-
సంపూర్ణ జీవితం
భట్టి విక్రమార్క కథలో, విక్రమార్కుడి బుద్ధి కుశలతను మెచ్చి, వెయ్యేళ్లు పరిపాలించే సింహాసనాన్ని బహూకరిస్తాడు ఇంద్రుడు. అంటే వెయ్యేళ్ల ఆయువు. మరి నా సంగతేమిటని విక్రమార్కుడిని అడుగుతాడు సోదరుడు భట్టి. అన్నింటికీ వెన్నంటి ఉండే భట్టి సంగతి మరిచేపోయాడు విక్రమార్కుడు. దాంతో భట్టి ఆవేశంతో కాళికాదేవి తపస్సు చేసి, రెండు వేల ఏళ్లు బతికే వరం పొందుతాడు. మరి నా సంగతేమిటని అడుగుతాడు విక్రమార్కుడు. ఇద్దరు కలిసి కదా బతకాలి! అప్పుడు ఆలోచన చేస్తారు. సింహాసనం మీద వెయ్యేళ్లు కూర్చుని కదా పాలించమన్నది... అంటే అది ఆయువు పరిమితి కాదు, రాజ్యపాలన పరిమితి. అందుకే ఆరు నెలలు రాజ్య పాలన, ఆరు నెలలు అరణ్యవాస పథకం వేస్తారు. అలా భట్టి విక్రమార్కులు ఇద్దరూ రెండు వేల ఏళ్లు బతుకుతారు. ఒక్క భట్టి విక్రమార్కులేనా? రామాయణంలో దశరథుడు వేల ఏళ్లు బతికాడు. ఎందరో మునులు, రుషులు వేల ఏళ్లు తపస్సులోనే గడిపి ఎన్నో శక్తులు సాధించిన కథలున్నాయి. ఎప్పటికీ చనిపోని వరాలు పొందిన రాక్షసులు ఎందరో మన పురాణాల్లో ఉన్నారు. ఎప్పటికీ బతికివుండేలా దేవతలు అమృతాన్ని సేవించారు. చనిపోయినవాళ్లను అట్టే మళ్లీ పునర్జీవింపజేసే సంజీవని కథలు, గాయాలన్నీ మానిపోయి దృఢకాయులయ్యే లేపనాల గాథలు మనకున్నాయి. వేల ఏళ్లు బతకడం అంటే దాదాపుగా చావు లేకపోవడమనే! జీవితానికి అంతం పలికే చావు అనేదాన్ని తప్పించే అన్ని ప్రయత్నాలనూ మనిషి కనీసం కథల్లోనైనా, కలల్లోనైనా చేశాడనుకోవచ్చు.ఎప్పటికైనా చచ్చిపోతామనే వాస్తవం మనిషిని కలవరపెడుతుంది. సమస్త మానవాళి గురించి కాకపోయినా, కనీసం తన అయినవారు తనకు కాకుండాపోతారన్న చింత ఉండటంతోపాటు తానూ ఒకరోజు ఈ భూమ్మీద శూన్యంగా మిగిలిపోతాడన్నది జీర్ణం చేసుకోలేని చేదుమాత్ర. అన్ని మతాలూ మరణానంతర జీవితాలను వాగ్దానం చేయడంలో అందుకే విజయం సాధించి ఉంటాయి. చచ్చాక ఏమీ లేదు అనుకోవడం కంటే, ఆ పైనెక్కడో మళ్లీ బతుకుతాం అనేది ఒక ఊరట. అదే సమయంలో చిట్టచివర చావు అనేది ఉంటుందని తెలియడం కొంతమందికి ఒక రిలీఫ్ కూడా. లేకపోతే ఎంతకాలం ఈ రోజువారీ సంకెళ్ల లాంటి వ్యవహారాలను లాక్కురావడం? అందుకే మన పెద్దలు మళ్లీ పుట్టుక లేని ముక్తిని కోరుకున్నారు కాబోలు.సృష్టిలోని ప్రతి జీవికీ ఒక ఆయుఃప్రమాణాన్ని నిర్దేశించిన ప్రకృతి, మనిషికి 120 ఏళ్లు ఇచ్చింది. శతమానం భవతి అని పెద్దలు దీవిస్తుంటారుగానీ, దాన్ని నూరేళ్లు అనికాక, పూర్ణాయువుతో బతకమని దీవించడంగా అర్థం చేసుకోవచ్చు. అర్ధంతరంగా మరణించడం ఆ ప్రకృతి వరాన్ని పాడుచేసుకోవడమే. అర్ధంతర మరణం ఆధునిక మానవుడికి సంభవించడానికి కర్ణుడి చావుకు ఉన్నన్ని కారణాలు ఉన్నాయి. మృత్యువును, రోగాలను మోసం చేసి దీర్ఘకాలం బతగ్గలమా? మన ఆయుఃప్రమాణం కంటే చాలా ఏళ్ల పాటు బతకడాన్ని నూతన శాస్త్రీయ ఆవిష్కరణలు సాధ్యం చేయనున్నాయా? మనిషి శాశ్వతత్వాన్ని సాధించగలడా? మన ఫిజియాలజీని మార్పు చేయడం ద్వారా జీవితకాలాన్ని పొడిగించవచ్చా? ఇలాంటి ప్రశ్నలను నోబెల్ పురస్కారం అందుకున్న వెంకీ రామకృష్ణన్ తన ‘వై వి డై: ద న్యూ సైన్స్ ఆఫ్ ఏజింగ్ అండ్ ద క్వెస్ట్ ఫర్ ఇమ్మోర్టాలిటీ’ పుస్తకంలో చర్చించారు. మనిషి శరీరం కోటానుకోట్ల కణాల నిర్మితం. ప్రతి కణంలో ఉండే డీఎన్ ఏ ప్రతిరోజూ లక్ష మార్పులకు గురవుతుంది. డీఎన్ ఏను నాలుగక్షరాల వర్ణమాలలో రాసిన సుదీర్ఘమైన కోడ్ అనుకుంటే, నెమ్మదిగా దాని కార్యకలాపంలో అంతరాయం రావడమే ముదిమి రావడం. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా సుమారు 700 బయోటెక్ కంపెనీలు ముదిమి, జీవితకాల పొడిగింపు మీద పని చేస్తున్నాయి. ‘యవ్వనంలో ఉన్నప్పుడు ధనికులం కావాలనుకుంటాం; ధనికులం అయ్యాక యవ్వనాన్ని కోరుకుంటాం. యవ్వనాన్ని కొనలేకపోయినా, కనీసం దానిమీద పరిశోధనలనైనా (ఏజింగ్ రీసెర్చ్) ధనికులు కొంటున్నా’రంటారు వెంకీ రామకృష్ణన్ . ఒకవేళ శాస్త్ర పరిశోధనలు ముదిమిని ఆపడంలో విజయం సాధించినా ఆ ఫలితాలు సంపన్నులకు తప్ప పేదవాళ్లకు తేలిగ్గా అందుబాటులోకి రావని చెబుతారు.ఈ శాస్త్రాలు, పరిశోధనలతో నిమిత్తం లేకుండా; ధనిక, పేద అనే తేడా లేకుండా జీవితాన్నే ఒక సాధనగా మలుచుకున్న కొన్ని ప్రాంతాల్లో మనుషులు సంపూర్ణ ఆయువును అనుభవిస్తున్నారు. ఒకినావా (జపాన్ ), సార్డీనియా (ఇటలీ), నికోయా (కోస్టా రికా), ఇకారియా (గ్రీస్), లోమ లిండా (కాలిఫోర్నియా, అమెరికా)... లాంటి ప్రదేశాల్లో ఎక్కువమంది వందేళ్లు బతకడమో, దీర్ఘకాలం బతకడమో కనబడుతుంది. ఇలాంటి ప్రదేశాలు ప్రపంచంలో ‘బ్లూ జోన్స్’గా నిలుస్తున్నాయి. ‘లివ్ టు 100: సీక్రెట్స్ ఆఫ్ ద బ్లూ జోన్స్’ డాక్యుమెంటరీ ప్రయోక్త డాన్ బ్యూట్నర్... ఈ బ్లూ జోన్స్ అని నామకరణం చేయడమే కాకుండా, వాళ్ల దీర్ఘాయువు రహస్యాలను పరిశోధించారు. శారీరక కార్యకలాపాలు, తక్కువ ఒత్తిడి, స్థానికంగా దొరికే ఆహారాన్ని వినియోగించడం, బలమైన కుటుంబ, సామాజిక సంబంధాలు వీరిని ఆరోగ్యవంతులుగా ఉంచుతున్నాయని బ్యూట్నర్ చెబుతారు. రసాయనిక ఎరువులు వేయని పంటలు, 95 శాతం మొక్క ఆధారిత ఆహారం, ఎనభై శాతం మాత్రమే తిని కడుపులో కొంత ఖాళీ ఉంచుకోవడంతోపాటు, జీవితానికి ఒక ఉద్దేశం ఉంచుకోవడం వారిని ఉత్సాహవంతులుగా ఉంచే అదనపు విషయాలు. వెంకీ రామకృష్ణన్ అయినా, బ్లూ జోన్స్ శతాధికులైనా మనిషి ఆరోగ్యానికి కీలకమని చెప్పేవి మూడు: ఆహారం, వ్యాయామం, నిద్ర. ఇవైతే మన చేతిలోనే ఉన్నాయి. -
800 ఏళ్ల నాటి వ్యాయామం..దెబ్బకు ఒత్తిడి, అలసట మాయం!
బరువు తగ్గేందుకు, ఫిట్గా ఉండేందుక చాలామంది పలు రకాల వ్యాయామాలు చేస్తుంటారు. కొందరు ఏరోబిక్, సైక్లింగ్, కార్డియో వర్కౌట్లు, యోగా వంటివి చేస్తుంటారు. ఎవరికి వెసులుబాటుగా ఉండేవి వారు ఎంచుకుని మరీ క్రమతప్పకుండా చేస్తుంటారు. మరికొందరూ వేలు ఖర్చుపెట్టి మరీ ఫిట్నెస్ సెంటర్లను ఆశ్రయిస్తుంటారు. అయితే కొన్ని రకాల అద్భుతమైన వ్యాయామాలు మన పూర్వీకాలం నుంచే ఉండేవి. ఐతే రాను రాను కొన్ని కనుమరుగయ్యిపోగా, మరికొన్నింటిని మనం గుర్తించకపోవడంతో తెలియకుండా పోయాయి. అలాంటి ఓ పురాతన వ్యాయామం తాజాగా వెలుగులోకి వచ్చింది. పైగా ఇది ఇప్పుడూ నెట్టింట తెగ ట్రెండింగ్గా మారింది. ఏంటా వ్యాయామం అంటే..చైనాకి సంబంధించిన 800 ఏళ్ల నాటి పురాతన వ్యాయామం ఇది. దీన్ని'బడువాంజిన్' అని పిలుస్తారు. ఈ వ్యాయామాన్ని సాధారణంగా వృద్ధులు ఎక్కువగా చేస్తుంటారు. అలాంటి వ్యాయామాన్ని ఇప్పుడు చైనా యువత ఆశ్రయిచడం విశేషం. దీన్ని వారు తమ రోజువారి దినచర్యలో భాగంగా చేసుకుని మరీ ప్రాక్టీస్ చేస్తున్నారు. ఇది తమ మాసిక ఆరోగ్యాన్ని మెరుగ్గా ఉంచి, అలసటను, ఒత్తిడిని దూరం చేస్తోందని చెబుతున్నారు. నిజానికి ఈ వ్యాయామం 960-1279ల నాటి సాంగ్ రాజవంశం కాలం నాటిది. చైనా ఆరోగ్యం అండ్ ఫిట్నెస్లకు సంబంధించిన పురాతన వ్యాయామాల్లో ఇది ఒకటిగా ప్రసిద్ధిగాంచింది. ఇది ఎనిమిది ఆసనాలతో కూడిన వ్యాయామం. ముఖ్యంగా శ్వాసకు సంబంధించిన వ్యాయామాలకు అనుగుణంగా చేస్తుండాలి. అందువల్ల మనకు ఇది ఒకరకంగా ధ్యానం చేసినట్లుగా ఉండటమే గాక శరీరం శక్తిని, రక్తపోటుని నియంత్రించే చక్కటి శరీర సాగతీతలు ఉంటాయి. చైనాలోని షెన్జెన్, షాంఘై, బీజింగ్, గ్వాంగ్జౌ వంటి నగరాల్లో యువత దాదాపు 49 గంటలు పనిచేస్తారు. దీంతో యువత తీవ్రమైన అలసటకు, ఒత్తిడికి లోనవ్వడం జరుగుతుంది. అందువల్లే వారంతా ఒత్తిడిని దూరం చేసుకునేందుకు ఇప్పుడూ ఈ వ్యాయామాన్నే ఆశ్రయిస్తున్నారు. గతేడాది జర్మన్ ఫిట్నెస్ ఇన్ఫ్లుయెన్సర్ పమేలా రీఫ్ బడువాన్జిన్ చేస్తున్న వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అంతే ఈ వీడియోకి ఒక్కసారిగా మిలియన్లలో వ్యూస్ వచ్చాయి. పైగా ఈ వ్యాయామం నెట్టింట తెగ ట్రెండింగ్గా మారింది. అంతేగాదు నెటిజన్లు మెడనొప్పితో బాధపడుత్ను వారికి ఈ వ్యాయామం అద్భుతంగా పనిచేస్తుందని, నిద్రనాణ్యత మెరుగుపడి రిఫ్రెష్గా ఉంటారని చెబుతున్నారు. Agréablement surpris par @PamelaReifYT qui pratique aussi le Baduanjin (Huit pièces de brocart), vieille gymnastique chinoise qui fait du bien à la santé. Programme sportif du weekend de plus en plus varié alors🤭 pic.twitter.com/zidpZ9dtOz— Yi Lien (@YiLien000) August 27, 2023 (చదవండి: ప్రపంచంలోనే తొలి తల మార్పిడి..! ఏకంగా హాలీవుడ్ మూవీని తలపించేలా..!) -
పొట్ట తగ్గాలంటే.. జిమ్కే వెళ్లాలా? ఏంటి?
