-
కాంగ్రెస్ –2, బీజేపీ–2, హంగ్–1!
న్యూఢిల్లీ: నెలన్నరకు పైగా సాగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల పోరు ముగింపునకు వచి్చంది. గురువారంతో అన్ని రాష్ట్రాల్లోనూ పోలింగ్ ప్రక్రియ ముగిసింది. మిజోరంలో నవంబర్ 7న, ఛత్తీస్గఢ్లో నవంబర్ 7, 19 తేదీల్లో రెండు దశల్లో, మధ్యప్రదేశ్లో 19న, రాజస్థాన్లో 25న పోలింగ్ జరగడం తెలిసిందే. తెలంగాణలో కూడా గురువారం ఒకే దశలో పోలింగ్ ముగిసింది. ఐదు రాష్ట్రాల్లోనూ డిసెంబర్ 3న ఓట్ల లెక్కింపు జరిగి ఫలితాలు వెలువడనున్నాయి. తెలంగాణలో పోలింగ్ ముగియగానే ఐదు రాష్టాల్లోనూ ఎగ్జిట్ పోల్స్ వెలువడ్డాయి. తెలంగాణలో అధికార బీఆర్ఎస్ను కాంగ్రెస్ ఓడించనుందని దాదాపుగా అన్ని ఎగ్జిట్ పోల్స్ పేర్కొన్నాయి. ఛత్తీస్గఢ్లో అధికారం నిలబెట్టుకుంటుందని పలు పోల్స్ పేర్కొన్నాయి. ఇక కాంగ్రెస్ పాలిత రాజస్థాన్లో బీజేపీ గెలుస్తుందని చాలావరకు తేల్చాయి. మధ్యప్రదేశ్ను కూడా బీజేపీ నిలబెట్టుకోవచ్చని, మిజోరంలో హంగ్ రావచ్చని తెలిపాయి... మధ్యప్రదేశ్... బీజేపీకే మొగ్గు! మధ్యప్రదేశ్లో బీజేపీ ఘనవిజయం సాధించనుందని ఇండియాటుడే–యాక్సిస్ మై ఇండియా, టుడేస్ చాణక్య, ఇండియా టీవీ–సీఎన్ఎక్స్ వంటి పలు సంస్థ ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. రాష్ట్రంలో మొత్తం అసెంబ్లీ సీట్లు 230. మెజారిటీ మార్కు 116 కాగా బీజేపీకి ఏకంగా 140 నుంచి 162 సీట్లు వస్తాయని ఇండియాటుడే––యాక్సిస్ మై ఇండియా పేర్కొంది. కాంగ్రెస్ 68 నుంచి 90 సీట్లకు పరిమితం కానుందని చెప్పింది. టుడేస్ చాణక్య కూడా బీజేపీకి 151, కాంగ్రెస్కు 74 స్థానాలిచ్చింది. ఇండియా టీవీ–సీఎన్ఎక్స్ ఎగ్జిట్ పోల్స్లోనూ బీజేపీకి 140 నుంచి 159 సీట్లు రాగా కాంగ్రెస్ 70 నుంచి 89 సీట్లకు పరిమితమైంది. రిపబ్లిక్ టీవీ కూడా బీజేపీకి 118 నుంచి 130 సీట్లిచ్చింది. కాంగ్రెస్కు 97 నుంచి 107 రావచ్చని పేర్కొంది. టైమ్స్ నౌ–ఈటీజీ మాత్రం కాంగ్రెస్కు 109–125 సీట్లివ్వగా బీజేపీకి 105–117 వస్తాయని పేర్కొంది. ఏబీపీ–సీవోటర్ కూడా కాంగ్రెస్కు 113 నుంచి 137 స్థానాలొస్తాయని, బీజేపీ 88 నుంచి 112కు పరిమితమవుతుందని చెప్పింది. జన్ కీ బాత్ మాత్రం రెండు పారీ్టలూ 100 నుంచి 125 సీట్ల మధ్య గెలుచుకుంటాయని జోస్యం చెప్పింది. రాజస్థాన్లో కమల వికాసమే రాజస్థాన్లో బీజేపీ విజయం ఖాయమని చాలా ఎగ్జిట్ పోల్స్ తేల్చాయి. మూడు మాత్రం కాంగ్రెస్ బహుశా రాజస్థాన్లో నెగ్గే అవకాశముందని అంచనా వేశాయి. రాష్ట్రంలో మొత్తం 200 అసెంబ్లీ సీట్లు కాగా మెజారిటీకి 101 స్థానాలు రావాలి. టైమ్స్ నౌ సర్వేలో బీజేపీకి 108 నుంచి 128, కాంగ్రెస్కు 56 నుంచి 72 సీట్లొచ్చాయి. ఇక బీజేపీ 105 నుంచి 125 స్థానాలు సాధిస్తుందని రిపబ్లిక్ టీవీ పేర్కొంది. కాంగ్రెస్ 69 నుంచి 81కి పరిమితమవుతుందని చెప్పింది. ఏబీపీ–సీవోటర్ బీజేపీకి 94–114, కాంగ్రెస్కు 71–91 సీట్లిచ్చింది. జన్ కీ బాత్ సర్వే కూడా బీజేపీ 100 నుంచి 122 సీట్లు గెలుస్తుందని, కాంగ్రెస్ 62 నుంచి 85కు పరిమితమవుతుందని పేర్కొంది. టుడేస్ చాణక్య బీజేపీకి 101, కాంగ్రెస్ 89 సీట్లిచి్చంది. ఇండియాటుడే––యాక్సిస్ మై ఇండియా బీజేపీకి 86 నుంచి 106, కాంగ్రెస్కు80 నుంచి 100 సీట్లొస్తాయని అంచనా వేసింది. కాంగ్రెస్ 94 నుంచి 104 సీట్లతో అధికారం నిలుపుకుంటుందని, బీజేపీకి 80 నుంచి 90 స్థానాలొస్తాయని ఇండియా టీవీ–సీఎన్ఎక్స్ పేర్కొంది. తెలంగాణలో కాంగ్రెస్ పాగా తెలంగాణలో బీఆర్ఎస్ పాలనకు తెర దించి తొలిసారిగా కాంగ్రెస్ అధికారంలోకి రానుందని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. 119 స్థానాల అసెంబ్లీలో మెజారిటీకి 60 స్థానాలు కావాల్సి ఉండగా కాంగ్రెస్కు 60 నుంచి 70 దాకా వస్తాయని టైమ్స్ నౌ–ఈటీజీ అంచనా వేసింది. బీఆర్ఎస్ 37 నుంచి 45 సీట్లకు పరిమితమవుతుందని చెప్పింది. బీజేపీకి 6 నుంచి 8, మజ్లిస్కు5 నుంచి 7 రావచ్చని పేర్కొంది. రిపబ్లిక్ టీవీ కూడా కాంగ్రెస్కు 58 నుంకచి 68 సీట్లిచి్చంది. బీఆర్ఎస్కు 46 56, బీజేపీకి 4 నుంచి 9 వస్తాయని, ఇతరులు 5 నుంచి 9 సీట్లు నెగ్గుతారని పేర్కొంది. ఇండియా టీవీ–సీఎన్ఎక్స్ అయితే కాంగ్రెస్కు ఏకంగా 63 నుంచి 79 సీట్లిచి్చంది. బీఆర్ఎస్ 31 నుంచి 47తో సరిపెట్టుకుంటుందని చెప్పింది. బీజేపీకి 2 నుంచి 4, మజ్లిస్కు5 నుంచి 7 వస్తాయని తెలిపింది. టుడేస్ చాణక్య కూడా కాంగ్రెస్కు 71 సీట్లు, బీఆర్ఎస్కు 33, బీజేపీకి 7, ఇతరులకు 8 స్థానాలిచి్చంది. కాంగ్రెస్ 49 నుంచి 65 సీట్లొస్తాయని ఏబీపీ–సీవోటర్ సర్వే పేర్కొంది. బీఆర్ఎస్కు 38 నుంచి 54, బీజేపీకి 5 నుంచి 13 వస్తాయని, ఇతరులు 5 నుంచి 9 సీట్లు నెగ్గుతారని చెప్పుకొచ్చింది. జన్ కీ బాత్ కూడా కాంగ్రెస్కు 48 నుంచి 64, బీఆర్ఎస్కు 40 నుంచి 55 సీట్లిచి్చంది. బీజేపీ 7 నుంచి 13, మజ్లిస్ 4 నుంచి 7 సీట్లు నెగ్గుతాయని చెప్పింది. మిజోరంలో హంగ్ ఈశాన్య రాష్ట్రమైన మిజోరంలో అధికార మిజో నేషనల్ ఫ్రంట్ (ఎంఎన్ఎఫ్) ఈసారి ఎదురీదుతోందని ఎగ్జిట్ పోల్స్ తేల్చాయి. ఎంఎన్ఎఫ్కు ఈసారి జోరాం పీపుల్స్ మూవ్మెంట్ (జెడ్పీఎం) గట్టి పోటీ ఇచి్చనట్టు పేర్కొన్నాయి. బహుశా హంగ్ అసెంబ్లీ ఏర్పడవచ్చని జోస్యం చెప్పాయి. కాంగ్రెస్ మూడో స్థానానికే పరిమితమవుతుందని, బీజేపీకి ఒకట్రెండు స్థానాలు దాటకపోవచ్చని తెలిపాయి. మొత్తం 40 స్థానాలకు గాను రిపబ్లిక్ టీవీ మాత్రం ఎంఎన్ఎఫ్కు 17 నుంచి 22 దాకా ఇచ్చింది. ఏబీపీ సీవోటర్ కూడా దానికి 15 నుంచి 21 స్థానాలు రావచ్చని పేర్కొంది. మిగతా సర్వేలన్నీ అది మెజారిటీకి కొద్ది దూరంలోనే నిలిచిపోతుందని తేల్చాయి. జెడ్పీఎం ఏకంగా 28 నుంచి 35 సీట్లతో ఘనవిజయం సాధిస్తుందని ఇండియాటుడే––యాక్సిస్ మై ఇండియా పేర్కొనడం విశేషం! ఎంఎన్ఎఫ్ కేవలం 3 నుంచి 7 సీట్లకు, కాంగ్రెస్ 2 నుంచి 4 స్థానాలకు పరిమితమవుతాయని అది తేల్చింది. మిగతా సర్వేలన్నీ ఎంఎన్ఎఫ్కు 14 నుంచి 18 సీట్లు, జెడ్పీఎంకు 10 నుంచి 16 సీట్ల చొప్పున ఇచ్చాయి. ఛత్తీస్గఢ్ ‘హస్త’గతం! ఛత్తీస్గఢ్లో భూపేశ్ బఘెల్ సర్కారు పనితీరుకు ప్రజలు మరోసారి పట్టం కడుతున్నట్టు పలు ఎగ్జిట్ పోల్స్ పేర్కొన్నాయి. మొత్తం 90 అసెంబ్లీ స్థానాలకు గాను కాంగ్రెస్కు 40 50 దాకా వస్తాయని ఇండియాటుడే–యాక్సిస్ మై ఇండియా పేర్కొంది. బీజేపీ 36 నుంచి 46 దాకా గెలుచుకుంటుందని అంచనా వేసింది. టైమ్స్ నౌ–ఈటీజీ కాంగ్రెస్కు 48 నుంచి 56, బీజేపీకి 32 నుంచి 40 సీట్లిచ్చింది. కాంగ్రెస్కు 57, బీజేపీకి 33 సీట్లొస్తాయని టుడేస్ చాణక్య పేర్కొంది. ఇండియా టీవీ–సీఎన్ఎక్స్ సర్వే కాంగ్రెస్కు 46–56, బీజేపీకి 30–40 సీట్లిచి్చంది. రిపబ్లిక్ టీవీ కూడా కాంగ్రెస్44 నుంచి 52 సీట్లు గెలుస్తుందని, బీజేపీ 35 నుంచి 42 సీట్లకు పరిమితమవుతుందని అభిప్రాయపడింది. ఇక రెండు పారీ్టలూ హోరాహోరీగా తలపడ్డట్టు ఏబీపీ–సీవోటర్, జన్ కీ బాత్ తేల్చాయి. కాంగ్రెస్కు 41 నుంచి 53, బీజేపీకి 36 నుంచి 48 సీట్లు రావచ్చని ఏబీపీ చెప్పింది. ఇక జన్ కీ బాత్ సర్వే బీజేపీకి 34 నుంచి 45, కాంగ్రెస్కు 42 నుంచి 53 స్థానాలిచ్చింది. -
తెలంగాణ అంచనాలు కాంగ్రెస్వైపే!
