-
హైదరాబాద్ లో డ్రగ్ విక్రయాలు.. పబ్ డీజే ప్లేయర్ల అరెస్టు
-
డ్రగ్స్తో జీవితం అంధకారమే
గచ్చిబౌలి (హైదరాబాద్): ‘చెడు స్నేహాల వల్ల నేను డ్రగ్స్కు బానిసనయ్యా. తల్లిదండ్రులు ఎంత చెప్పినా మారలేదు. చదువు మధ్యలోనే మానేశా. జీవితం అంధకారంగా మారిపోయింది. యువత డ్రగ్స్ బారిన పడొద్దు..’అంటూ నిట్ మాజీ విద్యార్థి నవీన్ నాయక్ చెప్పిన మాటలు ఆలోచింపజేస్తున్నాయి. వివరాలివి. హైదరాబాద్ బోయినపల్లికి చెందిన కురుమ్తోత్ రాథోడ్ నవీన్ నాయక్ (27) చదువులో చురుకుగా ఉండేవాడు. 2015లో ఆలిండియా 800వ ర్యాంక్ సాధింఛి ట్రిచి (తిరుచిరాపల్లి) ఎన్ఐటీలో చేరాడు. అయితే చెడు సహవాసాలతో మాదక ద్రవ్యాలకు అలవాటు పడ్డాడు.విషయం తెలిసిన తల్లిదండ్రులు ఎంతో నచ్చ చెప్పారు. అయినా పెడచెవిన పెట్టాడు. 2018లో చదువు మానేసి బెంగళూరులో మార్కెటింగ్ రంగంలో పని చేసినా ఆదాయం లేకుండా పోయింది. దీంతో డ్రగ్స్ పెడ్లర్గా మారాడు. ఈ క్రమంలోనే 2022లో ఎండీఎంఏ డ్రగ్ను వెంకటేళ్వర్లు అనే వ్యక్తికి సప్లయ్ చేయడంతో దుండిగల్ పీఎస్లో కేసు నమోదైంది. 2023లో కేరళలోని పలక్కడ్ పీఎస్లో నమోదైన ఎన్డీసీఎస్ కేసులో శిక్ష పడింది. తాజాగా మాదాపూర్ పీఎస్ పరిధిలో గంజాయి సేవించేందుకు వెళ్లి పోలీసులకు చిక్కాడు. ఒత్తిడిని అధిగమించాలివిద్యార్థులు ఒత్తిడి పేరిట డ్రగ్స్కు బానిస కావద్దని, వ్యాయామం, యోగా లాంటివి చేయడం ద్వారా ఒత్తిడిని అధిగమించాలని నవీన్ నాయక్ చెప్పాడు. భవిష్యత్ను నాశనం చేసుకోవద్దని మీడియాతో మాట్లాడుతూ విజ్ఞప్తి చేశాడు. తల్లిదండ్రులు తనకెంతో చేశారని, వారు చెప్పిన మాటలు పెడచెవిన పెట్టి జీవితం నాశనం చేసుకున్నానంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. ఏడేళ్లుగా ఇంటికి వెళ్లడం లేదని చెబుతూ తల్లిదండ్రులను క్షమాపణ కోరాడు. ముగ్గురికి పాజిటివ్మాదాపూర్లోని హైటెక్స్ సమీపంలో శుక్రవారం సాయంత్రం ఐదు గంటలకు స్థానిక పోలీసులతో కలిసి 1.4 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నామని తెలంగాణ యాంటీ నార్కోటిక్ బ్యూరో ఎస్పీ సాయి చైతన్య తెలిపారు. దూద్ బౌలికి చెందిన డ్రగ్ పెడ్లర్ మోటికర్ సిచి్చతానంద్ అలియాస్ సచిన్ (28)తో పాటు గంజాయి సేవించిన కురుమ్తోత్ నవీన్ నాయక్, ప్రణీత్రెడ్డి, రాహుల్రాజ్ను అరెస్టు చేశామని చెప్పారు. మరో డ్రగ్ పెడ్లర్ ధూల్పేట్కు చెందిన రాజా పరారీలో ఉన్నాడన్నారు. శనివారం మాదాపూర్ డీసీపీ వినీత్తో కలిసి కేసు వివరాలను ఆయన మీడియాకు వివరించారు.ముగ్గురూ గంజాయి తాగినట్లు తేలిందని (పాజిటివ్) తెలిపారు. డ్రగ్స్ సేవించిన వారు తప్పించుకోలేరని, రక్తపు నమూనాల ఆధారంగా పట్టుకుంటామని హెచ్చరించారు. తల్లిదండ్రులు పిల్లలపై నిఘా పెట్టాలని సూచించారు. పీజీ హాస్టళ్లలోనూ తనిఖీలు నిర్వహించాల్సిన అవసరం ఉందన్నారు. డ్రగ్స్ రహిత నగరంగా మార్చేందుకు ప్రజలు పూర్తి సహకారం అందించాలని కోరారు. డ్రగ్స్ విక్రయిస్తున్నట్లు కానీ, సేవిస్తున్నట్లు కానీ తెలిస్తే 8712671111 ఫోన్ నంబర్లో సమాచారం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.వారి పేర్లను గోప్యంగా ఉంచడంతో పాటు రివార్డులు అందిస్తామన్నారు. కాగా మాదాపూర్ జోన్ పరిధిలో డ్రగ్స్పై నిఘా పెట్టినట్లు డీసీపీ వినీత్ తెలిపారు. యాంటీ డ్రగ్ కమిటీలు యాక్టివ్గా పని చేస్తున్నాయన్నారు. గచ్చిబౌలి పీఎస్ పరిధిలో గంజాయి డాన్ నీతూ బాయ్ ఆస్తులు అటాచ్ చేశామని, ఆమెపై పీడీ యాక్ట్ నమోదు చేసినట్లు వివరించారు. ఈ సమావేశంలో టీజీఏఎన్బీ డీఎస్పీ రమే‹Ù, మాదాపూర్ ఇన్స్పెక్టర్ మల్లేష్ సిబ్బంది పాల్గొన్నారు. -
హైదరాబాద్లో డ్రగ్స్ సరఫరా.. డీజే అఖిల్ అరెస్ట్
సాక్షి,హైదరాబాద్ : బంజారాహిల్స్ కేంద్రంగా పలు పబ్బుల్లో డీజేగా పనిచేస్తున్న అఖిల్ డ్రగ్స్ అమ్ముతూ పోలీసులకు పట్టుబడ్డాడు. మాదక ద్రవ్యాల సరఫరాపై సమాచారం అందుకున్న పోలీసులు రెక్కీ నిర్వహించారు. అయితే ఓ ప్రాంతంలో డ్రగ్స్ అమ్ముతుండగా అఖిల్ను హ్యాండెడ్గా పట్టుకున్నారు. నిందితుడి నుంచి పెద్ద ఎత్తున ఎండీఎఏ డ్రగ్స్ను స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్తో పాటు నిందితుడు వద్ద గంజాయిని బెంగళూరు నుంచి హైదరాబాద్కు తెచ్చి సరఫరా చేస్తున్నాడని పోలీసులు తెలిపాడు. ఇక డ్రగ్స్ అమ్ముతూ పట్టుబడ్డ అఖిల్ను పోలీసులు విచారిస్తున్నారు. నగరంలో డ్రగ్స్ ఎవరికి అమ్మాడు, వారిలో సెలబ్రిటీలు ఉన్నారా? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. -
డ్రగ్స్ను అరికట్టడంలో డీఎంకే ప్రభుత్వం విఫలమైంది: నటుడు విజయ్
చెన్నై: తమిళ స్టార్ హీరో, తమిళగ వెట్రి కజగం పార్టీ అధినేత విజయ్.. డీఎంకే ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్రంలో డ్రగ్స్ మాఫియా రాజ్యమేలుతోందని, దీనిని అరికట్టడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విజయ్ ధ్వజమెత్తారు. మాదకద్రవ్యాలను నియంత్రించేందుకు స్టాలిన్ సర్కార్ ఏ ప్రయత్నం చేయడం లేదని ఆరోపించారు.విజయ్ మాట్లాడుతూ.. 'ఇటీవల కాలంలో తమిళనాడు యువతలో డ్రగ్స్ వాడకం ఎక్కువగా ఉంది. ఒక పేరెంట్గా, రాజకీయ పార్టీ నాయకుడిగా నేనే దీని గురించి భయపడుతున్నాను. యువతను డ్రగ్స్ నుంచి రక్షించడం ప్రభుత్వ కర్తవ్యం. కానీ ఈ విషయంలో ప్రస్తుత ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. రాష్ట్రంలో మంచి నాయకులు రావాల్సిన అవసరం ఉందిస అని పేర్కొన్నారు.కాగా స్టాలిన్ ప్రభుత్వంపై విజయ్ నేరుగా విమర్శలు చేయడం ఇదే తొలిసారి. అయితే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ పార్టీ పోటీ చేయనున్న విషయం తెలిసిందే. ఆయన తన రాజకీయ ప్రస్థానాన్ని మొదలు పెట్టాలని యోచిస్తున్న తరుణంలో ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఇదిలా ఉండగా.. తమిళనాడులోని కళ్లకురిచిలో ఇటీవల కల్తీ సారా తాగడం వల్ల 60 మంది మృత్యువాత పడిన విషయం తెలిసిందే. ఈ మరణాలపై జాతీయ మానవ హక్కుల కమిషన్ సుమోటోగా విచారణ చేపట్టి, వారంలోగా వివరణాత్మక నివేదిక ఇవ్వాలని కోరుతూ తమిళనాడు ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర పోలీసు డైరెక్టర్ జనరల్కు నోటీసులు జారీ చేసింది. నివేదికను దాఖలు చేసేందుకు మద్రాసు హైకోర్టు జూలై 3 వరకు గడువు ఇచ్చింది. -
డ్రగ్స్ రహిత రాష్ట్రంగా ఏపీ
