-
దర్శన్ నా కుమారుడితో సమానం.. సుమలత లేఖ వైరల్
ఆటో డ్రైవర్ రేణుకస్వామి హత్య కేసులో నిందితులుగా బెంగళూరు పరప్పన అగ్రహార జైలులో హీరో దర్శన్ (A2), నటి పవిత్ర (A1) ఉన్నారు. ఈ కేసులో 17 మంది జైలులో ఉన్నారు. ఇప్పటికే దర్శన్ అరెస్ట్ విషయంలో చాలామంది నటీనటులు తమ అభిప్రాయాన్ని పంచుకున్నారు. కానీ, రాజకీయ నాయకురాలు, సినీ నటి సుమలత అంబరీష్ స్పందన గురించి చాలామంది ఎదురుచూశారు. ఎట్టకేలకు ఆమె రియాక్షన్ ఇచ్చారు. దర్శన్తో తనకు ఉన్న బంధాన్ని ఆమె వివరించారు.'నేను 44 ఏళ్ల నుంచి సినిమా రంగంలో నటిగా, కళాకారిణిగా జీవిస్తున్నాను. ఐదేళ్లపాటు ఎంపీగా పని చేశా. అనేక రంగాలలో బాధ్యతగా నిర్వర్తించా. అనవసరంగా వ్యాఖ్యలు చేయడం వేస్ట్. నా కుటుంబంతో దర్శన్ కుటుంబానికి మధ్య ఉన్న బంధం మీకు అర్థం కాదు. అతను స్టార్ కాకముందు 25 ఏళ్లుగా నాకు తెలుసు. స్టార్డమ్కి మించి దర్శన్ నాకు కుటుంబ సభ్యుడు, కొడుకు లాంటివాడు. అంబరీష్ని ఎప్పుడూ నాన్నగా పిలిచే ఆయన జీవితంలో నాకు ప్రత్యేక స్థానం ఇచ్చారు. ఏ తల్లి తన కొడుకుని ఇలాంటి పరిస్థితిలో చూడడానికి ఇష్టపడదు. నాకు తెలిసిన దర్శన్ ఎప్పుడూ ఇలాంటి నేరం చేయడు. దర్శన్లో ప్రేమ, ఉదార హృదయం ఉన్న వ్యక్తిగా నాకు తెలుసు. ఆపదలో ఉన్నవారికి సహాయం చేయాలనే సంకల్పం అతని పాత్రకు సాక్ష్యమిస్తున్నాయి. దర్శన్ అటువంటి నేరం చేసే వ్యక్తి కాదని నేను నమ్ముతున్నాను.' అని సుమలత తన లేఖలో రాశారు. ఈ విషయం కోర్టులో ఉన్నందున తాను ఇకపై వ్యాఖ్యానించనని పేర్కొన్నారు.దర్శన్ భార్య విజయలక్ష్మి, కుమారుడు వినీష్పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న వారిని సుమలత తప్పుబట్టారు. అలాంటి వారిని విమర్శిస్తూ సుమలత తన లేఖను ముగించారు. 'దర్శన్ ఇప్పటికీ నిందితుడే.. అతనికి వ్యతిరేకంగా ఏదీ నిరూపించబడలేదు, శిక్షించబడలేదు. దర్శన్కు న్యాయమైన విచారణ జరగనివ్వండి. దర్శన్ కుటుంబ సభ్యులపై అసభ్యంగా మాట్లాడకండి. దర్శన్ విషయం వల్ల ఇప్పటికే శాండల్వుడ్ స్థంభించిపోయింది.' అని ఆమె రాశారు.18 వరకు దర్శన్కు కస్టడీరేణుకాస్వామి హత్య కేసులో అరైస్టె జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న హీరో దర్శన్, అనుచరులకు కోర్టు కస్టడీ పొడిగిస్తూ ఆదేశాలిచ్చింది. దర్శన్, నటి పవిత్ర, మరో 15 మంది నిందితులకు కస్టడీ గడువు ముగియడంతో వీడియో కాన్ఫరెస్స్ ద్వారా జడ్జి ముందు హాజరుపరిచారు. ఇందులో నలుగురు నిందితులు తుమకూరు జైల్లో ఉన్నారు. బెయిలు దక్కుతుందని ఆశించిన దర్శన్ గ్యాంగ్కి నిరాశ ఎదురైంది. జూలై 18 వరకూ కస్టడీని పొడిగిస్తూ జడ్జి ఆదేశాలిచ్చారు. -
