-
ముడిచమురుపై విండ్ఫాల్ ట్యాక్స్ పెంపు
న్యూఢిల్లీ: దేశీయంగా ఉత్పత్తి చేసే ముడి చమురుపైన, డీజిల్ ఎగుమతులపైన కేంద్రం విండ్ఫాల్ ట్యాక్స్ను పెంచింది. దీనితో క్రూడాయిల్పై ట్యాక్స్ టన్నుకు రూ. 7,100 మేర పెరిగింది. అలాగే, డీజిల్ ఎగుమతులపై ప్రత్యేక అదనపు ఎక్సైజ్ సుంకాన్ని (ఎస్ఏఈడీ) లీటరుకు రూ. 1 చొప్పున కేంద్రం పెంచింది. దీంతో ఇది లీటరుకు రూ. 5.50కి చేరింది. అటు విమాన ఇంధనం (ఏటీఎఫ్)పై కూడా లీటరుకు రూ. 2 చొప్పున సుంకం విధించింది. ఇప్పటి వరకు ఏటీఎఫ్పై ఎస్ఏఈడీ లేదు. తాజా మార్పులు ఆగస్టు 15 నుంచి అమల్లోకి వస్తాయని కేంద్రం తెలిపింది. క్రూడ్ రేట్ల కారణంగా చమురు కంపెనీలు అసాధారణంగా ఆర్జిస్తున్న లాభాలపై కేంద్రం 2022 జూలై 1 నుంచి విండ్ఫాల్ ట్యాక్స్ను విధిస్తోంది. -
పెట్రోల్కు పెరిగిన డిమాండ్
న్యూఢిల్లీ: పెట్రోల్ విక్రయాలు జూలైలో గతేడాది ఇదే నెలతో పోల్చినప్పుడు 4 శాతం వరకు పెరిగాయి. 2.76 మిలియన్ టన్నుల అమ్మకాలు నమోదయ్యాయి. ముఖ్యంగా జూలై మాసంలో మొదటి 15 రోజుల్లో పెట్రోల్ వినియోగం తగ్గగా, తదుపరి 15 రోజుల్లో గణనీయంగా పుంజుకుంది. అయితే నెలవారీగా (జూన్తో పోలి్చనప్పుడు) చూస్తే పెట్రోల్ అమ్మకాలు 4.6 శాతం తగ్గాయి. మరోవైపు డీజిల్ అమ్మకాల్లో విరుద్ధమైన పరిస్థితి కనిపించింది. ప్రధానంగా డీజిల్ను రవాణా రంగంలో వినియోగిస్తారు. కనుక, వర్షాల ప్రభావం వినియోగంపై పడినట్టు తెలుస్తోంది. డీజిల్ అమ్మకాలు 4.3 శాతం తగ్గి 6.15 మిలియన్ టన్నులుగా నమోదయ్యాయి. దేశంలో అత్యధికంగా అమ్ముడుపోయే పెట్రోలియం ఉత్పత్తి ఇదే కావడం గమనార్హం. వర్షాల సమయంలో ఏటా డీజిల్ అమ్మకాలు తగ్గుతుండడం సాధారణంగానే కనిపిస్తుంటుంది. ఈ ఏడాది ఏప్రిల్లో 6.7 శాతం, మే నెలలో 9.3 శాతం చొప్పున డీజిల్ అమ్మకాలు పెరగడం గమనించొచ్చు. ఇక ఈ ఏడాది జూన్ నెలలోని అమ్మకాలతో పోల్చి చూసినా, జూలైలో డీజిల్ విక్రయాలు (7.13 మిలియన్ టన్నులు) 13.7 శాతం తగ్గాయి. భారత్లో ఆయిల్ డిమాండ్ రోజువారీగా 0.2 మిలియన్ బ్యారెళ్ల చొప్పున 2023లో ఉంటుందని చమురు ఉత్పత్తి దేశాల సమాఖ్య ఓపెక్ అంచనాగా ఉంది. ఇక విమాన సేవలకు డిమాండ్ గణనీయంగా పెరగడంతో ఏవియేషన్ టర్బయిన్ ఫ్యూయల్ (ఏటీఎఫ్) డిమాండ్ సైతం 10 శాతం పెరిగి జూలైలో 6,03,500 టన్నులుగా నమోదైంది. 2021 జూలైలో వినియోగంతో పోలిస్తే రెట్టింపు కాగా, కరోనా ముందు నాటి సంవత్సరం 2019 జూలైలో వినియోగంతో పోల్చి చూస్తే 2.9 శాతం తక్కువగా ఉన్నట్టు అర్థం చేసుకోవచ్చు. జూలైలో వంటగ్యాస్ (ఎల్పీజీ) అమ్మకాలు క్రితం ఏడాది ఇదే నెలతో పోలి్చచూసినప్పుడు 1.7 శాతం తగ్గి 2.46 మిలియన్ టన్నులుగా నమోదైంది. జూన్ నెలతో పోల్చి చూస్తే కనుక 8 శాతం ఎల్పీజీ అమ్మకాలు పెరిగాయి. -
‘అంబులెన్స్లో డీజిల్ లేదు...రూ. 800 ఇస్తేనే తీసుకెళ్తా’.. రోగి మృతి
సాక్షి, నిజామాబాద్: మెరుగైన చికిత్స కోసం ఓ రోగిని బాన్సువాడ నుంచి నిజామాబాద్కు తరలించారు. అయితే డీజిల్కు డబ్బులు ఇవ్వలేదని అంబులెన్స్ డ్రైవర్ రోగిని తీసుకెళ్లలేదు. దీంతో పరిస్థితి విషమించి ఆ రోగి మృతి చెందిన ఘటన బాన్సువాడ ఆస్పత్రిలో చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. కామారెడ్డి జిల్లా నస్రూల్లాబాద్ మండలం నెమ్లి గ్రామానికి చెందిన సాయిలు (40) వాంతులు, విరోచనాలతో మూడురోజుల క్రితం బాన్సువాడ ఏరియా ఆస్పత్రిలో చేరాడు. సోమవారం తెల్లవారుజామున సాయిలుకు ఊపిరి పీల్చుకోవడం కష్టంగా మారింది. విధుల్లో ఉన్న వైద్యుడు పరిస్థితి గమనించి నిజామాబాద్ ఆస్పత్రికి తరలించాలని సాయిలు కుమారుడికి సూచించారు. వైద్య సిబ్బంది ప్రభుత్వ అంబులెన్స్ డ్రైవర్కు ఫోన్ చేసి పిలిపించారు. అయితే డ్రైవర్ అంబులెన్స్లో డీజిల్ లేదని...రూ.800 ఇవ్వాలని సాయిలు కుమారుడికి చెప్పాడు. తన వద్ద రూ.50 ఉన్నాయని, ఎలాగైనా తన తండ్రిని నిజామాబాద్కు తీసుకెళ్లాలని అంబులెన్స్ డ్రైవర్ను ప్రాధేయపడ్డాడు. డబ్బులు ఇస్తేనే తీసుకెళ్తానని చెప్పి అంబులెన్స్ డ్రైవర్ అక్కడి నుంచి వెళ్లిపోగా, కొద్దిసేపటి తర్వాత సాయిలు మృతి చెందాడు. విషయం తెలుసుకున్న బీజేపీ నాయకులు ఆస్పత్రి ఎదుట ప్రధాన రహదారిపై రాస్తారోకో చేపట్టారు. కాంగ్రెస్ నాయకులు కూడా ఇందులో పాల్గొన్నారు. సాయిలు మృతికి కారణమైన వైద్య సిబ్బందిపై, అంబులెన్స్ డ్రైవర్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సీఐ మహేందర్రెడ్డి వచ్చి చట్టపరంగా చర్యలు తీసుకుంటామని చెప్పడంతో రాస్తారోకో విరమించారు. రాస్తారోకోలో కొత్తకొండ భాస్కర్, కాసుల బాల్రాజ్, గుడుగుట్ల శ్రీనివాస్, ఖలేక్, హన్మాండ్లు, మంత్రి గణేశ్, రాజాసింగ్ తదితరులు పాల్గొన్నారు. చదవండి: లవ్ ఫెయిల్యూర్.. ప్రేమికురాలితో ఫోన్లో మాట్లాడుతూనే -
పెట్రోల్, డీజిల్కు తగ్గిన డిమాండ్