బీచ్ రోడ్డు(విశాఖ తూర్పు)/భవానీపురం(విజయవాడ పశ్చిమ): మాదక ద్రవ్యాల రహిత ఆంధ్రప్రదేశ్ను తీర్చిదిద్దడమే లక్ష్యంగా వంద రోజుల ప్రణాళిక అమలు చేస్తున్నామని రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా బుధవారం బీచ్ రోడ్డులో కాళీమాత ఆలయం నుంచి వైఎంసీఏ వరకు పోలీసులు మార్చ్ నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన అనిత తొలుత మార్చ్లో పాల్గొన్న వెయ్యి మందితో మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం జెండా ఊపి అవగాహన ర్యాలీని ప్రారంభించారు. ఆమె మాట్లాడుతూ విశాఖను డ్రగ్స్ రహిత నగరంగా తీర్చిదిద్దేందుకు యువత సహకారం అవసరమని చెప్పారు. విద్యార్థి దశ నుంచే డ్రగ్స్ దుష్పరిణామాలపై అవగాహన కల్పించాలని సూచించారు. నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ ఎ.రవిశంకర్ మాట్లాడుతూ గంజాయి, ఇతర డ్రగ్స్ను పూర్తిగా నిర్వీర్యం చేసేందుకు ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. మాదకద్రవ్యాల వినియోగంతో యువశక్తి ని ర్వీర్యం దేశాభివృద్ధిలో యువశక్తి కీలక పాత్ర పోషిస్తుందని, అయితే మాదకద్రవ్యాల వినియోగం వలన ఆ యువశక్తిలో కొంత నిర్వీర్యం కావడం బాధాకరమని రాష్ట్ర డీజీపీ సీహెచ్.ద్వారకా తిరుమలరావు అన్నారు. అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించిన అవగాహన సదస్సుకు ఆయన ముఖ్యఅతిధిగా హాజరై మాట్లాడారు. డ్రగ్స్ వాడకం విద్యార్థులకు ఒక ఫ్యాషన్గా మారుతుందని, అది వారి జీవితాన్ని కబళించి వేస్తుందని గ్రహించలేక పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. డ్రగ్స్ విక్రయాలు, వాడకాన్ని నిర్మూలించేందుకు వంద రోజుల ప్రణాళిక రెడీ అవుతుందని ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ పీహెచ్డీ రామకృష్ణ తెలిపారు. వివిధ శాఖల అధికారుల సమన్వయంతో డ్రగ్స్ టాస్్కఫోర్స్ను ఏర్పాటు చేయనున్నామని వివరించారు. అడిషనల్ డైరెక్టర్ ప్రాసిక్యూషన్ బైరా రామకోటేశ్వరరావు, ప్రముఖ మానసిక వైద్యులు డాక్టర్ ఇండ్ల రామసుబ్బారెడ్డి ప్రసంగించారు. మాదకద్రవ్యాల నిర్మూలనకు కృషి చేస్తామని విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. -
డ్రగ్స్ రహిత రాష్ట్రమే లక్ష్యం
సాక్షి, హైదరాబాద్: డ్రగ్స్ రహిత తెలంగాణ తమ ప్రభుత్వ లక్ష్యమని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క పేర్కొన్నారు. మాదకద్రవ్యాల రవా ణాకు పాల్పడితే ఎంతటివారైనా ఉపేక్షించేది లేదని చెప్పారు. మంగళవారం అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ నెక్లెస్ రోడ్లో రాష్ట్ర యాంటీ నార్కోటిక్స్ బ్యూరో ఆధ్వ ర్యంలో కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ, రాష్ట్రంలో మాదకద్రవ్యాల నిరో ధానికి ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోందని చెప్పారు. డ్రగ్స్ కుటుంబ వ్యవస్థను ఛిన్నాభిన్నం చేస్తోందని, ఈ విషయంలో అందరూ అప్రమత్తంగా ఉండాలన్నారు. సంఘ విద్రోహ శక్తుల చేతుల్లో యువత జీవితాలు నాశనం అవుతున్నాయని పేర్కొన్నారు. రాష్ట్రాన్ని, దేశాన్ని బలహీనపరిచేందుకు దేశద్రోహులు డ్రగ్స్ను అస్త్రంగా ప్రయోగి స్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.బడ్జెట్ ఎంతైనా కేటాయిస్తాం..రాష్ట్రంలో డ్రగ్స్ నిర్మూలనకు నార్కోటిక్ బ్యూరోకు ఎంత బడ్జెట్ అయినా కేటాయిస్తామని భట్టి తెలిపారు. ఇప్పటికే అడిగినన్ని నిధులు ఇచ్చామని, రాష్ట్రంలో డ్రగ్స్ మాట వినిపించకుండా చేయాల్సిన బాధ్యత నార్కోటిక్ విభాగానిదేనని పేర్కొన్నారు. డ్రగ్స్ను అరికట్టేందుకు ప్రజలు అన్ని గ్రామాల్లో మాదకద్రవ్యాల నిరోధక కమిటీలను రూపొందించుకోవాలని ఆయన సూచించారు. కలసికట్టుగా తరిమేద్దాం: డీజీపీకలసికట్టుగా ఉండి రాష్ట్రం నుంచి డ్రగ్స్ను తరిమే యాలని డీజీపీ రవిగుప్తా పిలుపునిచ్చారు. పిల్లలు డ్రగ్స్కు బానిసలు కాకుండా కఠిన చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. కాలేజీలు, స్కూళ్లను డ్రగ్ ఫ్రీ ప్రదేశాలుగా మలిచేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. డ్రగ్స్ తీసుకుంటే విద్యార్థుల జీవితాలతో పాటు వారి కలలు, కుటుంబాలు కూడా విచ్ఛిన్నం అవుతాయని హెచ్చరించారు. చేయూతనివ్వాలి: హైదరాబాద్ సీపీడ్రగ్స్కు బానిసలైన వారిని చైతన్యపరచి, వారికి చేయూతనివ్వాలని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్రెడ్డి పిలుపునిచ్చారు. యువతను లక్ష్యంగా చేసుకుని దేశద్రోహులు డ్రగ్స్ కుట్ర పన్నుతున్నారని చెప్పారు. వారి ఉచ్చులో పడి యువత మత్తుకు బానిసలై జీవితాలను పాడు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, డ్రగ్స్కు వ్యతిరేకంగా అవగాహన కల్పించేందుకు రూపొందించిన పాటను సీఎస్ శాంతికుమారితో కలిసి డిప్యూటీ సీఎం ఆవిష్కరించారు. డ్రగ్స్ నిర్మూలనపై అవగాహన కోసం షార్ట్ఫిల్మ్ పోటీల్లో విజేతలకు నగదు బహుమతులు అందజేశారు. నెక్లెస్ రోడ్డుపై విద్యార్థుల ర్యాలీని భట్టి జెండా ఊపి ప్రారంభించారు. కార్యక్రమంలో యాంటీ నార్కోటిక్స్ డైరెక్టర్ సందీప్ శాండిల్య పాల్గొన్నారు.డ్రగ్స్పై సమాజాన్ని మేల్కొలుపుదాంమంత్రి పొన్నం ప్రభాకర్బంజారాహిల్స్ (హైదరాబాద్): యువ తను, విద్యా ర్థులను పట్టి పీడిస్తున్న డ్రగ్స్ భూతాన్ని తరిమి కొట్టేందుకు ప్రజా నాట్యమండలి కళారూ పాల ప్రదర్శనకు శ్రీకారం చుట్టింది. ‘డ్రగ్స్ను నిర్మూలి ద్దాం–సమాజాన్ని మేల్కొల్పుదాం’పేరిట చేపట్టే కళాయాత్ర లోగోను మంత్రి పొన్నం ప్రభాకర్ మంగళవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. డ్రగ్స్ బారి నుంచి యువతను మేల్కొల్పి వారిని చక్కటి బాట పట్టించేందుకు చేప ట్టిన కళాయాత్ర విజయవంతంగా కొనసాగా లని ఆకాంక్షించారు. ప్రభుత్వం డ్రగ్స్ను ఎంత కట్టడి చేసినా డ్రగ్స్ మాఫియా వివిధ రూపాల్లో వ్యాపా రం సాగిస్తూ చివరకు చిన్న పిల్లలు తినే చాక్లెట్స్లో డ్రగ్స్ కలిపి వ్యాపారం చేస్తూ వారి జీవి తాలతో చెలగాటమాడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. అలాంటి వారిని ఉపేక్షించేది లేద న్నారు. ప్రజా నాట్య మండలి కళారూపాల ద్వారా పాఠశాలలు, జూనియర్, డిగ్రీ, ఇంజనీరింగ్, పీజీ కళాశాలల్లో అవగాహన కార్యక్రమాల నిర్వహణకు ముందుకు రావడం శుభపరిణామం అన్నారు. ఈ నెల 31 వరకు ఎగ్జిబిషన్స్, ఆగస్టు 16 నుంచి సెప్టెంబర్ 16 వరకు కళా యాత్రతో వివిధ కార్యక్రమా లను నిర్వహించనున్నట్లు తెలిపారు. కార్య క్రమంలో ఆహ్వాన సంఘాన్ని ప్రకటించారు. సంఘం చైర్మన్గా మంత్రి పొన్నం ప్రభాకర్, చీప్ ప్యాట్ర న్స్గా ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, సినీ గేయ రచ యిత అశోక్తేజ, మాదాల రవి, గాంధీ హాస్పటల్ సూపరింటెండెట్ రాజారావు, ఉస్మానియా ఆస్పత్రి సూపరింటెండెంట్ నాగేందర్, డాక్టర్ నీలిమ, డాక్టర్ జీఎన్రావులతో పాటు భారత్ ఇన్స్టి ట్యూట్స్ సీహెచ్.వేణుగోపాల్రెడ్డి, డీజీ నరసింహారావు, నాగటి మారన్న, మహరాజ్లను ప్రకటించారు. -