దర్శన్కు సపోర్ట్గా విజయలక్ష్మి కామెంట్
రేణుకాస్వామి హత్యకేసులో నిందితునిగా ఉన్న సినీ హీరో దర్శన్ పరప్పన అగ్రహార జైలులో ఉన్నారు. గతంలో 2011లో భార్యపై దాడికి పాల్పడిన కేసులో ఇదే జైలుకు తొలిసారిగా వచ్చి 20 రోజులకు పైగా ఉన్నారు. 13 ఏళ్ల తరువాత రెండోసారి మళ్లీ రేణుకాస్వామి హత్యకేసులో దర్శన్, ఆయన ప్రియురాలు, నటి పవిత్రా గౌడ సమేతంగా పరప్పన జైలులో ఉన్నారు. ఈ క్రమంలో తాజాగా దర్శన్ను సతీమణి విజయలక్ష్మి తన కుమారుడితో వెళ్లి కలుసుకున్నారు.దర్శన్, విజయలక్ష్మి మధ్య విభేదాలు ఉన్నాయి. వారిద్దరూ కూడా వేరువేరుగా ఉన్నారని సమాచారం. అయితే, దర్శన్ కష్టాల్లో ఉండటంతో ఆయనకు అండగా నిలబడేందుకు ఆమె సిద్ధం అయింది. ఈ క్రమంలో ఇటీవలే కుమారుడు వినీష్తో కలిసి జైలుకు వెళ్లి సుమారు రెండు గంటలపాటు దర్శన్తో మాట్లాడారు ఆమె. ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ఈ కేసులో దర్శన్కు న్యాయం లభిస్తుందనే నమ్మకం ఉందని, అంతవరకూ ఆయనకు అండగా ఉందామని, అభిమానులు ఓపికతో ఉండాలని పోస్ట్ చేశారు. ఇది పరీక్షా సమయమని, సహనం కోల్పోయి మాట్లాడినా, పోస్టులు పెట్టినా దర్శన్కు ఇబ్బంది కలుగుతుందన్నారు. అభిమానుల అంతరంగాన్ని మీ తరఫున దర్శన్కు వివరించాను. కోర్టులపై నమ్మకం ఉంచి న్యాయ పోరాటం చేద్దామని పిలుపునిచ్చారు. -
లైట్ బాయ్ నుంచి మొదలైన దర్శన్ జీవితంలో ఎన్నో వివాదాలు
లైట్ బాయ్గా సినీ జీవితం ప్రారంభించి అచెలంచెలుగా ఎదిగి ఛాలెంజింగ్ స్టార్గా నిలబడి కోట్లాదిమంది అభిమానులను సంపాదించుకున్న కన్నడ హీరో దర్శన్ నేపథ్యం చాలా ఆసక్తికరంగా ఉంది. ఎన్నిసార్లు జైలు ముఖం చూసినా ఆయనలో మార్పు రాలేదు. 2011 సెప్టెంబర్ 9న దర్శన్పై భార్య విజయలక్ష్మి వేధింపులు, దాడి,హత్యాయత్నం కేసు పెట్టింది. ఈ కేసులో దర్శన్ జైలుకు వెళ్లాడు. తరువాత భార్య రాజీ కావడంతో కేసు వెనక్కు తీసుకోగా జైలు నుంచి బయటకు వచ్చాడు. దర్శన్ జైలుకు వెళ్లి వచ్చాక ఆయన సినిమాలు అఖండ విజయాలు సాధించాయి. వాటిలో సారథి సినిమా మొదటిది. 2018లో సెప్టెంబర్ 24న మైసూరులో దర్శన్ ఎస్యూవీ కారు ప్రమాదానికి గురైంది. ఆ సమయంలో కారులో నటుడు దేవరాజ్, స్నేహితులు ఉన్నారు. 2021లో మైసూరులోని ఒక హోటల్లో వెయిటర్పై శారీరకంగా దాడికి దర్శన్ పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. పోలీసుల విచారణ తర్వాత CCTV విజువల్స్ తొలగించబడ్డాయని కూడా వార్తలు వచ్చాయి. తర్వాత వెయిటర్కు రూ. 