న్యూఢిల్లీ: భారీ వర్షాల అంచనాలతో ప్రయాణ ప్రణాళికలు, వ్యవసాయ రంగంలో ఇంధన వినియోగ ధోరణులు మారిపోవడంతో జూలై ప్రథమార్ధంలో పెట్రోల్, డీజిల్కు డిమాండ్ పడిపోయింది. పరిశ్రమ ప్రాథమిక డేటా ప్రకారం .. గతేడాది జూలై 1–15 తేదీల మధ్య కాలంతో పోలిస్తే ఈసారి అదే వ్యవధిలో డీజిల్కు డిమాండ్ 15 శాతం క్షీణించి 2.96 మిలియన్ టన్నులకు పరిమితమైంది. నెలవారీగా దాదాపు 20 శాతం క్షీణించింది. పెట్రోల్ అమ్మకాలు 10.5 శాతం తగ్గి 1.25 మిలియన్ టన్నులకు దిగి వచ్చాయి. నెలవారీగా 10.8 శాతం తగ్గాయి. దేశీయంగా తయారీ, సర్వీసుల రంగ సంస్థలు గణనీయంగా కార్యకలాపాలను విస్తరిస్తుండటంతో దాదాపు ఏడాది కాలంగా ఇంధనాలకు డిమాండ్ భారీగా పెరిగింది. ఇదీ చదవండి ➤ IT Dept Clarification On PAN: పనిచేయని పాన్ కార్డులపై ఐటీ శాఖ క్లారిఫికేషన్ మార్చి ద్వితీయర్ధం నుంచి పెట్రోల్, డీజిల్ విక్రయాలు మరింతగా పుంజుకున్నాయి. అయితే, రుతుపవనాల రాకతో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టడం, ఇతరత్రా వ్యవసాయ అవసరాలకు జనరేటర్ల వినియోగం తగ్గడం తదితర అంశాలు ఇంధనాల డిమాండ్ తగ్గుదలకు కారణమయ్యాయి. -
పెట్రోల్, డీజిల్పై డిస్కౌంట్.. ప్రభుత్వ బంకుల్లో కన్నా తక్కువ ధర
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ సంస్థల (పీఎస్యూ) బంకుల కన్నా చౌకగా ప్రైవేట్ కంపెనీలు ఇంధనాలను విక్రయిస్తున్నాయి. జియో–బీపీ తర్వాత తాజాగా నయారా ఎనర్జీ ఈ జాబితాలోకి చేరింది. పీఎస్యూ బంకులతో పోలిస్తే రూ. 1 తక్కువకే తమ బంకుల్లో పెట్రోల్, డీజిల్ను విక్రయిస్తున్నట్లు వివరించింది. మహారాష్ట్ర, రాజస్థాన్ వంటి 10 రాష్ట్రాల్లో డిస్కౌంటు రేట్లకు విక్రయాలను జూన్ ఆఖరు వరకు కొనసాగించనున్నట్లు పేర్కొంది. దేశీయంగా మొత్తం 86,925 పైచిలుకు పెట్రోల్ బంకులు ఉండగా.. నయారా ఎనర్జీకి 6,376 బంకులు (7 శాతం పైగా వాటా) ఉంది. జియో–బీపీ (రిలయన్స్–బీపీ జాయింట్ వెంచర్ సంస్థ) తమ బంకుల్లో ప్రస్తుతం డీజిల్ను మాత్రమే పీఎస్యూ బంకుల కన్నా తక్కువకు విక్రయిస్తోంది. ఇటీవల అంతర్జాతీయంగా ముడి చమురు రేట్లు తగ్గినప్పటికీ పీఎస్యూలైన ఐవోసీ, బీపీసీఎల్, హెచ్పీసీఎల్ మాత్రం రేట్లను సవరించకుండా యథాప్రకారం కొనసాగిస్తున్నాయి. అయితే, జియో–బీపీ, నయారా ఎనర్జీ వంటి ప్రైవేట్ సంస్థలు మాత్రం ఆ ప్రయోజనాలను కస్టమర్లకు బదిలీ చేసేందుకే డిస్కౌంటుకు విక్రయిస్తున్నట్లు తెలిపాయి. ఇదీ చదవండి: Jio-bp premium diesel: జియో ప్రీమియం డీజిల్.. అన్నింటి కంటే తక్కువ ధరకే! -
వాహనంలో పెట్రోల్ ఉదయం పోయించాలా? రాత్రి పోయించాలా?..
పెట్రోల్, డీజిల్ వినియోగానికి సంబంధించి వినియోగదారులలో చాలా అపోహలు తలెత్తుతుంటాయి. కారు మైలేజీ పెంచుకునే ఉపాయాలు మొదలుకొని పెట్రోల్ ధర వరకూ చాలామందిలో నిత్యం చర్చలు జరుగుతుంటాయి. ఈ నేపధ్యంలో కొందరు వాహనంలో పెట్రోల్ పోయించేందుకు ప్రత్యేక సమయం ఉందని చెబుతూ, ఆ సమయంలోనే ఇంధనం పోయించేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. పెట్రోల్ పోయించేందుకు ఉదయం తగిన సమయం అని చాలామంది చెబుతుంటారు. కొందరు దీనిని ఖండిస్తూ, రాత్రివేళ వాహనంలో పెట్రోల్ పోయించడం ఉత్తమం అని అంటుంటారు. ఇటువంటి పరిస్థితిలో పెట్రోల్ పోయించేందుకు తగిన సమయం ఏదనే ప్రశ్న మనలో తలెత్తుతుంటుంది. నిజానికి ఇటువంటి వాదనలో ఎంత వాస్తవం ఉందో ఇప్పుడు తెలుసుకుందాం. సోషల్ మీడియాలో దీనికి సంబంధించిన వివరాలు వైరల్ అవుతుంటాయి. పైగా ఈ అంశానికి సంబంధించి ఇంటర్నెట్లో పలు ఆర్టికల్స్ కూడా కనిపిస్తుంటాయి. చదవండి: ఆ రోడ్డుపై ప్రయాణిస్తూ 14 దేశాలు దాటేయొచ్చు.. ఎక్కడుందో తెలుసా! వీటిలో రాత్రివేళ వాహనంలో పెట్రోల్ పోయించకూడదని, తెల్లవారుజామునే పెట్రోల్ పోయిస్తే డబ్బులు ఆదా అవుతాయని, వాహనంలో అధికంగా పెట్రోల్ పడుతుందని చెబుతుంటారు. అయితే దీనిలో నిజం ఏమేరకు ఉన్నదో ఇప్పుడు తెలుసుకుందాం. నిజానికి వేడి కారణంగా ఇంధనం విస్తరిస్తుంది. అందుకే ఉదయం తెల్లవారుతున్న సమయంలో వాహనంలో పెట్రోల్ పోయిస్తే, అధికంగా నిండుతుందని చెబుతుంటారు. అయితే దీనిలో వాస్తవం లేదని నిపుణులు తేల్చిచెప్పారు. ప్రపంచంలోని అత్యధిక ఇంధన స్టేషన్లలో భూమిలోపల ట్యాంకులలో పెట్రోల్ లేదా డీజిల్ రిజర్వ్ చేస్తుంటారు. ఫలితంగా ఇంధన ఉష్ణోగ్రతలు స్థిరంగా ఉంటాయి. పైగా ట్యాంకులకు అత్యధిక దళసరితో కూడిన మూతలు ఉంటాయి. ఈ విధంగా చూస్తే వాహనంలో ఏ సమయంలో పెట్రోల్ పోయించినా దానిపై ఉష్ణోగ్రత ప్రభావం పడదు. ఇందన సంకోచ, వ్యాకోచాలలో తేడా ఏర్పడదు. అందుకే ఉదయం వేళలో వాహనంలో పెట్రోల్ పోయించినప్పటికీ ఎటువంటి తేడా రాదు. తెల్లవారుజామున పెట్రోల్ పోయించడం వలన ప్రత్యేక ప్రయోజనం ఏమీ ఉండదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. -
జియో ప్రీమియం డీజిల్.. అన్నింటి కంటే తక్కువ ధరకే!
