-
షఫాలీ విశ్వరూపం
భారత మహిళా క్రికెటర్లా... మజాకా! దక్షిణాఫ్రికా మహిళల జట్టుతో చెన్నైలో ఆరంభమైన ఏకైక టెస్టును టీమిండియా రికార్డుల జడివానతో మొదలుపెట్టింది. ‘ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ’... తొలి వికెట్కు అత్యధిక భాగస్వామ్యం... ఒకేరోజు అత్యధిక జట్టు స్కోరు... ఒకే ఇన్నింగ్స్లో అత్యధిక సిక్స్లు... ఇలా ఒకటేమిటి అన్ని కలగలిపి అతివల క్రికెట్లో అపూర్వ రికార్డుల జాతరను మన మహిళల జట్టు ఆవిష్కరించింది. ఈ మ్యాచ్ను చూసిన వారందరికి ఆడుతోంది అమ్మాయిలేనా? జరుగుతోంది టెస్టా లేదంటే వన్డేనా అన్న అనుమానం కలగకమానదు. అంతలా... ఆకాశమే హద్దన్నట్లుగా హర్మన్ప్రీత్ బృందం సఫారీపై సూపర్గా ఆడింది. చెన్నై: భారత మహిళల క్రికెట్ జట్టు దక్షిణాఫ్రికాతో జరుగుతున్న ఏకైక టెస్టులో విశ్వరూపమే చూపెట్టింది. డాషింగ్ ఓపెనర్ షఫాలీ వర్మ (197 బంతుల్లో 205; 23 ఫోర్లు, 8 సిక్స్లు) అంతర్జాతీయ మహిళల క్రికెట్లో వేగవంతమైన డబుల్ సెంచరీ సాధించింది. మరో స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన (161 బంతుల్లో 149; 27 ఫోర్లు, 1 సిక్స్) కూడా సఫారీ బౌలర్లను చితగ్గొట్టి మరీ శతకాన్ని పూర్తి చేసుకుంది. దీంతో శుక్రవారం మొదలైన ఈ ఏకైక టెస్టులో భారత మహిళల జట్టు తొలి రోజు ఆట ముగిసేసరికి 98 ఓవర్లలోనే 4 వికెట్ల నష్టానికి 525 పరుగుల భారీస్కోరు కాదు... ఒక్క రోజే రికార్డు స్కోరు నమోదు చేసింది. పరుగు... ప్రవాహమైందిలా! టాస్ గెలిచిన భారత్ బ్యాటింగ్ చేపట్టింది. ఓపెనర్లు స్మృతి, షఫాలీ పరుగులు మొదలుపెట్టారు. ఇది పట్టాలెక్కగానే ప్రవాహం ఆ వెంటే రికార్డుల విధ్వంసం రోజంతా కొనసాగింది. 14వ ఓవర్లో భారత్ స్కోరు 50కి చేరింది. స్మృతి 78 బంతుల్లో ఫిఫ్టీ పూర్తి చేసుకుంది. దీంతోనే ఇది టెస్టు కాదని వన్డేనేమో అనే అనుమానం మొదలైంది.షఫాలీ 66 బంతుల్లోనే అర్ధసెంచరీ సాధించడం, జట్టు స్కోరు వన్డేలకు దీటుగా 24.4 ఓవర్లలోనే 100కు చేరడంతో ఇది ఏ మ్యాచ్ అబ్బా అని అభిమానులు క్రికెట్కు సంబంధించిన వెబ్సైట్లలో ఏ ఫార్మాట్ అనే ఎంక్వైరీ చేసుకునేలా చేసింది. లంచ్ విరామానికి 130/0 స్కోరు చేసింది. ఆ తర్వాత రెండో సెషన్లోనూ ఓపెనర్లు షఫాలీ, స్మృతిల బ్యాటింగ్ దూకుడుతో 39 ఓవర్లలోనే భారత్ 200 స్కోరును అవలీలగా దాటేసింది. ఈ క్రమంలో ముందుగా షఫాలీ 113 బంతుల్లో సెంచరీని పూర్తి చేసుకోగా, స్మృతి 122 బంతుల్లో శతకాన్ని సాధించింది. 194 బంతుల్లో ‘ద్విశతకం’ ఎట్టకేలకు 52వ ఓవర్లో స్మృతి అవుటైంది. 54వ ఓవర్లో జట్టు స్కోరు 300 పరుగులకు చేరుకుంది. అప్పుడు తెలిసొచ్చింది స్కోరైతే వన్డే తీరు... ఫార్మాట్ అయితే సంప్రదాయ పోరు అని! కాసేపటికే శుభా సతీశ్ (15) వెనుదిరిగింది. 334/2 స్కోరు వద్ద టీ బ్రేక్కు వెళ్లారు. తర్వాత జెమీమా రోడ్రిగ్స్ (94 బంతుల్లో 55; 8 ఫోర్లు) అండతో షఫాలీ 194 బంతుల్లో డబుల్ సెంచరీ సాధించింది. 73వ ఓవర్లోనే భారత్ 400 పరుగుల మైలురాయిని వేగంగా అందుకుంది. షఫాలీ రనౌట్ కాగా... క్రీజులో పాతుకుపోయినా జెమీమా కూడా (85 బంతుల్లో) ఫిఫ్టీ సా«ధించింది. 95వ ఓవర్లో భారత్ 500 అసాధారణ స్కోరును ఒక్కరోజులోనే సాధించింది. స్కోరు వివరాలు భారత మహిళల తొలి ఇన్నింగ్స్: షఫాలీ వర్మ (రనౌట్) 205; స్మృతి (సి) డెర్క్సెన్ (బి) టకర్ 149; శుభ (సి) జాఫ్తా (బి) డి క్లెర్క్ 15; జెమీమా (సి) డి క్లెర్క్ (బి) టకర్ 55; హర్మన్ప్రీత్ (బ్యాటింగ్) 42; రిచా ఘోష్ (బ్యాటింగ్) 43; ఎక్స్ట్రాలు 16; మొత్తం (98 ఓవర్లలో 4 వికెట్లకు) 525. వికెట్ల పతనం: 1–292, 2–325, 3–411, 4–450. బౌలింగ్: క్లాస్ 14–2–63–0, డెర్క్సెన్ 11–0–60–0, నదినె 10–1–62–1, టుమి 10–0– 55–0, నొంకు లులెకొ లబ 24–1–113–0, డెల్మి టకర్ 26–1–141–2, సునె లుస్ 3–0–15–0.1 మహిళల క్రికెట్లో షఫాలీ 194 బంతుల్లో సాధించిన వేగవంతమైన డబుల్ సెంచరీ కొత్త రికార్డు. ఇదే ఏడాది దక్షిణాఫ్రికా జట్టుపైనే అనాబెల్ సదర్లాండ్ (ఆ్రస్టేలియా) 248 బంతుల్లో ద్విశతకం చేసింది. 2 మిథాలీ రాజ్ (214; 2002లో ఇంగ్లండ్పై) తర్వాత టెస్టుల్లో డబుల్ సెంచరీ సాధించిన రెండో భారతీయ మహిళా క్రికెటర్గా షఫాలీ నిలిచింది. 292 తొలి వికెట్కు షఫాలీ, స్మృతి జోడించిన పరుగులు. ఇది కొత్త ప్రపంచ రికార్డు. 2004లో పాక్ ఓపెనర్లు సాజీదా, కిరణ్ బలూచ్లు విండీస్పై తొలి వికెట్కు 241 పరుగులు జతచేశారు. 525 టెస్టు క్రికెట్లో మ్యాచ్ తొలిరోజుతోపాటు ఒకే రోజు అత్యధిక పరుగులు చేసిన జట్టుగా భారత్ రికార్డు సృష్టించింది. 1935లో న్యూజిలాండ్పై ఇంగ్లండ్ తొలిరోజు 431 పరుగులు చేసింది. -
చరిత్ర సృష్టించిన "లేడీ సెహ్వాగ్".. ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ! వీడియో
చెపాక్ వేదికగా దక్షిణాఫ్రికా మహిళల జట్టుతో జరుగుతున్న ఏకైక టెస్టులో భారత ఓపెనర్ షఫాలీ వర్మ చరిత్ర సృష్టించింది. ఈ మ్యాచ్లో షఫాలీ వర్మ విధ్వంసకర డబుల్ సెంచరీతో చెలరేగింది. టెస్టు క్రికెట్ అన్న విషయం మర్చిపోయిన షఫాలీ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయింది. సౌతాఫ్రికా బౌలర్లకు వర్మ చుక్కలు చూపించింది. షఫాలీ బౌండరీల వర్షం కురిపించింది. ఈ క్రమంలో కేవలం 194 బంతుల్లోనే తన తొలి డబుల్ సెంచరీ మార్క్ను షఫాలీ అందుకుంది. వరుసగా సిక్స్లు బాదుతూ షఫాలీ తన స్టైల్లో ద్విశతకం నమోదు చేసింది. ఓవరాల్గా 197 బంతులు ఎదుర్కొన్న షఫాలీ 27 ఫోర్లు, 8 సిక్స్లతో 205 పరుగులు చేసి పెవిలియన్కు చేరింది. దురదృష్టవశాత్తూ రనౌట్ రూపంలో షఫాలీ వర్మ వెనుదిరిగింది. ఇక డబుల్ సెంచరీతో చెలరేగిన ఈ లేడీ సెహ్వాగ్.. పలు అరుదైన రికార్డులను తన పేరిట లిఖించుకుంది.షఫాలీ సాధించిన రికార్డులు ఇవే..మహిళల టెస్టు క్రికెట్ చరిత్రలో ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ నమోదు చేసిన ప్లేయర్గా షఫాలీ రికార్డులకెక్కింది. ఇప్పటివరకు ఈ రికార్డు ఆసీస్ ఆల్రౌండర్ అన్నాబెల్ సదర్లాండ్ పేరిట ఉండేది. దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్లో సదర్లాండ్ 256 బంతుల్లో ద్విశతకం నమోదు చేసింది. తాజా మ్యాచ్లో కేవలం 194 బంతుల్లోనే డబుల్ సెంచరీ చేసిన వర్మ.. అన్నాబెల్ ఆల్టైమ్ రికార్డును బ్రేక్ చేసింది. అదేవిధంగా టెస్టు క్రికెట్లో డబుల్ సెంచరీ చేసిన రెండో భారత మహిళా క్రికెటర్గా షఫాలీ నిలిచింది. షఫాలీ కంటే ముందు భారత మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ టెస్టుల్లో ద్విశతకం నమోదు చేసింది. THE MOMENT SHAFALI VERMA CREATED HISTORY. ⭐- She scored Fastest Double Hundred in Women's Test Cricket History. 🔥 pic.twitter.com/94zBj5zY01— Tanuj Singh (@ImTanujSingh) June 28, 2024 -
ఆల్ టైమ్ రికార్డు.. ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ.. 20 ఫోర్లు, 21 సిక్సర్లతో..!
