-
కళ్ల సమస్యలకు చెక్!
కళ్ల సమస్యలు వచ్చినా... అక్షరాలు లేదా వస్తువులు సరిగా కనిపించకపోయినా డాక్టర్ కళ్ల జోడు వాడాలని సూచిస్తారు. వాటివల్ల కంటి సమస్యలు పూర్తిగా పరిష్కారం అవుతాయని కాదు.. కాస్త ఉపశమనం కలుగుతుంది అంతే. కాటరాక్ట్ శస్త్రచికిత్స కానీ లెన్స్ వాడటం వల్ల, లేజర్ చికిత్స వల్ల కాస్త కంటి సమస్యలను నయం చేసుకోవచ్చు. అయితే వీటన్నింటి సాయం అవసరం లేకుండానే కంటి చుక్కల మందు సాయంతో సమస్యలకు చెక్ పెట్టొచ్చని చెబుతున్నారు ఇజ్రాయెల్కు చెందిన శాస్త్రవేత్తలు. అంతేకాదు ఉన్న సమస్యలను కూడా తగ్గించవచ్చని పేర్కొంటున్నారు. ఇందుకోసం తాము ఓ ప్రత్యేకమైన కంటి చుక్కల మందు తయారు చేసినట్లు ఇజ్రాయెల్ టెల్ అవీవ్లోని బార్ ఇలాన్ యూనివర్సిటీకి చెందిన ఇన్స్టిట్యూట్ ఆఫ్ నానోటెక్నాలజీ, అడ్వాన్స్డ్ మెటీరియల్స్ శాస్త్రవేత్తలు తెలిపారు. తామే తయారు చేసిన చుక్కల మందుతో కంటి చూపును మెరుగుపరుచుకోవచ్చిన స్పష్టం చేస్తున్నారు. ‘రిఫ్రాక్టరీ సమస్యలను సరిచేసేందుకు తాము ఓ వినూత్న పద్ధతిని కనుగొన్నాం’ అని కంటి వైద్య నిపుణుడు డా.డేవిడ్ స్మద్జ తెలిపారు. ఈ మందు వేసిన పందుల కార్నియా సమస్యలు చాలా వరకు తొలగిపోయాయని తమ పరిశోధనల్లో తేలినట్లు చెప్పారు. దూరదృష్టి, హ్రస్వ దృష్టి సమస్యలు తొలగిపోయాయని వివరించారు. అయితే మానవులపై వచ్చే నెలలో క్లినికల్ ట్రయల్స్ చేయాల్సి ఉందని చెప్పారు. అంటే ఇది ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి వచ్చేందుకు మరింత సమయం పట్టే అవకాశాలున్నాయి మరి! -
కంట్లో చీకట్లు
సాక్షి, హైదరాబాద్: సర్వేంద్రియానాం నయనం ప్రధానం అన్నారు పెద్దలు.. అయితే ముఖ్యమైన ఆ కన్నే ప్రమాదంలో పడిందిప్పుడు. మారుతున్న జీవనశైలి, పౌష్టికాహార లోపం తదితర కారణాల వల్ల కంటిచూపు సమస్యలు పెరుగుతున్నాయి. ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ గణాంకాల ప్రకారం రాష్ట్రంలోని 25 శాతం మంది కంటి చూపు సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. పెద్ద వయస్సు వారికి శుక్లాలు (పొర), చిన్న పిల్లలకు పోషకాహార లోపం వల్ల దృష్టి లోపాలు వస్తున్నాయి. శుక్లాల కారణంగానే 43 శాతం మంది కంటిచూపు కోల్పోతున్నారని నిపుణు లు నిర్ధారించారు. మధుమేహం కారణంగా కంటిచూపు సమస్యల(డయాబెటిక్ రెటినోపతి)తో బాధపడుతున్నవారూ పెరుగుతున్నా రు. రాష్ట్రంలోని 7 శాతం జనాభా డయాబెటిక్ రెటినోపతి సమస్యతో బాధపడుతున్నారు. వీరు కాకుండా మరో 7 శాతం మంది చూపు కోల్పోయేందుకు కారణమయ్యే నీటి కాసులు(గ్లకోమా) సమస్యతో బాధపడుతున్నారు. 40 ఏళ్లు దాటిన వారిలో గ్లకోమా లక్షణాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. దీంతో ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ అంధత్వ నివారణపై ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టింది. అన్ని రకాల దృష్టి లోపాలను గుర్తించేందుకు ప్రత్యేక సర్వేను చేపట్టింది. 