నేటి ఆధునిక శారీరక శ్రమ బాగా తగ్గిపోయింది. దీనికితోడు జీవనశైలిలో మార్పులు, తీవ్రమైన ఒత్తిడి కారణంగా చాలా మంది ఊబకాయంతో బాధపడుతున్నారు. దీన్ని తగ్గించుకోవడానికి ఉపవాసాలున్నా, జిమ్ చేస్తున్నా ఫలితం కనిపించడం లేదని వాపోతున్న వారిని చూస్తూ ఉంటాం. అలాగే ఏం తిన్నా ఇక్కడికే.. అంటూ హీరోయిన్ సమంతా తరహాలో అద్దముందు నిలబడి డైలాగులుకొట్టే అమ్మాయిలు కూడా చాలామందే ఉన్నారు. ఈ నేపథ్యంలో జిమ్కెళ్లకుండానే, ఇంట్లోనే సింపుల్ చిట్కాలతో, ఊబకాయం, బెల్లీ ఫ్యాట్, ఫ్యాటీ బటక్స్ సమస్యకు చెప్పవచ్చు.గంటల తరబడి ఒకే చోట కూర్చుంటే గండమే!గంటల తరబడి టీవీలకు అతుక్కు పోకూడదు. పనిలో పడి అలాగే 8 నుంచి 10 గంటల పాటు కూర్చుని పని చేయకూడదు. ఎక్కువ సేపు ఒకే భంగిమలో కూర్చోవడం వల్ల కొవ్వు పేరుకుపోతోంది. అలాగే కడుపు ఉబ్బరం వస్తుంది. కాబట్టి ప్రతి గంటకు 5 నిమిషాలు విరామం తీసుకోవాలి. మెట్లు ఎక్కడం, గుంజీలు తీయడం లాంటివి చేయాలి. దీంతో అవయవాలకు రక్త ప్రసరణ సవ్యంగా జరుగుతుంది. బరువు అదుపులో ఉంటుంది క్రమం తప్పకుండా వ్యాయామంఉదయం, సాయంత్రం లేదా మీకు వీలైన సమయంలో వేగంగా నడవడం, జాగింగ్, యోగా, సైక్లింగ్, స్విమ్మింగ్ తప్పకుండా చేయాలి. స్నేహితులతో కలిసి మీకు నచ్చిన గేమ్స్ (క్రికెట్, టెన్నిస్, కబడ్డీ,ఇ తర) అవయవాలు పూర్తిగా కదిలేలా ఆడండి. శరీరమంతా చెమట పట్టేదాకా శ్రమిస్తే బాడీలో టాక్సిన్స్ అన్నీ బయటికి పోతాయి.ఎముకలు, కండరాలు బలతంతా తయారవుతాయి. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అతి ముఖ్యమైన డీ విటమిన్ పుష్కలంగా లభిస్తుంది.తగినన్ని నీళ్లు, కంటినిండా నిద్ర: వ్యాయామం చేసేటప్పుడు వీలైనంత ఎక్కువ నీరు త్రాగాలి. ఇది ఆకలిని తగ్గిస్తుంది , బరువును తగ్గించడంలో సహాయపడుతుంది. రోజుకు కనీసం 8 గ్లాసుల నీరు త్రాగాలని ఆరోగ్య నిపుణులు చెబుతారు. నీటిని తాగడం వల్ల పొట్ట, పొత్తికడుపు కొవ్వు తగ్గుతుంది. చక్కటి నిద్ర కూడా మన బరువును ప్రభావితం చేస్తుంది. రోజుకు ఎనిమిది గంటల నిద్ర అవసరం.ఫైబర్ రిచ్ ఫుడ్స్: శరీర బరువు నియంత్రణలో ఉండాలంటే మనం తీసుకునే ఆహారం చాలా ముఖ్యపాత్ర పోషిస్తుంది. బరువు పెరగడం గురించి ఆందోళన మానేసి పౌష్టికాహారాన్ని తీసుకోవాలి.తాజా ఆకుకూరలు, పండ్లు తీసుకోవాలి. రోజువారీ ఆహారంలో ఫైబర్ అధికంగా ఉండే ఆహారాన్ని చేర్చుకోండి, ఈ రకమైన ఆహారాన్ని తినడం వల్ల మీ కడుపు చాలా సేపు నిండుగా ఉంటుంది. అలాగే రాత్రి 7 గంటల లోపు డిన్నర్ కంప్లీట్ చేయాలి. బరువు క్రమంగా తగ్గడం ప్రారంభమవుతుంది.ఇంకా: ఒకేసారి కడుపు నిండా.. ఇక చాలురా బాబూ అనేంతగా తినవద్దు. అలాగే మైదాతో తయారుచేసిన పదార్థాలు, కూల్ డ్రింక్స్, జంక్ ఫుడ్కు దూరంగా ఉండాలి. మద్యం, ధూమమానం లాంటి దురలవాట్లకు దూరంగా ఉండాలి. పొట్ట, పిరుదులు, పిక్కలు, భుజాలు లాంటి ప్రదేశాల్లో కొవ్వును కరిగించుకునేందుకు నిపుణుల సలహా మేరకు కొన్ని స్పాట్ రిడక్షన్ ఎక్స్ర్సైజ్లు చేస్తే మంచి ఫలితం ఉంటుంది. యోగాలో కూడా ఇందుకోసం మంచి ఆసనాలు ఉన్నాయి. వాటినా ప్రాక్టీస్ చేయవచ్చు. నిజంగా వీటిని చిత్తశుద్ధిగా ఆచరిస్తే వారంలో బరువు తగ్గడం ఖాయం.నోట్: ఈ సమాచారం అవగాహన కోసం మాత్రమే అని గమనించగలరు. ఏదైనా అనారోగ్య సమస్యలున్న వారు వైద్యులను సంప్రదించడం ఉత్తమం. -
షుగర్ వచ్చిందని బెదిరిపోకండి.. ఇవి ఖచ్చితంగా పాటిస్తే షుగర్ పరార్!
మధుమేహం ఒక తీవ్రమైన వ్యాధి. జీవన శైలి మార్పులు,క్రమం తప్పని వ్యాయామం, ఆహార నియమాలు దీనికి పరిష్కారం. ఒకసారి మధుమేహం బారిన పడితే జీవితాంతం జాగ్రత్తలు తీసుకోవల్సిందే. ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా తీవ్రమైన సమస్యలు తప్పవు.మధుమేహం వచ్చిందని భయపడుతూ కూర్చుంటే సమస్య పరిష్కారం కాదు. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి ఆహారం తీసుకోవాలి అనేది తెలుసుకోవాలి. ముఖ్యంగా ఒత్తిడికి దూరంగా ఉండాలి. మధుమేహాన్ని నియంత్రించాలంటే తప్పనిసరిగా జీవనశైలిలో కొన్ని మార్పులు చేసుకోవాలి. అవేంటో ఒకసారి చూద్దాం.కొద్దిపాటి నడక, యోగాఉదయాన్నే లేదా రాత్రి నడక, యోగా, ధ్యానం చాలా అవసరం. ముఖ్యంగా డయాబెటిక్ సమస్య ఉన్నవారు యోగా చేయడం అలవాటు చేసుకోవాలి. రాత్రి భోజనం చేసిన వెంటనే నిద్రకుపక్రమించకూడదు. కనీసం పది, ఇరవై నిమిషాలు నడక,వజ్రాసనం వంటి యోగాసనాలను అలవాటు చేసుకోవాలి. దీని బరువు అదుపులో ఉంటుంది. తద్వారా మధుమేహాన్ని అదుపులో ఉంచుకోవచ్చు.రాత్రి భోజనం చేసిన వెంటనే నిద్రపోవడం అనేది షుగర్ లెవల్స్ ఎలివేట్ కావడానికి ముఖ్యం కారణం. కాబట్టి తిన్న తర్వాత కనీస శారీరక శ్రమ చాలా అవసరంస్వీట్లకు, కొన్ని రకాల పండ్లుమామిడికాయ, పనస, అరటి లాంటి పండ్లకు చాలా దూరంగా ఉండాలి. ఒక విధంగా చెప్పాలంటే ఒక్క జామకాయ తప్ప ఏదీ తినకూడదు.. తిన్నా.. చాలాపరిమితంగా తీసుకోవాలి. షుగర్ ఎక్కువగా ఉండే స్వీట్లకు పూర్తిగా దూరంగా ఉండాలి. రాత్రి సమయంలో స్వీట్లు తినకపోవడం మంచిది. మంచి నిద్ర, నీళ్లు ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా ఉంటే రాత్రి నిద్ర కూడా పడుతుంది. డయాబెటిక్ రోగులు కనీసం 8 గంటలు నిద్రపోవాలి.అలాగే రాత్రి భోజనం చేసిన 1 గంట తర్వాత మీరు కనీసం 2 గ్లాసుల నీరు తాగాలి. ఇలా చేయడం వల్ల కూడా రక్తంలో చక్కెర స్థాయి పెరగకుండా నిరోధించవచ్చు.రాత్రిపూట మొబైల్ స్క్రీన్లకు ఎంత దూరంగా ఉంటే మంచింది. రాత్రి పడుకుని టీవీ, మొబైల్ చూడటం వల్ల, మెడ నొప్పులు, తలనొప్పి వస్తాయి. మద్యపానం, ధూమపానం పూర్తిగా నిషేధించాలి. ఎప్పటికపుడు పరీక్షలు, వైద్యుల సలహాలుఒకసారి మన శరీరంలోకి మధుమేహం ఎంటర్ అయిందంటే అదొక హెచ్చరికలాగా భావించాలి. రెగ్యులర్గా పరీక్షలు చేయించుకుంటూ, వైద్యుల సలహా మేరకు మందులను వాడుతూ ఉండాలి.నోట్: డయాబెటిక్ వచ్చిందని భయపడకుండా, తగిన జాగ్రత్తలు పాటించాలి. వ్యాయామం, ఆహార నియంత్రణ లాంటి జీవన శైలి మార్పులు ఆరోగ్య జీవనానికి పునాది. ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే. పూర్తి సమాచారం, సందేహాలకోసం వైద్య నిపుణులను సంప్రదించండి. -
జిమ్ చేస్తూ కుప్పకూలిన యువకుడు..చివరకు వీడియో వైరల్
ఫిట్నెస్ కోసం వ్యాయామం చేస్తూ కుప్పకూలి ప్రాణాలు కోల్పోయిన ఘటన ఆందోళన రేపుతోంది. జిమ్లో వర్కౌట్స్ చేస్తూ అకస్మాత్తుగా కుప్పకూలిపోయాడు ఒక యువకుడు. ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో ఈ విషాదం చోటు చేసుకుంది.వారణాసికి చెందిన దీపక్ గుప్తా (32)గత పదేళ్లుగా జిమ్లో రెగ్యులర్గా వ్యాయామం చేస్తుండేవాడు.పలు ఫిట్నెస్ పోటీలలో చురుకుగా పాల్గొనేవాడు. ఫిట్నెస్ అంటే ప్రాణం పెట్టే దీపక్ రోజూలాగానే జిమ్కెళ్లి వ్యాయామం చేస్తుండగా తీవ్రమైన తలపోటుతో బాధపడినట్టుగా వీడియో ఫుటేజ్ని బట్టి తెలుస్తోంది. నేలపై పడకముందే తన తలని చేతుల్లో పెట్టుకుని కూర్చున్న దృశ్యాలు సీసీటీవీ ఫుటేజీలో రికార్డయ్యాయి. కిందపడిపోయిన దీపక్ను అక్కడున్న వారు లేపి కూర్చోబెట్టారు. నీళ్లు తాగించారు, వీపు, తలపై మసాజ్ చేశారు.అయినా గజ గజ వణికిపోయాడు. వెంటనే ఆసుపత్రికి తరలించగా అప్పటికే ప్రాణం పోయిందని వైద్యులు ప్రకటించారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మెడికల్ రిపోర్టు వచ్చిన తర్వాత అతడి మృతికి ఖచ్చితమైన కారణం తెలియనుంది. -
ఈ వ్యాయామాలతో కొవ్వు కరిగి స్లిమ్గా అవ్వుతారు!
మహిళలు మూడు పదుల వయసు వచ్చేటప్పటికీ శరీరంలో కొవ్వు పేరుకుపోయి, అధిక బరువు సమస్యతో బాధపడుతుంటారు. పైగా ఈ ఏజ్లోనే రకరకాల దీర్ఘవ్యాధుల బారినపడుతుంటారు చాలామంది. దీనికి చెక్పెట్టేలా ఫిట్గా ఉండాలంటే రోజువారి దినచర్యలో ఈ వ్యాయామాలను భాగం చేసుకోవాల్సిందే. బరువు తగ్గించే ప్రయాణంలో సమతుల్యమైన ఆహారంతో కూడిన డైట్ ఎంత ముఖ్యమో అలానే శరీరం ఫిట్గా ఉండేందుకు ఈ వ్యాయామాలు అంత అవసరం. ఆ వ్యాయమాలేమిటో చూద్దామా..!కార్డియో వర్కౌట్లు: ఇది అత్యంత ప్రభావవంతమైన వ్యాయామం. రన్నింగ్, జాగింగ్, స్కిప్పింగ్ రోప్ వంటి కార్డియో వ్యాయామాలను డైలీ లైఫ్లో భాగం చేసుకుంటే ఈజీగా కేలరీలు బర్న్ అవుతాయి. బహుళ కండరాలు ఈ వ్యాయమంలో నిమగ్నమవ్వడంతో హృదయ ఆరోగ్యం మెరుగుపరచడంలో అద్భుతంగా పనిచేస్తుంది. ముఖ్యంగా శరీర కొవ్వును తగ్గించడంలోనూ, కేలరీల లోటును సృష్టించడానికి సహాయపడతాయి. ఇవి మనిషికి ఓర్పు, సమన్వయం, చురుకుదనాన్ని అందిస్తాయి. హై-ఇంటెన్సిటీ ఇంటర్వెల్ ట్రైనింగ్ (హెచ్ఐఐటీ): ఇది హృదయ స్పందన రేటును పెంచేలా చేసే వ్యాయామం. ఇది కేలరీలను సమర్థవంతంగా బర్న్ చేస్తుంది. ముఖ్యంగా పర్వతారోహకులకు ఉపయోగపడే డైనమిక్ వ్యాయామం. ఇది జీవక్రియను పెంచి మొత్తం కొవ్వును కరిగేలా చేస్తాయి. వెయిల్ లిఫ్టింగ్ వంటి వ్యాయామాలు: స్క్వాట్లు, డెడ్లిఫ్ట్లు, పుష్ అప్లు వంటి వ్యాయామాల్లో కూడా బహుళ కండరాలు నిమగ్నం అవుతాయి. శరీర కొవ్వును తగ్గించుకోవాలనుకునే వారికి ఇది మంచి ప్రభావవంతమైన వ్యాయమాలు. జుంబా: వేగవంతంగా చేసే వ్యాయామాలు. ఓ ఆహ్లదభరితమైన వ్యాయామం ఇది. పూర్తి శరీరీ కొవ్వును తగ్గించడంలో ప్రభావవంతంగా ఉండటమే గాక కేలరీలను బర్న్చేసి కార్డియోవాస్కులర్ ఫిట్నెస్ను మెరుగుపరుస్తుంది. ఇవి శరీర కొవ్వుని సులభంగా కరిగించేస్తాయి. యోగా: యోగా అనేది చాలా పురాతనమైన అభ్యాసాలలో ఒకటి. ఇది మానవుల జీవనశైలి నాణ్యతను మెరుగుపరచడానికి, వారి మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి దోహదపడుతుంది. అంతేగాదు దీనిలో వివిధ శరీర భాగాలలో కొవ్వును కరిగించడానికి సహాయపడే నిర్దిష్ట యోగా ఆసనాలు ఉన్నాయి. సుమారు 15 నుంచి 20 నిమిషాల క్రమరహిత యోగా 30 ఏళ్లు పైబడిన స్త్రీలలో ప్రశాంతతను తీసుకురావడానికి, ఎముకలను బలోపేతం చేయడానికి సహాయపడుతుంది.ఆరోగ్యకరమైన రీతిలో శరీర బరువు నిర్వహించడం అనేది క్రమంతప్పకుండా వ్యాయామం, సమతుల్య ఆహారం, చక్కటి జీవనశైలి అనుసరించడం వంటి వాటిపై ఆధారపడి ఉంటుంది. అలాగే లావు తగ్గేందుకు స్పాట్ రిడక్షన్ వ్యాయామాలు అంటూ ఉండవనే విషయం గుర్తించుకోవాలి. ఆరోగ్యంగా ఉండేలా మంచి ప్రణాళికతో కూడిన వ్యాయామాలపై దృష్టిసారించడం ముఖ్యం అని గ్రహించాలి. (చదవండి: సమ్మర్ హీట్కి ఈ ఆటో డ్రైవర్ భలే చెక్ పెట్టాడు! నెటిజన్లు ఫిదా) -
వావ్..మనవళ్ల ముందే...రికార్డులు బద్దలు కొట్టింది!
