోట్లు పెట్టుబడులు వచ్చాయని కేంద్రం స్వయంగా చెప్పింది. ఎక్స్ పోర్ట్స్ లో 4వ ర్యాంక్ లో ఉన్నాం. చంద్రబాబు హయాంలోని పారిశ్రామిక బకాయిలు రూ.3,675 కోట్లు సైతం మేం చెల్లించాం , తిరిగి పారిశ్రామిక రాయితీ ఇచ్చాం. విపత్కర పరిస్థితులను తట్టుకుని 11.4% గ్రోత్ సీఎం జగన్ పరిపాలనతో సాధ్యం అయ్యింది. 108 భారీ పరిశ్రమలు మా హయాంలో వచ్చాయి చంద్రబాబుకి సిగ్గు లజ్జాలేదు. ప్రత్యేక హోదా వచ్చి ఉండుంటే .. ఇలా రాసుకునే బాధ ఉండేది కాదు. డబ్బులు కోసం ఒప్పుకుని వచ్చి నంగవాచి వేషాలు వేశారు. అందుకే ప్రజలు గూబమిద కొట్టి పక్కకు తోశారు. సలహాలు ఇచ్చేది పోయి విషం చిమ్ముతావా? చంద్రబాబు పోతే తప్ప రాష్ట్రం దరిద్రం పోదు అని ప్రజలు అనుకుంటున్నారు. 4 వారాల్లో భావనపాడు పోర్టుకు సీఎం జగన్ శంఖుస్థాపన చేస్తారు. భావన పాడు-మూలపేట పోర్టుతో శ్రీకాకుళం దిశ దశ మారనుంది. మెడలు వంచించుకునే స్థితిలో బీజేపీ లేదు. మేం మాటతప్పాం అనే నైతిక బాధ్యత వహించే స్థితిలో కూడా బీజేపీ లేదు. చంద్రబాబు ఏ ఓక్క సమయంలో కూడా హోదాా గురించి అడగలేదు. ఐపాక్ మాకు సలహాదారు అని ఓపెన్ గా చెప్పాం. ఐప్యాక్ మా పార్టీలో భాగం. పవన్ చెప్పగలరా తన స్క్రిప్ట్ ఎవరు రాస్తున్నారో. వారికి కూడా సలహాదారులు ఉన్నారు కదా? రోడ్లు ఏవి వేయాలో ఐపాక్ టీం ఏలా డిసైడ్ చేస్తుంది. ఇది అసత్య ప్రచారం' అని సీదిరి అప్పలరాజు టీడీపీపై ఫైర్ అయ్యారు. స్టాల్స్ను పరిశీలించిన విడదల రజిని.. గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ నేపథ్యంలో ఏర్పాటు చేసిన స్టాల్స్ను ఏపీ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని పరిశీలించారు. టిీడీపీ హయాంలో జరిగిన సదస్సులో పెట్టుబడులు కాగితాల పైనే జరిగాయాని ఎద్దేవా చేశారు. ఈ సదస్సు ఏపీ లో భారీ పెట్టుబడులకు అనువైన సమయమన్నారు. పారిశ్రామిక పెట్టుబడుల్లో ఏపీ నెంబర్ వన్ కాబోతోందన్నారు. రాష్ట్రంలో పారిశ్రామిక ఫ్రెండ్లీ ప్రభుత్వం నడుస్తోందని చెప్పారు. చదవండి: గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్కు ఘనంగా ఏర్పాట్లు -
గతం గుర్తుందా రామోజీ?.. ఆ విషయం ‘ఈనాడు’కు తెలియదా!
ఆంధ్రప్రదేశ్లో కొత్త పరిశ్రమలు రాకుండా అడ్డుకోవడానికి ఈనాడు మీడియా ప్రయత్నాలు గట్టిగానే చేస్తోంది. ఏపీ అభివృద్దికి పెద్ద శత్రువుగా ఈ మీడియా మారిందంటే ఆశ్చర్యం కాదు. ఒక వైపు రాష్ట్రానికి కొత్త పెట్టుబడులు, పరిశ్రమలు తేవడానికి ముఖ్యమంత్రి జగన్ ఆధ్వర్యంలోని ప్రభుత్వం విశాఖపట్నంలో భారీ స్థాయిలో గ్లోబల్ ఇన్వెస్ట్ మెంట్ సమ్మిట్ను నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తోంది. మార్చి 3,4 తేదీలలో ఈ సదస్సు జరగబోతోంది. దీనికి వివిధ రాష్ట్రాలు, దేశాల నుంచి ప్రముఖ పారిశ్రామికవేత్తలను రప్పించడానికి మంత్రులు, ఐఎఎస్ అధికారులు విశేష కృషి చేస్తుంటే దానిని ఎలా చెడగొట్టాలా అని ఈనాడు మీడియా ఆలోచన చేస్తోంది. మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, అమర్నాథ్ తదితరులు బెంగుళూరు, ముంబై, హైదరాబాద్ వంటి నగరాలలో పర్యటించి సన్నాహక సదస్సులు పెడుతున్నారు. వారి సమావేశాలకు ప్రముఖులు హాజరువుతున్నారు. ఏపీకి ఉన్న అపార అవకాశాలను మంత్రులు తెలియచేస్తున్నారు. విశాఖ సమ్మిట్ సక్సెస్ అయ్యే అవకాశాలు కనిపిస్తుండడంతో ఈనాడు మీడియా పుల్లలు వేయడం ఆరంభించింది. అందులో భాగంగా శనివారం నాడు ఒక కథనాన్ని ఇచ్చింది. పారిశ్రామిక రాయితీ జాడేది అని హెడింగ్ పెట్టి మొదటి పేజీలో పరిచారు. ప్రభుత్వం ప్రోత్సహాకాలను సకాలంలో చెల్లించలేదట. తీరా చూస్తే అదంతా కలిపి 728 కోట్లేనని ఆ మీడియాలోనే తెలిపారు. పైగా అది కూడా గత ఆగస్టునుంచే ఉన్న బకాయి. నిజానికి ఏ ప్రభుత్వంలో అయినా పారిశ్రామిక ఇన్సెంటివ్లు ఒకసారిగా చెల్లింపులు జరగవు. క్రమేపీ విడతల వారీగా ఇస్తుంటారు. గతంలో నాలుగైదేళ్ల పాటు కూడా పరిశ్రమలకు బకాయిలు చెల్లించని ఘట్టాలు చాలానే ఉన్నాయి. తెలుగుదేశం హయాంలో ఈ బకాయిలు ఎలా ఉన్నాయో మాత్రం ఈ మీడియా రాయలేదు. అప్పుడంతా బకాయి లేకుండా చెల్లించారా?. టీడీపీ ప్రభుత్వం దిగిపోయేనాటికి 3400 కోట్ల రూపాయల బకాయి ఉందట. ఆ ప్రభుత్వం సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమలకు చెల్లించవలసిన సుమారు వెయ్యి కోట్ల రూపాయల పైగా బకాయిలను జగన్ ప్రభుత్వం చెల్లించిందన్న సంగతి ఈనాడు మీడియాకు తెలియదా! ఎవరైనా పారిశ్రామికవేత్తలు ఆంద్రకు రావాలని అనుకుంటే,వారిని చెడగట్టడానికి గాను ఇక్కడ బకాయిలు ఉన్నాయి. ప్రభుత్వం సరిగా చెల్లించడం లేదన్న సంకేతం ఇవ్వడానికి, ఇలా దురుద్దేశపూరితంగా కథనం రాసిన సంగతి అర్దం అవుతూనే ఉంది. జగన్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఈనాడు వారు ఇలాంటి దిక్కుమాలిన కథనాలు ఎన్ని వండి వార్చారో! కియా పరిశ్రమ వెళ్లిపోతోందని తెలుగుదేశంకు మద్దతు ఇచ్చే ఈనాడు, జ్యోతి, టివి 5 వంటి మీడియా సంస్థలు విపరీత ప్రచారం చేశాయి. కాని ఆ సంస్థ వారు అదనంగా 400 కోట్ల రూపాయలు పెట్టుబడి పెడాతమని ప్రకటించారు. ఏపీకి ఎన్నడూ రాని ఆదిత్య బిర్లా వచ్చి పరిశ్రమలు పెడుతున్నారు. అయినా ఇక్కడకు పరిశ్రమలు రావడం లేదని దుష్ప్రచారం చేస్తుంటారు. విశాఖలో ఎల్జి పాలిమర్స్ సంస్థ నుంచి గ్యాస్ వెలువడడంతో పదమూడు మంది మరణించారు. ఆ సంస్థ తిరిగి తెరవడానికి వీలు లేదని టీడీపీ, ఎల్లో మీడియా వాదించాయి. అదే చిత్తూరు జిల్లాలో టీడీపీ ఎంపికి చెందిన సంస్థలో పొల్యూషన్ సమస్య సృష్టిస్తుంటే, వారికి నోటీసు ఇవ్వగానే నానా యాగి చేశాయి. ఇదే ఎంపీ తెలంగాణలో పెట్టుబడులు పెడుతున్నట్లు ప్రకటిస్తే, ఇంకే ముంది ఏపీకి రానివ్వడం లేదని అన్నారు. తదుపరి ఆయనే ఏపీలో కూడా పెట్టుబడి పెడుతున్నట్లు ప్రకటిస్తే ఈ మీడియా నోరుమూసుకుంది. కాకినాడ వద్ద ఫార్మా హబ్ ఏర్పాటుకు కేంద్రం ఆమోదం తెలిపితే, అది వద్దని టీడీపీ ఏకంగా లేఖ రాస్తే, ఆ పార్టీకి మద్దతు ఇచ్చే మీడియా తందాన అంటూ వంతపాడాయి. గతంలో శ్రీసిటీకి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం భూమి సేకరిస్తుంటే, రాష్ట్రంలో పారిశ్రామక సెజ్ లకు ఏర్పాట్లు చేస్తుంటే ఈనాడు రామోజీరావు దానిని వ్యతిరేకిస్తూ ఏకంగా సంపాదకీయం రాశారు. అదంతా ప్రజా వంచనగా వ్యాఖ్యానించారు. 2014లో చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత 2016 లో ఒక వార్త రాస్తూ అదంతా భాగ్యసీమ అయిపోయిందని రాసింది. అసలు ఆ పారిశ్రామికవాడ రావడానికి కృషి చేసిన వైఎస్ రాజశేఖరరెడ్డి పేరు మాత్రం ప్రస్తావించకుండా జాగ్రత్తపడింది. అదే పద్దతిలో ఇప్పుడు కూడా జగన్ ప్రభుత్వం పరిశ్రమలు తీసుకువస్తుంటే వ్యతిరేక కథనాలు రాయడానిక నానా పాట్లు పడుతోంది. నెల్లూరు జిల్లా రాపూరు వద్ద సోలార్ ప్రాజెక్టుల కోసం పారిశ్రామికవాడను ఏర్పాటు చేస్తుంటే దానిని ఫలానా వారికి ఇస్తున్నారు.. అది ముఖ్యమంత్రి జగన్ సన్నిహితులది అంటూ దిక్కుమాలిన రాతలకు పాల్పడింది. అంతే తప్ప ఆ పారిశ్రామికవాడ వస్తే వేలాది మందికి ప్రయోజనం కలుగుతుందని మాత్రం రాయడానికి వారికి మనసు ఒప్పలేదు. తెలంగాణకు గత ఏడాదికాలంలో సుమారు రెండువేల కోట్ల పెట్టుబడులే వచ్చినా, చాలా గొప్పగా వచ్చాయని, అదే ఏపీకి సుమారు నలభై వేల కోట్ల పెట్టుబడులు వచ్చినా, ఏమీ రాలేదని ఉన్నవిలేనట్లు, లేనివి ఉన్నట్లు ఈనాడు ప్రచారం చేయడం దుర్మార్గంగా ఉంది. ఈజ్ ఆఫ్ డూయింగ్లో గత మూడేళ్లుగా ఏపీ నెంబర్ ఒన్ స్థానంలో ఉన్నా, వీరు మాత్రం గుర్తించరు. ఇలాంటి దుష్టచతుష్టయాన్ని ఎదుర్కుంటూ జగన్ ప్రభుత్వం కొత్త పరిశ్రమల ఏర్పాటుకు చాలా కృషి చేయవలసి వస్తోంది. చంద్రబాబు టైమ్లో విశాఖలో సదస్సులు పెట్టి దారిపోయేవారితో ఒప్పందాలు చేసుకున్నా, ఆహా, ఓహో అంటూ వీరే ఊదరగొట్టారు. వాటిలో పదో వంతు కూడా వాస్తవరూపం దాల్చకపోయినా, ఎన్నడూ వీరు ఆ విషయాలను ప్రజలకు చెప్పలేదు. మాల్ ఏర్పాటుకు విశాఖలో అత్యంత విలువైన స్థలాన్ని లూలూ అనే కంపెనీకి కేటాయిస్తే, వారు ఏళ్ల తరబడి దానిని నిర్మించలేదు. ఈ ప్రభుత్వం ఆ స్తలాన్ని వెనక్కి తీసుకుని వేరే అవసరాలకు కేటాయిస్తే తప్పు పడుతుంది. అమరావతి పేరుతో ఉన్న పల్లెల్లలో బిఆర్ షెట్టి అనే ఆయనకు వంద ఎకరాలను గత ప్రభుత్వం కేటాయించింది. అక్కడ ఆస్పత్రి తదితర నిర్మాణాలు చేస్తారని తెలిపింది. కాని అలాంటివి ఏమీ చేయకపోయినా ఆ ప్రభుత్వ పట్టించుకోలేదు.పైగా బిఆర్ షెట్టిపై దుబాయిలో కేసులు వచ్చాయన్న సంగతి ఆ తర్వాత వార్తలలో వచ్చింది. అప్పట్లో బోగస్ కంపెనీలతో హడావుడి చేస్తే, ఇప్పుడు నిజమైన కంపెనీలు వస్తుంటేనే ప్రభుత్వం ఒప్పందాలు చేసుకుంటోంది. జిందాల్ స్టీల్స్ జమ్మలమడుగులో 8800 కోట్ల పెట్టుబడితో స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు ముందుకు వచ్చింది. అంతా సిద్దం అయ్యాకే అక్కడ జగన్ శంకుస్థాపనకు వెళ్లారు. అయినా ఒక్కోసారి కొన్ని పరిశ్రమలు అనుకున్నట్లు రావచ్చు. రాకపోవచ్చు. అది ఏ ప్రభుత్వంలోనైనా జరుగుతుంటుంది. కాని టీడీపీ ప్రభుత్వంలో అలాంటివాటిని కప్పిపుచ్చి, ఈ ప్రభుత్వంలో ఏదైనా చిన్న ఘటన జరిగినా చిలవలు, పలవులు చేసి వార్తలు ఇవ్వడం ఈనాడుకు రివాజుగా మారింది. ప్రముఖ పారిశ్రామికవేత్త ఆదాని గతంలో చంద్రబాబును కలిస్తే గొప్ప విషయంగా ప్రాజెక్టు చేశారు. అదే జగన్ను కలిస్తే రాష్ట్రాన్ని రాసిచ్చేస్తున్నారని దుర్మార్గపు రాతలకు టీడీపీ మీడియా పాల్పడుతోంది. ఈ నేపథ్యంలో జగన్ ప్రభుత్వం చాలా అప్రమత్తంగా ఉండాలి. వచ్చే పరిశ్రమలను ఏదో రకంగా అడ్డుకుని, మళ్లీ ఆ నెపాన్ని ప్రభుత్వంపైనే నెట్టే ప్రమాదం ఉంది. చదవండి: రామోజీ తప్పు చేస్తే ఉద్యోగులు బలిపశువులా? ఏ మీడియా అయినా ప్రభుత్వంలోని లోటుపాట్లు రాయడం తప్పుకాదు. కాని నిర్మాణాత్మక విధానంలో కాకుండా, రాష్ట్ర అభివృద్దిని ఎలా చెడగొట్టాలన్న ధ్యేయంతో ఈ మీడియా పనిచేస్తోంది. సరిగ్గా విశాఖ సమ్మిట్కు ముందు ఇలాంటి దారుణమైన కథనాలు రాయడం ఆరంభించారంటేనే వారి దుష్ట తలంపు తెలుస్తూనే ఉంది. పరిశ్రమల మంత్రి అమరనాథ్ మీడియా సమావేశంలో చెప్పిన వాటికి తన పైత్యం జోడించి మళ్లీ రాశారు. అందుకే ఈనాడు, తదితర టీడీపీ మీడియా అంతా ఇప్పుడు ఏపీ పాలిట విలన్గా మారాయని ఒకటికి పదిసార్లు చెప్పవలసి వస్తోంది. చివరిగా ఒక మాట!. ఆంగ్ల దినపత్రిక అయిన టైమ్స్ ఆఫ్ ఇండియా ఏపీకి పెట్టుబడులు భారీగా వస్తున్నాయని ప్రముఖంగా రాస్తే, ఏపీలో పుట్టి పెరిగిన తెలుగు దినపత్రిక అయిన ఈనాడు ఆ పెట్టుబడులు రాకుండా ఎలా చేయాలా అన్న యావతో కథనాలు ఇస్తోంది. దీనినే తల్లిపాలు తాగి రొమ్ము గుద్దడమని అంటారు. -హితైషి -
Fact Check: అది రోత రాతల వంటకం
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వంపై పనిగట్టుకుని ఈనాడు వండి వారుస్తున్న అసత్య కథనాలు రోజురోజుకూ శృతిమించుతున్నాయి. తాజాగా.. రాష్ట్రంలోని సంక్షేమ వసతి గృహాలు, విద్యా సంస్థల డైట్ చార్జీలపై ఆ పత్రిక వండిన రాతల వంటకం రోత పుట్టించేలా ఉంది. చంద్రబాబు రాజకీయ ప్రయోజనాలే పరమావధిగా భావించే ఆ క్షుద్ర పత్రిక ‘మాటల వంటకమే’ అంటూ అవాస్తవాలతో ఒక కథనాన్ని అచ్చోసింది. నిజానికి.. ఆ వసతి గృహాలపై చంద్రబాబు సవతి ప్రేమ గత పరిస్థితిని గమనించిన వారెవరికైనా ఇట్టే అర్థమవుతుంది. పైగా బోలెడు బకాయిలు తన హయాంలో చెల్లించలేదు. నిజానికి.. ఈ డైట్ ఛార్జీలు పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రతిపాదనలు సిద్ధంచేసింది. ఇవి ఆమోదించే దశలో ఉండగా ఈనాడు ఈ వాస్తవాలన్నింటినీ మరుగునపరిచి ఉద్దేశపూర్వకంగా, ఎప్పటిలాగే తన కడుపుమంటను తీర్చుకుంది. దీనిని ఖండిస్తూ సాంఘిక సంక్షేమ శాఖ సంచాలకుడు కె. హర్షవర్థన్ శుక్రవారం వాస్తవాలు వెల్లడించారు. అవి ఏమిటంటే.. ►2012లో ప్రీ మెట్రిక్, పోస్టు మెట్రిక్ హాస్టళ్లకు డైట్ ఛార్జీలు పెంచారు. ►2014లో అధికారం చేపట్టిన చంద్రబాబు 2018 వరకు వాటిని పెంచాలనే ఆలోచన చేయలేదు. ►కానీ, 2019లో ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని 2018 జూలై నుంచి పెంచింది. అంటే.. ఈ చార్జీలు పెంచింది కేవలం ఎనిమిది నెలలు మాత్రమే. పైగా ఇందుకు అవసరమైన బడ్జెట్ను విడుదల చేయలేదు. ఫలితంగా వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారం చేపట్టే నాటికి అనేక బిల్లులు పెండింగ్లో ఉన్నాయి. ►2019లో అధికారం చేపట్టిన వైఎస్సార్సీపీ ప్రభుత్వం.. బాబు మిగిల్చిన బకాయిల మొత్తం రూ.132 కోట్లను క్లియర్ చేసింది. ►ఆ తర్వాత డైట్ ఛార్జీలు పెంచేలా ప్రతిపాదనలు సిద్ధంచేయాలని 2022 ఆగస్టులో సీఎం జగన్ అధికారులను ఆదేశించగా వారు పెంపు ప్రతిపాదనలను ప్రభుత్వానికి సమర్పించారు. ► దీని ద్వారా 5.92 లక్షల మంది విద్యార్థులు ప్రయోజనం పొందనున్నారు. అలాగే, డైట్ ఛార్జీల కోసం రూ.755 కోట్లు బడ్జెట్ కేటాయించారు. తాజా పెంపు ప్రతిపాదనలతో ప్రభుత్వంపై అదనపు ఆరి్థక భారం రూ.110 కోట్లకు పైగానే ఉంటుంది. ఆరి్థకపరమైన భారంతో కూడుకున్న ఈ అంశంపై ఆయా విభాగాల వివరణాత్మక పరిశీలన, సంప్రదింపులు పూర్తయ్యాయి. ప్రస్తుతం ఆ ఫైలు ఆమోదించే దశలో ఉంది. ►ఇవేకాక.. నాడు–నేడు కింద రాష్ట్రంలో వివిధ రకాల 3,013 సంక్షేమ వసతి గృహాలు, విద్యా సంస్థలను మూడు దశల్లో రూ.3,300 కోట్ల అంచనాతో అభివృద్ధి చేసేందుకు చేసిన ప్రతిపాదనలు ఆమోదానికి సిద్ధంగా ఉన్నాయి. ►ఇందులో ప్రధానంగా టాయిలెట్లలో నీటి సరఫరా, విద్యుదీకరణ, ఫ్యాన్లు, ట్యూబ్లైట్లు, ఎల్ఈడీ లైట్లు, మంచినీటి సరఫరా, విద్యార్థులు, సిబ్బంది కోసం ఫర్నిచర్, పెయింటింగ్, మరమ్మతులు, వంటగది ఆధునీకరణ, ప్రహారీ గోడలు, దోమల మ్యాట్లు, స్మార్ట్ టీవీ, క్రీడా సామగ్రి, లైబ్రరీ పుస్తకాలు, డ్రైనేజీ వ్యర్థ జలాలను సురక్షితంగా పారవేయడంతో పాటు పరిసరాల సుందరీకరణకు ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించారు. ►ఈ సమయంలో డైట్ ఛార్జీల పెంపుదల ఫైల్ క్లియరెన్స్ అవకాశం ఉందనే విషయాన్ని మరుగున పరిచి ఈనాడు తప్పుడు కథనాన్ని ప్రచురించడం సరికాదు. బలహీనవర్గాల సంక్షేమం, అభివృద్ధి కోసం నిబద్ధతతో పనిచేస్తున్న ప్రభుత్వాన్ని కించపరిచే ఉద్దేశ్యంతో బురదజల్లే రాతలు రాయడం దుర్మార్గం. -
బాకీలంటూ.. తప్పుడు బాకాలు.. ఇదేం జర్నలిజం రామోజీ?