కౌంటీ క్రికెట్లో ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ నమోదైంది. కౌంటీ ఛాంపియన్షిప్ డివిజన్-2 పోటీల్లో భాగంగా ససెక్స్తో జరిగిన మ్యాచ్లో లీసెస్టర్షైర్ ఆటగాడు లూయిస్ కింబర్ కేవలం 100 బంతుల్లోనే డబుల్ సెంచరీ సాధించాడు. ఇంగ్లండ్ కౌంటీ క్రికెట్ చరిత్రలోనే ఇది వేగవంతమైన డబుల్ సెంచరీగా రికార్డైంది. గతంలో (2016) ఈ రికార్డు గ్లామోర్గన్ ఆటగాడు అనెరిన్ డొనాల్డ్ పేరిట ఉండేది. డొనాల్డ్ డెర్బిషైర్తో జరిగిన మ్యాచ్లో 123 బంతుల్లో డబుల్ సెంచరీ సాధించాడు. తాజాగా డొనాల్డ్ రికార్డును కింబర్ బద్దలు కొట్టాడు. ఈ మ్యాచ్లో కింబర్ 127 బంతులు ఎదుర్కొని 20 ఫోర్లు, 21 సిక్సర్ల సాయంతో 243 పరుగులు చేశాడు.ఫస్ట్క్లాస్ క్రికెట్ చరిత్రలో రెండో వేగవంతమైన డబుల్ సెంచరీ..ససెక్స్పై కింబర్ చేసిన డబుల్ సెంచరీ ఫస్ట్ క్లాస్ క్రికెట్ చరిత్రలోనే రెండో వేగవంతమైన డబుల్ సెంచరీగా రికార్డైంది. ఈ ఫార్మాట్లో వేగవంతమైన డబుల్ సెంచరీ రికార్డు ఆఫ్ఘనిస్తాన్ ఆటగాడు షఫీగుల్లా పేరిట ఉంది. షఫీగుల్లా 2018లో కాబుల్ రీజియన్ తరఫున ఆడుతూ బూస్ట్ రీజియన్పై కేవలం 89 బంతుల్లోనే డబుల్ బాదాడు.ఫస్ట్ క్లాస్ క్రికెట్లో టాప్-5 వేగవంతమైన డబుల్ సెంచరీలు..షఫీగుల్లా - 89 బంతులు, కాబూల్ రీజియన్ vs బూస్ట్ రీజియన్, 2018లూయిస్ కింబర్ - 100 బంతులు, లీసెస్టర్షైర్ vs ససెక్స్, 2024తన్మయ్ అగర్వాల్ - 119 బంతులు, హైదరాబాద్ vs అరుణాచల్, 2024రవిశాస్త్రి - 123 బంతులు, బాంబే vs బరోడా, 1985అనెరిన్ డోనాల్డ్ - 123 బంతులు, గ్లామోర్గాన్ vs డెర్బీషైర్, 2016ఈ మ్యాచ్లో కింబర్ మరో ఆల్ టైమ్ కౌంటీ క్రికెట్ రికార్డును కూడా బద్దలు కొట్టాడు. ఈ మ్యాచ్లో కింబర్ కొట్టిన సిక్సర్లు (21) కౌంటీ క్రికెట్ చరిత్రలోనే ఓ బ్యాటర్ కొట్టిన అత్యధిక సిక్సర్లుగా రికార్డయ్యాయి. గతంలో ఈ రికార్డు ఇంగ్లండ్ ప్రస్తుత టెస్ట్ జట్టు కెప్టెన్ బెన్ స్టోక్స్ (17 సిక్సర్లు) పేరిట ఉంది.కౌంటీ క్రికెట్లో ఓ ఇన్నింగ్స్లో అత్యధిక సిక్సర్లు సాధించిన టాప్-4 ఆటగాళ్లు..21 - లూయిస్ కింబర్ vs ససెక్స్, 202417 - బెన్ స్టోక్స్ vs వోర్సెస్టర్షైర్, 202216 - ఆండ్రూ సైమండ్స్ vs గ్లామోర్గాన్, 199516 - గ్రాహం నేపియర్ vs సర్రే, 2011ఈ మ్యాచ్లో మరో ఆల్టైమ్ కౌంటీ రికార్డు కూడా నమోదైంది. ససెక్స్ బౌలర్ ఓలీ రాబిన్సన్ కౌంటీ క్రికెట్ చరిత్రలోనే ఓ ఓవర్లో అత్యధిక పరుగులు సమర్పించుకున్న బౌలర్గా ఆల్టైమ్ చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు. రాబిన్సన్ ఓ ఓవర్లో ఏకంగా 43 పరుగులు సమర్పించుకున్నాడు.కౌంటీ క్రికెట్ చరిత్రలో అత్యధిక పరుగులు సమర్పించుకున్న టాప్-3 బౌలర్లు...ఓలీ రాబిన్సన్- 43 పరుగులు- 2024అలెక్స్ ట్యూడర్- 38 పరుగులు- 1998షోయబ్ బషీర్- 38 పరుగులు- 2024ఈ మ్యాచ్లో కింబర్ మెరుపు డబుల్ సెంచరీతో విరుచుకుపడినా అతని జట్టు లిసెస్టర్షైర్ ఓటమిపాలవడం కొసమెరుపు. 464 పరుగుల లక్ష్య ఛేదనలో లీసెస్టర్షైర్ 446 పరుగులకే ఆలౌటై 18 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. -
IPL 2024: టీ20ల్లో తొలి డబుల్ సెంచరీ అతడిదే.. కేన్ మామ జోస్యం
బ్యాటర్ల సంపూర్ణ ఆధిపత్యం నడుస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో టీ20 డబుల్ సెంచరీ అనేది ఎక్కువ దూరం లేదన్న విషయం అర్దమవుతుంది. బ్యాటర్ల ఊచకోత ధాటికి టీ20 డబుల్ ఇప్పుడా అప్పుడా అన్నట్లుంది. అతి త్వరలో ఈ అపురూప ఘట్టాన్ని చూడటం ఖాయమన్న విషయం తేలిపోయినప్పటికీ.. ఎవరు తొలి డబుల్ సాధిస్తారనే విషయంపై మాత్రం ఎవరి అభిప్రాయాలు వారికి ఉన్నాయి. జోస్ బట్లర్, రోహిత్ శర్మ సాధిస్తాడని కొందరంటుంటే.. ట్రవిస్ హెడ్, క్లాసెన్కు అవకాశం ఉందని మరికొందరంటున్నారు. వీరిద్దరి పేర్లే కాకుండా చాలామంది క్రికెటర్ల పేర్లు తొలి టీ20 డబుల్ రేసులో వినబడుతున్నాయి. ఈ విషయంపై చాలా మంది తరహాలోనే న్యూజిలాండ్ క్రికెటర్ కేన్ విలియమ్సన్ కూడా తన అభిప్రాయాన్ని వెల్లడించాడు. టీ20ల్లో తొలి డబుల్ సెంచరీ చేసే ఛాన్స్ టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు ఉందని అభిప్రాయపడ్డాడు. రోహిత్కు వన్డేల్లో మూడు డబుల్ సెంచరీలు చేసిన అనుభవం ఉంది కాబట్టి టీ20 డబుల్ అతనికి ఈజీ అవుతుందని అన్నాడు. రోహిత్ ఎలాగూ ఓపెనర్గానే బరిలోకి దిగుతాడు కాబట్టి ఏ క్షణంలోనైనా అతని బ్యాట్ నుంచి టీ20 డబుల్ జాలు వారే అవకాశం ఉందని తెలిపాడు. ప్రస్తుత ఐపీఎల్ సీజన్లోనే ఈ ఫీట్ నమోదైనా ఆశ్చర్యపోనక్కర్లేదని అన్నాడు. 2024 ఐపీఎల్లో బ్యాటర్ల దూకుడు చూస్తుంటే ఇది ఎంతో దూరం లేదని అనిపిస్తుందని పేర్కొన్నాడు. ఈ సీజన్లో బ్యాటర్ల విధ్వంసం రెట్టింపైందని.. ఈ సీజన్లో నమోదైన జట్టు స్కోర్లే ఇందుకు నిదర్శనమని గుర్తు చేశాడు. ఇదే సందర్భంగా కేన్ ఎంఎస్ ధోనిని తన ఆల్టైమ్ ఉత్తమ ఐపీఎల్ జట్టుకు కెప్టెన్గా ఎన్నుకున్నాడు. కాగా, టీ20ల్లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ రికార్డు క్రిస్ గేల్ పేరిట ఉన్న విషయం తెలిసిందే. 2013 ఐపీఎల్లో గేల్ పూణే వారియర్స్పై 66 బంతుల్లో 175 (నాటౌట్) పరుగులు చేశాడు. టీ20ల్లో నేటి వరకు ఇదే అత్యుత్తమ స్కోర్గా చలామణి అవుతుంది. ప్రస్తుత పరిస్థితులకు చూస్తుంటే గేల్ రికార్డు మూడినట్లు అనిపిస్తుంది. -
వారెవ్వా జైశ్వాల్.. విధ్వంసకర డబుల్ సెంచరీ! ఇదేమి బాదుడు
ఇంగ్లండ్తో టెస్టు సిరీస్లో టీమిండియా యువ ఓపెనర్ యశస్వీ జైశ్వాల్ దుమ్ములేపుతున్నాడు. రెండో టెస్టులో డబుల్ సెంచరీతో చెలరేగిన జైశ్వాల్.. ఇప్పుడు మరో ద్విశతకాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. రాజ్కోట్ వేదికగా ఇంగ్లండ్తో జరుగుతున్న మూడో టెస్టులో విధ్వంసకర డబుల్ సెంచరీతో యశస్వీ చెలరేగాడు. రెండో ఇన్నింగ్స్లో ఇంగ్లండ్ బౌలర్లను జైశ్వాల్ ఊచకోత కోశాడు. సెంచరీ తర్వాత మూడో రోజు రిటైర్డ్ హర్ట్గా వెనుదిరిగి జైస్వాల్.. నాలుగో రోజు బ్యాటింగ్కు వచ్చి వీర విహారం చేశాడు. ఈ క్రమంలో జైశ్వాల్ కేవలం 231 బంతుల్లో 14 ఫోర్లు, 10 సిక్స్లతో తన డబుల్ సెంచరీ మార్క్ను అందుకున్నాడు. ఓవరాల్గా 238 బంతులు ఎదుర్కొన్న జైశ్వాల్.. 14 ఫోర్లు, 12 సిక్సులతో అజేయంగా 214 పరుగులు చేసి విధ్వంసం సృష్టించాడు. కాగా జైశ్వాల్కు తన కెరీర్లో ఇది రెండో డబుల్ డబుల్ సెంచరీ కావడం గమనార్హం. అంతకుముందు వైజాగ్ వేదికగా జరిగిన రెండో టెస్టులో యశస్వీ 209 పరుగులు చేసిన సంగతి తెలిసిందే. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. జైశ్వాల్తో పాటు శుబ్మన్ గిల్(91), అరంగేట్ర ఆటగాడు సర్ఫరాజ్ ఖాన్(68*) అద్భుతంగా రాణించారు. దీంతో రెండో ఇన్నింగ్స్ను భారత జట్టు 430/4 పరుగుల భారీ స్కోర్ వద్ద తమ ఇన్నింగ్స్ను డిక్లేర్ చేసింది. ఫలితంగా ఇంగ్లండ్ ముందు టీమిండియా 557 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. 𝙃𝙖𝙩-𝙩𝙧𝙞𝙘𝙠 𝙤𝙛 𝙎𝙄𝙓𝙀𝙎! 🔥 🔥 Yashasvi Jaiswal is smacking 'em all around the park! 💥💥💥 Follow the match ▶️ https://t.co/FM0hVG5pje#TeamIndia | #INDvENG | @ybj_19 | @IDFCFIRSTBank pic.twitter.com/OjJjt8bOsx — BCCI (@BCCI) February 18, 2024 -
నిసాంక 210 నాటౌట్
పల్లెకెలె: ఓపెనర్ పతున్ నిసాంక (139 బంతుల్లో 210 నాటౌట్; 20 ఫోర్లు, 8 సిక్స్లు) అజేయ డబుల్ సెంచరీతో అదరగొట్టాడు. ఫలితంగా అఫ్గానిస్తాన్తో శుక్రవారం జరిగిన తొలి వన్డేలో శ్రీలంక 42 పరుగుల తేడాతో గెలిచింది. మూడు మ్యాచ్ల సిరీస్లో 1–0తో ఆధిక్యంలో నిలిచింది. ముందుగా లంక నిర్ణీత 50 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 381 పరుగులు చేసింది. నిసాంక ప్రత్యర్థి బౌలింగ్పై కడదాకా విధ్వంసం కొనసాగించాడు. 88 బంతుల్లో సెంచరీ సాధించిన ఈ ఓపెనర్ ఆ తర్వాత ఆకాశమే హద్దుగా చెలరేగాడు. దీంతో తర్వాతి 100 పరుగుల్ని కేవలం 48 బంతుల్లోనే సాధించడంతో 136 బంతుల్లో అతని డబుల్ సెంచరీ పూర్తయ్యింది. ఇప్పటివరకు వన్డేల్లో లంక టాప్ స్కోరర్గా నిలిచిన మాజీ ఓపెనర్ సనత్ జయసూర్య (189) ప్రేక్షకుడిగా హాజరైన ఈ మ్యాచ్లోనే నిసాంక అతని రికార్డును అతని కళ్లముందే బద్దలు కొట్టడం విశేషం. అవిష్క ఫెర్నాండో (88 బంతుల్లో 88; 8 ఫోర్లు, 3 సిక్స్లు)తో తొలి వికెట్కు 182 పరుగులు జోడించిన నిసాంక... సమరవిక్రమ (45; 4 ఫోర్లు, 1 సిక్స్)తో మూడో వికెట్కు 120 పరుగులు జత చేశాడు. అనంతరం అఫ్గానిస్తాన్ 50 ఓవర్లలో 6 వికెట్లకు 339 పరుగులు చేసి పోరాడి ఓడింది. 27/4 స్కోరు వద్ద కష్టాల్లో పడిన జట్టును అజ్మతుల్లా ఒమర్జాయ్ (115 బంతుల్లో 149 నాటౌట్; 13 ఫోర్లు, 6 సిక్స్లు), మొహమ్మద్ నబీ (130 బంతుల్లో 136; 15 ఫోర్లు, 3 సిక్స్లు) శతకాలతో నడిపించారు. ఇద్దరు ఆరో వికెట్కు 242 పరుగులు జోడించారు. శ్రీలంక బౌలర్లలో మదుషాన్ 75 పరుగులిచ్చి నాలుగు వికెట్లు పడగొట్టాడు. రేపు ఇదే వేదికపై రెండో వన్డే జరుగుతుంది. 12 ఓవరాల్గా అంతర్జాతీయ వన్డే క్రికెట్లో నమోదైన డబుల్ సెంచరీల సంఖ్య. ఇందులో సగానికి (7)పైగా బాదింది భారత బ్యాటర్లే! ఒక్క రోహిత్ శర్మే మూడు ద్విశతకాలను సాధించాడు. భారత్ తరఫున సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్, ఇషాన్ కిషన్, శుబ్మన్ గిల్ ఈ జాబితాలో ఉన్నారు. మార్టిన్ గప్టిల్ (న్యూజిలాండ్), క్రిస్ గేల్ (వెస్టిండీస్), ఫఖర్ జమాన్ (పాకిస్తాన్), మ్యాక్స్వెల్ (ఆస్ట్రేలియా) కూడా వన్డేల్లో డబుల్ సెంచరీలు చేశారు. 3 నిసాంకది వన్డేల్లో మూడో వేగవంతమైన డబుల్ సెంచరీ (138 బంతుల్లో). ఈ జాబితాలో మ్యాక్స్వెల్ (128 బంతుల్లో), ఇషాన్ కిషన్ (131 బంతుల్లో) ముందు వరుసలో ఉన్నారు. -
విధ్వంసకర డబుల్ సెంచరీ.. సెహ్వాగ్, క్రిస్ గేల్ రికార్డులు బద్దలు
వన్డే క్రికెట్లో మరో విధ్వంసకర డబుల్ సెంచరీ నమోదైంది. ఆఫ్ఘనిస్తాన్తో జరుగుతున్న మ్యాచ్లో శ్రీలంక ఓపెనర్ పథుమ్ నిస్సంక మెరుపు ద్విశతకంతో (139 బంతుల్లో 210 నాటౌట్; 20 ఫోర్లు, 8 సిక్సర్లు) విరుచుకుపడ్డాడు. కేవలం 136 బంతుల్లోనే డబుల్ సెంచరీ మార్కును చేరిన నిస్సంక.. వన్డేల్లో మూడో వేగవంతమైన డబుల్ సెంచరీ నమోదు చేశాడు. ఈ క్రమంలో క్రిస్ గేల్ (138 బంతుల్లో), వీరేంద్ర సెహ్వాగ్ (140 బంతుల్లో) లాంటి అరివీర భయంకరుల రికార్డులను అధిగమించాడు. వన్డేల్లో ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ రికార్డు టీమిండియా ఆటగాడు ఇషాన్ కిషన్ పేరిట ఉంది. 2022లో బంగ్లాదేశ్తో జరిగిన మ్యాచ్లో ఇషాన్ కేవలం 126 బంతుల్లోనే డబుల్ బాదాడు. రెండో ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ రికార్డు ఆసీస్ ఆటగాడు గ్లెన్ మ్యాక్స్వెల్ (128) పేరిట ఉంది. తాజా డబుల్ సెంచరీతో నిస్సంక మరిన్ని రికార్డులు నమోదు చేశాడు. వన్డేల్లో డబుల్ నమోదు చేసిన తొలి శ్రీలంక ఆటగాడిగా, ఓవరాల్గా 12వ ప్లేయర్గా రికార్డుల్లోకెక్కాడు. నిస్సంకకు ముందు రోహిత శర్మ, మార్టిన్ గప్తిల్, సెమ్వాగ్, క్రిస్ గేల్, ఫకర్ జమాన్, ఇషాన్ కిషన్, శుభ్మన్ గిల్, మ్యాక్స్వెల్, సచిన్ టెండూల్కర్ వన్డేల్లో డబుల్ మార్కును తాకారు. వీరిలో రోహిత్ శర్మ అత్యధికంగా మూడు వన్డే డబుల్లు సాధించాడు. మ్యాచ్ విషయానికొస్తే.. మూడు మ్యాచ్ల వన్డే సిరీస్లో భాగంగా ఆఫ్ఘనిస్తాన్తో జరుగుతున్న తొలి మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన శ్రీలంక.. నిస్సంక విధ్వంసకర ద్విశతకంతో చెలరేగడంతో నిర్ణీత 50 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 381 పరుగుల భారీ స్కోర్ చేసింది. నిస్సంకతో పాటు మరో ఓపెనర్ అవిష్క ఫెర్నాండో (88), సమరవిక్రమ (45) రాణించారు. నిస్సంక ఊచకోత ధాటికి ప్రపంచలోకెల్లా మెరుగైన స్పిన్ అటాక్ కలిగిన ఆఫ్ఘన్లు చిగురుటాకుల్లా వణికిపోయారు. -
డబుల్ సెంచరీతో చెలరేగిన యశస్వీ జైశ్వాల్..