ఒక బామ్మ ప్రపంచ రికార్డును బద్దలు కొట్టింది. మహిళల స్టమక్ ప్లాంక్స్లో గిన్నిస్ బుక్ ఆప్ వరల్డ్ రికార్డు క్రియేట్ చేసింది. కెనడాలోని అల్బెర్టాకు చెందిన ఒక బామ్మ డోనాజీన్ వైల్డ్ ఏకంగా 4.5 గంటల పాటు పొత్తికడుపు ప్లాంక్స్ చేసింది. 2019లో కెనడియన్ డానా గ్లోవాకాతో గతంలో నెలకొల్పిన రికార్డు కంటే కేవలం 10 నిమిషాలు ఎక్కువ ప్లాంక్స్ చేసిన ఈ రికార్డును అధిగమించింది. గతంలో వైస్ ప్రిన్సిపాల్గా పనిచేసిన ఉన్నత పాఠశాలలోనే డోనాజీన్ ఈ ఘనతను సాధించడం విశేషం. దీంతో స్కూలు విద్యార్థులు, తన 12 మంది మనవళ్ల కేరింతల మధ్య ఈ రికార్డు సాధించింది. గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది.గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ అడ్జుడికేటర్ టీనా షి రికార్డును పరిశీలించారు. మొదటి రెండు గంటలు త్వరగానే గడిచిపోయాయని, కానీ తర్వాతి రెండు గంటలు చాలా కష్టంగా గడిచాయని, ఇక చివరి గంటలోచుక్కలు కనిపించాయంటూ తన అనుభవాన్ని పంచుకున్నారు డోనాజీన్. పదేళ్ల కఠిన ప్రాక్టీస్ తరువాత వరల్డ్ రికార్డ్ సాధించడం సంతోషంగా ఉందన్నారు. విశేషం ఏమిటంటే ఆమె చేతుల్లో దీర్ఘకాలిక నొప్పి, తిమ్మిరితో బాధపడేవారు. దీన్నుంచి బయటపడేందుకు ప్రతీరోజూ ఇచేయడం మొదలు పెట్టారట. డోనాజీన్ ప్రతిరోజూ మూడు గంటల పాటు ప్రాక్టీస్ చేసేదని, ఈ రికార్డులో భాగంగా దానిని ఆరు గంటలకు పెంచిందని చెప్పుకొచ్చారు ఆమె భర్త రాండీ. -
వేగంగా బరువు తగ్గేందుకు సింపుల్ చిట్కాలివిగో!
బరువు తగ్గడం అనుకున్నంత ఈజీ కాదు. దీనికి తగ్గ ఆహార నియమాలు, కమిట్మెంట్ చాలా అవసరం. ఎలా పడితే అలా డైటింగ్ చేయడం కాకుండా బాడీ తీరును అర్థం చేసుకుని, నిపుణుల సలహాలు తీసుకోవడం మంచిది. బరువు తగ్గించే ప్రణాళికలకు సరైన ఆహార విధానం, జీవనశైలి పాటించడం ముఖ్యమని గుర్తుంచుకోవాలి. క్రమం తప్పకుండా వ్యాయామం, జాగ్రత్తగా తినడం అవసరం. అయితే ఈ లక్ష్యాన్ని స్థిరమైన, ఆరోగ్యకరమైన పద్ధతిలో చేరుకోవడం అత్యవసరం. మీబాడీ మాస్ ఇండెక్స్ ఎంత ఉన్నదీ లెక్కించుకొని, దానిని బట్ట ప్రణాళిక వేసుకోవాలి. నో జంక్ ఫుడ్, నో సుగర్ పోషకాహారం, సమతుల్య ఆహారం తీసుకోవడానికి ప్రాధాన్యత ఇవ్వాలి. ప్రాసెస్డ్ఫుడ్ సుగర్ పదార్థాలకు పూర్తిగా దూరంగా ఉండాలి. తక్కువ కేలరీలు ఎక్కువ శక్తినిచ్చే పండ్లు, కూరగాయలు, లీన్ ప్రోటీన్లు, తృణధాన్యాలను తీసుకోవాలి. తొందరగా బరువు తగ్గాలంటే కాఫీ, టీలు పూర్తిగా మానేయ్యాలి. దీని బదులు, గ్రీన్ టీ, హెర్బల్ టీ తీసుకోవాలి. రాత్రి 7 గంటల తరువాత భోజనం వద్దు రాత్రి 7 గంటలకే భోజనం చేయాలి. ఒక పూట భోజనంలోపూర్తిగా ఉడికించిన కూరగాయలు తీసుకుంటే ఇంకా మంచి ఫలితం . కంప్యూటర్, టీవీ ముందు కూర్చుని చిరు తిండ్లు (చిప్స్ కానీ, ఇంట్లో చేసుకున్నవైనా) మన తిండి మర ఆడుతూనే ఉంటుందనేది గుర్తు పెట్టుకోండి. వ్యాయామం బరువు ఎంత తొందరగా అంత వ్యవధిని వ్యాయామాన్ని పెంచాలి. యోగా, నడక, ఏరోబిక్, సైక్లింగ్ వంటివి ఎక్కువ కేలరీలు ఖర్చయ్యేలా చూసుకోవాలి. పుష్కలంగా నీరు తాగాలి బరువు తగ్గే ప్రక్రియలో నీరు చాలా కీలక పాత్ర. రోజంతా బాగా హైడ్రేటెడ్గా ఉండటంతోపాటు, పరగడుపున,రాత్రి నిద్రపోయేముందు నీరు తాగాలి. ఇది జీర్ణక్రియకు, చర్మానికి మంచిది. నిద్ర తప్పనిసరి మీరు తగినంత మంచి నిద్ర పోవాలి. నిద్ర లేకపోవడం హార్మోన్ల సమతుల్యతను దెబ్బతీస్తుంది. ప్రతి రాత్రి 7 నుండి 9 గంటల నిద్రను లక్ష్యంగా పెట్టుకోవాలి. Exercises with weights to lose weight fast: pic.twitter.com/Bm2RcZxUru — Health & Fitness (@FitnessF0rWomen) March 26, 2024 -
ఎక్కువ శ్రమ లేకుండా.. బాడీ స్లిమ్గా ఎలా..!?
అధిక బరువు ఆరోగ్యానికే కాదు అందానికీ శత్రువే. ఆ బరువును తగ్గించుకోవడానికి మితాహారం.. వ్యాయామాలే మార్గం అంటారు ఫిట్నెస్ నిపుణులు. మితాహారం ఓకే.. అతికష్టమ్మీద నాలుకను చంపుకొని కడుపు కట్టుకోవచ్చు. కానీ మైండ్ని ఎంత ప్రిపేర్ చేసినా వ్యాయామానికి సిద్ధమవదు. ఓ పక్క బద్ధకం అడ్డొస్తుంది. అందుకే ఈ ఎక్సర్సైజ్ కుషన్ చూడండీ.. చాలా యూజ్ అవుతుంది. పెద్దగా శ్రమ లేకుండానే బాడీని స్లిమ్గా మారుస్తుంది. ఇది కాళ్లు, తొడలు, పొట్ట చుట్టూ ఉన్న కొవ్వును ఇట్టే కరిగిస్తుంది. శరీరం సన్నగా, అందంగా అవడానికి సహకరిస్తుంది. దీని సాయంతో వ్యాయామం చేస్తే.. కొవ్వు తగ్గి నాజూగ్గా మారుతారు. ఈ ఎక్సర్సైజర్కి ఇరువైపులా కాళ్లు పెట్టుకోవడానికి వీలుగా హోల్స్ ఉంటాయి. వాటిలోకి కాళ్లను జొప్పించి.. పడుకుని లేదా కూర్చుని చిత్రంలో చూపించిన విధంగా వ్యాయామం చేసుకోవచ్చు. దానివల్ల.. పొట్ట నుంచి కాళ్ల వరకూ పేరుకున్న కొవ్వు వేగంగా తగ్గుతుంది. ఈ టూల్ని ఎక్కడికైనా సులభంగా తీసుకుని వెళ్లొచ్చు. ఇది ఇంట్లో ఉంటే.. మీకు కావాల్సిందల్లా కాస్త స్థలం.. కొంత సమయం మాత్రమే. అవిరెండూ దొరికితే.. అందం, ఆరోగ్యం మీ సొంతం. పక్షవాతంతో బాధపడుతున్న కొందరు (కాస్త కదలికలున్నవారు) పేషెంట్స్ కూడా ఈ టూల్ని ఉపయోగించి.. వ్యాయామం చేసుకోవచ్చు. రెడ్ లేదా బ్లాక్ కలర్స్లో ఈ ఎక్సర్సైజ్ కుషన్ అందుబాటులో ఉంది. దీని ధర 51 డాలర్లు. అంటే 4,219 రూపాయలన్న మాట. ఇవి చదవండి: Naila Grewal: నా యాక్టింగ్కి 'టెలివిజనే' నాకు ప్రేరణ! -
ఇవి మార్చితే.. చావును ఏమార్చినట్టే!
మన నిత్య జీవన విధానం, అలవాట్లు వంటివి మన జీవితకాలంపై ప్రభావం చూపుతాయన్నది తెలిసిందే. మరి ఏయే అలవాట్లు, పద్ధతులు మార్చుకుంటే.. 'మరణం' మనకు ఎంతెంత దూరం జరుగుతుందో తెలుసా.. దానిపై ఓ విస్తృత అధ్యయనం జరిగింది. 2011-2013 మధ్య 40 నుం 90 ఏళ్ల మధ్య వయసున్న ఏడు లక్షల మందిపై జరిపిన పరిశోధనలో ఆరు కీలక అంశాలను గుర్తించారు. వీటిని పాటించని వారితో పోలిస్తే.. పాటిందే వారిలో మరణ ప్రమాదం ఎంతవరకు తగ్గుతుందన్నది తేల్చారు. ముఖ్యంగా వ్యాయామం చేయనివారితో పోలిస్తే.. వారంలో కనీసం 150 నిమిషాల సాధారణ వ్యాయామం లేదా 75 నిమిషాల కఠిన వ్యాయామం చేసేవారు. మరణానికి దూరంగా ఉంటారని గుర్తించారు. మానసిక ఒత్తిడి, ఆందో నియంత్రించుకోగలిగితే 29 శాతం, డ్రగ్స్కు దూరంగా ఉంటే 380 మరణం రిస్క్ ను తప్పించుకున్నట్టేనని తేల్చారు. చదవండి: Alexi Navalni: కుటుంబ సభ్యులనూ వదలని పుతిన్ దేనిని పాటిస్తే మరణ ప్రమాదం ఎంత శాతం తగ్గుతుంది? -
చీరకట్టులో జిమ్ వర్క్ఔట్స్!
ఇటీవల కాలంలో చీర ధరించడాన్నే ట్రెండీగా ఫాలో అవుతోంది యువత. అందులోనూ చీర కట్టులో స్కూటర్ నడపడం, లేదా వ్యాయామాలు చేసి ఆశ్చర్యపరుస్తున్నారు. నెటింట కూడా అలాంటి వీడియోలకే మంచి ఆదరణ ఉందని చెప్పొచ్చు. అంతేగాదు చీర కట్టులో ఎలాంటి పనులైన సునాయాసంగా చెయ్యొచ్చని నిరూపిస్తున్నారు. ఇక్కడ కూడా ఓ ఫిటెనెస్ కోచ్ చీరకట్టులో వర్క్ఔట్లు చేసి అందర్నీ ఆకర్షించింది. శారీ వర్కవుట్ వీడియోలతో ఇంటర్నెట్లో ఫేమ్ అయింది ఫిట్నెస్ కోచ్ రీనాసింగ్. చీరకట్టుతో ఫుష్–అప్స్, పుల్–అప్స్, స్వ్కాట్స్, జంప్స్లాంటి ఎక్సర్సైజులు చేస్తూ నెటిజనులను ఆకట్టుకొంటుంది. పాత, కొత్తా అనే తేడా లేకుండా ఆమె వీడియోలు వైరల్ అవుతూనే ఉంటాయి. రీనాసింగ్ తాజా వీడియో ఇన్స్టాగ్రామ్లో 21.3 మిలియన్ల వ్యూస్ను సాధించింది. ‘వర్కవుట్ల సమయంలో సౌకర్యవంతమైన దుస్తులు ధరించాలని సిఫారసు చేసినప్పటికీ సౌకర్యంగా అనిపిస్తే చీర ధరించి వ్యాయామాలు చేయడం పొరపాటేమీ కాదు. అయితే గ్రిప్ తప్పకుండా ఉండడానికి అవసరమైన ఫుట్వేర్ ధరించాలి’ అంటుంది యోగా ట్రైనర్ అనూష రామ్. View this post on Instagram A post shared by Reena Singh (@reenasinghfitness) (చదవండి: మీరు ప్రేమిస్తున్న వ్యక్తి నిజంగా ప్రేమిస్తున్నారో లేదో తెలుసుకోవాలంటే..!) -
కింగ్ చార్లెస్కి కేన్సర్..ఆయన జీవనశైలి ఎలా ఉంటుందంటే..?