సాక్షి, అమరావతి: రాష్ట్ర అప్పులు, పెండింగ్ బిల్లులు, గ్యారెంటీ, నాన్ గ్యారెంటీ అప్పులపై ‘ఈనాడు’ పచ్చి అబద్ధాలను ప్రచురిస్తోందని ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్శి దువ్వూరి కృష్ణ మండిపడ్డారు. నిపుణుల పేరుతో అంతులేని అబద్ధాలు అచ్చేయటాన్ని తీవ్రంగా ఖండించారు. ఎవరా నిపుణులు? పేర్లు వెల్లడించే ధైర్యం ఉందా? అని సూటిగా ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరిస్తూ లెక్కలను గణాంకాల సహితంగా వెల్లడిస్తోందని, కేంద్ర ప్రభుత్వం, ఆర్బీఐ నివేదికలే ఇందుకు సాక్ష్యమని గుర్తు చేశారు. లేని అప్పులు, పెండింగ్ బిల్లులు, గ్యారెంటీ, నాన్ గ్యారెంటీ అప్పులు ఉన్నట్లు తప్పుడు గణాంకాలు ఎలా ప్రచురిస్తారని నిలదీశారు. మంగళవారం సచివాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర అప్పులు రూ.4.42 లక్షల కోట్లు ఉన్నట్లు ఆర్బీఐ గణాంకాల ఆధారంగా కేంద్ర ఆర్థిక శాఖ రాజ్యసభలో స్పష్టంగా చెప్పినప్పటికీ రూ. 9.16 లక్షల కోట్లు అంటూ ఏ గణాంకాలు, ఆధారాలు ప్రకారం ఈనాడు కథనాలను ప్రచురించింది? వాటిని పట్టుకుని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఎలా మాట్లాడతారు? బడ్జెట్ లోపల అప్పులతో పాటు ప్రభుత్వం పూచీకత్తు ఇచ్చిన కార్పొరేషన్ అప్పుల గురించి అసెంబ్లీలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజెంటేషన్తో సవివరంగా తెలియచేసినా ఈనాడు ఊహాగానాలతో, నిపుణులు అంచనాల పేరుతో అవాస్తవ కథనాలను ఎలా ప్రచురిస్తుంది? రాష్ట్ర అప్పులకు సంబంధించి ఎన్నిసార్లు వివరణ ఇచ్చినా అవే తప్పుడు వార్తలను పథకం ప్రకారం పదేపదే ప్రచారం చేస్తోంది. ♦ప్రస్తుత ప్రభుత్వ హయాంలో రాష్ట్ర అప్పులు రెట్టింపు అయ్యాయంటూ టీడీపీ, ఆ పార్టీ అనుకూల మీడియా చేస్తున్న ప్రచారంలో వాస్తవం లేదు. గత ప్రభుత్వ హయాంలో అప్పులు రెట్టింపు అయినట్లుగా ఇప్పుడు అందుకు ఏమాత్రం ఆస్కారం లేదు. రాష్ట్ర అప్పులపై టీడీపీ ఎంపీ రాజ్యసభలో అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆరి్థక శాఖ ‘‘స్టేట్ ఫైనాన్సెస్– ఏ స్టడీ ఆఫ్ స్టేట్ బడ్జెట్’’ అర్బీఐ నివేదికతో స్పష్టమైన సమాధానం ఇవ్వడంతో తట్టుకోలేక దు్రష్పచారానికి పాల్పడుతున్నారు. ♦ప్రస్తుత ప్రభుత్వం నాలుగేళ్ల పాలనలో అప్పులు 62.78 శాతం మాత్రమే పెరిగాయి. అప్పులు రెట్టింపు కావాలంటే ఒక్క 2023–24లోనే రూ.1,01,150 కోట్ల మేర అప్పులు చేయాల్సి ఉంటుంది. ఇది రాష్ట్ర జీఎస్డీపీలో 7.5 శాతానికి సమానం. కేంద్ర నిబంధనల ప్రకారం జీఎస్డీపీలో 3.5 శాతానికి మించి అప్పులు చేయడానికి వీలుండదు. కాబట్టి ప్రస్తుత ప్రభుత్వ హయాంలో గత సర్కారు పాలనలో మాదిరిగా అప్పులు రెట్టింపు అయ్యేందుకు ఆస్కారమే లేదు. ♦చంద్రబాబు ఐదేళ్ల పాలనలో ఇప్పటి మాదిరిగా ఎలాంటి సంక్షేమ పథకాలను అమలు చేయకున్నా, కోవిడ్ లాంటి విపత్కర పరిస్థితులు లేనప్పటికీ అప్పులు మాత్రం రెట్టింపు అయ్యాయి. కోవిడ్తో ఆరి్థక ఇబ్బందులు ఎదురైనా సమర్థంగా అధిగమించి సీఎం జగన్ ప్రభుత్వం రూ.1.92 లక్షల కోట్లను పేదలకు నేరుగా పారదర్శకంగా అందించి ఆదుకుంది. ♦విభజన తర్వాత 2014 నాటికి రాష్ట్ర అప్పులు రూ.1,13,797 కోట్లు ఉండగా చంద్రబాబు దిగిపోయే నాటికి 2019 మే నాటికి రూ.2,71,797.56 కోట్లకు ఎగబాకాయి. టీడీపీ పాలనలో అప్పులు ఏకంగా 138.84 శాతం అంటే 2.38 రెట్లు పెరిగాయి. సగటున ఏటా అప్పుల్లో 19.02 శాతం వృద్ధి నమోదైంది. ♦వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే నాటికి రూ.2,71,797.56 కోట్లుగా ఉన్న అప్పులు 2022 – 23 బడ్జెట్ అంచనాల ప్రకారం రూ.4,42,442 కోట్లకు చేరుకున్నాయి. నాలుగేళ్లలో అప్పుల్లో 62.78 శాతం వృద్ధి నమోదైంది. అంటే సగటున 13.55 శాతమే. ఇది టీడీపీ సర్కారు సగటు 19.02 శాతంతో పోలిస్తే తక్కువే. ♦గత సర్కారు ఎన్నికలకు ముందు రెండు నెలల్లో ఓట్ల కోసం భారీగా అప్పులు చేసింది. దేశంలో ఏ రాష్ట్రం కూడా చేయని విధంగా 2019 ఏప్రిల్ 9న ఒకే రోజు రూ.5,000 కోట్లు అప్పులు చేసింది. నాడు నోరు మెదపని టీడీపీ అనుకూల మీడియా ఇప్పుడు నిబంధనల ప్రకారం అప్పులు తీసుకుంటున్నా ఏదో ఘోరం జరిగిపోతున్నట్లు విషం చిమ్ముతున్నాయి. వీటిని పట్టుకుని విషయంపై అవగాహన లేని పవన్కళ్యాణ్ లాంటి వాళ్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ♦వాస్తవానికి టీడీపీ సర్కారు నిబంధనలకు మించి ఐదేళ్లలో రూ.48,128.70 కోట్లు ఎక్కువ అప్పులు చేసింది. దీనిపై ఈనాడు కలం కదల్లేదు ఎందుకో మరి? ప్రస్తుత ప్రభుత్వం మూడేళ్లలో నిబంధనలకు లోబడి రూ.2,696.76 కోట్లు తక్కువ అప్పులు చేసినా, ఇంత మెరుగ్గా ద్రవ్య నిర్వహణ చేస్తున్నా ప్రశంసించకపోగా బురద చల్లడం ఏమిటి? ♦పెండింగ్ బిల్లులు ఏకంగా రూ.1.85 లక్షల కోట్లు ఉన్నట్లు ఈనాడు పచ్చి అబద్ధాలను ప్రచురించింది. వీటికి ఆధారాలున్నాయా? మొత్తం పెండింగ్ బిల్లుల వివరాలను వెల్లడించే ధైర్యం ఉందా? పెండింగ్ బిల్లులపై గత ఏడాది సెపె్టంబర్ 19వ తేదీన అసెంబ్లీ వేదికగా ఆరి్థక మంత్రి స్పష్టంగా చెప్పారు. టీడీపీ అధికారం నుంచి దిగిపోయే సరికి పెండింగ్ బిల్లులు రూ.40,172 కోట్లు ఉండగా ఇప్పుడు రూ.21,673 కోట్లు మాత్రమే ఉన్నాయని ప్రకటించారు. గత సర్కారు పెండింగ్ బిల్లుల గురించి ఒక్క ముక్క రాయకుండా తప్పుడు వార్తలు ఎందుకు? ఇదేనా ఈనాడు పాటించే జర్నలిజం, మీడియా విలువలు? ♦ రాష్ట్ర ప్రభుత్వ పూచీకత్తు లేకుండా ప్రభుత్వ రంగ సంస్థలు చేసిన అప్పులు రాష్ట్ర అప్పులు ఎలా అవుతాయి? నాన్ గ్యారెంటీ రుణాలు రూ.87,233 కోట్లు అంటూ ఈనాడు ప్రచురించిన కథనం అవాస్తవం. ప్రభుత్వ గ్యారెంటీ లేకుండా ప్రభుత్వ రంగ సంస్థలు చేసే రుణాలు ప్రభుత్వ అప్పుల కిందకు రావు. ఆమాత్రం కనీస అవగాహన లేకుండా కథనాలు ప్రచురించారు. ఉదాహరణకు ఎన్టీపీసీ తీసుకునే రుణాలు కేంద్ర ప్రభుత్వ అప్పుల కిందకు రావు. టీటీపీ హయాంలో ట్రాన్స్కో, జెన్కో, డిస్కమ్లు రూ.55,108.94 కోట్లు నాన్ గ్యారెంటీ రుణాలు తీసుకుంటే వాటి గురించి ఈనాడు ఎప్పుడైనా రాసిందా? నాన్ గ్యారెంటీ రుణాలను కేంద్రం అప్పులుగా ఎప్పుడైనా చూపించిందా? ♦ప్రభుత్వ గ్యారెంటీతో వివిధ కార్పొరేషన్లు చేసిన అప్పుల్లో ఎక్కడా దాపరికం లేకుండా ద్రవ్య జవాబుదారీ బడ్జెట్ నిర్వహణ చట్టం (ఎఫ్ఆర్బీఎం) ప్రకారం అసెంబ్లీకి వెల్లడించాం. 2021 డిసెంబర్ 31 నాటికి పూచీకత్తు రుణాలు రూ.1.17,730 కోట్లు ఉన్నట్లు అసెంబ్లీకి వెల్లడించాం. 2022లో మరికొన్ని గ్యారెంటీ రుణాలు పెరిగినా రూ.1.27 లక్షల కోట్లకు మించదు. అలాంటిది రూ.1.78 లక్షల కోట్లు ఉన్నట్లు ఈనాడు ఏ ఆధారాలతో రాసింది? ♦ఎఫ్ఆర్బీఎం నిబంధనల మేరకే గ్యారెంటీ రుణాలున్నాయి. ఆర్బీఐ, 15వ ఆర్థిక సంఘం నిర్థారించిన మేరకే రాష్ట్ర అప్పులున్నాయి. కంపెనీల యాక్ట్ కింద ఆడిట్ లేకుండా లెక్కలను ఎవరైనా రిలీజ్ చేస్తారా? ఆడిట్ పూర్తయ్యాక వాటిని వెల్లడిస్తారు. ఈలోగా తమ ఇష్టానుసారంగా లెక్కలు గట్టి రాసుకుంటామనే ధోరణిలో టీడీపీ అనుకూల మీడియా వ్యవహరిస్తోంది. ♦నిపుణుల అంచనాల పేరుతో వాస్తవాలను వక్రీకరించి తప్పుడు సమాచారం చేరవేస్తున్నారు. నా బ్యాంకు ఖాతాల్లో ఎన్ని డబ్బులున్నాయో నిపుణులకు ఎలా తెలుస్తుంది? ఊహాగానాలతో, ఇష్టం వచి్చన అంకెలతో తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నిస్తున్నాయి. -
ఓర్చుకోలేక.. ‘ఈనాడు’ విషపు రాతలు.. సీమను సుభిక్షం చేస్తున్నదెవ్వరు?
చంద్రబాబు నాయుడు ఏం చేసినా... అది బంగారు బాటే. జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన మాట నిలబెట్టుకోవటంలో తనకెవ్వరూ సాటిలేరని పదేపదే నిరూపిస్తున్నా... ఆయన మాటలన్నీ నీటిమూటలే. వయసు మీదపడుతున్న కొద్దీ రామోజీరావులోని ఈ దృష్టిలోపం మరింత తీవ్రమవుతోంది. ఎందుకంటే 2016, సెపె్టంబరు 2న అనంతపురం జిల్లాలో అప్పటి సీఎం చంద్రబాబు కరవుపై యుద్ధానికి వెళ్లారు. అది కూడా ‘రెయిన్గన్’లతో!!. ఈ పిట్టలదొర విన్యాసానికి పరవశించిపోయారు రామోజీరావు. ‘ఈనాడు’లో కరువుపై యుద్ధమంటూ పతాక శీర్షికల్లో అచ్చేశారు. ఒక్క చుక్క వర్షం పడకపోయినా... దుర్భిక్ష రాయలసీమ సస్యశ్యా మలమైపోయినట్లు కథనాలు వండి వార్చేశారు. ఇప్పుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారంలోకి వచ్చాక గడిచిన మూడున్నరేళ్లుగా ఏటా హంద్రీ–నీవా సామర్థ్యం కంటే ఎక్కువగా కృష్ణా జలాలను తరలిస్తున్నారు. ప్రధాన కాలువ, ఉప కాలువల ద్వారా వేలాది చెరువులను నింపుతున్నారు. భూగర్భజలాలు పుష్కలంగా పెరిగాయి. బోరు బావులతో పాటు చెరువులు, హంద్రీ–నీవా ప్రధాన కాలువలు, ఉప కాలువల కింద లక్షల ఎకరాల్లో పంటలు సాగవుతున్నాయి. డిస్ట్రిబ్యూటరీలను ప్రాధాన్యతల వారీగా పూర్తి చేస్తూ ఆయకట్టుకు నీళ్లందించేలా అడుగులేస్తున్నారు. దీంతో రాయలసీమ పచ్చగా కళకళలాడుతోంది. ఇక చంద్రబాబుకు పుట్టగతులుండవనే భయం రామోజీలో అంతకంతకూ పెరుగుతోంది. ‘ఈనాడు’లో దు్రష్పచారపు రాతలూ పెరుగుతున్నాయి. ఆ కోవలోనిదే... శుక్రవారం నాటి ‘జగనన్న మాట.. నీటి మూట’ కథనం. మరి దీన్లో నిజానిజాలేంటి? ఒకసారి చూద్దాం... బహుశా! ఒకే ప్రాజెక్టుకు రెండు సార్లు శంకుస్థాపన చేసిందెవరైనా ఉంటే అది చంద్రబాబు నాయుడేనని ఖచ్చితంగా చెప్పొచ్చు. ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడిచి 1995లో అధికారంలోకి వచ్చాక... 1996 లోక్సభ ఎన్నికలకు ముందు 40 టీఎంసీల సామర్థ్యంతోనూ హంద్రీ–నీవాకు శంకుస్థాపన చేశారు చంద్రబాబు. 1999 ఎన్నికలకు ముందు దాని సామర్థ్యాన్ని 35 టీఎంసీలకు తగ్గించి మరోసారి కూడా శంకుస్థాపన చేశారు. రెండు సార్లు శంకుస్థాపన చేసినా... 1995 నుంచి 2004 మధ్య హంద్రీ–నీవా కోసం ఖర్చుపెట్టింది మాత్రం కేవలం రూ.13.57 కోట్లు. అది కూడా ఉద్యోగుల జీతభత్యాలు, కార్యాలయాల నిర్వహణ కోసమే తప్ప ప్రాజెక్టు కోసం కాదు. అది బాబు ఘనతయితే... ఈ నిర్వాకాన్ని ఆ తొమ్మిదేళ్లలో ఒక్కసారి కూడా ప్రశ్నించకపోవటం రామోజీరావు ఘనత. మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి అధికారంలోకి వచ్చాక శ్రీశైలానికి వరద వచ్చే 120 రోజుల్లో 40 టీఎంసీలను తరలించి.. ఉమ్మడి కర్నూల్, అనంతపురం, వైఎస్సార్, చిత్తూరు జిల్లాల్లో 6.02 లక్షల ఎకరాలకు సాగునీరు, 40 లక్షల మందికి తాగునీరు అందించడమే లక్ష్యంగా 2004లో హంద్రీ–నీవాను చేపట్టారు. 2009 నాటికల్లా హంద్రీ–నీవా తొలి దశను పూర్తి చేయటంతో పాటు... రెండో దశ పనులనూ సింహభాగం పూర్తి చేశారు. కానీ వైఎస్సార్ ఆకస్మిక మరణం తరవాత... టీడీపీ మద్దతుతో కొనసాగిన కాంగ్రెస్ ప్రభుత్వం హంద్రీ–నీవా పనులను పూర్తిగా నిర్లక్ష్యం చేసి అటకెక్కించేసింది. జీవో 22, జీవో 63లతో చంద్రబాబు దోపిడీ.. విభజన తర్వాత 2014 ఎన్నికల్లో కేవలం ఐదు లక్షల ఓట్ల తేడాతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు.. జీవో 22 (ధరల సర్దుబాటు), జీవో 63 (పనుల పరిమాణం ఆధారంగా అదనపు బిల్లులు చెల్లించడం) తెచి్చ, వాటి ద్వారా హంద్రీ–నీవా అంచనా వ్యయాన్ని రూ.6,850 కోట్ల నుంచి రూ.11 వేల కోట్లకు పెంచేశారు. అంతేకాక 60–సీ కింద పాత కాంట్రాక్టర్లను తప్పించి, అస్మదీయ కాంట్రాక్టర్లకు పనులు అప్పగించారు. భారీ ఎత్తున ఖజానాను దోచేశారు. హంద్రీ–నీవా ద్వారా అరకొరగా నీళ్లను తరలించి.. అరకొరగా పంపిణీ చేసి సీమ ప్రజల మధ్య జలయుద్ధాలు సృష్టించారు. చివరకు హంద్రీ– నీవాలో అంతర్భాగమైన కుప్పం నియోజకవర్గానికి నీళ్లందించే కుప్పం బ్రాంచ్ కెనాల్ పనులను కూడా రూ.477 కోట్ల అంచనాతో ప్రారంభించి.. ఆ తర్వాత వ్యయాన్ని రూ.622 కోట్లకు పెంచేశారు. చివరకు పనులు చేయకుండానే... అస్మదీయ కాంట్రాక్టర్తో కలిసి సులువైన మట్టి పనులు చేసి, కమీషన్లు వసూలు చేసుకుని చేతులు దులిపేసుకున్నారు చంద్రబాబు. హంద్రీ–నీవా జలాలు అందక... వర్షాలు కురవక రాయలసీమ.. అందులోనూ అనంతపురం జిల్లా కరవుతో తల్లడిల్లుతుంటే 2016, సెపె్టంబరు 2న కరవుపై యుద్ధం... అంటూ ట్యాంకర్లతో నీటిని తెప్పించారు చంద్రబాబు నాయుడు. పిట్టలదొరలా రెయిన్ గన్లు చేతబట్టి.. నాలుగు బొట్లు విదిల్చి... కరవును జయించేసినట్లు ప్రకటించారు. రైతులకు ఏమాత్రం పనికిరాని ఈ రెయిన్ గన్ల నిర్వహణ పేరుతో రూ.105 కోట్లను కాజేశారు. అదీ రామోజీరావు తెగ మెచ్చుకున్న బాబుగారి బాగోతం!!. కృష్ణా జలాలను గరిష్ఠంగా తరలిస్తూ.. వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చాక హంద్రీ–నీవా సామర్థ్యమైన 40 టీఎంసీల కంటే ఏటా అధికంగా కృష్ణా జలాలను తరలిస్తున్నారు. ప్రధాన కాలువ, ఉప కాలువల ద్వారా వేల చెరువులను నింపుతూ.. వాటి కింద లక్షల ఎకరాల ఆయకట్టును స్థిరీకరిస్తున్నారు. చెరువుల్లో నీటి నిల్వ వల్ల భూగర్భ జలాలు గరిష్ఠ స్థాయికి చేరాయి. 2019, మే నాటికి రాయలసీమ జిల్లాల్లో సగటున భూగర్భ జలమట్టం 26 మీటర్లు ఉండగా.. ప్రస్తుతం కేవలం 4.8 అడుగుల్లోనే భూగర్భ జలాలు పుష్కలంగా దొరుకుతున్నాయంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. దీనివల్లే బోరు బావుల కింద రైతులు లక్షలాది ఎకరాల్లో పంటలు సాగు చేసుకుంటున్నారు. ప్రధాన కాలువ, ఉప కాలువల కింద కూడా భారీగా సాగు చేస్తూ... ఉద్యానవన పంటల సాగులో రాయలసీమను అగ్రగామిగా మార్చారు. సత్యసాయి, అనంతపురం జిల్లాలు ఫ్రూట్ బౌల్ ఆఫ్ ఏపీగా అవతరించాయంటే దానివెనక ఈ ప్రభుత్వం చేసిన కృషిని వేరే చెప్పాల్సిన అవసరం లేదు. ‘ఈనాడు’కు ఈ చర్యలు కనపడవా..? ► దుర్భిక్ష రాయల సీమను సస్యశ్యామలం చేయడమే లక్ష్యంగా సత్యసాయి జిల్లాలో పేరూరు (అప్పర్ పెన్నార్) ప్రాజెక్టును సీఎం వైఎస్ జగన్ 2020లోనే హంద్రీ–నీవా ద్వారా కృష్ణా జలాలతో నింపారు. అనంతపురం జిల్లాలో భైరవానితిప్ప ప్రాజెక్టును హంద్రీ–నీవా జలాలతో నింపే పనులను వేగవంతం చేశారు. ► ధర్మవరం నియోజకవర్గంలో 2.18 టీఎంసీల సామర్థ్యంతో జిల్లేడుబండ రిజర్వాయర్ నిర్మాణ పనులను సీఎం జగన్ చేపట్టారు. ఈ రిజర్వాయర్ కింద 23 వేల ఎకరాలకు నీళ్లందించనున్నారు. ► సత్యసాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గంలో హంద్రీ–నీవా ద్వారా 3 టీఎంసీలు తరలించి.. 195 చెరువులను నింపి, 10,834 ఎకరాల ఆయకట్టును స్థిరీకరించడం, 2.43 లక్షల మంది దాహార్తి తీర్చే పనులు సీఎం వైఎస్ జగన్ చేపట్టారు. ► మడకశిర నియోజకవర్గానికి నీళ్లందించేందుకు హంద్రీ–నీవా రెండో దశలో మడకశిర బైపాస్ కెనాల్ పనులను చేపట్టారు. ► కర్నూల్ జిల్లాలో పశ్చిమ ప్రాంతంలోని 9 దుర్భిక్ష మండలాల్లో 10,130 ఎకరాలకు నీళ్లందించేందుకు హంద్రీ–నీవా నుంచి 1.238 టీఎంసీలను ఎత్తిపోసే పథకం పనులను రూ.180.67 కోట్లను ఖర్చు చేసి, దాదాపుగా పూర్తి చేశారు. ► హంద్రీ–నీవా.. గాలేరు–నగరి అనుసంధానం ద్వారా రాయలసీమను సస్యశ్యామలం చేసే పనులను సీఎం వైఎస్ జగన్ చేపడితే.. టీడీపీ నేతలతో ఎన్జీటీలో కేసులు వేయించి, సైంధవుడిలా అడ్డుపడే దుస్సాహసానికి చంద్రబాబు ఒడిగట్టారు. విచిత్రమేంటంటే ఈ దౌర్భాగ్యపు పనులను ‘ఈనాడు’ ఏనాడూ ప్రస్తావించదు. ఇది రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతమని చెప్పదు. ► టీడీపీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీనే గెలిపిస్తూ వచ్చిన హిందూపురం నియోజకవర్గ ప్రజల దాహార్తిని సైతం చంద్రబాబు తీర్చలేదు. ఆ నియోజకవర్గ ప్రజల దాహార్తిని మహా నేత వైఎస్ రాజశేఖరరెడ్డి తీర్చితే. చంద్రబాబు చేతులెత్తేసిన హంద్రీ–నీవాలో అంతర్భాగమైన కుప్పం బ్రాంచ్ కెనాల్ పనులను జూన్కు పూర్తి చేసి ఆ నియోజకవర్గానికి కృష్ణా జలాలను తరలించి.. సస్యశ్యామలం చేసే దిశగా సీఎం వైఎస్ జగన్ అడుగులు వేస్తున్నారు. -
Fact Check: ఎస్సీ, ఎస్టీలకు నిజంగా మేలు చేసిందెవరు?
