-
HYD: కుక్కల దాడిలో బాలుడి మృతి
సాక్షి,హైదరాబాద్: పటాన్చెరు ఇస్నాపూర్లో శుక్రవారం(జూన్28) దారుణం జరిగింది. కుక్కలదాడిలో ఎనిమిదేళ్ల బాలుడు విశాల్ మృతి చెందాడు. కాలకృత్యాలు తీర్చుకోవడానికి వెళ్లినపుడు కుక్కలు విశాల్పై దాడి చేసినట్లు తెలుస్తోంది.విశాల్ కుటుంబం కూలిపని చేసుకోవడానికి హైదరాబాద్ వచ్చింది. పొట్ట కూటి కోసం వచ్చి కొడుకును కోల్పోవడంపై విశాల్ తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. -
భీమిలిలో విషాదం.. పెంపుడు కుక్క కరిచి తండ్రీకొడుకుల మృతి
విశాఖపట్నం: భీమిలో పెంపుడు కుక్క కాటుకు తండ్రి కొడుకులు మృతి చెందారు. వివరాలలోకి వెళితే నర్సింగరావు(59), కొడుకు భార్గవ్(27) ను వారం క్రితం వారి పెట్ డాగ్ కరిచింది..భార్గవ్ ను ముక్కు మీద, నర్సింగరావు ను కాలిపై కరిచిన వారి పెట్ డాగ్ రెండు రోజుల్లో చనిపోవడంతో వారు అలెర్ట్ అయ్యారు..రేబిస్ ఇంజక్షన్స్ వేయించుకున్నారు..అయితే బ్రెయిన్ తో పాటు ఇతర భాగాలకు రేబిస్ సోకడంతో ట్రీట్మెంట్ తీసుకుంటూనే. తండ్రి కొడుకు మరణించారు -
వీధి కుక్కల వీరంగం
మణికొండ: వాకింగ్ కోసం ఇంట్లోంచి బయటకు వచ్చిన ఓ మహిళను వీధి కుక్కలు వెంటపడి తరిమాయి. ఏకంగా పదికి పైగా కుక్కల గుంపు ఆమెను చుట్టుముట్టి భయభ్రాంతులకు గురిచేశాయి. కుక్కల బారి నుంచి తప్పించుకుంటూ ఆ మహిళ వంద అడుగుల దూరం వరకు వెళ్లింది. అయినా అవి వెంటపడి మరీ తరమడంతో మహిళ అదుపుతప్పి కింద పడిపోయింది. దీంతో అవి ఒక్కసారిగా ఆమెపై పడ్డాయి. అదే సమయంలో అటువైపుగా స్కూటీపై వచ్చిన వ్యక్తి వద్దకు సదరు మహిళ పారిపోయి కుక్కల బారి నుంచి తప్పించుకున్న ఘటన మణికొండ మున్సిపాలిటీ పరిధిలోని చిత్రపురి కాలనీలో శనివారం చోటు చేసుకుంది. బాధితురాలి కథనం ప్రకారం.. చిత్రపురి కాలనీకి చెందిన రాజేశ్వరి రోజు మాదిరిగానే శనివారం ఉదయం 6 గంటలకు వాకింగ్ నిమిత్తం ఇంట్లోంచి బయటకు వచి్చంది. అదే సమయంలో పదుల సంఖ్యలో ఉన్న కుక్కలు ఒక్కసారిగా ఆమె వెంట పడ్డాయి. వాటి నుంచి తప్పించుకునేందుకు ఆమె విశ్వ ప్రయత్నాలు చేసింది. వాటి కాటుకు బలి కాకుండా తప్పించుకోగలిగింది. తిండి కోసం ఎదురు చూస్తుండగా.. కాలనీ వాసులు ముందు రోజు మిగిలిపోయిన ఆహారాన్ని కుక్కల కోసం వీధుల్లో పెడుతున్నారు. దీంతో ప్రతిరోజూ ఉదయం కుక్కలు ఆకలితో అక్కడికి చేరుకుంటున్నాయి. శనివారం కుక్కల బారిన పడిన మహిళ సైతం తమకు ఆహారం పెట్టేందుకే వచ్చి ఉంటుందని కొద్ది సేపు వెంటపడినట్టు సీసీ టీవీలలో రికార్డు అయ్యింది. ఎంతకూ అన్నం పెట్టకపోయేసరికి మహిళ వెంట పడ్డాయని కాలనీ వాసులు భావిస్తున్నారు. -
15 నెలల చిన్నారిపై వీధి కుక్కల దాడి
దుండిగల్: వీధి కుక్కల దాడిలో 15 నెలల చిన్నారి గాయపడింది. దుండిగల్ మున్సిపాలిటీ డిపోచంపల్లి పరిధిలోని సత్యసాయి కాలనీలో మింటూసింగ్ తన కుటుంబంతో నివసిస్తున్నాడు. అతడి కుమార్తె ఆరుషి (15 నెలలు) శనివారం ఇంటి ముందు ఆడుకుంటోంది. ఈ క్రమంలో వీధి కుక్కలు ఒక్కసారిగా చిన్నారిపై దాడి చేశాయి. ఈ ఘటనలో చిన్నారి తల, చేతికి గాయాలయ్యాయి. సూరారంలోని మల్లారెడ్డి ఆస్పత్రిలో బాలిక చికిత్స పొందుతోంది. మరో ఘటనలో 14 ఏళ్ల బాలుడిపై.. నిజాంపేట్: నిజాంపేట్లో 14 ఏళ్ల సాయిచరణ్ అనే బాలుడు నడుచుకుంటూ వెళ్తుండగా వీధి కుక్కల వెంటపడ్డాయి. వాటి బారి నుండి తప్పించుకునేందుకు యతి్నంచినా వెంబడించి గాయపరిచాయి. బాలుడి చేతులు, కాళ్లు, ఇతర శరీర భాగాల్లో కరిచాయి. దీంతో కుటుంబ సభ్యులు బాలుడిని స్థానికంగా ఉన్న ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స చేయించారు. -
Dogs Attack: నాలుగేళ్ల బాలుడిపై వీధి కుక్కల మూకుమ్మడి దాడి
మలక్పేట: నగరంలో వీధికుక్కలు స్వైరవిహారం చేస్తూనే ఉన్నాయి. శనివారం సాయంత్రం మలక్పేటలోని మూసారంబాగ్ డివిజన్ లక్ష్మీనగర్ కాలనీలో నాలుగేళ్ల బాలుడు ఉజ్వల్ కుమార్పై వీధి కుక్కలు దాడి చేసి తీవ్రంగా గాయపర్చాయి. తాను ఇంట్లోంచి బయటి రాకపోతే కుమారుడి ప్రాణాలు దక్కేవి కావని బాలుడి తల్లి ఆవేదన వ్యక్తం చేయడం ఈ ఘటన తీవ్రతకు అద్దంపడుతోంది. బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. ఏపీలోని అనంతపురం జిల్లా కదిరి మండలం వీరపల్లి పేట గ్రామానికి చెందిన జంపన సాయికుమార్, అలేఖ్య దంపతులు బతుకుదెరువు కోసం వచ్చి మూసారంబాగ్లో నివాసం ఉంటున్నారు.వీరికి ఉజ్వల్కుమార్ (4), ఆరు నెలల వయసున్న మరో బాబు ఉన్నారు. శనివారం సాయంత్రం చిన్న కుమారుడికి అలేఖ్య పాలు తాపుతుండగా.. ఉజ్వల్కుమార్ నిద్ర లేచి అపార్ట్మెంట్ గేట్ వైపు వెళ్తుండగా వీధి కుక్కలు వచ్చి అతనిపై దాడిచేశాయి. మొదట కుడికాలు పట్టుకుని బయటికి ఈడ్చుకుంటూ వెళ్లి బాలుడి ముఖాన్ని తీవ్రంగా గాయపరిచాయి. బాలుడు గట్టిగా ఏడ్వడంతో గదిలోంచి తల్లి బయటికి వచి్చంది. అప్పటికే కుక్కలు బాలుడిని కరుస్తున్నాయి.ఆమె కేకలు వేస్తూ వాటిని కట్టెతో కొట్టి వెళ్లగొట్టింది. బాలుడి ముఖంపై, కాలుకు తీవ్ర గాయాలు కావడంతో ఒళ్లంతా రక్తంతో తడిసి పోయింది. చికిత్స కోసం నల్లకుంటలోని ఫీవర్ ఆస్పత్రికి.. అక్కడి నుంచి ఉస్మానియా ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఉజ్వల్కుమార్ ముఖానికి వైద్యులు చికిత్స చేశారని, 10 కుట్లు వేశారని తండ్రి సాయికుమార్ తెలిపారు. గది నుంచి బయటికి రావడం ఆలస్యమైతే తమ కొడుకును కుక్కలు చంపేసి ఉండేవని తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమయ్యారు. అధికారులు ఇప్పటికైనా స్పందించి కుక్కల బెడదను నివారించాల్సిన అవసరం ఎంతైనా ఉందని డిమాండ్ చేశారు. -
వీధి కుక్కల దాడిలో ప్రముఖ వ్యాపారవేత్త కన్నుమూత!