550 గ్రామాలను ఎంపిక చేసి 2017 అక్టోబర్లో సర్వే మొదలుపెట్టింది. ఇటీవల వివరాలను నమోదు చేసింది. గ్రామీ ణ ప్రాంతాల్లోని ప్రతి వంద మందిలో ఇద్దరు కంటి చూపు సమస్యలతో బాధపడుతుండగా పట్టణాల్లో వంద మందిలో ఒకరు ఈ ఇబ్బం ది ఎదుర్కొంటున్నారు. ఎక్కువగా శుక్లాల సమస్యతోనే కంటిచూపు కోల్పోతున్నారు. రాష్ట్రంలో 3.21 లక్షల శుక్లాల చికిత్సలు నిర్వహించారు. నేత్రదానంతో 5,126 మంది కంటిచూపును పొందారు. పోషకాహారం తీసుకోకపోవడం వల్లే.. మహిళలు గర్భంతో ఉన్నప్పుడు పోషకాహా రం తీసుకోకపోవడం వల్ల పిల్లలు పుట్టుకతోనే కంటిచూపు సమస్యల బారిన పడుతున్నారు. చిన్న వయస్సులోనే కంటిచూపు సమస్యలతో బాధపడుతున్నవారు 7 శాతం మంది ఉంటున్నారు. నెలలు నిండకుండానే పుట్టిన వారిలో రెటినోపతి ఆఫ్ ప్రిమెచ్యూరిటీ సమస్య వస్తోంది. దీన్ని నిర్లక్ష్యం చేస్తే శాశ్వతంగా చూపు పోయే ప్రమాదం ఉంది. మన రాష్ట్రంలోని పిల్లల్లో కంటి చూపు సమస్య బాధితులు పెరుగుతున్నారు. 2014–15లో 5,44,469 మంది విద్యార్థుల్లో 24,947 మందికి కంటి చూపు సమస్యలున్నాయి. 2015– 16లో 6,53,156 మందిని పరీక్షించగా... 40,264 మంది బాధితులున్నారు. 2016– 17లో 6,10,234 మంది లో 40,367 మంది విద్యార్థులకు చూపు సమస్యలున్నాయి. ప్రస్తుత విద్యా సంవత్సరంలో పరీక్షల ఫలితాలు రావాల్సి ఉంది. చికిత్స ఏర్పాట్లు... కంటి చూపు సమస్యల నివారణపై ఆరోగ్య, కుటుంబ సంక్షేమ ప్రత్యేక కార్యాచరణ మొదలుపెడుతోంది. మూడేళ్లలో రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లోని ప్రజలకు పరీక్షలు నిర్వహించి అవసరమైన వైద్యం అందించేలా ఏర్పాట్లు చేస్తోంది. స్వచ్ఛంద సంస్థల సహకారంతో ‘అంధత్వ రహిత తెలంగాణ(అవైడబుల్ బ్లైండ్నెస్ ఫ్రీ తెలంగాణ–ఏబీఎఫ్టీ)’పేరుతో ఈ కార్యక్రమాన్ని అమలు చేయనుంది. నేత్ర వైద్య నిపుణులు, ప్రైవేటు ఆస్పత్రుల యాజమాన్యాలు దీంట్లో భాగస్వాములు అవుతున్నాయి. ఇందుకోసం మొదటి దశలో 2017–18లో 10 జిల్లాలను ఎంపిక చేసింది. వచ్చే ఏడాది 10 జిల్లాల్లో, మరో ఏడాది ఇంకో 10 జిల్లాల్లో ఇదే తరహా కార్యక్రమాలను నిర్వహించనుంది. రాష్ట్రంలో 2019 నాటికి కంటిచూపు సమస్యలు లేకుండా చేసేందుకు ప్రత్యేక కార్యాచరణ అమలు చేస్తున్నాం. స్వచ్ఛంద సంస్థల సహకారంతో కంటి శుక్లాల శస్త్ర చికిత్సలు నిర్వహిస్తున్నాం. కొన్ని గ్రామాలను ఎంపిక చేసి పూర్తి స్థాయిలో వైద్యం అందించే ఏర్పాట్లు చేస్తున్నాం. – డాక్టర్ మోతీలాల్, జాయింట్ డైరెక్టర్, జాతీయ అంధత్వ నివారణ కార్యక్రమం శుక్లాల సమస్యతోనే ఎక్కువ మందికి కంటి చూపు సమస్యలు వస్తున్నాయి. కాలుష్యం సైతం కంటి సమస్యలకు కారణమవుతోంది. పోషకాహార లోపంతో చిన్న వయస్సులోనే కంటి చూపు సమస్యలు వస్తుంటాయి. మధుమేహం ఉన్నట్లు తేలితే వెంటనే కంటి పరీక్షలు చేయించుకోవాలి. – డాక్టర్ రవీందర్గౌడ్, సూపరింటెండెంట్, సరోజినిదేవి కంటి ఆస్పత్రి -
12 సార్లు... 1 నిమిషానికే!