మత్తు డేగ ఎగురుతోంది... జాగ్రత్త
వీధి చివర బంకుల్లో మత్తు చాక్లెట్లు కాలేజీ క్యాంపస్లో గంజాయి పొగ పబ్లో మాదకద్రవ్యాలు బుద్ధిగా చదువుకోవాల్సిన టీనేజ్ పిల్లల్ని మత్తులోకి లాగడానికి పొంచి ఉన్న డేగలు. జాగ్రత్త... తల్లిదండ్రులూ.. జాగ్రత్త. పిల్లలు తెలిసీ తెలియక చిక్కుకుంటారు. గమనించాలి. చర్చించాలి. కాపాడుకోవాలి.స్కూల్ వయసు పిల్లలు డ్రగ్స్ బారిన పడకుండా హర్యాణ రాష్ట్రంలో పోలీసులు ఆయా స్కూళ్లకెళ్లి వారిని చైతన్యపరిచే కార్యక్రమాలు చేస్తున్నారు. ‘క్యాచ్ దెమ్ యంగ్’ అనేది ఈ కార్యక్రమం పేరు. అంటే చిన్న వయసులోనే పిల్లల దృష్టిని ఆకర్షించి వారిని డ్రగ్స్ దుష్ప్రభావాల గురించి చెప్పాలి. ఇందుకు వారు అంబాలలోని ఒక ప్రయివేటు స్కూల్లో ప్రయోగాత్మకంగా ఒక ప్రయత్నం చేశారు. దాని పేరు ‘చక్రవ్యూహ్’. వరుసగా ఉన్న ఐదు గదుల్లో రకరకాల పజిల్స్ ఇచ్చి ఒక గదిలో నుంచి మరో గదిలోకి కేవలం తెలివితేటల ఆధారంగా తలుపు తెరుచుకుని ప్రవేశిస్తూ అంతిమంగా బయట పడాలి. ‘ఇది ఒక అద్భుత ప్రయోగం’ అని విద్యార్థులు అంటున్నారు.చక్రవ్యూహ్ ప్రయోగంచక్రవ్యూహ్ అనేది ఒక పజిల్ గేమ్. ఆటోమేటిక్ తాళాలు ఉన్న గదుల్లోకి నలుగురు విద్యార్థుల బృందాన్ని పంపిస్తారు. ఆ బృందం అక్కడ తమ జీవితంలో ఎదురయ్యే రకరకాల సమస్యలను పజిల్స్ రూపంలో ఎదుర్కొంటుంది. అంటే పరీక్షలో ఫెయిల్ కావడం, మంచి ర్యాంక్ రాకపోవడం, నిరుద్యోగం, ఒంటరితనం, తల్లిదండ్రుల కొట్లాట... ఇలాంటి సమయంలో ఆ సమస్యలను ఎలా దాటాలో అక్కడే క్లూస్ ఉంటాయి. ఆ క్లూస్ ద్వారా ముందుకు సాగితే తర్వాతి గదిలోకి తలుపు తెరుచుకుంటుంది. ఇదంతా íసీసీ టీవీల ద్వారా అధ్యాపకులు గమనిస్తూ ఉంటారు. అయితే ఈ ప్రతి సవాలు ఎదుర్కొనే సమయంలో ఆ సమస్య నుంచి పారిపోయి డ్రగ్స్ను ఎంచుకునే ఆప్షన్ కూడా ఉంటుంది. కాని ఈ మొత్తం చక్రవ్యూహ్లో కలిగే అవగాహన ఏమిటంటే నిజ జీవిత సమస్యల్ని తల్లిదండ్రుల, స్నేహితుల సాయంతో దాటితే వచ్చే కిక్కు డ్రగ్స్ తీసుకొని జీవితాన్ని నాశనం చేసుకోవడంలో లేదని తెలియడం. ఇలాంటి చక్రవ్యూహ్ ప్రయోగాన్ని హర్యాణలోని స్కూళ్లల్లో విస్తృతంగా నిర్వహించాలని పోలీసులు భావిస్తున్నారు. జీవితపు చక్రవ్యూహంలో చిక్కుకుంటే బయటపడే దారి ఉంటుందిగాని డ్రగ్స్లో చిక్కుకుంటే దారి ఉండదు అని తెలియడం వల్ల విద్యార్థులు చిన్న వయసులోనే గట్టి సందేశం అందుకుంటారు.కుతూహలం, సాంగత్యంటీనేజీ పిల్లలు అయితే కుతూహలం కొద్దీ లేదా దుష్ట సాంగత్యంలోని ఒత్తిడి వల్ల డ్రగ్స్ను ట్రై చేస్తున్నారని డీ అడిక్షన్ థెరపిస్టులు అంటున్నారు. పిల్లలు డ్రగ్స్కు అలవాటు పడ్డారని తల్లిదండ్రులు గమనించే లోపు వారి ప్రవర్తన పూర్తిగా మారిపోయి ఉంటుందని హెచ్చరిస్తున్నారు. సరదా షికార్లు, స్లీప్ ఓవర్ల సమయంలో సరదా కొద్ది సీనియర్లో స్నేహితులో డ్రగ్స్ ఇస్తున్నారు. మొదటి ఒక రకం డ్రగ్స్ తీసుకున్నాక మెదడు ఇంకా ‘హై’ కావాలని కోరుకుంటుంది. దాంతో పిల్లలు ఇంకా ఎన్ని రకాల డ్రగ్స్ ఉన్నాయో చూద్దామని వెతుకులాట సాగిస్తారు. ఇక అంతటితో వారి చదువు, ఆరోగ్యం, ఏకాగ్రత, వ్యక్తిత్వం మొత్తం ధ్వంసమైపోతాయని డ్రగ్స్కు బానిసలైన టీనేజ్ విద్యార్థులను పరిశీలిస్తున్న డీ అడిక్షన్ థెరపిస్టులు తెలియచేస్తున్నారు.బయట పడేయాలిడ్రగ్స్కు అలవాటు అయ్యారని తెలియగానే తల్లిదండ్రులు పిల్లల్ని మందలించడానికి చూస్తారు. వెంటనే ఆ పిల్లలు ‘మీరిలా తిడితే ఇల్లు విడిచి వెళ్లిపోతాం’ అని బ్లాక్మెయిల్ చేస్తారు. వీరిని చాలా ఓర్పుతో థెరపీల ద్వారా తిరిగి మామూలు మనుషుల్ని చేయాల్సి వస్తుంది. పోలీసుల గమనింపు ప్రకారం 18 నుంచి 25 ఏళ్ల లోపు వారిని డ్రగ్ పెడలర్స్ లక్ష్యం చేసుకున్నా నేడు 14 ఏళ్ల పిల్లలతో మొదలు ప్రతి టీనేజ్ అమ్మాయి అబ్బాయి డ్రగ్స్ డేగ రెక్కల కింద ఉన్నట్టే లెక్క.నెగెటివ్ కుటుంబ వాతావరణంటీనేజ్ పిల్లలు డ్రగ్స్ వైపు మొగ్గు చూపడంలో ప్రధానంగా నెగెటివ్ కుటుంబ వాతావరణం ఒక ముఖ్యకారణమని నిపుణులు అంటున్నారు. తల్లిదండ్రులు ఘర్షణతో ఉన్నా పిల్లలతో మంచి అనుబంధం ఏర్పరుచుకోకపోయినా ఆత్మీయంగా వారితో సమయం గడపకపోయినా ‘మనం పట్టని తల్లిదండ్రుల’ కంటే ‘మనకు కిక్ ఇచ్చే డ్రగ్స్ మేలు’ అనే భావనలో భ్రష్ట సాంగత్యాలలోకి పిల్లలు వెళతారు. ఆ సంగతి తెలియనివ్వరు. చదువుతో పాటు క్రీడలు, ప్రకృతి ప్రేమ, బంధుమిత్రులు, క్రమశిక్షణ గల ఆర్థిక పరిస్థితి, భావోద్వేగాలకు అయినవారు ఉన్నారన్న భరోసా, విలువలు లేదా ఏదో ఒక ఆధ్యాత్మిక ఆలంబన... ఇవి టీనేజ్ పిల్లల రోజువారీ జీవనంలో ఉంటే వారు డ్రగ్స్ బారిన ఏ మాత్రం పడరు. తల్లిదండ్రులూ బహుపరాక్.ఎలా గుర్తించాలి?మీ టీనేజ్ పిల్లలు డ్రగ్స్కు అలవాటు పడ్డారని ఎలా గుర్తించాలి?1. చాలా మూడీగా తయారవుతారు 2. సరిగా భోజనం చేయరు 3. సడన్గా కొత్త కొత్త స్నేహితులు ప్రత్యక్షమవుతుంటారు. తరచూ ఏవో పార్టీలున్నాయని వెళుతుంటారు. 4. గతంలో కంటే ఎక్కువ డబ్బు అడుగుతారు 5. పొడి పెదిమలు 6. ఎర్రబడ్డ కళ్లు 7. వాదనలకు దిగి ఆధిపత్యం ప్రదర్శించడం 8. కుటుంబంతో కలివిడిగా లేకపోవడం 9. అర్థం పర్థం లేని నిద్రా సమయాలు. -
మాదాపూర్లో మరోసారి భారీ డ్రగ్స్ కలకలం
సాక్షి,హైదరాబాద్ : మాదాపూర్లో మరోసారి భారీ డ్రగ్స్ కలకలం సృష్టించాయి. బెంగళూరు నుంచి హైదరాబాద్కి డగ్స్ సరఫరా చేస్తున్న నిందితుడు సాయిచరణ్తో పాటు మరో వ్యాపారవేత్తలు మాలిక్ లోకేష్, సందీప్ రెడ్డి ,రాహుల్ ,సుబ్రహ్మణ్యంలను నార్కోటిక్ పోలీసులు అరెస్ట్ చేశారు. సాయిచరణ్ నుంచి పెద్ద మొత్తంలో ఎండీఎంఏ డ్రగ్స్ను స్వాధీనం చేసుకున్నారు. గతంలో సాయిచరణ్ డ్రగ్స్ సరఫరా చేస్తూ పోలీసులకు దొరికినట్లు తెలుస్తోంది.డ్రగ్స్ సరఫరా దందా జరిగేది ఇలానార్కోటిక్ పోలీసుల వివరాల మేరకు..సాయి చరణ్ బెంగళూరు నుంచి హైదరాబాద్కు డ్రగ్స్ తరలించేందుకు నగరంలో పలు ట్రావెల్స్ ఏజెన్సీలకు చెందిన డ్రైవర్లను నియమించుకున్నాడు. వారికి బెంగళూరులో డ్రగ్స్ను చిన్న చిన్న ప్యాకెట్లలో పెట్టి హైదరాబాద్కు తరలించినట్లు సమాచారం.ఇలా, 50 మంది వ్యాపారవేత్తలకు డ్రగ్స్ సరఫరా చేసినట్లు తెలుస్తోంది.సాయిచరణ్ డ్రగ్స్ సరఫరా చేసిన వ్యాపారస్తులు హైదరాబాద్, నెల్లూరు, విజయవాడ, రాజమండ్రి, వైజాగ్ ప్రాంతాలకు చెందిన వారేనని నార్కోటిక్ పోలీసుల విచారణ తేలింది. సాయిచరణ్తో పాటు ఇతర నిందితులపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభిస్తున్నారు. -
అత్యంత ప్రమాదకరమైన అల్ఫాజోలం డ్రగ్ స్వాధీనం
-
డ్రగ్స్, గంజాయి, మత్తు పదార్థాల విక్రయాలపై పోలీసుల ఉక్కుపాదం
-
భర్త పెడ్లర్ భార్య ట్రాన్స్పోర్టర్!