వీధి కుక్కల దాడితో ప్రముఖ వ్యాపారవేత్త, వాఘ్ బక్రీ టీ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పరాగ్ దేశాయ్ కన్నుమూశారు. అక్టోబర్ 15న మార్నింగ్ వాక్కు వెళ్లిన పరాగ్ దేశాయ్ను వీధి కుక్కలు వెంబడించాయి. ఆపై దాడి చేశాయి. ఈ దాడిలో ఆయన కిందపడినట్లుగా సన్నిహితులు చెబుతున్నారు. అప్రమత్తమైన కుటుంబసభ్యులు అత్యవసర చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. తాజాగా, అహ్మదాబాద్లోని జైదాన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మెదడులో రక్తస్రావం వల్ల కన్నుమూశారు. మెదడులో రక్తస్రావం వల్ల ఆస్పత్రిలో మరణించినట్లు వాఘ్ బక్రీ టీ గ్రూప్ కంపెనీ వెల్లడించింది. పరాగ్ మరణంపై పలువురు ప్రముఖులు విచారం వ్యక్తం చేస్తున్నారు. అంకితభావానికి కేరాఫ్ అడ్రస్ వ్యాపార రంగంలో సరికొత్త ఆవిష్కరణలకి, అంకితభావానికి కేరాఫ్ అడ్రస్గా నిలిచారు పరాగ్ దేశాయ్. భారత్లోనే అతిపెద్ద 3వ ప్యాకేజ్డ్ వాఘ్ బక్రీ టీ’ గా అవతరించడంలో విశేషంగా కృషి చేశారు. వారసత్వ వ్యాపారంలో అడుగు వాఘ్ బక్రీ టీ కంపెనీ అధికారిక వెబ్సైట్ ప్రకారం.. పరాగ్ దేశాయ్ అమెరికా లాంగ్ ఐలాండ్ యూనివర్సిటీ నుంచి ఎంబీఏని ఉన్నత విద్యను అభ్యసించారు. అనంతరం, వారసత్వంగా వస్తున్న టీ’ వ్యాపారంలో అడుగు పెట్టారు. తన తండ్రి రసేష్ దేశాయ్ స్థాపించిన వాఘ్ బక్రీ టీ సంస్థలో అమ్మకాలు, మార్కెటింగ్, ఎగుమతి విభాగాల్లో కీలక పాత్ర పోషించారు. రూ.2,000 కోట్ల టర్నోవర్ 1892లోవాఘ్ బక్రీ గ్రూప్ను పరాగ్ తండ్రి నరన్దాస్ దేశాయ్ ప్రారంభించారు. అయితే పరాగ్ దేశాయ్ నేతృత్వంలో వాఘ్ బక్రీని భారతదేశపు మూడవ అతిపెద్ద ప్యాకేజ్డ్ టీ బ్రాండ్గా మార్చడంలో కీలక పాత్ర పోషించారు. ముఖ్యంగా, వారసత్వం,సాంప్రదాయ విలువలను గౌరవిస్తూ కొత్త కొత్త వ్యాపార వ్యూహాలతో ముందుకు సాగారు. తన దూరదృష్టి తో వాఘ్ బక్రీ టీ పరిధిని ప్రపంచవ్యాప్తంగా విస్తరించుకుంటూ వెళ్లగలిగారు. ఈ వాఘ్ బక్రీ టీ ఒక్క మనదేశంలోనే ప్రపంచంలోని వివిధ దేశాలలో ఇంటి పేరుగా మారింది. నేడు ఈ కంపెనీ ప్రస్తుత టర్నోవర్ రూ.2,000 కోట్లు. -
కుక్కలు మనుషుల్ని ఎందుకు కరుస్తాయి?వాటికీ ఫ్రస్ట్రేషన్ ఉంటుందా?
జిల్లాలో రోజురోజుకూ కుక్కకాటు ఘటనలు పెరిగిపోతున్నాయి. నిత్యం ఎక్క డో ఒక చోట మనుషులపై దాడి చేసి గాయపరుస్తూ నే ఉన్నాయి. వీధులు, రోడ్లపై గుంపులు గుంపులు గా తిరుగుతూ పాదచారులు, ద్విచక్ర వాహనాలపై వెళ్లే వారిని వెంబడించి మరీ కరుస్తున్నాయి. అంతేకాకుండా ఇళ్లలోకి దూరి దాడి చేస్తున్నాయి. శునకాల దాడిలో చిన్నారులు ప్రాణాలు వదిలిన సందర్భా లు అనేకం. కుక్క కాటుకు గురైన వారు ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులకు పరుగులు తీస్తున్నారు. రోజు రోజుకు కుక్కల బాధితులు పెరిగిపోతున్నారు. కుక్కలు కరవడం వల్ల రేబిస్ అనే వ్యాధి వచ్చే అవకాశం ఉంది. రేబిస్ వల్ల ఏటా 55 వేల మందికి పైగా చనిపోతున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. మన దేశంలో కుక్క కాటుకు ఏటా 15 వేలకు పైగా మంది చనిపోతున్నారు. ఆకలితో దాడి చేస్తున్నాయా..? ఇంతకీ కుక్కలు మనుషులపై ఎందుకు తెగబడుతున్నాయి. ఆకలితోనా లేక దూపతోనా.. ఇంకా ఏమైనా కారణాలు ఉన్నాయా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఒకప్పుడు వీధి కుక్కలు మనుషులపై దాడి చేసేవి కావు. గ్రామాల్లోకి కొత్తగా ఎవరైనా వచ్చినా, వాటికి హాని చేసే జంతువులు, ఇతర ప్రాణులు ఏవైనా కనిపిస్తే దాడి చేయడం చూశాం. కానీ ఇప్పుడు మనుషులపై దాడి చేయడం ఎక్కువైంది. ఏ కుక్క మంచిదో ఏది పిచ్చిదో తెలియని పరిస్థితి నెలకొంది. శునకాల దాడికి ప్రధాన కారణం ఆకలి అని పలువురు అంటున్నారు. గ్రామాల్లో, మున్సిపలిటీల్లో డ్రైనేజీ వ్యవస్థ పూర్తిగా మెరుగుపడింది. దీంతో వాటికి ఆహారం దొరకడం లేదు. అలాగే ఇంటింటా చెత్త సేకరణ ప్రారంభమయ్యాక రోడ్డు పక్క అన్నం, ఇతర ఆహార పదార్థాలు పడేయడం తగ్గింది. దీంతో వాటికి ఆహారం దొరకడం కష్టంగా మారింది. పైగా కుక్కలు తరుచూ దాడి చేస్తుండడంతో వాటిని ఎవరూ చేరదీసి ఆహారం పెట్టడం లేదు. దీంతో అవి ఆకలికి అలమటిస్తున్నాయి. కనీసం దాహం తీర్చుకునేందుకు వీధి నల్లాల వద్ద నీరు కూడా దొరడం లేదు. కుక్కలు డీ హైడ్రేషన్కు గురైనప్పుడు కూడా తీవ్ర ఒత్తిడికి గురవుతాయి. ఆ సమయంలో అధిక శబ్ధం వినిపించినా, వ్యక్తులు అధికంగా తన పక్క నుంచి తిరిగినా, వాటి పక్క నుంచి హఠాత్తుగా పరుగెత్తుతున్న కుక్కలు కరిచేసే అవకాశం ఉంది. కొన్ని సార్లు ప్రజల్ని భయపెట్టడానికి కుక్కలు అరుస్తుంటాయి. అవి అలా అరుస్తూ వెంటపడినప్పుడు ప్రజలు పరుగెడతారు. దీంతో తమకు భయపడి మనుషులు పరుగెడుతున్నారని కుక్కలు భావిస్తాయి. ఈ క్రమంలోనే వాళ్లను వెండిస్తూ కరచే దాకా వదలవు. ఇలా చేస్తే కుక్క కాటు నుంచి తప్పించుకోవచ్చు .. ►కుక్క దగ్గరికి వస్తే కదలకుండా నిలబడాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ పరిగెత్తరాదు. కళ్లలోకి తదేకంగా చూడరాదు. కుక్క పిల్లల దగ్గరికి వెళ్లరాదు. ► నిద్రిస్తున్నప్పుడు, తింటున్నప్పుడు, పిల్లలకు పాలిస్తున్నప్పుడు ఏ రకంగానూ ఇబ్బంది పెట్టరాదు. ► కుక్క