-
సీఐ నారాయణస్వామిపై ఈసీ చర్యలు
-
సీఐ నారాయణస్వామిపై ఈసీ చర్యలు
గుంటూరు/పల్నాడు, సాక్షి: ఎమ్మెల్యే పిన్నెల్లి పిటిషన్ ఎఫెక్ట్.. ఆపై హైకోర్టు ఆదేశాలతో రాష్ట్ర ఎన్నికల సంఘం ఎట్టకేలకు కదిలింది. కారంపూడి సీఐ నారాయణస్వామిని విధుల నుంచి తప్పించింది.తప్పుడు కేసులతో వేధిస్తున్నారంటూ నారాయణ స్వామితో పాటు ఇద్దరు పోలీస్ అధికారులపై మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన విచారణలో భాగంగా చర్యలు చేపట్టాలని సీఈవోకు ఏపీ హైకోర్టు ఆదేశించింది.దీంతో కోర్టు ఆదేశాల మేరకు ఈసీ సీఐ నారాయణ స్వామిని తప్పించింది. అంతేకాదు.. నారాయణ స్వామిపై సిట్ విచారణకు ఆదేశించారు ఏపీ ఎన్నికల సంఘం ప్రధానాధికారి ఎంకే మీనా. ఆధారాలు సమర్పిస్తే ఇతర అధికారులపైనా విచారణ చేపడతామని ఆయన అంటున్నారు. -
పోస్టల్ బ్యాలెట్ చెల్లుబాటుపై ఈసీ కొత్త నిబంధనలు ఎందుకు ?
-
పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ పై అనుమానాలు
-
CEO జారీ చేసిన మెమోను ఉపసంహరించుకున్నట్లు హైకోర్టుకు తెలిపిన CEC
-
పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్..ఈసీ డబుల్ గేమ్
-
సీఈఓ మెమోపై భారీ ట్విస్ట్
-
ఎన్నికల కమిషన్ పై న్యాయ పోరాటం
-
Big Question: అడ్డదారిలో గెలవటానికి బాబు కుట్ర..అడ్డంగా దొరికిన ఈసీ
-
ఈసీకి చంద్రబాబు వైరస్
-
ఆ నిబంధనలను ఈసీ ఉపసంహరించుకోవాలి: వైఎస్సార్సీపీ
సాక్షి, గుంటూరు: అడిషనల్ సీఈవోను వైఎస్సార్సీపీ నేతలు పేర్ని నాని, మేరుగు నాగార్జున, లేళ్ల అప్పిరెడ్డి కలిశారు. పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు సడలింపు నిబంధనలపై వైఎస్సార్సీపీ ఫిర్యాదు చేసింది.అనంతరం మీడియాతో మాజీ మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ, ‘‘అన్ని రాష్ట్రాలకు పోస్టల్ బ్యాలెట్ లెక్కింపుపై గతంలో నిబంధనలు పంపారు. పోస్టల్ బ్యాలెట్ కవర్లు, 13ఏ, 13 బీ నిబంధనలు చెప్పారు. గెజిటెడ్ అధికారం సంతకం పెట్టి స్టాంప్ వేయాలని గతంలో చెప్పారు. స్టాంప్ లేకపోయినా చేతితో రాసినా ఆమోదించాలని గతంలో చెప్పారు. ఇప్పుడు కొత్తగా స్టాంప్ వేయకపోయినా సరే ఆమోదించాలని అంటున్నారు’’ అని పేర్ని నాని నాని అభ్యంతరం వ్యక్తం చేశారు. దేశంలో ఎక్కడా లేనిది ఇక్కడే ఎందుకు తీసుకొచ్చారని ఆయన ప్రశ్నించారు.