Jio-bp premium diesel: ప్రపంచంలోనే అతిపెద్ద రిఫైనింగ్ కాంప్లెక్స్ను నడుపుతున్న భారతీయ కంపెనీ రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్. రాష్ట్ర ఇంధన హోల్సేలర్ల కంటే తక్కువ ధరకే డీజిల్ను విక్రయిస్తోంది. ఇదీ చదవండి: SEBI on Adani: అదానీ గ్రూప్పై సెబీ కీలక వివరణ! సుప్రీం కోర్టుకు రిజాయిండర్ అఫిడవిట్ జియో-బీపీ (Jio-bp) ప్రీమియం డీజిల్ను తాజాగా ప్రారంభించింది. జియో-బీపీ అనేది రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, యూకేకి చెందిన బీపీ అనే ఇంధన సంస్థల జాయింట్ రిటైలింగ్ వెంచర్. జియో-బీపీ ప్రారంభించిన ఈ ప్రీమియం డీజిల్ ధర ఇతర ప్రభుత్వ రంగ ఇంధన సంస్థలు విక్రయస్తున్న సాధారణ డీజిల్ కంటే తక్కువగా ఉంది. భారతీయ వినియోగదారుల కోసం డీజిల్ ప్రమాణాలను పెంచడానికి యాక్టివ్ టెక్నాలజీతో కూడిన డీజిల్ను విడుదల చేస్తున్నట్లు జియో-బీపీ ప్రకటించింది. భారీగా ఇంధన ఆదా కొత్తగా లాంచ్ చేసిన డీజిల్ కంపెనీ నెట్వర్క్ పరిధిలోని అన్ని అవుట్లెట్లలోనూ అందుబాటులో ఉంటుందని, 4.3 శాతం మెరుగైన ఇంధన వ్యవస్థ కారణంగా ట్రక్కుల యజమానులకు ఒక్కో వాహనంపై సంవత్సరానికి రూ. 1.1 లక్షల వరకు ఆదా అవుతుందని జియో-బీపీ ఒక ప్రకటనలో తెలిపింది. ముంబైలోని జియో-బీపీ అవుట్లెట్లో కొత్త ప్రీమియం డీజిల్ను లీటర్కు రూ. 91.30కి విక్రయిస్తున్నారు. అయితే ఇక్కడ ఇతర ప్రభుత్వ రంగ పెట్రోల్ పంపుల వద్ద సాధారణ డీజిల్ ధర రూ. 92.28 ఉంది. ఇదీ చదవండి: Motorola Edge 40: మోటరోలా ఎడ్జ్ 40 లాంచ్కు రెడీ.. ఫీచర్లు, స్పెసిఫికేషన్లు భలే ఉన్నాయే! -
అలెర్ట్ : ఈ వెహికల్స్ను బ్యాన్ చేయండి.. కేంద్రం వద్దకు ప్రతిపాదనలు!
న్యూఢిల్లీ: పది లక్షలకుపైగా జనాభా ఉన్న నగరాల్లో డీజిల్ ఆధారిత ఫోర్ వీలర్లను 2027 నాటికి నిషేధించాలని చమురు మంత్రిత్వ శాఖ సూచించింది. ఎలక్ట్రిక్, గ్యాస్ ఆధారిత వాహనాలను ప్రోత్సహించాలని చమురు మంత్రిత్వ శాఖ మాజీ సెక్రటరీ తరుణ్ కపూర్ నేతృత్వంలోని కమిటీ విన్నవించింది. ‘ఇంటర్నల్ కంబషన్ ఇంజన్తో తయారైన మోటార్సైకిళ్లు, స్కూటర్లు, త్రిచక్ర వాహనాల తయారీని 2035 నాటికి దశలవారీగా నిలిపివేయాలి. సుమారు 10 ఏళ్లలో పట్టణ ప్రాంతాల్లో డీజిల్ సిటీ బస్సులను నూతనంగా జోడించకూడదు. ఇంటర్నల్ కంబషన్ ఇంజన్ ఆధారిత ద్విచక్ర, త్రిచక్ర వాహనాలను దశలవారీగా నిర్మూలించడానికి ఎలక్ట్రిక్ వెహికిల్స్ సరైన పరిష్కారంగా ప్రచారం చేయాలి. చదవండి👉 దేశంలోని ఐటీ ఉద్యోగులకు బంపరాఫర్! మధ్యంతర కాలంలో మిశ్రమ నిష్పత్తిని పెంచుతూ ఇథనాల్తో కూడిన ఇంధనానికి విధాన మద్దతు ఇవ్వాలి. డీజిల్తో నడిచే ఫోర్ వీలర్లను వీలైనంత త్వరగా తొలగించవచ్చు. అందువల్ల 10 లక్షలకుపైగా జనాభా ఉన్న నగరాలు, అధిక కాలుష్యం ఉన్న అన్ని పట్టణాలలో డీజిల్తో నడిచే నాలుగు చక్రాల వాహనాలపై నిషేధాన్ని ఐదేళ్లలో అమలు చేయాలి. ఫ్లెక్స్ ఫ్యూయల్, హైబ్రిడ్లతో కూడిన వాహనాలను ప్రోత్సహించేలా స్వల్ప, మధ్యస్థ కాలంలో ప్రచారం చేయాలి. పన్నుల వంటి ఆర్థిక సాధనాల ద్వారా ఇది చేయవచ్చు. ఈవీల వినియోగాన్ని పెంచేందుకు ఫేమ్ను కొనసాగించాలి. నగరాల్లో సరుకు డెలివరీ కోసం ఎలక్ట్రిక్ వాహనాలకు మాత్రమే కొత్తగా రిజిస్ట్రేషన్లకు అనుమతించాలి. కార్గో తరలింపు కోసం రైల్వేలు, గ్యాస్తో నడిచే ట్రక్కులను ఎక్కువగా ఉపయోగించాలి. ఈ సూచనలు అమలైతే 2070 నాటికి ఉద్గారాల విషయంలో భారత్ నెట్ జీరో స్థాయికి చేరుకుంటుంది’ అని నివేదిక పేర్కొంది. చదవండి👉 ఈ చెట్టు లేకపోతే ప్రపంచంలో కూల్డ్రింక్స్ తయారీ కంపెనీల పరిస్థితి ఏంటో? -
ఏప్రిల్లో ఇంధన అమ్మకాలు పెరగటానికి కారణం ఇదే!