లోక్సభ ఎన్నికలకు సెమీఫైనల్స్గా దేశవ్యాప్తంగా ఆసక్తి రేపిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ నువ్వా నేనా అన్నట్టుగా తలపడ్డట్టు ఎగ్జిట్ పోల్స్ పేర్కొన్నాయి. తెలంగాణలో మాత్రం అన్ని ఎగ్జిట్ పోల్స్ ఫలితాలూ కాంగ్రెస్ వైపే మొగ్గడం విశేషం. రాష్ట్రంలో హస్తం పార్టీ తొలిసారి అధికారంలోకి రానుందని అవి పేర్కొన్నాయి. అయితే వీటిలో చాలా ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు గురువారం సాయంత్రం ఒకవైపు ఇంకా పోలింగ్ కొనసాగుతుండగానే వెలువడటం గమనార్హం. ఈ నేపథ్యంలో తెలంగాణపై తన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను శుక్రవారం ప్రకటించనున్నట్టు ఇండియాటుడే–యాక్సిస్ మై ఇండియా పేర్కొంది. ఇక ఛత్తీస్గఢ్లో కాంగ్రెస్ అధికారం నిలుపుకోనుందని ఎగ్జిట్ పోల్స్లో చాలావరకు పేర్కొన్నాయి. ఇండియాటుడే–యాక్సిస్ మై ఇండియాతో పాటు టైమ్స్ నౌ–ఈటీజీ, ఇండియా టీవీ–సీఎన్ఎక్స్, టుడేస్ చాణక్య కాంగ్రెస్కు మెజారిటీ సీట్లు కట్టబెట్టాయి. బీజేపీ, కాంగ్రెస్ల్లో ఎవరిదైనా పై చేయి కావచ్చని ఏబీపీ–సీవోటర్, జన్ కీ బాత్ పేర్కొన్నాయి. ఇక రాజస్తాన్లో అధికార కాంగ్రెస్ను బీజేపీ ఓడించనుందని టైమ్స్ నౌ, రిపబ్లిక్ టీవీ, ఏబీపీ, జన్ కీ బాత్, టుడేస్ చాణక్యతో సహా అత్యధిక ఎగ్జిట్ పోల్స్ తేల్చాయి. ఇండియాటుడే–యాక్సిస్ మై ఇండియా మాత్రం బీజేపీకి 86 నుంచి 106, కాంగ్రెస్కు 80 నుంచి 100 సీట్లొస్తాయని అంచనా వేసింది. కాంగ్రెస్ 94 నుంచి 104 సీట్లతో అధికారం నిలుపుకుంటుందని ఇండియా టీవీ–సీఎన్ఎక్స్ పేర్కొంది. ఇక మధ్యప్రదేశ్లో కాంగ్రెస్ గట్టి పోటీ ఇచ్చినా బీజేపీ అధికారం నిలబెట్టుకోనుందని పలు సర్వేలు తెలిపాయి. 230 సీట్లకు గాను దానికి బీజేపీకి 162 సీట్ల దాకా వస్తాయని ఇండియాటుడే––యాక్సిస్ మై ఇండియా పేర్కొనగా టుడేస్ చాణక్య 151, ఇండియా టీవీ–సీఎన్ఎక్స్ 159 దాకా రిపబ్లిక్ టీవీ 130 దాకా ఇచ్చాయి. ఏబీపీ–సీవోటర్ మాత్రం కాంగ్రెస్కు 113 నుంచి 137 స్థానాలొస్తాయని, బీజేపీ 88 నుంచి 112కు పరిమితమవుతుందని చెప్పింది. ఈశాన్య రాష్ట్రమైన మిజోరంలో అధికార ఎంఎన్ఎఫ్, జెడ్పీఎం హోరాహోరీగా తలపడ్డట్టు సర్వేలు స్పష్టం చేశాయి. అక్కడ హంగ్ రావచ్చని పేర్కొన్నాయి. ఈ నేపథ్యంలో డిసెంబర్ 3న వెలువడనున్న ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అంచనాలకందని తెలంగాణ ఎగ్జిట్ పోల్స్ ఏం చెబుతున్నా తెలంగాణలో పోలింగ్ సరళి ఎవరికీ కచ్చితంగా అంతుబట్టడం లేదు. ఇండియాటుడే–యాక్సిస్ మై ఇండియా సంస్థ తెలంగాణలో పోలింగ్ తీరుతెన్నులను అంచనా వేయలేకపోయింది. రాష్ట్రంలో అధిక ధన ప్రభావం, పైగా గురువారం సాయంత్రం గడువు దాటాక కూడా ఓటింగ్ ప్రక్రియ కొనసాగుతుండడమే ఇందుకు ప్రధాన కారణమని సంస్థ అధినేత ప్రదీప్ గుప్తా స్పష్టం చేశారు. దాంతో కచ్చితమైన ఎగ్జిట్ పోల్ అంచనాలకు రాలేకపోతున్నామన్నారు. తెలంగాణలో ఎగ్జిట్ పోల్స్పై శుక్రవారం స్పష్టత ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలో గురువారం మధ్యాహ్నం ఒంటి గంట దాకా 36.68 శాతం మాత్రమే పోలింగ్ నమోదైంది. సాయంత్రం ఐదింటికల్లా 63.94 శాతానికి పెరిగింది. సాయంత్రం ఐదు గంటల తర్వాత కూడా చాలా పోలింగ్ కేంద్రాల్లో పెద్ద సంఖ్యలో ఓటర్లున్నారు. -
మూడోరోజూ మార్కెట్ ముందుకే...
ముంబై: స్టాక్ సూచీలు గురువారం స్వల్పంగా లాభపడి మూడోరోజూ ముందడుగేశాయి. అయిదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలకు సంబంధించిన ఎగ్జిట్ పోల్స్, దేశీయ క్యూ2 జీడీపీ వృద్ధి రేటు, అక్టోబర్ ద్రవ్యలోటు డేటా వెల్లడి నేపథ్యంలో ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరించారు. అమెరికా మార్కెట్లలో నెలకొన్న బలహీన సంకేతాలు సెంటిమెంట్పై ప్రభావం చూపాయి. ట్రేడింగ్లో 460 పాయింట్ల పరిధిలో కదలాడిన సెన్సెక్స్ చివరికి 87 పాయింట్లు పెరిగి 66,988 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 37 పాయింట్లు బలపడి 20,133 వద్ద నిలిచింది. ఉదయం స్వల్ప లాభాలతో మొదలైన సూచీలు నవంబర్ నెలవారీ డెరివేటివ్ల గడువు ముగింపు కావడంతో ట్రేడింగ్ ఆద్యంతం తీవ్ర ఒడిదుడుకులకు లోనయ్యాయి. ఫార్మా, కన్జూమర్, రియలీ్ట, పారిశ్రామిక, క్యాపిటల్ గూడ్స్, కన్జూమర్ షేర్లను కొనేందుకు ఇన్వెస్టర్లు ఆసక్తి చూపారు. బీఎస్ఈ మిడ్, స్మాల్ క్యాప్ సూచీలు ఒకశాతం మేర లాభపడ్డాయి. బ్యాంకులు, యుటిలిటీ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. ఆసియాలో చైనా, హాంగ్కాంగ్ స్టాక్ సూచీలు లాభపడ్డాయి. యూరప్ మార్కెట్లు సానుకూలంగా ట్రేడయ్యాయి. డాలర్ మారకంలో రూపాయి విలువ 5 పైసలు బలహీనపడి 83.37 వద్ద స్థిరపడింది. -
హస్తం గాలి ‘వీచినట్టేనా’!
సాక్షి, హైదరాబాద్: ఈసారి అధికారం కచ్చితంగా దక్కుతుందనే ధీమా కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతోంది. గురువారం జరిగిన పోలింగ్ సరళిని బట్టి చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా తమకు అనుకూల పరిస్థితులు కనిపించాయని, 70కి పైగా స్థానాల్లో గెలుపొంది అధికారంలోకి వస్తామని ఆ పార్టీ నేతలు స్పష్టం చేస్తున్నారు. తెలంగాణ ఇచ్చిన పార్టీగా ఇప్పటికి ప్రజలు తమను ఆదరించారని, బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ పాలన పట్ల వ్యతిరేకతతో ఉన్న అన్ని వర్గాలూ తమవైపు మొగ్గుచూపాయనే అభిప్రాయం రాష్ట్ర కాంగ్రెస్ నేతల్లో కనిపిస్తోంది. దక్షిణ తెలంగాణతో పాటు ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఊహించని విజయం దక్కుతుందని, మిగిలిన జిల్లాల్లో కూడా ఓ మోస్తరు నుంచి అధిక శాతం సీట్లలో గెలుపు తమదేనని వారు లెక్కలు వేస్తున్నారు. సింగరేణి ప్రాంత ఓటర్లు కూడా తమవైపే నిలిచారని, ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో విస్తరించి ఉన్న సింగరేణి ప్రాంతంలోని నియోజకవర్గాల్లో ఎక్కువ స్థానాలు తమ ఖాతాలోనే పడతాయని చెబుతున్నారు. ఇక, హైదరాబాద్ శివార్లలో కూడా తమకు భారీగా పోలింగ్ జరిగిందని అంచనా వేస్తున్నారు. మెజార్టీ ఎగ్జిట్పోల్స్ కూడా తమదే అధికారం అని చెపుతున్న నేపథ్యంలో ఈనెల 3న∙ఫలితాల కోసం కాంగ్రెస్ పార్టీ నేతలు ఆత్రుతతో ఎదురుచూస్తుండడం గమనార్హం. పోలింగ్ సరళిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ.. గురువారం ఉదయం పోలింగ్ ప్రారంభమైన సమయం నుంచి కాంగ్రెస్ ముఖ్య నేతలంతా పోలింగ్ సరళిని నిశితంగా పరిశీలించారు. రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్చార్జి మాణిక్రావ్ఠాక్రే, ఏఐసీసీ పరిశీలకురాలు దీపాదాస్మున్షీ, టీపీసీసీ మాజీ వర్కింగ్ ప్రెసిడెంట్ జెట్టి కుసుమకుమార్ గాం«దీభవన్లోని వార్రూంలో కూర్చుని పరిస్థితిని సమీక్షించారు. నియో జకవర్గాల వారీగా పోలింగ్ శాతాన్ని పరిశీలిస్తూ, క్షేత్రస్థాయిలోని నాయకత్వానికి అవసరమైన సూచనలు చేస్తూ వారిని ఎప్పటికప్పుడు అప్రమత్తం చేసే పనిలో నిమగ్నమయ్యారు. ఓటర్ల నాడి అనుకూలంగానే ఉన్నా పోల్ మేనేజ్మెంట్లో కాంగ్రెస్ పార్టీ వెనుకబడిందనే వార్తలు వస్తున్న నేపథ్యంలో తమ ఓట్లన్నీ కచ్చితంగా పోలయ్యేలా తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. వార్ రూం కోఆర్డినేటర్ విజయభాస్కర్, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి చరణ్కౌశిక్యాదవ్ వార్రూం సిబ్బందితో కలిసి ఎప్పటికప్పుడు అభ్యర్థులు, స్థానిక పార్టీ నేతలతో మాట్లాడుతూ పోల్ మేనేజ్మెంట్పై దృష్టి పెట్టి పనిచేశారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి కొడంగల్, కామారెడ్డి నియోజకవర్గాల్లో పర్యటిస్తూనే ఎప్పటికప్పుడు వార్రూంతో టచ్లో ఉంటూ పోలింగ్ సరళిపై ఆరా తీశారు. సీఎల్పీ నేత భట్టితో పాటు ఇతర కాంగ్రెస్ ముఖ్య నేతలు కూడా తాము పోటీ చేస్తున్న నియోజకవర్గాలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న పోలింగ్ తీరును పరిశీలించారు. ఈ ఎన్నికల్లో వ్యూహకర్తగా కీలకపాత్ర పోషించిన సునీల్ కనుగోలు ఆయన బృందం కూడా పోలింగ్ సరళిపై ప్రత్యేక దృష్టి పెట్టి ఎన్ని స్థానాల్లో సానుకూలత ఉందన్న లెక్కలు కట్టింది. ఆ నాలుగు.. మావే జిల్లాల వారీగా విశ్లేషిస్తే పోలింగ్ తీరును బట్టి నాలుగు జిల్లాల్లో చెప్పుకోదగిన స్థానాలు సాధిస్తామనే అభిప్రాయం కాంగ్రెస్ నేతల్లో వ్యక్తమవుతోంది. ఉమ్మడి నల్లగొండ, ఖమ్మం, మహబూబ్నగర్తో పాటు వరంగల్ జిల్లాల్లో ఉన్న 46 స్థానాల్లోనే 35 తమకు ఖాయమని లెక్కలు వేస్తున్నారు. రంగారెడ్డి జిల్లాలో కూడా బీఆర్ఎస్ కంటే ఎక్కువ సీట్లు వస్తాయని, ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మెదక్ జిల్లాల్లో కొంచెం అటూ ఇటుగా ఫలితాలు వస్తాయని చెబుతున్నారు. హైదరాబాద్ పరిధిలోనికి వచ్చే స్థానాల్లో కూడా 4–5 చోట్ల గెలుపునకు అవకాశాలున్నాయని, ఉమ్మడి హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో కలిపి 10 స్థానాల వరకు చేరుకుంటామని అంటున్నారు. అన్ని జిల్లాల్లో కలిపి ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మ్యాజిక్ ఫిగర్ కంటే ఓ 10 సీట్లు ఎక్కువే వస్తాయన్న నమ్మకాన్ని కాంగ్రెస్ నేతలు వ్యక్తం చేస్తున్నారు. -