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీలకు ఆర్థిక, సామాజిక, రాజకీయ, విద్య, ఉపాధిపరంగా నిజంగా మేలు చేసిందెవరు? అని ఆ వర్గాల వారిని ఎవరైనా ప్రశ్నిస్తే.. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అని ఠక్కున సమాధానం వస్తుంది. ఎందుకంటే ఎస్సీ, ఎస్టీలకు చంద్రబాబు హయాంలో ఐదేళ్లలో జరగని మేలు జగన్ నేతృత్వంలో మూడున్నరేళ్లలో అంతకుమించి జరిగిందన్నది జగమెరిగిన సత్యం. అప్పట్లో బాబు కేటాయించిన నిధులు.. నేడు సీఎం జగన్ ఖర్చుచేస్తున్న మొత్తం గణాంకాలను గమనిస్తే గతానికన్నా ఎంతో మేలు జరిగిందన్నది స్పష్టంగా అర్ధమవుతుంది. కానీ, ఇవేమి పరిగణలోకి తీసుకోని ఈనాడు విషపత్రిక ఎప్పటిలాగే వాస్తవాలను వక్రీకరించింది. ఈసారి ఎస్సీ, ఎస్టీ కాంపోనెంట్ (సబ్ప్లాన్)పై తన కడుపుమంటను ప్రదర్శించింది. సబ్ప్లాన్ను మరో పదేళ్లు పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీచేసిన ఆర్డినెన్స్పై ఆ వర్గాలకు చెందిన నేతలు, ప్రజాసంఘాలు హర్షం వ్యక్తంచేస్తుంటే రామోజీ మాత్రం ఎప్పటిలాగే తన అక్కసును వెళ్లగక్కారు. ప్రజలను తప్పుదోవ పట్టించేలా ‘పేరుకే చట్టం.. ఎన్నేళ్లున్నా ఏం లాభం?’ అంటూ ఈనాడు మరో అభూతకల్పనను వండివార్చింది. వాస్తవానికి.. 2017–18 నుంచి కేంద్ర ప్రభుత్వం చేసిన చట్టం కారణంగా బడ్జెట్లో ప్రణాళిక, ఉపప్రణాళిక అన్న పదాలేలేవు. సబ్ప్లాన్ను కాంపొనెంట్గా కేంద్ర ప్రభుత్వం మార్చింది. దీంతో ఎస్సీ కాంపొనెంట్, ఎస్టీ కాంపొనెంట్గా కేటాయింపులు జరుగుతున్నాయి. అలాగే, ప్రభుత్వం అమలుచేస్తున్న పథకాలు, వారి కార్యక్రమాల్లో ఎస్సీ, ఎస్టీల జనాభా ప్రాతిపదికన నిధులు కేటాయిస్తోంది. బాబు చేస్తే ఒప్పు.. జగన్ చేస్తే తప్పు రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో ఏ రకంగా చూసినా ఎస్సీ, ఎస్టీలు గత మూడున్నరేళ్లుగా అత్యధిక లబ్ధిపొందరానేది సుస్పష్టం. అర్హతే ప్రామాణికంగా అత్యంత పారదర్శకంగా పథకాలను అమలుచేస్తోంది. వివిధ సామాజిక పెన్షన్ల కోసం ఎస్సీ, ఎస్టీలకు చేస్తున్న ఖర్చును ఉప ప్రణాళికలో చూపించడాన్ని తప్పు అంటూ ‘ఈనాడు’ గుండెలు బాదుకుంది. కానీ, నిజమేమిటంటే.. 2019 జూన్కు ముందున్న టీడీపీ ప్రభుత్వం కూడా సామాజిక పెన్షన్లు, దివ్యాంగులకు ఇచ్చే పెన్షన్లు, మధ్యాహ్న భోజనం కోసం చేసిన ఖర్చులన్నింటినీ ఎస్సీ, ఎస్టీల ఉపప్రణాళికలో ఒక భాగంగానే చూపించిన విషయాన్ని పాపం వృద్ధ రామోజీకి గుర్తున్నట్లులేదు. అంతేకాదు.. మా ఇంటిమహాలక్ష్మి, పిల్లలకు–తల్లులకు ఇచ్చే పౌష్టికాహారం, అన్న అమృతహస్తం, చంద్రన్న పెళ్లికానుక, ఎన్టీఆర్ సుజలస్రవంతి, డ్వాక్రా మహిళలకు ఇచ్చే శానిటరీ నాప్కిన్స్, చంద్రన్న రైతు క్షేత్రాలు, పొలంబడి, జవహర్ నాలెడ్జ్ సెంటర్ మెంటార్లకు ఇచ్చే గౌరవ వేతనాలు సైతం గత ప్రభుత్వం సబ్ప్లాన్లో భాగంగానే చూపిన విషయం మర్చిపోతే ఎలా రామోజీ.. అప్పుడు ఒప్పు.. ఇప్పుడు తప్పు అంటే ఎలా? మూడున్నరేళ్లలోనే ఐదేళ్లకు మించిన మేలు ఇక రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ కాంపొనెంట్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఖర్చును గమనిస్తే చంద్రబాబు హయాంలో ఐదేళ్లలో కేటాయించిన నిధులకు మించి ఈ మూడున్నరేళ్లలోనే జరిగిందన్నది గణాంకాలే చెబుతున్నాయి. ప్రస్తుత ప్రభుత్వం వీరికోసం చేసిన ఖర్చు గతంలో ఏ ప్రభుత్వం కూడా చేయలేదు. గత ప్రభుత్వం 2014–15 ఆర్థిక సంవత్సరం నుంచి 2018–19 వరకు ఎస్సీ ఉపప్రణాళిక కోసం రూ.33,625.49 కోట్లు కేటాయిస్తే... ప్రస్తుత ప్రభుత్వం 2019–20 నుంచి 2022 డిసెంబర్ వరకు మూడున్నరేళ్లలో రికార్డు స్థాయిలో రూ.48,899.66 కోట్లు ఖర్చుచేసింది. అంటే.. టీడీపీ కేటాయించిన మొత్తానికంటే వైఎస్సార్సీపీ ప్రభుత్వం మూడున్నరేళ్లలోనే ఏకంగా రూ.15,274.17 కోట్లు అదనంగా కేటాయించింది. ఇక ఎస్టీల కోసం చేసిన ఖర్చుచూస్తే.. గత ప్రభుత్వం ఐదేళ్లలో రూ.12,487.48కోట్లు ఖర్చుచేస్తే, ప్రస్తుత ప్రభుత్వం మూడున్నరేళ్లలో రూ.15,589.38 కోట్లు వెచి్చంచింది. ఇవేమి పరిశీలించకుండానే రామోజీ మనసు 20 శాతం నిధులు కోత అంటూ తెగ బాధపడిపోయింది. ఎస్సీలకు లబ్ధిలో మనమే నెంబర్–1 ►ఎస్సీ కాంపొనెంట్ అమలులో ఏపీ దేశంలోనే మొదటి స్థానంలో ఉంది. ►దేశంలోని 20 రాష్ట్రాల్లో ఎస్సీ కాంపొనెంట్ ద్వారా మొత్తం 37.64 లక్షల మందికి మేలు జరిగితే అందులో ఒక్క ఏపీలోనే 35.92లక్షల మందికి లబ్ధిచేకూరింది. ►అలాగే, ఎస్సీ కాంపొనెంట్ ద్వారా కొత్తగా దేశంలో 12.41 లక్షల స్వయం సంఘాలు ఏర్పాటుచేస్తే ఒక్క ఏపీలోనే ఏకంగా 8.54 లక్షల సంఘాలు ఏర్పాటయ్యాయి. ►ఇది మనం చెబుతున్నది కాదు.. కేంద్ర ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన నివేదిక స్పష్టంచేసింది రామోజీ.. గిరి బిడ్డలపైనా ప్రత్యేక శ్రద్ధ.. ►మరోవైపు.. ఎస్టీ సబ్ప్లాన్ను కూడా వైఎస్సార్సీపీ సర్కారు పటిష్టంగా అమలుచేస్తూ గిరిజనులపైనా ప్రత్యేక శ్రద్ధ చూపిస్తోంది. ►రాష్ట్రంలోని జిల్లాల పునర్విభజనలో గిరిజనులకు రెండు జిల్లాలు కేటాయించి అల్లూరి సీతారామరాజు (ఏఎస్ఆర్), పార్వతీపురం మన్యం జిల్లాలను ఏర్పాటుచేసింది. ►ఆర్వోఎఫ్ఆర్ చట్టం ప్రకారం మొత్తం 4.49 లక్షల ఎకరాల భూమిని 2.22 లక్షల మంది ఎస్టీ రైతులకు అందించింది. ►దీంతోపాటు 39,272 ఎకరాల డీకేటీ భూమిని 26,287 మంది ఎస్టీ పేద రైతులకు పంపిణీ చేశారు. ►అర్హులైన ప్రతి గిరిజన కుటుంబానికి కనీసం రెండెకరాల భూమి ఉండేలా చూడాలని భావించిన సీఎం జగన్ ఆ దిశగా విప్లవాత్మక చర్యలు చేపట్టారు. ►ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఒక్కటిగా ఉంటే ఇబ్బందని భావించి షెడ్యూల్డ్ తెగల కోసం ప్రత్యేక రాష్ట్ర కమిషన్ను ఏర్పాటుచేసింది. ►ఏఎస్ఆర్ జిల్లా పాడేరులో గిరిజన వైద్య కళాశాలను రూ.500 కోట్లతో మంజూరు చేసి సీఎం ఇప్పటికే శంకుస్థాపన చేశారు. ►పార్వతీపురం మన్యం జిల్లాలోని కురుపాం వద్ద రూ.153.85 కోట్లతో గిరిజన ఇంజినీరింగ్ కళాశాలకూ శంకుస్థాపన చేశారు. -
ఎందుకీ వెకిలి రాతలు.. ‘ఈనాడు’ ఎవరి కోసం పనిచేస్తోంది?