అధ్యయనం మనుషులు నిమిషానికి ఎన్నిసార్లు కన్నార్పుతారో తెలుసా...12 సార్లు. అవును ప్రతి 5 సెకన్లకోసారి కనురెప్పలు వాటంతట అవే మూసుకుపోతాయి. నిమిషానికి... 12సార్లయితే మరి గంటకు...12 *60=720 సార్లు. రోజుకు... 24*720=17280 సార్లు. ఆసక్తికరమైన అంశాన్ని చూసేటప్పుడు కన్నార్పే నిడివి 5 సెకన్లకంటే ఎక్కువగా ఉంటుంది. కంప్యూటర్ మానిటర్ని చూసేటప్పుడు కూడా కన్నార్పడం ఆలస్యం అవుతుంటుంది. దాంతో కంటిని శుభ్రపరిచే ప్రక్రియ తక్కువగా జరుగుతుంది. కంప్యూటర్ మీద పనిచేసే వారికి కంటిసమస్యలు త్వరగా రావడానికి ఇదీ ఓ కారణమే. కళ్లకు తగినంత తేమను అందిస్తూ, దుమ్ముధూళిని తొలగించడానికే కనురెప్పలు మూసుకుంటాయి. -
నిండు జీవితానికి ‘నవ’ పరీక్షలు!
బీపి, షుగర్, కంటి సమస్యలు, లివర్ సమస్యలు, కిడ్నీ సమస్యలు, గుండెజబ్బులు, స్థూలకాయం, ఎముకలు బలహీనపడటం, రక్తంలో ెహిమోగ్లోబిన్ తగ్గడం వంటి సమస్యలు చాలామందికి సర్వసాధారణంగా ఎదురయ్యేవే. కారణాలను గుర్తించి, వాటిని అదుపులోకి తెచ్చేందుకు ఉపకరించేవే ఈ నవపరీక్షలు... 1. రక్తపోటు పరీక్ష: ఆధునిక జీవితంలో ఒత్తిడి, ఫాస్ట్ఫుడ్ సంస్కృతి పెరగడంతో చిన్న వయసు వారిలో కూడా ఇటీవలి కాలంలో అధిక రక్తపోటు కనిపిస్తోంది. ‘స్ఫిగ్మోమానోమీటర్’ అనే పరికరంతో బీపీని కొలుస్తారు. వైద్యుల సలహా మేరకు ఆహార విహారాల్లో జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా చాలా వరకు దీనిని అదుపు చేయవచ్చు. అప్పటికీ అదుపులోకి రాకుంటే, మందులు వాడాల్సి ఉంటుంది. 2. ఈసీజీ పరీక్ష: గుండె పనితీరును తెలుసుకోవడానికి ఎలక్ట్రో కార్డియోగ్రఫీ (ఈసీజీ) పరీక్ష అత్యవసరం. ఈసీజీ పరికరం సాయంతో గుండె కొట్టుకునే తీరును తెలుసుకుంటారు. దీనిద్వారా గుండె కండరాలకు తగినంతగా రక్త సరఫరా జరగకపోవడం, గుండె లయలో హెచ్చుతగ్గులు, తగినంత వేగంతో గుండె పంప్ చేయలేకపోవడం, గుండె కండరాల్లో ఏవైనా దళసరిగా మారడం లేదా వాటి పరిమాణం పెరగడం, గుండెలో పుట్టుకతో ఏర్పడే లోపాలు వంటివి కనుక్కోవచ్చు. 3. లివర్ ఫంక్షన్ టెస్ట్స్: లివర్ పనితీరును తెలుసుకునేందుకు చేసే కొన్ని రకాల రక్తపరీక్షలనే లివర్ ఫంక్షన్ టెస్ట్స్ అంటారు. వీటిలో ఆల్బుమిన్, టోటల్ బైలురుబిన్, డెరైక్ట్ బైలురుబిన్, ట్రాన్సామినాసెస్, ఆల్కలైన్ ఫాస్ఫేట్స్ వంటి పదార్థాల స్థాయిని కనుగొనేందుకు చేసే పరీక్షలు ఉంటాయి. వీటి ద్వారా హెపటైటిస్, హైపర్ పారాథైరాయిడిజం, పచ్చకామెర్లు (జాండిస్) వంటి జబ్బులను తెలుసుకోవచ్చు. వీటితో పాటు అల్ట్రాసౌండ్ హోల్ అబ్డామిన్ పరీక్ష చేయడం ద్వారా లివర్ సిరోసిస్, ఫ్యాటీలివర్ కూడా ఉందేమో తెలుసుకోవచ్చు. లివర్లోని లోపాల వల్ల తలెత్తే జబ్బుల లక్షణాలు అంత తొందరగా బయటపడవు. ప్రాథమిక దశలోనే గుర్తిస్తే, చికిత్స చేయడం తేలిక. 4. కంటి పరీక్ష: సాధారణంగా కంటిచూపు 6/6 ఉంటుంది. చిన్నారులు ఎక్కువగా హ్రస్వదృష్టి బారిన పడుతుంటారు. నలభై ఏళ్లు దాటాక చత్వారం వచ్చేస్తుంది. అంటే, దూరదృష్టి పెరుగుతుందన్నమాట. ఇవే కాకుండా, వయసు మళ్లిన వారికి గ్లకోమా, క్యాటరాక్ట్ వంటి ఇబ్బందులూ తలెత్తుతాయి. ఎప్పటికప్పుడు కంటి పరీక్ష జరిపించుకుంటూ, తగిన చికిత్స పొందాలి. 