వైజాగ్ వేదికగా ఇంగ్లండ్తో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా యువ ఓపెనర్ యశస్వీ జైశ్వాల్ డబుల్ సెంచరీతో చెలరేగాడు. 277 బంతుల్లో 18 ఫోర్లు, 7 సిక్స్లతో తన డబుల్ సెంచరీ మార్క్ను అందుకున్నాడు. భారత ఇన్నింగ్స్ 101 ఓవర్ వేసిన స్పిన్నర్ బషీర్ బౌలింగ్లో వరుసగా సిక్స్, ఫోర్ బాది జైశ్వాల్ తన డబుల్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. జైశ్వాల్కు తన అంతర్జాతీయ కెరీర్లో ఇదే తొలి ద్విశతకం కావడం విశేషం. రోహిత్ శర్మ, శుబ్మన్ గిల్, శ్రేయస్ అయ్యర్ విఫలమైన చోట జైశ్వాల్ తన అద్బుత ఇన్నింగ్స్తో జట్టును ముందుండి నడిపించాడు. ఓవరాల్గా ఈ మ్యాచ్లో 290 బంతుల్లో 209 పరుగులు చేసి జైశ్వాల్ ఔటయ్యాడు. అండర్సన్ బౌలింగ్లో భారీ షాట్కు ప్రయత్నించి తన వికెట్ను జైశ్వాల్ కోల్పోయాడు.108 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా 8 వికెట్ల నష్టానికి 387 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా ఉన్నారు. DOUBLE CENTURY BY YASHASVI JAISWAL...!!!! 🔥 Monster innings #INDvsENG #INDvsENGTest #YashasviJaiswal pic.twitter.com/vK8IVGfZiZ — 𝐕𝐈𝐑𝐀𝐓𝕏𝐑𝐂𝐁 (@ProfKohli18) February 3, 2024 -
డబుల్ సెంచరీతో చెలరేగిన పుజారా.. టీమిండియాలోకి రీ ఎంట్రీ!?
ఇంగ్లండ్తో టెస్టు సిరీస్కు ముందు భారత సెలక్టర్లకు వెటరన్ ఆటగాడు ఛతేశ్వర్ పుజారా తన బ్యాట్తోనే స్ట్రాంగ్ మెసేజ్ పంపాడు. రంజీట్రోఫీ-2024 సీజన్లో భాగంగా జార్ఖండ్తో జరుగుతున్న మ్యాచ్లో పుజారా డబుల్ సెంచరీతో చెలరేగాడు. తొలి ఇన్నింగ్స్లో 302 బంతుల్లో పుజారా తన డబుల్ సెంచరీ మార్క్ను అందుకున్నాడు. అతడికి ఇది 17వ ఫస్ట్క్లాస్ సెంచరీ కావడం విశేషం. పుజారా ప్రస్తుతం 236 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నాడు. కాగా ఈ మ్యాచ్లో జార్ఖండ్ బౌలర్ల సహనానికి పరీక్షపెట్టాడు. అతడి వికెట్ పడగొట్టడానికి బౌలర్లు నానా తంటాలు పడుతున్నారు. ఇక డబుల్ సెంచరీతో చెలరేగిన పుజారా పలు అరుదైన ఘనతలను తన పేరిట లిఖించుకున్నాడు. ఫస్ట్క్లాస్ క్రికెట్లో అత్యధిక డబుల్ సెంచరీలు చేసిన నాలుగో ఆటగాడిగా పుజారా నిలిచాడు. ఈ జాబితాలో ఆస్ట్రేలియా లెజెండ్ సర్ డొనాల్డ్ బ్రాడ్మన్ 37 డబుల్ సెంచరీలతో అగ్రస్దానంలో ఉన్నాడు. అదే విధంగా ఫస్ట్క్లాస్ క్రికెట్లో అత్యధిక పరుగులు చేసిన నాలుగో ఆటగాడిగా పుజారా (19730) రికార్డులకెక్కాడు. ఈ క్రమంలో భారత మాజీ క్రికెటర్ లక్ష్మణ్(19729)ను పుజారా అధిగమించాడు. ఇక మూడో రోజు లంచ్ విరమానికి సౌరాష్ట్ర 119 ఓవర్లలో కేవలం నాలుగు వికెట్లు నష్టపోయి 566 పరుగుల భారీ స్కోరు సాధించింది. టీమిండియాలోకి రీఎంట్రీ.. కాగా పుజారా చివరగా గతేడాది ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ (2021-23) ఫైనల్లో భారత జట్టు తరపున ఆడాడు. డబ్ల్యూటీసీ ఫైనల్లో పుజారా దారుణంగా విఫలమయ్యాడు. ఆ తర్వాత సెలక్టర్లు అతడి పేరును పరిగణనలోకి తీసుకోలేదు. వెస్టిండీస్తో టెస్టులకు, ఇటీవల సౌతాఫ్రికాతో ముగిసిన టెస్టులకూ ఎంపిక చేయలేదు. అయితే జనవరిలో ఇంగ్లండ్తో స్వదేశంలో ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్లో భారత్ తలడనుంది. ఈ సిరీస్కు ముందు పుజారా అద్భుత ప్రదర్శన కనబరుస్తుండడంతో అతడి రీ ఎంట్రీ ఖాయమని అభిమానులు భావిస్తున్నారు. -
Glenn Maxwell’s Wife Vini Raman: మాక్స్వెల్, వినీ రామన్ అపురూప (ఫొటోలు)
-
CWC 2023 AFG Vs AUS Highlights Pics: సాహో మ్యాక్సీ.. క్రికెట్ చరిత్రలోనే అత్యుత్తమ ఇన్నింగ్స్ (ఫొటోలు)
-
ఒకే ఒక్కడు మ్యాక్స్ ‘వెల్డన్’
ఆ్రస్టేలియా విజయలక్ష్యం 292... 18.3 ఓవర్ల వరకు ఆ జట్టు స్కోరు 91/7... ఇక ఐదుసార్లు విశ్వవిజేత ఆ్రస్టేలియాకు అఫ్గానిస్తాన్ చేతిలో ఘోర పరాభవం లాంఛనమేనని అందరూ భావించారు. కానీ గ్లెన్ మ్యాక్స్వెల్... కలిసొచ్చిన అదృష్టం (లైఫ్లు)... క్రీజులో కదల్లేకపోయిన దైన్యం... ఒకదాని తర్వాత ఒకటి వెంబడించినా... అదృష్టాన్ని అందిపుచ్చుకొని, కష్టాన్ని పంటిబిగువన భరించి ఈ ప్రపంచకప్కే అసాధారణ ‘షో’కు తెచ్చాడు. అఫ్గాన్ చేతుల్లో పడిన సంచలనాన్ని మ్యాక్సీ ఒంటిచేత్తో లాక్కున్నాడు. ఆ ఒక్కడే ఆసీస్ సైన్యంగా మారి గెలిచేదాకా నిలిచాడు. కాళ్లు కదలనీయలేకపోయినా... ఉక్కు పిడికిలితో బ్యాట్ పట్టి కొండంత లక్ష్యాన్ని కరిగించాడు. డబుల్ సెంచరీతో ఈ ప్రపంచకప్కే వన్నె తెచ్చాడు. ముంబై: నవంబర్ 19న వన్డే వరల్డ్కప్ ఫైనల్... టైటిల్ పోరు ఎవరి మధ్యయినా జరగొచ్చు... విజేత ఎవరైనా కావొచ్చు. కానీ ఈ ప్రపంచకప్ అంటే తప్పక గుర్తుండే క్రికెటర్ మాత్రం ఒక్కడే! అతడే మ్యాక్స్వెల్! ఛేదించలేని లక్ష్యం. కొండంత కష్టం కళ్లముందుంటే... కఠిన సవాల్ సైతం సలామ్ కొట్టేలా ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ మ్యాక్స్వెల్ (128 బంతుల్లో 201 నాటౌట్; 21 ఫోర్లు, 10 సిక్స్లు) అద్భుత ఇన్నింగ్స్ ఆడేశాడు. ఓటమి కోరల్లోంచి లాగి... మరో మ్యాచ్ మిగిలి ఉండగానే ఆస్ట్రేలియాను ఒంటిచేత్తో సెమీఫైనల్కు తీసుకెళ్లాడు. అందరూ ముఖమంత కళ్లు చేసుకొని చూసిన ఈ మ్యాచ్లో మ్యాక్స్వెల్ మహిమతో ఆస్ట్రేలియా 3 వికెట్ల తేడాతో అఫ్గానిస్తాన్పై గెలిచింది. మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న అఫ్గానిస్తాన్ 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 291 పరుగులు చేసింది. ఓపెనర్ ఇబ్రహీమ్ జద్రాన్ (143 బంతుల్లో 129 నాటౌట్; 8 ఫోర్లు, 3 సిక్స్లు) అజేయ సెంచరీ చేశాడు. ఆఖర్లో రషీద్ ఖాన్ (18 బంతుల్లో 35 నాటౌట్; 2 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరిపించాడు. హాజల్వుడ్కు 2 వికెట్లు దక్కాయి. అనంతరం ఆ్రస్టేలియా 46.5 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 293 పరుగులు చేసి గెలిచింది. ఈ 293 పరుగుల్లో 201 మ్యాక్స్వెల్ ఒక్కడివే అంటేనే ఇంకెవరూ చెప్పుకోదగ్గ స్కోర్లే చేయలేదనేది ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. దీంతో అఫ్గాన్ బౌలర్లు నవీనుల్ (2/47), రషీద్ (2/44), ఒమర్జాయ్ (2/52) చిందించిన చెమట... పడగొట్టిన వికెట్లు వృథా అయ్యాయి. జబర్దస్త్ జద్రాన్... ఓపెనర్లలో రహ్మనుల్లా గుర్బాజ్ (25 బంతుల్లో 21; 2 ఫోర్లు) నిష్క్రమించగా, ఇబ్రహీమ్ జద్రాన్ ఆద్యంతం ఇన్నింగ్స్కు వెన్నెముకగా నిలిచాడు. ఈ క్రమంలో జద్రాన్ 62 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తిచేసుకున్నాడు. రహ్మత్ షా (44 బంతుల్లో 30; 1 ఫోర్) కుదురుగా ఆడగా అఫ్గాన్ 21వ ఓవర్లో 100 పరుగులు దాటింది. రెండో వికెట్కు ఇద్దరు కలిసి 83 పరుగులు జోడించారు. ఆ తర్వాత కెప్టెన్ హష్మతుల్లా (26; 2 ఫోర్లు) చేసింది తక్కువే అయినా మూడో వికెట్కు 52 పరుగుల భాగస్వామ్యం నమోదైంది. జద్రాన్కు జతయిన అజ్మతుల్లా ఒమర్జాయ్ (18 బంతుల్లో 22; 1 ఫోర్, 2 సిక్స్లు) ధాటిగా ఆడటంతో 41వ ఓవర్లో అఫ్గాన్ 200 స్కోరు చేరింది. జద్రాన్ 131 బంతుల్లో అఫ్గాన్ తరఫున తొలి శతకాన్ని లిఖించాడు. ఒక్కడే అయినా... ఒంటరి కాదు విక్టరీ! హెడ్ (0) ఖాతా తెరువలేదు. మిచెల్ మామార్ష్ (24), వార్నర్ (18)లు గొప్పగా ఆడలేదు. ఇంగ్లిస్ (0), లబుషేన్ (14), స్టొయినిస్ (6)లు అంతే! అఫ్గాన్ బౌలర్లకు కలిసికట్టుగా దాసోహమయ్యారు. జట్టు స్కోరు 50కి ముందే (49/4) ఆసీస్ నలుగురు టాప్ బ్యాటర్లను... వందకు ముందు (91/7) మిగిలిపోయిన బ్యాటింగ్ అస్త్రాలను కోల్పోయింది. గెలుపు సంగతి దేవుడెరుగు! అసలు ప్రపంచకప్లలోనే ఫేవరెట్, ఐదుసార్లు ప్రపంచ చాంపియన్ పరువు సంగతి ఏంటి? ఎంత భారీతేడాతో ఓడుతుందనే కళ్లే మ్యాచ్ను చూశాయి. కలిసొచ్చిన రివ్యూలు, మిస్ క్యాచ్లు ఒమర్జాయ్ 9వ ఓవర్ తొలి బంతికే వార్నర్, రెండో బంతికి ఇంగ్లిస్లను అవుట్ చేశాడు. జట్టుస్కోరు 49/4 వద్ద మ్యాక్స్వెల్ క్రీజులోకి వచ్చాడు. బౌలర్ ‘హ్యాట్రిక్’ కోసం ప్రయత్నించాడు. ఎల్బీకోసం రివ్యూకు సైతం వెళ్లాడు. కానీ బంతి మ్యాక్సీ బ్యాట్ అంచును తాకి కీపర్కు చాలా ముందుగా పడింది. దీంతో అఫ్గాన్కు ఫలితం దక్కలేదు. ఆ తర్వాత 22వ ఓవర్లో రెండుసార్లు... ఎల్బీగా అంపైర్ అవుటిస్తే రివ్యూతో బయటపడ్డాడు. అదే ఓవర్లో ముజీబ్ జారవిడిచిన క్యాచ్తో, కాసేపయ్యాక నబీ అందుకోలేకపోయిన క్యాచ్తో బతికి బయటపడ్డాక వెనుదిరిగి చూసుకోలేదు. అప్పటికీ మ్యాక్సీ కనీసం 35 పరుగులైనా చేయలేదు. రాత మార్చిన ఘనుడు మ్యాక్స్వెల్ భారీ హిట్టింగ్కు, మ్యాచ్ విన్నింగ్ షాట్లకు పెట్టింది పేరు. కానీ పెద్ద లక్ష్యం, అంతదూరం ఎలా పయనిస్తాడో అనుకుంటే... జతకూడిన కమిన్స్తో కలిసి జట్టు రాతను తన బ్యాట్తో మార్చేశాడు. 20 ఓవర్లదాకా మ్యాక్సీ సాధారణ ఆటే ఆడాడు. 51 బంతుల్లో ఫిఫ్టీ పూర్తిచేశాడు. నూర్ అహ్మద్ వేసిన 29వ ఓవర్లో 2 వరుస సిక్సర్లతో గేర్ మార్చాడు. స్పిన్నర్లపై దూకుడు పెంచి బౌండరీలు, సిక్సర్లతో శివమెత్తాడు. దీంతో ఛేదించాల్సిన రన్రేట్ తగ్గుతూ వచ్చింది. 76 బంతుల్లోనే శతక్కొట్టిన మ్యాక్సీ డబుల్ సెంచరీకి అవసరమైన బంతులు 128 మాత్రమే! బతికించిన ముజీబ్ ఓవర్లోనే ముగించి... సునాయాసమైన క్యాచ్ను నేలపాలుచేసిన ముజీబ్ 47వ ఓవర్ వేశాడు. అప్పటికీ 24 బంతుల్లో 21 పరుగులు కావాలి. అయితే మ్యాక్సీ 0, 6, 6, 4, 6లతో ఆ ఓవర్ కూడా పూర్తవకముందే లక్ష్యాన్ని, తన డబుల్ సెంచరీని ముగించాడు. మ్యాక్సీ, కమిన్స్లు అబేధ్యమైన 8వ వికెట్కు 202 పరుగుల భాగస్వామ్యం జోడించడంతో కొత్త ప్రపంచ రికార్డు నమోదైంది. 2006లో భారత్పై 8వ వికెట్కు దక్షిణాఫ్రికా బ్యాటర్స్ జస్టిన్ కెంప్, అండ్రూ హాల్ చేసిన 138 పరుగుల భాగస్వామ్యం కనుమరుగైంది. గ్లెన్ మ్యాక్స్వెల్ పరుగులు 201 నాటౌట్ బంతులు 128 4 x 21; 6 x 10 1 x 39; 2 x 9 స్ట్రయిక్రేట్ 157.03 201 వన్డేల్లో ఆ్రస్టేలియా తరఫున తొలి డబుల్ సెంచరీతోపాటు అత్యధిక వ్యక్తిగత స్కోరు చేసిన ప్లేయర్గా మ్యాక్స్వెల్ నిలిచాడు. షేన్ వాట్సన్ (185 నాటౌట్; 2011లో బంగ్లాదేశ్పై మిర్పూర్లో) పేరిట ఉన్న రికార్డును మ్యాక్స్వెల్ బద్దలు కొట్టాడు. 3 ప్రపంచకప్ చరిత్రలో నమోదైన డబుల్ సెంచరీలు. గతంలో న్యూజిలాండ్కు చెందిన మార్టిన్ గప్టిల్ (237 నాటౌట్; వెస్టిండీస్పై 2015లో వెల్లింగ్టన్లో), వెస్టిండీస్ స్టార్ క్రిస్ గేల్ (215; జింబాబ్వేపై 2015లో కాన్బెర్రాలో) ఈ ఘనత సాధించారు. 2 వన్డేల్లో వేగవంతంగా డబుల్ సెంచరీ చేసిన రెండో ప్లేయర్గా మ్యాక్స్వెల్ (128 బంతుల్లో) నిలిచాడు. ఈ రికార్డు భారత ప్లేయర్ ఇషాన్ కిషన్ (126 బంతుల్లో; 2022లో బంగ్లాదేశ్పై చిట్టగాంగ్లో) పేరిట ఉంది. 1 వన్డేల్లో ఛేజింగ్ చేస్తూ అత్యధిక స్కోరు సాధించిన ప్లేయర్గా మ్యాక్స్వెల్ నిలిచాడు. పాకిస్తాన్ ప్లేయర్ ఫఖర్ జమాన్ (193; 2021లో దక్షిణాఫ్రికాపై జొహన్నెస్బర్గ్లో) పేరిట ఉన్న రికార్డును మ్యాక్స్వెల్ సవరించాడు. 2 ప్రపంచకప్ చరిత్రలో అత్యధిక సిక్స్లు కొట్టిన క్రికెటర్ల జాబితాలో మ్యాక్స్వెల్ (43) మూడో స్థానానికి చేరుకున్నాడు. క్రిస్ గేల్ (49), రోహిత్ శర్మ (45) వరుసగా తొలి రెండు స్థానాల్లో ఉన్నారు. స్కోరు వివరాలు అఫ్గానిస్తాన్ ఇన్నింగ్స్: గుర్బాజ్ (సి) స్టార్క్ (బి) హాజల్వుడ్ 21; జద్రాన్ (నాటౌట్) 129; రహ్మత్ (సి) హాజల్వుడ్ (బి) మ్యాక్స్వెల్ 30; హష్మతుల్లా (బి) స్టార్క్) 26; ఒమర్జాయ్ (సి) మ్యాక్స్వెల్ (బి) జంపా 22; నబీ (బి) హాజల్ వుడ్ 12; రషీద్ (నాటౌట్) 35; ఎక్స్ట్రాలు 16; మొత్తం (50 ఓవర్లలో 5 వికెట్లకు) 291. వికెట్ల పతనం: 1–38, 2–121, 3–173, 4–210, 5–233. బౌలింగ్: స్టార్క్ 9–0–70–1, హాజల్వుడ్ 9–0–39–2, మ్యాక్స్వెల్ 10–0– 55–1, కమిన్స్ 8–0–47–0, జంపా 10–0– 58–1, హెడ్ 3–0–15–0, స్టొయినిస్ 1–0– 2–0. ఆ్రస్టేలియా ఇన్నింగ్స్: వార్నర్ (బి) ఒమర్జాయ్ 18; హెడ్ (సి) ఇక్రామ్ (బి) నవీనుల్ 0; మామార్ష్ (ఎల్బీడబ్ల్యూ) (బి) నవీనుల్ 24; లబుషేన్ (రనౌట్) 14; ఇంగ్లిస్ (సి) జద్రాన్ (బి) ఒమరాŠజ్య్ 0; మ్యాక్స్వెల్ (నాటౌట్) 201; స్టొయినిస్ (ఎల్బీడబ్ల్యూ) (బి) రషీద్ 6; స్టార్క్ (సి) ఇక్రామ్ (బి) రషీద్ 3; కమిన్స్ (నాటౌట్) 12; ఎక్స్ట్రాలు 15; మొత్తం (46.5 ఓవర్లలో 7 వికెట్లకు) 293. వికెట్ల పతనం: 1–4, 2–43, 3–49, 4–49, 5–69, 6–87, 7–91. బౌలింగ్: ముజీబ్ 8.5–1–72–0, నవీనుల్ 9–0–47–2, ఒమర్జాయ్ 7–1–52–2, రషీద్ ఖాన్ 10–0–44–2, నూర్ అహ్మద్ 10–1–53–0, నబీ 2–0–20–0. ప్రపంచకప్లో నేడు ఇంగ్లండ్ x నెదర్లాండ్స్ వేదిక: పుణే మధ్యాహ్నం 2 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, హాట్స్టార్ యాప్లో ప్రత్యక్ష ప్రసారం -
వన్డే ఫార్మాట్లో మరో డబుల్ సెంచరీ.. ఈసారి..!