‘‘ఈసీ ఇచ్చిన ఆదేశాలు గొడవలకు దారి తీసే అవకాశం ఉంది. ఈసీ నిబంధనలు వలన ఓటు రహస్యత ఉండదు. ఏజెంట్లు అభ్యంతరం తెలిపితే ఘర్షణలకు దారి తీస్తుంది. ఎన్నికల కమిషన్ ఆఫ్ ఇండియా చెప్పని నిబంధనలను ఎలా అమాలు చేస్తారు అని అడిగాం. ఈ నిబంధనల పై పునరాలోచించాలి అని కోరాం’’ అని పేర్ని నాని వివరించారు.మంత్రి మేరుగ నాగార్జున మాట్లాడుతూ, ‘‘చంద్రబాబు ఎన్నికల్లో అలజడులు సృష్టించారు. పేదల పైన టీడీపీ నేతలు దాడులు చేస్తే ఎన్నికల కమిషన్, టీడీపీ నేతలు చర్యలు తీసుకోలేదు. ఆఖరికి ఈసీఐ నిబంధనలని కూడా ఏపీలో మార్చేస్తున్నారు. పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు విషయంలో ఈసీఐకి విరుద్ధంగా సీఈఓ ఆదేశాలు ఇవ్వడం ఏంటి..? వెంటనే ఆ నిబంధనలను ఉపసంహరించుకోవాలి. స్పెసిమెన్ సంతకం ద్వారా ఆమోదించడం సమంజసం కాదు. పోలింగ్ రోజున అక్రమాలకు టీడీపీ పాల్పడింది. ఇప్పుడు లెక్కింపు సక్రమంగా జరగకూడదు అన్నది టీడీపీ కుట్ర’’ అంటూ మండిపడ్డారు. -
బెంగాల్ గవర్నర్పై ఈసీకి టీఎంసీ ఫిర్యాదు
కోల్కతా: లోక్సభ ఎన్నికల వేళ తృణమూల్ కాంగ్రెస్ పార్టీ (టీఎంసీ) రాష్ట్ర గవర్నర్ సీఏ ఆనంద బోస్పై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. లోక్సభ ఎన్నికల్లో గవర్నర్ బీజేపీకి కోసం ప్రచారం చేస్తున్నారని టీఎంసీ ఆరోపణలు చేసింది. ఆయన కోల్కతాలోని ఓ రామాలయంలో జరిగిన కార్యక్రమానికి హాజరయ్యారు. ఆ సమయంలో గవర్నర్ తన ఛాతికి ‘బీజేపీ లోగో’ ధరించారని టీఎంసీ పేర్కొంది. ఇలా గవర్నర్ బీజేపీ లోగో ధరించటం వల్ల ఓటర్లు ప్రభావితం అవుతారని తెలిపింది.లోక్సభ ఎన్నికల కోసం గవర్నర్ బీజేపీ ప్రచారం చేస్తున్నారని టీఎంసీ ఎన్నికల సంఘానికి ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. రాష్ట్రపతి నియమించిన గవర్నర్కు రాజకీయ సిద్ధాంతాలు, ఆలోచనలు ఉండకూడదని టీఎంసీ ఈసీ దృష్టికి తీసుకువెళ్లింది. ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకోవటం మానేయాలని గవర్నర్కు ఆదేశించాలని పోల్ ప్యానెల్కు విజ్ఞప్తి చేసింది. తమ ఫిర్యాదును పరిగణలోకి తీసుకొని గవర్నర్పరై తగిన చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘాన్ని కోరింది. -
ఈసీకి సజ్జల 10 ప్రశ్నలు
-
అసలు వీడియో ఈసీ ఎందుకు దాస్తుంది?