న్యూఢిల్లీ: రబీ పంటల కోత పనులు ప్రారంభం కావడం, ఆర్థిక కార్యకలాపాలు పుంజుకోవడం వంటి అంశాల దన్నుతో ఏప్రిల్లో ఇంధనాలకు డిమాండ్ పెరిగింది. గతేడాది ఏప్రిల్తో పోలిస్తే డీజిల్ అమ్మకాలు 6.7% పెరిగి 7.15 మిలియన్ టన్నులుగా నమోదయ్యాయి. నెలవారీగా చూస్తే మార్చితో పోల్చినప్పుడు 4.8% వృద్ధి నమోదైంది. సోమవారం వెలువడిన గణాంకాల ప్రకారం.. పెట్రోల్ అమ్మకాలు ఏప్రిల్లో వార్షికంగా 2.5% పెరిగి 2.64 మిలియన్ టన్నులకు చేరగా, నెలవారీగా మాత్రం స్వల్పంగా 0.5% మేర తగ్గాయి. రబీ పంటల కోతకు ట్రాక్టర్లను ఉపయోగిస్తుండటం వల్ల డీజిల్ వినియోగం పెరుగుతుంది. -
ఊపందుకున్న పెట్రోల్, డీజిల్ విక్రయాలు
న్యూఢిల్లీ: వ్యవసాయ పనులు, పరిశ్రమల అవసరాలు, ట్రక్కుల ద్వారా రవాణా పెరగడంతో ఏప్రిల్ ప్రథమార్ధంలో డీజిల్కు భారీ డిమాండ్ ఏర్పడింది. గతేడాది ఏప్రిల్ ప్రథమార్ధంతో పోలిస్తే ఈసారి డీజిల్ విక్రయాలు 15 శాతం పెరిగి 3.45 మిలియన్ టన్నులుగా నమోదయ్యాయి. నెలలవారీగా చూసినప్పుడు మార్చి ప్రథమార్ధంలో నమోదైన 3.19 మిలియన్ టన్నులతో పోలిస్తే 8.4 శాతం పెరిగాయి. ఇక పెట్రోల్ విషయానికొస్తే ఏప్రిల్ 1–15 మధ్య కాలంలో అమ్మకాలు 2 శాతం పెరిగి 1.14 మిలియన్ టన్నులకు చేరాయి. నెలవారీగా చూస్తే మాత్రం 6.6 శాతం మేర తగ్గాయి. కోవిడ్ పూర్వంతో (2020) పోలిస్తే ఏప్రిల్ ప్రథమార్ధంలో పెట్రోల్ అమ్మకాలు 128 శాతం, డీజిల్ అమ్మకాలు 127 శాతం పెరిగాయి. వార్షికంగా వంట గ్యాస్ విక్రయాలు 5.7 శాతం పెరిగి 1.1 మిలియన్ టన్నులకు చేరాయి. మరోవైపు, ఏవియేషన్ కార్యకలాపాలు తిరిగి యథాప్రకారం ప్రారంభమైన నేపథ్యంలో గతేడాది ఏప్రిల్ ప్రథమార్ధంతో పోలిస్తే తాజాగా విమాన ఇంధనం (ఏటీఎఫ్) అమ్మకాలు 14 శాతం పెరిగి 2,84,600 టన్నులకు చేరాయి. నెలలవారీగా చూస్తే 3.8% తగ్గినప్పటికీ.. 2020తో పోల్చినప్పుడు 468 శాతం పెరిగాయి. పారిశ్రామిక కార్యకలాపాలు గణనీయంగా పుంజుకోవడం దేశీయంగా ఆయిల్ డిమాండ్కు ఊతమిస్తోందని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. ఇటు సర్వీసులు, అటు పరిశ్రమల నుంచి మద్దతుతో భారత్ స్థిరమైన వృద్ధి సాధించగలుగుతోందని పేర్కొన్నాయి. -
పెట్రోల్ కార్లదే హవా
సాక్షి, అమరావతి: దేశంలో కార్ల కొనుగోలుదారుల అభిరుచుల్లో ఆసక్తికరమైన మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ప్రధానంగా ఐదేళ్లలో కార్ల మార్కెట్పై దీని ప్రభావం ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. దేశంలో కార్ల మార్కెట్ను పెట్రోల్ వెర్షన్ కార్లు శాసిస్తున్నాయనే చెప్పొచ్చు. మార్కెట్లో 70 శాతం అమ్మకాలతో పెట్రోల్ వెర్షన్ కార్లు అగ్రస్థానంలో కొనసాగుతున్నాయి. డీజిల్ కార్లపై వినియోగదారుల ఆసక్తి క్రమంగా తగ్గుతోంది. దీంతో వీటి అమ్మకాలు 18.50 శాతానికే పరిమితమయ్యాయి. విద్యుత్ కార్ల అమ్మకాలు అనూహ్యంగా పుంజుకుంటున్నాయి. మొత్తం కార్ల అమ్మకాల్లో ఎస్యూవీ మోడల్ వాహనాల వాటా 42 శాతంగా ఉంది. 2018–19 నుంచి 2022–23లో దేశంలో కార్ల అమ్మకాల నివేదికను ప్రముఖ మార్కెటింగ్ రీసెర్చ్ సంస్థ ‘జేటో డైనమిక్స్’ వెల్లడించింది. నివేదిక ఏం చెబుతోందంటే.. ఐదేళ్లలో దేశంలో పెట్రోల్ కార్ల అమ్మకాలు 10 శాతం పెరిగాయి. 2018–19లో దేశీయ కార్ల మార్కెట్లో పెట్రోల్ వెర్షన్ కార్ల అమ్మకాలు 60 శాతంగా ఉండేవి. ఇవి 2022–23లో 70 శాతం మార్కెట్ను సాధించాయి. కాలుష్య నియంత్రణ కోసం ప్రభుత్వం తీసుకున్న మార్గదర్శకాలు కూడా పెట్రోల్ వాహనాల అమ్మకాలు పెరగడానికి కారణమయ్యాయి. డీజిల్ వాహనాలను 10 ఏళ్లకు తుక్కుగా మార్చాలని కేంద్రం నిర్ణయించింది. అదే పెట్రోల్ వాహనాలకు 15 ఏళ్ల వరకూ అవకాశం కల్పించింది. దాంతో డీజిల్ వాహనాల కంటే పెట్రోల్ వాహనాల కొనుగోలుకు వినియోగదారులు ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. ఐదేళ్ల క్రితం పెట్రోల్, డీజిల్ ధరల మధ్య వ్యత్యాసం ఎక్కువగా ఉండేది. కానీ డీజిల్ ధరలు క్రమంగా పెరుగుతూ వచ్చాయి. ప్రస్తుతం రెండింటి ధరల మధ్య ప్రస్తుతం పెద్ద వ్యత్యాసం లేదు. కొత్త మోడల్స్ లాంచింగ్లోనూ.. కార్ల కొనుగోలుదారుల ఆసక్తి కొత్త మోడళ్ల లాంచింగ్ను ప్రభావితం చేస్తోంది. కార్ల తయారీ కంపెనీలు కూడా మార్కెట్లోకి కొత్తగా పెట్రోల్, విద్యుత్ వాహనాలను ప్రవేశపెట్టేందుకే ఆసక్తి చూపిస్తున్నాయి. 