రాయల్ లండన్ వన్డే కప్-2023లో నార్తంప్టన్షైర్ ఓపెనర్, టీమిండియా యువ ఆటగాడు పృథ్వీ షా చేసిన విధ్వంకర ద్విశతకం (153 బంతుల్లో 244; 28 ఫోర్లు, 11 సిక్సర్లు) మరువక ముందే మరో డబుల్ సెంచరీ నమోదైంది. సోమర్సెట్తో ఇవాళ (ఆగస్ట్ 13) జరుగుతున్న మ్యాచ్లో గ్లోసెస్టర్షైర్ కెప్టెన్ జేమ్స్ బ్రేసీ అజేయ డబుల్ సెంచరీతో (151 బంతుల్లో 224 నాటౌట్; 30 ఫోర్లు, 5 సిక్సర్లు) విరుచుకుపడ్డాడు. బ్రేసీతో పాటు మరో ఓపెనర్ క్రిస్ డెంట్ (38 బంతుల్లో 65; 6 ఫోర్లు, 4 సిక్సర్లు), ఓలివర్ ప్రైస్ (83 బంతుల్లో 77; 8 ఫోర్లు, సిక్స్), ఆఖర్లో గ్రేమ్ వాన్ బుర్రెన్ (12 బంతుల్లో 35 నాటౌట్; 2 ఫోర్లు, 3 సిక్సర్లు) రాణించడంతో గ్లోసెస్టర్షైర్ నిర్ణీత 50 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 454 పరుగుల రికార్డు స్కోర్ చేసింది. సోమర్సెట్ బౌలర్లలో లాంగ్రిడ్జ్, జార్జ్ థామస్, షోయబ్ బషీర్ తలో వికెట్ పడగొట్టారు. ఈ టోర్నీలో డబుల్ సెంచరీలు నమోదైన రెండు సందర్భాల్లో ప్రత్యర్ధి సోమర్సెటే కావడం విశేషం. నార్తంప్టన్షైర్తో మ్యాచ్లో పృథ్వీ షా, గ్లోసెస్టర్షైర్తో జరుగుతున్న మ్యాచ్లో జేమ్స్ బ్రేసీ సోమర్సెట్ బౌలర్లను ఆడుకున్నారు. ఈ మ్యాచ్లో సోమర్సెట్ బౌలర్లందరూ 9కిపైగా యావరేజ్తో పరుగులు సమర్పించుకున్నారు. లాంగ్రిడ్జ్ను (8 ఓవర్లలో 5 పరుగులు) అయితే బ్రేసీ, బుర్రెన్ ఊచకోత కోశారు. లిస్ట్-ఏ క్రికెట్లో ఏడో అత్యధిక స్కోర్.. లిస్ట్-ఏ క్రికెట్లో (అంతర్జాతీయ, దేశవాలీ వన్డేలు) ఏడో అత్యధిక స్కోర్ నమోదైంది. సోమర్సెట్తో జరుగుతున్న మ్యాచ్లో గ్లోసెస్టర్షైర్ రికార్డు స్థాయిలో 454 పరుగులు స్కోర్ చేసింది. ఈ ఫార్మాట్లో అత్యధిక స్కోర్ రికార్డు తమిళనాడు పేరిట ఉంది. 2022లో అరుణాచల్ ప్రదేశ్తో జరిగిన మ్యాచ్లో తమిళనాడు జట్టు రికార్డు స్థాయిలో 506 పరుగులు చేసింది. లిస్ట్-ఏ క్రికెట్లో ఓ జట్టు 500 పరుగుల మార్కును దాటడం ఇదే మొదటిసారి. దీని తర్వాత అత్యధిక టీమ్ స్కోర్ రికార్డు ఇంగ్లండ్ పేరిట ఉంది. 2022లో నెదార్లండ్స్తో జరిగిన మ్యాచ్లో ఇంగ్లండ్ టీమ్ 498 పరుగులు స్కోర్ చేసింది. పదో అత్యధిక వ్యక్తిగత స్కోర్.. లిస్ట్-ఏ క్రికెట్లో పదో అత్యధిక వ్యక్తిగత స్కోర్ నమోదైంది. సోమర్సెట్తో జరుగుతున్న మ్యాచ్లో గ్లోసెస్టర్షైర్ ఆటగాడు జేమ్స్ బ్రేసీ (151 బంతుల్లో 224 నాటౌట్; 30 ఫోర్లు, 5 సిక్సర్లు) అజేయ డబుల్ సెంచరీతో విరుచుకుపడ్డాడు. లిస్ట్-ఏ క్రికెట్లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ తమిళనాడు ఆటగాడు ఎన్ జగదీశన్ (277) పేరిట ఉంది. అతని తర్వాత అలిస్టర్ బ్రౌన్ (268), రోహిత్ శర్మ (264), షార్ట్ (257), శిఖర్ ధవన్ (248),పృథ్వీ షా (244), మార్టిన్ గప్తిల్ (237), ట్రవిస్ హెడ్ (230), డంక్ (229), పృథ్వీ షా (227) ఉన్నారు. -
పృథ్వీ షా సునామీ ఇన్నింగ్స్.. 129 బంతుల్లో డబుల్ సెంచరీ! కానీ...
Prithvi Shaw Slams Double Century- Fans Reacts- లండన్: ఇంగ్లండ్ కౌంటీ క్రికెట్లో తొలిసారి ఆడుతున్న భారత క్రికెటర్ పృథ్వీ షా దేశవాళీ వన్డే కప్లో డబుల్ సెంచరీతో అదరగొట్టాడు. సోమర్సెట్తో బుధవారం జరిగిన వన్డే మ్యాచ్లో నార్తంప్టన్షైర్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న 23 ఏళ్ల పృథ్వీ షా విధ్వంసకర ఇన్నింగ్స్తో మెరిశాడు. 153 బంతులు ఆడిన పృథ్వీ షా 28 ఫోర్లు, 11 సిక్స్లతో 244 పరుగులు సాధించి ఇన్నింగ్స్ చివరి ఓవర్లో అవుటయ్యాడు. పృథ్వీ షా అసాధారణ బ్యాటింగ్తో మొదట బ్యాటింగ్కు దిగిన నార్తంప్టన్షైర్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లకు 415 పరుగులు సాధించింది. అనంతరం సోమర్సెట్ జట్టు 45.1 ఓవర్లలో 328 పరుగులకు ఆలౌటై 87 పరుగుల తేడాతో ఓడిపోయింది. రికార్డుల పృథ్వీ నార్తంప్టన్షైర్ జట్టు తరఫున మూడో మ్యాచ్ ఆడిన పృథ్వీ షా 81 బంతుల్లో సెంచరీ చేయగా... డబుల్ సెంచరీని 129 బంతుల్లో దాటాడు. ముంబైకి చెందిన పృథ్వీ షాకిది లిస్ట్ ‘ఎ’ క్రికెట్లో (దేశవాళీ, అంతర్జాతీయ వన్డేలు) రెండో డబుల్ సెంచరీ కావడం విశేషం. లిస్ట్ ‘ఎ’లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ల లిస్టులో మాత్రం.. జాబితాలో పృథ్వీ షాది ఆరో స్థానం. ఈ జాబితాలో తమిళనాడు క్రికెటర్ నారాయణ్ జగదీశన్ (277; అరుణాచల్ప్రదేశ్పై 2022లో) టాప్ ర్యాంక్లో ఉన్నాడు. అప్పటి నుంచి నో ఛాన్స్! 2021లో భారత దేశవాళీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీలో పుదుచ్చేరిపై పృథ్వీ షా 227 పరుగులతో అజేయంగా నిలిచాడు. 2021 జూలైలో చివరిసారి శ్రీలంక పర్యటనలో భారత జట్టుకు ఆడిన పృథ్వీ షా ఆ తర్వాత ఫామ్ కోల్పోయి జాతీయ జట్టుకు దూరమయ్యాడు. ఇక తాజాగా ఇంగ్లండ్లో అతడు బ్యాట్ ఝులిపించడంతో టీమిండియా సెలక్టర్లను ఉద్దేశించి అభిమానులు ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. మన వాళ్ల ప్రతిభను మనం గుర్తించకపోతే ఇదిగో ఇలాగే పక్క దేశాల్లో ఆడుకుంటారంటూ ఫైర్ అవుతున్నారు. ఇకనైనా పృథ్వీ వంటి వాళ్లకు అవకాశాలు ఇవ్వాలని సూచిస్తున్నారు. చదవండి: మా కెప్టెన్ గట్టిగానే వార్నింగ్ ఇచ్చాడు.. అదే నా మెదడును తొలిచేసింది! అందుకే.. ✅ Sixth-highest score in List A history ✅ Second-highest List A score in 🏴 ✅ Highest-ever List A score for @NorthantsCCC @PrithviShaw with one of the all-time great knocks 👑#MBODC23 pic.twitter.com/NfXH7RHfqk — Metro Bank One Day Cup (@onedaycup) August 9, 2023 -
పేట్రేగిపోయిన పృథ్వీ షా.. భారీ ద్విశతకం, 28 ఫోర్లు, 11 సిక్సర్లతో విధ్వంసం
టీమిండియా యంగ్ ఓపెనర్, ముంబై ఆటగాడు పృథ్వీ షా ఇంగ్లండ్ దేశవాలీ వన్డే టోర్నీ (లిస్ట్-ఏ క్రికెట్), మెట్రో బ్యాంక్ వన్డే కప్లో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. సోమర్సెట్తో ఇవాళ (ఆగస్ట్ 9) జరిగిన మ్యాచ్లో భారీ ద్విశతం (153 బంతుల్లో 244; 28 ఫోర్లు, 11 సిక్సర్లు) బాది ఆల్టైమ్ రికార్డులు బద్దలుకొట్టాడు. ఫలితంగా అతను ప్రాతినిథ్యం వహిస్తున్న నార్తంప్టన్షైర్ తొలుత బ్యాటింగ్ చేస్తూ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 415 పరుగుల రికార్డు స్కోర్ చేసింది. ✅ Sixth-highest score in List A history ✅ Second-highest List A score in 🏴 ✅ Highest-ever List A score for @NorthantsCCC @PrithviShaw with one of the all-time great knocks 👑#MBODC23 pic.twitter.com/NfXH7RHfqk — Metro Bank One Day Cup (@onedaycup) August 9, 2023 ఓపెనర్గా బరిలోకి దిగిన షా డబుల్ సెంచరీతో విధ్వంసం సృష్టించగా.. సామ్ వైట్మ్యాన్ (54), రికార్డో వాస్కో (47), ఎమిలియో గే (30) రాణించారు. సోమర్ సెట్ బౌలర్లలో జాక్ బ్రూక్స్ 3 వికెట్లు పడగొట్టగా.. డానీ లాంబ్ 2, షోయబ్ బషీర్, జార్జ్ థామస్ తలో వికెట్ దక్కించుకున్నారు. షా విధ్వంసం ధాటికి సోమర్సెట్ బౌలర్లంతా ఊచకోతకు గురయ్యారు. ప్రతి బౌలర్ దాదాపు 9 రన్రేట్తో పరుగులు సమర్పించుకున్నాడు. 🚨 PRITHVI SHAW HAS 200! 🚨#MBODC23 pic.twitter.com/GeVYVD3o6z — Metro Bank One Day Cup (@onedaycup) August 9, 2023 పృథ్వీ షా డబుల్ సెంచరీ విశేషాలు.. ఈ టోర్నీలో తొలి రెండు మ్యాచ్ల్లో కలిపి 60 పరుగులు చేసిన పృథ్వీ షా.. ఇంగ్లండ్ డొమెస్టిక్ క్రికెట్లో తన మూడో అప్పియరెన్స్లోనే డబుల్ సెంచరీ బాదాడు. ఇదే టోర్నీతో షా ఇంగ్లండ్ డొమెస్టిక్ సర్క్యూట్లోకి అరంగేట్రం చేశాడు. ఈ మ్యాచ్లో 153 బంతులను ఎదుర్కొన్న షా 28 ఫోర్లు, 11 సిక్సర్ల సాయంతో 244 పరుగులు చేసి, ఈ టోర్నీ చరిత్రలో అత్యధిక వ్యక్తిగత స్కోర్ రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. అలాగే ఈ టోర్నీ డబుల్ సెంచరీ చేసిన మూడో ఆటగాడిగానూ రికార్డుల్లోకెక్కాడు. ఈ టోర్నీ చరిత్రలో డబుల్ సెంచరీ చేసిన తొలి భారత ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. 129 బంతుల్లో డబుల్ సెంచరీ పూర్తి చేసిన షా.. ఇంగ్లండ్ లిస్ట్-ఏ క్రికెట్లో ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ రికార్డు నమోదు చేశాడు. ఈ మ్యాచ్లో డబుల్ సెంచరీతో చెలరేగిన షా.. ఇంగ్లండ్ లిస్ట్-ఏ క్రికెట్లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ నమోదు చేసిన భారత ఆటగాడిగా నిలిచాడు. గతంలో ఈ రికార్డు చతేశ్వర్ పుజారా (174) పేరిట ఉంది. లిస్ట్-ఏ చరిత్రలో ఆరో అత్యధిక వ్యక్తిగత స్కోర్ ఇంగ్లండ్ లిస్ట్-ఏ క్రికెట్లో రెండో అత్యధిక వ్యక్తిగత స్కోర్ నార్తంప్టన్షైర్ తరఫున హైయెస్ట్ లిస్ట్-ఏ స్కోర్ ఇంగ్లండ్ లిస్ట్-ఏ క్రికెట్లో డబుల్ సెంచరీ చేసిన తొలి భారత ఆటగాడు లిస్ట్-ఏ క్రికెట్లో రెండు వేర్వేరు దేశాల్లో డబుల్ సెంచరీలు చేసిన తొలి ఆటగాడు. భారత దేశవాలీ వన్డే టోర్నీలోనూ షా ఓ డబుల్ సెంచరీ చేశాడు. లిస్ట్-ఏ క్రికెట్లో రోహిత్ శర్మ (3) తర్వాత అత్యధిక డబుల్ సెంచరీలు (2) 100 on the shirt, 100 on the scoreboard 💯 Prithvi Shaw goes full @nassercricket with his celebration! #MBODC23 pic.twitter.com/5UJLbrF2uQ — Metro Bank One Day Cup (@onedaycup) August 9, 2023 Highest List A individual score for Prithvi Shaw. He surpassed his previous best 227*pic.twitter.com/fI783vh7JH — Don Cricket 🏏 (@doncricket_) August 9, 2023 Prithvi Shaw in 2023: Scored his maiden triple hundred - 379 in 383 balls in the Ranji Trophy. Scored 244 in 153 balls in the Royal London One Day Cup. pic.twitter.com/QhG2tOyaWk — Mufaddal Vohra (@mufaddal_vohra) August 9, 2023 -
లంక గడ్డపై డబుల్ సెంచరీ బాదిన తొలి ఓపెనర్గా..
శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టులో పాకిస్తాన్ ఓపెనర్ అబ్దుల్లా షఫీక్ డబుల్ సెంచరీతో మెరిశాడు. 322 బంతులెదుర్కొన్న షఫీక్ 19 ఫోర్లు, 4 సిక్సర్లతో డబుల్ సెంచరీ మార్క్ను అందుకున్నాడు. కాగా టెస్టు క్రికెట్లో అబ్దుల్లా షఫీక్కు ఇదే తొలి డబుల్ సెంచరీ కావడం విశేషం. కాగా 23 ఏళ్ల వయసున్న అబ్దుల్లా షఫీక్ పాక్ తరపున డబుల్ సెంచరీ బాదిన మూడో యంగెస్ట్ క్రికెటర్గా రికార్డులకెక్కాడు. ఇంతకముందు జావెద్ మియాందాద్, హనీఫ్ మొహమ్మద్లు ఈ ఘనత సాధించారు. ఇక లంక గడ్డపై డబుల్ సెంచరీ బాదిన తొలి పాక్ ఓపెనర్గానూ అబ్దుల్లా షఫీక్ చరిత్రకెక్కాడు. A true champion knock 🔥❤️ 200 hundred from @imabd28 #SLvPAK #SLvsPAK #AbdullahShafique pic.twitter.com/c2m4ldK3m8 — Mir kashi👑 (@oya_kojuu) July 26, 2023 ఇక రెండో టెస్టులో పాకిస్తాన్ పట్టు బిగిస్తోంది. ఇప్పటికే తొలి టెస్టు గెలిచిన పాక్ సిరీస్ క్లీన్స్వీప్పై కన్నేసింది. ప్రస్తుతం పాకిస్తాన్ తొలి ఇన్నింగ్స్లో 110 ఓవర్లు ముగిసేసరికి నాలుగు వికెట్లు కోల్పోయి 458 పరుగులు చేసింది. అబ్దుల్లా షఫీక్కు(200 నాటౌట్) అగా సల్మాన్(80 బంతుల్లో 70 బ్యాటింగ్) చక్కగా సహకరిస్తున్నాడు. ఆశితో ఫెర్నాండో మూడు వికెట్లు తీయగా.. ప్రభాత్ జయసూరియా ఒక వికెట్ పడగొట్టాడు. ఇప్పటివరకు పాకిస్తాన్ 292 పరుగుల ఆధిక్యంలో ఉంది. ఆటకు ఇంకా రెండు రోజులు సమయం ఉండడం.. వరుణుడు అడ్డుపడకపోతే మాత్రం పాకిస్తాన్ విజయాన్ని ఆపడం లంకకు కష్టసాధ్యమనే చెప్పొచ్చు. అంతకముందు లంక తొలి ఇన్నింగ్స్లో 166 పరుగులకే కుప్పకూలింది.ధనుంజయ డిసిల్వా 57, దినేశ్ చండిమల్ 34 మినహా మిగతావారు పెద్దగా రాణించలేకపోయారు. పాక్ బౌలర్లలో అబ్రర్ అహ్మద్ నాలుగు వికెట్లు తీయగా.. నసీమ్ షా మూడు, షాహిన్ అఫ్రిది ఒక వికెట్ తీశాడు. 🌟 First visiting opener to score a double 💯 at SSC, Colombo 🌟 Third-youngest double-centurion for 🇵🇰 after Javed Miandad and Hanif Mohammad@imabd28 scores a magnificent maiden double ton 🙌#SLvPAK pic.twitter.com/3zGaD0pnKl — Pakistan Cricket (@TheRealPCB) July 26, 2023 Maiden Double Hundred - Take a bow, Abdullah Shafique! 🌟 He is now the third youngest Pakistan batter to score a Test double ton after Javed Miandad and Hanif Mohammad 💯👌#CricketTwitter #SLvPAK #WTC25 #PakBall #abdullahshafique pic.twitter.com/QvRxprwC7J — CricWick (@CricWick) July 26, 2023 చదవండి: Saud Shakeel: అజేయ డబుల్ సెంచరీతో అదరగొట్టి.. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిలతో పాటు! Abdullah Shafique: సెంచరీతో మెరిసిన పాక్ ఓపెనర్.. భారీ ఆధిక్యం దిశగా -
చరిత్ర సృష్టించిన పాక్ బ్యాటర్.. డబుల్ సెంచరీతో..!
శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్ట్లో పాకిస్తాన్ మిడిలార్డర్ బ్యాటర్ సౌద్ షకీల్ చరిత్ర సృష్టించాడు. శ్రీలంకలో డబుల్ సెంచరీ (208 నాటౌట్) సాధించిన తొలి పాకిస్తాన్ క్రికెటర్గా రికార్డుల్లోకెక్కాడు. గతంలో శ్రీలంకలో అత్యధిక స్కోర్ రికార్డు మహ్మద్ హఫీజ్ (196) పేరిట ఉండేది. ఈ మ్యాచ్లో షకీల్.. హఫీజ్ రికార్డును తిరగరాశాడు. కెరీర్లో ఆడుతున్నది ఆరో టెస్ట్ మ్యాచే అయినా ఎంతో అనుభవజ్ఞుడిలా బ్యాటింగ్ చేసిన షకీల్.. వ్యక్తిగత రికార్డుతో పాటు టెయిలెండర్ల సహకారంతో తన జట్టుకు అతిమూల్యమైన పరుగులు సమకూర్చాడు. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు (73/4) బరిలోకి దిగిన షకీల్.. అఘా సల్మాన్ (83), నౌమన్ అలీ (25), నసీం షా (78 బంతుల్లో 6) సాయంతో తన జట్టుకు భారీ స్కోర్ అందించాడు. షకీల్ సూపర్ డబుల్ సెంచరీతో కదం తొక్కడంతో పాక్ తొలి ఇన్నింగ్స్లో 461 పరుగులకు ఆలౌటైంది. శ్రీలంక బౌలర్లలో రమేశ్ మెండిస్ 5 వికెట్లతో చెలరేగగా.. ప్రభాత్ జయసూర్య 3, విశ్వ ఫెర్నాండో, కసున్ రజిత తలో వికెట్ పడగొట్టారు. అంతకుముందు శ్రీలంక తొలి ఇన్నింగ్స్లో 312 పరుగులకు ఆలౌటైన విషయం తెలిసిందే. ధనంజయ డిసిల్వ (122) సెంచరీతో కదం తొక్కగా.. ఏంజెలో మాథ్యూస్ అర్ధసెంచరీతో (64) రాణించాడు. పాక్ బౌలర్లలో షాహీన్ అఫ్రిది, నసీం షా, అబ్రార్ అహ్మద్ తలో 3 వికెట్లు, అఘా సల్మాన్ ఓ వికెట్ పడగొట్టాడు. కాగా, కెరీర్లో 11 ఇన్నింగ్స్ల్లో 2 సెంచరీలు, 5 అర్ధసెంచరీల సాయంతో 98.50 సగటున 788 పరుగులు చేసిన షకీల్పై సోషల్మీడియా ప్రశంసల వర్షం కురిపిస్తుంది. పాక్ అభిమానులు 27 ఏళ్ల ఈ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ను ఆకాశానికెత్తుతున్నారు. టెస్ట్ క్రికెట్లో సంచలనాలు సృష్టిస్తున్న డెవాన్ కాన్వే, హ్యారీ బ్రూక్లతో పోలుస్తున్నారు. -
బర్త్డేకు ఒక్కరోజు ముందు.. ఓపెనర్గా డబుల్ సెంచరీ
వన్డేల్లో ఎంఎస్ ధోని అత్యధిక స్కోరు ఎంత అని అడిగితే టక్కున వచ్చే సమాధానం.. శ్రీలంకపై 183* పరుగుల సుడిగాలి ఇన్నింగ్స్. అంతకముందు పాకిస్తాన్పై 148 పరుగుల ఇన్నింగ్స్ ఆడినప్పటికి అంతగా పేరు రాలేదు. కానీ 183 పరుగులు ఇన్నింగ్స్ మాత్రం ధోని కెరీర్లో టర్నింగ్ పాయింట్గా నిలిచిందనడంలో సందేహం అవసరం లేదు. ఇక్కడి నుంచి ధోని కొట్టిన హెలికాప్టర్ షాట్లు బాగా ఫేమస్ అయ్యాయి. అయితే ధోని ఈ రెండు ఇన్నింగ్స్లను మిడిలార్డర్లో వచ్చి ఆడినవే. మరి ధోని ఓపెనర్గా డబుల్ సెంచరీ బాదాడన్న విషయం మీకు తెలుసా? అవును ఓపెనర్గా ధోని డబుల్ సెంచరీ బాదాడు. కానీ అంతర్జాతీయ క్రికెట్లో కాదు.. దేశవాలీ క్రికెట్లో. తన పుట్టినరోజుకు ఒక్కరోజు ముందు ధోని ఈ అద్బుత ఇన్నింగ్స్ను ఆడడం ఇక్కడ మరో విశేషం. జూన్ 6, 2005లో ఈడెన్ గార్డెన్స్ వేదికగా ధోని షామ్ బజార్ క్లబ్ తరపున 50 ఓవర్ల మ్యాచ్ ఆడాడు. పి-సేన్ టోర్నమెంట్లో భాగంగా జార్జ్ టెలిగ్రాఫ్తో షామ్ బజార్ క్లబ్ జట్టు తలపడింది. ఆ మ్యాచ్కు వచ్చిన అభిమానులను ధోని నిరాశపరచలేదు. ప్రత్యర్థి జట్టు బౌలర్లను చీల్చి చెండాడుతూ కేవలం 126 బంతుల్లోనే 207 పరుగులు బాదాడు. బ్యాట్కు చిల్లుపడిందా అన్నట్లుగా స్టేడియాన్ని సిక్సర్ల వర్షంతో మోతెక్కించాడు. ఆరోజు ధోని ఇన్నింగ్స్లో 10 సిక్సర్లు ఉండడం విశేషం. ఈ విషయాన్ని టెలిగ్రాఫ్ పత్రిక మరుసటి రోజు పెద్ద హెడ్లైన్స్తో ప్రచురించింది. ఇప్పటికి ధోని డబుల్ సెంచరీకి 18 ఏళ్ల పూర్తయిన సందర్భం.. ఇవాళ ధోని బర్త్డే సందర్భంగా ఆ విషయాన్ని గుర్తుచేసుకుంటూ బెంగాల్ క్రికెట్ అసోసియేష్(CAB) పంచుకుంది. అయితే అంతర్జాతీయ క్రికెట్లో ధోని 2006లో ఇంగ్లండ్తో జరిగిన వన్డేలో ఓపెనర్గా వచ్చి 106 బంతుల్లో 96 పరుగులు చేసి ఔటయ్యాడు. కేవలం నాలుగు పరుగుల తేడాతో సెంచరీ చేజార్చుకున్నాడు. వన్డే కెరీర్లో ఓపెనర్గా ధోనికిదే అత్యధిక స్కోరు. ఇక ధోనికి వన్డేల్లో డబుల్ సెంచరీ లేకపోయినప్పటికి.. టెస్టుల్లో ఆ ముచ్చటను తీర్చుకున్నాడు. 2012-13లో చెన్నై వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్టులో ధోని ఈ ఫీట్ సాధించాడు. టీమిండియా తొలి ఇన్నింగ్స్లో 265 బంతులాడిన ధోని 224 పరుగులు సాధించాడు. అతని ఇన్నింగ్స్లో 24 ఫోర్లు, ఆరు సిక్సర్లు ఉన్నాయి. ఈ మ్యాచ్లో టీమిండియా 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. On MS Dhoni's 42nd birthday, I found this report from 7th June 2005. It was about Dhoni hitting 207 off just 126 balls with 10 6s for Shyambazar Club against George Telegraph in the P Sen tournament at the Eden Gardens. pic.twitter.com/HbZNIHTD1o — Joy Bhattacharjya (@joybhattacharj) July 7, 2023 ఇక టీమిండియా కెప్టెన్గా ఉన్నత శిఖరాలను అధిరోహించిన ఎంఎస్ ధోని ఇవాళ(జూలై 7న) 42వ పడిలోకి అడుగుపెట్టాడు. టీమిండియా క్రికెట్ చరిత్రలో అత్యంత విజయవంతమైన కెప్టెన్గా గుర్తింపు పొందిన ఎంఎస్ ధోని 2007లో టి20 ప్రపంచకప్, 2011లో వన్డే వరల్డ్కప్, 2013 ఐసీసీ చాంపియన్స్ ట్రోపీ ఇలా మూడు టైటిల్స్ గెలిచిన ఏకైక భారత కెప్టెన్గా రికార్డులకెక్కాడు.అంతర్జాతీయ క్రికెట్కు గుడ్బై చెప్పి మూడేళ్లు కావొస్తున్నా అతని క్రేజ్ ఇసుమంతైనా తగ్గలేదు. ఇటీవలే ముగిసిన ఐపీఎల్ 16వ సీజన్ చాలు ధోని క్రేజ్ ఏంటో చెప్పడానికి. ఇక ఐపీఎల్లో సీఎస్కేను ఐదుసార్లు చాంపియన్గా నిలిపి అక్కడా సక్సెస్ఫుల్ కెప్టెన్ అయ్యాడు.2004లో టీమిండియాలో కీపర్ కీపర్ బ్యాట్స్మన్గా అరంగేట్రం చేసిన ధోని.. సుమారు 15 సంవత్సరాల పాటు అంతర్జాతీయ కెరీర్లో జట్టుకు ఎన్నో చిరస్మరణీయ విజయాలు అందించాడు. ధోని కెరీర్లో 90 టెస్టుల్లో 4876 పరుగులు, 350 వన్డేల్లో 10,773 పరుగులు, 98 టి20ల్లో 1617 పరుగులు చేశాడు. చదవండి: '30 లక్షలు సంపాదించి రాంచీలో ప్రశాంతంగా బతికేస్తా' ధోనికి వాళ్లంటే ఇష్టం! ‘ఏకైక’ క్రికెటర్గా ఎన్నెన్నో ఘనతలు! 42 ఆసక్తికర విషయాలు -
డబుల్ సెంచరీతో చెలరేగిన మయాంక్ అగర్వాల్
టీమిండియాకు దూరమైన మయాంక్ అగర్వాల్ రంజీ క్రికెట్లో మాత్రం దుమ్మురేపుతున్నాడు. సౌరాష్ట్రతో జరుగుతున్న సెమీఫైనల్లో ఈ కర్ణాటక కెప్టెన్ గురువారం డబుల్ సెంచరీతో అదరగొట్టాడు. 626 నిమిషాల పాటు క్రీజులో గడిపిన మయాంక్ 429 బంతులెదుర్కొని 249 పరుగులు చేశాడు. మయాంక్ ఇన్నింగ్స్లో 28 ఫోర్లు, ఆరు సిక్సర్లు ఉన్నాయి. ఫలితంగా కర్ణాటక తొలి ఇన్నింగ్స్లో 407 పరుగులకు ఆలౌట్ కాగా అందులో మయాంక్వే 249 పరుగులు ఉండడం విశేషం. ఒక రకంగా అతనిది వన్మ్యాన్ షో అని చెప్పొచ్చు. ఇక శ్రీనివాస్ శరత్ 66 పరుగులతో సహకరించాడు. సౌరాష్ట్ర బౌలర్లలో చేతన్ సకారియా, కె పటేల్లు చెరో మూడు వికెట్లు పడగొట్టగా.. చిరాగ్ జానీ, ప్రేరక్ మన్కడ్లు తలా ఒక వికెట్ తీశారు. అనంతరం బ్యాటింగ్ ఆరంభించిన సౌరాష్ట్ర వికెట్ నష్టానికి 22 పరుగులు చేసింది. బెంగాల్ వర్సెస్ మధ్యప్రదేశ్, రంజీ రెండో సెమీఫైనల్ బెంగాల్ తొలి ఇన్నింగ్స్లో 438 పరుగులకు ఆలౌటైంది. అనుస్తుప్ మజుందార్ (120 పరుగులు), సుదీప్ గరామీ(112 పరుగులు) శతకాలతో చెలరేగగా.. వికెట్ కీపర్ అభిషేక్ పోరెల్ 51 పరుగులు చేశాడు. అనంతరం మధ్యప్రదేశ్ తొలి ఇన్నింగ్స్లో 21 పరుగులు చేసింది. Mayank Agarwal's celebration when he completed his double hundred in Ranji trophy semi-final. pic.twitter.com/ckG0ez5ebh — CricketMAN2 (@ImTanujSingh) February 9, 2023 చదవండి: Ravindra Jadeja: పాంచ్ పటాకా.. ఆటతో పాటు తీరు కూడా కొత్తగా -
చరిత్ర సృష్టించిన తేజ్నరైన్ చంద్రపాల్.. తండ్రిని మించిపోయాడు..!