-
టీడీపీపై ఈసీకి వైఎస్సార్సీపీ ఫిర్యాదు
సాక్షి, విజయవాడ: టీడీపీపై ఈసీకి వైఎస్సార్సీపీ బృందం ఫిర్యాదు చేసింది. నాలుగు అంశాలపై వైఎస్సార్సీపీ నేతలు ఫిర్యాదు చేశారు. ఈ సార్వత్రిక ఎన్నికలలో ప్రజలు తమకు ఓటు వేయలేదనే ఉక్రోషంతో.. టీడీపీ రాష్ట్రవ్యాప్తంగా హింసను ప్రోత్సహిస్తోందని ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. తెలుగుదేశం అభ్యర్థులే రోడ్లపైకి వచ్చి దాడులకు తెగబడుతూ.. ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేస్తున్నారని మండిపడ్డారు.‘‘కౌంటింగ్ సమయంలోనూ టీడీపీ అల్లర్లను సృష్టించే అవకాశం ఉంది. శాంతిభద్రతల సమస్య తలెత్తకుండా తగిన చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘాన్ని కోరాము. పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ సమయంలో పాటించవలసిన రూల్స్ను 175 నియోజకవర్గాలలోనూ తూచా తప్పకుంగా పాటించేలా ప్రత్యేక చొరవ తీసుకోవాలని కోరాం’’ మల్లాది విష్ణు అన్నారు.‘‘టీడీపీ అధికారంలో ఉండగా చింతమనేని ప్రభాకర్ చేసిన దారుణాలు అన్నీఇన్నీ కావు. చింతమనేని ప్రభుత్వ అధికారులపైనే దాడులకు తెగబడిన సందర్భాలు చూశాం. తాజాగా పోలింగ్ రోజు దెందులూరులో జరిగిన ఓ దాడి ఘటనలో టీడీపీకి చెందిన రాజశేఖర్ అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చింతమనేని ప్రభాకర్ స్టేషన్ పైనే దాడి చేసి పోలీసులపైన దౌర్జన్యం చేశారు. తక్షణమే చింతమనేనిని అరెస్ట్ చేసి.. ఆయనపై పీడీ యాక్టు కింద కేసు నమోదు చేయాలి’’ మల్లాది విష్ణు డిమాండ్ చేశారు.‘‘టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పోటీ చేస్తున్న టెక్కలి నియోజకవర్గంలో ఆపార్టీ అరాచకాలకు ఓ నిండు ప్రాణం బలైంది. నిమ్మాడ గ్రామంలో టీడీపీ అరాచకాలను అడ్డుకున్న వైఎస్సార్సీపీ బూత్ ఏజంట్ తోట మల్లేష్ ఇంటిపై దాడికి తెగబడి.. అతని చావుకు కారణమయ్యారు. ఘటనకు సంబంధించిన నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని, అచ్చెన్నాయుడిపైనా కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశాం. గురజాల, మాచర్ల, నరసరావుపేట, సత్తెనపల్లి, తాడిపత్రి సహా రాష్ట్రంలో జరిగిన అరాచకాలన్నింటికీ మూలకారణం టీడీపీ పార్టీనే. కానీ సిట్ను తప్పుదోవ పట్టించేలా స్థానిక వైఎస్సార్సీపీ అభ్యర్థులపై ఫిర్యాదులు చేస్తూ గందరగోళపరుస్తున్నారు’’ అని మల్లాది విష్ణు మండిపడ్డారు. -
ఈసీ నిష్పక్షపాతంగా వ్యవహరించిందని ఎలా నమ్మాలి?: సజ్జల