సాక్షి, హైదరాబాద్: బెంగళూరు నుంచి డ్రగ్స్ ఖరీదు చేసుకోవచ్చు, నగరంలో విక్రయిస్తున్న భార్యభర్తల దందాకు తెలంగాణ స్టేట్ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో (టీఎస్–నాబ్) అధికారులు చెక్ చెప్పారు. ఈ దంపతులుసహా ఐదుగురిని అరెస్టు చేసి, రూ.4 లక్షల విలువైన ఎండీఎంఏ డ్రగ్ స్వా«దీనం చేసుకున్నట్లు టీఎస్–నాబ్ డైరెక్టర్ సందీప్ శాండిల్య బుధవారం వెల్లడించారు. అంబర్పేటకు చెందిన సయ్యద్ ఫైజల్ పెట్స్ విక్రయిస్తుంటాడు. తేలిగ్గా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో డ్రగ్స్ దందా మొదలెట్టాడు. ఇతడిపై గతంలో అంబర్పేట, బాలానగర్ ఎక్సైజ్ పోలీసుస్టేషన్లలో మూడు కేసులు నమోదయ్యాయి. కొన్నిసార్లు భార్య ముస్రత్తున్నిస్సా బేగంతో కలిసి ఈ దందా చేయడంతో ఆమె పైనా ఓ కేసు నమోదైంది. జైలుకు వెళ్లివచ్చినా తమ పంథా మార్చుకోలేదు. బెంగళూరుకు చెందిన జునైద్ ఖాన్, డబీర్పుర వాసి మహ్మద్ అబ్రార్, రహ్మత్ ఖాన్లను తమతో కలుపుకున్నారు. జునైద్ డ్రగ్ సరఫరాలో సహకరిస్తుండగా... మిగిలిన ఇద్దరూ నగరంలో కస్టమర్లను గుర్తించేవారు. పోలీసుల నిఘా పెరిగిందని గుర్తించిన సయ్యద్, వారికి చిక్కకుండా ఉండటం కోసం కొత్త పంథా మొదలెట్టాడు. బెంగళూరు నుంచి డ్రగ్స్ ఖరీదు చేస్తూ పెడ్లర్గా మారాడు. కస్టమర్లకు సరఫరా చేయడానికి మస్రత్తున్నిస్సా బేగంను ట్రాన్స్పోర్టర్గా వాడుతున్నాడు. బెంగళూరుకు వెళ్లి వచ్చా... ఇటీవల బెంగళూరు వెళ్లిన ఈ నలుగురు నిందితులు అక్కడ జునైద్ను కలిసి 34 గ్రాముల ఎండీఎంఏ ఖరీదు చేశారు. అనంతరం జునైద్తో కలిసి వారు నగరానికి వచ్చారు. ఈ విషయం తెలుసుకున్న టీఎస్–నాబ్ అధికారులు బహదూర్పుర పోలీసులతో కలిసి ఐదుగురు నిందితులను అరెస్టు చేసి రూ.4 లక్షల విలువైన డ్రగ్ స్వాధీనం చేసుకున్నారు. వీరి నుంచి క్రమం తప్పకుండా డ్రగ్ ఖరీదు చేస్తున్న 19 మంది కస్టమర్లను పోలీసులు గుర్తించారు. ఒక్కో గ్రాము రూ.8 వేలకు విక్రయిస్తున్నట్లు గుర్తించారు. ఈ కస్టమర్ల పైనా చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. నగరాన్ని డ్రగ్ ఫ్రీ సిటీగా మార్చడానికి కృషి చేస్తున్నామన్న పోలీసులు వీటిపై సమాచారం తెలిస్తే 87126–71111 నెంబర్కు ఫోన్ చేసి లేదా ( tsnabho& hyd@tspolice. gov. in)కు ఈ–మెయిల్ ద్వారా తెలపాలని కోరారు. ఇలా సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని హామీ ఇచ్చారు. -
నటి హేమకు బెయిలు మంజూరు
బెంగళూరు డ్రగ్స్ కేసులో నటి హేమకు తాజాగా బెయిల్ లభించింది. కొద్దిరోజుల క్రితం బెంగళూరు నగర శివార్లలో జరిగిన రేవ్పార్టీలో హేమ మాదక ద్రవ్యాలను తీసుకున్నట్లు పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఆమెను బెంగళూరు నగర నేర నియంత్రణ దళం (సీసీబీ) పోలీసులు విచారించారు. ఈ క్రమంలో హేమకు స్థానిక కోర్టు బెయిల్ మంజూరు చేసింది.నటి హేమ వద్ద ఎలాంటి డ్రగ్స్ లేవని, ఆమెపై ఆరోపణలు వచ్చిన పది రోజులకు వైద్య పరీక్షలు నిర్వహించారని హేమ తరఫు న్యాయవాది కోర్టులో తెలిపారు. అంతేకాకుండా హేమ డ్రగ్స్ తీసుకున్నట్లు పోలీసుల వద్ద ఎలాంటి సాక్ష్యాలు లేవని కోర్టు దృష్టికి ఆయన తీసుకువెళ్లారు. అయితే, హేమ రేవ్ పార్టీలో పాల్గొన్నట్లు అందుకు సంబంధించిన ఆధారాలను సీసీబీ న్యాయవాది కోర్టుకు అందించారు. ఇరువురి వాదనలు విన్న న్యాయస్థానం నటి హేమకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. -
మెక్సికో పీఠంపై మహిళ!
అపారమైన వనరులున్నా ఏనాడూ కంటి నిండా కునుకు లేని మెక్సికో ప్రజానీకం అధ్యక్ష ఎన్నికల్లో వరసగా రెండోసారి సైతం వామపక్ష మొరెనా పార్టీకి పట్టంగట్టారు. ఆరుపదుల వయసుగల యూదు మహిళ క్లాడియా షీన్బామ్ను అధ్యక్ష పీఠానికి ఎన్నుకున్నారు. రెండు శతాబ్దాల రిపబ్లిక్ చరిత్రలో మహిళ దేశాధినేత కావటం ఇదే ప్రథమం. జనాభాలో యూదులు అత్యల్ప సంఖ్యాకులు కావటం గమనించదగ్గది. వచ్చే అక్టోబర్లో ఆమె పదవీబాధ్యతలు చేపడతారు. ఆకలి,నిరుద్యోగం, డ్రగ్స్ విజృంభణ, వ్యక్తుల అదృశ్యం... ఒకటి కాదు, మెక్సికోను సవాలక్ష సమస్యలు పీడిస్తున్నాయి. అంతటా నిరాశా నిస్పృహలు అలుముకున్న తరుణంలో అంతవరకూవున్న రెండు పార్టీల వ్యవస్థను బద్దలుకొడుతూ మొరెనా పార్టీ రంగంలోకొచ్చింది. 2018లో ఆరేళ్లకాలానికి అధ్యక్షుడైన ఆండ్రస్ మ్యాన్యువల్ లొపెజ్ అబ్రడార్ (ఆమ్లో) ఆశించిన స్థాయిలో పాలించకపోయినా శాంతిభద్రతలను కాస్త అదుపు చేయగలిగారు. అదే సమయంలో సంక్షేమపథకాలు అందించటం, మౌలిక సదుపాయాలు పెంచటం మొరెనా పార్టీని రెండోసారి అందలం ఎక్కించింది. అలాగని అంతా సవ్యంగా ఉందని కాదు. ఏడాదికి సగటున 30,000 హత్యలు జరగటం, అందులో 90 శాతం మిస్టరీగా మిగిలిపోవటం మెక్సికో ప్రత్యేకత. ఈ హత్యల్లో డ్రగ్స్ మాఫియాల వాటాతోపాటు, వాటిని అదుపు చేసే సాకుతో పారా మిలిటరీ దళాలు సాగించే నరమేధమూ ఉంటుంది. మారుమూల పల్లెల్లో ఏదో ఒకచోట హఠాత్తుగా ఖననం చేసిన శవాల గుట్టలు లేదా మాదకద్రవ్యాల డంప్లు బయటపడతాయి. అమెరికాకు చాటుగా వలసదారుల తరలింపు మరో పెద్ద వ్యాపారం. మూడునెలలక్రితం అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కొండ ప్రాంత ఆవాసాలపై మాదకద్రవ్య ముఠాలు డ్రోన్లతో బాంబుల వర్షం కురిపించి వందలాది పౌరులను హతమార్చటంతోపాటు ఇళ్లను దహనం చేశారు. గ్రామస్థులు తమ సమాచారం పారా మిలిటరీ దళాలకు చేరేస్తున్నారన్నది వారి అనుమానం. ఈ అధ్యక్ష ఎన్నిక సందర్భంగా దాదాపు డజనుమంది అభ్యర్థుల్ని మాదకద్రవ్యాల ముఠా కాల్చిచంపింది. ఇన్ని సమస్యలతో సతమతమయ్యే దేశానికి అధ్యక్షురాలు కావటం నిజానికి కత్తి మీద సామే. చిత్రమేమంటే అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో ఆమె శాంతిభద్రతల అదుపు కోసం ఏం చేస్తానన్నది చెప్పలేదు. కానీ మెక్సికో నగర మేయర్గా పనిచేసిన అనుభవం ఆమెకు అక్కరకొస్తుందన్న ఆశ జనానికి ఉంది. నగరాన్ని సీసీ కెమెరాలతో నింపడం, నేరాలు తరచూ జరిగే ప్రాంతాల్లో నిరంతరం పోలీసు బలగాలను మోహరించటం వంటివి హత్యలను గణనీయంగా తగ్గించాయని గణాంకాలు చెబుతున్నాయి. అయితే ఈ సంఖ్య వాస్తవాలను ప్రతిబింబించటం లేదన్నది విపక్షాల ఆరోపణ. నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా సాగిన 1968 నాటి విద్యార్థి ఉద్యమంతో సహా అనేక సామాజికోద్యమాల్లో పాల్గొన్న యూదు కుటుంబంలో జన్మించటం వల్ల అటు రాజకీయాలపైనా, ఇటు పర్యావరణంపైనా ఆమెకు ఆది నుంచీ ఆసక్తి. అందుకే ఆ రంగంలో ఆమె పీహెచ్డీ చేయటంతోపాటు క్యాలిఫోర్నియా యూనివర్సిటీలో తన అధ్యయనాన్ని కొనసాగించి నైపుణ్యానికి పదును పెట్టుకున్నారు. పర్యావరణ పరిరక్షణకు కృషి చేసినందుకు 2007లో నోబెల్ పురస్కారాన్ని గెల్చుకున్న శాస్త్రవేత్తల బృందంలో క్లాడియా ఒకరు. 2018లో తెరపైకొచ్చిన మొరెనా పార్టీ ఆమెను సహజంగానే ఆకర్షించింది. వెంటనే మెక్సికో మేయర్ పదవి కూడా వరించింది. ఆ పదవికి మహిళ ఎన్నిక కావటం కూడా అదే ప్రథమం. 