తెలంగాణను గెలుస్తున్నాం: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: పోలింగ్ ప్రక్రియ పూర్తి కాకమునుపే వెల్లడైన ఎగ్జిట్ పోల్ ఫలితాలు ‘రబ్బిష్ ’అని, డిసెంబర్ 3న వెలువడే అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో 70కి పైగా స్థానాల్లో గెలిచి తీరుతామని భారత్ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు ధీమా వ్యక్తం చేశారు. వందకు వంద శాతం తాము మరోమారు అధికారంలోకి వస్తున్నామని, తెలంగాణను గెలుస్తున్నామని అన్నారు. గురువారం సాయంత్రం తెలంగాణ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. పోలింగ్ ప్రక్రియ పూర్తి కాకమునుపే కొన్ని మీడియా సంస్థలు ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను విడుదల చేయడంపై కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలింగ్ ప్రక్రియ పూర్తిగా ముగియకుండా కొనసాగుతుండగానే ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు విడుదల చేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ఎలా అనుమతి ఇస్తుందని ఆయన ప్రశ్నించారు. ఎగ్జిట్ పోల్ ఫలితాల వెల్లడి గడువు కుదించడంలో తమ ప్రమేయం లేదని, కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకే జరిగిందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి చెప్పారని కేటీఆర్ పేర్కొన్నారు. ఇలాంటి ఎగ్జిట్ పోల్స్ మాకు కొత్తకాదు ‘మేము 88కి పైగా స్థానాల్లో గెలుస్తామని అను కున్నా చిన్న చిన్న ఆటంకాలు వచ్చాయి. జాతీయ మీడియాలో కొన్ని సంస్థలు సర్వే చేయకుండానే కొద్దిపాటి గణాంకాలను రాకెట్ సైన్స్ లాగా చూపుతారు. ఎగ్జిట్ పోల్స్ పేరిట వారు చేసే న్యూసెన్స్, నాన్సెన్స్తో ఆ సంస్థల ప్రతిష్ట దెబ్బతింటుందనే విషయాన్ని గమనించాలి. ఈ రకమైన ఎగ్జిట్ పోల్స్ మాకు కొత్త కాదు, గతంలోనూ ఇదే తరహాలో ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెల్లడించి, ఆ తర్వాత నాలుక కరుచుకున్నారు. ప్రజలు ఓ వైపు ఓటు వేస్తున్న సమయంలోనే ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఎలా సాధ్యమని మేము మిమ్మల్ని నిలదీయవచ్చు కానీ అంతదూరం వెళ్లదలుచుకోలేదు. అనని మాటలు అన్నట్లు సోషల్ మీడియా, ఇతర మీడియాల్లో చేస్తున్న ప్రచారంపైనా ఎలక్షన్ కమిషన్ దృష్టి సారించాలి. హైదరాబాద్ సహా దేశంలోని అనేక పెద్ద పట్టణాల్లో పోలింగ్ శాతం తక్కువగా ఉంటోంది. రాష్ట్రంలో ఏవో చిన్నా చితకా ఘటనలు తప్ప పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. మా పార్టీ నాయకులు, కార్యకర్తలతో పాటు అన్ని పార్టీల సహకారంతో ఇది సాధ్యమైంది..’అని కేటీఆర్ అన్నారు. -
Chhattisgarh: 57 అప్పటికి 75 అవుతుంది.. ఎగ్జిట్పోల్స్పై సీఎం బఘేల్
రాయపూర్: ఎగ్జిట్ పోల్ అంచనాలపై ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ స్పందించారు. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు రాష్ట్రంలో బీజేపీపై కాంగ్రెస్కు స్వల్ప ఆధిక్యాన్నే అందించడాన్ని తోసిపుచ్చుతూ తమ పార్టీ భారీ మెజారిటీ సాధించే దిశగా పయనిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. చాలా సర్వేలు కాంగ్రెస్కు సీట్లు 57 అని అంచనా వేస్తున్నప్పటికీ కౌంటింగ్ రోజైన డిసెంబర్ 3న ఫలితాలు వెలువడే నాటికి ఆ సంఖ్య 75కి పెరుగుతుందన్నారు. గురువారం ఎగ్జిట్ పోల్ ఫలితాలు విడుదలైన అనంతరం బఘేల్ మీడియాతో మాట్లాడారు. "ఏడు ఎగ్జిట్ పోల్స్ వెల్లడించిన అంకెలు స్థిరంగా ఉన్నాయా? రెండు రోజుల తర్వాత, ఈ ఎగ్జిట్-పోల్ అంచనాలలో పేర్కొన్న సంఖ్యలు స్థిరపడతాయి. ఎగ్జిట్-పోల్ అంచనాలతో సంబంధం లేకుండా మేము ఛత్తీస్గఢ్లో అద్భుతమైన మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం" అన్నారు. ఒక ఎగ్జిల్ పోల్ ఫలితాన్ని ప్రస్తావిస్తూ 57 (కాంగ్రెస్ సీట్లు) ఏమిటి? కౌంటింగ్ నాటికి ఇది 75 అవుతుంది అన్నారు. ఇండియా టుడే చాణక్య నిర్వహించిన సర్వేలో ఛత్తీస్గఢ్లో కాంగ్రెస్కు 57-66 సీట్లు వస్తాయని, బీజేపీకి 33-42 సీట్లు వస్తాయని, 0-3 సీట్లు ఇతరులకు వస్తాయని అంచనా వేసింది. కాంగ్రెస్కు స్వల్ప మెజారిటీ సూచనల నేపథ్యంలో బీజేపీ 'ఆపరేషన్ కమలం' ప్రారంభిస్తుందా అనే దానిపై సీఎం బఘేల్ స్పందిస్తూ వారికి ఆ అవకాశం లేదని, తమకు మెజారిటీ ఉందని, తమ కృషిపై, ప్రజలపై విశ్వాసం ఉందని పేర్కొన్నారు. మూడు సర్వేలు కాంగ్రెస్ స్పష్టమైన విజయం సాధిస్తుందని అంచనా వేయగా, మరికొన్ని ఆ పార్టీ గెలుపు రేంజ్లో ఉందని చెప్పాయి. ఏబీపీ సీ-ఓటర్ అంచనాల ప్రకారం.. 90 మంది సభ్యుల అసెంబ్లీ ఉన్న రాష్ట్రంలో కాంగ్రెస్ 41-53 సీట్లు గెలుచుకోనుంది. బీజేపీకి 36-48 సీట్లు, ఇతరులకు 0-4 సీట్లు వస్తాయి. ఇండియా టుడే-యాక్సిస్ మై ఇండియా పోల్ కాంగ్రెస్కు 40-50 సీట్లు, బీజేపీకి 36-46 సీట్లు, ఇతరులకు 1-5 సీట్లు వస్తాయని అంచనా వేసింది. రిపబ్లిక్ టీవీ ఎగ్జిట్ పోల్లో కాంగ్రెస్కు 44-52 సీట్లు, బీజేపీకి 34-42 సీట్లు, ఇతరులకు 0-2 సీట్లు వచ్చాయి. ఇండియా టీవీ-సీఎన్ఎక్స్ పోల్ కాంగ్రెస్కు 46-56 సీట్లు, బీజేపీకి 30-40 సీట్లు, ఇతరులకు 3-5 సీట్లు వస్తాయని అంచనా వేసింది. జన్ కీ బాత్ ఎగ్జిట్ పోల్లో కాంగ్రెస్ 42-53, బీజేపీ 34-45, ఇతరులకు 0-3 సీట్లు వస్తాయని అంచనా వేసింది. ఇక కాంగ్రెస్ 44.6 శాతం ఓట్లతో 46-54 సీట్లు, 42.9 శాతం ఓట్లతో బీజేపీ 35-42 సీట్లు, 12.5 శాతం ఓట్లతో ఇతరులు 0-2 సీట్లు సాధిస్తాయని పీ-మార్క్ పోల్ పేర్కొంది. -
బీఆర్ఎస్కు ఎగ్జిట్ పోల్స్ షాక్ !
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియలో కీలకమైన పోలింగ్ ఘట్టం ముగిసింది. పోలింగ్ ముగిసిన వెంటనే ప్రముఖ మీడియా, సర్వే సంస్థలు ఎగ్జిట్ పోల్స్ను వెల్లడించాయి. మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ అధికార బీఆర్ఎస్ పార్టీకి షాక్ ఇచ్చాయి. 90 శాతం ఎగ్జిట్ పోల్స్ గులాబీ పార్టీకి ఈ ఎన్నికల్లో నెగెటివ్ ఫలితాలే రానున్నాయని ప్రెడిక్ట్ చేశాయి. ఇదే సమయంలో ఒకటి రెండు సీట్లు అటుఇటుగా కాంగ్రెస్ పార్టీ మ్యాజిక్ ఫిగర్కు దగ్గరగా రానుందని చాలా వరకు సర్వేలు తెలిపాయి. బీజేపీకి 10 దాకా, ఎంఐఎంకు మళ్లీ 6 లేదా 7 సీట్లు రానున్నాయని వెల్లడించాయి. బీఆర్ఎస్కు 48 సీట్లే: సీఎన్ఎన్ న్యూస్ 18 ప్రముఖ మీడియా సంస్థ సీఎన్ఎన్ న్యూస్ 18 ఎగ్జిట్ పోల్స్లో బీఆర్ఎస్కు 48 సీట్లే వస్తాయని తెలిపింది. కాంగ్రెస్కు 56, బీజేపీకి 10 సీట్లు రానున్నాయని వెల్లడించింది. కాంగ్రెస్కు మ్యాజిక్ ఫిగర్ : ఆరా మస్తాన్ సర్వే తెలంగాణ ఎన్నికలపై ఇప్పటివరకు పక్కాగా సర్వేలు విడుదల చేసిన ఆరా మస్తాన్ ప్రీ పోల్ సర్వే కూడా బీఆర్ఎస్కు 41-49 సీట్లే రానున్నాయని తెలిపింది. కాంగ్రెస్కు ఏకంగా 58-67 సీట్లు రానున్నాయని వెల్లడించింది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఆరా మస్తాన్ సర్వే బీఆర్ఎస్దే విజయం అని చెప్పింది. ఆరా చెప్పినట్లుగానే బీఆర్ఎ్స్ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. చాణక్య స్ట్రాటజీస్లో బీఆర్ఎస్కు 30 సీట్లే.. చాణక్యస్ట్రాటజీస్ ఎగ్జిట్ పోల్లో బీఆర్ఎస్ ఘోర పరాజయం పాలవనుందని వెల్లడించింది. ఈ సర్వే బీఆర్ఎస్కు 22 నుంచి 30 సీట్లు మాత్రమే వస్తాయని తెలిపింది. కాంగ్రెస్కు సీట్లు 78 వరకు వెల్లవచ్చని పేర్కొంది. బీఆర్ఎస్దే హ్యాట్రిక్ : పల్స్ టుడే పల్స్ టుడే ఎగ్జిట్ పోల్ బీఆర్ఎస్కు 71 సీట్ల దాకా రావచ్చని తెలిపింది. ఈ సర్వేలో కాంగ్రెస్ 38 సీట్ల దగ్గరే ఆగిపోవచ్చని పేర్కొంది. ఈ సర్వేతో పాటు పొలిటికల్ గ్రాఫ్, థర్డ్ విజన్లాంటి సంస్థలు బీఆర్ఎస్ మ్యాజిక్ ఫిగర్ ఈజీగా చేరుకుంటుందని తెలిపింది. మెజారిటీ పోల్స్లో వెనుకబడ్డ కారు సుమారు ఇరవై దాకా సర్వే సంస్థలు ఎగ్జిట్ పోల్స్ రిలీజ్ చేయగా వాటిలో 15కుపైగా సర్వేలు ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ది వెనుకంజేనని వెల్లడించాయి. కొన్ని సంస్థలు మాత్రమే మళ్లీ బీఆర్ఎస్దే అధికారం అని తెలిపాయి. చాలా వరకు ఎగ్జిట్ పోల్స్ బీఆర్ఎస్, కాంగ్రెస్ కంటే వెనుకబడిందని చెప్పడంతో తుది ఫలితాల్లో ఇదే నిజమయ్యే ఛాన్స్ లేకపోలేదని రాజకీయ పండితులు అభిప్రాయడుతున్నారు. ఎగ్జిట్ పోల్స్ను తారుమారు చేసిన చరిత్ర బీఆర్ఎస్ది : కేటీఆర్ కాగా, ఎగ్జిట్పోల్స్ రిలీజ్ అయిన తర్వాత మీడియా సమావేశంలో మాట్లాడిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ మాత్రం ఎగ్జిట్ పోల్స్ రబ్బిష్ అని కొట్టి పారేయడం విశేషం. తమ పార్టీకి ఎగ్జిట్ పోల్స్ తప్పని రుజువు చేసే చరిత్ర ఉందన్నారు. ఎగ్జిట్ పోల్స్ తప్పయితే క్షమాపణ చెప్తారా అని ఎదురు ప్రశ్నించారు. 3వ తేదీన బీఆర్ఎస్ హ్యాట్రిక్ కొట్టడం పక్కా అని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. ఎగ్జిట్ పోల్స్ పూర్తి పట్టిక కోసం.. -
బర్రెలక్క(శిరీష)కు అన్ని ఓట్లా..?
హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని మెజార్టీ సర్వేలు తమ ఎగ్జిట్ పోల్స్లో స్పష్టం చేయగా, ఒకటి రెండు సర్వేలు మాత్రం బీఆర్ఎస్కు గెలిచే అవకాశాలున్నాయి పేర్కొన్నాయి. ఆరా మస్తాన్ సర్వే(ప్రీపోల్ సర్వే) కాంగ్రెస్ 58 నుంచి 67 స్థానాల్లో విజయం సాధించే అవకాశం ఉన్నట్లు తెలిపింది. ఇక బీఆర్ఎస్ 41-49 స్థానాల్లో విజయం సాధించే అవకాశం ఉందని, అదే సమయంలో బీజేపీ 5 నుంచి 7, ఎంఐఎం, ఇతరులు కలుపుకుని 7 నుంచి 9 స్థానాల్లో విజయం సాధిస్తారని ఆరా మస్తాన్ తన ప్రీపోల్ సర్వేను బయటపెట్టింది. ఇక ఆరా మస్తాన్ సర్వేలోని కొన్ని హైలెట్స్ను చూస్తే తెలంగాణలో ఐదుగురు మంత్రులు తీవ్రమైన పోటీ ఎదుర్కోబోతున్నట్లు పేర్కొంది. ఇక రాష్ట్రంలో ఎన్నికల సమయంలో ట్రెండింగ్లో నిలిచిన బర్రెలక్క(అలియాస్ శిరీష) కూడా తన ఖాతాలో భారీ ఓట్లను వేసుకోబోతున్నట్లు సదరు సర్వే తెలిపింది. కొల్లాపూర్లో స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచిన బర్రెలక్క 10 వేలకు పైగా ఓట్లు సాధించే అవకాశం ఉందని తెలిపింది. ఆరా మస్తాన్ సర్వే హైలెట్స్ ఇలా.. 5 గురు మంత్రులు తీవ్రమైన పోటీ ఎదుర్కుంటున్నారు నిర్మల్లో మంత్రి అవుట్ అయ్యి ఛాన్స్ ముధోల్, కామారెడ్డిలలో బీజేపీ గెలిచే ఛాన్స్ బాల్కొండలో మంత్రి ప్రశాంత్ రెడ్డి గెలిచే అవకాశం కరీంనగర్ లో మంత్రి గంగుల గెలిచే ఛాన్స్ సిరిసిల్లలో కేటీఆర్ మంచి మెజారిటీతో గెలిచే ఛాన్స్ సిద్దిపేటలో అత్యధిక మెజారిటీతో(70 వేలు) హరీష్ గెలిచే ఛాన్స్ దామోదర రాజ నర్సింహ గెలిచే ఛాన్స్ తక్కువ మెజారిటీ తో కేసీఆర్ గెలిచే ఛాన్స్ మహేశ్వరంలో స్వల్ప ఆధిక్యంతో సబిత గెలిచే ఛాన్స్ అంబర్ పేటలో కారుకే ఛాన్స్ తలసాని మంచి మెజారిటీతో గెలుస్తారు వనపర్తిలో మంత్రి నిరంజన్ ఓడిపోయే ఛాన్స్ కొడంగల్ లో రేవంత్ గెలిచే ఛాన్స్ బర్రెలక్క కి 10 వేల ఓట్లు ఉత్తమ్, పద్మావతి గెలుస్తారు కోమటి రెడ్డి బ్రదర్స్ గెలుస్తారు హుజూరాబాద్ లో 50 50 ఛాన్స్ మంత్రి దయాకర్ రావు ఓడిపోయే ఛాన్స్ ఖమ్మలో పువ్వాడ ఓడిపోయే ఛాన్స్ పాలేరు, మధిర కాంగ్రెస్ గెలుస్తుంది కొత్తగూడెంలో సీపీఐ గెలుస్తుంది -
మళ్లీ మాదే అధికారం: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: ఎగ్జిట్ పోల్స్ చూడి కార్యకర్తలు కంగారు పడొవద్దని.. మూడోసారి అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్సేనని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు అన్నారు. గురువారం(నవంబర్ 30) సాయంత్రం పోలింగ్ ముగిసి.. ఎగ్జిట్ పోల్స్ వెలువడుతున్న నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఎగ్జిట్ పోల్స్ చూసి నేతలు, కార్యకర్తలు కంగారు పడొద్దు. ఈ తరహా ఎగ్జిట్ పోల్స్ను గతంలోనూ చూశాం. ఎగ్జిట్పోల్స్ పేరిట న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నారు. ఇంకా పోలింగ్ కొనసాగుతోంది. క్యూ లైన్లో చాలామందే ఉన్నారు. ఓటింగ్ కచ్చితంగా ప్రభావితం అవుతుంది. అసలైన ఫలితం డిసెంబర్ 3వ తేదీన రాబోతోంది. 70కిపైగా స్థానాలు దక్కించుకుంటాం. బీఆర్ఎస్ ఖచ్చితంగా అధికారంలోకి వస్తుంది. హ్యాట్రిక్ కొట్టి.. కేసీఆర్ సీఎంగా ప్రమాణం చేస్తారు అని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. -
Rajastan: ఎగ్జిట్ పోల్ ఫలితాలు ఎలా ఉన్నా మళ్లీ కాంగ్రెస్దే అధికారం.. సీఎం గెహ్లాట్
న్యూఢిల్లీ : ఎన్నికలు జరగనున్న ఐదు రాష్ట్రాల్లోనూ బీజేపీ గెలవబోదని రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ గురువారం జోస్యం చెప్పారు. ఎగ్జిట్ పోల్స్కు కొన్ని గంటల ముందు ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలు జరుగుతున్న ఐదు రాష్ట్రాల్లో మిజోరం, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్లో ఇదివరకే పోలింగ్ పూర్తవగా తెలంగాణలో ఈరోజు పోలింగ్ జరిగింది. ఎగ్జిట్ పోల్ ఫలితాలు ఎలా ఉన్నా రాజస్థాన్లో కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి వస్తుందని సీఎం గెహ్లాట్ అన్నారు. పార్టీ ఎన్నికల అవకాశాల గురించి సీఎం గెహ్లాట్ విలేకరులతో మాట్లాడుతూ, "ఎగ్జిట్ పోల్స్ ఎలా ఉన్నా రాజస్థాన్లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. ఐదు రాష్ట్రాల్లోనూ బీజేపీ గెలవలేదు" అన్నారు. ఎన్నికలు జరుగుతున్న ఐదు రాష్ట్రాలలో బీజేపీ అధికారంలో ఉన్న ఏకైక రాష్ట్రం మధ్యప్రదేశ్. 2018లో రాజస్థాన్లో కాంగ్రెస్ 99 సీట్లు గెలుచుకోగా, బీజేపీ 73 సీట్లు సాధించింది. బీఎస్పీ ఎమ్మెల్యేలు, స్వతంత్రుల మద్దతుతో గెహ్లాట్ సీఎం పీఠాన్ని అధిష్టించారు. కాగా ఐదు రాష్ట్రాల్లో ఓట్ల లెక్కింపు డిసెంబర్ 3న జరగనుంది. -
Rajasthan Exit Poll 2023: రాజస్థాన్ ఎగ్జిట్ పోల్స్.. ఈసారి అధికారం ఎవరిదంటే?
ఢిల్లీ/ జైపూర్: రాజస్థాన్లో అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన విషయం తెలిసిందే. ఇక, ఐదు రాష్ట్రాలకు ఎన్నికలకు సంబంధించి డిసెంబర్ మూడో తేదీన ఎన్నికల ఫలితాలు విడుదల కానున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల ఫలితాలపై ఎగ్జిల్ పోల్స్ వివరాలను వెల్లడిస్తున్నాయి. రాజస్థాన్లో 199 అసెంబ్లీ స్థానాలు ఉండగా.. మ్యాజిక్ నెంబర్ 100 మార్క్ దాటితే ప్రభుత్వ ఏర్పాటు చేసుకోవచ్చు. అయితే, ప్రతీ ఐదేళ్లకు ఒకసారి ప్రభుత్వం మారే సంప్రదాయం రాజస్థాన్లో కొనసాగుతోంది. దీంతో, ఈసారి ఎన్నికల్లో బీజేపీ గెలుస్తుందని కాషాయ పార్టీ నేతలు, కార్యకర్తలు బలంగా నమ్ముతున్నారు. మరోవైపు.. అధికార కాంగ్రెస్కు మరోసారి పట్టం కడాతరని చెబుతున్నారు. దీంతో, ఎన్నికల ఫలితాలు రసవత్తరంగా మారాయి. తాము చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, కాంగ్రెస్ ఇచ్చిన గ్యారంటీలే తమను గెలిపిస్తాయని కాంగ్రెస్ ఆశలు పెట్టుకుంది. ఇక, ఎగ్జిట్ పోల్స్పై రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. తాజాగా గెహ్లాట్ మీడియాతో మాట్లాడుతూ.. ఎగ్జిట్ పోల్స్ ఎలా ఉన్నా మాకు అనవసరం. రాజస్థాన్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. రాష్ట్రంలో బీజేపీ గెలిచే ఛాన్స్ లేదు. రాజస్థాన్ సహా ఐదు రాష్ట్రాల్లో కాంగ్రెస్ విజయం సాధిస్తుందన్నారు. ఎగ్జిట్పోల్స్ వివరాలు ఇలా.. పీపుల్స్ పల్స్ సర్వే.. BJP.. 95-115 Congress.. 73-95 Others.. 8-11. ఇండియా టుడే.. BJP.. 55-72 Congress.. 119-141 Others.. 4-11 News Nation BJP.. 89-93 Congress.. 99-103 Others.. 05-09 News18.. BJP.. 111 Congress.. 74 Others.. 14 Republic TV.. BJP.. 118-130 Congress.. 97-107 Others.. 0-2. Jankibaat BJP.. 100-122 Congress.. 62-85 Others.. 14-15. TV9 Bhararvarsh Polstrat.. BJP.. 100-120 Congress.. 90-100. Times Now-ETG.. BJP.. 108-128 Congress.. 56-72. Times Now-ETG Rajasthan Election #ExitPolls2023: BJP Set To Get Majority With 108-128 Seats, Congress To Bag 56-72 #ExitPolls #ElectionsWithMirrorNow #RajasthanElections — Mirror Now (@MirrorNow) November 30, 2023 ఎగ్జిట్పోల్స్ పూర్తి పట్టిక కోసం.. -
Chhattisgarh Exit Poll 2023: ఛత్తీస్గఢ్ ఎగ్జిట్పోల్స్లో ఆ పార్టీదే హవా !