2022–23 ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో భారత్ మార్కెట్లోకి 28 కొత్త మోడల్ కార్లను ప్రవేశపెట్టారు. వాటిలో పెట్రోల్ వెర్షన్ కార్లు 13 ఉండగా.. విద్యుత్ కార్లు 8 ఉన్నాయి. డీజిల్ వెర్షన్ కార్లు ఆరు, సీఎన్జీ వెర్షన్ కారు ఒక మోడల్ భారత్ మార్కెట్లోకి ప్రవేశించాయి. సగానికి తగ్గిన డీజిల్ కార్ల అమ్మకాలు ఐదేళ్లలో దేశంలో డీజిల్ కార్ల అమ్మకాలు దాదాపు సగానికి తగ్గిపోయాయి. పర్యావరణ నియంత్రణ చర్యలు, డీజిల్ ధరలు అమాంతంగా పెరుగుతుండటమే దీనికి కారణం. ఎస్యూవీ వాహనాల్లోనే డీజిల్ వెర్షన్కు డిమాండ్ ఉంది. సాధారణ కార్ల అమ్మకాల్లో డీజిల్ వాహనాలకు డిమాండ్ తగ్గుతూ వస్తోంది. 2018–19లో దేశంలో డీజిల్ వెర్షన్ కార్ల వాటా 36 శాతం ఉండేది. కాగా 2022–23లో అది 18.50 శాతానికి తగ్గిపోయింది. 2018–19తో పోలిస్తే 2022–23నాటికి దేశంలో కార్ల కొనుగోలుదారుల అభిరుచుల్లో గణనీయమైన మార్పులు వచ్చాయి. -
డీజిల్ ఎగుమతిపై విండ్ఫాల్ ట్యాక్స్ పెంపు
న్యూఢిల్లీ: డీజిల్ ఎగుమతిపై విండ్ఫాల్ ప్రాఫిట్ ట్యాక్స్ను లీటరుకు రూపాయి పెంచుతూ కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. అయితే దేశీయంగా ఉత్పత్తయిన ముడి చమురుపై పన్నును ఐదో వంతు తగ్గించినట్లు అధికారిక ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ ఉత్తర్వుల ప్రకారం చమురు, సహజ వాయువుల సంస్థ (ఓఎన్జీసీ) వంటి కంపెనీలు ఉత్పత్తి చేసే ముడి చమురుపై లెవీ టన్నుకు రూ.4,400 నుంచి రూ.3,500కి తగ్గింది. భారత్ 2022 జూలై 1వ తేదీన విండ్ఫాల్ ప్రాఫిట్ ట్యాక్స్ విధానాన్ని ప్రవేశపెట్టింది. తద్వారా అంతర్జాతీయంగా ధరలు పెరుగుదల వల్ల ఇంధన కంపెనీలకు అనూహ్యంగా వచ్చే భారీ లాభాలపై పన్ను విధిస్తున్న పలు దేశాల సరసన చేరింది. అంతర్జాతీయ చమురు ధరలకు అనుగుణంగా ప్రతి పదిహేను రోజులకు ఈ పన్ను మదింపు, నిర్ణయం జరుగుతోంది. అటువంటి లెవీ ప్రస్తుతం ఉన్న అన్ని ఇతర పన్నులకు అదనం. దేశీయ చమురు అన్వేషణకు విఘాతం కలుగుతుందని పేర్కొంటూ ఈ పన్నును రద్దు చేయాలని ఫిక్కీ వంటి పారిశ్రామిక సంస్థలు తమ ప్రీ–బడ్జెట్ మెమోరాండంలో ప్రభుత్వాన్ని కోరాయి. -
భారత్ నుంచి బంగ్లాకు పైప్లైన్ ద్వారా డీజిల్
న్యూఢిల్లీ: భారత్ నుంచి బంగ్లాదేశ్కు డీజిల్ రవాణా కోసం రూ.377 కోట్లతో నిర్మించిన పైప్లైన్ను ప్రధాని మోదీ, బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా శనివారం వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ప్రారంభించారు. భారత్–బంగ్లాదేశ్ సంబంధాల్లో కొత్త అధ్యాయం ప్రారంభమైందని ఈ సందర్భంగా మోదీ అన్నారు. ఈ లైన్ వల్ల రవాణా ఖర్చులతోపాటు కాలుష్యం కూడా తగ్గుతాయని చెప్పారు. ప్రస్తుతం డీజిల్ భారత్ నుంచి 512 కిలోమీటర్ల పొడవైన రైలు మార్గంలో బంగ్లాదేశ్కు సరఫరా అవుతోంది. నూతనంగా అస్సాంలోని నుమాలిఘడ్ నుంచి బంగ్లాదేశ్కు 131.5 కిలోమీటర్ల మేర నిర్మించిన పైప్లైన్ ద్వారా ఏడాదికి 10 లక్షల టన్నుల డీజిల్ రవాణాకు వీలుంటుంది. ఈ 15 ఏళ్ల ఒప్పందాన్ని దశలవారీగా విస్తరించుకునే వీలుంది. -
Pakistan crisis: చుక్కలు చూపిస్తున్న పెట్రోల్ ధరలు
పాకిస్థాన్ ప్రస్తుతం అత్యంత దారుణమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే, ఇప్పటికే లీటరు పాలు రూ. 210, కేజీ చికెన్ రూ. 700 నుంచి రూ. 800 వరకు ఉన్నాయి. తాజాగా పెట్రోల్ ధరలు ప్రజలకు చుక్కలు చూపిస్తున్నాయి. నివేదికల ప్రకారం.. పెట్రోల్, డీజిల్ ధరలు వరుసగా రూ. 22.02, రూ. 17.20 పెరిగాయి. ఈ ధరలు ఫిబ్రవరి 16 నుంచి అమలులోకి వచ్చాయి. ధరల పెరుగుదల తరువాత పెట్రోల్ ధర రూ. 272, డీజిల్ ధర రూ. 280. వీటితో పాటు కిరోసిన్ ధరలు కూడా ఆకాశాన్నంటుతున్నాయి. ఇప్పటికే పాకిస్థాన్ ప్రభుత్వం గతంలో కూడా వీటి ధరలను పెంచింది. భారతదేశం వంటి కొన్ని దేశాలలో పెట్రోల్, డీజిల్ ధరలు చాలా రోజుల నుంచి నిలకడగా ఉన్నాయి. అయినప్పటికీ మన దేశంలో చమురు ధరలు ఎప్పుడో సెంచరీ దాటాయి. పాకిస్థాన్ కరెన్సీలో భారీగా తగ్గుదల, చమురు దిగుమతుల వ్యయం పెరగడం వంటి కారణాల వల్ల పాకిస్థాన్లో గత కొన్ని రోజులుగా చమురు ధరలు చాపకింద నీరులా ప్రవహిస్తున్నాయి. ఇప్పటికే ఆర్థిక సంక్షోభంలో మునిగిపోయి కొట్టు మిట్టాడుతున్న పాకిస్థాన్ ప్రజలు రానున్న రోజుల్లో మరింత కష్టాలను ఎదుర్కోవాల్సి వచ్చే సూచనలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. నిత్యావసర ధరలతో పాటు ఇంధన ధరలు కూడా పెరగటం వారికి శాపంగా మారింది. ఇప్పటికీ కొంత మంది ప్రజలు ఆకలి బాధలను భరిస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో ఎంతోమందిని కలచి వేస్తున్నాయి. -
వాహనదారులకు శుభవార్త.. పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు
-
జీఎస్టీలోకి పెట్రోలియం ఉత్పత్తులు! ఆర్థిక మంత్రి ఏం చెప్పారంటే..