బ్రిటన్ రాజు కింగ్ చార్లెస్ III కేన్సర్తో బాధపడుతున్న బకింగ్హామ్ ప్యాలెస్ పేర్కోంది. ఆయన గత నెలలో ఆరోగ్య సమస్యతో ఆస్పత్రికి వెళ్లగా కేన్సర్గా నిర్దారణ అయినట్లు తెలిపింది. అయితే అది ఏ రకమైన కేన్సర్ అనేది వెల్లడించలేదు. సోమవారం నుంచి చికిత్స మొదలైందని, కాబట్టి కొద్ది రోజు ప్రజావిధుల నుంఇచ తప్పుకుంటారని పేర్కొంది. ఇక బ్రిటిఫ్ ప్రెస్ ప్రకారం ఆయన కెరిర్లో కొన్ని గాయాలు, రెండుసార్లు కరోనా మహమ్మారి బారిని పడటం మినహా రాజ అద్భుతమైన ఆరోగ్యకరమ జీవితాన్నే గడిపారు. ఆయన చక్రవర్తిగా 2022లో సింహాసనాన్ని అధిరోహించిన సంగతి తెలిసిందే. పైగా బ్రిటిష్ చరిత్రలో రాజుగా పట్టాభిషేకం అయిన అంత పెద్ద వయసు వ్యక్తి కూడా ఆయనే. ఇక ఆయన లైఫ్స్టైల్ విషయానికి వస్తే.. ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరిస్తారని అంతరంగికులు చెబుతున్నారు. అందులోనూ ఆయన ఆరోగ్యానికి అత్యంత ప్రాముఖ్యత ఇస్తారని అంటునన్నారు. అలాంటి ఆయన ఈ కేన్సర్ మహమ్మారిన బారిన పడటం అందర్నీ దిగ్బ్రాంతికి గురి చేసింది. ఈ సందర్భంగా ఆయన ఆహార అలవాట్లు ఎలా ఉండేవి? రోజూవారి దినచర్య ఎలా ఉంటుంది తదితర విశేషాల గురించి తెలుసుకుందామా!. ఆయన ఒకసారి మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో బిజీ షెడ్యూల్కు ఆటంకం కలిగించే భోజనం లగ్జరీ లాంటిదని విశ్వసిస్తానని అన్నారు. అంతేగాదు ఆయన సమతుల్యమైన ఆహారం తీసుకోవడం, క్రమం తప్పకుండా వ్యాయామాలు చేయడం వంటివి చేస్తారని అధికారిక వర్గాల సమాచారం. 2018లో కార్లెస్ హౌస్లో తన 70వ పుట్టిన రోజు పురస్కరించుకుని తనకు సంబంధించిన 70 వాస్తవాల జాబితాలో తాను రోజుకు రెండుసార్లు మాత్రమే ఆహారం తీసుకుంటానని అదికూడా అల్పహారం, రాత్రి భోజనం మాత్రమేనని చెప్పుకొచ్చారు. అంతేగాదు వారంలో రెండు రోజులు పూర్తిగా శాకాహారం భోజనం తింటానని, పాల ఉత్పత్తులకు కూడా దూరంగా ఉంటానని చెప్పుకొచ్చారు. ఆరోగ్యంగా ఉండేందుకు ఎక్కువుగా మొక్కల ఆధారిత ఆహారమే ఎక్కువగా తీసుకుంటానని చెప్పుకొచ్చారు. అల్పాహారంలో ఎక్కువగా చీజ్, ఉడకబెట్టిన గుడ్లు, పాలు, తేనేతో కూడిన డార్జిలింగ్ టీ తదితరాలే తీసుకుంటారని రాయల్ డైట్ పేర్కొంది. ఆయన ఎక్కువగా సేంద్రీయ ఉత్పత్తులనే ఇష్టపడతారని రాయల్ చెఫ్లు చెబుతున్నారు. ఇక ఫిట్నెస్ విషయానికి వచ్చేటప్పటికీ క్రమం తప్పకుండా వ్యాయమాలు చేస్తారని ప్యాలెస్ పేర్కొంది. అలాగే కెనడియన్ ఎయిర్ఫోర్స్కి సంబంధించిన ఐదు ప్రాథమిక వ్యాయమాలను రోజుకు రెండుసార్లు చేస్తారని తెలిపింది. ముఖ్యంగా రెండు నిమిషాల స్ట్రెచింగ్ ఒక నిమిషం సిట్ అప్లు, మరో నిమిషం బ్యాక్ లెగ్ రైజ్లు పుష్ అప్లు 11 నిమిషాలు చేస్తారని వెల్లడించింది. వాటన్నింటి తోపాటు ఆరు నిమిషాల పాలు రన్నింగ్, ప్రతి 75 అడుగులకు డేగ జంప్లు చేయడం, వాతావరణం బాగుంటే ఎక్కువ సేపు బహిరంగ ప్రదేశంలో గడపడం వంటివి చేస్తారని రాయల్ ప్యాలెస్ పేర్కొంది. ఇంతలా పిట్నెస్గా ఉంటూ మంచి ఆరోగ్యకరమైన జీవన శైలి పాటించనప్పటికీ కొన్ని రకాల వ్యాధులు ఎందుకు దాడి చేస్తాయనేది ఎవ్వరికీ అంతుపట్టని చిక్కు ప్రశ్న. నిజం చెప్పాలంటే వ్యాధికి రాజు, పేద అనే తారతమ్యం ఉండదేమో రావాలి, వేదన అనుభవించాలి అని ఉంటే టైంకి వచ్చి దాని ప్రభావం చూపించేస్తుందేమో కదూ!. View this post on Instagram A post shared by The Royal Family (@theroyalfamily) (చదవండి: శిల్పాశెట్టి చెప్పే తిరగలి తిప్పే భంగిమ..ఎన్ని ప్రయోజనాలో తెలుసా!) -
జస్ట్ ఈమూడు వ్యాయామాలు చేయండి! బరువు తగ్గడం ఖాయం!
కొన్నిసార్లు ఎలాంటి వ్యాయామాలు చేసినా.. మంచి ఫలితం ఉండదు. శారీరక శ్రమ తప్ప పడుతున్న కష్టమంతా వృధా అనిపిస్తుంది. అలాంటి వాళ్ల కోసం ఈ మూడు వ్యాయమాలు చాలా చక్కగా ఉపయోగపడతాయి. చాలా సులభంగా బరువు తగ్గుతారు. అలాగే ఆరోగ్యానికి ఆరోగ్యం తోపాటు మంచి ఫిట్నెస్గా ఉంటారు అంటున్నారు ఫిట్నెస్ ట్రైనర్ అలీ కబ్బా. ఇంతకీ ఏంటా ఆ వ్యాయామాలు అంటే.. ఈ మూడు వ్యాయమాలు జస్ట్ 20 నిమిషాలు కనీసం కొన్ని పర్యాయాలు చొప్పున చేస్తే చాలు చక్కటి ఫలితం చాలా త్వరిగతగతిన కనిపిస్తుంది. దీనికి కావల్సిందల్లా కెటిల్బెల్స్, రోయింగ్ మెషిన్ ఉంటే చాలు. ఎలా చెయ్యాలంటే..? ముందుగా రోయింగ్ మెషిన్ పై మీరు కూర్చొని ముందుకు వెనక్కు రోప్ని పట్టుకుని వెళ్తుంటే అది మీ కండరాలను ఫిట్గా ఉంచడానికి ఉపయోగపడటమే గాక కాళ్లకి చేతులకి మంచి వ్యాయామంగా ఉంటుంది. మొత్తం బాడీ అంతా కదలుతుంది కాబట్టి కేలరీలు కూడా స్పీడ్గా తగ్గుతాయి. హృదయ స్పందన రేటు పెరుగుతుంది. కాళ్లు, చేతులు, భుజాలు బలోపేతం అవుతాయి. ఇక రెండోది కెటిల్ బాల్స్తో పుష్ అప్లు బాడీ ఫ్లాట్గా ఉండేలా చేస్తుంది. బెల్లీ ఫ్యాట్ కరిగి పొట్ట ఫ్లాట్గా ఉంటుంది. బాడీ మొత్తం బ్యాలెన్సింగ్ చేసే వ్యాయామం కాబట్టి తొందరగా బరువు తగ్గడం ఈజీ అవుతుంది. ఒక వేళ కెటిల్ బాల్స్తో చేయడం కష్టమైతే అవి లేకుండా ఒట్టిగా నేలపైనే అయినా ట్రై చేయండి సరిపోతుంది. తదుపరి ఈ కెటిల్ బాల్స్ని పట్టుకుని పైకిలేపి వదలడం. దీనికి ముందుగా నుంచొని ముందుకు వంగి కాళ్లని ఏ మాత్రం వంచకుండా ఆ బాల్స్ని కింద నుంచి పైకి తీయడం, దించడం ఇలా ఓ 5 నిమిషాలు చేస్తే..భుజాలు, నడుం మంచిగా బలోపేతం అవుతాయి. మీ కటి భాగంలో కొవ్వు కరిగి తొడలు సన్నబడతాయి. ఈ మూడింటిని క్రమం తప్పకుండా కనీసం ఓ 20 నిమిషాలు చేస్తే ఫిట్గా ఉండటమే గాక బరువు తగ్గి నాజూగ్గా ఉండటం పక్కా అని చెబుతున్నారు బాడీ ట్రైయినర్ అలీ కబ్బా. View this post on Instagram A post shared by Ali Kabba - Personal Trainer (@amt.fitness) (చదవండి: చపాతీలు డయాబెటిక్ రోగులకు మేలు! వెలుగులోకి షాకింగ్ విషయాలు) -
వ్యాయామం రోజూ ఒకే టైంలో చేస్తున్నారా? వెలుగులోకి షాకింగ్ విషయాలు
మనం కొత్తగా ఏదైన డైట్ లేదా వ్యాయామాలకు సంబంధించి మార్పులు తీసుకునేటప్పుడూ సమయపాలనే అనేది ముఖ్యం. అంటే.. ఇక్కడ రోజూ ఒకే టైంలోనే ఏదైనా చేయమని నొక్కి చెబుతుంటారు నిపుణులు. మన చిన్నప్పుడూ కూడా ఈ టైం కల్లా చదువుకోవడం పూర్తి చేసుకుని నిద్రపోండి అని మన పెద్దవాళ్లు పదేపదే చెబుతుంటారు. ఇలానే ఎందుకు? ఇది మన శరీరాన్ని ఏవిధంగా ప్రభావితం చేస్తుంది తదితరాల గురించి తాజా అధ్యయనాల్లో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. అందుకు గల కారణాలకు సరైన సమాధానం కూడా దొరికింది. మనం చేసే వ్యాయామం లేదా ఏదైన పని రోజూ ఒకే టైంలో చేస్తే చక్కటి ఫలితం ఉంటుందట. ఈ మేరకు మాంచెస్టర్ విశ్వ విద్యాలయానికి చెందిన శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనల్లో..ఏ వ్యక్తి అయినా వ్యాయామాన్ని ఇష్టారీతిలో తనకు కుదిరిన సమయంలో చేసిన వారి కంటే ఒక నిర్దేశిత టైంలో చేసిన వారిలోనే మెరుగైన పలితాలు కనపడటం గుర్తించారు. దీనికి గల కారణాల గురించి సాగిన పరిశోధనలో చాలా ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. మానవుని శరీరం బాహ్య వాతావరణంతో ప్రభావితవుతుంది. అందుకు తగ్గట్టుగా మన అంతర్గత శరీరీం స్కిరాడియన్ గడియారాన్ని సెట్ చేసుకుంటుందట. ఇక్కడ స్కిరాడియన్ గడియారం అంటే జీవక్రియ గడియారం. దీని అర్థం ఉదయం మేల్కోనగానే కాసేపు బద్ధకంగా అనిపించటం, తర్వాత ఆకలి.. ఆ తర్వాత రోజూవారి పనుల్లో నిమగ్నమవ్వడం ఒక లయబద్ధంగా మన మెదడు సిగ్నల్స్ పాస్ చేయడంతో ఆటోమెటిక్గా చేసుకుంటూ పోతున్న విధానాన్నే జీవగడియారం అంటారు. అంటే..ఇక్కడ మన జీవక్రియ గడియారానికి మన శరీర భాగాలకు మధ్య మెదడు అనే సెంట్రల్ గడియారం సమన్వయంతోనే ఇదంతా సాధ్యమవుతుంది. అందువల్ల సాయంత్రం చీకటి పడగానే ఆటోమెటిక్ నిద్రకు ఉపక్రమించడం, వెలుగు అనగానే బాడీ సెట్ రైట్ అయిపోయి లేవాలనే ఫీల్ కలగడం జరుగుతుంది. కాబట్టి మనిషి ఏదైనా డైట్ లేదా వ్యాయామం చేయాలనుకుంటే..రోజూ ఒక నిర్దేశిత టైంలో చేస్తే రిజల్ట్ బాగుండటమే గాక అనారోగ్యాల బారిన పడకుండా ఫిట్గా ఉండగలుగుతారని శాస్త్రవేత్తల అధ్యయనంలో వెల్లడయ్యింది. అంతేగాదు రోజులో 24 గంటలు అనే రోజు చక్రానికి అనుగుణంగా మన బాడీ ప్రతిస్పందిస్తుంది. అదే శరీరంలో ఒక్కసారిగా ఉష్ణోగ్రత మారడం, రక్తంలో స్థాయిలు మార్పులు, తదితరాలకు కారణం అని పరిశోధకులు పేర్కొన్నారు. మన శరీరంలోని ఇతర భాగాలు గనుక మన జీవ గడియారం, సెంట్రల్ గడియారానికి అనుగుణంగా పనిచేయకపోయినప్పుడే అనారోగ్య సమస్యలు ఉత్ఫన్నమవుతాయని చెబుతున్నారు. ఈ పరిస్థితే మన శరీరంలో చెడు కొలస్ట్రాల్కు కారణమని అన్నారు. అలాగే పగటిపూట మాగ్జిమమ్ తిరుగుతూ ఏదో ఒక పని చేస్తుంటాం. అందువల్ల మన వెన్నెముకలోని ఇంటర్వర్టెబ్రల్ డిస్క్ల నుంచి తుంటి, మోకాళ్లలోని మృదులాస్థి నుంచి నీరు బయటకు వచ్చి రోజూ ముగిసే సమయానికి కాస్త పొట్టిగా కనిపిస్తాం. ఇది రోజు ముగిసే సమయానికి మనల్ని కొంచెం పొట్టిగా కనిపించేలా చేస్తుంది. అదే రాత్రి విశ్రాంత తీసుకునే సమయంలో నీరు తిరిగి మన బాడీకి వస్తుంది మనం యథావిధిగా కనిపిస్తాం అని చెప్పారు. అందుకోసం తాము ఎలుకలపై అధ్యయనం చేయగా.. ఈ ఫలితాలను గుర్తించామని అన్నారు. మన డైట్కి సంబంధించి లేదా వ్యాయామం వంటివి చేసేటప్పుడూ వీలు కుదరినప్పుడల్లా చేస్తే డీసింక్రోనైజేషన్కి గురయ్యి ఫలితం సరిగా ఉండదు. పైగా మన ఇతర వ్యవస్థలపై ప్రభావం ఏర్పడి అనారోగ్య సమస్యలకు దారితీస్తుందని అన్నారు. కాబట్టి మనం రోజూ శారీరక శ్రమకు సంబంధించి(వ్యాయామం తదితర పనులు) ఒకే సమయానికి చేయడం వల్ల శరీరంలోని ఇతర వ్యవస్థలన్ని సమన్వయం అయ్యి, గాయాల బారినపడకుండా ఉండటమే గాక వయసు రీత్య వచ్చే కీళ్ల సంబంధ వ్యాధుల బారినపడే ప్రమాదం కూడా తగ్గుతుందని చెప్పుకొచ్చారు మాంచెస్టర్ పరిశోధకులు. (చదవండి: సరికొత్త ఔషధం..ఒక్క డోసు తీసుకుంటే చాలు.. దెబ్బకు కొలస్ట్రాల్ మాయం!) -
వ్యాయామం తక్కువుగా చేసినా చాలు! పరిశోధనల్లో షాకింగ్ విషయాలు
చాలమంది వర్క్ఔట్లు ఎక్కువగా చేస్తుంటారు. త్వరితగతిన బరువు తగ్గాలని లేదా మంచి ఫలితాలు కనిపించాలంటే ఆ మాత్రం వర్క్ఔట్లు ఉండాలని అనుకుంటారు. అందుకోసం అని వాకింగ్లు కొన్ని రకాల వ్యాయమాలు తెగ చేసేస్తుంటారు. ఐతే తాజా పరిశోధనలో అందుకు భిన్నంగా షాకింగ్ విషయాలు వెల్లడయ్యాయి. శాస్త్రవేత్తలు కూడా మితంగా వ్యాయామం చేస్తే చాలని తేల్చి చెప్పారు. మొన్నటి వరకు పదివేల అడుగులు వేస్తే బరువు తగ్గుతారు అనుకున్నారు. కానీ ఇప్పుడు అన్ని అడుగులు అవసరం లేదని అధ్యయనంలో వెల్లడైందంటూ షాకింగ్ విషయాలు చెప్పుకొచ్చారు. తక్కువ వ్యాయామంతో దీర్ఘకాలిక వ్యాధులకు చెక్పెట్టగలమా? పరిశోధనల్లో ఏం వెల్లడైంది తదితరాల గురించే ఈ కథనం!. స్పెయిన్లోని గ్రెనడా విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు నిర్వహించిన అధ్యయనం ప్రకారం..తక్కువ వ్యాయామంతోనే మంచి రిజల్ట్స్ని పొందొచ్చని ప్రభావంతంగా కూడా ఉంటుందని పరిశోధనలో తేలింది. వివిధ రకాల వ్యాధులు వచ్చే ప్రమాదం దాదాపు 60% తగ్గుతుందని కూడా వెల్లడైంది. ఈ మేరకు ఈ విషయాలను అమెరికన్ కాలేజ్ ఆఫ్ కార్డియాలజీ జర్నల్లో వెల్లడించారు శాస్త్రవేత్తలు. అందుకోసం సుమారు లక్ష మందికి పైగా వ్యక్తులపై పరిశోధనలు చేసినట్లు పేర్కొన్నారు. ఆరోగ్యంగా ఉండాలన్నా, బరువు తగ్గాలన్నా పదివేల అడుగులు అవసరమని చెబతుంటారు. ఐతే అన్ని అడుగులు అవసరం లేదంటున్నారు. కేవలం రెండు కిలోమీటర్లు అనగా దాదాపు 2,700 అడుగులు చాలు వివిధ గుండె సంబంధిత సమ్యలు తగ్గుతాయని చెబుతున్నారు. ఎక్కువగా నడిచే వారిలో చాలా మంచి ప్రయోజనాలు కూడా కనిపించాయి. కానీ కొందరు ఎక్కువగా నడిస్తేనే మంచిదని భావించి బలవంతంగా చేస్తుంటారు. కానీ అదంతా అవసరం లేదంటున్నారు. రోజుకు రెండు కిలోమీటర్లు నడవండి, మంచి తృణ ధాన్యాలతో కూడిన సమతుల్య ఆహారం తీసుకోండి చాలు చాలా రుగ్మతలు నుంచి సులభంగా బయటపడతారని అంటున్నారు. అలాగే మగవాళ్లకు, ఆడవాళ్లకు వ్యాయామం ఎంత చేయాలనే వ్యత్యాసం ఏం ఉండదని పరిశోధనలో తేలిందన్నారు. తక్కువగా చేసిన మంచి ఫలితాలు ఉంటాయని భయపడాల్సి అవసరం లేదని భరోసా ఇస్తున్నారు. అదే టైంలో ఎక్కువగా చేసేవారికి ఆరోగ్య మరింత మెరుగ్గా ఉండటమేగాక మరిన్ని ప్రయోజనాలు ఉండటాన్ని గుర్తించాం అని చెప్పారు. ఐతే ఈ పదివేల అడుగులు నడవడం అనేది జపాన్ నుంచి వచ్చింది టోక్యో ఒలంపిక్స్ నేపథ్యంలో వచ్చిందని. ఆటగాళ్లు మెరుగ్గా ఆడేలా ఫిట్నెస్పై ఎక్కువగా దృష్టి సారించేందుకు జపాన్ ఇలా పదివేల అడుగుల లక్ష్యాన్ని నిర్దేశించిందని పేర్కొన్నారు. సైన్సు పరంగా అది ఎక్కడ ఫ్రూవ్ కాలేదన్నారు. ఈ నెంబర్ ఫిగర్ అందరు గుర్తుంచుకునేందుకు సులభంగా ఉంటుందని ఇలా లక్ష్యాన్ని నిర్ణయించినట్లు తెలిపారు. అందువల్ల ప్రతీరోజూ తక్కువ వ్యాయామం, సుమారు రెండు కిలోమీటలర్లు నడకతో కూడా పూర్తి ఫిట్నెస్గా ఉండగలమని నొక్కి చెబుతున్నారు. దీంతోపాటు వేళకు తినడం, కంటి నిండ నిద్రపోవడం వంటివి చేస్తే జీర్ణ వ్యవస్థ బాగొంటుంది. తద్వారా ఇతరత్ర సమస్యలు ఉత్ఫన్నం కావు అని చెబుతున్నారు పరిశోధకులు. (చదవండి: 'ఒంటరితనం' రోజుకు 15 సిగరెట్లు తాగినంత ప్రాణాంతకమా? వెలుగులోకి షాకింగ్ విషయాలు) -
మోగిన మూడవ ప్రపంచ యుద్ధ ఘంటికలు? 200 హెలికాప్టర్లతో ఇరాన్ యుద్ధ విన్యాసాలు!
ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం మధ్య ఇరాన్ సైన్యం 200 హెలికాప్టర్లతో యుద్ధ విన్యాసాలు ప్రారంభించింది. ఇరాన్ మీడియా ఈ సమాచారాన్ని ప్రపంచం ముందు వెల్లడించింది. మధ్యప్రాచ్యంలో యుద్ధ భయాల మధ్య ప్రణాళికాబద్ధంగా ఇరాన్కు చెందిన ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్.. ఎస్ఫహాన్లో రెండు రోజుల సైనిక విన్యాసాలను ప్రారంభించారు. ఇరాన్ ఆర్మీ కమాండర్ ఒకరు ఇరాన్ ప్రభుత్వ మీడియాతో మాట్లాడుతూ ‘ఈ మాక్ డ్రిల్ వెనుక ఉన్న ఉద్దేశ్యం ఇరాన్కున్న శత్రువులను హెచ్చరించడమేనని అన్నారు. ప్రస్తుతం ఇజ్రాయెల్- హమాస్ మధ్య యుద్ధంలో హమాస్కు ఇరాన్ బహిరంగంగా మద్దతు ఇస్తోంది. ఇరాన్ సైన్యం యుద్ధ విన్యాసాలు చేపట్టిన నేపధ్యంలో ఇరాన్ విదేశాంగ మంత్రి హోస్సేన్ అమీర్ అబ్దుల్లాహియాన్ ఒక ప్రకటన విడుదల చేసి, ఇజ్రాయెల్కు బహిరంగ హెచ్చరిక జారీ చేశారు. ‘గాజాపై ఇజ్రాయెల్ తన యుద్ధ నేరాలను ఆపకపోతే, ఆ దేశం ఇతర కూటములతో కూడా కూడా పోరాడవలసిన దుస్థితికి చేరుకుంటుందని, అప్పుడు ఆ దేశం ఎదుర్కోబోయే పరిస్థితులను ఆపడం అసాధ్యమని హెచ్చరించారు. కాగా ఇరాన్ హెచ్చరికలు మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీసేలా ఉన్నాయని విశ్లేషకులు అందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇది కూడా చదవండి: ‘కృత్రిమ మేథ’ పక్కదారి పడితే? ‘ఓపెన్ ఏఐ’ చేయబోతున్నదిదే... -
వ్యాయామం, డైటింగ్లు చేసినా.. బరువు తగ్గకపోవడానికి కారణం..!
కొంతమంది మంచిగా వ్యాయామం, డైటింగ్ చేసిన ఒళ్లు తగ్గదు. పైగా వారికి కూడా ఎందుకిది దండగా అనే నిరాశ వచ్చేస్తుంది. కొందరూ భలే తగ్గుతారు. మరికొందరికి మాత్రం శరీరంలో కొంచెం కూడా మార్పు రానట్లు అనిపిస్తుంది. దీనికి ఆయుర్వేద నిపుణులు నవీన్ నడిమింటి కొన్ని సలహలు సూచనలు ఇచ్చారు. అవేంటంటే.. ఒళ్లు తగ్గకపోవడానికి చాలా రకాల కారణాలు ఉంటాయి. వాటిలో కొన్ని హర్మోన్ల తేడా లేదా పీసీడీఓ సమస్య జన్యు పరమైన కారణాలు, అధికంగా ఆహారం తీసుకోవడం వ్యాయామం చేయకపోవడం సరైన శారీరక శ్రమ లేక పోవడం నూనెలో బాగా వేగిన పదార్ధాలను తినడం, మెత్తని పదార్ధాలను తినడం, కార్బో హైడ్రేట్లు ( పిండి పదార్ధాలు) ఎక్కువగా తీసుకోవడం. ఆహార విహారాలతో బాటు మధ్యాహ్నం నిద్ర పోవడం శరీరంలోని వ్యాధులు, హైపో థైరాయిడ్, కొవ్వు బాగా పెరిగిపోవడం, రక్త నాళాల్లో కొవ్వు పేరుకు పోవడం, గుండె సమస్యలు తదితరాలు ఉన్నా. సరిగా నడవలేక పోవడం సంతాన లేమి మొదలైనవి. ఒళ్లడు తగ్గడం లేదని బాధపడేవాళ్లు.. ⇒ ప్రతిరోజు ఉదయం, సాయంత్రం కపాలభాతి ప్రాణాయామం చేయండి.ఇది బరువును తగ్గించడమే కాకుండా ముఖం మీద కాంతిని కూడా పెంచుతుంది ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిది. ⇒ మీరు తినే ఆహారంలో ఎక్కువ శాతం పచ్చి కాయగూరలు మరియు పండ్లు ఉండేలా చూసుకోండి. కనీసం 30% శాతం ఇవి ఉండాలి. ⇒ ఒక తమలపాకులో 5 నుంచి ఆరు మిరియాలు కలిపి చుట్టి రోజూ ఉదయం టిఫిన్కి ముందు తిని, ఒక గ్లాసు మంచినీళ్ళు తాగండి. ఇది ఒంట్లో ఉన్న కొవ్వును కరిగిస్తుంది. ⇒ కొద్దిగా కొత్తిమీర, 3 నుండి 4 చిన్న అల్లం ముక్కలు కలిపి నీళ్ళు వేసి మిక్సీకి వేసుకొని జ్యూస్ చేసుకోండి. అందులో 1 స్పూన్ తేనె మరియు సగం నిమ్మకాయ బద్దను పిండండి. ఇది రోజూ పరగడపున సేవించండి. సులువుగా బరువును తగ్గిస్తుంది. ⇒ రోజుకి కనీసం 25 నుండి 30 నిమిషాల వరకు చమట కక్కేలా గుంజీలు తీయడం, స్కిప్పింగ్ చేయడం, నడవడం లాంటివి చేయండి. ఇది అన్నిటికన్నా ఎంతో ముఖ్యం. ⇒ లావు తగ్గడానికి ఆయుర్వేదంలో చింత గింజలను ఒక రోజంతా నీటిలో నానబెట్టాలి. పొద్దున బాగా పిసికి పొట్టు పోయిన తరువాత కొంచం నెయ్యి వేసి వేయించి, పొడి చేసి పెట్టుకోవాలి. అర స్పూను పొడిని పాలలో వేసి, చక్కర కలిపి తాగాలి. 40 రోజుల నుంచి100 రోజులు వాడాలి . ⇒ నేరుగా పట్టిన వాన నీటిని నిల్వ చేసుకోవాలి. ప్రతి రోజు ఒక గ్లాసు నీటిలో ఒక స్పూను పసుపు కలిపి తాగితే లావు తగ్గుతారు. స్థూలకాయులైతే.. ►తేనె 25 గ్రాములు గోరువెచ్చని నీళ్ళులో వేసుకుని ఒక గ్లాసు ఉదయం, సాయంత్రం పరగడుపున తాగాలి. ►వాయువిడంగాల పొడిని 2,3 గ్రాముల చొప్పున ఉదయం, సాయంత్రం వేడి నీటితో తీసుకోవాలి. ►త్రిఫల చూర్ణము త్రికటు చూర్ణము రెండింటిని సమాన భాగాలుగా తీసుకోవాలి. పూటకు ఒకటిన్నర స్పూను చొప్పున ఉదయం, సాయంత్రం తీసుకోవాలి. ►ప్రతి రోజు అరస్పూను నుంచి ఒక స్పూను వరకు కరక్కాయ పొడిని రెండు పూటలా క్రమం తప్పకుండా తీసుకుంటే తగ్గిపోతుంది. పీసీఓడీ సమస్య ఉన్నవాళ్లు.. ప్రతి రోజు ఒక తిప్ప తీగ ఆకును తింటూ వుంటే లావు తగ్గడమే గాక శరీరంలోని భాగాలు, చర్మం లాంటివి వేలాడుతూ వుంటే ఒక సంవత్సరానికి గట్టి పడతాయి భోజనానికి అరగంట ముందు వేరుశనగ పప్పులకు చక్కెర కలిపి తింటే భోజనం తక్కువగా తింటారు. ఆహారానికి బదులుగా కేవలం ఆపిల్ పండ్లు మాత్రమే తింటే రోజులలో లావు తగ్గుతారు. (చదవండి: డయాబెటిస్ మందుల వల్ల ఇన్ని సైడ్ ఎఫెక్ట్సా! ఏకంగా చర్మం ఊడి..) -
మనసుకి వ్యాయామం
శరీరానికి సంబంధించి ఆహారంతో పాటు వ్యాయామం గురించి చాలామంది చెప్పటం, ఎంతోమంది అనుసరించటం గమనించవచ్చు. కాని, మనస్సు గురించి కొద్దిమంది వైద్యులు చెప్పినా పట్టించుకున్నవారి సంఖ్య అత్యల్పం. మనోవ్యాపారం జరిగేది మెదడులో. దానిని వాడక మూలన పడేస్తే అది మొద్దుబారిపోతుంది. అందుకే చాలామందికి మతిమరుపు వస్తూ ఉంటుంది. వయసు పైబడితే అది సహజం అనుకుంటారు. శరీరం చక్కగా ఉండాలని మందులు, అలంకారాలు చేసుకున్నప్పుడు మెదడుకి కూడా చేయాలని మర్చిపోతూ ఉంటారు. పైగా ఇంత వయసు వచ్చాక పరీక్షలు రాయాలా? ఉద్యోగాలు చేయాలా? ఊళ్లేలా? అని అడుగుతూ ఉంటారు. నిజమే కాని తన విషయాలు తనకి గుర్తు ఉండాలి కదా! ముందు వస్తువులు, మనుషుల పేర్లు మొదలైనవి మర్చిపోవటంతో మొదలై కొంతకాలానికి అవయవాలు కూడా తమ పని చేయటం మర్చిపోయే ప్రమాదం ఉన్నదట!ఆయువు ఉన్నంత కాలం ఒకరి మీద ఆధార పడకుండా తెలివితో ఉండటం ఎవరైనా కోరుకోవలసినదే! దీనికి చేయ వలసిన దల్లా మెదడుకి పని చెప్పి చేయిస్తూ ఉండటమే. ముందు నుండి ఆవిధంగా ఉంటే వృద్ధాప్యంలో మతిమరపు వచ్చే అవకాశాలు చాలా తక్కువ అని మానసిక వైద్యనిపుణులు చెప్పిన మాట. అప్పుడు మానవ జన్మ అనే అద్భుతమైన అవకాశాన్ని పూర్తిగా అనుభవించినట్టు అవుతుంది. దానికోసం కొన్ని మానసిక వ్యాయామాలు సహకరిస్తాయని చెప్పారు. మనస్తత్వ శాస్త్రవేత్తలు సూచించిన వాటిలో కొన్ని చూద్దాం. చదవటం, రాయటం, మాట్లాడటం, ఆలోచించటం, సమస్యలని పరిష్కరించటం మొదలైనవి. వీటి అన్నిటికీ మెదడుని ఉపయోగించక తప్పదు. 40 సంవత్సరాల తరువాత మెదడులో ఉన్న కణాలు పెరగవు. 60 సంవత్సరాల తరువాత తగ్గటం మొదలవుతుంది. కనుక క్రమంగా జ్ఞాపకశక్తి క్షీణిస్తూ ఉంటుంది. కాని చదవటం, రాయటం వంటివి చేసే వారికి పెరగక పోయినా తరగవు. ఉపాధ్యాయులకి జ్ఞాపకశక్తి ఎక్కువ ఉండటానికి కారణం వారు చదువుతూ, రాస్తూ, మాట్లాడుతూ ఉండటమే. అందరికీ ఆ అవకాశం ఉండదు కదా! అందుకని చిన్నపిల్లల దగ్గర కూర్చుని చదివించ వచ్చు. వారికి కథలు చెప్ప వచ్చు. అసలు మాట్లాడటమే చాలు. బుర్రకి కావలసినంత పని. çపద వినోదాలు పూర్తి చేయటం, చదరంగం ఆడటం వంటి వాటిని చేయచ్చు. ఇప్పుడైతే అవన్నీ ఉన్నాయి. మరి, పూర్వం ఏం చేసేవారు? పొడుపు కథలు, చిక్కుప్రశ్నలు, జంటపదాల ఆట, వైకుంఠపాళీ, పులి – జూదం, పచ్చీసు, వామన గుంటలు, వైకుంఠపాళీ వంటి కాలక్షేపాలు, వినోదాలు ఉండేవి. ఇవన్నీ మెదడుకి చురుకుతనం కలిగించేవే. పెద్ద ఉమ్మడి కుటుంబాలు ఉండేవి కనుక ఎప్పుడు ఏదో ఒకటి మాట్లాడుతూ ఉండేవారు. కొంతకాలం మాట్లాడకుండా ఉంటే, మాట్లాడటానికి కొంచెం ప్రయత్నం చేయవలసి ఉంటుంది. అందుకే వృద్ధులని,ఏదయినా కారణంతో జ్ఞాపకశక్తిని కోల్పోయిన వారిని తరచూ పలకరిస్తూ ఉండమని వాళ్ళని మాట్లాడేట్టు చేయమని వైద్యులు చెపుతారు. ఆనాటి వారు తమ కుటుంబ సమస్యలను తామే పరిష్కరించుకునే వారు. ఎవరి సమస్య అయినా అందరు పరిష్కరించటానికి కుస్తీ పట్టే వారు. ఇప్పుడు అందరికీ ఆలోచించటానికి బద్ధకం. కళ్ళు, చెవులు అప్పగించి కూర్చొనే అలవాటు ఎక్కువయింది. ఈనాడు ఎక్కడ పడితే అక్కడ కౌన్సిలింగ్ కేంద్రాలు తయారవటానికి కారణం మెదడుని పని చేయించకపోవటమే. శరీరం లాగానే మనస్సుకి కూడా సోమరితనం అలవాటు అయిపోయింది. నాకు ఏదైనా సమస్య వస్తే ఎవరో పరిష్కారం చూపించాలి, నా మెదడుని నేను కష్టపెట్టను అన్నది అలవాటు అయితే స్థబ్ధుగా తయారవుతారు. మెదడు తుప్పు పడుతుంది. తస్మాత్ జాగ్రత!! డా‘‘ ఎన్ అనంత లక్ష్మి -
15 తర్వాతే సమగ్ర నోటిఫికేషన్!