5. కిడ్నీ పరీక్ష: కిడ్నీల పనితీరును తెలుసుకోవడానికి సీరమ్ క్రియాటినిన్ పరీక్ష నిర్వహిస్తారు. కండరాల జీవక్రియలో వెలువడే రసాయనిక వ్యర్థమే క్రియాటినిన్. రక్తంలో క్రియాటినిన్ స్థాయిని సక్రమంగా ఉండేలా చూడటంలో కిడ్నీలదే కీలక పాత్ర. కిడ్నీల పనితీరులో తేడా వస్తే రక్తంలో క్రియాటినిన్ పరిమాణం పెరిగిపోతుంది. క్రియాటినిన్ పరిమాణం సాధారణంగా 0.8-1.2 ఎండీ/డీఎల్, పురుషుల్లో 0.8-1.3 ఎంజీ/డీఎల్ ఉంటుంది. మూత్రపరీక్ష ద్వారా కూడా దీని స్థాయిని తెలుసుకుంటారు. ఒక్కోసారి అవసరాన్ని బట్టి మూత్రపరీక్ష, రక్తపరీక్ష రెండింటి ద్వారా ఈ పరిమాణాన్ని తెలుసుకుని, కిడ్నీల పనితీరులో తేడాలు ఉన్నట్లు తేలితే తగిన చికిత్స చేస్తారు. 6. కొలెస్ట్రాల్ పరీక్ష: రక్తంలో కొలెస్ట్రాల్ పరిమాణం సాధారణ స్థాయి కంటే ఎక్కువగా ఉంటే గుండెజబ్బులు, పక్షవాతం వంటి ప్రమాదకర పరిస్థితులు తలెత్తుతాయి. రక్తపరీక్ష ద్వారా కొలెస్ట్రాల్ పరిమాణాన్ని తెలుసుకోవచ్చు. ఎల్డీఎల్, హెచ్డీఎల్ ఈ పరీక్షల ద్వారా తెలుసుకుంటారు. ఎల్డీఎల్నే చెడు కొవ్వు అంటారు. ఇది ఎక్కువగా ఉంటే, ధమనుల్లో కొవ్వు చేరి గుండెపోటు వచ్చే ప్రమాదం ఏర్పడుతుంది. అదే, హెచ్డీఎల్ అంటే మంచి కొలెస్ట్రాల్ రక్తనాళాల్లోకి చెడుకొవ్వు చేరకుండా అరికడుతుంది. 45 పైబడ్డ వాళ్లు ప్రతి ఏటా ఈ పరీక్ష చేయించుకోవాలి. 7. చక్కెర పరీక్ష: రక్తంలో గ్లూకోజ్ స్థాయి ఉండాల్సిన దాని కంటే ఎక్కువగా ఉంటే డయాబెటిస్ ఉన్నట్లే. చక్కెరను నియంత్రించే ఇన్సులిన్ను ఉత్పత్తి చేసే పాన్క్రియాస్ పనితీరు మందగించినా, కండరాలు, కాలేయం, కొవ్వుల్లో ఉండే జీవకణాలు ఇన్సులిన్కు తగిన రీతిలో ప్రతిస్పందించకపోయినా చక్కెరజబ్బు వస్తుంది. పాన్క్రియాస్ ఇన్సులిన్ను ఉత్పత్తి చేయకపోతే టైప్-1 డయాబెటిస్ వస్తుంది. ఇది చిన్న వయసు నుంచే కనిపిస్తుంది. ఇన్సులిన్ను శరీరంలోని జీవకణాలు తగిన రీతిలో ఉపయోగించుకోనప్పుడు టైప్-2 డయాబెటిస్ వస్తుంది. ఇది ఏ వయసు వారికైనా రావచ్చు. ఎలాంటి లక్షణాలూ కనిపించకపోయినా 45 ఏళ్ల వారు తరచు రక్తపరీక్షలు జరిపించుకుని, రక్తంలో చక్కెర స్థాయిని తెలుసుకోవడం మంచిది. 8. కంప్లీట్ బ్లడ్ పిక్చర్: రక్తంలో ఉండే సూక్ష్మ పదార్థాలన్నింటి పరిమాణాన్ని సమగ్రంగా తెలుసుకునేందుకు కంప్లీట్ బ్లడ్ పిక్చర్ పరీక్ష నిర్వహిస్తారు. రక్తహీనత వంటి లోపాలను కనుగొనేందుకు ఈ పరీక్ష ఎంతగానో దోహదపడుతుంది. రక్తంలో హెమోగ్లోబిన్ పరిమాణం 11ఎంజీ/డీఎల్ నుంచి 16 ఎంజీ/డీఎల్ వరకు ఉండాలి. అంతకంటే తక్కువగా ఉంటే రక్తహీనతతో బాధపడుతున్నట్లే. డెంగ్యూ వంటి వ్యాధులు సోకినప్పుడు ప్లేట్లెట్స్ సంఖ్య గణనీయంగా పడిపోతుంది. కంప్లీట్ బ్లడ్ పిక్చర్ ద్వారానే ఆ పరిస్థితిని తెలుసుకోవచ్చు. 