31 రాష్ట్రాలూ, 13 కోట్ల జనాభాగల దేశంలో నేరాలను అరికట్టడం మెక్సికో నగరాన్ని దారికి తెచ్చినంత సులభం కాదు. చాలా రాష్ట్రాల్లో మాదకద్రవ్య ముఠాలు వాహన సముదాయాల్లో ఏకే–47 తుపాకులతో సంచరించటం, పోలీసులు సమాచారం అందుకుని వచ్చేలోపే హత్యాకాండ ముగించి నిష్క్రమించటం తరచు కనబడే దృశ్యాలు. తల్లిదండ్రుల ఆలనా పాలనాలేని పిల్లల్ని, యువతను చేరదీస్తామని వారిలో అమాయకంగా కనబడేవారికి ప్రాధాన్యమిచ్చి ఏళ్లతరబడి ఆయుధ శిక్షణ ఇచ్చి మాదకద్రవ్యాల పంపిణీకీ హత్యలకూ వినియోగిస్తామని మాదకద్రవ్య ముఠా నాయకుడొకరు చెప్పాడు. ఆ కోణంలో దృష్టి సారించి పాఠశాల విద్య నుంచే స్కాలర్షిప్లిచ్చే పథకాన్ని ఆమ్లో అమలుచేశారు. కానీ పెద్దగా ఫలించలేదు. ఇవన్నీ అంతర్గత సమస్యలు. పొరుగునున్న అమెరికాతో అనేక పేచీలున్నాయి. ఆ దేశంలో ట్రంప్ తిరిగి అధికారంలోకి రాబోతున్నారన్న కథనాలు మెక్సికోకు ఇబ్బందిగానే ఉన్నాయి. ఆ దేశంనుంచి వలసలను అరికట్టడానికీ, మాదకద్రవ్యాలను కట్టడి చేయటానికీ సరిహద్దుల్లో గోడ నిర్మిస్తానని గతంలో ట్రంప్ ప్రకటించి పని మొదలెట్టినా బైడెన్ వచ్చాక ఆగిపోయింది. మరోపక్క లాటిన్ అమెరికా దేశాల్లో అమెరికాతో వాణిజ్యం నెరపే దేశాల్లో మెక్సికోయే నంబర్ వన్. అందువల్ల ఆ దేశాన్ని అంత సులభంగా అమెరికా వదులుకోలేదు. పైగా మెక్సికో పరిశ్రమల్లో ఉత్పత్తయ్యే కార్ల విడిభాగాల వల్లే అమెరికాలోని డెట్రాయిట్లో కార్ల పరిశ్రమలు సజావుగా సాగుతున్నాయి. మెక్సికో పవన విద్యుత్తోనే అమెరికా తయారీరంగ పరిశ్రమలు లక్షలమంది అమెరికన్లకు ఉపాధినిస్తున్నాయి. హృద్రోగులకు వాడే పేస్మేకర్లు మొదలుకొని పండ్లు, కూరగాయలు, ఆహారధాన్యాల వరకూ చాలా భాగం మెక్సికో నుంచి రావాల్సిందే. అందుకే ఇరుదేశాల వాణిజ్యమూ నిరుడు 80 వేల కోట్ల డాలర్ల వరకూ సాగింది. కనుక నేరస్థముఠాలను అరికట్టి శాంతిభద్రతలు తీసుకురాగలిగితే మెక్సికో సుసంపన్న దేశాల్లో ఒకటై నిలుస్తుంది. క్లాడియా ఆ పని చేయగలరా అన్నదే పెద్ద ప్రశ్న. -
గుజరాత్లో రూ. 130 కోట్ల విలువైన కొకైన్ స్వాధీనం
గాంధీనగర్: గుజరాత్లో భారీగా డ్రగ్స్ పట్టుబడింది. కచ్ తీరంలో సుమారు రూ. 130 కోట్ల విలువైన 13 ప్యాకెట్ల కొకైన్ను గురువారం తెల్లవారుజామున పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గాంధీధామ్ పట్టణంలోని మితి రోహర్ ప్రాంతంలో స్మగ్లర్లు సముద్ర తీరంలో మాదకద్రవ్యాలను దాచి పెట్టినట్లు సమాచారం అందుకున్న పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో 13 ప్యాకెట్ల కొకైన్ను పట్టుకున్నారు. దీని విలువ రూ.130 కోట్లకు పైగా ఉంటుందని కచ్-ఈస్ట్ డివిజన్ పోలీసు సూపరింటెండెంట్ సాగర్ బాగ్మార్ పేర్కొన్నారు. స్మగ్లర్లు కొకైన్ పట్టుబడకుండా సముద్ర తీరంలో ప్యాకెట్లను దాచిపెట్టినట్లు తెలిపారు. వీటిని తరలిస్తున్న నిందితులను అదుపులోకి తీసుకున్నారు. గత ఏడాది సెప్టెంబర్లో ఇదే ప్రాంతంలో రూ.800కోట్ల విలువైన 80 కొకైన్ ప్యాకెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. -
Gujarat: పిల్లల బొమ్మల్లో, లంచ్ బాక్సుల్లో దాచి..
గాంధీ నగర్: గుజరాత్ రాష్ట్రంలో భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. అహ్మదాబాద్లో విదేశాల నుంచి వచ్చిన వారి నుంచి సుమారు రూ. కోటికి పైగా విలువైన డ్రగ్స్ను కస్టమ్ అధికారులు శనివారం స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసుకు సంబంధించిన ఒకరిని అదుపులోకి తీసుకున్నారు.వివరాలు.. అహ్మదాబాద్ క్రైమ్ బ్రాంచ్తోపాటు కస్టమ్స్, ఎక్సైజ్ శాఖ అధికారులు సంయుక్త ఆపరేషన్ చేపట్టారు. ఈ ఆపరేషన్లో అమెరికా, కెనడా, థాయ్లాండ్ నుంచి వచ్చిన వారి వద్ద నుంచి రూ. 1.15 కోట్ల విలువైన హైబ్రిడ్, సింథటిక్ గంజాయి పొట్లాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వీటిని చిన్నారుల ఆట బొమ్మలు, చాక్లెట్లు, లంచ్ బాక్స్లు, క్యాండీ విటమిన్లల్లో దాచి అక్రమంగా తరలిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ కేసుకు సంబంధించి ఓ విదేశీయుడిని అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. -
ఓజీ ఖుష్.. హైదరాబాద్లో కొత్తరకం డ్రగ్స్ పట్టివేత
హైదరాబాద్, సాక్షి: నగరంలో అత్యంత ప్రమాదకరమైన.. కొత్తరకం డ్రగ్స్ దందాను పోలీసులు పట్టుకున్నారు. అమెరికా, ఆఫ్రికా దేశాల్లో ఎక్కువ అక్రమ రవాణా, వినియోగం జరిగే ఓజీ ఖుష్ డ్రగ్స్ను ఇక్కడ స్వాధీనం చేసుకున్నారు. ముంబై నుంచి బెంగళూరు మీదుగా ఈ మాదకద్రవ్యాన్ని హైదరాబాద్కు తీసుకొచ్చి ఓ గ్యాంగ్ విక్రయిస్తున్నట్లు పోలీసులు నిర్ధారించుకున్నారు. ఓజీ ఖుష్ గంజాయిలో ఓ రకం. ఇది అత్యంత ప్రమాదకరమైంది. అఫ్గనిస్థాన్లోని హిందూఖుష్ కొండల్లో ఈ డ్రగ్స్ను సాగు చేస్తుంటారు. అందుకే దీని పేరులో ఖుష్ చేరింది. ఒక్క గ్రాము విలువ మన కరెన్సీలో రూ. 4 వేల దాకా ఉంటుందని టాస్క్ఫోర్స్ పోలీసులు చెబుతున్నారు. ప్రస్తుతం లాలాగూడలో స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ రూ.10 లక్షల దాకా ఉండొచ్చని పోలీసులు అంచనా వేస్తున్నారు. -
డ్రగ్స్ విక్రయిస్తున్న ఇద్దరి అరెస్ట్
రాజేంద్రనగర్: గుట్టు చప్పుడు కాకుండా నిషేధిత డ్రగ్స్ను విక్రయిస్తున్న ఇద్దరిని శంషాబాద్ ఎక్సైజ్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 270 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్స్ను స్వాదీనం చేసుకున్నారు. సన్సిటీ బండ్లగూడ జాగీర్లోని ఓ సూపర్ మార్కెట్ సమీపంలో గురువారం మహారాష్ట్రకు చెందిన తృప్తి ప్రభాకర్ హోకం (21), మధ్యప్రదేశ్ శివుపురి గ్వాలియర్ ప్రాంతానికి చెందిన అనుభవ్ సక్సేనా (24)లు బ్యాగ్తో ప్యాసింజర్ ఆటోదిగి అనుమానాస్పదంగా తిరుగుతున్నారు. దీనిపై సమాచారం అందుకున్న శంషాబాద్ ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్ ఎం.రాఘవేందర్, కానిస్టేబుళ్లు వారిని అదుపులోకి తీసుకొని తనిఖీలు చేయగా తెల్లటి పౌడర్ రూపంలో ఉన్న 270 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్ లభించింది. దీంతో పోలీసులు విచారణ చేపట్టగా.. తాము ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తూ.. ఎండీఎం డ్రగ్స్ను ఐటీ, ఈవెంట్ మేనేజర్లకు విక్రయిస్తున్నామని తెలిపా రు. తాము చంద్రపూర్కు చెందిన సాబేర్ అనే వ్యక్తి ద్వారా కొరియర్ తెప్పించుకొని ఎక్కువ ధరలకు హైదరాబాద్లో విక్రయిస్తున్నట్లు తెలిపారు. ఎండీఎంఏ డ్రగ్ విలువ మార్కెట్లో రూ.20 లక్షలు ఉంటుందన్నారు. -
విచారణకు రాలేనంటూ లేఖ రాసిన హేమ
బెంగళూరు శివార్లలోని జీఆర్ ఫామ్హౌస్లో ఈ నెల 19న జరిగిన రేవ్ పార్టీలో పాల్గొన్నట్లు నటి హేమ పేరు బయటకు రావడంతో టాలీవుడ్లో సంచలనంగా మారింది. రేవ్ పార్టీలో పాల్గొన్నవారి రక్త నమూనాలను ల్యాబ్లో పరీక్షించగా 86 మంది డ్రగ్స్ సేవించినట్లు తేలింది. ఈ క్రమంలో హేమ బ్లడ్ షాంపిల్స్లో కూడా డ్రగ్స్ ఉన్నట్లు గుర్తించిన పోలీసులు నోటీసులు కూడా జారీ చేశారు. దీంతో హేమ నేడు మే 27న విచారణకు వెళ్లాల్సి ఉంది. అయితే, ఆమె విచారణకు హాజరుకాలేనని లేఖ ద్వారా తెలిపింది.వైరల్ ఫీవర్తో బాధపడుతున్నట్లు లేఖ ద్వారా పోలీసులకు హేమ తెలిపింది. అయితే ఆ లేఖను సీసీబీ పరిగణలోకి తీసుకోలేదని తెలుస్తోంది. తనకు ఆరోగ్యం సహకరించడం లేదని, విచారణకు మరికొంత సమయం ఇవ్వాలని హేమ కోరింది. అయితే, నేడు సాయంత్రం హేమకు మరో నోటీసు జారీ చేసే అవకాశం ఉందని పోలీసు వర్గాలు తెలుపుతున్నాయి. -
అసలు ‘రేవ్’ రచ్చ గురించి తెలుసా?