న్యూఢిల్లీ: రాష్ట్రాలు అంగీకరిస్తే పెట్రోలియం ఉత్పత్తులను వస్తు, సేవల పన్నుల (జీఎస్టీ) పరిధిలోకి తీసుకురావచ్చని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. ఇందుకు సంబంధించి ఒక ప్రొవిజన్ ఇప్పటికే ఉందని బుధవారం వివరించారు. పరిశ్రమల సమాఖ్య పీహెచ్డీసీసీఐ సభ్యులతో బడ్జెట్ అనంతర సమావేశంలో పాల్గొన్న సందర్భంగా మంత్రి ఈ విషయాలు తెలిపారు. ప్రస్తుతం ముడి పెట్రోలియం, పెట్రోల్, హై స్పీడ్ డీజిల్, సహజ వాయువు, విమాన ఇంధనాలను తాత్కాలికంగా జీఎస్టీ నుంచి మినహాయించారు. వాటిని ఎప్పటి నుంచి ఈ పరిధిలోకి తేవాలనేది జీఎస్టీ మండలి నిర్ణయం తీసుకోనుంది. 2023 ఫిబ్రవరి 18న జీఎస్టీ మండలి 49వ సమావేశం జరగనుంది. ఒకవేళ మొత్తం మండలి ఈ ప్రతిపాదనకు అంగీకరిస్తే ఏ రేటు వర్తింపచేయాలనే దానిపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని మంత్రి చెప్పారు. రేటును నిర్ధారించి తనకు తెలియజేస్తే పెట్రోలియం ఉత్పత్తులను సత్వరం జీఎస్టీ పరిధిలోకి చేర్చగలమన్నారు. మరోవైపు, వృద్ధికి ఊతమిచ్చే దిశగా కేంద్రం గత మూడు–నాలుగేళ్లుగా పెట్టుబడి వ్యయాలను గణనీయంగా పెంచుతూనే ఉందని మంత్రి వివరించారు. ఒకే దేశం ఒకే రేషన్ కార్డు స్కీమును, విద్యుత్ తదితర రంగాల్లో సంస్కరణలను ముందుకు తీసుకెళ్లాలంటూ రాష్ట్రాలకు కేంద్రం సూచిస్తోందన్నారు. (ఇదీ చదవండి: ఈవీ జోరుకు భారత్ రెడీ.. ప్లాంటు యోచనలో వోల్వో!) -
వాహనదారులకు షాక్.. పెట్రోల్, డీజిల్పై రూ.2 సెస్..ఎక్కడంటే?
తిరువనంతపురం: వాహనదారులకు కేరళ ప్రభుత్వం షాక్ ఇచ్చింది. పెట్రోల్, డీజిల్పై లీటరుకు రూ.2 సెస్ విధించనున్నట్లు తెలిపింది. ఆర్థిక మంత్రి కేఎన్ బాలగోపాల్ బడ్జెట్ ప్రసంగంలో గురువారం ఈ విషయాన్ని వెల్లడించారు. కేరళలో ఎల్డీఎఫ్ రెండో దఫా అధికారం చేపట్టిన తర్వాత ప్రవేశపెట్టిన రెండో పూర్తి స్థాయి బడ్జెట్ ఇది. రాష్ట్రంలో ఇకపై సోషల్ సెక్యూరిటీ సెస్ పేరుతో లీటరు పెట్రోల్, డీజిల్పై రూ.2 అదనంగా వసూలు చేయనున్నట్లు మంత్రి చెప్పారు. తద్వారా సోషల్ సెక్యూరిటీ సీడ్ ఫండ్కు రూ.750 కోట్ల ఆదాయం సమకూరుతుందని అంచనా వేస్తున్నట్లు వివరించారు. అలాగే భారత్లో తయారయ్యే విదేశీ లిక్కర్ బ్రాండ్ మద్యంపై రూ.20, రూ.40 సెస్ విధించనున్నట్లు బాలగోపాల్ వెల్లడించారు. రూ.500-999 ధర గల లిక్కర్ బాటిళ్లపై రూ.20 సెస్, ధర రూ.1000కి ఎక్కువగా ఉండే బాటిళ్లపై రూ.40 సెస్ విధించనున్నట్లు చెప్పారు. దీనిద్వారా రూ.400 కోట్ల ఆదాయం సమకూరుతుందని అంచనా వేశారు. కేరళ ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఇంధనం, మద్యంపై సెస్ విధించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ సంవత్సరం రాష్ట్రానికి ఆర్థిక అవరోధాలు ఉన్నప్పటికీ అప్పుల ఊబిలో కూరుకుపోలేదని మంత్రి తెలిపారు. చదవండి: వాహనదారులకు బంపర్ ఆఫర్.. చలాన్లపై 50 శాతం డిస్కౌంట్..! -
ముడిచమురుపై విండ్ఫాల్ ట్యాక్స్ పెంపు.. జనవరి 3 నుంచి అమలు
దేశీయంగా ఉత్పత్తయ్యే ముడి చమురు, ఎగుమతి చేసే డీజిల్, ఏటీఎఫ్లపై విండ్ఫాల్ ట్యాక్స్ను కేంద్రం పెంచింది. అంతర్జాతీయంగా ఆయిల్ ధరలు పెరుగుతున్న నేపథ్యంలో ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. మంగళవారం విడుదల చేసిన ఉత్తర్వుల ప్రకారం క్రూడాయిల్పై విండ్ఫాల్ ట్యాక్స్ను టన్నుకు రూ. 1,700 నుంచి రూ. 2,100కి పెంచింది. అలాగే ఎగుమతి చేసే డీజిల్పై లీటరుకు పన్నును రూ. 5 నుంచి రూ. 6.5కి, విమాన ఇంధనం (ఏటీఎఫ్)పై లీటరుకు రూ. 1.5 నుంచి రూ. 4.5కి పెంచింది. కొత్త ట్యాక్స్ రేట్లు జనవరి 3 నుంచి అమల్లోకి వచ్చాయి. ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ఓఎన్జీసీ) తదితర సంస్థలు దేశీయంగా క్రూడాయిల్ ఉత్పత్తి చేస్తున్నాయి. ఆయిల్ రేట్ల పెరుగుదలతో చమురు కంపెనీలకు ఆకస్మికంగా వచ్చే భారీ లాభాలపై విధిస్తున్న పన్నును విండ్ఫాల్ ట్యాక్స్గా వ్యవహరిస్తున్నారు. ఇతర దేశాల బాటలోనే ఈ ఏడాది జూలై 1 నుంచి భారత్ కూడా దీన్ని అమలు చేయడం ప్రారంభించింది. ప్రతి 15 రోజులకోసారి సమీక్షిస్తోంది. అంతర్జాతీయంగా క్రూడాయిల్ రేట్లు తగ్గడంతో డిసెంబర్ 16న చివరిసారిగా జరిపిన సమీక్షలో ట్యాక్స్ రేటును కొంత తగ్గించింది. పెట్రోల్ ఎగుమతులకు మాత్రం విండ్ఫాల్ ట్యాక్స్ నుంచి మినహాయింపు ఉంటోంది. చదవండి: iPhone 14: వావ్ ఐఫోన్ పై మరో క్రేజీ ఆఫర్! ఇంకెందుకు ఆలస్యం..ఇప్పుడే సొంతం చేసుకోండి! -
విండ్ఫాల్ టాక్స్ మూడు రెట్లు కోత: ఇక జాలీగా విమానాల్లో!