ఈనాడు దినపత్రిక తన అక్షరాన్ని తెలుగుదేశం పార్టీకి అమ్ముకోవడమో, లేక తాకట్టు పెట్టినట్లో చేసేసినట్టుగా ఉంది. గతంలో విలువలు అంటూ పెద్ద,పెద్ద లెక్చర్లు ఇచ్చిన ఈనాడు అధినేత రామోజీరావు వలువలు వదిలేసి విలువలను మూసినదిలో కలిపేస్తున్నారన్న భావన ప్రజలలో ఏర్పడుతోంది. రోడ్ షో లు, నడి రోడ్డుపై బహిరంగ సభల నిర్వహణపై ఆంక్షలు విధిస్తూ ప్రభుత్వం విడుదల చేసిన జీఓ పై ఈనాడు పత్రికలో వచ్చిన తుగ్లక్ పాలన సంపాదకీయం చదివితే ఇలాంటి అభిప్రాయమే కలుగుతుంది. ఈ జీవో పై అభ్యంతరం ఉంటే సంపాదకీయం రాయవచ్చు. తప్పుకాదు. రాసిన తీరు చూస్తే, అక్షరక్షంలో విద్వేషం, విషం తప్ప మరొకటి కనిపించదు. ఇలా రోత రాతలను కూడా సంపాదకీయం అని చెప్పుకుంటోందన్నమాట. తేలుకు పెత్తనమిస్తే తెల్లార్లు కుట్టి చంపిందన్న సామెతను ఈనాడు వాడింది. నిజానికి ఈ సామెత ఆ పత్రికకే వర్తిస్తుంది. తెలుగుదేశం పెత్తనం పోతే, తన పెత్తనం పోయినంతగా లబలబలాడుతూ రోజూ ప్రభుత్వంపైన, ముఖ్యమంత్రి జగన్ పైన ఏడుపుగొట్టు వార్తలు రాస్తూ ఈనాడు ఆత్మవంచన చేసుకుంటోంది. జగన్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ను కాల్చుకు తింటోందట. ఏమి రాశారండి. చెత్త, చెదారం రాసి ప్రజలపై రుద్ది వేధించుకు తింటున్నది ఈనాడు మీడియానే. ఆ విషయాన్ని ప్రజలు ఇప్పటికే గమనించారు. పేద ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు చేస్తే రాష్ట్రాన్ని కాల్చుకు తినడమట. పాలనను ప్రజల గడప వద్దకు తీసుకువెళ్లడం కాని, చివరకు వృద్దులకు పెన్షన్లు ఇళ్లకు ఇవ్వడం కాని ఇవేవీ ఈనాడుకు జీర్ణం కావడం లేదు. గతంలో వృద్దులు గంటల తరబడి మండల ఆఫీస్ల వద్ద నిలబడి నానా యాతనలు పడితే అది ఈనాడు వారికి స్వర్గంగా కనపడిందన్నమాట. గ్రామ, వార్డు సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, గ్రామ క్లినిక్లు, స్కూళ్లలో నాడు-నేడు, ఇలా ఒకటేమీటి అనేక విప్లవాత్మక మార్పులు తెస్తే హర్షించకపోతే పోనీ, ఇలా దిక్కుమాలిన రాతలు రాస్తున్నారు. రాష్ట్రంలో ప్రతిపక్షం లేకుండా చేయాలని చూస్తున్నారని ప్రతిపక్షనేతగా జగన్ మొసలి కన్నీరు కార్చారని ఈనాడు ఆరోపించింది. చివరికి కనీస ఇంగితం లేకుండా ఇలాంటి సంపాదకీయం రాశారంటే ఏమనుకోవాలి. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండి 23 మంది వైసీపీ ఎమ్మెల్యేలను నడిబజారులో అంగడి సరుకు కొన్నట్లు కొనుగోలు చేస్తే, టీడీపీ పాలన చూసి వారంతా ఎగబడి పార్టీ మారారన్నట్లుగా రాసిన ఈనాడుకు అది ప్రజాస్వామ్యం అనిపించింది. దానిపై జగన్ చేసిన విమర్శకు, ఇప్పుడు రోడ్డుపై సభలు పెట్టుకోవడంపై నిబంధనలు విధించినదానికి లింక్ పెట్టి రాశారంటే వీరు అజ్ఞానంతో రాశారా? లేక విద్వేషంతో రాశారా? పోలీసులను ఉసికొల్పుతున్నారట. రూల్స్ పాటించమని పోలీసులు చెబితే చంద్రబాబుకే కాదు.. ఈనాడుకు కోపం వస్తోంది. ఎందుకంటే మార్గదర్శి చిట్ ఫండ్స్లోని లొసుగులను ప్రభుత్వ అధికారులు ఎత్తి చూపారన్న దుగ్దతో ఈ పత్రిక ఇలా రాసిందన్న విషయం అర్దం అవుతూనే ఉంది. తాము రాజ్యాంగానికి, చట్టానికి అతీతులం అన్నట్లుగా రామోజీరావు రాతలు ఉన్నాయి. పోలీసులను అంతు చూస్తానని చంద్రబాబు బెదిరిస్తే ప్రజాస్వామ్యాన్ని రక్షించి, చట్టాన్ని గౌరవించినట్లు ఈనాడు భాష్యం చెబుతోంది. ఎంత నిస్సిగ్గుగా ఒక విషయం రాశారో చూడండి. కందుకూరు, గుంటూరు విషాద ఘటనలు పోలీసుల వైఫల్యంతో జరిగాయని అన్నారంటే ఇంతకంటే దిగజారుడు తనం ఏమి ఉంటుంది?. కందుకూరులో ఇరుకు రోడ్డులో టీడీపీ సభ పెడితే ఈనాడు కళ్లకు కనబడలేదా?. డ్రోన్లతో పెద్ద సభ జరిగినట్లు ప్రజలను మభ్య పెట్టడానికి తెలుగుదేశం చేసిన ప్రయత్నాలను ఈనాడు ఎంత దారుణంగా సమర్దించిందో చూడండి. ఇక గుంటూరులో టోకెన్లు పంచి చంద్రన్న కానుకలు ఇస్తాం రండి అని టీడీపీ సభ నడిపితే ఈనాడుకు గొప్ప విషయం అనిపించింది. ఎప్పటికప్పుడు శవరాజకీయాలకు వంత పాడుతున్నది ఈనాడు. ఎక్కడైనా ఇద్దరు ఘర్షణపడి మరణిస్తే, అది రాజకీయ ఘర్షణ కాకపోయినా, దానికి రాజకీయ రంగు పులిమి వైసీపీపై పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తూ బానర్ కథనాలు ఇచ్చిన ఈనాడుకు గుంటూరులో తొక్కిసలాటలో ముగ్గురు మరణిస్తే ఏదో చిన్న వార్తగా కనిపించింది. కేవలం మొక్కుబడిగా మొదటి పేజీలో ఒక ముక్కపెట్టారు. రహదారి ప్రమాదాలలో ఎవరైనా మరణిస్తున్నారు కనుక, రోడ్లపై సభలు జరిగి జనం చస్తే మాత్రం ఏమిటనే స్థాయికి ఈనాడు పతనం అవుతుందని ఊహించలేకపోయాం. సరిగ్గా ఇది చంద్రబాబు నాయుడు మాట మాదిరే ఉంది. ఆయన గతంలో పుష్కరాలలో 29 తన సినిమా ప్రచార యావ కారణంగా మరణిస్తే, రోడ్డు ప్రమాదాలలో చనిపోవడం లేదా? కుంభమేళాలో మృతి చెందడం లేదా అని ప్రశ్నించారు. అప్పట్లో ఈనాడు కూడా పుష్కర మరణాలను కప్పిపుచ్చడానికి ఎన్ని తంటాలు పడింది అందరికి తెలుసు. పోలీసులు వైసీపీ పెంపుడు మనుషులుగా ఉన్నారంటూ నీచంగా రాసిన ఈనాడుకు గతంలో చంద్రబాబు టైమ్లో ప్రతిపక్ష వైసీపీకి పోలీసులు అండగా ఉన్నారా? లేక ప్రభుత్వ నిబంధనల ప్రకారం నడుచుకున్నారా?. ఒక మండల ఎన్నికలో వైసీపీ వారిని అడ్డుకుంటున్న నేపథ్యంలో ఆ గ్రామానికి వెళ్లేయత్నం చేసిన ప్రస్తుత మంత్రి అంబటి రాంబాబు, ఎమ్మెల్యే ముస్తాఫాలను రోడ్డు మీదే నిలిపివేసిన సంగతి జనానికి తెలియదని అనుకుంటున్నారు. ప్రత్యేక హోదాపై ఒక కార్యక్రమంలో పాల్గొనడానికి జగన్ విశాఖ వెళితే విమానం వద్దే నిలిపివేసిన చరిత్ర టీడీపీది కాదా? అప్పుడు పోలీసులు ఎవరి కొమ్ముకాశారు? నంద్యాల ఉప ఎన్నికలో పోలీసులు డబ్బు పంపిణీ చేసినప్పుడు, చివరికి దొంగ ఓట్లు వేయించారన్న ఆరోపణలు వచ్చినప్పుడు ఈనాడుకు పోలీసులు ప్రజలకు విధేయులుగా కనిపించారని అనుకోవాలి. సామాజిక మాధ్యమాలలో విమర్శిస్తున్న వారిపై కేసులు పెడుతున్నారట. వారు చేస్తున్నవి విమర్శలా? రాస్తున్నవి బూతులా అన్న విషయంలో తేడా లేకుండా ఈనాడు ప్రస్తావిస్తోందంటే వారు ఎవరి కోసం పనిచేస్తున్నది అర్ధం చేసుకోవచ్చు. అమరావతి పేరుతో భ్రమరావతి సృష్టించే క్రమంలో ఆ ప్రాంతంలో ఎవరిని నిరసన చేయకుండా చంద్రబాబు ప్రభుత్వం నిర్భంధ కాండ అమలు చేసినప్పుడు, రైతుల పంటలు తగులపెట్టినప్పుడు ఎన్నడైనా ఒక్క వార్త రాశారా? ఒక ఎడిటోరియల్ ప్రజల పక్షాన రాశారా? ఇప్పుడు మాత్రం ఉన్నవి, లేనివి రాసి జగన్పై కక్షతో బురద చల్లాలనుకునే ప్రయత్నం అందరికి కనిపిస్తూనే ఉంది. అందుకే జగన్ ఈనాడును దుష్టచతుష్టయంలో భాగంగా చేశారు. సీఎం కాన్వాయి వెళుతుంటే ప్రజలకు అసౌకర్యం కలుగుతోందని రాసే ఈ పత్రిక, నడి రోడ్డుపై సభలు పెట్టుకోవడానికి అనుమతించాలని చెప్పడం దారుణం. చంద్రబాబు ,రామోజీరావుల ధైర్యం ఏ వ్యవస్థనైనా మేనేజ్ చేయగలమన్నదే. పత్రికను అడ్డు పెట్టుకుని ఏమైనా చేయగలమన్నదే వారి ధీమా! పిల్ల ఫాసిస్టు జగన్ రెడ్డి అంటూ రామోజీ రాసిన చండాలపు సంపాదకీయం చదివితే ఈనాడు నగ్నంగా బజారులో నిలబడడానికి కూడా ఏ మాత్రం సిగ్గుపడడం లేదని అర్ధం అవుతూనే ఉంది. చదవండి: డేంజర్ గేమ్.. చంద్రబాబు ప్లాన్ అదే..? ఇదిగో రుజువులు.. మహా నియంతలే నేలమట్టం అయ్యారట జగన్కు తద్బిన్నంగా భవిష్యత్తు ఉండదట. రామోజీరావు తద్వారా ఉత్తిత్తి పిట్ట మాదిరి శాపనార్దాలు పెడుతున్నారు. నిజం చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ ప్రజల పాలిట ఈనాడు విలన్గా మారింది. తన విలనిజానికి పరాకాష్టగా ఈనాడు వెకిలి రాతలు రాసి ఆత్మానందం పొందుతోంది. జగన్ గెలిస్తే తెలుగుదేశం పార్టీకి పుట్టగతులు ఉండవని, తన ఎదుట కూర్చుని డిక్టేషన్ తీసుకునే చంద్రబాబు ఓడితే తన ప్రభ మసకబారుతుందన్న బాధ తప్ప మరొకటి కనిపించదు. ఒక్కమాటలో చెప్పాలంటే అక్షరాన్ని తాకట్టు పెట్టి, ఆంధ్ర ప్రజలను మోసం చేయాలనుకుంటున్న ఈనాడుకు ప్రజలు గుణపాఠం చెప్పకుండా ఉంటారా! -హితైషి -
గుంటూరు తొక్కిసలాట.. టీడీపీ అబద్ధాల బాగోతం మరోసారి బట్టబయలు
గుంటూరు: టీడీపీ తప్పుడు రాజకీయం, అబద్ధాల బాగోతం మరోసారి బట్టబయలైంది. ఆదివారం తొక్కిసలాట జరిగిన గుంటూరు సభకు ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు శ్రవణ్ కుమారే దరఖాస్తు చేయగా, ఈ లేఖతోనే పోలీసులు సభకు అనుమతి ఇచ్చారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు సభ నిర్వహించుకునేందుకు వీలు కల్పించారు. అయితే సభలో తొక్కిసలాట జరిగి ముగ్గురు చనిపోయాక టీడీపీ ప్లేటు ఫిరాయించింది. ఈ సభతో తమకు సంబంధమే లేదని పచ్చి అబద్ధాలు ప్రచారం చేస్తోంది. ఉయ్యూరు ఫౌండేషనే ఈ సభకు అనుమతి తీసుకుందని చంద్రబాబు అబద్ధాలు చెప్పారు. ఇలాంటివారిని ఎంకరేజ్ చేయాలనే సభకు హాజరయ్యానన్నారు. అసలు టీడీపీ దరఖాస్తులో చంద్రన్న కానుకల ప్రస్తావనే లేదు. కానీ జనాలు భారీగా రావాలని కానుకలు ఇస్తామంటూ చెప్పి టీడీపీ నేతలు పెద్దఎత్తున ప్రచారం చేశారు. దీంతో కానుకలకు ఆశపడి జనం తరలివెళ్లారు. అయితే కానుకలు కొందరికే ఇచ్చి మిగతావాళ్లను వెళ్లగొట్టారు. తమకు కూడా కానుకలు ఇవ్వాలని మహిళలు దూసుకెళ్లడంతో తొక్కిసలాట జరిగింది. ఒకరు అక్కడికక్కడే మరణించగా.. మరో ఇద్దరు చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. తన సభలో ఇంత విషాదం జరిగినా బాధితుల కుటుంబాలను పరామర్శించేందుకు కూడా చంద్రబాబు వెళ్లలేదు. గుంటూరు ఘటనకు నాలుగు రోజుల ముందే కందుకూరులో చంద్రబాబు నిర్వహించిన సభలోనూ తొక్కిసలాట జరిగి 8 మంది చనిపోయారు. చదవండి: గుంటూరు తొక్కిసలాట ఘటన: ఉయ్యూరు శ్రీనివాస్ అరెస్ట్ -
సాయంత్రం కాగానే వారికి బాబే గుర్తొస్తారట! అసెంబ్లీ సాక్షిగా క్లారిటీ ఇచ్చారుగా!
ప్రతిపక్ష నేత, టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు నోటి వెంట ఆణిముత్యాలు వస్తున్నాయి. ఆయన చెబుతున్న ఈ సుభాషితాలు విన్నవారు ముక్కున వేలేసుకోవల్సిందే. నెల్లూరు జిల్లా పర్యటనలో ఆయన ప్రసంగాలు చేస్తూ, మీడియాతో మాట్లాడుతూ రకరకాల వ్యాఖ్యలు చేశారు. వాటిలో అన్నిటికన్నా ఆసక్తికరమైనది ఏమిటంటే .. తమ్ముళ్లూ ..సాయంత్రం అయ్యేసరికి మందుబాబులకు నేనే గుర్తుకు వస్తాను.. అని ఆయన గర్వంగా చెప్పుకోవడం. తాగినప్పుడు బూతులు తిడతారు.. తర్వాత మర్చిపోతారు.. అన్నారు. అంటే మద్యం బాబులు బ్రాందీ, విస్కి వంటివి తీసుకున్నప్పుడు ముఖ్యమంత్రి జగన్ ను తిట్టుకుని, ఆ తర్వాత వారు మర్చిపోతున్నారట. ఇది ఆయన బాధ. జగన్ మద్యం రేట్లు పెంచేశారని, మంచి బ్రాండ్లు ఇవ్వడం లేదని ఆయన ఆరోపిస్తున్నారు. దాదాపు పద్నాలుగేళ్లు ముఖ్యమంత్రిగా, పద్నాలుగేళ్లు ప్రతిపక్ష నేతగా ఉన్న ఒక వ్యక్తి మాట్లాడవలసిన మాటలేనా ఇవి? ఎవరైనా పెద్ద నాయకుడు ప్రజలకు మద్యం తాగవద్దని చెప్పాలి. అది మంచిదికాదని వారించాలి. కాని చంద్రబాబు ఏమంటున్నారు! సాయంత్రం అయితే పెగ్గు వేసుకోవాలని గతంలో అన్నారు. ఇప్పుడేమో సాయంత్రం అయితే తానే గుర్తుకు వస్తానని చెబుతున్నారు. అవును నిజమే. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న రోజులలో నలభై వేలకు పైగా బెల్ట్ షాపులు నడిపారు. ఇళ్లకు కూడా మద్యం సరఫరా చేశారు. మహిళలంతా తమ భర్తలను తాగుబోతులుగా చంద్రబాబు ప్రభుత్వం మార్చుతోందని మండిపడి ఆయనకు వ్యతిరేకంగా ఓటు వేశారు. కాని ఆయన మాత్రం మారలేదు. మద్యం ఏదో అత్యవసర వస్తువుగా ఆయన భావిస్తున్నారు. దానిని చౌకగా అందుబాటులోకి తేవాలట. జగన్ ఏవేవో బ్రాండ్లు తెచ్చారట. వాటికి నాణ్యత లేదట. ఇంతవరకు ఆ బ్రాండ్ల వల్ల ఏమైనా హానీ కలిగిందా? అంటే లేదు. పోనీ ఆ బ్రాండ్లు ఏమైనా జగన్ ప్రభుత్వం ఇచ్చిందా అంటే అదీకాదు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఆ బ్రాండ్ లన్నీ ఇచ్చారని స్వయంగా జగన్ అసెంబ్లీలో పేర్లు చదివి మరీ వినిపించారు. అయినా చంద్రబాబు మాత్రం అదే అసత్యాన్ని వల్లె వేస్తుంటారు. దీనివల్ల రాజకీయంగా చంద్రబాబుకు ఎంత ప్రయోజనం చేకూరుతుందంటే అనుమానమే. మరో మాట చెబుతున్నారు. రాష్ట్రం కోసం అందరూ కలిసిరావాలట. ఆయన సీఎంగా ఉన్నప్పుడు కూడా ఇలాగే మాట్లాడేవారు. అప్పుడు జగన్ ను విమర్శించేవారు. ఇప్పుడు కూడా జగన్ నే దూషిస్తున్నారు. తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అంతా ఆయనకు మద్దతు ఇవ్వాలి. తాను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా అదికార వైసిపిపై పోరాటానికి అంతా మద్దతు ఇవ్వాలి. అంతా డబుల్ స్టాండర్డే. చంద్రబాబు నిజంగానే అంత బాగా చేసి ఉంటే జనం ఎందుకు అంత దారుణంగా ఓడిస్తారు? అదేదో జనం చేసిన తప్పు మాదిరిగా ఆయన ఊహించుకుంటూ , శుద్దిమంతుడి మాదిరి గా ఉపన్యాసాలు చెబుతుంటారు. మీడియా వారిని బాగున్నారా? అని అడిగితే బాగున్నాం అంటే ఆయనకు నచ్చలేదట. దానిని గమనించిన ఒకరిద్దరు బాగోలేదని అనగానే మళ్లీ జగన్ ప్రభుత్వంపై విమర్శలు అందుకున్నారట. ప్రశ్నిస్తే జర్నలిస్టులపై కేసులు పెడతారని, ఇంకా ఏవేవో అన్నారు. ఏ జర్నలిస్టుపై ప్రశ్నిస్తే కేసు పెట్టారు. తప్పుడు పోస్టింగ్ లు పెట్టిన ఒక రిటైర్డ్ జర్నలిస్టుపై చర్య తీసుకుంటే కోర్టు ద్వారా రక్షణ పొందారు కదా! ఇప్పుడు ఎవరు జగన్ ను విమర్శించినా, అధికారికంగా ఎవరిపైనా చర్య తీసుకోలేకపోతున్నారు. అదే ప్రధాని మోదీనో, తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ నో అని చూడమనండి .. తమాషా ఏమిటో తెలుస్తుంది. న్యాయ వ్యవస్థను జగన్ ప్రభుత్వం బ్లాక్ మెయిల్ చేస్తున్నదని అన్నారట. నిజానికి న్యాయ వ్యవస్థ అయినా మరో వ్యవస్థ అయినా అన్నిటి సమస్యలు ఎదుర్కొంటున్నది జగన్ ప్రభుత్వం. అయితే ఈయన ఎదురుదాడి చేస్తుంటారు. అసలు ఆయా వ్యవస్థలను మేనేజ్ చేయడంలో దిట్ట అని కదా చంద్రబాబుకు పేరు. ఆ విషయాన్ని కప్పిపుచ్చి ఎదురుదాడి చేస్తుంటారు. జగన్ ఆస్తులపై సిబిఐ విచారణకు ఆదేశించిన కోర్టు, చంద్రబాబు ఆస్తుల విషయంలో ఎన్ని మలుపులు తిప్పింది అందరూ గమనించారు కదా? చాలామందికి నాట్ బిఫోర్ అన్న పదం న్యాయ వ్యవస్థలో ఉంటుందన్న సంగతి తెలియదు. కాని చంద్రబాబు కేసులో మాత్రం అది బాగా పాపులర్ అయింది. కడుపు చించుకుంటే కాళ్ల మీద పడుతుందంటారు. చంద్రబాబు ఎంతసేపు జగన్ ను ఆడిపోసుకోవడమే కాని, తాను ప్రజలకు ఏమి చేస్తారో చెప్పలేక నోటికి వచ్చిన దూషణలతో కాలం గడుపుతున్నారు. అదే రాజకీయం అని, తనకు అండగా ఉండే మీడియాను అడ్డం పెట్టుకుని ఆ దూషణలతో ప్రజలను ప్రభావితం చేయాలని చంద్రబాబు నానా తంటాలు పడుతున్నారు. మరి అది సాద్యమేనా? -హితైషి -
స్మార్ట్ మీటర్లపై కొంతమంది తప్పుడు ప్రచారం చేస్తున్నారు
-
‘స్మార్ట్ మీటర్లపై అపోహలు వద్దు.. అది తప్పుడు ప్రచారం’
సాక్షి, విజయవాడ: రాష్ట్రంలో ఏపీ జెన్కో ఆధ్వర్యంలో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తున్నామని ఏపీ ఎనర్జీ స్పెషల్ చీఫ్ సెక్రటరీ కె.విజయానంద్ పేర్కొన్నారు. సోమవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, విద్యుత్ పంపిణీలో అత్యాధునిక విధానాలు ప్రవేశపెడుతున్నామన్నారు. స్మార్ట్ మీటర్లపై కొంతమంది తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. ఐఆర్డీఏ మీటర్లకు, స్మార్ట్ మీటర్లకు వ్యత్యాసం ఉండదన్నారు. మారుతున్న సాంకేతికని ఇంధనశాఖ అంది పుచ్చుకుంటోందని విజయానంద్ అన్నారు. ‘‘ట్రాన్స్కోలో ప్రతీ జిల్లాలో 400 కేవీ సబ్ స్టేషన్స్ అందుబాటులోకి తీసుకువచ్చాం. వినియోగదారులకి త్వరితగతిన సేవలు అందించడానికే స్మార్ట్ మీటర్లు. స్టాండర్డ్ బిడ్డింగ్ డాక్యుమెంట్ దేశమంతా ఒకేలా ఉంటుంది. మొదటి ఫేజులో 27 లక్షల మీటర్లు స్మార్ట్ మీటర్లు బిగిస్తాం. ఇందులో 4.72 లక్షలు మాత్రమే గృహావసరాల కనెక్షన్స్ ఉన్నాయి. అమృత్ సిటీలోని జిల్లా హెడ్ క్వార్టర్స్లో 200 యూనిట్లు దాటిన 4.72 లక్షల కనెక్షన్స్కి మాత్రమే స్మార్ట్ మీటర్లు బిగిస్తాం. రాష్ట్రం మొత్తం 1.80 కోట్లు వినియోగదారులు ఉన్నారు. 1.80 కోట్ల కనెక్షన్లకి స్మార్ట్ మీటర్లనేది అవాస్తవం’’ అని విజయానంద్ స్పష్టం చేశారు. ‘‘13.54 లక్షల మందికి సెకండ్ ఫేజులో స్మార్ట్ మీటర్లు ఇవ్వాలని నిర్ణయిస్తున్నాం. ఇంకా టెండర్లు పిలవలేదు. ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర గుజరాత్ తదితర 15 రాష్ట్రాలు స్మార్ట్ మీటర్లకి టెండర్లు పిలిచాయి. ఏపీ 16వ రాష్ట్రంగా టెండర్లు పిలుస్తోంది. 2025 మార్చి నాటికి దేశవ్యాప్తంగా స్మార్ట్ మీటర్లు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా అన్ని రాష్ట్రాలు ముందుకువచ్చాయి. ఇందుకు కేంద్రం నుంచి 5,484 కోట్లు గ్రాంటుగా వస్తాయి. స్మార్ట్ మీటర్ల ద్వారా వినియోగదారులకి అదనపు భారం పడదు. రైతులకి భారం పడకుండా ప్రభుత్వమే స్మార్ట్ మీటర్ల భారాన్ని భరిస్తోంది’’ అని ఆయన అన్నారు. ‘‘స్మార్ట్ మీటర్ల విషయంలో స్పష్టమైన విధానంతో ఇంధనశాఖ ముందుకు వెళ్తోంది. ఇంధన శాఖకి ఇష్టం లేదనేది అవాస్తవం. అన్ని డిస్కమ్లతో చర్చించిన తర్వాతే ఇంధన శాఖ ఈ నిర్ణయం. ఈ మొత్తం ప్రాజెక్ట్ పూర్తి అయితే దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల ఇంధన వ్యయ వినియోగం నేషనల్ మీటరింగ్ మోనిటరింగ్ సిస్టం పరిధిలోకి వెళ్తాయి. ఇంధన శాఖకి వ్యవసాయ, గృహావసరాల స్మార్ట్ మీటర్ల ప్రాజెక్ట్పై ఎటువంటి అభ్యంతరాలు లేవు. స్మార్ట్ మీటర్ల వల్ల వినియోగదారులకి ఎక్కువ బిల్లులు వస్తాయనేది అపోహ మాత్రమే’’ అని విజయానంద్ వివరించారు. చదవండి: టీడీపీ నేతల అమానుష చర్య.. చంద్రబాబు సభలో గాయపడిన మహిళకు అవమానం -
పెన్షన్లపై విష ప్రచారం.. సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు
సాక్షి, అమరావతి: పెన్షన్లపై విపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నాయని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మండిపడ్డారు. అర్హులైనప్పటికీ ఏ కారణం చేతనైనా లబ్ధి పొందని వారికి మరో అవకాశం కల్పిస్తూ రాష్ట్రవ్యాప్తంగా 2,79,065 మందికి రూ.590.91 కోట్లను సీఎం తన క్యాంపు కార్యాలయం నుంచి బటన్ నొక్కి ఖాతాల్లో జమ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ‘‘పెన్షన్లపై ప్రతి ఆరు నెలలకు ఒకసారి ఆడిట్ జరగాలి. ఆడిట్ జరుగుతుంటే పెన్షన్లు తీసేస్తున్నారని విష ప్రచారం చేస్తున్నారు. నోటీసులు ఇచ్చి రీవెరిఫికేషన్ మాత్రమే చేస్తారు. అర్హులందరికీ పెన్షన్లు అందాలన్నదే మా లక్ష్యం. మంచి పనులను చెడుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ విషపు రాతను ప్రజలు నమ్మే పరిస్థితి లేదు.. తప్పుడు ప్రచారాన్ని కలెక్టర్లు తిప్పికొట్టాలి’’ అని సీఎం పేర్కొన్నారు. ‘‘గత ప్రభుత్వంలో పెన్షన్ బిల్లు కేవలం రూ.400 కోట్లు మాత్రమే. ఇప్పుడు నెలనెలా పెన్షన్ బిల్లు రూ.1770 కోట్లు. గత ప్రభుత్వంలో 39 లక్షల మందికి మాత్రమే పెన్షన్లు ఇచ్చేవారు. మా ప్రభుత్వంలో 62 లక్షల మందికి పెన్షన్లు ఇస్తున్నాం. గత ప్రభుత్వంలో పెన్షన్ రూ.వెయ్యి మాత్రమే ఇచ్చేవారు. మా ప్రభుత్వంలో పెన్షన్ రూ.2750కి పెంచుతూ ఉన్నాం. మనం విషపు వ్యవస్థతో యుద్ధం చేస్తున్నాం. విష ప్రచారం చేసే వారిని దేవుడే శిక్షిస్తాడు.’’ అని సీఎం అన్నారు. తమది రైతులు, పేదల కష్టాలు తెలిసిన ప్రభుత్వమని.. ఏ ఒక్క లబ్ధిదారుడు నష్టపోకూడదన్నదే తమ లక్ష్యమని సీఎం అన్నారు. అర్హత ఉండి సంక్షేమ పథకాలు పొందని వారికి అవకాశం ఇచ్చాం. పలు సంక్షేమ పథకాల లబ్ధిదారులకు నిధులు జమ చేస్తున్నాం. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందిస్తున్నాం. ఈ మాదిరిగా సంక్షేమ పథకాలు ఇవ్వడం దేశ చరిత్రలోనే లేదని సీఎం అన్నారు. చదవండి: లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ చేసిన సీఎం జగన్ ‘‘లంచాలు, వివక్షకు తావు లేకుండా సంక్షేమ పథకాలు అందిస్తున్నాం. మూడున్నరేళ్లలో నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో రూ.1.85 లక్షల కోట్లు జమ చేశాం. డీబీటీ, నాన్ డీబీటీ ద్వారా మొత్తం రూ.3.30 లక్షల కోట్లు అందించాం. సంక్షేమ పథకాల అమలులో కలెక్టర్ల పాత్ర చాలా కీలకం. గత ప్రభుత్వంలో ఏ పార్టీ అని అడిగి పథకాలు ఇచ్చేవారు. లంచాలు లేకుండా గత ప్రభుత్వం ఏ పథకం ఇవ్వలేదు. గత ప్రభుత్వంలో జన్మభూమి కమిటీలు వసూళ్లకు పాల్పడ్డాయి’’ అని సీఎం జగన్ అన్నారు. -
పప్పులు ఉడకలేదా?.. ‘ఈనాడు’ తన పరువు తానే తీసుకుందా?
ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన వినూత్న పథకాలు ఎంతగా సఫలం అయింది ప్రతిపక్షనేత చంద్రబాబు చేస్తున్న వ్యాఖ్యలను బట్టి, ఆయనకు పెద్ద ఎత్తున మద్దతు ఇచ్చే ఈనాడు వంటి దినపత్రికల కథనాలను బట్టి ఇట్టే అర్థం చేసుకోవచ్చు. తెలుగుదేశం గెలిస్తే జగన్ తీసుకు వచ్చిన పథకాలను రద్దు చేస్తారని వలంటీర్లు ప్రచారం చేస్తున్నారని ఈనాడు ఒక కథనంలో ఆందోళన చెందింది. అలాగే చంద్రబాబు కూడా ఇప్పుడు సంక్షేమ రాగం ఆలపిస్తూ, తాను అధికారంలోకి వస్తే ఇంకా అధికంగా సంక్షేమం అమలు చేస్తానని, ఆ మాటకు వస్తే, తాను అమలు చేసిన వివిధ స్కీములను ప్రస్తుత ప్రభుత్వం రద్దు చేసిందని, వాటన్నిటిని వడ్డీతో సహా అమలు చేస్తామని ఆయన చెబుతున్నారు. చంద్రబాబు స్కీములు అంత గొప్పవి అయితే, వాటిని నిజంగానే పేదలకు ఉపయోగపడేలా అమలు చేసి ఉంటే, 2019 ఎన్నికలలో అంత ఘోరంగా టీడీపీని ప్రజలు ఎలా ఓడించారు?. ఇప్పుడు జగన్ స్కీములను అమలు చేస్తామని వీరంతా చెబుతున్నారు. అంతదానికి జగన్ ప్రభుత్వాన్ని వదులుకునే అవసరం ప్రజలకు ఎందుకు వస్తుంది? ఇంతకాలం ఏమని వాదించారు. జగన్ స్కీముల వల్ల రాష్ట్రం నాశనం అవుతోందని, అప్పుల పాలు అవుతోందని జనంలో భయం రేకెత్తించడానికి తీవ్రంగా కృషి చేశారు. ఆ విషయంలో వారి పప్పులు ఉడకకపోవడంతో స్వరం మార్చి కొత్త ప్రచారం మొదలు పెట్టారు. అందులో భాగంగానే జగన్ ప్రభుత్వంపై విషపూరిత కథనాలు, విద్వేషపూరిత స్టోరీలు ఇచ్చే పనిలో ఈనాడు మీడియా పడింది. ఒక పక్క కొత్త పరిశ్రమలు వస్తుంటే, మరిన్ని పరిశ్రమల కోసం ప్రభుత్వం పనిచేస్తుంటే, వాటిని కనిపించకుండా చేయాలన్న తాపత్రయంలో పరిశ్రమలను వెళ్లగొడుతున్నారంటూ పచ్చి అబద్దాలు రాశారు. ఇలా రోజుకోక అబద్దాన్ని జనంలోకి తీసుకు వెళ్లే యత్నం చేస్తున్నారు. తాజాగా ఇచ్చిన ఒక కథనంలో వలంటీర్లు కాదు.. వైకాపా వేగులు అంటూ వలంటీర్లపై విమర్శలు ఎక్కుపెట్టారు. అది చదివితే ఈనాడు మీడియా బాధ, ఆందోళన అంతా తెలిసిపోతుంది. వలంటీర్ల వ్యవస్థతో ప్రభుత్వం జనంలో పాతుకుపోతోందన్న భయం కనబడుతుంది. ఏ వ్యవస్థ అయినా ఎవరు అధికారంలో ఉంటే వారి ఆదేశాలను బట్టి నడచుకుంటుంది. ప్రజలకు వివిధ సేవలను అందిస్తుంటుంది. ఆ క్రమంలో ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది. లేదా అది ప్రజలకు ఉపయోగపడకపోతే ప్రభుత్వానికే చెడ్డ పేరు తెస్తుంది. ఎక్కడైనా వలంటీర్లు తప్పు చేస్తే వార్తలు ఇవ్వవచ్చు. అందుకోసం ఈనాడు కాని, టీడీపీ మీడియా కాని డేగ కళ్లు వేసుకుని పనిచేస్తున్నదన్న సంగతి బహిరంగ రహస్యమే. దానిని తప్పు పట్టనక్కర్లేదు. రాష్ట్రంలో ఏ చిన్న ఘటనలో వలంటీర్ల పాత్ర ఉందన్న ఫిర్యాదు వచ్చినా, దానిని మొదటి పేజీలో హైలైట్ చేయడానికి యత్నిస్తోంది. నిజానికి వలంటీర్లు ప్రభుత్వ వ్యవస్థలో అతి చిన్న స్థాయి వారు. కేవలం స్వచ్చందంగా ప్రభుత్వం తరపున ప్రజలకు వివిధ స్కీములు చేరవేసేవారు. కాని వారిని అత్యంత పవర్ పుల్ వ్యక్తులుగా ఈనాడు మీడియా భావిస్తున్నట్లుగా ఉంది. వారు ప్రజలపై నిఘా ఉంచుతున్నారట. ఏకంగా రాజ్యంగం ప్రసాదించిన భావస్వేచ్చ ప్రకటనకు ఆటంకంగా ఉన్నారట. ఏమైనా అర్ధం ఉందా?. వీరివల్ల ప్రజల భావస్వేచ్చ ఎలా పోతుంది. అదే నిజమైతే ప్రజలలో అలజడి రాదా? ప్రభుత్వానికి నష్టం రాదా?. వచ్చే ఎన్నికలలో దాని ప్రభావం పడదా?. నిజంగానే వలంటీర్లకు ప్రజలు భయపడుతున్నారనుకుందాం. వచ్చే ఎన్నికలలో ప్రజలు వైసీపీకి ఓటు వేస్తారా?. ఆ మాత్రం లాజిక్ లేకుండా వార్తలు ఇవ్వడం ద్వారా మొత్తం వ్యవస్థనే దెబ్బతీసే యత్నం చేశారు. ఆ క్రమంలో ఈనాడు తన పరువు తానే తీసుకుంటోంది. వలంటీర్లు రాజకీయ కార్యకలాపాలలో పాల్గొంటున్నారట. అసలు వారు రాజకీయాలలోకి రారాదని ఎక్కడైనా నిషేధం ఉందా?. ఎంతమంది ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఇతర అధికారులు రాజీనామాలు చేసి మరీ రాజకీయాలలోకి వస్తున్నారు కదా? తెలుగుదేశం పార్టీ అలాంటి పలువురికి టిక్కెట్లు ఇచ్చింది కదా? అంటే అంతకుముందు పదవులలో ఉంటూ రాజకీయాలపై ఆసక్తి కనబరిచినట్లా? కాదా? అంతెందుకు గతంలో ఇంటెలెజెన్స్ ఛీప్ గా ఉన్న ఒక అధికారి తెలుగు యువత అధ్యక్షుడిని నియమిస్తారని, స్వయంగా టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మాట్లాడుకున్న వీడియోనే ఉంది కదా?. ఆ స్థాయిలో వారు రాజకీయం చేసినప్పుడు, తెలుగుదేశం పార్టీని తమ భుజస్కందాల మీద మోసినప్పుడు ఈనాడు మీడియా కళ్లు మూసుకుందా? లేక ఆహా అంతటి పెద్ద అధికారి టీడీపీకి అండగా నిలబడ్డారని చంకలు గుద్దుకుందా?. కడుపు చించుకుంటే కాళ్ల మీద పడుతుందని అంటారు. ఈనాడు పరిస్థితి అలాగే ఉంది. టీడీపీ హయాంలో జరిగిన తప్పులన్నిటీని కప్పి పుచ్చి ఆ పార్టీని రక్షించాలని పాటు పడి, చివరికి దానిని గోతిలో పడేశారు. ఇప్పుడు వైసీపీపై అక్కసుతో ఉన్నవి, లేనివి రాసి మరోసారి టీడీపీని ప్రజల నుంచి దూరం చేస్తున్నారనిపిస్తుంది. వలంటీర్లు ప్రతి నెల మొదటి తేదీన వృద్దులకు పెన్షన్లు ఇస్తున్నారా? లేదా? దానిని రాజకీయ యాక్టివిటిగా ఈనాడు భావిస్తోందా? ఆయా స్కీములకు సంబంధించి ప్రజలకు వివరించి అర్హులైనవారితో దరఖాస్తులు చేయించడం రాజకీయాలలో పాల్గొన్నట్లు అవుతుందా?. ప్రజలను నిరంతరం కలిపి వారి అవసరాలు తెలుసుకుని, సంబంధిత దరఖాస్తులను సచివాలయానికి ఇస్తున్నది నిజం కాదా?. చదవండి: ఎల్లో బ్యాచ్ విష ప్రచారం.. ఘాటుగా స్పందించిన మంత్రి అమర్నాథ్ పోనీ గతంలో టీడీపీ ప్రభుత్వం చేపట్టిన సేవా మిత్రలు ఏమైనా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించారా? వారితోనే గెలిచిపోతామని అప్పట్లో టీడీపీ నేతలు భావించేవారా?. కాదా? అయినా ఎందుకు టీడీపీ ఓడిపోయింది. అంతేకాదు.. అన్నదాత సుఖీభవ, పసుపు -కుంకుమ వంటి స్కీములను చివరి నిమిషంలో తీసుకు వచ్చినా టీడీపీకి ఎందుకు ఫలితం దక్కలేదు? జబ్బు ఒకటైతే మందు మరొకటి ఇస్తున్నట్లుగా ప్రస్తుతం ఈనాడు మీడియా కాని, తెలుగుదేశం కాని వ్యవహరిస్తూ తమకు అంటిన ఈర్ష్య వ్యాధిని గుర్తించలేకపోతున్నాయి. నిర్మాణాత్మక ప్రతిపక్షంగా వాస్తవాల ఆధారంగా విమర్శలు చేయడంలో టీడీపీ విఫలం అవుతుంటే, నిజాలు రాయడానికి సిగ్గుపడే పరిస్థితిలో ఆ పార్టీకి మద్దతు ఇచ్చే మీడియా ఉండడం దురదృష్టకరం. -హితైషి, పొలిటికల్ డెస్క్, సాక్షి డిజిటల్ feedback@sakshi.com -
వాలంటీర్ల వ్యవస్థపై ఈనాడు తప్పుడు కథనాలు
-
వాలంటీర్ల వ్యవస్థపై ‘ఈనాడు’ తప్పుడు కథనాలపై నిరసనల వెల్లువ
సాక్షి, అనకాపల్లి/అనంతపురం: వాలంటీర్ల వ్యవస్థపై ఈనాడు తప్పుడు కథనాలపై నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. అనకాపల్లి జిల్లా దేవరాపల్లిలో రామోజీ దిష్టిబొమ్మ దహనం చేశారు. అనంతపురం జిల్లా రాయదుర్గంలో ఈనాడు ప్రతులను దహనం చేశారు. మేం వేగులం కాదు.. ప్రజా సేవకులమని వాలంటీర్లు తెలిపారు. సేవకుల పట్ల అవాస్తవ కథనాలు ప్రచురించడం సబబు కాదని, బేషరతుగా క్షమాపణ లు చెప్పాలని వాలంటీర్లు డిమాండ్ చేశారు. చదవండి: ఏది నిజం?: పింఛన్లిచ్చే వారు గూఢచారులట? -
ఆనాడు ఏం చేశావో గుర్తుందా చంద్రబాబూ?
కొద్ది రోజుల క్రితం ఆంగ్ల పత్రికలలో ఒక కథనం వచ్చింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై తప్పుడు ప్రచారం చేసిన ఒక రాజకీయ నేతను గుజరాత్ పోలీసులు అరెస్టు చేశారు. ఆయన తృణమూల్ కాంగ్రెస్ నేత. గుజరాత్లో జరిగిన వంతెన ప్రమాదం నేపథ్యంలో మోదీ పర్యటనకు అయిన ఖర్చుపై ఆయన ఒక మెస్సేజ్ని పార్వర్డ్ చేశారు. పోలీసులకు ఆ విషయమై ఒక ఫిర్యాదు అందింది. తదుపరి ఆ నేత గురించి పోలీసులు వాకబ్ చేసి రాజస్థాన్లోని జైపూర్లో పట్టుకున్నారు. న్యాయ వ్యవస్థ కూడా ఆయనను రిమాండ్కు పంపించింది. అలాగే మరి కొంతకాలం క్రితం గుజరాత్కు చెందిన ఒక కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రధాని పట్ల అనుచిత వ్యాఖ్యలు చేశారన్న అభియోగంపై అసోంలో అరెస్టు చేశారు. ఆయనను వారం రోజులకు పైగానే జైలులో ఉంచారు. మరి అదే పరిస్థితి ఇతర రాష్ట్రాలలో ఉంటుందా?. ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్లో జరిగిన కొన్ని పరిణామాలను గమనిస్తే భిన్నమైన అంశాలు గోచరిస్తాయి. ఈ మధ్య ఒక రిటైర్డ్ పాత్రికేయుడు ఏపీ ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులపై ఒక అసత్యపు ప్రచారాన్ని పార్వర్డ్ చేశారు. ఒక బంగారం సగ్మింగ్ కేసులో సీఎంవో పాత్ర ఉందని ఆ ప్రచారం సారాంశం. దానిపై చర్య తీసుకోవాలని అధికారులు సూచించగా, పోలీసులు ఆ పాత్రికేయుడిని అదుపులోకి తీసుకుని కోర్టులో ప్రవేశ పెట్టింది. అయితే చట్టంలోని సెక్షన్ 41 సి ప్రకారం నోటీసు ఇవ్వలేదు కనుక ఆయనను బెయిల్పై వదలి వేయాలని కోర్టు ఆదేశించింది. ఆ తర్వాత హైకోర్టు సంబంధిత సెక్షన్లు ఈ కేసులో చెల్లవని పేర్కొంది. కోర్టు వారు సాంకేతిక కారణాలతో నిర్ణయాలుచేసి ఉండవచ్చు. కాని ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మాత్రం ఈ అంశాన్ని కూడా తన ప్రచారానికి వాడుకుని ప్రజలలో ప్రభుత్వంపై వ్యతిరేకత పెంచడానికి కృషి చేస్తున్నారు. అంతే తప్ప, ఎవరూ అభ్యంతరకరంగా వ్యవహరించరాదని ఒక సీనియర్ నేతగా చెప్పడం లేదు. మరి ఇదే చంద్రబాబు హయాంలో ఎంత మంది సోషల్ మీడియా కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారో గుర్తుకు తెచ్చుకోండి. హైదరాబాద్లో ఉన్నవారిని సైతం రాత్రికి, రాత్రి పట్టుకువెళ్లి అనేక మందిని జైలులో పెట్టారు. కొందరిని విజయవాడలో, మరికొందరిని విశాఖ పట్నంలో కోర్టులలో ప్రవేశపెట్టేవారు. అప్పట్లో ఈ ముందస్తు విచారణలు జరిగిన సందర్భాలు కూడా చాలా తక్కువేనని చెప్పాలి. ఏప్రభుత్వం అయినా ఎవరి స్వేచ్చను హరించరాదు. ప్రత్యేకించి పాత్రికేయుల విషయంలో మరింత ఉదారంగా ఉండాలి. కాని ఆ స్వేచ్ఛను పాత్రికేయుల ముసుగులో దుర్వినియోగం చేయడం కూడా తగదు. చదవండి: చినబాబు మూడు ముక్కలాట.. ‘గో ఎహెడ్.. నీకే టిక్కెట్..’ కేవలం ఒక రాజకీయ పార్టీ కోసం తప్పుడు ప్రచారం చేయడం పద్దతి కాదు. ఒక పార్టీకి మద్దతు ఇస్తే ఇవ్వవచ్చు. ఆ క్రమంలో అబద్దపు, దారుణమైన అభియోగాలను ప్రచారం చేయడం, వాట్సాప్లో పార్వార్డ్ చేయడం అంటే దురుద్దేశంతోనే అని అర్థం చేసుకోవడం కష్టం కాదు. ఏది ఏమైనా ఇలాంటి ఘటనల విషయంలో దేశ వ్యాప్తంగా ఒక విధానం లేకపోతే, ఒక్కో కేసులో ఒక్కో రకంగా పోలీసులు, కోర్టులు వ్యవహరిస్తే అది సమాజానికి మంచి సంకేతం ఇవ్వదేమో! -హితైషి, పొలిటికల్ డెస్క్, సాక్షి డిజిటల్ feedback@sakshi.com -
టీడీపీలో కొత్త టెన్షన్ మొదలైందా?.. బాబూ నెక్ట్స్ఏంటి?