టెస్ట్ క్రికెట్లో వెస్టిండీస్ యువ ఓపెనర్ తేజ్నరైన్ చంద్రపాల్, తన తండ్రి శివ్నరైన్ చంద్రపాల్తో కలిసి ఎవరికీ సాధ్యంకాని ఓ అరుదైన ఫీట్ను సాధించాడు. ఈ క్రమంలో తేజ్నరైన్ తన తండ్రిని కూడా వెనక్కునెట్టాడు. వివరాల్లోకి వెళితే.. జింబాబ్వేతో జరుగుతున్న తొలి టెస్ట్లో తేజ్నరైన్ అజేయ డబుల్ సెంచరీ (467 బంతుల్లో 207 నాటౌట్; 16 ఫోర్లు, 3 సిక్సర్లు) సాధించి, తన జట్టును పటిష్ట స్థితిలో ఉంచాడు. The moment Tagenarine Chanderpaul complete his maiden double hundred in Test cricket - The future of West Indies cricket.pic.twitter.com/2ZRmKZ7ZUV — CricketMAN2 (@ImTanujSingh) February 6, 2023 కెరీర్లో మూడో టెస్ట్లోనే డబుల్ సెంచరీ సాధించిన తేజ్.. అత్యుత్తమ వ్యక్తిగత స్కోర్ విభాగంలో తండ్రి శివ్నరైన్నే మించిపోయాడు. శివ్నరైన్ 164 టెస్ట్ల కెరీర్లో 203 నాటౌట్ అత్యధిక స్కోర్ కాగా.. తేజ్ తన మూడో టెస్ట్లో తండ్రి అత్యధిక స్కోర్ను అధిగమించి తండ్రిని మించిన తనయుడు అనిపించుకున్నాడు. ఈ క్రమంలో తండ్రి కొడుకుల జోడీ క్రికెట్ చరిత్రలో ఎవరికీ సాధ్యం కానీ ఓ యూనిక్ రికార్డును సొంతం చేసుకుంది. టెస్ట్ క్రికెట్లో డబుల్ సెంచరీలు సాధించిన తొట్టతొలి తండ్రి కొడుకుల జోడీగా శివ్-తేజ్ జోడీ రికార్డుల్లోకెక్కింది. క్రికెట్ చరిత్రలో ఏ తండ్రి కొడుకులు ఈ ఘనత సాధించలేదు. భారత్కు చెందిన తండ్రి కొడుకులు లాలా అమర్నాథ్-మొహిందర్ అమర్నాథ్, విజయ్ మంజ్రేకర్-సంజయ్ మంజ్రేకర్, ఇఫ్తికార్ (ఇంగ్లండ్)-మన్సూర్ అలీ ఖాన్ పటౌడీ టెస్ట్ల్లో సెంచరీలు చేసినప్పటికీ తండ్రి కొడుకులు ఇద్దరూ డబుల్ సెంచరీలు మాత్రం సాధించలేకపోయారు. తేజ్నరైన్ కెరీర్లో 5 ఇన్నింగ్స్లు ఆడి హాఫ్ సెంచరీ, సెంచరీ, డబుల్ సెంచరీ సాయంతో 91.75 సగటున 367 పరుగులు చేశాడు. మరోపక్క తేజ్ తండ్రి శివ్నరైన్ 1994-15 మధ్యకాలంలో 164 టెస్ట్ల్లో 51.4 సగటున 30 సెంచరీలు, 66 హాఫ్సెంచరీల సాయంతో 11867 పరుగులు చేశాడు. అలాగే 268 వన్డేల్లో 11 సెంచరీలు, 59 హాఫ్సెంచరీల సాయంతో 8778 పరుగులు, 22 టీ20ల్లో 343 పరుగులు చేసి విండీస్ దిగ్గజ బ్యాటర్ అనిపించుకున్నాడు. ఇదిలా ఉంటే, 2 మ్యాచ్ల టెస్ట్ సిరీస్ కోసం జింబాబ్వేలో పర్యటిస్తున్న విండీస్ టీమ్.. తొలి టెస్ట్లో 447/6 స్కోర్ వద్ద తొలి ఇన్నింగ్స్ను డిక్లేర్ చేసింది. తేజ్నరైన్తో పాటు కెప్టెన్ క్రెయిగ్ బ్రాత్వైట్ (182) సెంచరీ చేశాడు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన జింబాబ్వే.. 11 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 25 పరుగులు చేసింది. ఈ మ్యాచ్లో ఇంకా రెండు రోజుల ఆట మాత్రమే మిగిలి ఉంది. -
సునాయాసంగా డబుల్ సెంచరీలు బాదేస్తున్న టీమిండియా ఓపెనర్లు.. గిల్ తర్వాత మరొకరు
Ranji Trophy 2022-23 KAR VS KER: రంజీ ట్రోఫీ 2022-23 సీజన్లో భాగంగా కేరళతో జరిగిన ఎలైట్ గ్రూప్-సి మ్యాచ్లో కర్ణాటక కెప్టెన్ మయాంక్ అగర్వాల్ (208; 17 ఫోర్లు, 5 సిక్సర్) డబుల్ సెంచరీతో చెలరేగిపోయాడు. మయాంక్కు జతగా నికిన్ జోస్ (54), శరత్ (53), శుభంగ్ హేగ్డే (50 నాటౌట్) అర్ధసెంచరీలతో రాణించడంతో కర్ణాటక 485/9 స్కోర్ వద్ద తొలి ఇన్నింగ్స్ను డిక్లేర్ చేసింది. అంతకుముందు టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన కేరళ సచిన్ బేబీ (141) సెంచరీతో అదరగొట్టడంతో తొలి ఇన్నింగ్స్లో 342 పరుగులకు ఆలౌటైంది. కేరళ స్కోర్ రెండో ఇన్నింగ్స్లో 96/4 వద్ద ఉండగా.. ఫలితం తేలే అవకాశం లేకపోవడంతో అంపైర్లు మ్యాచ్ను డ్రాగా ప్రకటించారు. సునాయాసంగా డబుల్ సెంచరీలు.. ఇటీవలి కాలంలో టీమిండియా ఆటగాళ్లు ఫార్మాట్లకతీతంగా డబుల్ సెంచరీలు బాదేస్తున్న విషయం విధితమే. రెండు రోజుల కిందట హైదరాబాద్ వేదికగా న్యూజిలాండ్తో జరిగిన వన్డే మ్యాచ్లో భారత యువ ఓపెనర్ శుభ్మన్ గిల్ డబుల్ సెంచరీతో (208) విధ్వంసం సృష్టించగా.. తాజాగా మరో టీమిండియా ఓపెనర్ మయాంక్ అగర్వాల్ (208) రంజీల్లో ఈ ఫీట్ సాధించాడు. మయాంక్ టెస్ట్ల్లోనూ భారత్ తరఫున డబుల్ సెంచరీ (243) చేశాడు. కాగా, ప్రస్తుత రంజీ సీజన్లో మయాంక్తో పాటు టీమిండియా ఆటగాళ్లు పృథ్వీ షా, కేదార్ జాదవ్, మనన్ వోహ్రా, పునిత్ బిస్త్, మహ్మద్ సైఫ్, తరువార్ కోహ్లి డబుల్ సెంచరీలతో విరుచుకుపడ్డారు. వీరిలో పృథ్వీ షా ఏకంగా ట్రిపుల్ సెంచరీ (379) చేశాడు. గతేడాది బంగ్లాదేశ్తో జరిగిన వన్డే మ్యాచ్లో టీమిండియా పాకెట్ డైనమైట్ ఇషాన్ కిషన్ బంగ్లాదేశ్పై 131 బంతుల్లో 24 ఫోర్లు, 10 సిక్సర్ల సాయంతో 210 పరుగులు చేశాడు. తాజాగా గిల్ చేసిన ద్విశతకంతో అంతర్జాతీయ వన్డేల్లో డబుల్ సెంచరీల సంఖ్య 10కి చేరింది. ఈ 10లో 7 భారత ఆటగాళ్లు చేసినవే కాగా, ఈ ఫీట్ సాధించిన వారంతా ఓపెనర్లే కావడం విశేషం. వన్డేల్లో డబుల్ సెంచరీలు సాధించిన ఆటగాళ్ల వివరాలు.. సచిన్ టెండూల్కర్ (2010లో సౌతాఫ్రికాపై 200 నాటౌట్), వీరేంద్ర సెహ్వాగ్ (2011లో వెస్టిండీస్పై 219), రోహిత్ శర్మ (2013లో ఆసీస్పై 209), రోహిత్ శర్మ (2014లో శ్రీలంకపై 264), క్రిస్ గేల్ (2015లో జింబాబ్వేపై 215), మార్టిన్ గప్తిల్ (2015లో వెస్టిండీస్పై 237*), రోహిత్ శర్మ (2017లో శ్రీలంకపై 208*), ఫకర్ జమాన్ (2018లో జింబాబ్వేపై 210*), ఇషాన్ కిషన్ (2022లో బంగ్లాదేశ్పై 210), శుభ్మన్ గిల్ (2023లో న్యూజిలాండ్పై 208) -
ఎలా ఔటయ్యాడో చూడు.. ఇంకెప్పుడు నేర్చుకుంటాడు.. గిల్ తండ్రి అసంతృప్తి
హైదరాబాద్ వేదికగా న్యూజిలాండ్తో నిన్న (జనవరి 18) జరిగిన వన్డేలో టీమిండియా యువ ఓపెనర్ శుభ్మన్ గిల్ డబుల్ సెంచరీతో (149 బంతుల్లో 209; 19 ఫోర్లు, 9 సిక్సర్లు) విధ్వంసం సృష్టించిన విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్కు ముందు గిల్ శ్రీలంకపై మూడో వన్డేలో సెంచరీ సాధించిన అనంతరం అతని తండ్రి లఖ్విందర్ గిల్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్మీడియాలో వైరల్గా మారాయి. గిల్ సహచరుడు, పంజాబ్ ఆటగాడు గురుకీరత్ సింగ్ మాన్ కథనం మేరకు.. శ్రీలంకపై గిల్ సెంచరీ సాధించాక ఔటైన విధానంపై లఖ్విందర్ అసంతృప్తి వ్యక్తం చేశాడట. లఖ్విందర్ గురుకీరత్తో మాట్లాడుతూ.. మంచి ఆరంభం లభించాక సెంచరీ చేశాడు, ఓకే.. డబుల్ సెంచరీ చేసే అవకాశం ఉన్నా, ఎలా ఔటయ్యాడో చూడు.. ఇలాంటి అవకాశాలు ప్రతిసారి రావు.. ఇంకెప్పుడు నేర్చుకుంటాడు అని అన్నాడట. This is what dreams are made of 💙🇮🇳🇮🇳 pic.twitter.com/rD3n4aHvfz — Shubman Gill (@ShubmanGill) January 19, 2023 లఖ్విందర్ చేసిన ఈ వ్యాఖ్యలు గిల్ కివీస్పై డబుల్ సెంచరీ చేశాక సోషల్మీడియాలో వైరలవుతున్నాయి. తండ్రి మందలింపును ఛాలెంజ్గా తీసుకుని గిల్ డబుల్ సెంచరీ కొట్టాడు అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇలాంటి తండ్రి గైడెన్స్లో పెరిగే క్రికెటర్లు అద్భుతాలు సృష్టిస్తారని మరికొందరు వ్యాఖ్యానిస్తున్నారు. ICYMI - 𝙒𝙃𝘼𝙏. 𝘼. 𝙆𝙉𝙊𝘾𝙆! 💪 💪 That celebration says it ALL 👌 👌 Follow the match 👉 https://t.co/IQq47h2W47 #TeamIndia | #INDvNZ | @ShubmanGill pic.twitter.com/OSwcj0t1sd — BCCI (@BCCI) January 18, 2023 కాగా, 2021 ఆస్ట్రేలియా పర్యటనలో (గబ్బా టెస్ట్లో) గిల్ 91 పరుగుల వద్ద ఔటయ్యాక కూడా లఖ్విందర్ ఇలాంటి వ్యాఖ్యలే చేశాడట. గిల్పై చిన్నప్పటి నుంచి ఎన్నో అంచనాలు పెట్టుకున్న లఖ్విందర్.. గిల్ అనవసర షాట్లు ఆడి వికెట్ సమర్పించుకుంటే అస్సలు ఒప్పుకునే వాడు కాదట. వన్డేల్లో జింబాబ్వేపై తన తొలి సెంచరీ చేసిన సందర్భంగా గిల్.. ఈ విషయాలు స్వయంగా వెల్లడించాడు. అంతకుమందు మ్యాచ్లో 33 పరుగుల వద్ద ఔటైనప్పుడు తన తండ్రి కొట్టినంత పని చేశాడు.. అందుకే ఈ సెంచరీ నా తండ్రికి అంకితం అంటూ తొలి వన్డే సెంచరీ అనంతరం పోస్ట్ మ్యాచ్ ప్రజెంటేషన్ సందర్భంగా గిల్ పేర్కొన్నాడు. ఇదిలా ఉంటే, 3 మ్యాచ్ల సిరీస్లో భాగంగా న్యూజిలాండ్తో నిన్న జరిగిన తొలి వన్డేలో టీమిండియా అతికష్టం మీద 12 పరుగుల తేడాతో విజయం సాధించింది. టీమిండియా నిర్ధేశించిన 350 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన న్యూజిలాండ్.. మైఖేల్ బ్రేస్వెల్ (78 బంతుల్లో 140; 12 ఫోర్లు, 10 సిక్సర్లు) విధ్వంకర శతకంతో గడగడలాడించినప్పటికీ, ఆఖరి ఓవర్లో అతను ఔట్ కావడంతో టీమిండియా విజయం సాధించగలిగింది. -
డబుల్ సెంచరీ కొట్టాలంటే మనోళ్లే.. పదిలో ఏడు మనవే.. మరో విశేషమేమిటంటే..?