న్యూఢిల్లీ: కేంద్రం ఆయిల్ రంగ సంస్థలకు భారీ ఊరట కల్పించింది. పక్షం రోజుల సమీక్షలో భాగంగా దేశీయ రిఫైనరీలు, చమురు ఉత్పత్తి లాభాలపై విండ్ఫాల్ టాక్స్ను భారీగా తగ్గించింది. జెట్ ఇంధనం (ఏటీఎఫ్), డీజిల్ ఎగుమతులపై కూడా విండ్ఫాల్ టాక్స్ను తగ్గించింది. ప్రభుత్వ నోటిఫికేషన్ ప్రకారం, దేశీయంగా ఉత్పత్తి అయ్యే ముడి చమురుపై విండ్ఫాల్ ప్రాఫిట్ సెస్ టన్నుకు రూ. 4,900 నుంచి రూ.1,700కు తగ్గించింది. జెట్ ఇంధనం లేదా ఏవియేషన్ టర్బైన్ ఇంధనంపై విధించే విండ్ఫాల్ పన్నును మూడు రెట్లు తగ్గించి లీటరుకు రూ. 5 నుండి రూ. 1.5 కు కోత విధించింది. డీజిల్ ఎగుమతిపై సెస్ లీటర్కు రూ. 8 నుండి రూ. 5 కు తగ్గించింది. కేంద్రం పెట్రోల్పై ప్రత్యేక అదనపు ఎక్సైజ్ సుంకాన్ని జీరో శాతం వద్దే ఉంచింది. సవరించిన రేట్లు అన్నీ డిసెంబర్ 16, 2022 నుండి అమల్లో ఉంటాయి. (వావ్..ఇంత తక్కువ ధరలో యాపిల్ ఐఫోన్!) భారతదేశంలో విమానయాన సంస్థ నిర్వహణ ఖర్చులో ఇంధన ఖర్చే 30-40 శాతం దాకా ఉంటుంది. ఈ నేపథ్యంలో తాజా విండ్ఫాల్ టాక్స్ కోత వాటి లాభాల మార్జిన్లను పెంచుతుంది. దీంతో విమాన టిక్కెట్ ఛార్జీలు దిగి రావచ్చని నిపుణులు భావిస్తున్నారు. 2022 నవంబరు నుంచి దాదాపు 15 శాతం గ్లోబల్ క్రూడ్ ధరలు క్షీణిస్తున్న సమయంలో ఈ తగ్గింపు వచ్చింది. కాగా జూలై 1, 2022 నుంచి ముడి చమురు ధరలు అంతర్జాతీయంగా పెరిగిన కారణంగా చమురు కంపెనీలు పొందిన లాభాలను దృష్టిలో ఉంచుకుని, చమురు ఉత్పత్తిపై, అలాగే గ్యాసోలిన్, డీజిల్ , విమాన ఇంధనాల ఎగుమతులపై విండ్ఫాల్ టాక్స్ ప్రారంభించింది. అప్పటి నుంచి దాదాపు రెండు వారాలకు ఒకసారి విండ్ ఫాల్ ట్యాక్స్ ను ప్రభుత్వం సవరిస్తోంది. -
పెట్రోల్, డీజిల్ రేట్లు భారీగా తగ్గే అవకాశం
-
బంపర్ ఆఫర్..ఆ క్రెడిట్ కార్డ్ ఉంటే 68 లీటర్ల పెట్రోల్, డీజిల్ ఫ్రీ!
పెరుగుతున్న పెట్రోల్-డీజిల్ ధరలు ప్రజలపై భారంగా మారుతోంది. దీనికి తోడు ద్రవ్యోల్బణం విపరీతంగా పెరగడంతో సామాన్యులు నెలవారీ బడ్జెట్లో పొదుపు మంత్రం పాటించక తప్పట్లేదు. అందుకే పైసలు ఆదా చేసేందుకు ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. ఈ నేపథ్యంలో ఇండియన్ అయిల్ సిటీ క్రెడిట్ కార్డ్ తన కస్టమర్లకు ఓ బంఫర్ ఆఫర్ ప్రకటించింది. ఈ కార్డు వాడకం ద్వారా 68 లీటర్ల ఉచిత పెట్రోల్, డీజిల్ పొందవచ్చని తెలిపింది. ఇందుకోసం ఇండియన్ ఆయిల్తో ఒప్పందం చేసుకొని.. సిటీ బ్యాంక్ ఈ క్రెడిట్ కార్డు తీసుకొచ్చింది. కాకపోతే ఈ ఉచిత పెట్రోల్, డీజిల్ పొందేందుకు కొన్ని షరతులు కూడా ఉంటాయని పేర్కొంది. 68 లీటర్ల ఇంధనం ఉచితం ఈ రోజుల్లో బైక్లు, కార్ల వాడకం విపరీతంగా పెరిగిపోయింది. దీంతో పెట్రోల్, డీజిల్కు డిమాండ్ పెరిగి ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఈ క్రమంలో ప్రతీ నెలా ఇంధన బిల్లుకు వేలు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. అయితే ఈ పైసలను పొదుపు చేయాలంటే ఇలా చేయండి. ఈ సారి ఇంధన బిల్లులకు ఇండియన్ ఆయిల్ సిటీ క్రెడిట్ కార్డ్తో చెల్లించడం ద్వారా సంవత్సరానికి సుమారు రూ. 7వేల ఆదా చేయవచ్చు. ఎలా అంటే.. ఈ కార్డ్ని ఉపయోగించి పేమెంట్ చేయడం ద్వారా కస్టమర్లు దీని నుంచి రివార్డ్ పాయింట్లను (టర్బో పాయింట్లు) పొందగలరు. ఈ పాయింట్లను రీడీమ్ చేయడం ద్వారా కార్డుదారులు సంవత్సరానికి 68 లీటర్ల వరకు పెట్రోల్, డీజిల్ని కొనుగోలు చేయవచ్చు. పాయింట్లు ఎలా వస్తాయ్ ► ఇండియన్ ఆయిల్ పంపుల వద్ద 1 శాతం ఇంధన సర్చార్జి మినహాయింపు. ► ఇండియన్ ఆయిల్ పంప్లలో ఖర్చు చేసే ప్రతి రూ. 150కి 4 టర్బో పాయింట్లను పొందండి. ► కార్డ్ ద్వారా గ్రోసరీలు, సూపర్ మార్కెట్లలో ఖర్చు చేసే రూ. 150కి 2 టర్బో పాయింట్లను పొందండి. ► కార్డ్ ద్వారా ఇతర కేటగిరీలో రూ.150 ఖర్చు చేస్తే 1 టర్బో పాయింట్ని పొందండి. అయితే ఈ టర్బో పాయింట్లకు.. ఇండియన్ ఆయిల్ బంకుల్లో మాత్రం ఎక్కువ ప్రయోజనాలు లభించనున్నాయి. ఎలా అంటారా.. బంకుల్లో ఒక టర్బో పాయింట్.. ఒక రూపాయితో సమానం కాగా, ఇదే విధంగా ఇండిగో, గోఐబిబో వంటి ఇతర వాటిలో ఒక టర్బో పాయింట్కు రూ. 25 పైసలు మాత్రమే లభిస్తాయి. బుక్మైషో, ఎయిర్టెల్, జియో, వొడాఫోన్, షాపర్స్ స్టాప్ వంటి ప్రదేశాల్లో ఒక టర్బో పాయింట్తో 30 పైసలు వస్తాయి. ఇలా ఏడాది మొత్తంలో ఈ కార్డు ఉపయోగించి జరిపే లావాదేవీలపై వచ్చే రివార్డులు, టర్బో పాయింట్లతో 68 లీటర్ల వరకు ఉచితంగా పెట్రోల్ లేదా డిజిల్ కానీ పొందవచ్చని సిటీ బ్యాంక్ వెల్లడించింది. చదవండి: హైదరాబాద్: ఫుల్ డిమాండ్.. అందులో స్టార్టప్ల ఏర్పాటు కోసం ఎగబడుతున్న సంస్థలు! -
‘పెట్రోల్, డీజిల్ను జీఎస్టీ కిందకు తెచ్చేందుకు మేము సిద్ధం.. కానీ’
శ్రీనగర్: జీఎస్టీ కిందకు పెట్రోల్, డీజిల్ను తీసుకువచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి తెలిపారు. కానీ, ఇందుకు రాష్ట్రాలు అంగీకరించకపోవచ్చన్నారు. ఇందుకు రాష్ట్రాల అంగీకారం కూడా తప్పనిసరి అన్నది గుర్తు చేశారు. రాష్ట్రాలు కూడా సుముఖత వ్యక్తం చేస్తే ఈ విషయంలో కేంద్రం ముందుకు వెళుతుందని పురి చెప్పారు. దీన్ని ఎలా అమలు చేయాలన్నది మరో అంశంగా పేర్కొన్నారు. దీనిపై ఆర్థికమంత్రి స్పష్టత ఇవ్వగలరని పేర్కొన్నారు. లిక్కర్, ఇంధనాలు రాష్ట్రాలకు ఆదా య వనరులుగా ఉన్నందున, వాటిని జీఎస్టీ కిందకు తీసుకురావడానికి అంగీకరించకపోవచ్చన్న అభిప్రాయాన్ని మంత్రి వినిపించారు. చదవండి: ఫోన్పే యూజర్లకు అలర్ట్: అందుబాటులోకి వచ్చిన ఈ సరికొత్త సేవలు తెలుసా! -