విజయవాడలో వైఎస్సార్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో జరిగిన జయహో బీసీ సభ విజయవంతం అవడం సహజంగానే తెలుగుదేశం పార్టీకి, ఆ పార్టీకి మద్దతు ఇచ్చే ఈనాడు, జ్యోతి వంటి మీడియా సంస్థలకు జీర్ణం కాని విషయమే. ఈ సభకు సంబంధించి రెండు అంశాలను గమనించాలి. ఒకటి సీఎం వైఎస్ జగన్ వచ్చే ఎన్నికల కోసం ఎజెండాను సెట్ చేస్తున్నారు. రెండు సభ జరిగిన తీరు, దానిని మీడియా కవర్ చేసిన వైనం. ముందుగా జగన్ స్పీచ్ను గమనిస్తే ఆయన తన సంక్షేమ కార్యక్రమాల ఆధారంగానే మాట్లాడారు. ప్రభుత్వం అమలు చేస్తున్న స్కీముల వల్ల అత్యధిక లబ్ధి పొందింది బీసీలేనని ఆయన తెలిపారు. నా బిసీ, నా ఎస్సీ, నా ఎస్టీ, నా మైనార్టీ వర్గాలు అంటూ ఆయన ఉచ్చరించడం ద్వారా వారిని సొంతం చేసుకోవడానికి యత్నించారు. ఇప్పటికే ఆ వర్గాలలో మెజార్టీ తనవైపు ఉన్న నేపథ్యంలో ఆయన వారిని మరింత కన్సాలిడేట్ చేసుకోవడానికి ఈ వేదికను ఉపయోగించుకున్నారు. జయహో బీసీ పేరుతో జరిగిన ఈ సభలో బీసీ వర్గాలకు చెందిన సుమారు 80 వేల మంది వివిధ హోదాలలో ఉన్న ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. దీని ద్వారా బీసీ వర్గాలలో వైసీపీ ఎంత పట్టు సాధించింది పరోక్షంగా చెప్పారన్నమాట. బీసీ వర్గాల ఆదరణ మళ్లీ పొందడానికి గాను తెలుగుదేశం పార్టీ అనుసరిస్తున్న వ్యూహాలకు ఇది ప్రతి వ్యూహం అనుకోవచ్చు. ఈ సందర్భంగా ఆయన పేదలకు, పెత్తందారులకు మధ్య యుద్దం జరగబోతోందని, 18 నెలల్లో జరిగే ఈ యుద్దంలో అంతా తనకు మద్దతు ఇవ్వాలని జగన్ విజ్ఞప్తి చేశారు. యుద్ధం అన్న పదం వినడానికి కొంత ఇబ్బందికరంగా ఉన్నా, రాజకీయంగా ఆయన దానిని అంత సీరియస్గా తీసుకున్నారని అర్ధం చేసుకోవచ్చు. ఇప్పటికే కొన్ని మీడియా సంస్థలను అడ్డం పెట్టుకుని ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పన్నుతున్న వ్యూహాలను ఆయన తిప్పికొట్టడానికి, తన వాదనను ప్రజలలోకి తీసుకు వెళ్లడానికి బలంగా వినిపించారు. గతంలో ఏ సీఎం చెప్పని విధంగా తన పాలన వల్ల మేలు జరిగిందనుకుంటేనే తనకు ఓటు వేయాలని, అదే విషయం ప్రజల ఇళ్లకు కూడా తెలియచేయాలని ఆయన కోరారు. బీసీల సమాజానికి వెన్నుముక వంటి వారని, వారి కోసం తాను ఏఏ స్కీములను ప్రవేశపెట్టింది. వాటిని అడ్డుకోవడానికి టీడీపీ ప్రయత్నాలు ఏమి చేసింది.. మొదలైన విషయాలను ఆయన వివరించారు. ఇక మీడియా కవరేజీ విషయానికి వస్తే ఈనాడు, జ్యోతి వంటి పత్రికలు పత్రికా ప్రమాణాలతో సంబంధం లేకుండా వార్తలు ఇస్తున్నాయి. అదే పద్దతిని ఇప్పుడు కూడా కొనసాగించాయి. ఈనాడు అయితే కనీసం ఒక వార్తకు అయినా ప్రాముఖ్యత ఇచ్చారు. జ్యోతి అయితే మొదటి పేజీలోనే తీవ్ర వ్యతిరేకతను కనబరుచుతూ కథనాలను ఇచ్చింది. కర్నూలులో ఒక ప్రధాన వీధిలో చంద్రబాబు సభ జరిగితే జనం ఫోటోలను ప్రచురించిన ఈనాడు.. జగన్ సభకు సంబంధించి వేదికను మాత్రమే ఫోటోగా ఇచ్చింది. అక్కడితో ఆగకుండా.. ఈనాడు, జ్యోతి కూడబలుక్కుని రాసినట్లుగా జగన్ మాట్లాడుతుండగా వెళ్లిపోయారని ఎప్పటి మాదిరి రాశాయి. అయితే ఆంధ్రప్రభ తదితర కొన్ని పత్రికలు సభ విజయవంతం అయిందని, బీసీ ప్రతినిధులు పెద్ద ఎత్తున హాజరయ్యారని ప్రముఖంగా ఇచ్చాయి. ఆంధ్రప్రభలో మొదటి పేజీలోనే సభ సక్సెస్ అన్న శీర్షికను కథనం ఇచ్చారు. టీడీపీతో పరోక్షంగానో, ప్రత్యక్షంగానో కలిసి ప్రయాణిస్తున్న సిపిఐకి చెందిన విశాలాంధ్ర మాత్రం బీసీ సభ వార్తను మొదటి పేజీలోనే వేయలేదు. చివరి పేజీకి పరిమితం అయింది. సిపిఎంకు చెందిన ప్రజాశక్తి బానర్గా కథనం ఇచ్చింది. ఆ సందర్భంగా భారీగా ట్రాపిక్ జామ్ అయిన విషయాన్ని ప్రస్తావించింది. ఇక జ్యోతి పత్రిక జనం లేరని ఒక వార్త, సభ వల్ల మొత్తం నగరం అంతా నరకంగా మారిందని మరో వార్త రాసింది. నిజంగానే జనం పెద్దగా రాకపోతే నగరంలో ట్రాఫిక్కు ఇబ్బంది ఎందుకు వస్తుందన్న సంగతి మర్చిపోయింది. విశేషం ఏమిటంటే గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రద్దీగా ఉండే బెంజ్ సెంటర్ నడి రోడ్డులో నవనిర్మాణ దీక్షలని కార్యక్రమం నిర్వహించినప్పుడు అహా, ఓహో అంటూ వార్తలు ఇచ్చాయి. నిజానికి అప్పుడు ఆ రోడ్డులో వచ్చిన జనమే తక్కువ. దాని కోసం ప్రజలను ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టింది టీడీపీ మీడియా మర్చిపోయి ఉండవచ్చు. అంతేకాదు.. పోలవరం సందర్శన అని, లేని అమరావతి విజిట్ అని, ఇలా రకరకాల ప్రచార యాత్రలకు జనాన్ని ఆర్టీసీ బస్లలో తిప్పినందుకుగాను ఆర్టీసీ వారికి 78 కోట్ల మేర టీడీపీ చెల్లించనేలేదట. చదవండి: ఆర్టీసీకి ‘చంద్రన్న భజన’ బకాయి రూ.78.36 కోట్లు మరి వైసీపీ మాత్రం ఈ సభకు బస్ల ఏర్పాటు నిమిత్తం అయిన 3.8 కోట్ల రూపాయలను చెల్లించినట్లు వెల్లడైంది. అయినా ఈనాడు అసత్య కథనాలు రాసింది. ఏది ఏమైనా ప్రతి నిత్యం తెలుగుదేశం పార్టీతోనే కాకుండా, ఈనాడు, జ్యోతి వంటి టీడీపీ మీడియాతో యుద్దం జరుగుతూనే ఉంది. జగన్ చెప్పినట్లు ఎన్నికల యుద్దం కాదు.. ఇప్పటికే అది ఆరంభం అయిందని అనుకోవచ్చు. అందుకే జగన్ తన మద్దతుదారులను అప్రమత్తం చేస్తున్నారు. -హితైషి, పొలిటికల్ డెస్క్, సాక్షి డిజిటల్ feedback@sakshi.com -
బద్దలైన పవన్ అబద్ధాలు
-
ఎన్నికలే లక్ష్యంగా బాబు డేంజర్ గేమ్.. ఇంకెన్ని దారుణాలు చూడాలో..
ఈ రాష్ట్రం ఏమైపోయినా పర్వాలేదు... నా చంద్రబాబు అధికారంలో ఉంటే చాలనుకుంటాడు రామోజీరావు. అందుకే... ‘బాబు మాట– బంగారం మూట’ అనే రీతిలో నారా వారు చెప్పే పచ్చి అబద్ధాలను కూడా పతాక శీర్షికల్లో అచ్చేస్తుంటాడు. కాస్తయినా ఇంగితజ్ఞానం, పత్రికగా కొంతైనా సామాజిక బాధ్యత ఉండాలి కదా? తన పాఠకులకే కాదు... ఈ రాష్ట్ర ప్రజలకు కూడా జవాబుదారీ అనే స్పృహ అక్కర్లేదా? ‘ఆక్వా జోన్– నాన్ ఆక్వా జోన్’ అనే పరిమితులు లేకుండా... ఆక్వా రైతులు అందరికీ యూనిట్ విద్యుత్తు రూ.1.50కే ఇస్తానని చంద్రబాబు నాయుడు హామీ ఇవ్వటం... అదో మహా ప్రసాదంలా ‘ఈనాడు’ భజంత్రీలు కొడుతూ అచ్చేయటం!!. అసలు ఆక్వా రైతుల పాలిట విలన్ ఎవరు రామోజీ? సీడ్ నుంచి ఫీడ్ వరకూ... చివరకు రొయ్యల ఎగుమతిదారుల వరకూ ఒకే వర్గానికి చెందిన వారు సిండికేట్గా ఏర్పడి... రైతుల రక్తాన్ని పీల్చి పిప్పి చేస్తున్న ముఠాగా మారటం అబద్ధమా? తన వర్గానికి చెందిన వ్యాపారుల దారుణాలకు వత్తాసు పలికింది చంద్రబాబు కాదా? ఫీడ్, సీడ్ ధరలు ఆకాశాన్నంటుతున్నా... రొయ్యల ధరలు పతనమవుతున్నా ఏనాడన్నా బాబు హయాంలో ప్రభుత్వం జోక్యం చేసుకుందా? ఇప్పటి మాదిరిగా కనీస మద్దతు ధరలు నిర్ణయించి వ్యాపారుల చేత కొనిపించే సాహసం చేసిందా? అప్పుడెందుకు పెన్నెత్తలేదు రామోజీ మీరు? బాబు అధికారంలో ఉంటే ఎన్ని దారుణాలు జరిగినా మీకు ‘సమ్మ’తమేనా? మరీ ఈ స్థాయి పాత్రికేయమా? అసలు ఆక్వా – నాన్ ఆక్వా జోన్లను తెచ్చిందే చంద్రబాబు నాయుడు కదా? ఆక్వా జోన్లలోని వారికే విద్యుత్తు, ఇతర సబ్సిడీలని నిబంధనలు పెట్టిందే చంద్రబాబు నాయుడు కదా? అప్పుడెందుకు ఈ నిబంధనలు పెట్టారు... ఇప్పుడెందుకు తొలగిస్తామంటున్నారని అడిగే బాధ్యత ‘ఈనాడు’కు లేదా? తాను అధికారంలో ఉంటూ ఏకంగా నాలుగున్నరేళ్ల పాటు యూనిట్ విద్యుత్తు ఆక్వా జోన్ల రైతులకు కూడా రూ.3.86 చొప్పున ఇచ్చింది చంద్రబాబు కాదా? ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఏదో మాయ చేయాలన్న ఉద్దేశంతో ఎలక్షన్ల్లకు 6 నెలల ముందు దాన్ని యూనిట్ రూ.2కు తగ్గించాడు. అది కూడా ఆక్వా జోన్లలోని రైతుల వరకే!!. ఆ నాలుగున్నరేళ్లూ యూనిట్కు రూ.3.86 చొప్పున చెల్లిస్తూ ఆక్వా రైతులు పడ్డ బాధలు ‘ఈనాడు’కు కనిపించలేదు... వినిపించలేదు. ఎందుకంటే అధికారంలో ఉన్నది చంద్రబాబు మరి!!. కానీ అప్పట్లో వైఎస్ జగన్మోహన్రెడ్డి పాదయాత్ర చేస్తూ ఆక్వా రైతుల వెతలు చూశారు. తాను అధికారంలోకి వస్తే ఆక్వా జోన్లలోని రైతులకు విద్యుత్తు చార్జీలు తగ్గిస్తానని హామీ ఇచ్చారు. దీంతో బాబుకు గుబులు పెరిగి... ఎన్నికల ముందు ధర తగ్గించి తన జబ్బలు తానే చరుచుకున్నారు. రామోజీ కూడా శక్తివంచన లేకుండా చంద్రబాబు నిర్ణయాన్ని శ్లాఘించారు. కానీ... ఈ ఎన్నికల గిమ్మిక్కును ఆక్వా రైతులు అర్థం చేసుకున్నారు. ‘ఇదేం ఖర్మరా బాబూ..’ అనుకునేట్టుగా బాబుకు బుద్ధి చెప్పారు. అన్నట్టుగానే అధికారంలోకి వచ్చిన వెంటనే ఆక్వా జోన్లలోని రైతులకు యూనిట్ రూ.1.50కే అందించటం మొదలుపెట్టారు వైఎస్ జగన్. జోనింగ్ నిబంధనలకు అర్థమేంటి? అసలు చంద్రబాబు ఆక్వా జోనింగ్ నిబంధనలు తెచ్చిందెందుకు? ఆక్వా సాగును కొన్ని ప్రాంతాలకే పరిమితం చేయాలని కదా? అలా కాక ఎక్కడ పడితే అక్కడ కాలువ నీరు పారిన చోటల్లా చేపల చెరువులు వెలిస్తే మామూలు వ్యవసాయానికి భవిష్యత్తు ఉంటుందా? రాయలసీమలోని కడప జిల్లా మైదుకూరులో సైతం కాలువల వెంబడి చేపల చెరువులు తవ్వే ప్రయత్నాలు చేశారంటే ఏమనుకోవాలి? అలాంటి నాన్ –ఆక్వా ప్రాంతాల్లో కూడా రొయ్యల చెరువుల్ని విద్యుత్తు సబ్సిడీలిచ్చి ప్రోత్సహించాలన్న చంద్రబాబు ఆలోచన ఏ మేరకు సమంజసం? అలా రాయితీలిస్తే కాస్తో కూస్తో లాభసాటి కాబట్టి అంతా అటువైపే వెళతారు. అలా ఆక్వా సాగు చేసిన ప్రాంతాలన్నీ ఉప్పు నీటి కయ్యలుగా మారి మామూలు వ్యవసాయానికి పనికిరాకుండా పోతాయి. ఒకవేళ ఎప్పుడైనా... ప్రస్తుతం మాదిరిగా అంతర్జాతీయంగా ప్రతికూల పరిణామాలు తలెత్తి ఆక్వా సాగు దెబ్బతింటే... ఆ భూముల్ని మళ్లీ మామూలు సాగులోకి తీసుకురావటం అసాధ్యం. ఆ ఉద్దేశంతోనే జోనింగ్–నాన్ జోనింగ్ నిబంధనలొచ్చాయని ఎవరైనా చెబుతారు. మరిప్పుడు చంద్రబాబుకు ఏమైంది? రాష్ట్రం ఏమైపోయినా పర్వాలేదు... నేను అధికారంలోకి వస్తే చాలన్న దుర్బుద్ధి స్పష్టంకావటం లేదూ? ఈయన్ని... ఈయన తానా అంటే... తందానా అంటూ తయారయ్యే రామోజీరావును ఏం చెయ్యాలి? అంతా బాబు మనుషులు కాదా? ఫీడ్ తయారు చేసే కంపెనీలూ వారివే. రొయ్యల్ని ఎగుమతి చేసే కంపెనీలూ వారివే. అంటే రైతుకు పెట్టుబడి వ్యయాన్ని నిర్ణయించేదీ వారే... ఉత్పత్తి ధరను నిర్ణయించేదీ వారే. వీళ్లు ఈ స్థాయిలో ముఠాలా మారి అన్నీ శాసించినపుడు గత ప్రభుత్వం ఏం చేసింది? ఆక్వా కార్య కలాపాల్లోని అవంతి ఫీడ్స్, దేవి సీఫుడ్స్, దేవి ఫిషరీస్, నెక్కంటి సీఫుడ్స్, సంధ్య ఆక్వా, గ్రోవెల్ ఫీడ్స్, వాటర్ బేస్ లిమిటెడ్... ఇవన్నీ ఎవరివి? చంద్రబాబు సన్నిహితులవి కావా? అసలు రాష్ట్రంలో వనామీ రొయ్యల పెంపకం 2009లో మొదలైనపుడు... 2014 వరకూ నాటి ప్రభుత్వాలు 2–3 సార్లు రేట్లు పెంచాయి. కిలో రేటు దాదాపుగా రూ.20 వరకూ పెరిగింది. మరి 2014 నుంచి 2019 మధ్య చంద్రబాబు కేవలం 70 పైసలు మాత్రమే ఎందుకు పెంచారు? ఎందుకు రైతులకు సరైన ధర రాకుండా వారి పొట్టగొట్టారు? 2019లో ఈ ప్రభుత్వం వచ్చాక ఇప్పటిదాకా దాదాపు కిలోకు రూ.27 వరకూ పెరగటం అబద్ధమా? కోవిడ్ లాంటి విపత్కర పరిస్థితుల్లోనూ ప్రభుత్వం అండగా నిలవటం అబద్ధమా? ఈ నిజాలు ఎన్నడూ ఎందుకు చెప్పరు రామోజీ? బాబు అబద్ధాలను మాత్రమే అచ్చేసే మీదీ ఒక పత్రికేనంటారా? ప్రతి ఏటా దోచుకోవటం... పచ్చి నిజం ఆక్వా ఎగుమతిదారుల మెడపై ప్రభుత్వం కత్తిపెట్టిందంటూ రకరకాల ఆరోపణలు చేస్తున్న చంద్రబాబు... తన హయాంలో వారందరికీ ఇష్టారీతిన దోచుకోవటానికి లైసెన్స్ ఇచ్చారనే చెప్పాలి. ఏటా తొలిసారి రొయ్యల పంట చేతికొచ్చినపుడు ఏ రైతూ ఎక్కువ ధరను కళ్ల జూసేవాడు కాదు. 200 కౌంట్ ధర రూ.170–180 రూపాయలకు మించి పలికేది కాదు. ఎందుకంటే కంపెనీలన్నీ సిండికేట్గా ఏర్పడి ఈ మాయాజాలాన్ని కొనసాగించేవి. దానికి బాబు, రామోజీల అండ ఎటూ ఉంది. ‘ఈనాడు’ సైతం వీరి పక్షమే కనక... రైతుల వెతలను రాస్తే ఒట్టు!. అలా 170–180కి వీళ్లంతా రైతుల దగ్గర కొనుగోలు చేసిన తరవాత... అకస్మాత్తుగా ధర పెరిగిపోయేది. కానీ అలా పెరిగేటప్పటికి రైతుల చేతిలో రొయ్యలుండేవి కావు. ఇలాంటి పరిస్థితులుండకూడదనే చట్ట సవరణలు చేసి మరీ ఈ ప్రభుత్వం రైతుల్లో భరోసా కల్పించింది. అదే రామోజీరావు దృష్టిలో పెద్ద నేరమైపోయింది. ఆక్వా రైతుల గురించి ‘ఈనాడు’ రాసే ప్రతి రాతలో ప్రభుత్వంపై విషం చిమ్మటానికి... ఈ సిండికేట్లను బ్రేక్ చేయటమన్నదే ప్రధాన కారణమని వేరే చెప్పాల్సిన పని లేదు కూడా. అధికారంలో ఉన్నన్నాళ్లూ ఈ సిండికేట్లు దోచుకోవటానికి చంద్రబాబు సాయపడితే... ఎన్నికలు వచ్చినపుడు వీళ్లంతా కలిసి చంద్రబాబుకు ఆర్థికంగా సాయపడతారు. అదీ వీళ్ల లెక్క. అందుకే వీళ్లకు సాధారణ రైతులంటే లెక్క ఉండదు. ఇక్కడ గమనించాల్సిందొకటుంది. బాబు హయాంలో ముడిపదార్థాల ధరలు తగ్గినా.... ఫీడ్పై మాత్రం కిలోకు రూ.7 అధికంగా దోచుకున్నారు. కానీ బాబు పట్టించుకుంటే ఒట్టు!!. అదే ఈ ప్రభుత్వ హయాంలోకి వచ్చేసరికి ముడిపదార్థాల ధరలు భారీగా పెరిగాయి. ఇదే కారణంతో ఈ ఏడాది జూన్ నుంచి సెపె్టంబరు మధ్య 6 సార్లు కంపెనీలు ఫీడ్ ధరలు పెంచాయి. కానీ ప్రభుత్వం జోక్యం చేసుకుని 3 సార్లు తగ్గించింది. అంతేకాకుండా ముగ్గురు సీనియర్ మంత్రులు, సీనియర్ అధికారులతో ఆక్వా సాధికార కమిటీ ఏర్పాటయింది. ఈ కమిటీ అందరితో చర్చించి... కిలోకు రూ.2.60 చొప్పున ఫీడ్ ధరలు తగ్గించింది. ఇలా ఇష్టానుసారం ఫీడ్ ధరలు పెంచకుండా ఏకంగా చట్టాన్ని సైతం సవరించింది ప్రభుత్వం. అలా.. ఫీడ్ ధరలను నియంత్రించే వ్యవస్థను తేవటంతో పది ఎకరాల్లోపు ఉన్న రైతులకు దాదాపు రూ.10 లక్షల మేర ప్రయోజనం కలిగింది. కాకపోతే ఇలాంటి నిజాలను ‘ఈనాడు’ ఎప్పుడూ చెప్పదు. ఎందుకంటే ఇవి బాబు చేయలేని... కనీసం చేయాలనుకోని పనులు కాబట్టి!. జగన్ హామీ... బాబు జీవో.. బకాయిలు చెల్లించిన జగన్!! వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేస్తున్నపుడు... తాను అధికారంలోకి వస్తే ఆక్వా రైతులకు యూనిట్ విద్యుత్తు రూ.1.50కే ఇస్తానని హామీ ఇచ్చారు. దీంతో కలత చెందిన బాబు... అప్పటికప్పుడు ఆక్వా జోన్లలోని రైతులకు రూ.2కే యూనిట్ ఇస్తానని జీవో ఇచ్చారు. అది కూడా 2018 సెప్టెంబర్లో. అంటే 6 నెలల్లో ఎన్నికలున్నాయనగా!!. చిత్రమేంటంటే జీవో ఇచ్చినా ఆ మేరకు సబ్సిడీ నిధుల్ని విద్యుత్తు కంపెనీలకు మాత్రం ఇవ్వలేదు బాబు. అధికారంలోకి వచి్చన వెంటనే... 2019 జూలై 2 నుంచి వీరికి విద్యుత్తు యూనిట్ రూ.1.50కే ఇస్తున్నట్లు వైఎస్ జగన్ జీవో ఇచ్చారు. ఈ మూడున్నరేళ్లలో ఏకంగా రూ.2,687.47 కోట్ల రూపాయలు ఆక్వా రైతులకు విద్యుత్ సబ్సిడీ రూపంలో ఖర్చు చేశారు. బాబు చెల్లించకుండా వదిలేసిన బకాయిలనూ చెల్లించారు. అదీ చిత్తశుద్ధి అంటే. ధరలెందుకు తగ్గాయి? అసలిప్పుడు రొయ్యల ధరలెందుకు పతనమయ్యాయి? ప్రధానంగా చైనా, అమెరికాలకు ఎగుమతులు నిలిచిపోయాయి. ఈక్వెడార్ లాంటి చిన్న దేశం నాణ్యమైన రొయ్యల్ని ఉత్పత్తి చేస్తూ అంతర్జాతీయ మార్కెట్లో సవాల్ విసిరింది. దీంతో అంతర్జాతీయ మార్కెట్ లేక... ధరలు పతనమయ్యాయి. ఇక దేశీయంగా పరిస్థితులెలా ఉన్నా రాష్ట్రం మాత్రం నాణ్యమైన విద్యుత్తును సబ్సిడీ ధరకే అందించటంతో ఇక్కడ ఉత్పత్తి పెరిగింది. ఎగుమతిలో పోటీ పెరిగింది. కోవిడ్ లాక్డౌన్ సమయంలోనూ ఆక్వా పరిశ్రమ దెబ్బతినకుండా దానికి మినహాయింపునిస్తూ రాష్ట్ర ప్రభుత్వం పెద్ద సాహసమే చేసింది. మత్స్య రంగంలో ఏపీ ఉత్తమ రాష్ట్రం.. కేంద్రం కితాబు మత్స్య రంగానికి సంబంధించి అన్ని అంశాలలో ఆంధ్రప్రదేశ్ను భారత ప్రభుత్వం 2021లో ఉత్తమ రాష్ట్రంగా గుర్తించింది. ప్రపంచ మత్స్య దినోత్సవం సందర్భంగా అదే ఏడాది నవంబర్ 21న బహుమతి ప్రదానం చేసింది. మత్స్య ఉత్పత్తిలో రాష్ట్రం.. దేశంలోనే 30 శాతం వాటా కలిగి అగ్రగామిగా ఉంది. స్థూల విలువ జోడింపులో 2014–15లో 4.6 శాతంగా ఉన్న వాటా, 2020–21 నాటికి 9 శాతానికి అభివృద్ధి చెందింది. మొత్తం దేశ సముద్ర ఆహార ఎగుమతుల విలువలో రాష్ట్ర వాటా 2014–15 లో 28 శాతం ఉండగా, 2020–21 నాటికి అది 35 శాతానికి పెరిగింది. ఎగుమతుల విలువ 2014–15లో రూ.9,671 కోట్లు ఉండగా, 2020–21 నాటికి అది రూ. 20,019 కోట్లకు పెరిగింది. 2014–15లో 19.78 లక్షల మెట్రిక్ టన్నులు ఉన్న మత్స్య ఉత్పత్తి.. 2021–22లో ఏకంగా 48.13 లక్షల మెట్రిక్ టన్నులకు చేరింది. ఈ వాస్తవాలు కళ్లెదుటే కనిపిస్తున్నా, మత్స్య రంగం వృద్ధి చెందలేదని చెప్పడం ఎవరి బాగు కోసం? -
ముసుగు తీస్తే లొసుగులే..చెప్పడానికి మాత్రమే వారికి నీతులు.!