దాడి చేసేటప్పుడు ముఖాన్ని పంచె లేదా తువ్వాలు తదితర వాటితో కప్పుకోవాలి. ఏమీ లేకపోతే చొక్కాను పైకి జరుపుకోవాలి. లేదా ముఖాన్ని చేతులతో కప్పుకోండి. ముఖంపై కరిస్తే ఇన్ఫెక్షన్ మెదడుకు త్వరగా సోకుతుంది. దీనివల్ల ప్రాణహాని ఉండే ప్రమాదం ఉంది. ►కుక్క కోపంగా దగ్గరికి వస్తే నేల వైపు చూస్తూ దానికి దూరంగా మెల్లగా నడవాలి. కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు వికారాబాద్ మున్సిపల్ పరిధిలో గత ఏడాది ఏర్పాటు చేసిన ఏబీసీలో 1,429 శునకాలకు సంతానం కలగకుండా ఆపరేషన్లు చేశారు. ఆపరేషన్ల అనంతరం కొన్నాళ్ల పాటు సెంటర్లోనే ఉన్న కుక్కలు బయటి వచ్చాక వరుసపెట్టి జనాలపై దాడికి తెగబడుతున్నాయి. వీధి కుక్కలను ఒకేచోట పదిహేను నుంచి ఇరవై రోజుల పాటు బంధించి ఉంచడంతో అవి ఒత్తిడికి లోనై మనుషులపై దాడి చేస్తున్నట్లు తెలిసింది. తాండూరులోని ఏబీసీ సెంటర్లో కూడా సుమారు 1,247 కుక్కలకు ఆపరేషన్లు చేశారు. కుక్క కరిస్తే ఏం చేయాలి? కుక్క కాటుకు గురైన వ్యక్తి ఐదు సార్లు రేబిస్ వ్యాధికి వ్యాక్సిన్ తీసుకోవాల్సి ఉంటుంది. కుక్క కాటు వల్ల బాగా గాయం అయ్యి రక్తస్రావం అయితే వ్యాక్సిన్ తో పాటు కరిచిన చోట ఇమ్యునొగ్లోబిలిన్స్ ఇంజెక్షన్ తీసుకోవాలి. కుక్క కరిస్తే ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకోవాలంటే..గతంలో కుక్క కాటుకు గురైన వ్యక్తికి ఒకప్పుడు బొడ్డు చుట్టూ 16 ఇంజెక్షన్లు వేసేవారు. దీంతో ఆ వ్యక్తి ఎంతో బాధను అనుభవించాల్సి వచ్చేది. కానీ ప్రస్తుతం ఈ పద్ధతి మారింది. వ్యాక్సినేషన్ ఈ ఏడాది జూన్ నుంచి ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా సుమారు 3వేల కుక్కలకు రేబీస్ వ్యాధి సోకకుండా పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో వ్యాక్సిన్ వేశారు. అయినా ఎక్కడో ఒక చోట రేబీస్ వ్యాధితో కుక్కలు జనాలపై దాడి చేస్తున్నాయి. రేబిస్తో చాలా ప్రమాదం రేబీస్ వ్యాధికి గురైన పశువులను కుక్కలు కరిసినా, రేబీస్ వ్యాధి ఉన్న కుక్కను మరో కుక్క కరిచినా వ్యాధి ఒకదాని నుంచి మరొక దానికి సోకుతుంది. ఆ కుక్కలు మనుషులను కరిస్తే ప్రమాదం. వెంటనే వైద్యులను సంప్రదించాలి. అయితే రేబీస్ వ్యాధి సోకుండా ప్రతి ఏటా జూన్ మొదటి వారంలోనే పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో టీకాలు వేస్తున్నాం. పెంపుడు కుక్కలకు కూడా వాటి యజమానులు తప్పకుండా వ్యాక్సిన్ వేయించాలి. కుక్కలను భయపెట్టడం, నేరుగా వాటివైపు చూడడం, వాటి దగ్గరగా పెద్ద చప్పుడు చేయడం వంటివి చేయరాదు. అలా చేస్తే అవి దాడిచేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. – అనిల్కుమార్, జిల్లా పశు వైద్యాధికారి -
హైదరాబాద్లో మళ్లీ.. బాలుడిపై వీధి కుక్క దాడి
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నగరంలో వీధి కుక్కలు మరోసారి రెచ్చిపోయాయి. టప్పాచబుత్రలో కుక్క దాడి చేయడంతో ఓ బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు. తన తల్లితో కలిసి బాలుడు విధిలో నడుస్తూ వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. అయిదేళ్ల బాలుడిని కుక్క కరిచిన దృశ్యాలు స్థానిక సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. అయితే బాలుడి తల్లి వెంటనే గుర్తించి అప్రమత్తమవ్వడంతో పెను ప్రమాదం తప్పింది. అయితే అప్పటికే కుక్క బాలుడి చెవిని కొరికేసిందని తెలుస్తోంది. వెంటనే బాధిత బాలుడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కాగా రెండురోజుల క్రితం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసినట్లు తెలుస్తోంది. చిన్నారికి జర్జరీ చేశారని, అందుకోసం తల్లిదండ్రులు రూ. 3 లక్షలు వెచ్చించినట్లు ఓ వ్యక్తి ట్వీట్ చేశారు. తెలుగు రాష్ట్రాల్లో కుక్కల దాడులు ఆగటం లేదు. నిత్యం ఎక్కడో ఓ చోట కుక్కలు దాడులకు తెగబడుతూనే ఉన్నాయి. హైదరాబాద్ అంబర్పేటలో వీధి కుక్కల దాడిలో నాలుగేళ్ల చిన్నారి ప్రదీప్ మృతి చెందిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోకపోవటం వల్లే ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయని ప్రజలు ఆరోపించడంతో తెలంగాణ హైకోర్టు ఈకేసును సుమోటోగా తీసుకొని జీహెచ్ఎంసీకి, ప్రభుత్వ అధికారులకు నోటీసులు సైతం జారీ చేసింది. ఈ ఘటన తర్వాత ప్రభుత్వం కుక్కలు వీధుల్లో తిరగకుండా ప్రత్యేక చర్యలు చేపట్టినా క్షేత్రస్థాయిలో పరిస్థితిలో మార్పు రావటం లేదు. ప్రస్తుతం వీధి క్కలపై జీహెచ్ఎంసీ ఫోకస్ తగ్గినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎలక్షన్ డ్యూటీతో పాటు వెటర్నరీ అధికారులు బిజీ బిజీగా గడుపుతున్నారు. మరోవైపు సిబ్బంది నిరసన చేస్తుండటంతో కుక్కల కాటు కేసులు నగరంలో మళ్ళీ పెరుగుతున్నాయి. కుక్కల బెడదపై వేసిన హై లెవెల్ కమిటీ ఎక్కడ ఉందనే ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. కమిటీ ఏర్పాటు చేసి.. ఒక్కసారి కూడా సమావేశం కాకపోవడం శోచనీయం -
Rangareddy: పిచ్చి కుక్క కరిచిన బాలుడి దుర్మరణం