50,000 నష్టపరిహారం అందించారు. భరత్ అనే కన్నడ చిత్ర నిర్మాతను 2022లో దర్శన్ బెదిరించాడు. ప్రాణభయంతో పోలీసులకు ఆయన ఫిర్యాదు చేశాడు. 2023 జనవరి 20న దర్శన్పై వన్యప్రాణుల సంరక్షణా చట్టం కింద కేసు నమోదైంది.2023 అక్టోబర్ 28న పెంపుడు కుక్కను తనపై వదిలి దాడి చేయించాడని దర్శన్ ఇంటికి దగ్గర్లో ఉన్న మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పార్కింగ్ స్థలం విషయంలో తన కేర్టేకర్తో ఆ మహిళ వాగ్వాదానికి దిగినందున దర్శన్ ఈ పని చేశాడని తెలిసింది. అయితే, ఆ మహిళకు ఆసుపత్రి చికిత్స ఛార్జీలతో పరిహారం చెల్లించాడు.2024 జనవరి 4వ తేదీన బెంగళూరు సుబ్రమణ్యపుర పోలీస్స్టేషన్ పరిధిలోని ఒక హోటల్లో లేట్నైట్ పార్టీ చేసారని దర్శన్ అండ్ గ్యాంగ్పై పోలీసులు వార్నింగ్ ఇచ్చారు. ఇలా ఆయన నిజ జీవితంలో ఎన్నో వివాదాలు చుట్టుముట్టాయి. ఆయన గతంలో జైలుకు వెళ్లి వచ్చారు. అయినా దర్శన్లో ఎలాంటి మార్పులు రాలేదని నెటిజన్లు అంటున్నారు. తప్పులు మీద తప్పులు చేస్తూ చివరకు ప్రియురాలి కోసం ఒక హత్యకు కారణం అయ్యాడని వారు తెలుపుతున్నారు. పేద కుటుంబం నుంచి చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టి.. లైట్ బాయ్గా తన ప్రయాణం కొనసాగించిన దర్శన్ ఆపై కన్నడలో స్టార్ హీరోగా ఎదిగాడు. అలాంటి వ్యక్తి ఇంతటి సాహసానికి పాల్పడ్డాడంటే అభిమానులు కూడా నమ్మలేకపోతున్నారు. -
విచారణలో మౌనంగానే దర్శన్.. ఛాన్స్ ఉన్నా తప్పించుకోని రేణుకాస్వామి
కన్నడ ప్రముఖ నటుడు దర్శన్ ఆయన అనుచరులు రేణుకాస్వామి అనే వ్యక్తిని హత్య చేశారనే కేసులో ఇప్పటికే 15 మందిని అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో ఆయన ప్రియురాలు పవిత్రగౌడ కూడా అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. రేణుకాస్వామి హత్యకు సంబంధించి పోలీసులు అడుగుతున్న ప్రశ్నలకు దర్శన్ తనకు ఏమీ తెలీదని చెప్పడం లేదా మౌనంగా ఉండిపోతున్నాడని తెలిసింది. ఈ కేసులో అరైస్టెన దర్శన్ ప్రియురాలు పవిత్రగౌడ ఇతర నిందితులు చాలా ప్రశ్నలకు నేరుగా సమాధానాలు ఇస్తుండగా దర్శన్ మాత్రం చెప్పిందే చెబుతున్నట్లు సమాచారం. అయితే రేణుకాస్వామిని స్కెచ్ వేసి హత్య చేయలేదని, బెదిరించి కొట్టి భయపెట్టి వదిలేయాలనుకున్నామని, దెబ్బలు తట్టుకోలేని రేణుకాస్వామి మృతి చెందినట్లు నిందితులు చెబుతున్నారు. ఇదిలా ఉండగా రాత్రి రేణుకాస్వామి కేసుకు సంబంధించి పోలీసులు చిత్రదుర్గలో స్పాట్ మహజర్ నిర్వహించారు. పగటి సమయంలో మీడియా, జనాల వల్ల పని కాదని భావించిన పోలీసులు అర్థరాత్రి చిత్రదుర్గలో సీఐ సంజీవ్ గౌడ... నిందితుడు రఘును తీసుకువచ్చి రేణుకాస్వామిని కిడ్నాప్ చేసిన స్థలం, సంఘటనకు సంబంధం ఉన్న ఇతర చోట్ల మహజర్ చేశారు. రఘు దర్శన్ అభిమానుల సంఘం జిల్లా అధ్యక్షుడిగా ఉన్నాడు. రేణుకాస్వామిని గుర్తించి కిడ్నాప్ చేయడంలో రఘు కీలకంగా వ్యవహరించారు.