ప్రశ్నపత్రాల కూర్పు ఎవరికి? టీఆర్టీ పరీక్ష నిర్వహణ పబ్లిక్ సర్విస్ కమిషన్కు ఇవ్వడమా? ఎస్సీఈఆర్టీకి ఇవ్వడమా? అనే అంశంపై అధికారులు చర్చించారు. ఆన్లైన్ పద్ధతిలో నిర్వహిస్తే పబ్లిక్ సర్విస్ కమిషన్ పరిధిలోకి తెచ్చే వీలుందని, ఆఫ్లైన్ విధానమైతే ఎస్సీఈఆర్టీకి అప్పగించే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు. మొత్తం మీద ఎస్సీఈఆర్టీకి ఇవ్వడమే సరైన నిర్ణయమని పాఠశాల విద్యాశాఖ భావిస్తున్నట్టు తెలిసింది. సాక్షి, హైదరాబాద్: ఉపాధ్యాయ నియామక పరీక్ష (టీఆర్టీ) విధివిధానాల రూపకల్పనపై ముమ్మర కసరత్తు జరుగుతోంది. విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ సమక్షంలో ఉన్నతాధికారులు సోమవారం ఈ అంశంపై చర్చించారు. ఒకటీ రెండు రోజుల్లో వీటిపై అధికారిక ఉత్తర్వులు వెలువడే వీలుంది. ప్రతి జిల్లాలోనూ డిపార్ట్మెంట్ సెలక్షన్ కమిటీ (డీఎస్సీ) ఏర్పాటు, వాటికి ఇవ్వాల్సిన అధికారాలపై అధికారులు చర్చించినప్పటికీ ఇంకా స్పష్టత రాలేదని తెలిసింది. టీఆర్టీని రాష్ట్రస్థాయిలో నిర్వహిస్తున్న నేపథ్యంలో డీఎస్సీలకు పరిమిత అధికారాలు మాత్రమే ఇవ్వాలని అధికారులు భావిస్తున్నారు. ఈ క్రమంలో రాష్ట్ర, జిల్లా స్థాయిలో సమన్వయం దెబ్బతినకుండా తీసుకోవాల్సిన చర్యలపై అధికారులు దృష్టి పెట్టారు. మరోవైపు పరీక్ష నిర్వహణ ప్రక్రియ మొత్తం రాష్ట్రస్థాయిలోనే కేంద్రీకృత వ్యవస్థలో నిర్వహించే అంశాన్నీ పరిశీలిస్తున్నారు. అవసరమైతే రాష్ట్రస్థాయి పరీక్ష నిర్వహణకు ప్రత్యేక సమన్వయ కర్తలను నియమించాలని భావిస్తున్నారు. ఎన్నికల సమయం కావడంతో టీఆర్టీ పరీక్షకు చట్టపరమైన అడ్డంకులు తలెత్తకుండా చూడాలని ప్రభుత్వం సూచించింది. దీంతో విధివిధానాల తయారీలో న్యాయ కోవిదుల సలహాలు కూడా తీసుకోవాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో పరీక్షకు సంబంధించిన సమగ్ర నోటిఫికేషన్ సెపె్టంబర్ 15 తర్వాతే వెలువడే వీలుందని అధికార వర్గాలు తెలిపాయి. ఆన్లైనా? ఆఫ్లైనా? పరీక్ష నిర్వహణ మొదలుకొని, నియామక ప్రక్రియ వరకూ ఎవరి బాధ్యత ఏమిటనే దానిపై తొలుత వెలువడే ప్రభుత్వ జీవోలోనే స్పష్టత ఇవ్వాలని వాకాటి కరుణ అధికారులకు సూచించారు. ఆన్లైన్, ఆఫ్లైన్లో పరీక్షల్లో ఏది ప్రయోజనం అనే అంశాన్నీ చర్చించారు. ఆన్లైన్ విధానంలో కొన్ని సమస్యలు వచ్చే వీలుందని అధికారులు భావిస్తున్నారు. టీఆర్టీ పరీక్ష భాషా పండితులకు, సబ్జెక్టు టీచర్లకు, ఎస్టీజీటీలకు విడివిడిగా నిర్వహిస్తారు. టీఆర్టీకి దరఖాస్తు చేసే వారి సంఖ్య దాదాపు 4 లక్షల వరకు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. ఆన్లైన్ పరీక్ష విధానంలో ప్రశ్నపత్రం కూర్పు సమస్యలకు తావిస్తుందనే సందేహాలున్నాయి. ఒకేరోజు 4 లక్షల మందికి కంప్యూటర్ బేస్డ్గా పరీక్ష నిర్వహణ కష్టమని.ఒక్కో జిల్లాకు రెండు సెషన్స్ పెట్టాల్సి ఉంటుందని అంటున్నారు. అదే ఆఫ్లైన్లో అయితే రాష్ట్రవ్యాప్తంగా ఒకే రోజు పరీక్ష నిర్వహించవచ్చని భావిస్తున్నారు. అయితే దీనివల్ల ఫలితాల ప్రకటన ఆలస్యమయ్యే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు. పోస్టులు, వెయిటేజీపై ఇంకా అస్పష్టత సమగ్ర నోటిఫికేషన్ సెప్టెంబర్ 15 తర్వాతే వెలువడే వీలుందని అధికారులు అంటున్నారు. ఏ జిల్లాలో ఎన్ని పోస్టులున్నాయి? సబ్జెక్టుల వారీగా ఎన్ని ఉన్నాయి? రిజర్వేషన్ల వారీగా పోస్టుల విభజన, బ్యాక్లాగ్ పోస్టుల సంఖ్యపై ముందుగా స్పష్టత రావాల్సి ఉంటుంది. దీంతో పాటు ఎస్జీటీలకు, ఎస్ఏలకు ఉండే అర్హతలపైనా అధికారులు తర్జన భర్జన పడుతున్నారు. మరోవైపు టెట్ అర్హులకు ఇవ్వాల్సిన వెయిటేజీ పైనా చర్చిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సమగ్ర నోటిఫికేషన్ వెలువడేందుకు మరికొంత సమయం పట్టే వీలుందని అధికార వర్గాలు తెలిపాయి. -
Bruce Lee Workout Plan: ఇదే బ్రూస్ లీ జిమ్ వర్క్అవుట్ ప్లాన్..
బ్రూస్ లీ.. ఈ పేరు విననివారు ఎవరూ ఉండరు. మార్షల్ ఆర్ట్స్ అనగానే ఎవరికైనా టక్కున బ్రూస్ లీ పేరు గుర్తుకు వస్తుంది. మార్షల్ ఆర్ట్స్లో ఇప్పటి వరకూ బ్రూస్లీ పేరును పడగొట్టే మొనగాడెవడూ లేడంటే అతిశయోక్తి కాదు. ఇంటర్నెట్లో బ్రూస్ లీ గురించి వెదుకులాట.. తన 32 ఏళ్ల జీవితంలో బ్రూస్ లీ అద్భుత ప్రతిభతలో ప్రపంచవ్యాప్తంగా తన పేరు మారుమోగిపోయేలా చేసుకున్నాడు. ఈరోజు ప్రపంచమంతా బ్రూస్ లీని ఎంతో గౌరవ మర్యాదలతో చూస్తుంది. బ్రూస్ లీ 1940లో ఫ్రాన్సిస్కోలో జన్మించారు. నేటి కాలంలోనూ ఇంటర్నెట్లో బ్రూస్ లీకి సంబంధించిన అనేక విషయాలు అందుబాటులో ఉన్నాయి. అలాగే లెక్కకు మించిన నెటిజన్లు తరచూ బ్రూస్ లీ గురించి ఇంటర్నెట్లో సెర్చ్ చేస్తుంటారు. ఇటీవల బ్రూస్ లీకి సంబంధించిన 1965 నాటి వర్క్అవుట్ ప్లాన్ వైరల్గా మారింది. Bruce Lee early Training plan in 1965. pic.twitter.com/H1uLj49NFK — World Of History (@UmarBzv) May 17, 2023 బ్రూస్ లీ వర్క్అవుట్ ఇలా.. బ్రూస్ లీ వర్క్అవుట్ ప్లాన్ కెవుంగ్ జిమ్నాషియంతో ముడిపడివుంది. దీనిలో అతను ఏ వర్క్అవుట్ ఎన్నిసార్లు, ఎంతసేపు చేసేవాడనే వివరాలు ఉన్నాయి. ఈ వర్క్అవుట్ ప్లాన్ చూసినవారు ఈ రొటీన్ను ఫాలో చేయడం అంత సులభం కాదని వారు చెబుతున్నారు. ట్వీట్ చేసిన ఈ పోస్టులో బ్రూస్ లీకి సంబంధించిన ఒక బ్లాక్ అండ్ వైట్ ఫొటో కనిపిస్తోంది. అతని ట్రైనింగ్ ప్రోగ్రాం వివిధ సోషల్ మీడియా ప్లాట్ఫారాలలో కనిపిస్తోంది. ఈ ప్లాన్ చూసిన వారంతా.. ట్విట్టర్పై ఈ పోస్టును ‘వరల్డ్ ఆఫ్ హిస్టరీ’(@UmarBzv) పేరు గల పేజీలో షేర్ చేశారు. దానికి 1965లో బ్రూస్ లీ ఎర్లీ ట్రైనింగ్ ప్లాన్ అనే కామెంట్ రాశారు. ఈ పోస్టుకు 8 మిలియన్లకుపైగా వ్యూస్ దక్కాయి. 70 వేలకుపైగా లైక్స్ పడ్డాయి. ఈ వర్క్అవుట్ ప్లాన్ చూసినవారంతా తెగ ఆశ్చర్యపోతూ, దీనిని ఫాలో చేయడం అసాధ్యమంటూ కామెంట్లు చేస్తున్నారు. ఒక యూజర్.. బ్రూస్ లీ వర్క్అవుట్ ప్లాన్ను పరిశీలించి ఈ ప్లాన్ పూర్తి చేసేందుకు 2 గంటల సమయం పడుతుందని లెక్కవేశారు. ఇది కూడా చదవండి: ఈ 8 రైల్వే స్టేషన్లు బ్రిటీష్ కాలం నాటివి.. ఇప్పుడెలా ఉన్నాయో తెలిస్తే.. -
అదొక్కటే! ఎన్నో వ్యాయామాలకు సరిసాటి..