రంగారెడ్డి: పిచ్చికుక్క దాడిలో 25 రోజుల క్రితంతీవ్రంగా గాయపడిన చిన్నారి మంగళవారం మృతిచెందాడు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.. ఆగస్టు 10న బొంరాస్పేట మండలం రేగడిమైలారంలో ఓ కుక్క స్వైరవిహారం చేసింది. 2 గంటల వ్యవధిలో 12మందిని కరిచి గాయపర్చింది. వీరిలో ఏడుగురు చిన్నారులు కాగా ఐదుగురు పెద్దవాళ్లు ఉన్నారు. ఇందులో తీవ్రంగా గాయపడిన ఆరుగురిని నగరంలోని నల్లకుంట ఆస్పత్రికి తరలించి చికిత్స చేయించారు. మిగిలిన వారిని వికారాబాద్లోని జిల్లా ఆస్పత్రికి పంపించారు. వీరిలో ఆరుగురు చిన్నారులు ప్రస్తుతం మందులు వాడుతున్నారు. ఇదిలా ఉండగా ఆరోజు ఘటనలో తీవ్రంగా గాయపడిన నెల్లి అనురాధ, శ్రీనివాస్ల కుమారుడు ఆదిత్య(5) సోమవారం రాత్రి అస్వస్థతకు గురయ్యారు. దీంతో తల్లిదండ్రులు మంగళవారం ఉదయాన్నే ఆస్పత్రికి తరలిస్తుండగా ఆరోగ్యం విషమించి మార్గమధ్యలోనే మృతిచెందాడు. బాధితులకు వర్షిత, ఆదిత్య ఇద్దరు సంతానం. ఉన్న ఒక్కగానొక్క కొడుకు మరణించడంతో తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. ఆదిత్య మృతితో మిగిలిన చిన్నారుల తల్లిదండ్రులు భయాందోళనకు గురవుతున్నారు. పిచ్చికుక్కగాటు బాధితులకు ఉరుములు, మెరుపుల వాతావరణం పడదని పెద్దలు చెబుతున్నారు. వీధి కుక్కల నివారణకు చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. -
కుక్కల గొడవ కాస్తా ఎంత దూరం వెళ్లిందో చూడండి
భోపాల్: ఇండోర్లో ఒక కాలనీలో కుక్కలను వాకింగ్ కోసమని తీసుకొచ్చారు ఇద్దరు వ్యక్తులు. కానీ ఆ కుక్కలు ఒక్కసారిగా కయ్యానికి కాలు దూశాయి. వాటి తరపున వకాల్తా పుచ్చుకుని వాటి యజమానులు కూడా గొడవపడ్డారు. అందులో ఒకరు ఆగ్రహంతో పక్కనే ఉన్న తన ఇంటిలోకి వెళ్లి తుపాకీతో కాల్పులు జరిపగా కాల్పుల్లో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు.. ఆరుగురు గాయపడ్డారు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం ఇండోర్ కృష్ణ బాగ్ కాలనీలో రాత్రి 11 గంటలకు ఒక ఇరుకైన సందులో రజావత్, విమల్ అచల్ ఇద్దరూ తమ పెంపుడు కుక్కలతో వాకింగ్ చేయడానికి బయటకు వచ్చారు. ఆ సమయంలో రెండు కుక్కలు ఎదురుపడేసరికి పెద్దగా మొరుగుతూ తగువుకు దిగాయి. వాటికంటే గట్టిగా అరుపులతో రజావత్, అచల్ గొడవపడ్డారు. అంతలో ఏమైందో రజావత్ ఆగ్రహంతో పక్కనే ఉన్న బిల్డింగ్ మొదటి అంతస్తులోని తన ఇంటిలోకి ఆవేశంగా వెళ్లి బాల్కనీలోకి వచ్చి 12-బోర్ రైఫిల్ తో కాల్పులు జరిపాడు. కాల్పుల్లో అచల్ అక్కడికక్కడే చనిపోయాడు. అతడి తోపాటు అక్కడే ఉన్న మరో వ్యక్తి రాహుల్ వర్మ కూడా ప్రాణాలు కోల్పోయాడు. మరో ఆరుగురికి బులెట్ గాయాలయ్యాయి. రజావత్ కు గన్ లైసెన్స్ ఉన్నందున అతడిని ఒక ప్రయివేట్ కంపెనీ సెక్యూరిటీ గార్డుగా నియమించింది. మృతుడు అచల్ కు నిపనియాలో కటింగ్ షాపు ఉంది. రజావత్ క్షణికావేశంలో చేసిన పొరపాటుకు రెండు ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. సమాచారం అందుకున్న పోలీసులు రజావత్ ను, అతడి కుమారుడిని, వారి బంధువు శుభంను అదుపులోకి తీసుకున్నారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. Indore | Dog Fight | कुत्ता घुमाने निकले दो पड़ोसियों के कुत्ते आपस में लड़ गए। दोनों पड़ोसियों के बीच भी हाताहपाई हो गई। इतने में एक पड़ोसी अपने घर गया, बंदूक लाया और गोली चला दी। तमाशा देख रहे 2 लोगों की मौत हो गई और 6 घायल हो गए। गोली चलाने वाले व्यक्ति गिरफ्तार: अमरेंद्र… pic.twitter.com/NhKKSLLBcZ — काश/if Kakvi (@KashifKakvi) August 18, 2023 ఇది కూడా చదవండి: మసాజ్ కోసం కక్కుర్తి పడ్డ బెజవాడ కుర్రాళ్ళు. -
జగిత్యాల: కుక్క దాడిలో గాయపడ్డ బాలిక మృతి
సాక్షి, జగిత్యాల: కుక్క కాటు మరో బాలిక జీవితాన్ని బలిగొంది. దాడిలో తీవ్రంగా గాయపడిన ఆమె మృత్యువుతో పోరాడింది. రెండువారాల పాటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ .. చివరకు కన్నుమూసింది. గొల్లపెల్లి మండలం ఆత్మకూరు గ్రామంలో పదిహేను రోజుల కిందట ఓ పిచ్చి కుక్క స్వైర విహారం చేసింది. ఊర్లో దాదాపు పది మందిని గాయపర్చింది. అయితే సంగెపు సాహిత్య అనే 12 ఏళ్ల బాలిక మాత్రం కుక్క దాడిలో తీవ్రంగా గాయపడింది. దీంతో ఆమెను ఆస్పత్రికి తరలించిన చికిత్స అందించారు. అయితే చికిత్స పొందుతూ ఆ చిన్నారి ఇవాళ(శనివారం) ఉదయం కన్నుమూసింది. తమ ముందు ఆడిపాడిన చిన్నారి ఇక లేదనే విషయం తెలిసి.. గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇదీ చదవండి: గుండెలో రంధ్రం.. డ్యాన్స్ చేస్తూ కుప్పకూలి.. -
వేములవాడలో కుక్కల బీభత్సం !
వేములవాడ: వేములవాడలో బుధవారం కుక్కలు రెచ్చిపోయాయి. వివిధ అవసరాల కోసం బయటకు వచ్చిన 25 మందిపై దాడి చేశాయి. గాంధీనగర్, జాతరాగ్రౌండ్, ఉప్పుగడ్డ, ముదిరాజ్వీధి ప్రాంతాల్లో దాదాపు 25 మందిని కరిచాయి. వీరంతా స్థానిక ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి చేరుకున్నారు. అందిరికీ యాంటీ రెబీస్ ఇంజక్షన్లు ఇచ్చి పంపించినట్లు ఆస్పత్రి సూపరింటెండెంట్ రేగులపాటి మహేశ్రావు తెలిపారు. కుక్కల దాడులపై ఇప్పటికే అధికారులకు ఫిర్యాదులు చేసినా స్పందన లేకపోవడంతో జనం ఇబ్బందులు పడుతున్నారు. -
పొరుగింటిలో 34 పెంపుడు కుక్కలు వీరంగమాడుతున్నాయని..