సాక్షి, తాడేపల్లి: ఎన్నికల కమిషన్ పక్షపాత ధోరణితో వ్యవహరించిందని.. టీడీపీ దాడులు చేస్తున్నా.. పోలీసులు పట్టించుకోలేదని వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. బుధవారం ఆయన తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, అసాంఘిక శక్తులు రాజకీయ కక్షతో దాడులు, హింసాకాండ కొనసాగిస్తున్నాయని మండిపడ్డారు.రాజకీయ కక్షతో బడుగు బలహీన వర్గాలపై దాడులకు చేశారు.ఈసీ ఉదాసీనంగా వ్యవహరిస్తోంది. పోలింగ్ సమయంలో టీడీపీ గూండాలు ఎక్కడికక్కడ తెగబడ్డారు.పోలింగ్ సజావుగా జరగకూడదని టీడీపీ దాడులు చేసింది. టీడీపీ దాడులపై డీజీపీకి, ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేశాం’’ అని సజ్జల చెప్పారు.‘‘రిగ్గింగ్ చేయాలనే ఆలోచనతో దాడులకు తెగబడ్డారు. కూటమి నేతలు చెప్పినచోటే పోలీసు అధికారులను మార్చారు. ఈసీ నియమించిన పోలీస్ అధికారులకు రాష్ట్రంపై అవగాహన లేదు. టీడీపీ నేతలు ఇచ్చి పార్టీకి పోలీస్ అబ్జర్వర్ హాజరయ్యారు. పోలింగ్కు ముందే పోలీస్ ఉన్నతాధికారులను మార్చేశారు. ఎక్కడైతే పోలీస్ అధికారులను మార్చారో అక్కడే హింస జరిగింది. ఎన్నికల కమిషన్ నిష్పక్షపాతంగా వ్యవహరించిందని ఎలా నమ్మాలి?’’ అంటూ సజ్జల ప్రశ్నించారు.పోలింగ్ రోజు వైఎస్సార్సీపీ అభ్యర్థులను హౌస్ అరెస్ట్ చేశారు. టీడీపీ అభ్యర్థులు మాత్రం యథేచ్చగా తిరిగారు. గురజాలలో ఓ గుడిలో తలదాచుకున్న దళితులపై దాడులు చేశారు. ఈసీ వైఫల్యం కారణంగానే పల్నాడులో గొడవలు జరిగాయి. వీటన్నిటికి ఎన్నికల కమిషనే బాధ్యత తీసుకోవాలి’’ అని సజ్జల రామకృష్ణారెడ్డి డిమాండ్ చేశారు.‘‘ఎన్నికల సంఘం విధుల్లో కూడా టీడీపీ దూరింది. పురందేశ్వరి ఎవరిపై ఫిర్యాదు చేశారో వారిని బదిలీ చేశారు. వారు కోరిన అధికారులను వేశారు. మొత్తం 29 మంది అధికారులను ఉన్నట్టుండి ట్రాన్సఫర్ చేశారు. విష్ణువర్ధనరావు అనే రిటైర్డ్ ఆఫీసర్ ఇచ్చిన విందుకు పోలీసు అబ్జర్వర్ దీపక్ మిశ్రా వెళ్లారు. విష్ణువర్ధన్ రావు టీడీపీ నేత సుజనాచౌదరికి దగ్గరి మనిషి. అలాంటి వ్యక్తి ఇచ్చిన విందుకు పోలీసు అబ్జర్వర్ వెళ్లితే ఇక ఎన్నికలు ప్రశాంతంగా ఎలా జరుగుతాయి?. టీడీపీ ఆఫీసులో రూపు దిద్దుకున్న ప్లాన్ ని దీపక్ మిశ్రా ద్వారా ఈసీ అమలు చేసింది. రెడ్డి, ఎస్సీ, ఎస్టీ అధికారులు అందరినీ వరుసపెట్టి ట్రాన్సఫర్ చేశారు. ఎవరిపై ఫిర్యాదు వచ్చినా విచారణ చేయకుండానే వెంటనే ట్రాన్సఫర్ చేశారు. ప్రకాశం, పల్నాడు, తాడిపత్రి, తిరుపతిలలో అధికారులను మార్చారు. అక్కడే ఎక్కువ హింస చెలరేగింది’’ అని సజ్జల ధ్వజమెత్తారు.జరుగుతున్న దాడులన్నీ ఒన్ సైడే జరుగుతన్నాయి. మంత్రి అంబటి రాంబాబును అన్యాయంగా హౌస్ అరెస్టు చేశారు. ఎమ్మెల్యే పిన్నెళ్లి రామకృష్ణారెడ్డి కుటుంబంపై దాడులు చేసినా పోలీసులు పట్టించుకోలేదు. వెంటనే పోలీసు అబ్జర్వర్ దీపక్ మిశ్రాని వెంటనే వెనక్కు పిలవాలి. ఎన్నికల కమిషన్ త్వరగా స్పందించి శాంతిభద్రతలను పరిరక్షించాలి. సంక్షేమ పథకాల నిధులను కాంట్రాక్టర్లకు ఇస్తున్నారని ఎల్లోమీడియా తప్పుడు ప్రచారం చేస్తోంది. కౌంటింగ్ సందర్భంగా అల్లర్లు చేసేందుకు కూడా టీడీపీ కుట్రలు పన్నుతోంది. కచ్చితంగా రెండోసారి జగన్ పాలన రాబోతోంది’’ అని సజ్జల చెప్పారు.