తప్పులెన్నువారు తమ తప్పులెరగరు అని శతక కారుడి ఊవాచ. కొన్ని మీడియా సంస్థలు ఇలాగే ప్రవర్తించి తాము అంతేనని రుజువు చేసుకుంటున్నాయి. దేశంలో ఎక్కడ ఏమి జరిగినా, శల్య పరీక్షలు చేసి, తామే అంతా కనిపెట్టేశామంటూ కథనాలు ఇచ్చే ఈ మీడియా తమ వరకు వచ్చేసరికి మాత్రం అమ్మో.. మా జోలికి వస్తారా .. అని గగ్గోలు పెడుతోంది. ఎవరిపైన ఐటి లేదా సీబీఐ, లేదా ఈడీ వంటి సంస్థలు సోదాలు నిర్వహిస్తే, విచారణ జరిపితే సంబంధిత వ్యక్తులు ఇలా అన్నారు.. జవాబు ఇవ్వకుండా తప్పించుకున్నారు.. అంటూ కథనాలు రాసే ఈ మీడియా తను కూడా అతీతం కాదు అని ఆచరణలో తెలియజేస్తోంది. భుజాలు ఎందుకు తడుముకుంటున్నారు? ఈనాడు మీడియాకు చెందిన మార్గదర్శి చిట్ ఫండ్ సంస్థలలో రిజిస్ట్రేషన్ అధికారులు సోదాలు జరిపితే అదంతా కక్ష అంటూ తమ పత్రికలలో, టీవీ చానళ్లలో ప్రచారం చేస్తూ ప్రజలను తప్పుదారి పట్టించే యత్నం చేసింది. నిజంగానే వీరు ఏ తప్పు చేయకుండా ఉంటే, మొత్తం తెరచిన పుస్తకం అయి ఉంటే ఉలిక్కిపడవలసిన అవసరం ఏమి ఉంటుంది. శంషేర్ గా మొత్తం రికార్డులన్నీ అధికారుల ముందు పెట్టి ఇంకేమైనా కావాలా అని అడిగి ఉండేవారు. అంతే తప్ప అధికారులు ఏది అడిగినా, తమ వద్ద ఆ సమాచారం లేదని, అదంతా హైదరాబాద్లోని హెడ్ ఆఫీస్ లో ఉందని ఎందుకు చెప్పి తప్పించుకుంటారు? మార్గదర్శి మేనేజర్లు పంచనామా కాగితాలపై ఎందుకు సంతకం పెట్టకుండా నిరాకరించారు? నిజానికి ఒక్క మార్గదర్శిపైనే అధికారులు సోదాలు జరపలేదు. చాలా చిట్ ఫండ్ సంస్థలలో జరిగాయి. అయినా వారెవ్వరూ కక్ష అంటూ ఎందుకు ఆరోపించలేదు. కేవలం మార్గదర్శి పక్షాన ఈనాడు మీడియా మాత్రమే ఎందుకు గోల చేసింది? అదే ఇంకేదైనా సంస్థపై ఏ దర్యాప్తు సంస్థ అయినా సోదా చేసి ఉంటే ఈనాడు ఇలాగే రాసేదా? ఉండవల్లి ప్రశ్నలకు బదులేదీ? 2006లోనే తాము డిపాజిట్ల సేకరణ ఆపేశామని మార్గదర్శి అధినేత రామోజీరావు రిజర్వు బ్యాంకుకు తెలియజేసిన తర్వాత కూడా మరో రూపంలో డిపాజిట్లు తీసుకుంటున్నట్లు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్కుమార్ చేసిన ఆరోపణకు ఎందుకు స్పందించలేదో అర్ధం చేసుకోవచ్చు. డిపాజిట్ అన్న పదం బదులు రిసీట్ అన్న పేరు పెట్టి చిట్ పాడిన వారి డబ్బు తీసుకోవచ్చా? ఇవన్ని చట్ట విరుద్దమా?కాదా? సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి చెప్పారు కాబట్టి తీసుకున్నామని చెప్పిన రామోజీ.. ఇంతకీ ఆ జడ్జి ఎవరో ఎందుకు చెప్పలేదు? చేసింది తప్పని గమనించి మాట మార్చేశారా? చిట్లు కట్టిన వారి వివరాలు ఇవ్వడానికి కూడా మార్గదర్శి నిరాకరించడం గమనించదగిన అంశం. అంటే ఇందులో ఏమైనా మతలబు ఉందా? మార్గదర్శి డబ్బును ఇతర అవసరాలకు మళ్లిస్తున్నారా? లేదా? ఉండవల్లి దీనికి సంబంధించి స్పష్టమైన ఆరోపణ చేశారు. అయినా జవాబు ఇవ్వలేదు. డబ్బులెలా మళ్లించారు? మార్గదర్శి కేసు సుప్రింకోర్టులో విచారణ ఉన్న సంగతి తెలిసిందే. ఈ కేసును ఉమ్మడి ఏపీ హైకోర్టులో కొట్టివేసిన తీరుపై ఉండవల్లి ఆశ్చర్యం వ్యక్తం చేసి, ఏడాది తర్వాత ఆ సంగతి తెలిసి సుప్రీంకోర్టును ఆశ్రయించవలసి వచ్చింది. ఇందులో ఏదో మతలబు వ్యవహారం లేకపోతే రామోజీరావు ఇలా ఎందుకు చేశారన్న సందేహం వస్తుంది. సుప్రీంకోర్టులో కేసు కోసం రామోజీ హడావుడి పడ్డారన్న విమర్శలు వచ్చాయి. కానీ సుప్రీంకోర్టు ఈ కేసును విచారణకు తీసుకుంది. మార్గదర్శి ఎవరికి బకాయి పడలేదు కదా అని కొందరు వాదిస్తుంటారు. అయితే చట్టాన్ని ఉల్లంఘించవచ్చని చెబుతారా? ప్రభుత్వ సంస్థలలో ఏదైనా చిన్న ఉల్లంఘన జరిగినా కావ్..కావ్ .. అని రాసే ఈ మీడియా తాను మాత్రం ఎలాంటి అతిక్రమణలనైనా చేయవచ్చని భావిస్తోందా? అది తన హక్కుగా అనుకుంటోందా? గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ నిధుల దారి మళ్లింపు వ్యవహారం బయటపడింది. అనేక సంస్థలు ఇలా నిధులు మళ్లించే దెబ్బతిన్నాయి. రామోజీకి సంబంధించిన పలు సంస్థలు కూడా నష్టాలు చవిచూశాయి. అందువల్లే ఆయన తన టివి చానళ్లను ఒక ప్రముఖ కార్పొరేట్ సంస్థకు విక్రయించిన సంగతి అందరికి గుర్తు ఉంది కదా! అబ్బో ఏం మేనేజ్మెంటో! విజయ్ మాల్యా వంటి ప్రముఖ పారిశ్రామికవేత్త ఇలా నిధుల మళ్లింపు కేసును ఎదుర్కొంటున్నారు. ఆయనే కాదు. అనేక సంస్థలు కూడా ఈ కేసుల్లో చిక్కుకున్నాయి. వారికి మీడియా సంస్థలు ఉంటే పరిస్థితి భిన్నంగా ఉండి ఉండేదేమో! ఒకవేళ వచ్చినా తమ పైన కక్ష సాధింపు అని ఆరోపణ చేసి ప్రజల దృష్టి మళ్లించడానికి, ప్రభుత్వానికి సహకరించకుండా ఉండడానికి యత్నించేవారేమో! ఈ నేపధ్యంలోనే ఉండవల్లి ఒక ఆసక్తికర వ్యాఖ్య చేశారు. రామోజీరావుకు దేశంలోని బ్యాంకులను అప్పగిస్తే అద్బుతంగా నడిపి భారతరత్న పొందేవారని ఆయన వ్యంగ్యంగా అన్నారు. పత్రిక ముసుగులో తప్పులను రామోజీ కప్పి పుచ్చుకుంటున్నారని ఆయన విమర్శించారు. నిజమే. చివరికి కాపురాలను బజారు కీడుస్తారా? రామోజీ వద్దకు కేంద్ర హోం మంత్రి వంటివారు సైతం వెళితే, ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నవారు వెళ్లి డిక్టేషన్ తీసుకుంటే ఇలాంటి ధైర్యం వస్తుందేమో! ఏది ఏమైనా ఏపీ ప్రభుత్వ అధికారులు జరిపిన సోదాలతో ఈనాడు మీడియా మరింతగా రెచ్చిపోతోంది. చివరికి ఏ స్థాయికి దిగజారిందంటే గత మూడేళ్లుగా అంటే జగన్ అధికారంలోకి వచ్చాక ప్రజలు సంసారాలు కూడా చేయడం లేదన్న అర్ధం వచ్చేలా పిచ్చి కధనాలు రాసి ప్రజల చేత అపహాస్యానికి గురి అవుతోంది. ఏపీలో అమరావతి నిర్మాణం జరగడం లేదని యువత ఇక్కడ సంసారం చేయకుండా వేరే రాష్ట్రాలకు వెళ్లిపోతున్నారట.! ఇక్కడ ఉద్యోగాలు లేక ఇతర ప్రాంతాలకు వెళ్లి అక్కడే కాపురాలు చేస్తున్నారట. ఇది నిజమే అయితే చంద్రబాబు 2014 నుంచి 2019 వరకు చేసిన పాలనలో వచ్చిన పరిశ్రమలు ఇబ్బడి ముబ్బడిగా ఉండి ఉంటే ఇక్కడే యువత ఉండి సంసారాలు చేస్తుండాలి కదా? ఆ మాటకు వస్తే రామోజీరావు కుటుంబం ఎప్పుడో ఎందుకు హైదరాబాద్ వెళ్లిపోయింది? చంద్రబాబు మొత్తం ఏపీని అభివృద్ది చేసి ఉంటే ఇక్కడే సంసారాలు చేసి తెగ పిల్లలను కనేసి ఉండేవారు కదా? ముఖ్యమంత్రి జగన్పై కోపంతో పిచ్చి వార్తలు రాసి ఈనాడు పరువు తీసుకుంటోంది. సోషల్ మీడియాలో ఈ కధనంపై వచ్చిన వ్యంగ్యాస్త్రాలు చూస్తే దానిని రాసినవారు సిగ్గుతో తలవంచుకోవల్సిందే. కనుక కేవలం కక్ష కట్టి అర్ధం పర్దం లేని వార్తలు రాసి ప్రజల చీత్కారానికి గురి కావద్దని హితవు చెప్పడం మినహా ఏమి చేయగలుగుతాం? -హితైషి, సాక్షి డిజిటల్ feedback@sakshi.com -
పేదల ఇళ్లపై ఇవీ నిజాలు.. బాబూ పవనూ అర్థమవుతుందా?
ఆంధ్రప్రదేశ్లో జనసేన అధినేత పవన్ కల్యాణ్ కొన్ని కార్యకమాలు చేపట్టడం ప్రభుత్వానికి మంచిదే అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన ఏ స్కీమ్ను విమర్శించడానికి ప్రయత్నిస్తారో దానిపై ఆయనకు ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఆపై, ప్రజలలో ఆ స్కీమ్ గురించి మంచి చర్చ జరగడానికి ఆస్కారం ఏర్పడుతోంది. పవన్ కల్యాణ్ సినిమా నటుడు కావడం, ఆయన ఎక్కడకు వెళ్లినా కొంతమంది అభిమానులు అక్కడకు వెళ్లడం, ఆయనను తెలుగుదేశం పార్టీ మీడియా భుజాన వేసుకోవడంతో కనీసం ఇప్పుడైనా ఆ స్కీమ్ గురించి ప్రజలకు మరింతగా తెలియచేసే అవకాశం వస్తోంది. చదవండి: అబద్ధాలపై పేటేంట్ చంద్రబాబుకే.. మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే.. పేదలకు ఇళ్లు ఇస్తే అక్కసా? ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆధ్వర్యంలోని రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా పేదలకు 31లక్షల స్థలాలు ఇచ్చి ఇళ్ల నిర్మాణం సంకల్పించారు. రాష్ట్రంలోనే కాదు.. దేశంలోనే ఎక్కడా ఈ స్థాయిలో పేదలకు స్థలాలు మంజూరు చేయలేదన్నది వాస్తవం. ఆ స్థలాలలో కేంద్ర ప్రభుత్వం స్కీంను కొంత వాడుకుని, తద్వారా వచ్చే నిధులకు తోడు రాష్ట్ర నిధులను జత చేసి ఇళ్లనిర్మాణం చేపడుతోంది. జగనన్న కాలనీల పేరుతో సాగుతున్న ఈ నిర్మాణాలు ఒకరకంగా చరిత్ర సృష్టిస్తున్నాయని చెప్పాలి. దీంతో ప్రతిపక్ష తెలుగుదేశంకు, ఆ పార్టీకి మద్దతు ఇచ్చే మీడియాకు తేళ్లు, జెర్రులు పాకుతున్నట్లయింది. ఇది జగన్కు మంచి పేరు తెచ్చే స్కీమ్ కావడంతో దానిని ఎలా బదనాం చేయాలా అని ప్లాన్ చేసి రకరకాల ప్రచారాలు చేపట్టారు. ఆవ భూములని, స్కామ్లని, వర్షం పడితే నీళ్లు నిలుస్తాయని, కాలనీలపై ఒకటి కాదు.. అనేక రకాలుగా విషం కక్కుతూ తెలుగుదేశం మీడియా వార్తా కథనాలు ఇచ్చింది. టీడీపీ నేతలు పలు ఆరోపణలు చేస్తూ కథ నడిపారు. కాని దానివల్ల తమకు నష్టం కలుగుతుందని భావించారో,లేక మరే కారణమో తెలియదు కానీ, ఇళ్ల స్థలాలపై విమర్శల జోరు తగ్గించినట్లు అనిపించింది. రెడీ.. కెమెరా.. యాక్షన్ అదే సమయంలో తమకు పరోక్ష మిత్రుడుగా ఉన్న జనసేన అధినేత పవన్ కల్యాణ్కు ఆ బాధ్యత అప్పగించినట్లు ఉన్నారు. ఆయన ఒక రకంగా అమాయకుడు, అంత పరిజ్ఞానం కూడా లేని వ్యక్తి కావడంతో, లేచిందే లేడీకి ప్రయాణం అన్నట్లుగా ఈ స్కీమ్ స్థలాలను పరిశీలించేందుకు వెళ్లారు. ఆయన పార్టీ నేతలు, కార్యకర్తలు కూడా ఉత్సాహంగా ఆయా కాలనీలలోకి వెళ్లి లబ్ధిదారులను పట్టుకుని ఇంటర్వ్యూలు చేసి విమర్శల వర్షం కురిపించాలని భావించారు. కానీ వారికి విధి వక్రీకరించిందన్నట్లుగా వారు వెళ్లిన ఎక్కువ చోట్ల లబ్ధిదాదారులు నిలదీశారు. దీనికి సంబంధించి వచ్చిన కథనాలు, ప్రత్యేకించి సోషల్ మీడియాలో వచ్చిన వీడియోలు ఆసక్తి కలిగించాయి. కొందరు మహిళా లబ్దిదారులను జనసేన కార్యకర్తలతో మాట్లాడుతూ, తమకు వస్తున్న సదుపాయాన్ని చెడగొట్టవద్దని నిర్మొహమాటంగా చెప్పారు. ఒక్కో చోట పట్టణాన్ని బట్టి లబ్ధిదారులకు మూడు లక్షల నుంచి పది లక్షల వరకు విలువైన స్థలాలు దక్కాయి. ఆ విషయాన్ని వారు చాలా స్పష్టంగా చెబుతున్నారు. చివరికి పవన్ కల్యాణ్ ప్రోగ్రాంలో సైతం ఆయన ఊదరకొట్టిన ఉపన్యాసం తప్ప, లబ్దిదారులు ఎవరూ వచ్చి ఫిర్యాదు చేయలేదట. దాంతో ఆయన పార్టీ నేతలను తప్పు పట్టి వెళ్లిపోయారు. జనసేన నేతలు సరిగా ఆర్గనైజ్ చేయలేకపోయారన్నది ఆయన బాధ కావచ్చు. కానీ వాస్తవాలు తెలుసుకుని ఆయన వ్యవహరించకపోతే ఇలాగే చేదు అనుభవాలే మిగులుతాయి. ఇళ్ల స్థలాల స్కీము ఆలోచన చేయడమేపూర్తి సాచ్యురేషన్ మోడ్లో జగన్ చేశారు. అందువల్లే 31 లక్షల మంది పేదలకు ఈ స్కీమ్ను అమలు చేయడానికి ఆయన సిద్దమయ్యారు. దీనిని మెచ్చుకోకపోతే, పోనీ మొత్తం కుంభకోణం అంటూ ప్రచారం చేయడానికి తెగించారు. ఎక్కడైనా ఒకటి, రెండు చోట్ల ఎవైనా అవకతవకలు జరిగి ఉంటే వాటిని ప్రస్తావిస్తే తప్పు కాదు. కానీ అసలు స్కీమ్ కింద తీసుకున్న భూముల విలువకన్నా ఎక్కువ మొత్తం స్కామ్ జరిగిందని ఆరోపిస్తే ఎవరు నమ్ముతారు? మొత్తం 71 వేల ఎకరాల భూమిని పేదల ఇళ్ల స్థలాల కోసం సేకరిస్తే, అందులో ప్రభుత్వ భూమి పోను మిగిలిన 25 వేల ఎకరాల కొనుగోలుకు 11 వేల కోట్ల రూపాయల వ్యయం అయిందట. కానీ పవన్ కల్యాణ్ మాత్రం ఏకంగా పదిహేనువేల కోట్ల రూపాయల స్కామ్ జరిగిందని ఆరోపించారు. ఇలాంటి ప్రకటనలే పవన్ అజ్ఞానాన్ని బయటపెడుతున్నాయని మంత్రి రోజా ఎద్దేవా చేశారు. ఇక్కడ 40 ఇయర్స్ అబద్దాలు ఈ ధోరణి రాష్ట్ర రాజకీయాలలో తెలుగుదేశం ప్రవేశం తర్వాత బాగా పెరిగిపోయింది. చంద్రబాబు నాయుడుతో పాటు, ముద్దుకృష్ణమనాయుడు వంటివారు ఆధారాలు లేని ఆరోపణలు చేయడంతో సిద్దహస్తులుగా పేరొందారు. నిజంగానే ఏ అంశంపైన అయినా పరిశీలన చేసి విమర్శ చేయదలిస్తే, క్షుణ్ణంగా అధ్యయనం చేసి వెళ్లాలి. కానీ ఎక్కువ సందర్భాలలో పవన్ అరకొర పరిజ్ఞానంతో వెళ్లి అభాసుపాలు అవుతున్నట్లు అనిపిస్తుంది. తెలుగుదేశం కోసం అహర్నిశలు శ్రమిస్తున్న ఈనాడులో వచ్చిన విషపూరిత కథనాల ఆధారంగా ఆయన ఇలాంటి యాత్రలు పెట్టుకుంటున్నారు. ఒక కుట్ర ప్రకారం ముందుగా ఈనాడు, తదితర తెలుగుదేశం మీడియాలలో సంబంధిత ఆరోపణలతో కథనాలు ఇవ్వడం, ఆ తర్వాత తెలుగుదేశం, జనసేన వంటి పార్టీలు ప్రకటనలు చేయడం నిత్యకృత్యం అయింది. పింగళి గారు.. గమనించారా? జనసేన అధినేత వీకెండ్ షూటింగ్ లేని సమయంలో ఇలాంటి యాత్రలు పెట్టుకుని తన వంతు పాత్ర పోషిస్తున్నారు. ఈనాడు మీడియా అయితే పూర్తి అయిన ఇళ్ల గురించి వార్తలు ఇవ్వదు. పూర్తి కానీ ఇళ్ల గురించే వ్యతిరేక కథనాలు ఇస్తూ, అసలేమీ జరగడం లేదేమో అన్న భావన క్రియేట్ చేయడానికి ప్రయత్నిస్తోంది. జగనన్న కాలనీలలో మౌలిక సదుపాయాలైన రోడ్లు, డ్రైనేజ్, నీటి సదుపాయం వంటివాటిని ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం అన్ని రకాలుగా కృషి చేస్తుంటే టీడీపీ మీడియా మాత్రం ప్రతిదానిని తప్పుపడుతూ, నిందలు మోపుతూ ప్రజలను గందరగోళం చేయడానికి తంటాలు పడుతోంది. ఆ సంగతి పక్కన బెడితే సోషల్ మీడియాలో పవన్ గురించి ఒక వీడియో వచ్చింది. ఆయన బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని మాట్లాడుతున్నట్లుగా ఉంది. అందులో జాతీయ పతాకాన్ని తయారు చేసింది జవహర్ లాల్ నెహ్రూ అన్నట్లుగా ఉంది. అది ఆయన వీడియోలాగే ఉంది. దీనిని బట్టే పవన్ కల్యాణ్ రాజకీయాలలోనే కాదు.. చరిత్ర విషయంలో కూడా అంత పరిజ్ఞానంతో మాట్లాడడం లేదన్నది అర్థం అవుతుంది. రాజకీయాలలో ముఖ్యమైన భూమిక పోషించాలని అనుకుంటే, అందుకు తగ్గట్లుగా విషయ పరిజ్ఞానం పంపొందించుకోవాలన్న సంగతి పవన్ కల్యాణ్కు ఎప్పటికి అర్ధం అవుతుందో! -పొలిటికల్ ఎడిటర్, సాక్షి డిజిటల్ feedback@sakshi.com -
తెలంగాణలో ఒకలా.! ఏపీలో మరోలా.! ఎందుకలా..?