యూపీలోని లక్నోలో శునకాల వీరంగంతో జనం ఏ స్థాయిలో భయపడుతున్నారంటే చివరికి ఇంటిని కూడా అమ్మేసుకునేందుకు సిద్ధం అవుతున్నారు. లక్నోలోని జానకీపురంలో ఉంటున్న ఒక వృద్ధ జంట ఎదురింటిలోని కుక్కలకు భయపడి తమ ఇంటిని విక్రయించేందుకు సిద్ధం అయ్యారు. ఉత్తరప్రదేశ్లో చోటుచేసుకున్న ఈ విచిత్ర ఉదంతానికి సంబంధించిన వివరాల్లోకి వెళితే లక్నోలోని జానకీపురం ప్రాంతానికి చెందిన ఒక వృద్ధ జంట ఇటీవలే స్థానికంగా ఉన్న ఒక ఇంటిని కొనుగోలు చేశారు. అయితే వారు ఈ ఇంటిలోకి అడుగుపెట్టగానే వారికి కుక్కల బెడద మొదలయ్యింది. దీంతో వారు తాము ఉంటున్న ఇంటిని వెంటనే అమ్మివేయాలని భావిస్తూ, ఇంటి బయటి గేటుకు ‘ఇల్లు అమ్మబడును’ అనే బోర్డు తగిలించారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం ఈ ప్రాంతంలోని ఒక ఇంటిలోని వారు ఏకంగా 34కు మించిన కుక్కలను పెంచుతున్నారని,ఈ కుక్కలు రోజుంతా ఈ ప్రాంతంలో తిరుగుతూ అందరినీ వెంబడిస్తున్నాయని, చిన్నారులను భయపెడుతున్నాయని, కరుస్తున్నాయని తెలిపారు. వీటికి భయపడే ఆ వృద్ధ దంపతులు తమ ఇంటిని విక్రయించాలనుకుంటున్నారని అన్నారు. స్థానికుల ఫిర్యాదు మేరకు నగరపాలక సంస్థ అధికారులు ఆ కుక్కల యజమానికి నోటీసు అందించారు. కాగా లక్నోలో పెంపుడు కుక్కలు మనుషులపై దాడులకు దిగిన ఘటనలు అనేకం ఉన్నాయి. ఒక పిట్బుల్ డాగ్ తన యజమానిపై తీవ్రంగా దాడి చేయడంతో అతను మృతి చెందాడు. ఇదేవిధంగా రిటైర్డ్ టీచర్ సుశీల్(82) కూడా శునకాల దాడిలో కన్నుమూశారు. ఇది కూడా చదవండి: ఆ రాష్ట్రాన్ని కుదిపేస్తున్న ‘నీటిగండం’.. రాబోయే రోజుల్లో.. -
విషాదం: వీధి కుక్కల కారణంగా చిన్నారి మృతి
సాక్షి, హన్మకొండ: ఇటీవలి కాలంలో దేశవ్యాప్తంగా వీధి కుక్కల దాడులు ఎక్కువైన విషయం తెలిసిందే. వీధి కుక్కల దాడిలో ఇప్పటికే పలువురు మృతిచెందగా, చాలా మంది తీవ్రంగా గాయపడ్డారు. ఇక, తాజాగా హన్మకొండ జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. కుక్కల దాడిలో ఓ చిన్నారి మృతిచెందాడు. వివరాల ప్రకారం.. తెలంగాణ దశాబ్ది సంబరాలు ముగింపు దశకు చేరుకున్నాయి. 21రోజులపాటు జరిగే ఉత్సవాల్లో నేడు 19వరోజున విద్యా దినోత్సవం నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో కమలాపూర్ మండలం మర్రిపల్లిగూడెంలో విద్యా దినోత్సవంలో అపశృతి చోటుచేసుకుంది. కాగా, విద్యా దినోత్సవం సందర్భంగా గ్రామంలో ర్యాలీ తీస్తుండగా విద్యార్థులపైకి వీధి కుక్కలు ఎగబడ్డాయి. ఈ సమయంలో కుక్కల దాడి నుంచి తప్పించుకోబోయి విద్యార్థి ఇనుగాల ధనుష్(12) మృతిచెందాడు. కాగా, ధనుష్ ఆరో తరగతి చదవుతున్నాడు. అయితే, ధనుష్ మృతితో గ్రామంలో విషాయఛాయలు అలుముకున్నాయి. ఇది కూడా చదవండి: ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు గుడ్న్యూస్.. -
‘భౌ’బోయ్.. కరుస్తున్నాయ్!
సాక్షి, అమరావతి: కమ్యూనిటీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లోకల్ సర్కిల్స్ సర్వే ప్రకారం దేశవ్యాప్తంగా 82 శాతం మంది ప్రజలు నిత్యం వీధి, పెంపుడు శునకాలతో దాడి ముప్పు పొంచి ఉందని భయపడుతున్నారట. ఇందులో 61 శాతం మంది ఇలాంటి దాడులు సర్వ సాధారణమని చెప్పగా.. ఇది గతంతో పోలిస్తే 31 శాతం పెరుగుదలను చూపిస్తోంది. లోకల్ సర్కిల్స్ దేశవ్యాప్తంగా 326 జిల్లాల్లో 53 వేల మందికిపైగా ప్రజల నుంచి ప్రతి స్పందనలు స్వీకరించింది. వీరిలో 67 శాతం పురుషులు, 33 శాతం మహిళలు ఉన్నారు. ప్రతి 10 మందిలో 8 మంది కుక్కల బెడదను తొలగించడంలో అధికారుల సహకారం దూరమైందని అభిప్రాయపడ్డారు. వీధి కుక్కల నియంత్రణ, పెంపుడు కుక్కల డేటా సేకరణలోనూ నిర్లక్ష్యంగా ఉన్నట్టు సర్వే తెలిపింది. కేవలం 10 శాతం మంది మాత్రమే అధికార యంత్రాంగంపై విశ్వాసం వ్యక్తం చేశారు. ముఖ్యంగా 71 శాతం మంది ప్రజలు స్వచ్ఛ భారత్ కార్యక్రమం కింద విచ్చలవిడి జంతు నిర్వహణకు నిధులు కేటాయించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం విశేషం. 36 శాతం రేబిస్ మరణాలు భారత్లోనే! దేశంలో జంతువులపై క్రూరత్వ నిరోధక చట్టం–1960 ప్రకారం జంతువులను హింసించడం, చంపడం చట్టవిరుద్ధం. యానిమల్ బర్త్ కంట్రోల్ రూల్–2001 ప్రకారం.. వాటి జనాభాను తగ్గించడానికి వీధి కుక్కలకు స్టెరిలైజేషన్, టీకాలు వేయాల్సి ఉంటుంది. అయితే, చాలా రాష్ట్రాల్లో నిధుల కొరతతో వీధి కుక్కలకు టీకాలు వేయడంలో విఫలమవుతున్నట్టు సర్వే చెబుతోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా రేబిస్ మరణాలలో 36 శాతం భారతదేశం నుంచే ఉండటం ఆందోళన కలిగిస్తోంది. అంటే 18వేల నుంచి 20వేల మరణాలు సంభవిస్తున్నాయి. 30నుంచి 60 శాతం మృతుల్లో 15 ఏళ్లలోపు చిన్నారులే ఎక్కువగా ఉంటున్నారు. వీధి శునకాలకు వేటాడే స్వభావం వీధి శునకాలకు విచ్చలవిడిగా వేటాడే స్వభావం ఉంటుందని జంతుశాస్త్ర నిపుణులు చెబుతున్నారు. అవి సంచరిస్తున్న ప్రదేశంలో ఆహారం లభించకుంటే చిన్నచిన్న జంతువులను చంపి తింటాయని.. ఆ ప్రక్రియ వాటి మానసిక ప్రవృత్తిని ప్రభావితం చేస్తోందని వాదిస్తున్నారు. ఏటా ఆడ శునకం 20 పిల్లలకు జన్మనిస్తుంది. ఒక్కసారి కారు, బైక్ ప్రమాదంలో శునకం పిల్ల చనిపోతే ఆ వాహనాన్ని శత్రువుగా భావిస్తుంది. అలాంటి వాహనాలు వస్తే దూకుడుగా వెంబడించడం.. దాడి చేయటం వాటికి అలవాటుగా మారుతుందంటున్నారు. గతేడాది మహారాష్ట్రలో అత్యధికంగా 3,46,318 శునకాల దాడుల కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత 3,30,264 కేసులతో తమిళనాడు రెండో స్థానంలో నిలిచింది. ఏపీలో 1,69,378, ఉత్తరాఖండ్లో 1,62,422, కర్ణాటకలో 1,46,094, గుజరాత్లో 1,44,855, బీహార్లో 1,18,354 కేసులొచ్చాయి. -
కుక్కలు పగబట్టాయా?.. పార్క్లో మహిళను వెంబడించి..