9. బోన్ డెన్సిటీ టెస్ట్: మెనోపాజ్ తర్వాత ఈస్ట్రోజన్ ఉత్పత్తి తగ్గిపోవడంతో మహిళలు ఆస్టియో పొరాసిస్కు గురవుతుంటారు. మరీ సన్నగా ఉండే మహిళలు, వంశపారంపర్యంగా ఈ వ్యాధి కొనసాగుతున్న వాళ్లు ఈ వ్యాధికి గురయ్యే అవకాశాలు ఎక్కువ. బోన్ డెన్సిటీ పరీక్ష ద్వారా ఆస్టియో పొరాసిస్ వ్యాధిని తేలికగా గుర్తించవచ్చు. బోన్ డెన్సిటీ తక్కువగా ఉంటే క్యాల్షియం అధికంగా ఉండే ఆహారం తీసుకోవాలి. డాక్టర్ ఎల్. సుదర్శన్ రెడ్డి సీనియర్ జనరల్ ఫిజీషియన్ యశోద హాస్పిటల్స్ సికింద్రాబద్ -
కంట్లో నలుసు!
ఐటీ, అనుబంధ ఉద్యోగుల్లో పెరుగుతున్న కంటి సమస్యలు 70 శాతం మందికి ‘కంప్యూటర్ విజన్ సిండ్రోమ్’ మారిన జీవనశైలే కారణమంటున్న నిపుణులు జాగ్రత్తపడకపోతే ప్రమాదమని హెచ్చరిక సిటీబ్యూరో: రోజంతా కంప్యూటర్లకు అతుక్కుపోవడం, గంటల తరబడి టీవీల ముందు కూర్చోవడం, రెప్పవాల్చకుండా అదే పనిగా పని చేయడం, కనీస విరామం లేకపోవడం వల్ల ఐటీ దాని అనుబంధ రంగాల్లో పని చేస్తున్న ఉద్యోగుల్లో నూటికి 70 శాతం మంద్ఙికంప్యూటర్ విజన్ సిండ్రోమ్*(సీవీఎస్)వ్యాధితో బాధపడుతున్నట్లు వైద్యుల పరిశోధనలో వెల్లడైంది. కళ్లు ఎరుపెక్కడం, కంట్లో నలుసులు ఏర్పడటం, మంట, దురద, తడారి పోవడం, నీరు కారడం, వంటి సమస్యలు కంటి చూపుపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. నగరం లోని వాసన్, అగర్వాల్, ఎల్వీప్రసాద్, సరోజినీదేవి, మ్యాక్స్విజన్, తదితర కంటి ఆస్పత్రుల్లో ప్రతి రోజూ 400కుపైగా కేసులు న మోదవుతుండటంపై సర్వత్రా ఆందోళన వ్యక్తం అవుతోంది. జీవనశైలిని మార్చుకోకపోతే భవిష్యత్తులో కంటి చూపు దెబ్బతినే అవ కాశం లేకపోలేదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. రెప్పవాలిస్తేనే రక్షణ నగరంలో ఐటీ, దాని అనుబంధ రంగాల్లో మూడు లక్షలకు పైగా ఉద్యోగులు పని చేస్తున్నట్లు అంచనా. ఇక ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయా ల్లోనూ కంప్యూటర్ల వినియోగం తప్పని సరిగా మారింది. చివరికి షాపింగ్ మాల్స్లో కూడా వీటి వినియోగం పెరిగింది. కనురెప్ప వాల్చ కుండా గంటల తరబడి కంప్యూటర్ స్క్రీన్పై పని చేస్తుండటం వల్ల కళ్లు దెబ్బతింటున్నాయి. ఐటీ అనుబంధ రంగాల్లో పని చేస్తున్న ప్రతి వంద మందిలో 70 శాతం మంది ఏదో ఒక సమస్యతో బాధపడుతున్నట్లు ప్రముఖ కంటి వైద్య నిపుణుడు డాక్టర్ సుధాకర్ రెడ్డి తెలిపారు. కళ్లపై పెరుగుతున్న ఒత్తిడి కారణంగా ఇరిటేషన్కు గురవుతున్నారు. ప్రతి చిన్న అంశానికి చిరాకు పడుతున్నారు. ఇదిలా ఉండగా పిల్లలు సైతం గేమ్స్ పేరుతో కంప్యూటర్లకు అతుక్కుపోతున్నారు. గంటల తరబడి టీవీలను వీక్షిస్తుండంతో చూపు మందగించడం వల్ల పుస్తకంలోని