బనశంకరి: ప్రస్తుతం ఎక్కువగా వినిపిస్తున్న మాట రేవ్ పార్టీ. బెంగళూరు నగరంలో నిర్వహించిన రేవ్ పార్టీలో పాల్గొన్నవారిలో అధిక మంది తెలుగువాళ్లే ఉన్నారని అందులోనూ రాజకీయ, సినీప్రముఖులు ఉన్నారని ప్రచారం జరుగుతోంది. అసలు రేవ్ పార్టీలు అంటే ఏమిటి, ఇందులో కేవలం సెలబ్రెటీలే ఎందుకు పాల్గొంటారు, ఆ పార్టీలో ఎలాంటి పనులు చేస్తారు, ఎందుకు సంపన్నులకు అంత వెర్రి అని ప్రజలు ఆసక్తి కనబరుస్తున్నారు. సోషల్ మీడియాలో ఓ పోస్ట్ వైరల్కాగా.. క్లారిటీ ఇచ్చే యత్నమే ఈ కథనం. నైట్ క్లబ్లు, పబ్లు అనే పాశ్చాత్య సంస్కతి దేశంలో వేళ్లూనుకున్నాయి. సెలబ్రెటీలు, బడాబాబులు.. వాటిలో తనివితీరా ఎంజాయ్ చేయడం జరుగుతుంది. అంతకుమించి కావాలనుకునేవారి కోసం రేవ్ పార్టీలు రెడీగా ఉంటాయి. రేవ్ పార్టీ అనే సంస్కృతి 1950లో ఇంగ్లండ్లో ప్రారంభమై మెల్లగా ప్రపంచమంతా విస్తరించింది. ఈ కల్చర్ ప్రారంభమైన కొత్తల్లో పెద్ద హాల్, లేదా ఎక్కడైనా చుట్టూ మూసి ఉన్న ప్రదేశంలో పెద్దగా మ్యూజిక్ పెట్టుకొని డ్యాన్సులు చేయడం, కావలసినంత మద్యం తాగడమే. ఆ షోలో నృత్యాలు చేసే కళాకారులు కూడా ఉండేవారు. అయితే..రానురాను ఈ పార్టీకి అర్థం మారుతూ వస్తుంది. ఇందులోకి విచ్చలవిడి సంస్కృతి ప్రవేశించింది. నెమ్మదిగా ఈ రేవ్ పార్టీల్లోకి చట్టవిరుద్ధమైన కార్యకలాపాలు జత అయ్యాయి. అతిథులు ఈ పారీ్టల్లో విచ్చలవిడిగా డ్రగ్స్ సేవిస్తూ అశ్లీల నృత్యాలు చేయడం ఉంటాయని సమాచారం. అన్నింటికీ తెగించేవారే ఈ పార్టీల్లో పాల్గొంటారని సమాచారం. అన్ని రకాల హడావుడిముంబై, చెన్నై, బెంగళూరు,హైదరాబాద్ లాంటి నగరాల్లోనే ఈ కల్చర్ పెరిగిపోతుంది. ఇతరులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా పార్టీలు చేసుకోవడం సబబే, కానీ పెద్ద పెద్ద సౌండ్లు పెట్టుకోవడం, అరుపులు, కేకలతో స్థానికులకు ఇబ్బంది పెట్టడం చట్ట విరుద్ధమే అవుతుంది. పైగా డ్రగ్స్, జూదం వంటి అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయని పోలీసులు అడుగు పెడుతున్నారు. సాధారణమైనా, రేవ్ అయినా పార్టీలపై పోలీసులు రైడ్చేసి అందులో డ్రగ్స్ వినియోగం ఏమైనా జరిగిందా లేదా అన్నది చూస్తారు. అశ్లీలత జరిగిందా, మైనర్లు పాల్గొన్నారా అన్నది కూడా ఆరాతీస్తారు. అనుమానం ఉంటే రక్తం, వెంట్రుకల నమూనాలను తీసుకుని టెస్టులకు పంపిస్తారు. ఆపై కౌన్సెలింగ్ ఇచ్చి పంపిస్తారు. డ్రగ్స్ వాడినట్లు తేలితే చట్టప్రకారం చర్యలు ఉంటాయి. టికెట్ చాలా రేటు సాధారణంగా రేవ్ పార్టీలంటే చాలా ఖరీదైన వ్యవహారం. బెంగళూరులో జరిగిన రేవ్పార్టీకి ఎంట్రీ ఫీజు సుమారు రూ.50 లక్షలు అని ప్రచారం సాగుతోంది. ఇంత డబ్బు పోసి టికెట్ కొనాలి. వాటిని చాలా గోప్యంగా నిర్వహిస్తారు. ఈ పారీ్టలో పరిమిత సంఖ్యలో పాల్గొనేలా ప్లాన్ చేస్తారు. అతిథుల అభిరుచులను బట్టి పార్టీలో ఏర్పాట్లు ఉంటాయి. మద్యం, డ్రగ్స్, ఇంకా కొన్ని అంశాలు లభిస్తాయి. రేవ్పార్టీని బడా బాబుల ఫాంహౌస్, గెస్ట్ హౌస్లలో నిర్వహిస్తారు. 24 గంటల నుంచి 3 రోజుల వరకు కొనసాగవచ్చు. ఆహారం, ఆల్కహాల్ వంటి అన్ని వసతులూ లభిస్తాయి. ఊహల్లో మాత్రమే లభించే రకరకాల ఫాంటసీ కార్యక్రమాలు కూడా అందుబాటులో ఉన్నా ఆశ్చర్యం లేదు. అందుకే అంత మోజు అంటారు. పార్టీలోకి మొబైల్ ఫోన్లు, కెమెరాలు అనుమతించరు.ఉద్యానగరిలో దందా గత కొన్నేళ్లుగా సిలికాన్ సిటీలో రేవ్పార్టీలు గుట్టుచప్పుడు కాకుండా నిర్వహిస్తున్నారు. ఇక్కడ అనువైన వాతావరణం ఉండడమే కారణం. రెండేళ్ల క్రితం నగర పోలీసులు దాడిచేసి పలువురు సినీ సెలబ్రెటీలను అరెస్ట్ చేయడంతో పాటు డ్రగ్స్ను కూడా పట్టుకున్నారు. టెక్కీలు, ధనవంతును లక్ష్యంగా చేసుకుని ఇలాంటి ఖరీదైన పార్టీలను సాగిస్తున్నారు. వాటి నిర్వాహకులకు అటు నాయకులు, ఇటు ఖాకీలతో సంబంధాలు ఉండడంతో చూసీచూడనట్లు ఉన్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఏవో కొన్నిసార్లు మాత్రమే దాడులు జరుగుతున్నాయి. కొన్నిరోజులు హడావుడి జరగడం, ఆపై సద్దుమణగడం షరా మామూలుగా మారుతోంది. -
డ్రగ్స్ కేసులో ప్రముఖ సింగర్ అరెస్ట్
అమెరికన్ ప్రముఖ ర్యాపర్, గాయని నిక్కీ మినాజ్(41) అరెస్ట్ అయింది. అయితే, కొన్ని గంటల తర్వాత మళ్లీ ఆమెను విడుదల చేశారు. ఇంగ్లండ్లోని మాంచెస్టర్లో నిక్కీ మినాజ్కు ఈవెంట్ ఉంది. ఆ కార్యక్రమానికి వెళ్లేందుకు ఆమ్స్టర్డామ్లోని షిపోల్ ఎయిర్పోర్ట్ వద్దకు నిక్కీ చేరుకుంది. తన బ్యాగ్లో డ్రగ్స్ తీసుకెళ్తున్నట్లు ఆమెపై ఆరోపణలు రావడంతో ఆమ్స్టర్డామ్ అధికారులు ఆమెను నిర్బంధించారు. దీంతో ఆమె షెడ్యూల్ ప్రకారం జరగాల్సిన సంగీత్ కార్యక్రమం వాయిదా పడింది. ఆమె పాల్గొంటున్న ప్రోగ్రామ్ కోసం సుమారు ఇరువై వేల మంది టికెట్లు కొన్నారు. నిక్కీ వద్ద డ్రగ్స్ ఉన్నాయని సమాచారం రావడంతో తనిఖీల పేరుతో ఆమెను కొన్ని గంటల పాటు ఎయిర్పోర్టులోనే పోలీసులు ఉంచారు. ఫైనల్లీ తనవద్ద డ్రగ్స్ లేవని తేలడంతో ఆమెను పోలీసులు వదిలిపెట్టారు. అప్పటికే సమయం గడిచిపోవడంతో ఆమె పాల్గొనాలనుకున్న కార్యక్రమం వాయిదా పడింది. అయితే మరో కొత్త తేదీని ప్రకటిస్తామని అభిమానులకు నిక్కీ టీమ్ తెలిపింది. అయితే, పోలీసుల తీరుపట్ల నిక్కీ మినాజ్ అసహనం వ్యక్తం చేసింది. తన వద్ద డ్రగ్స్ లేకున్నా కావాలనే తన ప్రోగ్రామ్ చెడగొట్టేందుకు ఎవరో ఇలాంటి గేమ్ ప్లాన్ చేశారని ఆరోపించింది. అభిమానులు కూడా ఆమెకు మద్దతు తెలుపుతున్నారు.కాగా 2010లో ‘పింక్ ఫ్రైడే’ అల్బమ్ తో నిక్కీ మినాజ్ పాప్ సంగీత ప్రపంచంలోకి అడుగుపెట్టింది. ది పింక్ ప్రింట్, క్వీన్, ప్లే టైమ్ ఈజ్ ఓవర్ వంటి ఆల్బమ్స్ తో మంచి పేరు తెచ్చుకుంది. మినాజ్ ఎప్పటికప్పుడు అత్యంత ప్రభావవంతమైన హిప్ హాప్ కళాకారులలో ఒకరిగా గుర్తింపు తెచ్చుకుంది. తన కెరీర్ మొత్తంలో 10 గ్రామీ నామినేషన్లు, తొమ్మిది అమెరికన్ మ్యూజిక్ అవార్డులు, 11బీఈటీ అవార్డులు , నాలుగు బిల్బోర్డ్ మ్యూజిక్ అవార్డులు, ఇతర పురస్కారాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా పలువురి సంగీత అభిమానుల ప్రశంసలను ఆమె సొంతం చేసుకుంది. View this post on Instagram A post shared by Barbie (@nickiminaj) -
హేమకు మద్దతు ప్రకటించిన మంచు విష్ణు