వ్యాయామం చేయడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయనే విషయం అందరికీ తెలుసు. అయితే అందరికీ వ్యాయామం చేయడం కుదరకపోవచ్చు. కొందరికైతే కనీసం వాకింగ్ చేయడం కూడా కష్టమే అవుతుంటుంది వారున్న పరిస్థితులలో. అలాంటప్పుడు కనీసం ఇండోర్ సైక్లింగ్ లేదా స్టేషనరీ సైకిల్తో వ్యాయామం చేసినా ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఇండోర్ సైక్లింగ్ వల్ల ఏయే ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో చూద్దాం.. ఇండోర్ సైక్లింగ్ శరీరాన్ని ఫిట్ గా ఉంచడమే కాకుండా గుండె జబ్బుల ముప్పును కూడా తగ్గిస్తుంది ఇండోర్ సైక్లింగ్ శారీరక, మానసిక ఆరోగ్యానికి ప్రయోజనకరంగా ఉంటుంది. ఇండోర్ సైక్లింగ్ ఎన్నో రోగాల ముప్పు నుంచి కాపాడుతుంది. ఏరోబిక్ సామర్థ్యాన్ని కూడా పెంచుతుంది. అలాగే హృదయ స్పందన రేటును పెంచుతుంది. ఇది మీ గుండె కండరాలను బలోపేతం చేయడానికి, శరీరంలోకి రక్తాన్ని సమర్థవంతంగా పంప్ చేయడానికి సహాయపడుతుంది. ఈ వ్యాయామాన్ని స్థిరంగా చేయడం వల్ల రక్త ప్రసరణ, ఊపిరితిత్తుల సామర్థ్యం మెరుగుపడుతుంది. దీంతో అధిక రక్తపోటు పోటు సమస్యలు రావు. గుండె జబ్బుల ప్రమాదం కూడా తగ్గుతుంది. మెటబాలిజాన్ని పెంచుతుంది ఏ రకమైన కదలిక అయినా సరే శరీరానికి ఎంతో మంచి చేస్తుంది. సైక్లింగ్ ఎఫెక్టీవ్ కేలరీల బర్నింగ్ వ్యాయామం. సైక్లింగ్ తో బెల్లీ ఫ్యాట్ ను తగ్గించుకోవచ్చు. హార్వర్డ్ మెడికల్ స్కూల్ ప్రకారం.. 70 కిలోల బరువున్న వ్యక్తి ఇండోర్ సైక్లింగ్ వల్ల 250 నిమిషాల్లో 30 కేలరీలను కరిగించగలడు. అందుకే మీరు బరువు తగ్గాలనుకుంటే జిమ్ముకు బదులుగా ఇంట్లో ఉండి ఇండోర్ సైక్లింగ్ చేస్తే సరి! అంతేకాదు ఈ సైకిల్ను తొక్కడం వల్ల మీ కాలి కదలికలు మెరుగుపడతాయి. ఫలితంగా కాళ్లలోని కండరాల సమూహాలు – క్వాడ్రిసెప్స్, గ్లూట్స్, తొడ కండరాలు కాలక్రమేణా బలంగా, టోన్ అయ్యేలా చేస్తాయి. ఇండోర్ సైక్లింగ్ మీ కీళ్లకు మంచిది ఇండోర్ సైక్లింగ్ ప్రభావవంతమైన తక్కువ–ప్రభావ వ్యాయామంగా పరిగణించబడుతుంది. ఇది వృద్ధులకు, మోకాలి, కీళ్ల నొప్పులు ఉన్నవారికి బాగా సహాయపడుతుంది. ఇది కీళ్లపై తక్కువ ఒత్తిడిని కలిగిస్తుంది. మోకాలి సమస్య లేదా వెన్నునొప్పి ఉన్నవారు ఇండోర్ సైక్లింగ్కు ముుందు డాక్టర్తో మాట్లాడాలి. వైద్యుడి సలహా మేరకే ఈ సైకిల్ను తొక్కాలి. ఒత్తిడిని తగ్గిస్తుంది ఇండోర్ సైక్లింగ్ మానసిక ఆరోగ్య ప్రయోజనాలను కూడా కలిగిస్తుంది. ఏదో ఒక రూపంలో శారీరకంగా చురుకుగా ఉండటం వల్ల మీ శరీరం ఎండార్ఫిన్లు అని పిలువబడే ఫీల్–గుడ్ హార్మోన్లను విడుదల చేస్తుంది. çకొన్ని అధ్యయనాల ప్రకారం.. సైక్లింగ్ డోపామైన్, సెరోటోనిన్ ను కూడా పెంచుతుంది. ఫలితంగా మీ మానసిక స్థితి మెరుగ్గా ఉంటుంది. ఒత్తిడి స్థాయులు కూడా తగ్గుతాయి. శక్తి సామర్థ్యాలను పెంచుతుంది ఇండోర్ సైక్లింగ్ మీ స్టామినాను పెంచడానికి కూడా సహాయపడుతుంది. దీన్ని రెగ్యులర్ గా తొక్కుతుంటే క్రమంగా అలసట తగ్గి రోజువారీ కార్యకలాపాలను నిర్వహించడానికి, ఇతర వ్యాయామాలలో పాల్గొనడానికి ఎక్కువ శక్తి, సామర్థ్యాన్ని కలిగి ఉండటానికి సహాయపడుతుంది. (చదవండి: మనిషన్నవాడు ఏమైపోయాడో..ప్రపంచాన్నే దిగ్భ్రాంతికి గురిచేసిన హత్యాకాండలు!) -
వ్యాయామమే మంచి మందు
సాక్షి, అమరావతి: ప్రతి రోజూ అర గంటపాటు నడక, పరుగు, సైక్లింగ్, ఈత.. ఇలా ఏదో ఒకదాన్ని నిత్యకృత్యంగా చేసుకున్నవారు మానసికంగా, శారీరకంగా ఆరోగ్యంగా ఉంటారని వైద్య నిపుణులు చెబుతున్నారు. నిత్యం వ్యాయామాన్ని ఒక అలవాటుగా మార్చుకుంటే చాలా వరకు వ్యాధులను దరి చేరకుండా చూసుకోవచ్చని పేర్కొంటున్నారు. కేవలం శారీరకంగానే కాకుండా మానసిక ఆరోగ్యానికి సైతం వ్యాయామాన్ని మించిన మందు లేదని వివరిస్తున్నారు. ఈ మేరకు అధ్యయనాలు సైతం ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయని అంటున్నారు. మందుల కంటే కూడా వ్యాయామంతోనే 1.5 రెట్లు ఎక్కువ ప్రయోజనం ఉంటుందని స్పష్టం చేస్తున్నారు. శారీరకంగా చురుకుగా ఉంటే విచారం, ఆందోళన, బాధ తదితరాలు తక్కువ స్థాయిలోనే ఉంటాయని పేర్కొంటున్నారు. ఈ మేరకు సౌత్ ఆ్రస్టేలియా యూనివర్సిటీ పరిశోధకులు ఓ అధ్యయనం నిర్వహించారు. ఇందులో భాగంగా 1.28 లక్షల మందిని పరిశీలించారు. ఆయా మానసిక సమస్యలను అధిగమించడానికి మందులు, కౌన్సెలింగ్ కంటే కూడా శారీరక శ్రమ చేస్తే 1.5 రెట్లు ఎక్కువ ప్రభావవంతంగా ఉంటోందని వెల్లడించారు. ఈ అధ్యయనం ఆధారంగా గుర్తించిన అంశాలను బ్రిటిష్ జర్నల్ ఆఫ్ స్పోర్ట్స్ మెడిసిన్లో తాజాగా ప్రచురించారు. మానసిక ఆరోగ్యంపై సానుకూల ప్రభావం పరిశోధకులు తమ అధ్యయనంలో భాగంగా దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు, గర్భిణులు, నిరాశ, ఆందోళన, ఆత్మన్యూనతతో బాధపడేవారిని పరిశీలించారు. ఈ క్రమంలో శారీరక శ్రమ/వ్యాయామం చేసేవారిలో నిరాశ, ఒత్తిడి, ఆందోళన వంటివి తగ్గుముఖం పట్టాయని గుర్తించారు. తీవ్ర డిప్రెషన్తో బాధపడుతున్న గర్భిణులు, హెచ్ఐవీ, కిడ్నీ వ్యాధిగ్రస్తులు వ్యాయామంతో ఎక్కువ ప్రయోజనాలు పొందుతున్నట్టు స్పష్టమైంది. ప్రతి ఎనిమిది మందిలో ఒకరు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఎనిమిది మందిలో ఒకరు మానసిక రుగ్మతతో బాధపడుతున్నారు. దీంతో మానసిక ఆరోగ్య సంరక్షణకు ప్రపంచవ్యాప్తంగా ఏటా దాదాపు 2.5 ట్రిలియన్ డాలర్ల వ్యయం చేస్తున్నారు. ఈ వ్యయం 2030 నాటికి 6 ట్రిలియన్ డాలర్లకు పెరుగుతుందని అంచనా. మంచి హార్మోన్లు పెరుగుతాయి నడక, వ్యాయామం, పరుగు, ఏరోబిక్స్ వంటివాటితో శరీరానికి మంచి చేసే హార్మోన్లు విడుదల అవుతాయని నిపుణులు చెబుతున్నారు. ఈ వ్యాయామం వల్ల శరీరంలోని అడ్రినాలిన్, కార్టిసాల్ వంటి ఒత్తిడి హార్మోన్ల స్థాయిలు తగ్గుతాయని పేర్కొంటున్నారు. శారీరక శ్రమ ఒత్తిడిని తగ్గించే ఎండారి్ఫన్ల ఉత్పత్తిని ప్రేరేపిస్తుందని అంటున్నారు. రోజూ అరగంట చేసినా మంచి ఫలితాలు.. ప్రస్తుతం అన్ని వయసులవారు తీవ్ర ఒత్తిడితో కూడిన జీవితాన్ని గడుపుతున్నారు. ఈ క్రమంలో రోజూ కనీసం అరగంట పాటు నడక, స్విమ్మింగ్, రన్నింగ్, సైక్లింగ్, జాగింగ్, డ్యాన్సింగ్, ఏరోబిక్స్ వంటి వాటికి సమయం కేటాయించాలి. ఈ వ్యాయామం బీపీ, షుగర్, ఊబకాయం వంటివి రాకుండా శారీరక, మానసిక ఆరోగ్యాలకు మేలు చేకూరుస్తుంది. రోజూ శారీరక శ్రమ చేయడం వల్ల శరీరంలో మంచి హార్మోన్ల ఉత్పత్తి పెరుగుతుంది. ఒత్తిడి, నిరాశ, ఆందోళనల నుంచి దూరం కావచ్చు. – డాక్టర్ రాధికారెడ్డి, రిజిస్ట్రార్, డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్య విశ్వవిద్యాలయం, విజయవాడ -
వ్యాయామం చేసి వచ్చాక.. గుండెపోటుతో యువకుడి మృతి
సాక్షి, మహబూబ్నగర్: మహబూబ్నగర్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. రామయ్యబౌళికి చెందిన సయ్యద్ మజిద్ హుస్సేన్ అలియాస్ జునేద్ (26) గురువారం రాత్రి జిమ్లో కొంతసేపు వ్యాయామం చేశాడు. అక్కడి నుంచి స్నూకర్ ఆడడానికి వెళ్లి తిరిగి ఇంటికి వచ్చాడు. రాత్రి 11:30 గంటల సమయంలో ఛాతీలో నొప్పి వచ్చింది. వాంతులు కూడా చేసుకున్నాడు. సాధారణమైనదేనని భావించి ఇంటి ముందు వాకింగ్ చేయటం ప్రారంభించాడు. ఈక్రమంలో తీవ్ర గుండెపోటు వచ్చి అక్కడే కుప్పకూలిపోయాడు. వెంటనే కుటుంబసభ్యులు ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లగా వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. కరోనా తర్వాత పోస్ట్కోవిడ్ సోకిన బాధితులతో పాటు ఇతరులకు సైతం ఇటీవల గుండెపోటు పెరిగాయి. సడెన్ కార్డియాక్ ద్వారా పలువురు మృతి చెందడం ఆందోళన కలిగిస్తుంది. ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల్లో గుండె జబ్బులతో రోగులు బారులు తీరుతున్నారు. ముందస్తుగా గుర్తించడం ఎలా? సాధారణంగా గుండెపోటు వచ్చే వాళ్లకు కొన్ని లక్షణాలు కన్పిస్తుంటాయి. ప్రధానంగా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ఊపిరాడక పోవడం, గుండె బరువు అనిపించడం, నీరసం, చెమటలు రావడం, చేతులు లాగడం వంటివి అనిపించినప్పుడు ఆలస్యం చేయకుండా వైద్యుడిని సంప్రదించాలి. ముందస్తు చికిత్స తీసుకుంటే కార్డియాక్ అరెస్టు నుంచి బయటపడేందుకు అవకాశం ఉంది. దెబ్బకొడుతున్న జీవన శైలి గతంతో పోలిస్తే ప్రస్తుతం అన్ని వర్గాల వ్యక్తులు విపరీతమైన ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. ఉదయం లేచింది మొదలు ఉరుకులు పరుగుల జీవనం తప్పడం లేదు. సరైన ప్రణాళిక లేక వృత్తి, వ్యక్తిగత జీవితంలో ఒత్తిడితో సతమతం అవుతున్న పరిస్థితి ఉంది. కొన్ని రకాల ఉద్యోగాల్లో లక్ష్యాలు ఉంటాయి. అందుకోవడానికి పరుగులు పెట్టాల్సిందే. వేళకు తిండి తినరు. తిన్నా జంక్ఫుడ్ అలవాటు పడుతున్నారు. కొందరైతే చెడు అలవాట్లకు బానిసలు అవుతున్నారు. చివరికి తీవ్ర అనారోగ్య సమస్యలను కొని తెచ్చుకుంటున్నారు. చిన్న వయస్సులోనే హృద్రోగ ముప్పు తలెత్తుతోంది. వారంలో 4–5రోజులు బయటే తింటున్నారు. ఈ ఆహారంలో రుచికోసం అధిక మసాలాలు, నూనెలు వాడుతుంటారు. తరచూ ఇవి తినడంతో అధిక కేలరీలు శరీరంలోకి చేరుతాయి. అందుకు తగినట్లు వ్యాయామం లేకపోవడంతో ఊబకాయులుగా మారి చివరకు ఆ ప్రభావం గుండైపె చూపుతుంది. -
చిన్నవయసులోనే గుండెపోటు సంఘటనలు ఎందుకు?
గుండెపోటు విషయంలో ఇటీవలి కొన్ని అధ్యయనాల్లో తెలిసి వచ్చిన అంశం ఏమిటంటే... ఇది పెద్దవారిలో మాత్రమే కాదు... టీనేజర్లలో... ఆ మాటకొస్తే చిన్నారుల్లో సైతం కనిపిస్తుందని తేలింది. క్రమబద్ధమైన రీతిలో వ్యాయామం చేస్తూ, శిక్షణ పొందే యువ అథ్లెట్లలో సైతం గుండెపోట్లు కనిపించాయి. ఫిఫా (ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ అసోసియేషన్ ఫుట్బాల్) రిజిస్ట్రీలో సైతం 2014 నుంచి 2018 మధ్యకాలంలో 617 మంది యువ అథ్లెట్లు గుండెపోటుతో కుప్పకూలిన దాఖలాలున్నాయి. అంతేకాదు... మనదేశంలో సైతం చాలా పెద్ద సెలబ్రిటీలు మొదలుకుని... మన వీధిలో మనకు తెలిసిన వారిలో అకస్మాత్తు గుండెపోట్లు కనిపించడం, వారు హఠాత్తుగా మరణించడం చాలా ఎక్కువగా కలవరపరిచే విషయాలే. అతి చిన్న వయసులోనే ఎందుకిలా గుండెపోట్లు? అతి చిన్నవయసులో గుండెపోట్లు కనిపించడానికి కొన్ని అండర్లైయింగ్ ఫ్యాక్టర్స్ దోహదపడుతున్నట్లు వెల్లడైంది. ♦ కుటుంబ చరిత్రలోనే చిన్నవయసులో గుండెపోటు సంఘటనలు ఉండటం. ♦ గుండె నిర్మాణంలోనే పుట్టుకతో తేడాలు ఉండటం. ♦ గుండెలో లయబద్ధంగా కొట్టుకోడానికి నిత్యం ఒకే రీతిలో విడుదలయ్యే ఎలక్ట్రిసిటీ కావాలి. అది సయనో ఏట్రియల్ నోడ్ అనే గుండెలోని ఓ కేంద్రం నుంచి వెలువడుతుంది. ఈ కరెంటు వెలువడటంలోని తేడాలు (అబ్నార్మాలిటీస్) కూడా ఇలా యువత అకస్మాత్తు మరణాలకు ఒక కారణమని అధ్యయనాల్లో తేలింది. కోవిడ్ నష్టాలూ కొంతవరకు కారణం... ఎలాగంటే...? కోవిడ్ అనంతరం వచ్చే కొన్ని సమస్యలు సైతం గుండెపోటుకు కారణమని కొన్ని అధ్యయనాల్లో తేలింది. గుండె కండరానికి ఇన్ఫ్లమేషన్ తెచ్చిపెట్టే ‘మయోకార్డయిటిస్ ’ సమస్య ఇందుకు ఓ ఉదాహరణ. ఛాతీలో నొప్పి, శ్వాస తగినంతగా అందకపోవడం వంటి లక్షణాలతో కనిపించే మయోకార్డయిటిస్ అన్నది అటు తర్వాత గుండె క్రమబద్ధంగా కొట్టుకునే లయను దెబ్బతీసేలా ‘అరిథ్మియాస్’, హార్ట్ఫెయిల్యూర్లతోపాటు మరికొన్ని ఇతర గుండె సంబంధిత సమస్యలకు దారితీసే అవకాశం ఉంది. ఇదొక్కటే కాదు... కోవిడ్ తర్వాత చాలామందిని పరిశీలించినప్పుడు వారి రక్తప్రసరణ వ్యవస్థలో / రక్తనాళాల్లో రక్తపు ఉండలు (క్లాట్స్) పెరగడం మరో అంశం. ఈ క్లాట్స్ ప్రధాన ధమనుల్లో వచ్చినప్పుడు, గుండెకు తగినంతగా పోషకాలు, ఆక్సిజన్ అందకుండా అడ్డుపడతాయి. ఇవి కూడా యువతలో గుండెపోట్లకు కారణం. ♦ ఇటీవల యువతలో మానసిక ఒత్తిడి ఎక్కువగా పెరిగిపోయింది. ఆదుర్దా పడటం, ఆందోళన చెందడం వంటి అంశాలు యాంగ్జైట్ టీకి దారితీస్తున్నాయి. దీనికి తోడు వైరస్ అనంతర పరిణామాల్లో సామాజిక సమస్యలుగా పరిగణించే ఉపాధి కోల్పోవడం, ఆర్థికంగా దెబ్బతినడం వంటి అంశాలూ యువతలో ఒత్తిడికి కారణమవుతున్నాయి. ఈ ఒత్తిడి అధిక రక్తపోటుకూ, గుండె వేగం పెరుగుదలకూ, గుండె లయ మార్పుచెందడానికి దోహదపడుతున్నాయి. ఇవన్నీ గుండె, రక్తప్రసరణ వ్యవస్థ ఆరోగ్యాన్ని దెబ్బతీయడం ద్వారా యువతలో చాలా చిన్నవయసులోనే గుండెపోట్లకు దారితీస్తున్నాయి. ♦ దీనికి తోడు అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, వ్యాయామం లేకపోవడం వంటి అంశాలూ,ఇంకా కొనసాగుతున్న వర్క్ఫ్రమ్ హోమ్ వంటి పని అలవాట్లు యువతలో వ్యాయామలేమిని పెంచడంతో పాటు... రాత్రి తగినంతగా నిద్రలేకుండా పనిచేయడాన్ని పెంపొందిస్తున్నాయి. ఈ నిద్రలేమి కూడా యువతలో గుండెపోట్లకు ఓ ప్రధాన కారణమే. ♦ వీటన్నింటికి తోడు మనలో ఒత్తిడినీ, యాంగ్జైట్ టీని పెంచే మరో అంశం కూడా ఉంది. నిజానికి తగిన సమయానికి కోవిడ్ వ్యాక్సిన్ రావడం వల్ల చాలా మరణాలు నివారితమయ్యాయి. పెద్దసంఖ్యలో జనం రక్షణ పొందారు. కానీ ఇటీవల పెరిగిన గుండెపోట్లను వ్యాక్సిన్తో ముడిపెడుతూ చాలా వదంతులు వెలువడుతున్నాయి. మానసిక ఒత్తిడిని పెంచడానికి ఇవీ కారణమవుతున్నాయి. నిజానికి ఈ గుండెపోట్లకూ, వ్యాక్సిన్ కూ సంబంధం ఉన్నట్లుగా ఏ విధమైన ఆధారాలూ ఇప్పటివరకు వెలువడలేదు. వీటిపై ఇంకా పరిశోధనలు జరగాల్సి ఉంది. ♦ గుండెపోటుతో మృతి చెందినవారిలో నిర్దిష్ట కారణాలు కనుగొనేందుకు పోస్ట్మార్టమ్ అవసరం. యుక్తవయసు గుండెపోట్లను నివారించాలంటే...? ♦ ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించేలా ప్రజల్లో అవగాహన కల్పించాలి. క్రమంతప్పకుండా అలాగే శరీరానికి మితిమీరిన శ్రమకలిగించకుండా చేసే వ్యాయామాలు, మంచి ఆహారపు అలవాట్లు, పొగతాగడం, మద్యం వంటి అలవాట్ల నుంచి దూరంగా ఉండడంపై ప్రజల్లో అవగాహన పెంచాలి. నష్టనివారణ కోసం ఎలాంటి పరీక్షలు అవసరమంటే...? ఇటీవల హఠాత్తుగా గుండెపోట్ల పెరుగుదల అన్నది ఇటు డాక్టర్లను, అటు సామాజికవేత్తలనూ బెంబేలెత్తిస్తోంది. దేశ ఆర్థికాభివృద్ధి, పురోగతికి కారణమైన యువత ఇలా అకస్మాత్తుగా మృతి చెందడం కుటుంబాలకే కాదు, దేశానికీ నష్టమే. అందుకే గుండెపోటు మరణాల పట్ల తగినంత అవగాహన, విషయపరిజ్ఞానం, మున్ముందు రాబోయే ఇక్కట్ల నుంచి తమను రక్షించుకునేలా చేయించుకోవాల్సిన తగిన వైద్యపరీక్షల వంటి అంశాల్లో నివారణ ప్రణాళికలు రచించుకోవాల్సిన అవసరం ఉంది. చిన్న వయసువారైనప్పటికీ, తమలో రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నవారు తప్పనిసరిగా గుండె పరీక్షలు అంటే... ఈసీజీ, 2డీ ఎకో, ట్రెడ్మిల్ టెస్ట్ వంటివి డాక్టర్లు చెప్పిన విధంగా తగిన ఇంటర్వెల్స్లో చేయించుకోవాలి. ఇవేగాక ప్రాథమిక పరీక్షలైన బీపీ చెక్ అప్, కొలెస్ట్రాల్ స్థాయుల్ని తెలిపే రక్త పరీక్షలు, చక్కెర మోతాదు పరీక్షలు చేయించుకుని, డాక్టర్లు చెప్పిన విధంగా మందులు, జాగ్రత్తలు తీసుకోవాలి. ♦ ప్రాణాలను కాపాడే సీపీఆర్ (కార్డియో పల్మునరీ రిససియేషన్)వంటివి అందరూ నేర్చుకోవాలి. దీనివల్ల అకస్మాత్తు గుండెపోటు మరణాలను చాలావరకు నివారించవచ్చు. ఈ సీపీఆర్పై సాధారణ ప్రజలందరికీ శిక్షణ ఇవ్వాలి. ♦ ఇక ప్రజలు ఎక్కువగా తిరగాడే కొన్ని కీలకమైన ప్రదేశాల్లో, కూడళ్లలో, సెంటర్లలో డీ–ఫిబ్రిలేటర్లను (ఆగిపోయిన గుండెను మళ్లీ స్పందించేలా చేసే ఉపకరణాలు) అమర్చాలి. గుండెపోటు ముప్పును తెచ్చిపెట్టే అంశాలేమిటంటే? మన దేశంలోని యువతలో ఇటీవల ఆహారపు అలవాట్లలో వచ్చిన మార్పులు, కొవ్వు పదార్థాల వినియోగంలో పెరుగుదల... ఫలితంగా బరువు పెరగడం ఓ ప్రధాన ముప్పు. ♦ చాలా తక్కువ వయసులోనే గుండెపోటు ముప్పునకు కారణమయ్యే స్థూలకాయం, హైబీపీ (హైపర్టెన్షన్), మధుమేహం (డయాబెటిస్) పెరుగుదల కూడా మరో కారణం. ఒకప్పుడు ఈ తరహా జీవనశైలి సమస్యలు చాలా పెద్ద వయసువారిలోనే కనిపించేవి. కానీ ఇటీవల ఇవి చిన్నవయసు వారిలోనూ వస్తున్నట్లే... దీని చిట్టచివరి ప్రమాదకరమైన ఫలితమైన గుండెపోట్లూ యువతలో పెరుగుతున్నాయి. ♦ ఇటీవల యువత చేపడుతున్న వృత్తులన్నింటిలోనూ కదలకుండా కూర్చుని చేసే పనులే ఎక్కువగా ఉంటున్నాయి. కనీస కదలికలు కూడా కొరవడటం (సెడెంటరీ) అనే జీవనశైలి వల్ల ఈ ముప్పు యువతలో మరింతగా పెరుగుతోంది. ♦ ఈ అంశాలన్నీ కలగలసి చాలా చిన్నవయసులోనే గుండెపోటు ముప్పును తెచ్చిపెడుతున్నాయి. - డా. ఎంఎస్ఎస్ ముఖర్జీ, సీనియర్ కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్ -
వద్దు‘లే..జీ’ నడవటం ఈజీ.. మరణాలకు నాలుగో ప్రధాన కారణం ఏంటో తెలుసా?
తాగి డ్రైవింగ్ చేయడం.. అతి వేగంతో వాహనాలు నడపటం.. సిగరెట్లు తాగడం వంటివి ఎలా ప్రాణాంతకమవుతాయో.. రోజంతా మంచంపై కూర్చోవడం.. ఎలాంటి కదలికలు లేకుండా ఉండటం కూడా అంతే ప్రాణాంతకమని మీకు తెలుసా. సోమరితనం మీ విలువైన కాలంతోపాటు మీ ఆరోగ్యాన్ని కూడా నాశనం చేస్తుంది. శరీరానికి తగినంత వ్యాయామం చేయకపోతే అకాల మరణాలు సంభవించే అవకాశాలు 500 రెట్లు అధికమని ‘ది లాన్సెట్’లో ప్రచురించిన ఓ అధ్యయనం స్పష్టం చేసింది. నడక లేదా పరుగు వంటి సాధారణ వ్యాయామాలు చేయడానికి కూడా తీరిక లేని వ్యక్తి వ్యాధులను ఆహ్వానిస్తాడని వెల్లడించింది. సాక్షి, అమరావతి: బడి ఈడు పిల్లల నుంచి వృద్ధుల వరకూ ఏ వయసు వారైనా తగినంత శారీరక శ్రమ చేయడం ఆరోగ్యానికి చాలా అవసరం. ఇంటినుంచి అడుగు బయట పెట్టగానే బైక్ లేదా కారెక్కి తుర్రుమని గమ్యస్థానానికి చేరుతున్న వారెందరో ఉన్నారు. ఒక్క క్లిక్తో గుమ్మం వద్దకే అగ్గిపెట్టె నుంచి అన్నిరకాల వస్తువులు వచ్చి చేరుతున్నాయి. దీంతో బద్ధకస్తులు పెరిగిపోతున్నారు. ఫలితంగా దీర్ఘకాలిక వ్యాధులబారిన పడుతున్న వారి సంఖ్య కూడా శరవేగంగా పెరుగుతోంది. ఉరుకుల పరుగుల జీవితంలో నడక, జాగింగ్, స్విమ్మింగ్, సైక్లింగ్, జిమ్ చేయడం లాంటి ఏదో ఒక వ్యాయామం చేసి తీరాలని వైద్యులు సూచిస్తున్నారు. భారం పెరిగిపోతోంది ప్రజలు బద్ధకిస్టులుగా మారడం.. ఆధునిక ఆహారపు అలవాట్ల వల్ల గుండె జబ్బులు, పక్షవాతం, క్యాన్సర్ వంటి నాన్ కమ్యూనికబుల్ (ఎన్సీడీ) వ్యాధులు దేశంలోను, రాష్ట్రంలోనూ విపరీతంగా పెరిగిపోతున్నాయి. దేశంలో 63 శాతం, రాష్ట్రంలో 68 శాతం మరణాలకు ఎన్సీడీ వ్యాధులకు కారణమవుతోంది. ఈ క్రమంలో ఇప్పటికే ఎన్సీడీ నివారణ, నియంత్రణపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. 30 ఏళ్ల పైబడిన వారందరికీ స్క్రీనింగ్ నిర్వహించి.. వారి ఆరోగ్యంపై నిరంతర ఫాలో అప్ను వైద్య శాఖ చేపడుతోంది. రాష్ట్రంలో ఇప్పటివరకూ 2.80 కోట్ల మందికి స్క్రీనింగ్ నిర్వహించగా.. 55.41 లక్షల మందిలో రక్తపోటు లక్షణాలు వెలుగు చూశాయి. వీరిలో 16.28 లక్షల మందిలో సమస్య నిర్ధారణ అయింది. 5.46 లక్షల మంది ప్రస్తుతం చికిత్సలో ఉండగా.. 5.14 లక్షల మందిలో సమస్య అదుపులోనే ఉంది. అదేవిధంగా 53.92 లక్షల మందిలో మధుమేహం సమస్య వెలుగు చూడగా.. 12.29 లక్షల మందికి సమస్య నిర్ధారణ అయింది. వీరిలో 4.17 లక్షల మంది ప్రస్తుతం చికిత్సలో ఉన్నారు. 3.65 లక్షల మందిలో సమస్య అదుపులో ఉంది. ఫ్యామిలీ డాక్టర్ విధానంలో ఎన్సీడీ బాధితులపై వైద్య శాఖ ప్రత్యేక దృష్టి సారిస్తోంది. ప్రజల్లోకి తీసుకుని వెళ్లేలా.. దీర్ఘకాలిక జబ్బుల బారిన పడేవారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతుండటంతో ప్రజలకు శారీరక శ్రమ ఆవశ్యకతను తెలియజేసి.. వారిని నడక, వ్యాయామం ఇతర కార్యకలాపాల వైపు మళ్లించడంపై వైద్య శాఖ దృష్టి సారించింది. ఈ క్రమంలో ప్రైవేట్ విద్యాసంస్థలు, ఎన్జీవోల సహకారాన్ని తీసుకుని వాకింగ్ ట్రాక్లు, గ్రౌండ్లను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రణాళిక రచించారు. పాఠశాల దశలోనే పిల్లల్లో వ్యాయామం, నడక రోజువారీ కార్యకలాపాల్లో భాగంగా చేసేలా చర్యలు తీసుకుంటున్నారు. మరణాలకు నాలుగో ప్రధాన కారణం బద్ధకమే ప్రజలు తగినంత శారీరక శ్రమ చేయకపోవడం మరణాలకు నాలుగో ప్రధాన కారణంగా ఉంటోందని డబ్ల్యూహెచ్వో సైతం హెచ్చరిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా నమోదవుతున్న మరణాలకు నాలుగు ప్రధాన కారణాలను పరిశీలిస్తే అధిక రక్తపోటు మొదటి స్థానంలో ఉంది. ఆ తరువాత స్థానాల్లో పొగాకు వినియోగం, మధుమేహం, శారీరక శ్రమ చేయకపోవడం వంటివి ఉంటున్నాయి. తగినంత శారీరక శ్రమ లేకపోవడంతో ప్రజలు దీర్ఘకాలిక జబ్బులైన మధుమేహం, రక్తపోటు, పక్షవాతం, క్యాన్సర్, గుండె సమస్యలు, మానసిక రుగ్మతల బారిన పడుతున్నారు. వీటిని నయం చేసుకోవడానికి ఏటా రూ.25 వేల కోట్ల మేర ఖర్చవుతోందని, పదేళ్లలో ఈ ఖర్చు రూ.2.50 లక్షల కోట్లకు చేరే అవకాశం ఉందని గత ఏడాది ఓ నివేదికలో డబ్ల్యూహెచ్వో స్పష్టం చేసింది. పట్టణీకరణ పెరుగుదల, రవాణా సౌకర్యంలో మార్పులు, అవుట్డోర్ పార్కులు, వాకింగ్ ట్రాక్లు అందుబాటులో లేకపోవడం, శారీరక శ్రమ ఆవశ్య కతపై అవగాహన లేకపోవడం వంటి కారణాలు ప్రజలను బద్ధకిస్టులుగా మార్చుతున్నాయి. ఇప్పటికే సమావేశం నిర్వహించాం ప్రజలకు వాకింగ్ చేయడానికి వీలుగా మైదానాలను అందుబాటులోకి తీసుకురావడం కోసం ప్రైవేట్ విద్యాసంస్థల యాజమాన్యాలతో ఇప్పటికే సమావేశం నిర్వహించాం. తమ గ్రౌండ్లను ఉదయం, సాయంత్రం ప్రజలకు అందుబాటులో ఉంచాలని కోరాం. వివిధ శాఖలను సమన్వయం చేసుకుని ప్రజల రోజువారి దినచర్యలో వాకింగ్, జాగింగ్, వ్యాయామం, ఇతర శారీరక శ్రమ కార్య కలాపాలను భాగం చేసేలా కార్యక్రమాలు చేపడతాం. – జె.నివాస్, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ కమిషనర్ మార్పు రావాలి పాశ్చాత్య జీవన విధానానికి ప్రజలు అలవాటు పడ్డారు. ఈ క్రమంలో అలవాట్లలో మార్పు రావాలి. మన పూర్వీకుల జీవన విధానాల్లోకి మనం వెళ్లాలి. రోజుకు కనీసం 30 నిమిషాలు నడక, వ్యాయామం, ఈత ఇలా ఏదో ఒక శారీరక శ్రమ చేయాలి. తద్వారా మానసిక ప్రశాంతత లభిస్తుంది. గుండె, ఊపిరితిత్తుల పనితీరు మెరుగుప డుతుంది. ఊబకాయం నుంచి బయటపడొచ్చు. – డాక్టర్ ప్రభాకర్రెడ్డి, డిప్యూటీ సూపరింటెండెంట్, కర్నూలు జీజీహెచ్