అక్షరాలను కూడా చదువలేక పోతున్నారు. కాపాడుకోవచ్చు ఇలా కనురెప్పవాల్చకుండా అదేపనిగా కంప్యూటర్పై పని చేయకూడదు. ప్రతి 15 నిమిషాలకు ఒకసారి కంప్యూటర్ స్క్రీన్ నుంచి దృష్టి ని మరల్చాలి. కంట్లో మంట ఉన్నప్పుడు కనురెప్పలను రెండు చేతులతో మూసి అదిమిపట్టుకోవాలి. కంప్యూటర్ల ముందు కూర్చున్నప్పుడు ట్యూబ్ లైట్లు ఆర్పేయకూడదు. చీకట్లో పనిచేయడం వల్ల కంప్యూటర్ స్క్రీన్ కాంతి ప్రభావం నేరుగా కంటిపై పడుతుంది. ప్రతి పదిహేను నిమిషాలకు ఒకసారి 20 నుంచి 30సార్లు కళ్లను మూసి తెరవాలి. కంప్యూటర్ మానిటర్కు కళ్లకు కనీసం రెండు అడుగుల దూరంలో ఉండేలా చూసుకోవాలి. కళ్లు దురదగా అనిపిస్తే చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. కంటికి ఓ వ్యాయామం నిమిషానికి పదిసార్లు కళ్లు మూసి తెరవడం వల్ల ఒత్తిడి మాయమవుతుంది.కనుగుడ్లను కిందికి, పైకి కనీసం పదిసార్లు కదిలించాలి.కుడి నుంచి ఎడమకు, ఎడమ నుంచి కుడికి కనీసం పదిహేను సార్లు తిప్పాలి.ఎదురుగా ఉన్న గోడపై గుర్తుపెట్టి దానిపై దృష్టిని కేంద్రీకరించి చూపు మెరుగు పరుచుకోవచ్చు.మంచి నీరు, పళ్ల రసాలు ఎక్కువగా తాగడం ద్వారా కంటి సమస్యను జయించవచ్చు.రోజుకు ఎనిమిది గంటలు నిద్రపోవాలి.దోస కీర ముక్కలను కనురెప్పలపై ఉంచడం వల్ల ఒత్తిడి మాయమవడంతో పాటు కలర్ కూడా మెరుగు పడుతుంది. - డాక్టర్ రవీందర్గౌడ్, కంటి వైద్య నిపుణుడు ఇండియన్ ఆప్తమాలజీ సొసైటీ ప్రకారం వైద్యులకు అందుతున్న ఫిర్యాదులు ఇలా.. కళ్లు అలసి పోవడం 64.95 శాతం ఒత్తిడికి గురికావడం 48.83 శాతం తలనొప్పి 45.68 శాతం మెడ, భుజాలనొప్పి 44.01శాతం ఇరిటేషన్కు గురికావడం 37.5 శాతం కళ్లల్లో మంట/దురద 34.38 శాతం రెండు దృశ్యాలు కన్పించడం 30.48 శాతం కంటి నుంచి నీరు కారడం 14.78 శాతం -
కంటి సమస్యలను నిర్లక్ష్యం చేయొద్దు
వయసు మీద పడుతున్న కొద్దీ వచ్చే కంటి సమస్యలను నిర్లక్ష్యం చేయకూడదని ఏపీ పెన్షనర్ల సంఘం కార్యదర్శి కేఎస్ హనుమంతరావు అన్నారు. విజయవాడ గవర్నర్ పేటలోని స్వాతంత్ర్య సమరయోధుల భవనంలో రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల కోసం రాజమండ్రి గౌతమి నేత్రాలయం గురువారం ప్రత్యేకంగా నిర్వహించిన నేత్రవైద్య శిబిరాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడారు. పెన్షనర్లు ముఖ్యంగా తమ కంటి చూపును ఎప్పటికప్పుడు పరీక్షించుకోవాలని, ఏ చిన్న సమస్య వచ్చినా వైద్యులను సంప్రదించాలని సూచించారు. ఈ శిబిరానికి మొత్తం 62 మంది హాజరు కాగా, వాళ్లలో 18 మందికి కంటి శుక్లాల శస్త్ర చికిత్సలు చేయాల్సి ఉన్నట్లు గుర్తించారు. ఉద్యోగుల హెల్త్ కార్డుల పథకం (ఈహెచ్ఎస్) కింద వీళ్లందరికీ సోమవారం నాడు రాజమండ్రిలో ఆపరేషన్లు చేస్తారు. దీనికి సంబంధించి వాళ్లందరికీ రవాణా, ఆహారం, మందులు అన్నింటినీ ఆస్పత్రి అందజేస్తుంది. ఈ కార్యక్రమంలో సీనియర్ సిటిజన్ల ప్రతినిధి టి.హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు. -