బెంగళూరు శివార్లలోని జీఆర్ ఫామ్హౌస్లో ఈ నెల 19న జరిగిన రేవ్ పార్టీలో పాల్గొన్నట్లు నటి హేమ పేరు బయటకు రావడంతో టాలీవుడ్లో సంచలనంగా మారింది. తాజాగా రేవ్ పార్టీలో పాల్గొన్నవారి రక్త నమూనాలను ల్యాబ్లో పరీక్షించగా 86 మంది డ్రగ్స్ సేవించినట్లు తేలింది. ఈ క్రమంలో హేమ బ్లడ్ షాంపిల్స్లో కూడా డ్రగ్స్ ఉన్నట్లు గుర్తించిన పోలీసులు నోటీసులు కూడా జారీ చేశారు. దీంతో హేమ మే 27న విచారణకు వెళ్లనున్నట్లు సమాచారం.బెంగళూరు రేవ్ పార్టీ వ్యవహారంపై మా అధ్యక్షుడు మంచు విష్ణు తన ఎక్స్ పేజీలో ఒక ట్వీట్ చేశారు. నటి హేమపై కొన్ని మీడియా సంస్థలు చేస్తున్న అసత్య ప్రచారాలు ఆపాలని ఆయన కోరారు. ఆమెపై ఇంకా నేరం రుజువు కాలేదని ఆయన గుర్తుచేశారు. ఎవరికి వారే హేమ తప్పుచేసినట్లు నిర్ధారిస్తే ఎలా అని ప్రశ్నించారు. శ్రీమతి హేమ దోషిగా రుజువయ్యే వరకు నిర్దోషిగానే భావించబడాలి. ఆమె కూడా ఒక తల్లి, భార్య అని గుర్తించాలి. ఇలాంటి పుకార్ల ఆధారంగా చేసుకుని ఆమెను దూషించడం అన్యాయం.మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (MAA) చట్టవిరుద్ధమైన కార్యకలాపాలను తప్పకుండా ఖండిస్తుంది. ఒకవేళ హేమ మీద వచ్చిన ఆరోపణలకు సంబంధించిన సరైన ఆధారాలను పోలీసులు ఇస్తే ఆమెపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. అప్పటి వరకు, దయచేసి నిరాధారమైన వార్తలను వ్యాప్తి చేయకుండా ఉండాలి.' అని మంచు విష్ణు విజ్ఞప్తి చేశారు.Regarding the recent drug-related case at a rave party, few media outlets and individuals are making baseless allegations about actress Ms.Hema.I urge everyone to refrain from jumping to conclusions and spreading unverified information. Ms.Hema deserves to be presumed innocent…— Vishnu Manchu (@iVishnuManchu) May 25, 2024 -
TDP.. తెలుగు డ్రగ్స్ పార్టీ
బెంగళూరు: కర్ణాటకలోని బెంగళూరు నగరంలో జరిగిన రేవ్ పార్టీలో టీడీపీ మూలాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. రేవ్ పార్టీలో డ్రగ్స్ విక్రయించిన నిందితుల్లో మరో ఇద్దరు టీడీపీ నేతలు హస్తం ఉన్న విషయం తాజాగా బయటపడింది.చిత్తూరు జిల్లా మద్దిపట్ల పల్లికి చెందిన ప్రణీత్ చౌదరితో పాటు అదే జిల్లా కొండేటివండ్ల గ్రామానికి చెందిన సుకుమార్ నాయుడు ఉన్నట్లు తేలింది. ఈ ఇద్దరూ టీడీపీ బెంగళూరు ఐటీ ఫారంకి చెందిన కీలక వ్యక్తులు. వీరికి పూతలపట్టు టీడీపీ అభ్యర్థి మురళితో సత్సంబంధాలున్నాయి.కాగా, అంతకుముందు రేవ్ పార్టీలో డ్రగ్స్ విక్రయించిన ఐదుగురు ప్రధాన నిందితుల ఫోటోలు, వివరాలను బెంగళూరు పోలీసులు వెల్లడించగా, తాజాగా ప్రణీత్ చౌదరి, సుకుమార్ నాయుడులు సైతం ఇందులో నిందితులుగా ఉన్నట్లు గుర్తించారు.చిత్తూరుకు చెందిన టీడీపీ యువనేత రణధీర్ విక్రమ్నాయుడు, టీడీపీ కార్యకర్త కాణిపాకానికి చెందిన అరుణ్కుమార్నాయుడులు ఈ రేవ్ పార్టీకి డ్రగ్స్ సప్లై చేశారు. వీళ్లపై మాదక ద్రవ్యాల నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.రణధీర్విక్రమ్నాయుడుకు చిత్తూరులోని టీడీపీకి చెందిన పలువురు నేతలతో సన్నిహిత సంబంధాలున్నాయంటున్నారు. అరుణ్కుమార్నాయుడుది కాణిపాకం సమీపంలోని మద్దిపట్లపల్లెగా చెబుతున్నారు. బెంగళూరు ఎలక్ట్రానిక్ సిటీలో జరిగిన రేవ్ పార్టీలో 101 మందిని పట్టుకున్న పోలీసులు ఐదుగురు మినహా.. మిగిలినవాళ్లను సొంత పూచికత్తుపై విడుదల చేశారు. వీళ్ల రక్తనమూనాలు సేకరించగా, విచారణకు ఎప్పుడు పిలిచినా హాజరుకావాలని షరతు పెట్టారు.డ్రగ్స్ అయినా, స్కాములైనా సూత్రధారులు మాత్రం తెలుగు డ్రగ్స్ పార్టీ (టీడీపీ) వాళ్ళే!బెంగళూరు రేవ్ పార్టీలో డ్రగ్స్ సప్లై చేసిన వాళ్ళలో @naralokesh కి ముఖ్య అనుచరులు అయిన చిత్తూరు జిల్లాకు చెందిన మద్దిపట్ల ప్రణీత్ చౌదరి (ఐటీ ఎంప్లాయ్) కొండేటి సుకుమార్ నాయుడు (సీఈవో) Eavetop… pic.twitter.com/8zi7mwScAH— YSR Congress Party (@YSRCParty) May 24, 2024మాదక ద్రవ్యాలు విక్రయించిన ఐదుగురిలో వీరిద్దరితో పాటు మొహ్మద్ అబూబక్కర్ సిద్ధికి, ఎల్.వాసు, డి.నాగబాబులున్నారు. నిందితుల నుంచి 15.56 గ్రా. ఎండీఎంఏ పిల్స్, 6 గ్రాముల హైడ్రో గాంజా, 6.2 గ్రాముల కొకైన్తో పాటు ఇతర మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. వీళ్లపై మాదక ద్రవ్యాల నిరోధక చట్టం–1985, సెక్షన్ 8(సి), 22(బి), 22(సి), 22(ఏ), 27(బి), 25, 27, ఐపీసీ 1860 సెక్షన్ 290, 294 కింద కేసులు నమోదు చేసి అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. అంతా ఓ పద్ధతి ప్రకారం.. వాసు బర్త్ డే పేరుతో నిర్వహించిన ఈ రేవ్ పార్టీలో వాస్తవానికి ఎలాంటి బర్త్ డే వేడుకలు జరగలేదు. ఉద్దేశపూర్వకంగా డ్రగ్స్ విక్రయించడం, వేశ్యా గృహాన్ని నిర్వహించడాన్ని పోలీసులు గుర్తించారు. రేవ్ పార్టీలోకి వచ్చే ప్రతి ఒక్కరికీ ఓ పాస్వర్డ్ ఇచ్చారు. వాసు బర్త్ డే పార్టీ అనే యూజర్ నేమ్, పాస్వర్డ్ చెప్పినవాళ్లకు మాత్రమే ఇక్కడ ప్రవేశం ఉంటుంది. ఇందుకోసం నిర్వాహకులు ఓ ప్యాకేజీ ఇచ్చారు. ఒక్కో వ్యక్తి నుంచి రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షల వరకు వసూలు చేసినట్టు తెలిసింది.‘సన్సెట్ టు సన్రైజ్ విక్టరీ’ పేరిట ఈ నెల 19వ తేదీ సాయంత్రం 5 నుంచి 20వ తేదీ ఉదయం 6 గంటల వరకు రేవ్ పార్టీ జరిగేలా ప్రణాళిక రూపొందించారు. తొలుత ఎలక్ట్రానిక్ సిటీ స్టేషన్ పరిధిలో కేసు నమోదవగా, తర్వాత హెబ్బాగోడికి బదిలీ చేయాలనుకున్నారు. తాజాగా ఈ కేసును సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ బెంగళూరు(సీసీబీ) పోలీసులకు అప్పగిస్తున్నట్లు కర్ణాటక పోలీసులు ప్రకటించారు. ఇందులో సెక్స్ రాకెట్ అంశం కూడా ఉన్నట్లు పోలీసులు అనుమానించి, ఆ దిశగా సైతం విచారణ చేస్తున్నారు.ఈ ఘటనలో పోలీసులు సీజ్ చేసిన కార్లలో ఫార్చూనర్ కారు ఏపీ 39 హెచ్ 0002 నంబర్తో ఉంది. ఇది చిత్తూరులోని గుడిపాల మండలం రాసనపల్లెకు చెందిన త్యాగరాజులు నాయుడు అనే వ్యక్తి పేరిట ఉంది. త్యాగరాజులు నాయుడు కారు అక్కడ ఎందుకు ఉందనే దానిపై పోలీసులు ఇప్పటికే విచారణ ప్రారంభించారు. ఇంతలోపు ఈ కారును తొమ్మిది నెలల కిందటే మరో వ్యక్తికి విక్రయించినట్లు, అతను ఇంకా కారును తన పేరిట మార్చకోలేదని కొత్త డ్రామా చేస్తున్నట్లు తెలుస్తోంది. చిత్తూరు నియోజకవర్గానికి చెందిన ఓ టీడీపీ ముఖ్య నేత ఈ కారును ఉపయోగించినట్లు సమాచారం. -