నోయిడా: కొద్దిరోజులుగా కుక్కల దాడితో గాయపడుతున్న, మృతిచెందుతున్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. దేశంలో ఏదో ఒక చోట కుక్కల దాడుల కారణంగా ఎవరో ఒకరు గాయపడుతూనే ఉన్నారు. ఇక, ఇటీవల యూపీలోని గుర్గావ్లో మార్నింగ్ వాక్ చేస్తున్న వ్యక్తిపై కుక్కల గుంపు దాడి చేసిన ఘటనలో అతను మృతిచెందిన విషయం తెలిసిందే. ఇక, ఈ ఘటన మరువక ముందే తాజాగా నోయిడాలో ఓ మహిళపై శునకాలు దాడి చేశాయి. దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. వివరాల ప్రకారం.. నోయిడాలోని సెక్టార్-78లోని మహాగున్ మోడరన్ సొసైటీలోని ఓ పార్కులో ఓ మహిళ తన పెంపుడు కుక్కతో నడుచుకుంటూ వెళుతున్నది. ఈ సందర్భంగా మహిళపై కొన్ని వీధికుక్కలు ఒక్కసారిగా దాడికి దిగాయి. దీంతో, కుక్కల బారినుండి ఆమె తప్పించుకునే ప్రయత్నం చేసినా అవి వెంటపడ్డాయి. కుక్కల గుంపు నుండి తన కుక్కను, తనను తాను రక్షించుకునేందుకు ఆమె పరుగు తీసింది. ఈ క్రమంలో కుక్కల దాడిలో ఆమెకు స్వల్ప గాయలయ్యాయి. ఇక, దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. Disturbing scenes from Noida's Mahagun Mezzaria Society where stray dogs attack a woman and her pet. Thanks to the Dog Lovers in every such society where they neither adopt them nor they’ll allow others to evict them from the complex.https://t.co/rSYRvyhfOv — Rishi Bagree (@rishibagree) April 19, 2023 ఇది కూడా చదవండి: మార్నింగ్ వాక్ వెళ్లిన వ్యక్తిపై కుక్కల దాడి.. అక్కడికక్కడే మృతి -
మార్నింగ్ వాక్ వెళ్లిన వ్యక్తిపై కుక్కల దాడి.. అక్కడికక్కడే మృతి
లక్నో: ఇటీవలి కాలంలో కుక్కల దాడులు ఎక్కువయ్యాయి. దేశవ్యాప్తంగా కుక్కల దాడి ఘటనలు ఎక్కువ సంఖ్యలో వెలుగులోకి వస్తున్నాయి. దేశవ్యాప్తంగా ఏదో ఒకచోట కుక్కల దాడిలో ఎవరో ఒకరు మృతిచెందడం లేక గాయపడటం జరుగుతోంది. ఇక, తాజాగా మార్నింగ్ వాక్ చేస్తున్న ఓ వ్యక్తిపై కుక్కలు మూకుమ్మడి దాడి చేశాయంతో తీవ్రంగా గాయపడి మృతిచెందాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. వివరాల ప్రకారం.. ఉత్తరప్రదేశ్లోని అలీఘర్ ముస్లిం యూనివర్సిటీ క్యాంపస్లో డాక్టర్ సఫ్దర్ అలీ అనే వ్యక్తి ఆదివారం ఉదయం 6 గంటల ప్రాంతంలో మార్నింగ్ వాక్ చేస్తున్నారు. పార్క్లో ఓ చోట నిలుచుని వ్యాయామం చేస్తున్నాడు. ఈ క్రమంలో అక్కడున్న కుక్కలు ఒక్కసారిగా అతడిపై దాడి చేశాయి. పది కుక్కుల గుంపుగా ఏర్పడి మూకుమ్మడిగా దాడి చేశాయి. తప్పించేందుకు ఆయన ఎంతగా ప్రయత్నించినప్పటికీ అవి పదే పదే దాడి చేయడంతో పాటు నోటితో ఈడ్చుకెళ్లి తీవ్రంగా గాయపరిచాయి. తీవ్రగాయాలతో సఫ్దర్ అలీ ఘటనాస్థలిలోనే ప్రాణాలు కోల్పోయాడు. అనంతరం, అటుగా వచ్చిన కొందరు వ్యక్తులు సప్దర్ అలీ మృతదేహాన్ని చూసి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో, ఘటనా స్థలానికి చేరుకున్ని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అయితే, అతను ఎలా చనిపోయాడోనని పోలీసులు సీసీ ఫుటేజీని పరిశీలించగా కుక్కల దాడిలో మృతిచెందినట్టు గుర్తించారు. దీనికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజీని విడుదల చేశారు. దీంతో, ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ ఘటన నేపథ్యంలో స్థానికులు ఆ ప్రాంతంలో తిరిగేందుకు టెన్షన్ పడుతున్నారు. #Aligarh #DogMenance CCTV footage of the painful death of a person due to dog attack emerged. More than half a dozen #dogs attacked a person in the Aligarh Muslim University campus of Thana Civil Line area of Aligarh, which killed the person on the spot. pic.twitter.com/5XedupSu90 — Dr. Sandeep Seth (@sandipseth) April 16, 2023 -
ఆపరేషన్ చేసి.. తాబేలుకు ప్రాణం పోశారు
అనకాపల్లి: కుక్కల దాడిలో తీవ్రంగా గాయపడ్డ తాబేలుకు ఆపరేషన్ చేసి ఓ వైద్యాధికారి జీవం పోశారు. స్థానిక యువకులు సకాలంలో స్పందించడంతో ఒక మూగ జీవి ప్రాణం నిలబడింది. వివరాలు.. వడ్డాది పెద్దేరు నదిలో తాబేళ్లు సంచరిస్తూ ఉంటాయి. శనివారం తాబేలు ఒకటి గుడ్లు పెట్టడానికి ఒడ్డుకు వచ్చింది. అక్కడే ఉన్న వీధి కుక్కలు దానిపై దాడి చేశాయి. తీవ్రంగా గాయపడ్డ తాబేలు పేగులు బయటకు వచ్చేయడంతో విలవిల్లాడింది. ఈ విషయం గమనించిన స్ధానిక యువకులు దగ్గర్లోనే ఉన్న ప్రభుత్వ పశువైద్యాధికారి శివకుమార్కు ఈ విషయం తెలిపారు. వెంటనే స్పందించిన వైద్యుడు తాబేలును ఆస్పత్రికి తీసుకొచ్చి వైద్య సేవలు అందించారు. ఆధునిక పద్ధతిలో శస్త్రచికిత్స నిర్వహించి ప్రాణాలు కాపాడారు. తీవ్ర గాయాలైన మూగజీవికి ఆపరేషన్ చేసి ఆదుకున్నందుకు వైద్యు డు శివకుమార్ను స్థానికులు అభినందించారు. -
చిన్నారినిపై వీధికుక్క దాడి.. వైద్యానికి రూ.10లక్షల ఖర్చు..
కరీంనగర్: అభం శుభం తెలియని చిన్నారి అందరాని లోకాలకు వెళ్లింది. తమ్ముళ్లను ఆడిపిస్తూ.. అల్లరిచేస్తూ.. ఇంటికి మహాలక్ష్మిగా భావించిన కూతురు ఇకలేదన్న నిజాన్ని ఆ తల్లిదండ్రులు జీర్ణించుకోలేకపోతున్నారు. పదిహేను రోజుల క్రితం కుక్కకాటుకు గురైన బాలిక చికిత్స పొందుతూ శుక్రవారం చనిపోయింది. ఈ ఘటన మానకొండూర్ మండలం పోచంపల్లి గ్రామంలో విషాదం నింపింది. స్థానికుల వివరాల ప్రకారం.. పోచంపల్లి గ్రామానికి చెందిన కోమళ్ల చిరంజీవి– రజిత దంపతులు వ్యవసాయం, కూలీ పని చేస్తుంటారు. వీరికి కూతురు మహేశ్వరి(12), ఇద్దరు కొడుకులు సంతానం. మహేశ్వరి స్థానిక మోడల్ స్కూల్లో ఏడో తరగతి చదువుతోంది. పదిహేను రోజుల క్రితం తమ్ముళ్లతో ఇంటిముందు ఆడుకుంటుండగా ఓ కుక్క అకస్మాత్తుగా వచ్చి మహేశ్వరి చేతును కరిచింది. వెంటనే తల్లిదండ్రులు మండలంలోని వెల్ది ప్రాథమిక ఆరోగ్యకేంద్రానికి తీసుకెళ్లారు. అక్కడ వైద్యులు ఇంజక్షన్తో పాటు వారంరోజుల పాటు వైద్యం చేశారు. వారం తరువాత మహేశ్వరికి జ్వరం వచ్చింది. వెంటనే కరీంనగర్లోని ఓ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ చిన్నారికి ఇన్ఫెక్షన్ సోకిందని చెప్పడంతో హైదరాబాద్లోని ఓ ప్రయివేటు ఆస్పత్రిలో చేర్పించారు. మహేశ్వరి ప్రాణాలు దక్కించుకోవడానికి తల్లిదండ్రులు రూ.10లక్షలకు పైగా అప్పు చేశారు. అయినా పరిస్థితిలో మార్పురాకపోవడం, విషమంగా మారడంతో గాంధీ ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ శుక్రవారం మహేశ్వరి ప్రాణాలు వదిలింది. చిన్నారి మృతితో గ్రామంలో విషాదం అలుముకుంది. -