‘‘సీఎస్, డీజీపీని కేంద్ర ఎన్నికల సంఘం పిలిపించటం అసాధారణం. పోలింగ్ తర్వాత కూడా పరిపాలన జరగకుండా చేయటం ఏంటి?. వీటన్నిటిపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశాం. పురందేశ్వరి ఇచ్చిన లేఖల ప్రకారం ఈసీ పనిచేయటంపై సీఈసీకి ఫిర్యాదు చేస్తాం. పోలీస్ అబ్జర్వర్ దీపక్ మిశ్రాని నియమించటం వెనుక కుట్ర ఉంది. లేకపోతే రిటైర్డ్ ఆఫీసర్ ని పోలీసు అబ్జర్వర్గా నియమించటం ఏంటి?. ఉద్యోగంలో ఉన్న ఆఫీసర్ని నియమిస్తే బాధ్యతతో వ్యవహరిస్తారు. రిటైర్డ్ అధికారిని నియమిస్తే బాధ్యత ఏం ఉంటుంది?’’ అంటూ సజ్జల ప్రశ్నించారు. -
ఈసీ బదిలీ చేసిన చోటే ఈ దారుణాలు
-
ఏపీ సీఎస్, డీజీపీని ఢిల్లీకి పిలిచిన ఈసీఐ
-
తెనాలి ఎమ్మెల్యేపై యువకుడి దాష్టీకం
తెనాలి: గుంటూరు జిల్లా తెనాలి వైఎస్సార్సీపీ అభ్యర్థిపై సామాజికవర్గం ముసుగులో కూటమికి చెందిన ఓ యువకుడు ఆయన భార్య సమక్షంలోనే అవమానించి... రెచ్చగొట్టే ధోరణితో వ్యవహరించారు. ఆగ్రహించిన ఆయన చేయి చేసుకోవడంతో సోషల్ మీడియాలో దు్రష్పచారానికి తెగబడ్డారు. అంతేగాకుండా ఈసీకి ఫిర్యాదు చేసి ఆయన్ను తిర గనీయకుండా గృహనిర్బంధం చేశారు. అయితానగర్లో సోమవారం ఉదయం ఓటు వేసేందుకు భార్యతో సహా వచ్చిన ఎమ్మెల్యే శివకుమార్ను అప్పటికే క్యూలో ఉన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి గొట్టిముక్కల సుధాకర్ అడ్డుకున్నాడు.క్యూలో వెళ్లకుండా నేరుగా లోపలకు వెళ్లడమేంటన్న మిషతో దుర్భాషలాడాడు. అయినా మౌనంగా లోపలకు వెళ్లి ఓటేసి వస్తుంటే, మళ్లీ అదే వ్యక్తి అడ్డుకున్నాడు. కులాల పేర్లు ప్రస్తావిస్తూ ‘ఆ పార్టీలో ఉండటమేమిటి’ ను వ్వు కమ్మోడివి కావా?’ అని రెచ్చగొట్టాడు. ఇంకా కవి్వంపు చర్యలకు పాల్పడటమే గాకుండా భార్య ముందే అసభ్యంగా మాట్లాడటంతో తట్టుకోలేకపోయిన శివకుమార్ అతడి చెంపపై కొట్టాడు.సుధాకర్ కూడా తిరిగి చేయి చేసుకోవడంతో ఎమ్మెల్యే పక్కనే ఉన్న కార్యకర్తలు అతడికి దేహశుద్ధి చేశారు. ఈ ఘటనను సోషల్ మీడియాలో వైరల్ చేశారు. దీనిని ఆసరాగా చేసుకుని టీడీపీ నేతలు ఈసీకి ఫిర్యాదుచేసి, పోలింగ్ సరళిని పర్యవేక్షించే అవకాశం లేకుండా గృహనిర్బంధం విధించేలా చేశారు. ఈ ఘటనపై పోలీస్ కేసు నమోదు చేశారు. మనోహర్తో కలిసి చేసిన కుట్ర తనను రెచ్చగొట్టి ఏదోలా గొడవ సృష్టించి పోలింగ్ రోజున డ్యామేజ్ చేయాలని జనసేన అభ్యర్థి నాదెండ్ల మనోహర్, గొట్టిముక్కల సుధాకర్ కుట్ర పన్నారని ఎమ్మెల్యే శివకుమార్ ఆరోపించారు. -
ఎమ్మెల్యే రాజాసింగ్పై కేసు నమోదు
హైదరాబాద్, సాక్షి: బీజేపీ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్పై కేసు నమోదైంది. పోలింగ్ సందర్భంగా ప్రిసైడింగ్ అధికారితో దురుసుగా ప్రవర్తించారనే అభియోగాలు నమోదు అయ్యాయి. దీంతో.. మంగళ్ హట్ పోలీస్ స్టేషన్లో రాజాసింగ్పై కేసు నమోదు చేశారు. -
ఖర్గే హెలికాప్టర్లో తనిఖీలు.. ‘బీజేపీ నేతలను తనిఖీ చేస్తున్నారా?’