కనుపాపకు ఎంత కష్టం
రోజూ నగరంలో కంటి సమస్యలతో వైద్యుల వద్దకు వెళుతున్న వారు 5,000 ఇందులో గాలి, రసాయన కాలుష్యాల కారణ బాధితులు 500 ఎక్కువగా ఇలాంటి బాధితులు 18 నుంచి 35 ఏళ్ల లోపువారే పొల్యూషన్ వల్ల దీర్ఘకాలిక కంటిసమస్య మారిన బాధితుల సంఖ్య ఏటా 15 వేలు ఇందులో అబ్బాయిలే 70 శాతం మంది. నయనం ప్రధానం. కానీ నగర జీవి కంటిపాపకు కష్టకాలమొచ్చింది. ఇది ఎంత వేగంగా అంటే మనకు ఏం జరుగుతోందో తెలిసే లోపే చూపు మసకబారుతోంది. ఇంటికెళితే చికాకు. ఆఫీసుకొస్తే అలసట. ఆఫీసు పనులతో మానసిక ఒత్తిడి. ప్రయాణం చేయడంతో కంటిపాపపై ఒత్తిడి. ఇదీ నగరంలో లక్షలాది మంది యువతీయువకుల పరిస్థితి. కంటి బాధితులు మిగతా ఏరంగంలో పెరగనంతగా పెరుగుతున్నారు. కనీస జాగ్రత్తలు కూడా తీసుకోకపోవడం వారిని తిన్నగా అంధత్వం దిశగా నెడుతోంది. అరవై ఏళ్లకు చత్వారం వస్తుందంటారు. కానీ ముప్ఫై దాటాయో లేదో కళ్లకు అద్దాలు. నలభై దాటితే చత్వారం. యాభైలో మరింత దారుణం. ప్రతి వందమంది కంటి బాధితుల్లో నగరంలో పొగలు, దుమ్మూ ధూళితో వస్తున్న కంటివ్యాధుల బాధితులు కనీసం 15 శాతం దాటారు. పొగల సెగలు కంటిపాపను ఛిద్రం చేస్తున్న తీరుపై డాక్టర్లే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కనీస జాగ్రత్తలు పాటిస్తే కొంతవరకైనా కంటిని కాపాడుకోవచ్చునని ప్రముఖ కంటి వైద్య నిపుణులు డా.రవికుమార్రెడ్డి చెబుతున్నారు. ఇలా మొదలవుతున్నాయ్ కంటిపాప కష్టాలు - నగరంలో ఎక్కువగా ద్విచక్ర వాహనదారులు కంటి వ్యాధులకు గురవుతున్నారు. - ప్రధానంగా రెండు రకాల ఇబ్బందులు కంటివ్యాధులకు కారణమవుతోంది - వెజిటబుల్ మెటీరియల్...అంటే వృక్ష సంబంధిత లేదా జంతు సంబంధిత రేణువులు. - వాహనాల నుంచి వచ్చే రసాయన ధూళి. కార్బన్ డయాక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్, నైట్రోజన్ డయాక్సైడ్, ఓజోన్, సల్ఫర్ డయాక్సైడ్ తదితరం - ఈ రెండు రకాల కారణాల వలన ప్రతి వందమందికీ పదిహేను మంది ఏడాదికి రెండు మూడు సార్లు కంటి వైద్యుల దగ్గరకు వెళుతున్నారు - ప్రధానంగా వీటి వలన కళ్లకలక, ఇన్ఫెక్షన్, కార్నియల్ అల్సర్ తదితరం వస్తున్నాయి - కళ్లు ఎరుపుగా మారడం, కళ్లనుంచి పదే పదే నీళ్లు కారడం వస్తున్నాయి - కళ్లలో ఇరిటేషన్, అలర్జీ, కళ్లు డ్రై అవడం అంటే పొడిబారడం జరుగుతుంది - ఇలాగే కొన్నేళ్ల తర్వాత కళ్లు మసకబారడం జరుగుతుంది - ఆ తర్వాత కొన్నేళ్లలో కంటిచూపు తగ్గుతూ వస్తుంది - ఎయిర్ పొల్యూషన్, కెమికల్ పొల్యూషన్ వల్ల కంటిలో నల్లగుడ్డుపై ఎరిటియం అనే కండరం పెరుగుతుంది. ఇది తిన్నగా చూపును తగ్గిస్తుంది కొద్ది పాటి జాగ్రత్తలు పాటిస్తే - ద్విచక్ర వాహనదారులు ప్రయాణం చేస్తున్నప్పుడు రక్షణగా అద్దాలు (ప్రొటెక్టివ్ గ్లాసెస్) ధరించడం వలన కళ్లను గాలి పొల్యూషన్ నుంచి