పేట్రేగిన పిచ్చికుక్కలు
రాజంపేట రూరల్ : రాజంపేటలో పిచ్చికుక్క దాడిలో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. స్థానిక రాజు హైస్కూల్లో ఉపాధ్యాయుడుగా పనిచేస్తున్న చౌడయ్య వైఎస్సార్ నగర్లో నివాసం ఉంటున్నారు.ఈయన టీ తాగేందుకు ఇంటి నుంచి బయటకు వచ్చారు. వీధిలో ఉన్న పిచ్చికుక్క దాడిచేసి గాయపరిచింది. చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తోపుడుబండిలో కూరగాయలు విక్రయిస్తూ జీవనం సాగించే నరసయ్య అనే వ్యక్తిపై కూడా కుక్కలు దాడిచేసి గాయపరిచాయి. చిట్వేలిలో మహిళపై.. చిట్వేలి : మండల పరిధిలోని నేతివారిపల్లిలో బుధవారం లక్ష్మీ నరసమ్మ (65) అనే మహిళపై పిచ్చికుక్క దాడి చేయడంతో తీవ్ర గాయాలయ్యాయి. చిట్వేలి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చికిత్స చేసి మెరుగైన చికిత్స నిమిత్తం రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గ్రామంలో ఇప్పటి వరకు 20 మందిపై కుక్కలు దాడి చేసినట్లు సమాచారం. అధికారులు స్పందించి వీధి కుక్కల బెడద నుండి రక్షించాలని ప్రజలు కోరుతున్నారు. -
కుక్కలకు కరవమని నేను చెప్పానా?.. మేయర్ విజయలక్ష్మి షాకింగ్ కామెంట్స్
సాక్షి, హైదరాబాద్: ఆకలితో ఉన్నందునే కుక్కలు దాడి చేశాయంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి.. తాజాగా మరోసారి కుక్క కాట్లపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘‘ఎవరినో కుక్క కరిస్తే.. కుక్కను నేనే కరవమన్నట్టు చేశారు’’ అంటూ మండిపడ్డారు. కావాలనే తనపై బురద జల్లుతున్నారని నిప్పులు చెరిగారు. సోమవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ, రాజకీయాల్లో మహిళల గురించి ఎప్పుడూ చెడుగా మాట్లాడతారని, మహిళలు బయటకు వస్తే ఓర్వలేరు.. తట్టుకోలేరన్నారు. అన్ని రంగాల్లో మహిళలు పోటీపడుతున్నారన్నారు. మహిళలు ఎన్ని అడ్డంకులు వచ్చినా ముందుకు వెళ్లాలన్నారు. హైదరాబాద్ మేయర్గా పనిచేయడం అంత సులువు కాదని విజయలక్ష్మి అన్నారు. కాగా, తెలంగాణలో కుక్కల దాడిలో బాలుడు చనిపోయిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై దర్శకుడు రామ్గోపాల్ వర్మ కూడా స్పందించారు.. ట్విట్టర్ వేదికగా కేటీఆర్ సార్.. ఒక్క దగ్గరకు చేర్చిన కుక్కల మధ్యలోకి మేయర్ను పంపండి అంటూ కామెంట్స్ చేశారు. ఈ క్రమంలోనే మేయర్ తన పదవికి ఎందుకు రాజీనామా చేయకూడదని ఆయన ప్రశ్నించారు. చదవండి: ఉప్పు-నిప్పు: ఔను..! వాళ్లిద్దరూ ఒక్కటయ్యారు!! ఆకలితో ఉన్నందునే కుక్కలు దాడి చేశాయంటూ మేయర్ వ్యాఖ్యలపై కూడా వర్మ స్పందించి ఆగ్రహం వ్యక్తం చేశారు. పిల్లల ప్రాణం కంటే కుక్కల ఆకలి గురించి ఆలోచించడమేంటని మండిపడ్డారు. అంతగా ఉంటే.. మేయర్ గారు కుక్కలన్నింటినీ ఇంటికి తీసుకువెళ్లి ఆహారం పెట్టొచ్చు కదా అని కామెంట్ చేశారు. కుక్కలన్నీ మేయర్ ఇంట్లో ఉంటేనే పిల్లలకు రక్షణ ఉంటుందని సెటైర్ వేశారు. అలాగే, కుక్కల విషయంలో సమీక్షలో భాగంగా ఏం నిర్ణయం తీసుకున్నారో చెప్పాలన్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం మరోసారి మేయర్ వివాదస్పద వ్యాఖ్యలు వైరల్గా మారాయి. -
షాకింగ్.. తల్లితో నిద్రిస్తున్న పసికందును ఈడ్చుకెళ్లిన వీధి కుక్క..
జైపూర్: హైదరాబాద్లో వీధికుక్కల దాడిలో బాలుడు మరణించిన ఘటన మరువకముందే అలాంటి దారుణం మరొకటి వెలుగుచూసింది. రాజస్థాన్ సిరోహి జిల్లాలోని ఓ ఆస్పత్రిలో అమ్మపక్కన నిద్రిస్తున్న నెల రోజుల పసికందును వీధికుక్క ఈడ్చుకెళ్లింది. అనంతరం అతనిపై దాడి చేసింది. దీంతో తీవ్రగాయాలపాలై శిశువు చనిపోయాడు. హాస్పిటల్ వార్డు బయట మృతదేహం లభించింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టిన పోలీసులు సీసీటీవీ రికార్డులను పరిశీలించారు. సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వత రెండు వీధి కుక్కలు ఆస్పత్రిలోని టీబీ వార్డులోకి ప్రవేశించాయి. అనంతరం వీటిలో ఓ శునకం పసికందును బయటకు ఈడ్చుకెళ్లినట్లు అందులో రికార్డయింది. ఈ శిశువు తండ్రి టీబీ వార్డులో చికిత్స పొందుతున్నాడు. అతనితో పాటు భార్య, పిల్లలు కూడా ఇదే వార్డులో ఉన్నారు. అయితే అర్ధరాత్రి దాటిన తర్వాత అందరూ నిద్రపోయారు. అదే సమయంలో వీధికుక్క వార్డులోకి వచ్చి చిన్నారిని ఎత్తుకెళ్లింది. ఈ సమయంలో వార్డు సెక్యూరిటీ గార్డు కూడా అక్కడ లేరని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్నామని, శిశువు మృతదేహానికి పోస్టుమార్టం కూడా నిర్వహించామని పేర్కొన్నారు. మరోవైపు ఆస్పత్రి నిర్వాహకులు కూడా ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు. రోగితో పాటు ఉన్న కుటంబసభ్యులు అందరూ నిద్రలో ఉన్నప్పుడు ఈ ఘటన జరిగిందని, ఆ సమయంలో వార్డు గార్డు వేరే వార్డుకు వెళ్లాడని పేర్కొన్నారు. దర్యాప్తు పూర్తయిన తర్వాత మరిన్ని వివరాలు వెల్లడిస్తామని చెప్పారు. కాగా.. ఇటీవల హైదరాబాద్లోని అంబర్పేటలో వీధికుక్కల దాడిలో ప్రదీప్ అనే బాలుడు మరణించిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దీంతో కక్కుల బెడద నివారణకు జీహెచ్ఎంసీ చర్యలు చేపట్టింది. చదవండి: ముంబైలోకి ప్రవేశించిన 'డేంజర్ మ్యాన్'.. చైనా, పాకిస్తాన్, హాంకాంగ్లో శిక్షణ.. పోలీసుల హై అలర్ట్.. -
ప్రజల విమర్శలతో కుక్కల బెడద నివారణకు చర్యలు..