ఢిల్లీ: లోక్సభ ఎన్నికల ప్రచార సమయంలో ప్రతిపక్షాలను ఎన్నికల అధికారులు టార్గట్ చేసి మరీ తనిఖీలు చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే హెలికాప్టర్ను బిహార్లోని సమస్తిపూర్లో పోలింగ్ అధికారులు తనిఖీ చేశారు. అయితే ఎన్డీయే కూటమి నేతలను మాత్రం ఎటువంటి తనిఖీలు చేయకుండా విదిలేస్తున్నారని కాంగ్రెస్ ఎన్నికల అధికారులపై విమర్శలు చేసింది. శనివారం మల్లికార్జున ఖర్గే.. సమస్తీపూర్, ముజఫర్పర్లో ఎన్నికల ర్యాలీల్లో పాల్గొన్నారు.‘‘ఇప్పటికే కేరళలో కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ హెలికాప్టర్ను ఎన్నికల అధికారలు తనిఖీ చేశారు. శనివారం మల్లికార్జన ఖర్గేను బిహార్లోని సమస్తీపూర్లో అధికారుల చేత తనిఖీ చేయబడ్డారు’’ అని ‘ఎక్స్’ వేదికగా కాంగ్రెస్ పార్టీ నేత రాజేష్ రాథోడ్ అన్నారు. బిహార్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ ఖర్గే హెలికాప్టర్ చెక్ చేశారని రాజేష్ రాథోడ్ తెలిపారు. దీనికి సంబంధించిన వీడియోను ఎక్స్లో పోస్ట్ చేశారు. వీడియోలో.. హెలికాప్టర్ చుట్టూ అధికారులు, పోలిసులు ఉండటం గమనించవచ్చు.श्री @RahulGandhi जी के बाद अब @INCIndia अध्यक्ष श्री @kharge जी का हेलीकॉप्टर की तलाशी बिहार के समस्तीपुर में सभा के दौरान चुनाव आयोग और पुलिसकर्मियों द्वारा करना चुनाव आयोग का दुर्भावना पूर्ण व्यवहार प्रतिपक्षों के लिए दर्शाता है यह लोकतंत्र की हत्या है l pic.twitter.com/tk1SUqcj5P— Rajesh Rathorre (@RajeshRathorre1) May 11, 2024 ‘‘కేవలం కాంగ్రెస్ నేతల హెలికాప్టర్లకు మాత్రమే తనిఖీలు చేస్తున్నారా? లేదా బీజేపీకి చెందిన అగ్రనాయకుల హెలికాప్టర్లును కూడా చెక్ చేస్తున్నారా? అనే విషయంపై ఎన్నికల సంఘం క్లారిటీ ఇవ్వాలి. ఈ తనిఖీలు సమాచారాన్ని ఈసీ బహిరంగంగా ప్రజలకు అందుబాటులో ఉంచాలి. లేదంటే ప్రతిపక్షాలను అడ్డుకొని, ఎన్డీయే నేతలను ఫ్రీగా వదిలేసినట్లు అర్థమవుతుంది’’ అని రమేష్ రాథోడ్ అన్నారు. ఎన్నికల సమయంలో ఎన్నికల అధికారులు నేతల హెలికాప్టర్లను చెక్ చేసిన అన్ని వీడియోను బయటపెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. -
AP: డీబీటీలపై హైకోర్టులో విచారణ.. తీర్పు రిజర్వ్
సాక్షి, విజయవాడ: రైతుల ఇన్పుట్ సబ్సిడీ, విద్యా దీవెన నిధులను విడుదల చేసేందుకు ఎన్నికల సంఘం అనుమతి నిరాకరించడాన్ని సవాల్ చేస్తూ రైతులు, విద్యార్థులు దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు గురువారం విచారణ చేపట్టింది. డీబీటీలపై వాదనలు ముగియగా, తీర్పును ధర్మాసనం రిజర్వ్ చేసింది.