టాలీవుడ్ లో మరోసారి డ్రగ్స్ ప్రకంపనలు
-
డ్రగ్స్ పార్టీలో ట్విస్ట్.. నటి హేమ రక్త నమూనా రిపోర్ట్ విడుదల
బెంగళూరు నగర శివారులోని ఓ ఫాంహౌస్లో జరిగిన రేవ్పార్టీ టాలీవుడ్ను కుదిపేసింది. ఈ పార్టీలో సినీ ప్రముఖులు కూడా పాల్గొన్నట్లు నగర పోలీస్ కమిషనర్ బి.దయానంద్ తెలిపారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ ప్రజాప్రతినిధులెవరూ ఈ పార్టీలో పాల్గొనలేదన్నారు. అయితే, పట్టుబడిన వారి బ్లడ్ శాంపిల్స్ రిపోర్ట్ను వారు విడుదల చేశారు. దీంతో సినీ నటి హేమకు చిక్కులు తప్పవని తెలుస్తోంది. రక్త నమూనాలో డ్రగ్స్ ఆనవాళ్లుఈ రేవ్ పార్టీలో మందుతో పాటు పెద్ద ఎత్తున డ్రగ్స్ వాడకం కూడా జరిగినట్లు పోలీసులు తెలిపారు. రేవ్ పార్టీలో పాల్గొన్న సుమారు 150 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారందరి రక్త నమూనాలను నార్కోటిక్ టీం సేకరించింది. తాజాగా అందరి రక్త నమూనా రిపోర్ట్లు వచ్చాయని కర్ణాటక పోలీసులు తెలిపారు. తెలుగు నటి హేమ రక్త నమూనాలో డ్రగ్స్ ఆనవాళ్లు ఉన్నట్లు గుర్తించామని వారు తెలిపారు.86 మందికి పాజిటివ్డ్రగ్ టెస్టులో నటి హేమ సహా 86 మందికి పాజిటివ్గా తేలిందని కర్ణాటక పోలీసులు తెలిపారు. డ్రగ్స్ తీసుకున్నట్లు రక్త నమూనా పరీక్షలో నిర్ధారణ అయిన వ్యక్తులకు సీసీబీ నోటీసులు ఇస్తుందన్నారు. పట్టుబడిన వారిలో 59 మంది పురుషుల రక్త నమూనాల్లో డ్రగ్స్ ఆనవాళ్ళు ఉన్నాయన్నారు. 27 మంది మహిళల రక్త నమూనాల్లో డ్రగ్స్ తీసుకున్నట్లు రిపోర్ట్ వచ్చిందన్నారు. ఇప్పటి వరకు 103 మందిలో మొత్తం 86 మంది డ్రగ్స్ తీసుకున్నట్లు తేలిందన్నారు. వారందరికీ సమన్లు జారీ చేసి కౌన్సెలింగ్కు పిలిచే అవకాశం ఉంటుందన్నారు. డ్రగ్స్ తీసుకున్నవాళ్లను బాధితులుగా పరిగణించేందుకే ఎక్కువ అవకాశాలు ఉంటాయని పోలీసులు తెలుపుతున్నారు.పేరు మార్చుకున్న హేమబెంగుళూరు డ్రగ్స్ కేసులో పోలీసులకు నటి హేమ వరుసగా ట్విస్ట్లు ఇచ్చింది. పార్టీకి వెళ్తున్న క్రమంలో తన పేరు బయటికి రాకుండా ఆమె చాలా జాగ్రత్తలు తీసుకుంది. తన అసలు పేరుకు బదులుగా కృష్ణవేణి పేరుతో పార్టీకి వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. హేమా, చిరంజీవి, ఆశి రాయికి బెంగుళూరు సీసీబి పోలీసులు నోటిసులు ఇవ్వనున్నారు.రేవ్ పార్టీలో తెలుగు సినీనటి హేమ పేరు వచ్చిన వెంటనే ఆమె జాగ్రత్త పడి, ఫాంహౌస్ ఖాళీ స్థలంలోకి వెళ్లి నేను ఆ పార్టీలో లేను, హైదరాబాద్లో ఫాంహౌస్లో ఉన్నాను అని చెప్పింది. ఆ సమయంలో ఆమె ఫోటోను పోలీసులు విడుదల చేశారు. ఆ తర్వాత ఆమె తన ఇంట్లో ఉన్న మరొ వీడియోను విడుదల చేసింది. అయితే, తాజాగా పోలీసులు ఇచ్చిన ప్రకటనతో ఆమె ఇంకా రియాక్ట్ కాలేదు. -
‘రేవ్’ పార్టీలో చిత్తూరు టీడీపీ నేతలు!
చిత్తూరు అర్బన్: కర్ణాటకలోని బెంగళూరు నగరంలో జరిగిన రేవ్ పార్టీలో టీడీపీ మూలాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. రేవ్ పార్టీలో డ్రగ్స్ విక్రయించిన ఐదుగురు ప్రధాన నిందితుల ఫొటోలు, వివరాలను బెంగళూరు పోలీసులు వెల్లడించారు. వీరిలో చిత్తూరుకు చెందిన టీడీపీ యువనేత రణధీర్ విక్రమ్నాయుడు, టీడీపీ కార్యకర్త కాణిపాకానికి చెందిన అరుణ్కుమార్నాయుడు ఉన్నారు. ఐదుగురు నిందితులను అరెస్టు చేసిన బెంగళూరు పోలీసులు, వీళ్లపై మాదక ద్రవ్యాల నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రణధీర్విక్రమ్నాయుడుకు చిత్తూరులోని టీడీపీకి చెందిన పలువురు నేతలతో సన్నిహిత సంబంధాలున్నాయంటున్నారు. అరుణ్కుమార్నాయుడుది కాణిపాకం సమీపంలోని మద్దిపట్లపల్లెగా చెబుతున్నారు. బెంగళూరు ఎలక్ట్రానిక్ సిటీలో జరిగిన రేవ్ పార్టీలో 101 మందిని పట్టుకున్న పోలీసులు ఐదుగురు మినహా.. మిగిలినవాళ్లను సొంత పూచికత్తుపై విడుదల చేశారు. వీళ్ల రక్తనమూనాలు సేకరించగా, విచారణకు ఎప్పుడు పిలిచినా హాజరుకావాలని షరతు పెట్టారు. మాదక ద్రవ్యాలు విక్రయించిన ఐదుగురిలో వీరిద్దరితో పాటు మొహ్మద్ అబూబక్కర్ సిద్ధికి, ఎల్.వాసు, డి.నాగబాబులున్నారు. నిందితుల నుంచి 15.56 గ్రా. ఎండీఎంఏ పిల్స్, 6 గ్రాముల హైడ్రో గాంజా, 6.2 గ్రాముల కొకైన్తో పాటు ఇతర మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. వీళ్లపై మాదక ద్రవ్యాల నిరోధక చట్టం–1985, సెక్షన్ 8(సి), 22(బి), 22(సి), 22(ఏ), 27(బి), 25, 27, ఐపీసీ 1860 సెక్షన్ 290, 294 కింద కేసులు నమోదు చేసి అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. అంతా ఓ పద్ధతి ప్రకారం.. వాసు బర్త్ డే పేరుతో నిర్వహించిన ఈ రేవ్ పార్టీలో వాస్తవానికి ఎలాంటి బర్త్ డే వేడుకలు జరగలేదు. ఉద్దేశపూర్వకంగా డ్రగ్స్ విక్రయించడం, వేశ్యా గృహాన్ని నిర్వహించడాన్ని పోలీసులు గుర్తించారు. రేవ్ పార్టీలోకి వచ్చే ప్రతి ఒక్కరికీ ఓ పాస్వర్డ్ ఇచ్చారు. వాసు బర్త్ డే పార్టీ అనే యూజర్ నేమ్, పాస్వర్డ్ చెప్పినవాళ్లకు మాత్రమే ఇక్కడ ప్రవేశం ఉంటుంది. ఇందుకోసం నిర్వాహకులు ఓ ప్యాకేజీ ఇచ్చారు. ఒక్కో వ్యక్తి నుంచి రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షల వరకు వసూలు చేసినట్టు తెలిసింది. ‘సన్సెట్ టు సన్రైజ్ విక్టరీ’ పేరిట ఈ నెల 19వ తేదీ సాయంత్రం 5 నుంచి 20వ తేదీ ఉదయం 6 గంటల వరకు రేవ్ పార్టీ జరిగేలా ప్రణాళిక రూపొందించారు. తొలుత ఎలక్ట్రానిక్ సిటీ స్టేషన్ పరిధిలో కేసు నమోదవగా, తర్వాత హెబ్బాగోడికి బదిలీ చేయాలనుకున్నారు. తాజాగా ఈ కేసును సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ బెంగళూరు(సీసీబీ) పోలీసులకు అప్పగిస్తున్నట్లు కర్ణాటక పోలీసులు ప్రకటించారు. ఇందులో సెక్స్ రాకెట్ అంశం కూడా ఉన్నట్లు పోలీసులు అనుమానించి, ఆ దిశగా సైతం విచారణ చేస్తున్నారు. ఈ ఘటనలో పోలీసులు సీజ్ చేసిన కార్లలో ఫార్చూనర్ కారు ఏపీ 39 హెచ్ 0002 నంబర్తో ఉంది. ఇది చిత్తూరులోని గుడిపాల మండలం రాసనపల్లెకు చెందిన త్యాగరాజులు నాయుడు అనే వ్యక్తి పేరిట ఉంది. త్యాగరాజులు నాయుడు కారు అక్కడ ఎందుకు ఉందనే దానిపై పోలీసులు ఇప్పటికే విచారణ ప్రారంభించారు. ఇంతలోపు ఈ కారును తొమ్మిది నెలల కిందటే మరో వ్యక్తికి విక్రయించినట్లు, అతను ఇంకా కారును తన పేరిట మార్చకోలేదని కొత్త డ్రామా చేస్తున్నట్లు తెలుస్తోంది. చిత్తూరు నియోజకవర్గానికి చెందిన ఓ టీడీపీ ముఖ్య నేత ఈ కారును ఉపయోగించినట్లు సమాచారం.