సాక్షి, ఢిల్లీ : వివిధ సర్వే సంస్థలు నిర్వహించిన ఛత్తీస్గఢ్ ఎగ్జిట్పోల్స్ రిలీజ్ అయ్యాయి. ఇక్కడ అధికార పార్టీ కాంగ్రెస్దే మళ్లీ గెలుపని ఎగ్జిట్ పోల్స్ వెల్లడిస్తున్నాయి. ప్రభుత్వ వ్యతిరేకతను అధిగమించి కాంగ్రెస్ రెండోసారి అధికారంలోకి వస్తుందని ఎగ్జిట్పోల్స్ చెబుతున్నాయి. బీజేపీకి ఇక్కడ రెండోసారి నిరాశేనని తెలిపాయి. పీపుల్స్ పల్స్ మొత్తం స్థానాలు 90 బీజేపీ 29-39 కాంగ్రెస్ 54-64 ఇతరులు 2 ఇండియా టుడే బీజేపీ 36-46 కాంగ్రెస్ 40-50 ఇతరులు 0-5 సీఎన్ఎన్ న్యూస్ 18 బీజేపీ 41 కాంగ్రెస్ 46 స్వతంత్రులు 3 జన్ కీ బాత్ బీజేపీ 34-45 కాంగ్రెస్ 42-53 ఇతరులు 0 ఏబీపీ సీ ఓటర్ బీజేపీ 36-48 కాంగ్రెస్ 41-53 ఇతరులు 0 ఇండియా టీవీ సీఎన్ఎక్స్ బీజేపీ 30-40 కాంగ్రెస్ 46-56 ఇతరులు 0 దైనిక్ భాస్కర్ బీజేపీ 36-46 కాంగ్రెస్ 46-56 ఇతరులు 0 ఎగ్జిట్పోల్స్ పూర్తి పట్టిక కోసం.. -
Telangana Assembly Exit Polls 2023: తెలంగాణ ఎగ్జిట్ పోల్స్ వచ్చేశాయ్! ఆసక్తికరంగా..
సాక్షి, ఢిల్లీ: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల 2023 పోలింగ్ ముగియడంతో.. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెలువడ్డాయి. వివిధ రకాల ఏజెన్సీలు ఫలితాల్ని విశ్లేషిస్తే.. ఆసక్తికరంగా ఉన్నాయి. మెజార్టీ కంటే అధిక స్థానాల్లో గెలుపు సాధిస్తామని, సర్వేలు తమకు అనుకూలంగా ఉంటాయని బీఆర్ఎస్ భావిస్తోంది. మరోవైపు ప్రజల్లో ప్రభుత్వ వ్యతిరేకత ఉందని, తమకు కలిసొస్తుందని కాంగ్రెస్.. బీజేపీలు భావిస్తున్నాయి. తెలంగాణలో ఇలా పోలింగ్ ముగియగానే.. ఇలా ఎగ్జిట్ పోల్స్ వచ్చేశాయ్. తెలంగాణతో పాటు ఇప్పటికే ఎన్నికలు జరిగిన మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, మిజోరం ఎగ్జిట్ పోల్స్ సైతం వెలువడ్డాయి. ఏ పార్టీ అధికారంలోకి రాబోతోంది..? ప్రజలు ఎవరికి పట్టం కట్టబోతున్నారని చెప్పే ఎగ్జిట్ పోల్స్ కోసం జనాలు టీవీలకు.. ఫోన్లకు అతుక్కుపోయారు. తెలంగాణ ఎన్నికలపై ఎగ్జిట్ పోల్స్ :- సీఎన్ఎన్ ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్-56 బీఆర్ఎస్-48 బీజేపీ-10 ఎంఐఎం-5 సీ-ప్యాక్ కాంగ్రెస్ : 65 బీఆర్ఎస్ : 41 బీజేపీ : 04 ఇతరులు : 09 ఆరా మస్తాన్ సర్వే (ఇది ప్రీపోల్ సర్వే) కాంగ్రెస్ 58-67 బీఆర్ఎస్ 41-49 బీజేపీ 5-7 ఎంఐఎం, ఇతరులు 7-9 పల్స్ టుడే బీఆర్ఎస్ : 69-71 కాంగ్రెస్ : 37-38 బీజేపీ : 03-05 ఎంఐఎం : 06 ఇతరులు : 01 చాణక్య స్ట్రాటజీస్ కాంగ్రెస్ : 67-78 బీఆర్ఎస్ : 22-30 బీజేపీ : 06-09 ఎంఐఎం : 06-07 ఇతరులు : 00 న్యూస్18 సర్వే బీఆర్ఎస్: 48 కాంగ్రెస్: 56 బీజేపీ: 0 ఎంఐఎం: 5 ఇతరులు: 0 థర్డ్ విజన్ సర్వే బీఆర్ఎస్ 60-68 కాంగ్రెస్ 33-40 బీజేపీ 1-4 ఎంఐఎం 5-7 ఇతరులు- 0-1 పోల్ ట్రెండ్స్ అండ్ స్ట్రాటజీస్(PTS) కాంగ్రెస్: 65-68 బీఆర్ఎస్: 35-40 బీజేపీ: 7-10 ఇతరులు: 6-9 పొలిటికల్ గ్రాఫ్ బీఆర్ఎస్: 68 కాంగ్రెస్: 38 బీజేపీ: 5 ఎంఐఎం-7 ఇతరులు-1 జనంసాక్షి బీఆర్ఎస్: 26-37 కాంగ్రెస్ : 66-77 బీజేపీ: 4-9 ఎంఐఎం: 6-7 ఇతరులు: 0-1 పార్థదాస్ సర్వే బీఆర్ఎస్: 40 కాంగ్రెస్: 68 బీజేపీ: 4 ఎంఐఎం: 6 ఇతరులు: 1 ఆత్మసాక్షి బీఆర్ఎస్:58-63 కాంగ్రెస్:48-51 బీజేపీ: 7-8 ఎంఐఎం: 6-7 ఇతరులు: 1-2 పోల్స్ట్రాట్ బీఆర్ఎస్:48-58 కాంగ్రెస్:49-59 బీజేపీ:5-10 ఎంఐఎం:6-8 రాష్ట్ర బీఆర్ఎస్: 45 కాంగ్రెస్:56 బీజేపీ:10 ఎంఐఎం, ఇతరులు:8 రేస్ బీఆర్ఎస్: 45-51 కాంగ్రెస్:57-67 బీజేపీ:1-5 ఎంఐఎం, ఇతరులు: 6-7 పీపుల్స్ పల్స్ బీఆర్ఎస్: 35-46 కాంగ్రెస్:62-72 బీజేపీ:3-8 ఎంఐఎం, ఇతరులు:7-9 మాట్రిజ్ బీఆర్ఎస్: 46-56 కాంగ్రెస్: 58-58 బీజేపీ: 4-9 ఎంఐఎం: 5-7 సీఎన్ఎక్స్ బీఆర్ఎస్: 31-47 కాంగ్రెస్: 63-79 బీజేపీ: 2-4 ఎంఐఎం: 5-7 స్మార్ట్ పోల్ బీఆర్ఎస్: 24-36 కాంగ్రెస్:70-82 బీజేపీ:3-8 ఎంఐఎం, ఇతరులు: 6-8 రిపబ్లిక్ టీవీ బీఆర్ఎస్: 46-56 కాంగ్రెస్:58-68 బీజేపీ: 4-9 ఎంఐఎం, ఇతరులు: 5-7 ఎగ్జిట్పోల్స్ పూర్తి పట్టిక కోసం.. -
ఎగ్జిట్ పోల్స్ ఎంతవరకు కరక్ట్..!
న్యూఢిల్లీ: లోక్సభకు 2024లో జరిగే సార్వత్రిక ఎన్నికలకు సెమీఫైనల్స్గా భావిస్తున్న ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై దేశవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న పోలింగ్ ముగిసిన వెంటనే సాయంత్రం 5.30 గంటల నుంచి ఐదు రాష్ట్రాల ఎగ్జిట్ పోల్స్ వెలువడనున్నాయి. లోక్సభ ఎన్నికల్లో రానున్న ఫలితాలకు ఈ ఎన్నికల రిజల్ట్స్ ప్రివ్యూగా భావిస్తున్నారు.ఎన్డీఏ జైత్రయాత్రను సవాల్ చేస్తున్న ఇండియా కూటమి భవితవ్యం కూడా ఈ ఎన్నికలతో తేలిపోనుంది. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్లో కాంగ్రెస్,, బీజేపీల మధ్య హోరాహోరీ పోరు జరిగింది. ఇక్కడ ఈ రెండు పార్టీల మధ్యే ఫైట్ ఉంది. తెలంగాణలో బీఆర్ఎస్, కాంగ్రెస్కు మధ్య ప్రధాన పోరు ఉండగా మిజోరంలో మిజో నేషనల్ ఫ్రంట్ కాంగ్రెస్కు మధ్య ఫైట్ నడిచింది. కాసేపట్లో వెలువడనున్న ఎగ్జిట్ పోల్స్లో 5 రాష్ట్రాల్లో జనాల మూడ్ ఎలా ఉందో తేలిపోనుంది. అయితే సాధారణంగా ఎగ్జిట పోల్స్ ఎన్నికల్లో ప్రజల మూడ్ ఎలా ఉందనేదాన్ని ప్రతిబింబిస్తాయి. కానీ చాలా సందర్భాల్లో ఎగ్జిట్ పోల్స్కు పూర్తి విరుద్ధంగా ఫైనల్ ఫలితాలు వచ్చాయి. దీంతో ఎగ్జిట్పోల్స్ను పూర్తిస్థాయిలో నమ్మడానికి లేదని రాజకీయ పండితులు చెబుతున్నారు. ఇదీచదవండి..రెండేళ్లుగా ఏం చేస్తున్నారు?.. గవర్నర్పై సుప్రీంకోర్టు అసహనం -
మరి కాసేపట్లో ఎగ్జిట్ పోల్స్!ఐదు రాష్ట్రాల్లో ఏ పార్టీకి మొగ్గు!