కాగా, నిధుల విడుదలకు నిరాకరించిన ఈసీ.. పోలింగ్ తర్వాత నిధుల విడుదలకు అనుమతిస్తామని పేర్కొంది. కోడ్ వచ్చాక కొనసాగుతున్న పథకాలైనా, కొత్త పథకాలైన ఒక్కటే.. కోడ్ వచ్చాక నిధులు విడుదల చేస్తే ఓటర్లపై ప్రభావం ఉంటుందని ఈసీ తెలిపింది.అయితే, ఇప్పటివరకు వేర్వేరు రాష్ట్రాల్లో అనుసరించిన విధానాన్ని కొనసాగించాలని పిటిషనర్లు కోరారు. నోటిఫికేషన్ కంటే ముందు అమల్లో ఉన్న అన్ని పథకాలు అన్ని రాష్ట్రాల్లో కొనసాగుతున్నాయన్న పిటిషనర్లు.. ఒక్క ఆంధ్రప్రదేశ్లో విరుద్ధంగా నిర్ణయాలు తీసుకోకుండా ఈసీకి ఆదేశాలివ్వాలని పిటిషనర్లు కోరారు. -
ఈసీ మా ఫిర్యాదుల్ని పట్టించుకోవట్లేదు: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: ఎన్నికల కమిషన్ బీజేపీ కనుసన్నల్లో నడుస్తోందని.. తాము ఫిర్యాదు చేస్తే పట్టించుకోవడం లేదని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. శుక్రవారం ఆయన తెలంగాణ భవన్లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, రాముడి ఫొటోతో ఓట్లడిగిన వారిపై చర్యలేవీ? కేసీఆర్పై మాత్రం ఆగమేఘాల మీద చర్యలు తీసుకుంటారంటూ మండిపడ్డారు‘‘మతపరమైన రిజర్వేషన్లపై డైరెక్ట్గా ప్రచారం చేస్తున్న బీజేపీపై ఎందుకు మాట్లాడటం లేదు. మోదీ మాట్లాడిన మాటలకు నడ్డా సమాధానం ఇవ్వాలని తల తోక లేకుండా మాట్లాడింది ఎన్నికల సంఘం. అమిత్ షా రాముడు పటం పట్టుకొని ప్రచారం చేస్తున్న ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు?. అధికారం కోసం ఎన్నికలలో రాముడ్ని అడ్డం పెట్టుకొని ఓట్లు అడుగుతున్నారు. మోదీ, అమిత్ షా వాళ్ల బీజేపీ నేతలు ఇలా చేస్తుంటే ఇప్పటికీ చర్యలు తీసుకోరు. కానీ కేసీఆర్ ఒక్క మాట అన్నందుకు ఆగమేఘాల మీద నోటీసులు ఇచ్చారు.రైతుల సమస్యలు చెప్తూ మాట్లాడారు. చేనేత కార్మికుల గురించి కేసీఆర్వా రి బాధలు చెప్తూ భావోద్వేగంతో ఒక్క మాట అన్నారు. ఇలా చిన్న మాట అన్నందుకు 48 గంటలు నిషేధం విధించింది. కానీ రేవంత్ రెడ్డి కేసీఆర్పైనా ఇష్టానుసారంగా మాట్లాడారు. ఇలా మాట్లాడుతున్న రేవంత్ రెడ్డి పై 8 సార్లు ఫిర్యాదు చేశాం. కానీ చర్యలు లేవు. కేసీఆర్ తల నరకండి అంటే ఎందుకు ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవటం లేదు. 27 సార్లు పలువురు బీజేపీ, కాంగ్రెస్ నాయకులపై ఫిర్యాదు చేస్తే ఎన్నికల సంఘం పట్టించుకోలేదు’’ అంటూ కేటీఆర్ మండిపడ్డారు. -
జనసేన రెబల్స్ కు గాజుగ్లాసు గుర్తు పవన్ కళ్యాణ్ కు భారీ షాక్..!
-
హైదరాబాద్ సౌత్ జోన్ డీసీపీ సాయిచైతన్యపై ఈసీ వేటు
సాక్షి, హైదరాబాద్: నగర పోలీస్ కమిషనరేట్ సౌత్ జోన్ డీసీపీపై ఎలక్షన్ కమిషన్ వేటు వేసింది. ఎన్నికల విధుల నుంచి తొలగిస్తూ ఈసీ ఆదేశాలు జారీ చేసింది. సాయి చైతన్యకు ఎలాంటి ఎన్నికల విధులు అప్పగిందంటూ సీపీని ఆదేశించింది. బీజేపీ ఇచ్చిన ఫిర్యాదుతో సాయి చైతన్యపై ఈసీ చర్యలు తీసుకుంది.