అప్పులపై ఈనాడు ఎన్ని సార్లు వార్తలు ఇచ్చిందో చెప్పలేం. చివరికి ఓడరేవుల అభివృద్దికి అప్పు ప్రతిపాదన చేసినా తప్పు పడుతున్నారు. ఓడరేవులు అభివృద్ధి చెందితే అది రాష్ట్రానికి ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. దానిని చెడగొట్టడానికి ఈనాడు, జ్యోతి వంటి మీడియా సంస్థలు ఇలాంటి వార్తలు ఇస్తున్నాయని ప్రజలు అర్ధం చేసుకోలేరనుకుంటే అది వారి భ్రమే అవుతుంది. హంద్రీనీవాలో నీరున్నా రైతుకు కన్నీరే అంటూ మరో విషపూరిత కథనాన్ని ఈనాడు ఇచ్చింది. చదవండి: ఏపీపై ‘దుష్టచతుష్టయం’ పగబట్టిందా.. వచ్చే ఎన్నికల వరకు భరించాల్సిందేనా? నిజంగానే ఎక్కడైనా పొలాలకు సరిగా నీరు అందకపోతే వార్త ఇవ్వవచ్చు. అలా కాకుండా రాయలసీమలో హైకోర్టు పెట్టాలని ఆత్మగౌరవ ర్యాలీలు జరుగుతున్న వేళ ప్రజలలో ప్రభుత్వంపై వ్యతిరేకత తెచ్చే లక్ష్యంతో ఇలాంటి కథనాలు ఇస్తున్నారు. ఈ వార్త అబద్దమని రాయలసీమ మేధావుల ఫోరం కన్వీనర్ పురుషోత్తంరెడ్డి సోదాహరణంగా వివరించారు. తప్పుదారి పట్టించే యత్నం ఒకవేళ నిజంగానే లక్ష ఎకరాల పొలాలు ఎండిపోతుంటే ప్రభుత్వం చూస్తూ ఉరుకుంటుందా? ప్రభుత్వం పట్టించుకోకపోతే ప్రతిపక్షం ఎంత గొడవ చేసేది? ఈనాడు మాత్రం ప్రజలను తప్పుదారి పట్టించే యత్నం చేసింది. ఈ ఏడాది వర్షాలు బాగా పడ్డాయి. రిజర్వాయిర్లు, చెరువులు అన్నిటా నీరు ఉంది. అలాంటప్పడు నీటి సమస్య ఎక్కడ వస్తుంది? విద్యుత్ బకాయిల చెల్లించలేదంటూ రాసిన ఈ పత్రిక తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టు లిఫ్టులు, ఇతర లిఫ్టుల విద్యుత్ బకాయిల గురించి ఎన్నడైనా వార్తలు ఇచ్చిందా అంటే అదేమీ చేయలేదు. ఇక్కడ ఆ మీడియాకు ఉన్న భయం ఏమిటో వారే చెప్పాలి. నిజం తెలిసినా వక్రభాష్యమే.! అమరావతిలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడాన్ని కూడా వ్యతిరేకిస్తూ మాస్టర్ ప్లాన్ మార్చేస్తున్నారు అంటూ వార్త ఇచ్చింది. ఆయువు తీస్తున్న విద్యుత్ తీగలు అంటూ అప్పుడెప్పుడో జరిగిన ఘటనల ఆధారంగా ఒక స్టోరీ వండారు. ఇది కూడా నిజంగా సమస్య పరిష్కారం కోసం కాకుండా, ఏపీ ప్రభుత్వాన్ని బదనాం చేయాలన్న ఉద్దేశంతోనే చేశారన్న సంగతి ఇట్టే తెలిసిపోతుంది. మరో వైపు గ్రామాలలో విద్యుత్ బకాయిలు చెల్లించకూడదన్నట్లుగా వార్తలు ఇస్తూ సర్పంచ్లపై కత్తీ అంటూ మరో అధ్వాన్నపు వార్త ఇచ్చారు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. కరోనా సంక్షోభం సమయంలో ఉద్యోగులకు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు జీతాలు ఇవ్వలేకపోయాయి. కాని ఏపీలో మాత్రం ఉద్యోగులను రెచ్చగొట్టే రీతిలో కధనాలు ఇచ్చాయి. అప్పు తెచ్చి జీతాలు ఇస్తే అదిగో అప్పు చేశారని రాశారు. అంతేకాదు .. ఈనాడు ఒకసారి అసలు ఏపీ ప్రభుత్వ ఆదాయం పెరిగిందని కూడా వార్త ఇచ్చింది. రాతలు కావవి.. పచ్చ కామెర్లు.! కరోనా సమయంలో పేదలకు సాయం చేసినప్పుడు ఎలాంటి పాజిటివ్ వార్తలు ఇవ్వలేదు. పైగా అమ్మో అప్పులు చేసేశారు అంటూ వ్యతిరేక ప్రచారం చేశారు. పోనీ ప్రభుత్వం వ్యయం తగ్గించుకోవడానికి, స్కీములలో వృధా అరికట్టడానికి ప్రయత్నిస్తే, వెంటనే ఆ స్కీములో కోత పెట్టారు! ఈ స్కీములో కోత పెట్టారు అంటూ అప్పుడు కధనాలు ఇచ్చారు. విశాఖలో టిడిపి ఆందోళనకు దిగితే పోలీసులు కట్టడి చేస్తే నిర్భంధ కాండ అంటూ తాటికాయంత అక్షరాల హెడింగ్ ఇచ్చారు. మరి అదే అమరావతిలో భూముల సమీకరణకు వ్యతిరేకంగా రైతులు ఆందోళన చేసినప్పుడు, విపక్షాలు ఆ ప్రాంతం వైపు వెళ్లకుండా ఆంక్షలు పెట్టినప్పుడు ఎప్పుడైనా ఇలా రాశారా? ఆనాటి ప్రభుత్వమే రైతుల పంటలను కూడా తగుల పెట్టించదన్న ఆరోపణ వచ్చినప్పుడు ఈ మీడియా ఏనాడైనా ఇది దారుణం అని రాసిందా? మీరా విలువలా గురించి వల్లించేది? ఎప్పుడైనా ఒకసారి ఏడిస్తే ఎవరైనా ఓదార్చుతారు. కాని రోజు ఏడ్చేవారిని ఎవరు ఓదార్చుతారన్నది నానుడి. సరిగ్గా ప్రస్తుతం ఈనాడు, ఇతర టీడీపీ మీడియా సంస్థల పరిస్థితి అలాగే ఉంది. రోజూ ప్రభుత్వంపై ఏదో ఒక చెత్తరాసి, ఇంత బురద పోసి ఈ మీడియా ఆనందపడుతోంది. వీరి బాధ అల్లా ఎన్ని రాసినా ప్రజలలో ప్రభుత్వంపై తాము ఆశించిన వ్యతిరేకత రావడం లేదనే. అందుకే మరింత ప్రస్టేషన్ తో ఈనాడు, టీడీపీ మీడియా ఇలా చేస్తున్నాయి. ఒకప్పుడు ఈనాడు అధినేత రామోజీరావు సమాజ విలువల గురించి, పత్రిక ప్రమాణాలు, విలువల గురించి సంపాదకీయాలే కాదు.. ఉపన్యాసాలు కూడా ఇచ్చేవారు. ఏదైనా నిజమైతేనే రాయండి.. అబద్దమైతే రాయవద్దని సుద్దులు చెప్పేవారు. ఏ ఆరోపణపైన అయినా రెండో వెర్షన్ తీసుకోవాలని చెప్పేవారు. కాని ఇప్పుడు ఆయన సారధ్యంలోని ఈనాడు ఇంత ఘోరంగా విలువలకు పాతర వేస్తున్న తీరు చూస్తే, ఆనాటి మాటలన్నీ ఒట్టి మాటలేనా అన్న భావన ఏర్పడుతుంది. చివరికి ఈనాడు సైతం కులం ఊబిలో చిక్కుకుందన్న విమర్శలు రావడం అత్యంత శోచనీయం. వీటన్నిటిని గమనిస్తే వచ్చే 2024 ఎన్నికల వరకు జగన్ ప్రభుత్వం ఈ దుష్టచతుష్టయాన్ని ఎదుర్కోకతప్పదని అర్థం అవుతుంది. దీనికి తగ్గట్లుగానే ప్రభుత్వం కూడా ప్లాన్ చేసుకోవలసి ఉంటుంది. -పొలిటికల్ ఎడిటర్, సాక్షి డిజిటల్ feedback@sakshi.com -
అన్నీ ఏడుపుగొట్టు వార్తలే.. పచ్చమీడియా ఆ విశ్లేషణ చేయదు.. ఎందుకంటే?
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని తప్పుబడుతున్న పచ్చమీడియా.. ఆచరణలో అంత కంటే ఘోరంగా వ్యవహరిస్తోంది. ఈ విషయంలో వారు అనుసరిస్తోన్న తీరును ప్రజలు తరచుగా గమనించినా.. పచ్చమీడియా ధోరణిలో మాత్రం మార్పు రావడం లేదు. వైఎస్సార్సీపీ ఇచ్చిన మానిఫెస్టోపై ఈ మీడియా ఎన్నడూ విశ్లేషణ చేయదు. ఆయన ఇచ్చిన హామీలు నెరవేర్చారా? లేదా? అన్న జోలికి వెళ్లదు. ఎందుకంటే వాటి గురించి ప్రస్తావిస్తే వైఎస్ జగన్ హామీలు అమలు చేశారని చెప్పవలసి వస్తుంది కనుక. అంతకుముందు అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ 400 హామీలు ఇచ్చి వాటిని అమలు చేయకుండా ప్రజలను మోసం చేసినా, చంద్రబాబు ప్రభుత్వం అంత గొప్ప, ఇంత గొప్ప అని ప్రచారం చేసేవి. లక్షకోట్ల రుణాలను మాఫీ చేస్తామని చంద్రబాబు చెబితే ఈ మీడియా అదెలా సాధ్యమైని ఏనాడు ప్రశ్నించలేదు. పైగా చంద్రబాబు అనుభవజ్ఞుడు కనుక రుణమాఫీ చేస్తారని ప్రచారం చేశాయి. బాబు ఓడగానే అసలు రూపం ఈనాడు, ఆంద్రజ్యోతి, టివి 5 తెలుగుదేశంకు మద్దతు ఇచ్చే సంస్థలే అయినా గతంలో మరీ ఇంత నీచంగా ఉండేవికావు. వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ఆ సంస్థలు ఓర్చుకోలేకపోతున్నాయి. ఆ మీడియా యాజమాన్యాలు చంద్రబాబు ఓడిపోతే తామే ఓడిపోయినట్లు భావించడం ఆరంభించాయి. అంతే.. ఇక జగన్పై ఉన్నవి, లేనివి రాయడం ఆరంభించారు. ఆ క్రమంలో ఉచ్ఛనీచాలు వదలివేస్తున్నారు. ఒక మాటలో చెప్పాలంటే ఇవి బట్టలు ఊడదీసుకుని తిరగడానికి కూడా సిగ్గుపడడం లేదేమో అనిపిస్తుంది. ఈనాడు మీడియాకు కాని, మిగిలిన టిడిపి మద్దతుదారులైన మీడియా వారికి గాని, ఈ మూడున్నరేళ్లలో జగన్ ప్రభుత్వం చేసిన ఒక్క మంచి పని కూడా కనిపించలేదు. వీళ్లు కళ్లున్న కబోదుల్లా మారిపోయారు. (చదవండి: ఏపీపై ‘దుష్టచతుష్టయం’ పగబట్టిందా.. వచ్చే ఎన్నికల వరకు భరించాల్సిందేనా?) అన్నీ ఏడుపుగొట్టు వార్తలే ఉదాహరణకు ఈనాడు మీడియా గత కొద్దిరోజులుగా రాస్తున్న ఏడుపుగొట్టు వార్తలను పరిశీలించండి. ఎవరికైనా విషయం ఇట్టే బోధపడుతుంది. ఏపిలో విద్యా వ్యవస్థ మెరుగుదలకు ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టిందని అంతా భావిస్తారు. యుపి తదితర రాష్ట్రాల నుంచి ప్రత్యేక బృందాలు వచ్చి ప్రభుత్వ స్కూళ్లను చూసి వెళ్లాయి. ఇంగ్లీష్ మీడియం ప్రవేశ పెట్టడంతో పాటు స్కూళ్లను నాడు-నేడు కింద తీర్చిదిద్దుతున్నారు. వాటిని మెచ్చుకోకపోతే మాని, ఈనాడు ఏమని రాసిందో చూడండి. పిల్లలపై పిడుగు అన్న శీర్షికతో తరగతి బోధన, అభ్యసన గాలికి వదలివేశారంటూ ప్రచారం చేశారు. ప్రైవేటు స్కూళ్లలో అడ్మిషన్లు పెరిగాయని రాస్తున్నారు. ఇలాంటి వార్తనే ఒక ఇరవై రోజుల కిందట ఈ పత్రిక రాసింది. దానిపై అధికారులు వివరణ ఇచ్చారు. గతంలో కన్నా ప్రభుత్వ స్కూళ్లలో అడ్మిషన్లు పెరిగిన వైనాన్ని తెలిపారు. అయినా ఈ పత్రిక మళ్లీ పిల్లలపై పిడుగు అంటూ ఏడుపుగొట్టు వార్త ఇచ్చింది. ఎల్లో ఎజెండాలో నెగెటివ్ వార్తలే స్కూళ్లలో కనీస సంఖ్యలో విద్యార్ధులు లేకపోతే వాటిని వేరే స్కూల్ లో కలిపితే, అమ్మో ఇంకేముంది పిల్లలకు అన్యాయం జరిగిపోయిందని రాస్తున్నారు. ప్రభుత్వం ఈ చర్య తీసుకోకపోతే, పిల్లలు లేకపోయినా, టీచర్లకు జీతాలు ఇస్తున్నారని అప్పుడు రాస్తారు. ఈ పత్రిక ఎన్నడైనా స్కూళ్ల ఆధునీకరణపై ఒక్క పాజిటివ్ వార్త అయినా ఇచ్చిందా? ప్రభుత్వ స్కూళ్ల టీచర్లను రెచ్చగొట్టేలా మాత్రం స్టోరీలు ఇస్తుంటారు. అందుకే విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఈ పత్రికలు విద్యారంగంపై విషం కక్కుతున్నాయని విమర్శించారు. కళ్లు తెరిచి చూడండయ్యా, జరుగుతున్న మంచిని! చిత్తశుద్దితో విద్యా వ్యవస్థలో తెస్తున్న మార్పులలోని మంచిని, ఏవైనా లోటుపాట్లు ఉంటే వాటిని చెప్పడం తప్పుకాదు. కాని నిత్యం విషపూరిత కథనాలు ఇవ్వడంతో ఈనాడు, ఇతర టిడిపి మీడియా సంస్థలు విశ్వసనీయత కోల్పోతున్నాయి. ఉత్తరాంద్రపై ప్రేమ ఉంటే భూముల తాకట్టా అంటూ మరో ఏడుపు వార్త ఇచ్చారు. భూములు తాకట్టుపెట్టి ప్రభుత్వం అప్పు తీసుకోవడాన్ని వీరు తప్పు పట్టారు. మరి గత ప్రభుత్వం అమరావతి భూములను తాకట్టుపెట్టినప్పుడు, అధిక వడ్డీకి బాండ్లను జారీ చేసినప్పుడు ఎందుకు ఇలాంటి స్టోరీలు ఇవ్వలేదు? అప్పుడు చంద్రబాబు మొహం చూసి అప్పులు ఇచ్చారని ప్రచారం చేశారే. పోనీ భూముల తాకట్టుపెట్టకుండా రుణాలు వచ్చే అవకాశం ఉంటే దాని గురించి రాయవచ్చు. అలాకాకుండా విశాఖ కార్యనిర్వహాక రాజధాని అయితే ఉత్తరాంద్ర అంతటా జగన్ కు మంచి పేరు వస్తుందన్న కారణంగా ఈనాడు కుళ్లుబుద్దితో ఇలాంటి వార్త ఇచ్చింది. విశాఖ రాజధాని కాకుండా చేయాలని తన వంతు విషాన్ని ఈ మీడియా చిమ్ముతోంది. - పొలిటికల్ ఎడిటర్, సాక్షి డిజిటల్ feedback@sakshi.com