దేశ వ్యాప్తంగా ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగుతున్నాయి. ఇప్పటికే మధ్యప్రదేశ్, రాజస్థాన్, తెలంగాణ, మిజోరాం ఒకే దశలో ఎన్నికలు జరగ్గా, చత్తీస్గఢ్లో మాత్రం రెండు దశల్లో పూర్తి అయ్యింది. తెలంగాణలో నవంబర్ 30 గురువారం సాయంత్రంతో పూర్తి కానున్నాయి. ఎన్నికలు పూర్తి అయిన వెంటనే ఏ పార్టీ గెలుస్తుంది? ఏ పార్టీకి ప్రజలు పట్టం కడతారు అనే అంచనాలతో వాతావరణం హీటెక్కిపోతుంది. అయినా అధికారికంగా ఫలితాలు ప్రకటించక మునుపే వెల్లడించే ఈ ఎగ్జిట్ ఫలితాలు అంటే ఏంటీ? ఎవరు నిర్వహిస్తారు? దీనిలో వాస్తవం ఎంత? ఎగ్జిట్ ఫలితాలు అంటే.. ఎగ్జిట్ పోల్స్ అనేది ఒక నిర్దిష్ట ఎన్నికలలో ఓట్లు ఎలా పడ్డాయనే దాని గురించి అంచానే వేసే ప్రక్రియ. దీన్ని వార్తా సంస్థలు, ఇతర ఏజెన్సీలు నిర్వహిస్తారు. ప్రజలు ఎవరకు పట్టం కడతారు? ఏ పార్టీ గెలుస్తుందని అంచానా వేసి చెబుతారు. ముందుగా ఓటింగ్ సరళి గురించి వివరణాత్మక సమాచారాన్ని అందించి తద్వారా విజేతలను అంచనా వేయడం జరుగుతుంది. ఈ ఎగ్జిట్ పోల్స్ పూర్తిగా కచ్చితమైనది కానప్పటికీ..ఎన్నికలకు సంబంధించిన అనేక అంశాల గురించి స్థూలమైన అంచనాను ఇస్తాయి. ఎన్నికలకు ముందు కూడా ఇలా ఓటింగ్ సర్వే చేస్తారు. దీన్ని ప్రీపోల్స్ అంటారు. ఈ ప్రీపోల్ సర్వేలు ఎన్నికల నోటిఫికేషన్ రాక మునుపు చేపట్టే ప్రక్రియ. ఇక్కడ వివిధ రాజకీయ పార్టీల పొత్తలు, సీట్ల సర్దుబాటు, అభ్యర్థుల ఎంపిక ప్రభావం ఎలా ఉండబోతుంది అనేదాని గురించి విశ్లేషిస్తారు. ఇది పోలింగ్ తేది సమీపిస్తున్నప్పుడూ నియోజక వర్గాల వారీగా కొంతమంది ఓటర్లను కలుసుకుని సర్వే చేసి..ప్రీపోల్ సర్వే ఫలితాలను వెల్లడిస్తారు. అయితే ఎగ్జిట్ పోల్స్ మాత్రం పోలింగ్ జరిగిన ఆ రోజే ఓటరు మనోగతం తెలుసుకుంటూ సర్వే చేసి చెబుతారు. ఎప్పుడూ ప్రకటిస్తారంటే.. నవంబర్ 30 సాయంత్రం 5 గంటలకు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన వెంటనే ఐదు రాష్ట్రాల ఎగ్జిట్ ఫలితాలను ప్రకటిస్తారు. ఇలానే ఎందుకంటే.. ఎన్నికల సంఘం నవంబర్ 30 వరకు ఐదు రాష్ట్రాలకు ఎగ్జిట్ పోల్ ఫలితాలను ప్రకటించడాన్ని నిషేధించింది. కచ్చితత్వం ఎంతంటే.. ఎగ్జిట్ పోల్ అంచనాలు రిజల్ట్కు దాదాపు దగ్గరగా ఉంటాయి. పోలింగ్ ఉదయం నుంచి సాయంత్రం వరకు జరుగుతుంది. ఎగ్జిట్ పోల్ నిర్వాహకులు దాదాపు అన్ని వర్గాల ఓటర్లు కవర్ అయ్యేలా వేర్వేరు సమయాల్లో ఓటర్ల స్పందనను తెలుసుకుంటారు. కానీ ఈ ప్రక్రియను ఎంత ఎక్కువ మందిని పకడ్బందీగా, విస్తృతంగా సర్వే చేస్తేనే కచ్చితమైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ఎగ్జిట్ పోల్ అప్డేట్స్ని ఎలా చూడాలి.. ఈ ఐదు రాష్ట్రాల్లో ఫలితాలు నవంబర్ 30న సాయంత్రం ప్రకటించడం జరుగుతుంది. వీటి ప్రత్యక్ష ప్రసారాన్ని న్యూస్ ఛానల్స్ తోపాటు ఇతర సోషల్ మీడియాల్లో వీక్షించి తెలుసుకోవచ్చు. దీంతో ఈ ఐదు రాష్ట్రాల్లో ప్రజల ఎవరికీ పట్టం కట్టారు? ఏ పార్టీ అధికారంలోకి రానుంది? అనేదానిపై ఓ స్పష్టత రానుంది. ఓటింగ్ శాతం! 2023లో రాజస్థాన్లో 74.6% ఓటింగ్ నమోదవ్వగా, 2018 నాటి 74.24 % కంటే స్వల్పంగా మెరుగ్గా ఉంది. మధ్యప్రదేశ్ 2018లో 75%తో ఓటింగ్తో పోలిస్తే 2023లో దాదాపు 76% ఓటింగ్తో మెరుగ్గా ఉంది నవంబర్ 7న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మిజోరంలో 77.04% పోలింగ్ నమోదైంది. అదే రోజు, ఛత్తీస్గఢ్లో మొదటి దశలో పోలింగ్ జరిగిన 20 అసెంబ్లీ స్థానాల్లో 70.87 శాతం ఓటింగ్ నమోదైంది. మిగలిన 70 స్థానాలకు నవంబర్ 17న పోలింగ్ జరిగింది. ఇక తెలంగాణ రాష్ట్రంలో కూడా ఈరోజు 119 అసెంబ్లీ స్థానాల్లో అభ్యర్థుల భవితవ్యాన్ని ఓటర్లు నిర్ణయించనున్నారు ఈ 2023 అసెంబ్లీ ఎన్నికల్లో రాజస్థాన్, ఛత్తీస్గఢ్లలో అధికారంలో ఉండాలని కాంగ్రెస్ భావిస్తుండగా, మధ్యప్రదేశ్లో బీజేపీ మరో పర్యాయం కోసం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. అలాగే తెలంగాణలో బీఆర్ఎస్, కాంగ్రెస్ల మధ్య గట్టి పోటీ నెలకొంది. (చదవండి: ఎగ్జిట్ పోల్స్పై ఈసీ కీలక ప్రకటన.. రిలీజ్ ఎప్పుడంటే?) -
అసెంబ్లీ ఎన్నికలు.. ఎగ్జిట్ పోల్స్పై ఈసీ కీలక ప్రకటన
సాక్షి, ఢిల్లీ: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా 20శాతం పోలింగ్ నమోదైంది. మరోవైపు.. ఎగ్జిట్పోల్స్ విడుదలపై కేంద్ర ఎన్నికల సంఘం కీలక ప్రకటన చేసింది. ఎగ్జిట్ పోల్ సమయాన్ని మార్చుతూ కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. ఈరోజు సాయంత్రం 5.30 గంటల వరకు ఎగ్జిట్ పోల్స్ విడుదల చేయవద్దని తాజాగా ఆదేశాలు జారీ చేసింది. 5.30 గంటల తర్వాత ఎగ్జిట్ పోల్స్ విడుదల కానున్నాయి. ఇక, తెలంగాణలో సాయంత్రం ఐదు గంటల వరకు పోలింగ్ ప్రక్రియ కొనసాగనుంది. మరోవైపు.. తెలంగాణ సీఈవో వికాస్ రాజ్ అసెంబ్లీ ఎన్నికలపై కీలక వ్యాఖ్యలు చేశారు. తాజాగా వికాస్ రాజ్ మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రశాంతంగా పోలింగ్ కొనసాగుతోంది. EVMల సమస్య వచ్చిన దగ్గర కొత్తవి మార్చాము. అర్బన్ ఏరియాల్లో ఇంకా పోలింగ్ శాతం పెరగాలి.. ఇక నుంచి పెరుగుతుంది అనుకుంటున్నాం. అక్కడక్కడ చిన్న చిన్న ఘర్షణలు జరిగాయి. జరిగిన ప్రతి కంప్లైంట్స్ పై DEOను రిపోర్ట్ అడిగాం. ఎమ్మెల్సీ కవిత, టీపీసీసీ చీఫ్ రేవంత్ వ్యాఖ్యలపై ఫిర్యాదు వచ్చింది. కవిత వ్యాఖ్యల పై DEOకు ఆదేశాలు ఇచ్చాను. ఆమె వ్యాఖ్యలపై ఎఫ్ఐఆర్ నమోదు అయ్యింది. రాష్ట్రంలో 11 గంటల వరకు 20.64 శాతంగా పోలింగ్ నమోదైంది. రూరల్లో పోలింగ్ శాతం బాగానే ఉంది.. అర్బన్లో పెరగాల్సి ఉంది’ అని కామెంట్స్ చేశారు. -
కర్ణాటక ఎన్నికల్లో ఎగ్జిట్ పోల్స్ అంచనాలను మించిన ఫలితాలు
దేశం మొత్తం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న కర్ణాటక ఎన్నికల ఫలితాలు వచ్చేసాయి. కొన్ని సంస్థలు అంచనా వేసిన విధంగానే కాంగ్రెస్ ముందంజలో దూసుకెళ్తోంది. ప్రస్తుతం కాంగ్రెస్ 137 స్థానాల్లో, బీజేపీ 64 స్థానాల్లో, జేడీఎస్ 20 లీడింగ్లో ఉన్నాయి. గత ఎన్నికల ఫలితాల్లో పోలిస్తే జేడీఎస్ దాదాపు 17 స్థానాలు కోల్పోయింది. 2018లో జేడీఎస్ 37 స్థానాల్లో గెలిచింది. వరుస ఫలితాలను పరిగణలోకి తీసుకుంటే క్రమంగా జేడీఎస్కి ఆదరణ తగ్గుతున్నట్లు స్పష్టమవుతోంది. ఎన్నికల ఫలితాలు వెలువడక ముందే ఎగ్జిట్ పోల్స్లో 'యాక్సిస్ మై ఇండియా' కాంగ్రెస్ పార్టీకి 122 నుంచి 140 సీట్లు, బీజేపీకి 62 నుంచి 80 సీట్లు వస్తాయని అంచనా వేసింది. ఈ అంచనా ఇప్పుడు నిజమైంది. కర్ణాటకలో కాంగ్రెస్ సాధించిన విజయాన్ని పురస్కరించుకుని పార్టీ నేతలు సంబరాలు చేసుకుంటున్నారు. మొత్తానికి ఎగ్జిట్ అంచనాల కంటే మించి ఫలితాలు వచ్చేశాయి. ఎగ్జిట్ అంచనాల కంటే మించి ఫలితాలు కాంగ్రెస్ విజయాన్ని అంచనా వేసిన సర్వేలు ఫలితాలకు దగ్గరగా ఇండియా టుడే, యాక్సిస్ మై ఇండియా అంచనాలు Follow https://t.co/Fg8UHp55I6 for #KarnatakaElection#KarnatakaElectionResults#KarnatakaElections2023 latest updates pic.twitter.com/yWe36EbKaS — Sakshi TV Official (@sakshitvdigital) May 13, 2023 -
కర్ణాటక తీర్పు
సాక్షి, బెంగళూరు: ఉత్కంఠకు మరికొన్ని గంటల్లో తెరపడనుంది. మొత్తం 2,615 మంది అభ్యర్థుల తలరాత ఏమిటో తేలిపోనుంది. రాజకీయ పార్టీలు ఎప్పుడెప్పుడా అని ఎ దురు చూస్తున్న కర్ణాటక శాసనసభ ఎన్నికల ఫలితాలు శనివారం వెలువడనున్నా యి. ఓట్ల లెక్కింపునకు అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు. ఉదయం 8 గంటలకు ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల(ఈవీఎం) తెరపై ఎన్నికల ఫలితం కనిపించడం ప్రారంభం కానుంది. కౌంటింగ్ కోసం రాష్ట్రవ్యాప్తంగా 36 కేంద్రాలు ఏర్పాటు చేశారు. తుది ఫలితాలపై మధ్యాహ్నం కల్లా ఒక స్పష్టమైన చిత్రం ఆవిష్కృతం అవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో రాష్ట్రంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. బుధవారం జరిగిన ఎన్నికల్లో రికార్డు స్థాయిలో 73.19 శాతం పోలింగ్ నమోదైన సంగతి తెలిసిందే. ప్రధాన పార్టీల నడుమ హోరాహోరీ ఈ ఎన్నికల్లో అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్ మధ్య హోరాహోరీ పోరు ఉంటుందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. కొన్ని సర్వేలు బీజేపీ మళ్లీ గెలుస్తుందని తెలియజేశాయి. స్వల్ప మెజార్టీతో కాంగ్రెస్ నెగ్గే అవకాశం ఉన్నట్లు మరికొన్ని సర్వేల్లో వెల్లడయ్యింది. జేడీ(ఎస్) కింగ్మేకర్ మారే అవకాశాలు కొట్టిపారేయలేమని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. కర్ణాటకలో గత 38 ఏళ్లుగా అధికార పార్టీ వరుసగా రెండోసారి అధికారంలోకి వచ్చిన దాఖలాలు లేవు. ఆ ఆనవాయితీని బద్ధలు కొట్టాలన్న లక్ష్యంతో అధికార బీజేపీ శ్రమించింది. మరోవైపు ఈ ఎన్నికలపై కాంగ్రెస్కు భారీ ఆశలే ఉన్నాయి. వీటిలో గెలిస్తే పార్టీల్లో కొత్త ఉత్సాహం వస్తుందని, వచ్చే ఏడాది జరగబోయే లోక్సభ ఎన్నికల్లో తామే అతిపెద్ద పార్టీగా అవతరిస్తామని కాంగ్రెస్ లెక్కలు వేసుకుంటోంది. తీర్పు ఎవరికి అనుకూలంగా ఉండనుందన్న దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ప్రభుత్వం మాదే: బొమ్మై ఎన్నికల్లో తమకే సంపూర్ణ మెజార్టీ లభిస్తుందని కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై ధీమా వ్యక్తం చేశారు.సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటయ్యే ప్రసక్తే లేదన్నారు. పార్టీ సహచర నాయకులతో కలిసి మాజీ సీఎం బీఎస్ యడియూరప్పను శుక్రవారం ఆయన నివాసంలో కలుసుకున్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ తమ పార్టీ సొంతంగా పోలింగ్ బూత్ స్థాయిలో ఓటింగ్ సరళిని పరిశీలించిందని మేజిక్ ఫిగర్ దాటుతామన్న విశ్వాసం తమకి ఉందన్నారు. హంగ్ అసెంబ్లీ వస్తే బీజేపీ వైఖరి ఎలా ఉంటుందన్న ప్రశ్నకు ఊహాగానాలను తాను విశ్వసించనని చెప్పారు. తమకి మెజార్టీ ఖాయమని స్పష్టం చేశారు. ఈ సారి ఎన్నికల్లో అత్యధికంగా 73.19% పోలింగ్ నమోదైంది. ఎగ్జిట్ పోల్స్లో అత్యధిక సంస్థలు కాంగ్రెస్కే స్వల్ప మొగ్గు వస్తుందని వెల్లడించాయి. సంప్రదింపులు.. బేరసారాలు కర్ణాటకలో అధికారం చేజిక్కించుకునేందుకు ఇప్పటికే పార్టీలు తీవ్ర కసరత్తు చేస్తున్నాయి. నేతలు వరుసగా సమావేశాలు, చర్చలు జరుపుతున్నారు. గెలుపోటముల లెక్కలు ప్రారంభమయ్యాయి. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే 224 సీట్లను గాను 113 సీట్లు సాధించాలి. కనీసం సాధారణ మెజార్టీ సాధిస్తామని బీజేపీ, కాంగ్రెస్ ధీమాగా చెబుతున్నాయి. మ్యాజిక్ ఫిగర్కు చేరువగా వచ్చి ఆగిపోతే హంగ్ పరిస్థితులు రానున్నాయి. అందుకే కచ్చితంగా గెలిచే అవకాశం ఉన్న అభ్యర్థులపై పార్టీలు కన్నేశాయి. స్వతంత్ర అభ్యర్థులపైనా దృష్టి పెట్టాయి. వారితో సంప్రదింపులు, బేరసారాలు జరుపుతున్నట్లు తెలిసింది. హంగ్ ఏర్పడితే చేపట్టాల్సిన కార్యాచరణపై కాంగ్రెస్ పెద్దలు చర్చించారు. ఇక బీజేపీ నేతలు కూడా సమాలోచనాల్లో మునిగిపోయారు. శుక్రవారం ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై మాజీ సీఎం యడియూరప్ప నివాసానికి వెళ్లి మాట్లాడారు. జేడీ(ఎస్)లో ఇంకా ఎలాంటి సమావేశాలు నిర్వహించలేదు. ప్రస్తుతం రాష్ట్రంలో అందరి చూపు ఆ పార్టీ పైనే ఉంది. జేడీ(ఎస్) నేత, మాజీ సీఎం కుమారస్వామి సింగపూర్ పర్యటనకు వెళ్లారు. రాష్ట్రంలో హంగ్ వస్తే తమ ఎమ్మెల్యేలను రిసార్టులకు తరలించేందుకు పార్టీలు సన్నద్ధమవుతున్నాయి. ఎమ్మెల్యేగా నెగ్గినవారంతా శనివారం సాయంత్రంలోగా బెంగళూరుకు చేరుకోవాలని ప్రధాన పార్టీల నుంచి ఆదేశాలు వెళ్లినట్లు తెలిసింది. -
డిసెంబర్లోనే అసెంబ్లీ పోరు.. కర్ణాటక ఫలితాలపై బీఆర్ఎస్లో ఉత్కంఠ!