వన్డే క్రికెట్లో సెంచరీ సాధించాలంటే ముక్కీ మూలిగి, 150, 200 బంతులను ఎదుర్కొని, ఆఖరి ఓవర్లలో ఆ మార్కును దాటే రోజులు పోయాయి. టీ20 క్రికెట్ పుణ్యమా అని వన్డే క్రికెట్లోనూ వేగం పెరగడంతో ఆటగాళ్లు తృణప్రాయంగా సెంచరీలు బాదేస్తున్నారు. ఒకప్పుడు సెంచరీ సాధించాలంటే ఓపెనర్లు లేదా వన్డౌన్, టూ డౌన్లలో వచ్చే ఆటగాళ్లకు మాత్రమే సాధ్యమయ్యేది. అయితే ప్రస్తుత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఆరు, ఏడు స్థానాల్లో వచ్చే ఆటగాళ్లు కూడా అలవోకగా సెంచరీలు కొట్టేస్తున్నారు. ఓపెనింగ్ వచ్చే ఆటగాళ్లైతే బఠానీలు నమిలినంత ఈజీగా డబుల్ సెంచరీలు బాదేస్తున్నారు. ఇందుకు తాజా ఉదాహరణ శుభ్మన్ గిల్. ఈ భారత యువ ఓపెనర్ ఇవాళ (జనవరి 18) న్యూజిలాండ్తో జరిగిన వన్డేలో 149 బంతుల్లో 19 ఫోర్లు, 9 సిక్సర్ల సాయంతో 208 పరుగులు చేశాడు. ఇంతకు కొద్ది రోజుల ముందే (డిసెంబర్ 10, 2022) మరో భారత ఓపెనర్ ఇషాన్ కిషన్ బంగ్లాదేశ్పై 131 బంతుల్లో 24 ఫోర్లు, 10 సిక్సర్ల సాయంతో 210 పరుగులు చేశాడు. మొత్తంగా ఇప్పటివరకు వన్డేల్లో 10 డబుల్ సెంచరీలు నమోదు కాగా, అందులో భారత ఆటగాళ్లు సాధించినవి ఏడు ఉండటం విశేషం. మరో విశేషమేమిటంటే ఈ పది డబుల్ సెంచరీలు కూడా ఓపెనర్లు సాధించినవే కావడం. వన్డేల్లో తొట్ట తొలి డబుల్ సెంచరీ సాధించింది క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్. 2010 ఫిబ్రవరి 24న గ్వాలియర్లో సౌతాఫ్రికాపై సచిన్ 200 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఆతర్వాత వీరేంద్ర సెహ్వాగ్ (2011లో వెస్టిండీస్పై 219), రోహిత్ శర్మ (2013లో ఆసీస్పై 209), రోహిత్ శర్మ (2014లో శ్రీలంకపై 264), క్రిస్ గేల్ (2015లో జింబాబ్వేపై 215), మార్టిన్ గప్తిల్ (2015లో వెస్టిండీస్పై 237*), రోహిత్ శర్మ (2017లో శ్రీలంకపై 208*), ఫకర్ జమాన్ (2018లో జింబాబ్వేపై 210*), ఇషాన్ కిషన్ (2022లో బంగ్లాదేశ్పై 210), శుభ్మన్ గిల్ (2023లో న్యూజిలాండ్పై 208) డబుల్ సెంచరీలు సాధించారు. మహిళల క్రికెట్ విషయానికొస్తే.. ఈ విభాగంలోనూ రెండు డబుల్ సెంచరీలు నమోదయ్యాయి. ఆస్ట్రేలియాకు చెందిన బెలిండా క్లార్క్ 1997లోనే డెన్మార్క్పై 229* పరుగులు సాధించింది. ఆ తర్వాత 2018లో న్యూజిలాండ్కు చెందిన అమెలియా కెర్ ఐర్లాండ్పై 232* పరుగులు సాధించింది. ఓవరాల్గా చూస్తే.. వన్డేల్లో తొలి డబుల్ సెంచరీ సాధించింది బెలిండా క్లార్క్ కాగా, అత్యధిక డబుల్ సెంచరీలు సాధించింది రోహిత్ శర్మ (3). ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ రికార్డు ఇషాన్ కిషన్ (126) పేరిట ఉండగా, అత్యంత పిన్న వయసులో ఈ ఫీట్ సాధించిన ఘనత శుభ్మన్ గిల్ (23 ఏళ్ల 132 రోజులు) పేరిట నమోదై ఉంది. -
డబుల్ సెంచరీతో రికార్డుల మోత మోగించిన శుభ్మన్ గిల్
హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియం వేదికగా న్యూజిలాండ్తో జరుగుతున్న తొలి వన్డేలో టీమిండియా యువ ఓపెనర్ శుభ్మన్ గిల్ డబుల్ సెంచరీతో విరుచుకుపడ్డాడు. ఈ ఇన్నింగ్స్లో మొత్తం 145 బంతులను ఎదుర్కొన్న గిల్.. 19 ఫోర్లు, 9 సిక్సర్ల సాయంతో 208 పరుగులు చేశాడు. అంతర్జాతీయ కెరీర్లో తొలిసారి ఈ ఫీట్ (డబుల్ సెంచరీ) సాధించిన గిల్ హ్యాట్రిక్ సిక్సర్లతో 200 మార్క్ను చేరుకున్నాడు. డబుల్ సెంచరీ సాధించే క్రమంలో గిల్ పలు రికార్డులను బద్దలు కొట్టాడు. అవేంటంటే.. అత్యంత పిన్న వయసులో (23 ఏళ్ల 132 రోజులు) డబుల్ సెంచరీ సాధించిన ఆటగాడిగా రికార్డు. ఇంతకుముందు ఈ రికార్డు ఇషాన్ కిషన్ (24 ఏళ్ల 145 రోజులు) పేరిట ఉండేది. హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియంలో అత్యధిక స్కోర్ రికార్డు. గతంలో ఈ రికార్డు సచిన్ టెండూల్కర్ (2009లో ఆసీస్పై 175 పరుగులు) పేరిట ఉండేది. ఓ ఇన్నింగ్స్లో అత్యధిక స్కోరర్ (గిల్, 208), రెండో అత్యధిక స్కోరర్ (రోహిత్, 34) మధ్య రన్స్ గ్యాప్ రికార్డు. ఈ రికార్డు రోహిత్ శర్మ పేరిట ఉంది. హిట్మ్యాన్ 264 పరుగులు చేసిన మ్యాచ్లో రెండో అత్యధిక స్కోరర్గా విరాట్ కోహ్లి (66) ఉన్నాడు. వీరిద్దరి మధ్య 198 పరుగుల తేడా ఉంది. ఇవాళ్టి మ్యాచ్లో గిల్, రోహిత్ల మధ్య 174 పరుగుల తేడాతో ఉంది. రన్స్ గ్యాప్ రికార్డ్స్ జాబితాలో గిల్ది మూడో స్థానం. వన్డేల్లో న్యూజిలాండ్పై అత్యధిక వ్యక్తిగత స్కోర్. గతంలో ఈ రికార్డు సచిన్ (186 నాటౌట్) పేరిట ఉండేది. వరుస వన్డే ఇన్నింగ్స్ల్లో సెంచరీ, డబుల్ సెంచరీతో పాటు హ్యాట్రిక్ సిక్సర్లతో డబుల్ సెంచరీ పూర్తి చేసిన ఘనత. అతి తక్కువ వన్డేల్లో (19) 3 సెంచరీలు చేసిన ఆటగాడిగా శిఖర్ ధవన్ (17) తర్వాతి స్థానం. వన్డేల్లో అతి వేగంగా (19 మ్యాచ్ల్లో) 1000 పరుగులు పూర్తి చేసిన రెండో ఆటగాడిగా రికార్డు. ఈ రికార్డు పాక్ ఆటగాడు ఫకర్ జమాన్ (18) పేరిట ఉంది. భారత్ తరఫున అతి వేగంగా 1000 పరుగులు చేసిన ఆటగాడిగా రికార్డు. విరాట్ కోహ్లి, శిఖర్ ధవన్ (24 మ్యాచ్లు) సంయుక్తంగా రెండో ప్లేస్లో ఉన్నారు. -
హ్యాట్రిక్ సిక్సర్లతో డబుల్ సెంచరీ పూర్తి చేసిన గిల్.. టీమిండియా భారీ స్కోర్
హైదరాబాద్ వేదికగా న్యూజిలాండ్తో ఇవాళ (జనవరి 18) జరుగుతున్న తొలి వన్డేలో టీమిండియా ఓపెనర్ శుభ్మన్ గిల్ (149 బంతుల్లో 208; 19 ఫోర్లు, 9 సిక్సర్లు) డబుల్ సెంచరీతో విరుచుకుపడ్డాడు. ఈ ఇన్నింగ్స్లో ఆకాశమే హద్దుగా చెలరేగిన గిల్.. వన్డేల్లో పలు రికార్డులు బద్దలు కొట్టడంతో పాటు వరుస ఇన్నింగ్స్ల్లో సెంచరీ, డబుల్ సెంచరీ చేసిన ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. గిల్ విధ్వంసం ధాటికి భారత్ నిర్ణీత ఓవర్లలో 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 349 పరుగులు చేసింది. రోహిత్ శర్మ (34), సూర్యకుమార్ యాదవ్ (31), హార్ధిక్ పాండ్యా (28) ఓ మోస్తరుగా రాణించగా.. విరాట్ కోహ్లి (8), ఇషాన్ కిషన్ (5), వాషింగ్టన్ సుందర్ (12), శార్దూల్ ఠాకూర్ (3) నిరాశపరిచారు. కివీస్ బౌలర్లలో హెన్రీ షిప్లే, డారిల్ మిచెల్ చెరో 2 వికెట్లు పడగొట్టగా.. ఫెర్గూసన్, టిక్నర్, సాంట్నర్, తలో వికెట్ సాధించారు.