చావనైనా చస్తాం.. భూమి మాత్రం ఇచ్చేదిలేదు
ఖలీల్వాడి : నిజామాబాద్ జిల్లా నందిపేట్ మండలం సీహెచ్ కొండూర్ గ్రామంలోని అన్నదమ్ముల భూమిలో వైకుంఠధామం నిర్మించాలంటున్న గ్రామస్తుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వారిద్దరూ పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఆత్మహత్యకు యత్నించారు. మంగళవారం జరిగిన ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. సీహెచ్ కొండూర్ గ్రామానికి చెందిన హన్మాండ్లు, లింగంకు వారసత్వంగా వచ్చిన రెండెకరాల భూమి ఉంది. మూడేళ్ల క్రితం ఈ భూమిలో వైకుంఠధామం నిర్మించాలని గ్రామస్తులు నిర్ణయించారు. అయితే 40 ఏళ్లుగా వ్యవసాయం చేసుకుంటున్న భూమిలో వైకుంఠధామం నిర్మిస్తే తమకు జీవానాధారమైన సాగు భూమి లేకుండా పోతుందని గ్రామస్తుల్ని వేడుకున్నారు. అయినప్పటికీ గ్రామస్తులు, కుల సంఘం సభ్యులు మూడేళ్లుగా పట్టువిడవకుండా ఒత్తిడి చేస్తుడటంతో విసిగిపోయిన హన్మాండ్లు, లింగంలు నందిపేట్లోని పోలీస్ స్టేషన్కు వెళ్లి న్యాయం చేయాలని వేడుకున్నారు. వారి నుంచి సరైన స్పందన రాకపోవడంతో కుటుంబ సభ్యులతో కలసి జిల్లా కేంద్రంలోని పోలీస్ కమిషనర్ కార్యాలయానికి వచ్చి అన్నదమ్ములిద్దరూ ఒంటిపై డీజీల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశారు. అక్కడే ఉన్న పోలీసులు డీజీల్ డబ్బాలతోపాటు అగ్గిపెట్టెను లాక్కున్నారు. తమను కుల బహిష్కరణ చేశారని, గ్రామంలో కూడా తమతో ఎవరూ మాట్లాడటం లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. పక్క ఊళ్లకు వెళ్లి వ్యవసాయపనులు చేసుకుంటున్నామని వాపోయారు. స్పందించిన సీపీ కేఆర్ నాగరాజు ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధితులకు న్యాయం చేయాలని ఆర్మూర్ ఏసీపీకి ఆదేశాలు జారీ చేశారు. -
సామాన్యులకు శుభవార్త.. తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు
వాహనదారులకు శుభవార్త. దేశంలో చాలా రోజుల తర్వాత ఇంధన ధరలు తగ్గాయి. లీటర్ పెట్రోల్, డీజిల్పై 40 పైసలు తగ్గిస్తూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. మంగళవారం ఉదయం నుంచి కొత్త ధరలు అమల్లోకి వచ్చాయి. న్యూఢిల్లీలో సోమవారం పెట్రోల్ ధర రూ.96.72గా ఉండగా, ముంబైలో రూ.106.31గా ఉంది. కోల్కతాలో రూ.106.03, చెన్నైలో రూ.102.63, హైదరాబాద్లో రూ.109.66గా ఉంది. మంగళవారం నుంచి ఈ ధరలపై 40 పైసలు త్గగింది. అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు తగ్గి చాలా రోజులుగా స్థరంగా కొనసాగుతుండటంతో చమురు సంస్థలు పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గిస్తున్నాయి. ప్రస్తుతం ఇంటర్నేషనల్ మార్కెట్లో క్రూడాయిల్ బ్యారెల్ ధర 95 డాలర్లకు దిగువన ఉంది. ఆరు నెలల తర్వాత పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గడం ఇదే తొలిసారి. ఈ ఏడాదిలో చివరిసారిగా ఏప్రిల్ 7 ఇంధన ధరలను తగ్గించారు. అలాగే ఆర్థికవ్యవస్థ పుంజుకోవడంతో అక్టోబర్ తొలి అర్ధభాగంలో ఇంధన విక్రయాలు భారీగా పెరిగి కరోనా ముందు స్థితికి చేరుకున్నాయి. పండుగ సీజన్లో పెట్రోల్, డీజిల్ అమ్మకాలు భారీ వృద్ధి నమోదు చేశాయి. దీంతో ధరలు తగ్గించాలని చమురు సంస్థలు నిర్ణయించాయి. ప్రస్తుతం లీటర్పై 40 పైసలే తగ్గించినప్పటికీ.. రానున్న రోజుల్లో రూ.2వరకు తగ్గే అవకాశమున్నట్లు తెలుస్తోంది. చదవండి: ఎయిర్టెల్ బంపరాఫర్: ఒకే రీచార్జ్తో బోలెడు బెనిఫిట్స్, తెలిస్తే వావ్ అనాల్సిందే! -
ముడిచమురుపై విండ్ఫాల్ ట్యాక్స్ పెంపు
న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా క్రూడాయిల్ రేట్లు పెరుగుతున్న నేపథ్యంలో దేశీయంగా ఉత్పత్తయ్యే ముడి చమురు, డీజిల్ .. ఏటీఎఫ్ ఎగుమతులపై కేంద్రం విండ్ఫాల్ ట్యాక్స్ ను పెంచింది. క్రూడాయిల్పై టన్నుకు రూ. 8,000గా ఉన్న సుంకాన్ని రూ. 11,000కు పెంచింది. అలాగే డీజిల్ ఎగుమతులపై లీటరుకు రూ. 5 నుంచి రూ. 12కు పెంచింది. ఈ నెల ప్రారంభంలో దాదాపు సున్నా స్థాయికి దిగి వచ్చిన ఏటీఎఫ్ (విమాన ఇంధనం)పై తిరిగి సుంకాలు విధించింది. లీటరుకు రూ. 3.50 మేర నిర్ణయించింది. అంతర్జాతీయంగా చమురు రేట్లు భారీగా పెరగడం వల్ల వివిధ ఇంధనాలపై ఆయిల్ కంపెనీలకు వచ్చే అసాధారణ లాభాల మీద విధించే సుంకాలను విండ్ఫాల్ ట్యాక్స్లుగా వ్యవహరిస్తున్నారు. ఇతర దేశాల బాటలో దేశీయంగా జూలై 1న కేంద్రం వీటిని విధించింది. ఆ తర్వాత ధరలు కొంత తగ్గుముఖం పట్టడంతో సెప్టెంబర్లో రెండు విడతల్లో వాటిని తగ్గించింది. దేశీ క్రూడాయిల్పై పన్నులతో ఓఎన్జీసీ, ఆయిల్ ఇండియా, వేదాంత వంటి సంస్థలపై ప్రభావం పడనుంది. ఇక రిలయన్స్ ఇండస్ట్రీస్, నయారా ఎనర్జీ వంటి ప్రైవేట్ రిఫైనింగ్ కంపెనీలు.. డీజిల్, ఏటీఎఫ్ మొదలైన ఇంధనాలను ఎగుమతి చేస్తున్నాయి. చదవండి: ఇది ఊహించలేదు.. యూజర్లకు భారీ షాకిచ్చిన జియో!