సాక్షి, హైదరాబాద్: శనివారం వెలువడనున్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు తెలంగాణలో అప్పుడే వేడి పెంచేశాయి. జాతీయ పార్టీలు కాంగ్రెస్, బీజేపీ హోరాహోరీగా పోరాడిన కర్ణాటకలో.. కాంగ్రెస్ స్వల్పంగా పైచేయి సాధిస్తుందని ఎగ్జిట్ పోల్స్ అంచనాలు వెలువడటం, అదేమీకాదు బీజేపీ మెజార్టీ సాధిస్తుందన్న అభిప్రాయాలూ వినిపించడంపై రాష్ట్రంలో ఆసక్తికర చర్చ సాగుతోంది. ముఖ్యంగా అధికార భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)లో కర్ణాటక ఫలితాలపై ఆసక్తి కనిపిస్తోంది. నిజానికి ఈ ఏడాది అక్టోబర్, నవంబర్ నెలల్లో తెలంగాణ శాసనసభ ఎన్నికలు జరగనుండటంతో.. కాంగ్రెస్, బీజేపీ ఇప్పటికే తమ కార్యకలాపాలను ముమ్మరం చేశాయి. మరోవైపు కర్ణాటక ఎన్నికల్లో ఈ రెండు పార్టీల మధ్యే ప్రధాన పోరు జరగడంతో.. అక్కడ రాబోయే ఫలితాలు తెలంగాణ రాజకీయాలను ప్రభావితం చేయవచ్చని బీఆర్ఎస్ అంచనా వేస్తోంది. కాంగ్రెస్, బీజేపీలలో ఏది గెలిచినా.. తెలంగాణలో ఏ తరహా వ్యూహాన్ని అమలు చేస్తాయన్న దానిపై బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ లెక్కలు వేస్తున్నట్టు సమాచారం. కర్ణాటక ఎన్నికల ఫలితాలను అనువుగా ఎలా మలుచుకోవాలనే వ్యూహాలను సిద్ధం చేయడంపైనా దృష్టి సారించినట్టు తెలిసింది. బీజేపీ దూకుడుకు అడ్డుకట్ట వేసేందుకు.. కర్ణాటకలో బీజేపీ అమలు చేసిన పలు విధానాలు, వ్యవహరించిన తీరు ఆ పార్టీకి ఇబ్బందికరంగా మారిందని బీఆర్ఎస్ భావిస్తోంది. ప్రస్తుతం తెలంగాణలో నలుగురు ఎంపీలు, ముగ్గురు ఎమ్మెల్యేలు, ఒక ఎమ్మెల్సీ బలమున్న బీజేపీ.. ప్రధానంగా హైదరాబాద్ నగరం, శివారు నియోజకవర్గాల్లో మాత్రమే కొంత బలంగా ఉందని అంచనా వేస్తోంది. పట్టణ ప్రాంతాల్లో 8 నుంచి 12 అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీజేపీ ప్రధాన ప్రత్యర్థిగా ఉంటుందని, గ్రామీణ ప్రాంతాల్లో మూడు, నాలుగు నియోజకవర్గాలు మినహా.. కాంగ్రెస్ పార్టీయే ప్రధాన పోటీదారుగా ఉంటుందని బీఆర్ఎస్ సంస్థాగత నివేదికల ఆధారంగా భావిస్తున్నట్టు తెలిసింది. కర్ణాటకలో బీజేపీకి మెజార్టీ వచ్చి నా.. మేజిక్ ఫిగర్కు దగ్గరగా వచ్చి నా... అక్కడ ప్రభుత్వ ఏర్పాటుకు సర్వశక్తులు ఒడ్డుతుందని బీఆర్ఎస్ భావిస్తోంది. అక్కడ అధికారంలోకి వస్తే తెలంగాణలో దూకుడు పెంచుతుందని అభిప్రాయపడుతోంది. ఒకవేళ కర్ణాటకలో బీజేపీ అధికార పగ్గాలు చేపట్టకుంటే.. ఇక్కడ ఆ పార్టీ దూకుడుకు అడ్డుకట్ట వేయడం సులువు అవుతుందని బీఆర్ఎస్ నేతలు అంటున్నారు. కాంగ్రెస్తోనే ప్రధాన పోటీ.. గ్రామీణ ప్రాంతాల్లో నేటికీ కాంగ్రెస్కు బలమైన కేడర్ ఉన్నట్టు ఆత్మీయ సమ్మేళనాలకు ఇన్చార్జులుగా వ్యవహరించిన బీఆర్ఎస్ నేతలు పార్టీ అధినేత కేసీఆర్కు సమర్పించిన నివేదికల్లో పేర్కొన్నట్టు తెలిసింది. హైదరాబాద్, శివారు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ సాధించే ఓట్లు బీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపోటములను నిర్ణయిస్తాయని స్పష్టం చేసినట్టు సమాచారం. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కాంగ్రెస్కు ఉన్న ఓటు బ్యాంకు ఒక ఏడు శాతం తగ్గితే.. తాము గెలుపు కోసం శ్రమించాల్సి వస్తుందని ఓ ఎమ్మెల్యే వ్యా ఖ్యానించడం పరిస్థితికి అద్దం పడుతోంది. హుజూరాబాద్ తరహాలో గ్రేటర్ పరిధిలో కాంగ్రె స్ నామమాత్ర పోటీకి పరిమితమైతే ఇబ్బంది త ప్పవని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు భావిస్తున్నారు. ఈ క్రమంలో బీజేపీ వైపు మొగ్గుచూపే అవకాశము న్న వర్గాలపై ఫోకస్ పెట్టి.. బీఆర్ఎస్ వైపు తిప్పు కొనేలా వ్యూహరచన చేస్తున్నట్టు సమాచారం. -
కర్ణాటక ఎగ్జిట్ పోల్స్.. కోటి ఆశల్లో కాంగ్రెస్! అక్కడ గెలిస్తే.. ఇక్కడ ఎఫెక్ట్!
సాక్షి, హైదరాబాద్: ‘‘తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు ఇంకో నాలుగైదు నెలలే ఉంది. ఇలాంటి సమయంలో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు అనుకూలంగా వస్తే.. రాష్ట్ర కాంగ్రెస్కు కొత్త బలం వస్తుంది. బీజేపీ, బీఆర్ఎస్లలోకి పార్టీ నుంచి వలసలు తగ్గుతాయి. అసెంబ్లీ ఎన్నికలను ధైర్యంగా ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది’’.. రాష్ట్ర కాంగ్రెస్లో వ్యక్తమవుతున్న అభిప్రాయమిది. కర్ణాటక ఎన్నికల ఫలితాలు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై ప్రభావం చూపవచ్చనే రాజకీయ అంచనాల నేపథ్యంలో.. రాష్ట్ర కాంగ్రెస్ కోటి ఆశలతో ఎదురుచూస్తోంది. ఎగ్జిట్ పోల్స్ అనుకూలంగా రావడంతో ఆ పార్టీలో హుషారు కన్పిస్తోంది. బీజేపీని నిలువరించడం సులువు! రాష్ట్రంలో బీఆర్ఎస్కు ప్రత్యామ్నాయం తామేనని కాంగ్రెస్ నేతలు అంటున్నా.. బీజేపీ పుంజుకుంటున్న తీరు వారిని కలవరపెడుతూనే ఉంది. బీఆర్ఎస్తోపాటు కాంగ్రెస్ నుంచి అడపాదడపా బీజేపీలోకి వలసలు జరుగుతుండటం, కర్ణాటక ఎన్నికల తర్వాత బీజేపీ జాతీయ నాయకత్వం తెలంగాణపైనే దృష్టి సారించనుందనే సంకేతాలు వస్తుండటం.. కాంగ్రెస్లో ఆందోళన పెంచుతోంది. ఇప్పుడు కర్ణాటకలో కాంగ్రెస్ గెలిస్తే.. ఈ ఆందోళనకు చెక్పడుతుందని, ధైర్యంగా ముందుకెళ్లే పరిస్థితులు వస్తాయని ఆ పార్టీ నేతలు చెప్తున్నారు. ముఖ్యంగా దేశవ్యాప్తంగా కాంగ్రెస్కు కొత్త ఊపు వస్తుందని, అది తెలంగాణలోనూ టానిక్లా పనిచేస్తుందని అంటున్నారు. రాష్ట్రంలో బీజేపీకి బ్రేక్ పడుతుందని, వలసలు ఆగుతాయని అంచనా వేస్తున్నారు. అంతేకాదు కాంగ్రెస్ పార్టీలోకి చేరికలు జరుగుతాయని పేర్కొంటున్నారు. బీఆర్ఎస్కు దీటుగా నిలిచేలా.. కర్ణాటకలో విజయం సాధిస్తే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ను దీటుగా ఎదుర్కొంటామని కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు. కొన్నేళ్లుగా దేశవ్యాప్తంగా పరాజయాలు, రోజురోజుకూ క్షీణించిపోతున్న పార్టీగా ముద్ర పడుతున్న నేపథ్యంలో.. కర్ణాటక గెలుపు ఆ అభిప్రాయాన్ని తొలగిస్తుందని అంటున్నారు. ఈ ఊపుతోనే రాష్ట్రంలో బీఆర్ఎస్కు ప్రత్యామ్నాయంగా ఎన్నికలను ఎదుర్కొనే ధీమా వస్తుందని వివరిస్తున్నారు. కర్ణాటకలో బీజేపీకి ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ను ఎంచుకున్నట్టే.. రాష్ట్రంలో బీఆర్ఎస్కు ప్రత్యామ్నాయంగా ప్రజలు కాంగ్రెస్వైపు చూస్తారని అంటున్నారు. బీఆర్ఎస్కు కాంగ్రెస్ పార్టీయే ప్రధాన ప్రత్యర్థిగా ఎన్నికలు జరుగుతాయనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఒకవేళ ఎగ్జిట్పోల్స్కు భిన్నంగా కర్ణాటకలో ప్రతికూల ఫలితాలు వస్తే.. రాష్ట్రంలోనూ కాంగ్రెస్కు గడ్డుకాలమేనని, మనుగడ కోసం పోరాడాల్సిన పరిస్థితి వస్తుందేమోనని అంటున్నారు. ‘‘కర్ణాటకలో మేం గెలిస్తే ధైర్యంగా తెలంగాణ ఎన్నికలను ఎదుర్కొంటాం. అలా కాకుండా కర్ణాటకలో ఓటమి ఎదురయితే ఇక్కడ బిక్కుబిక్కుమంటూ ఎన్నికలకు వెళ్లాల్సి ఉంటుంది. దూకుడుగా ఎన్నికలకు వెళ్లకపోతే ఇక్కడా ప్రతికూల ఫలితాలు వచ్చే అవకాశముంది. అయినా కర్ణాటకలో గెలుస్తామని, తెలంగాణలోనూ అధికారంలోకి వస్తామనే నమ్మకం మాకుంది’’అని టీపీసీసీ కీలక నేత ఒకరు వ్యాఖ్యానించడం గమనార్హం. -
అక్కడా, ఇక్కడా మాదే విజయం! ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తప్పుతాయంటున్న బీజేపీ