కాపాడుకోవచ్చు - అద్దంతో కూడిన హెల్మెట్ కవర్ను ధరించడం మంచిదే - ఇంటినుంచి ఆఫీసుకు వెళ్లగానే మంచినీళ్లతో కళ్లను కడుక్కోవడం మంచిది - అలాగే ఆఫీసునుంచి ఇంటికి వచ్చినప్పుడు కూడా మంచినీళ్లతో కళ్లను కడుక్కోవాలి - ప్రయాణం చేసి కొద్దిగా కంటికి ఇబ్బందిగా ఉన్నప్పుడు లూబ్రికెంట్ డ్రాప్స్ వేసుకోవచ్చు - పదే పదే కళ్లతో బాధపడుతూంటే వైద్యుల సలహా మేరకు యాంటిబయోటిక్ చుక్కలు వేసుకోవచ్చు. - ద్విచక్రవాహనంలో తిరిగే వారు ప్రతి ఆరుమాసాలకు కంటి వైద్యులను సంప్రదించడం మంచిది - ద్విచక్ర వాహనంలో వెళ్తున్నప్పుడు చిన్నపిల్లలను ఎలాంటి కళ్లద్దాలుగానీ, హెల్మెట్గానీ లేకుండా ముందువైపు కూర్చోపెట్టద్దు. - ఎక్కువగా పెద్ద పెద్ద చౌరస్తాల్లో ట్రాఫిక్ జామ్ అయినప్పుడు కళ్లకు ఎఫెక్ట్ అయ్యే పొగలు వెలువడున్నాయి. వీలైనంత వరకూ ఇలాంటి చౌరస్తాల గుండా వెళ్లడం తగ్గించాలి - డా. రవికుమార్రెడ్డి కంటివైద్య నిపుణులు, మెడివిజన్ హాస్పిటల్ మెహిదీపట్నం -
40 శాతం మందికి ‘కంప్యూటర్ విజన్ సిండ్రోమ్’
సాక్షి, సిటీబ్యూరో: రోజంతా కంప్యూటర్లకు అతుక్కపోవడం, గంటల తరబడి టీవీల ముందు కూర్చోవడం, రెప్పవాల్చకుండా అదేపనిగా పనిచేయడం, కనీస విరామం లేకపోవడం వల్ల ఐటీ దాని అనుబంధ రంగాల్లో పని చేస్తున్న ఉద్యోగుల్లో నూటికి 40 శాతం మంది ‘కంప్యూటర్ విజన్ సిండ్రోమ్’ వ్యాధితో బాధపడుతున్నారు. వైద్యుల పరిశోధనలో ఈ విషయం వెల్లడైంది. కళ్లు ఎరుపెక్కడం, కంట్లో నలుసు ఏర్పడటం, మంట, దురుద, తడారి పోవడం, నీరు కారడం, వంటి సమస్యలు కంటి చూపుపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. నగరంలోని వాసన్, అగర్వాల్, ఎల్వీప్రసాద్, సరోజినీదేవి, మ్యాక్స్విజన్ తదితర కంటి ఆస్పత్రుల్లో ప్రతి రోజూ 400కు పైగా కేసు లు నమోదు అవుతుండటంపై ఆందోళన వ్యక్తమవుతోంది. జీవనశైలిని మార్చుకోకపోతే భవిష్యత్తులో కంటి చూపు దెబ్బతినే అవకాశమూ లేకపోలేదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. రెప్పవాల్చకపోవడం వల్లే... నగరంలో ఐటీ, దాని అనుబంధ రంగాల్లో మూడు లక్షల మందికి పైనే పనిచేస్తున్నట్లు ఓ అంచనా. ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల్లోనూ కంప్యూటర్ల వినియోగం తప్పనిసరిగా మారింది. కనురెప్ప వాల్చకుండా గంటల తరబడి కంప్యూటర్ స్క్రీన్పై పనిచేస్తుండటం వల్ల కళ్లు దెబ్బతింటున్నాయి. ఐటీ అనుబంధ రంగాల్లో పనిచేస్తున్న ప్రతి వంద మందిలో 40 శాతం ఏదో ఒక కంటి సమస్యతో బాధపడుతున్నారని ప్రముఖ కంటి వైద్యుడు సుధాకర్రెడ్డి తెలిపారు. కంటిపై పెరుగుతున్న ఒత్తిడివల్ల తీవ్రమైన ఇరిటేషన్కు గురవుతున్నారు. ప్రతి చిన్న అంశానికి చిరాకు పడుతున్నారు. ఇక పిల్లలు గేమ్స్ అంటూ కంప్యూర్లకు అతుక్కపోతున్నారు. గంటల తరబడి టీవీలను వీక్షిస్తుండంతో చూపు మందగించి పుస్తకంలోని అక్షరాలను కూడా చదువలేకపోతున్నారు.