సాక్షి, సిటీబ్యూరో: ఎప్పుడైనా సరే.. ప్రజల ప్రాణాలు పోయాక సదరు ఘటనలు పునరావృతం కాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటామనే జీహెచ్ఎంసీ.. కుక్కకాట్ల విషయంలోనూ అలాగే సిద్ధమైంది. ప్రజలకు కుక్కకాట్ల బెడద తగ్గించేందుకు ప్రభుత్వం ఆదేశించిన కార్యక్రమాల అమలుకు సిద్ధమైంది. యాక్షన్ స్టార్ట్ చేయడంతో పాటు పబ్లిసిటీపైనా శ్రద్ధ చూపుతోంది. కుక్కలు మనుషుల జోలికి రాకుండా ఉండేందుకు ఎలా వ్యవహరించాలి? అనే అంశంపై పాఠశాలల్లోని విద్యార్థులకు వివరించడంతో పాటు కుక్కల విషయంలో చేయాల్సినవి, చేయకూడనివి (డూస్ అండ్ డోంట్స్) పనులను వివరిస్తూ పాఠశాలల్లో పోస్టర్లును ప్రదర్శిస్తోంది. కరపత్రాల పంపిణీ ప్రారంభించింది. వీటితోపాటు కుక్కల సంతతి నిరోధానికి ఆపరేషన్లు, రేబిస్ సోకకుండా వ్యాక్సిన్లు వేసే చర్యలు చేపట్టినట్లు పేర్కొంది. ప్రతియేటా కుక్కల గణన వీటితోపాటు ప్రతియేటా కుక్కల గణన చేపట్టాలని నిర్ణయించింది. వీధికుక్కలకు సంబంధించిన ఫిర్యాదులందగానే తక్షణ చర్యలు చేపట్టాలని, కుక్కల సంరక్షణ కేంద్రాలకు తరలించే కుక్కలకు వ్యాధులుంటే చికిత్సలు చేయడంతోపాటు ఆహార సమస్యలు తలెత్తకుండా చూడాలని నిర్ణయించింది.విద్యార్థులతో పాటు రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్లు, స్వయం సహాయక సంఘాలు, స్లమ్ ఫెడరేషన్ సభ్యులకు సైతం కుక్కలకు సంబంధించి తగిన అవగాహన కలి్పంచ నున్నారు. కుక్కలు ఎక్కువగా సంచరించే ప్రాంతాలను గుర్తించి అవసరమైన చర్యలు చేపట్టనున్నారు. మాంసం, ఇతరత్రా ఆహార వ్యర్థాలు బహిరంగ ప్రదేశాల్లో వేసేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. మూసీ ప్రాంతాల్లో నూరుశాతం వీధికుక్కలను పట్టుకునేందుకు స్పెషల్డ్రైవ్ నిర్వహించనున్నట్లు పేర్కొంది. కుక్క కాటు నివారణకు స్వచ్ఛంద సంస్థలు , జంతు ప్రేమికులు, ప్రజాప్రతినిధులు తగిన సహకారం అందించాల్సిందిగా కోరింది. సామర్థ్యం లేని బల్దియా.. వేల సంఖ్యలో ఫిర్యాదులు వస్తున్నా.. వాటిని పరిష్కరించేందుకు తగిన యంత్రాంగం బల్దియాలో లేదు. వచి్చన ఫిర్యాదులకు అనుగుణంగా వీధి కుక్కలను పట్టుకునేందుకు తగిన వాహనాలు, నిపుణులైన సిబ్బంది గానీ లేరు. ఫిర్యాదుల్లో ఒకే ప్రాంతం సమస్యను ఎక్కువ సార్లు ఫోన్ చేసి చెప్పడంతో అధిక సంఖ్యలో ఫిర్యాదులు కనిపిస్తున్నాయని జీహెచ్ఎంసీ చెబుతోంది. ఫిర్యాదుల వరద.. అంబర్పేటలో నాలుగేళ్ల బాలుడు కుక్కలదాడిలో మృతి చెందడంతో నగర ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. సామాజిక మాధ్యమాల్లో, టీవీల్లో దాడి దృశ్యాలు చూసిన వారు బయటకు వెళ్లే తమ పిల్లల గురించి ఆందోళన చెందుతున్నారు. జీహెచ్ఎంసీ కాల్సెంటర్కు నాలుగు రోజులుగా నిత్యం రెండు వేలకు పైగా ఫిర్యాదులు అందాయి. నాలుగు రోజుల్లో పదివేలకు పైగా ఫిర్యాదు వచ్చాయి. వివరాలిలా ఉన్నాయి. జీహెచ్ఎంసీ ముద్రించిన పోస్టర్లలో దిగువ అంశాలు పేర్కొన్నారు చేయాల్సినవి.. ♦ కుక్క మీ దగ్గరకు వస్తుంటే.. కదలకుండా అక్కడే నిలబడాలి. ♦ వీధి కుక్కలకు దూరంగా ఉండాలి. ♦ నిశ్శబ్దంగా ఉండాలి. ♦ పిల్లలతో ఉన్న కుక్కల దగ్గరకు వెళ్లొద్దు. ♦ కుక్కలతో స్నేహపూర్వకంగా ఉండాలి.. కానీ వాటిని ముట్టుకోవద్దు. ♦ కుక్కల గుంపు కనిపిస్తే వాటికి దూరంగా ఉండాలి. చేయకూడనివి.. ♦ కుక్కలు అరుస్తున్నప్పుడు, తింటున్నప్పుడు, నిద్రిస్తున్నప్పుడు వాటికి భంగం కలిగించొద్దు. ♦ వీధికుక్కలపై రాళ్లు విసరడం వంటివి చేయొద్దు. ♦ తల్లి, పిల్లలు ఉన్నప్పుడు కుక్కల వద్దకు వెళ్లొద్దు. ♦ కుక్కల వెంటపడి తరమడం చేయవద్దు. ♦ కుక్కల తోక, చెవులు లాగడం వంటి పనులు చేయవద్దు. ♦ రోడ్లపై మాంసాహారం వేయవద్దు. ► ఎప్పుడైనా కుక్క కరిస్తే కరిచిన ప్రాంతంలో సబ్బుతో శుభ్రం చేసి వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. ► జీహెచ్ఎంసీని సంప్రదించాల్సిన ఫోన్ నంబర్: 040 21111111 చదవండి: స్నేహితుడిని కత్తితో పొడిచి.. తల, గుండె వేరు చేసి.. -
కుక్కలు దాడులు చేయడానికి కారణాలు ఇవే..
-
కుక్కల దాడి ఘటన.. వారికి మెదడు ఉందా?.. రేవంత్రెడ్డి సీరియస్
సాక్షి, భూపాలపల్లి: కుక్కల బెడదపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి స్పందించారు. కుక్కల బెడదను అరికట్టడంలో ప్రభుత్వం విఫలమయిందని ఆరోపించారు. హైదరాబాద్లో కుక్కల దాడిలో బాలుడు చనిపోతే మానవత్వం లేకుండా ప్రభుత్వం వ్యవహరిస్తోందని విమర్శించారు. హాథ్ సే హాథ్ జోడో యాత్రలో భాగంగా భూపాలపల్లి నియోజకవర్గంలో పర్యటిస్తున్న రేవంత్రెడ్డి.. కోటంచ లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ కుక్కలకు ఆకలి వేసి బాలుడిని తిన్నాయని మేయర్ అంటే.. మంత్రి కేటిఆర్ కుక్కలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయిస్తామని చెప్పడం చూస్తే వారి ఆలోచన ఏవిధంగా ఉందో అర్థమవుతుందన్నారు. చనిపోయిన బాలుడి కుటుంబాన్ని పరామర్శించి ఆదుకోవాల్సిన మంత్రి కేటీఆర్ కుక్కలకు కుటుంబ నియంత్రణ చేస్తామనడం వారికి మెదడు ఎక్కడ ఉందో అర్థమవుతుందన్నారు. ఎఫ్1 రేస్పై ఉన్న శ్రద్ధ కుక్కల బెడదపై లేదా అని ప్రశ్నించారు. మంత్రి కేటీఆర్ తక్షణమే మృతి చెందిన బాలుడి కుటుంబాన్ని పరామర్శించి, క్షమాపణ చెప్పి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. భూపాలపల్లిలో పామాయిల్ కంపెనీ పేరుతో ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి బినామీల పేరుతో పేదల భూములను ఆక్రమించుకుంటున్నాడని ఆరోపించారు. రేపు భూపాలపల్లిలో పర్యటించే మంత్రి కేటీఆర్.. దానిపై విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే అక్రమ దందాను నిరూపించేందుకు కాంగ్రెస్ సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. చదవండి: అందుకే నన్ను టార్గెట్ చేస్తున్నారు: చికోటి ప్రవీణ్ షాకింగ్ కామెంట్స్ భూపాలపల్లికి పట్టిన చీడపీడ విరగడం కోసం కోటంచ లక్ష్మి నరసింహస్వామి వారిని వేడుకుని పాదయాత్ర చేస్తున్నానని తెలిపారు. భూపాలపల్లిలో ఆరాచకశక్తులు పార్టీ ఫిరాయింపుదారులు రాజ్యమేలుతున్నారని విమర్శించారు. వారి తప్పిదాలను ప్రశ్నించిన వారిపై కేసులు పెట్టి జైలుకు పంపిన చరిత్ర భూపాలపల్లిలో ఉందన్నారు. ప్రజా వ్యతిరేక పాలనతో ఆస్తులు సంపాదనే లక్ష్యంగాఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి పనిచేస్తున్నాడని విమర్శించారు. భూపాలపల్లిలో పర్యటించే కేటీఆర్ తమ సవాల్ స్వీకరించి సమాధానం చెప్పాలని కోరారు.