సాక్షి, హైదరాబాద్: కన్నడ ఓటరు తీర్పు ఎలా ఉంటుందనే దానిపై బీజేపీలో ఉత్కంఠ మరింత ఎక్కువగా కనిపిస్తోంది. అధికారంలో ఉన్న పార్టీ మళ్లీ గద్దెనెక్కని సాంప్రదాయం, ఎగ్జిట్పోల్స్ కాంగ్రెస్ వైపు మొగ్గడం వంటి అంశాల నేపథ్యంలో తీవ్ర చర్చలు జరుగుతున్నాయి. అయినా కర్ణాటకలో బీజేపీ విజయఢంకా మోగించడం తథ్యమని కమల నాథులు చెప్తున్నారు. ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తప్పుతాయని అంటున్నారు. కర్ణాటకలో గెలిస్తే.. దక్షిణాదిలో పార్టీ విస్తరణకు, తెలంగాణలో కాషాయజెండా ఎగురవేసేందుకు మార్గం సుగమం అవుతుందని పేర్కొంటున్నారు. ఎగ్జిట్ పోల్స్తో అంతర్మథనం.. ఇప్పటికే విడుదలైన ఎగ్జిట్పోల్ అంచనాల్లో ఒకట్రెండు మినహా దాదాపు అన్నీ కాంగ్రెస్కు ఆధిక్యం వస్తుందనే పేర్కొన్నాయి. ఇది బీజేపీ వర్గాల్లో కొంత అంతర్మథనానికి దారితీసినా.. కర్ణాటక అసెంబ్లీ ఫలితాలపై రాష్ట్ర నేతలు మాత్రం పెద్ద ఆశలే పెట్టుకున్నారు. ఎగ్జిట్పోల్స్ అంచనాలు తప్పుతాయని, బీజేపీయే అధికారంలోకి వస్తుందని వాదిస్తున్నారు. ఇక కర్ణాటకలో తెలుగు మాట్లాడే ప్రజలు అధికంగా నివసించే ప్రాంతాలతోపాటు ఇతర చోట్ల కూడా తెలంగాణ ముఖ్యనేతలు పలువురు ఎన్నికల ప్రచారంలో చురుకుగా పాల్గొన్నారు. పార్టీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడు కె.లక్ష్మణ్, జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, జాతీయ కార్యవర్గ సభ్యుడు నల్లు ఇంద్రసేనారెడ్డి, ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి ఎస్.కుమార్, ఇతర నేతలు దాదాపు నెలరోజుల పాటు కర్ణాటకలోని వివిధ ప్రాంతాల్లో ప్రచార కార్యక్రమాలను పర్యవేక్షించారు. రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్, జాతీయ కార్యవర్గ సభ్యుడు ఈటల రాజేందర్, ఎమ్మెల్యే ఎం.రఘునందన్రావు, తమిళనాడు సహ ఇన్చార్జి పొంగులేటి సుధాకరరెడ్డి తదితరులు మూడు, నాలుగు రోజులపాటు వివిధ నియోజకవర్గాల్లో విస్తృత ప్రచారం చేశారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర పార్టీ నేతలు వివిధ జిల్లాలు, నియోజకవర్గాల్లో సమన్వయ, ప్రచార బాధ్యతలు నిర్వహించిన చోట్ల ఫలితాలు ఎలా ఉండబోతున్నాయనే ఆసక్తి కూడా పార్టీ వర్గాల్లో కనిపిస్తోంది. మేం పీపుల్ పోల్స్ నమ్ముకున్నాం: కె.లక్ష్మణ్ తాము ఎగ్జిట్ పోల్స్ను తప్పుబట్టడం లేదని, అవి ఎలా ఉన్నా తాము పీపుల్ పోల్స్ను నమ్ముకున్నామని బీజేపీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడు, ఎంపీ కె.లక్ష్మణ్ చెప్పారు. గురువారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎగ్జిట్పోల్స్ అధికశాతం కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నట్టుగా ఉంది కదా అన్న మీడియా ప్రశ్నలపై స్పందించారు. కర్ణాటకలో తాను నెలరోజుల పాటు ఉన్నానని, బళ్లారి జిల్లా ఎన్నికల ప్రచార బాధ్యతలు నిర్వహించానని చెప్పారు. యడ్యూరప్ప, బసవరాజు బొమ్మై ప్రభుత్వాలు తీసుకున్న సాహసోపేత నిర్ణయాలు, కేంద్రంలోని మోదీ ప్రభుత్వం కర్ణాటకకు పెద్ద ఎత్తున నిధుల కేటాయింపు, అమలుచేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతోపాటు ‘మోదీ ఫాక్టర్’అనేది కచ్చి తంగా ప్రభావం చూపుతుందని తెలిపారు. సామాజిక న్యాయ సాధన దిశలో ఎస్సీ, ఎస్టీలకు ఆరు శాతం రిజర్వేషన్ల పెంపు, అదనంగా లింగాయత్లు, ఒక్కలిగలకు రెండేసి శాతం రిజర్వేషన్లు, ఎస్సీ వర్గీకరణ అమలు వంటివి ప్రజాభిప్రాయాన్ని బీజేపీకి అనుకూలంగా మార్చాయని పేర్కొన్నారు. కర్ణాటకలో కచ్చి తంగా తిరిగి అధికారానికి రావడం ఖాయమన్నారు. -
కర్ణాటక ఎగ్జిట్ పోల్స్
-
కాంగ్రెస్ వైపే మెజార్టీ ఎగ్జిట్పోల్స్ మొగ్గు..!
-
Exit Polls: కర్ణాటక కాంగ్రెస్దే! ఒకవేళ హంగ్ అయితే కింగ్మేకర్ ఆ పార్టీయే!
సాక్షి, బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో్ల కాంగ్రెస్కే ఎగ్జిట్ పోల్స్ జైకొట్టాయి. కాంగ్రెస్ స్పష్టమైన మెజారిటీ సాధించనుందని ఇండియాటుడే–మై యాక్సిస్ సర్వే వెల్లడించింది. మెజారిటీకి 113 స్థానాలు కావాల్సి ఉండగా కాంగ్రెస్ 122 నుంచి 140 దాకా నెగ్గుతుందని ఇండియాటుడే పేర్కొనడం విశేషం. బీజేపీకి కేవలం 62 నుంచి 80 సీట్లే వస్తాయని అంచనా వేసింది. మొత్తమ్మీద కాంగ్రెస్కు 43 శాతం ఓట్లొస్తాయని, బీజేపీకి 35 శాతం, జేడీ(ఎస్)కు 16 శాతం దాకా రావచ్చని తెలిపింది. టైమ్స్ నౌ, ఇండియా టీవీ కూడా కాంగ్రెస్కు 120 సీట్ల దాకా వస్తాయని, బీజేపీ 90 స్థానాలకు పరిమితమవుతుందని పేర్కొన్నాయి. కాంగ్రెసే ఏకైక పెద్ద పార్టీగా నిలవనుందని బుధవారం సాయంత్రం పోలింగ్ ముగియగానే వెలువడ్డ ఎగ్జిట్పోల్స్లో చాలావరకు పేర్కొన్నాయి. బీజేపీ, కాంగ్రెస్ హోరాహోరీగా తలపడ్డా 2018 ఫలితాలతో పోలిస్తే కాంగ్రెస్ బాగా పుంజుకుందని దాదాపుగా సర్వేలన్నీ వెల్లడించాయి. కాంగ్రెస్కు 100 నుంచి 112, బీజేపీ 83 నుంచి 95 సీట్లొస్తాయని సీ ఓటర్ సర్వే తేల్చింది. జన్ కీ బాత్ కాంగ్రెస్కు 91 నుంచి 106 స్థానాలు, బీజేపీకి 94 నుంచి 117 ఇచ్చింది. కొన్ని మాత్రం హంగ్ ఏర్పడుతుందని జోస్యం చెప్పాయి. అదే జరిగితే జేడీ(ఎస్) మరోసారి కింగ్మేకర్ పాత్ర పోషించే అవకాశముంది. ఆ పార్టీకి 14 నుంచి 30 స్థానాలు రావచ్చని సర్వేలు తేల్చాయి. శనివారం ఓట్ల లెక్కింపు జరిగి ఫలితాలు వెలువడనున్నాయి. 38 ఏళ్లుగా కన్నడ ఓటర్లు ఏ పార్టీకీ వరుసగా రెండోసారి అధికారం కట్టబెట్టని సంగతి తెలిసిందే. ఈ చరిత్రను ఈసారి ఎలాగైనా తిరగరాయాలని బీజేపీ ప్రచారంలో సర్వశక్తులూ ఒడ్డింది. ప్రధాని మోదీ కాలికి బలపం కట్టుకుని రాష్ట్రమంతటా కలియదిరిగారు. పదుల కొద్దీ బహిరంగ సభలు, ర్యాలీలు, మెగా రోడ్ షోలతో హోరెత్తించారు. కాంగ్రెస్ కూడా ఈసారి స్పష్టమైన మెజారిటీ సాధనే లక్ష్యంగా పెట్టుకుంది. రాష్ట్రానికి చెందిన మల్లికార్జున ఖర్గే కాంగ్రెస్ అధ్యక్ష పదవి చేపట్టిన నేపథ్యంలో పార్టీ గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. 81 ఏళ్ల వయసులోనూ రాష్ట్రమంతటా తిరిగి శ్రమించారు. రాహుల్గాంధీ, ప్రియాంక గాంధీ వద్రా రోజుల తరబడి జోరుగా ప్రచారం చేశారు. 2018లో అలా... ప్రస్తుత అసెంబ్లీలో బీజేపీకి 116, కాంగ్రెస్కు 69, జేడీ(ఎస్)కు 29 స్థానాలున్నాయి. 2018లో కూడా హంగ్ అసెంబ్లీయే ఏర్పడింది. 104 సీట్లతో బీజేపీ అతి పెద్ద పార్టీగా నిలిచింది. కాంగ్రెస్కు 80, జేడీ(ఎస్)కు 37 సీట్లొచ్చాయి. బీఎస్పీ, కేపీజేపీ, స్వతంత్రులకు ఒక్కో స్థానం దక్కింది. కాంగ్రెస్, జేడీ(ఎస్) సంకీర్ణంగా ఏర్పడే ప్రయత్నాల్లో ఉండగానే బీజేపీ ప్రభత్వ ఏర్పాటుకు ముందుకొచ్చింది. బీఎస్ యడియూరప్ప సీఎంగా ప్రమాణస్వీకారం చేశారు. కానీ మెజారిటీ నిరూపించుకోలేక బలపరీక్షకు ముందే రాజీనామా చేశారు. అనంతరం ఊహించినట్టుగానే కాంగ్రెస్–జేడీ(ఎస్) జట్టు కట్టి కుమారస్వామి సీఎం అయ్యారు. కానీ పాలక కూటమికి చెందిన 17 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేసి బీజేపీ గూటికి చేరడంతో సర్కారు 14 నెలలకే కుప్పకూలింది. మళ్లీ బీజేపీ గద్దెనెక్కింది. తర్వాత 15 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో పన్నెండింటిని బీజేపీ గెలుచుకుని మెజారిటీ సాధించింది. -
Karnataka: కింగ్ మేకర్ కాదు.. కింగ్ అవుతాం
సాక్షి, బెంగళూరు: కర్ణాటక ఎన్నికల ఫలితాలపై ఎగ్జిట్ పోల్స్ వెలువడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జనతాదళ్ సెక్యులర్(జేడీఎస్) నేత కుమారస్వామి కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీల ధన బలాన్ని తట్టుకోలేకపోయాం అన్నారు. తాము నిధుల కొరతతో గెలిచే 25 స్థానాల్లో వెనుకపడ్డామని చెప్పుకొచ్చారు తాను జేడీఎస్ అభ్యర్థులకు ఆర్థికంగా సాయపడలేకపోయానంటూ వాపోయారు. కనీసం 120 రాకపోయినప్పటికీ మాకే ఎక్కువ సీట్లు వస్తాయని ధీమాగా చెప్పారు. జేడీఎస్ మేకర్ కాదని కచ్చితంగా కింగ్ అవుతుందని నమ్మకంగా చెప్పారు. (చదవండి: ఎగ్జిట్పోల్స్పై సీఎం బొమ్మై రియాక్షన్ ఇదే..)