నగదు సీజ్రేణుకాస్వామి హత్య కేసులో దర్శన్ పేరు బయటకు రాకుండా కుదుర్చుకున్న డీల్ ప్రకారం చేతులు మారిన రూ.30 లక్షల నగదు పోలీసులు సీజ్ చేసినట్టు సమాచారం. దర్శన్ ఇచ్చిన రూ.30 లక్షలు దర్శన్కు సంబంధించిన దగ్గరి వ్యక్తి ఇంట్లో ఉన్నట్టు తెలుసుకున్న పోలీసులు ఇంటిపై రైడ్ చేసి నగదు సీజ్ చేశారు.అవకాశం దొరికినా తప్పించుకోని రేణుకాస్వామిరేణుకాస్వామిని కిడ్నాప్ చేసి చిత్రదుర్గ నుంచి బెంగళూరు తీసుకువచ్చే క్రమంలో మార్గం మధ్యలో అనేకసార్లు తప్పించుకునే అవకాశం లభించినా తప్పించుకోలేదని పోలీసుల దర్యాప్తులో తెలిసింది. ఏ8గా ఉన్న నిందితుడు రవి పోలీసులకు లొంగిపోయాడు. రవి ఇచ్చిన సమాచారాన్ని పోలీసులు మీడియాకు వివరించారు. నిందితుడు రవి క్యాబ్ డ్రైవర్. టొయోటా ఈటీఎస్ కారు అద్దెకు నడుపుతుంటాడు. ఈక్రమంలో రవి స్నేహితుడు జగ్గు కాల్ చేసి బెంగళూరుకు వెళ్లాలని కోరాడు. చిత్రదుర్గలో జగ్గు, రఘు, అను, రేణుకాస్వామి కారు ఎక్కారు. కారులో బెంగళూరు వస్తుండగానే ప్రయాణంలో పవిత్రగౌడకు పంపించిన మెసేజ్లపై జగ్గు, రఘు ప్రశ్నించారు. అయితే మెసేజ్లు పంపడం తనకు హాబీ అని రేణుకాస్వామి చెప్పుకున్నాడు. వారంతా మార్గం మధ్యలో తుమకూరులో టిఫిన్ చేయగా రేణుకాస్వామే బిల్ చెల్లించాడు. బెంగళూరు వచ్చేలోపు పలుసార్లు కారు నిలిపినా రేణుకాస్వామి తప్పించుకునే ప్రయత్నం చేయలేదు. కారు బెంగళూరు కామాక్షిపాళ్యలోని షెడ్ వద్దకు చేరుకోగానే అక్కడ 30 మంది సిద్ధంగా ఉన్నారు. వారంతా రేణుకాస్వామిని చూసి ఈ బాడీని కొట్టడానికి ఇంతమంది అవసరమా అని నవ్వుకుని కొందరు అక్కడి నుంచి వెళ్లిపోయారు. రేణుకాస్వామిని రఘు లోపలకు తీసికెళ్లగా అను, రవి, జగ్గు చాలాసేపు బయటే వేచి ఉన్నారు. కొన్ని గంటల తరువాత బయటకు వచ్చిన రఘు రేణుకాస్వామి హత్య జరిగిపోయింది, అప్రూవర్గా మారతారా? అంటూ ప్రశ్నించాడు. రవి అందుకు నిరాకరించడంతో కారు అద్దె రూ.4వేలు ఇచ్చి పంపించేశాడు. రవి, అను, జగ్గు ముగ్గురూ చిత్రదుర్గకు తిరిగి వచ్చేశారు. అనంతరం హత్య వెలుగు చూసి విషయం పెద్దది కావడంతో భయపడ్డ రవి పోలీసులకు లొంగిపోయాడు. -
‘బాస్’ కోసం ఫ్యాన్స్ మధ్య రగడ
సాక్షి, బెంగళూరు: కరోనా లాక్డౌన్ సమయంలో బాస్ అనే పదంపై దర్శకుడు పవన్ ఒడెయర్ చేసిన ట్వీట్ సినీ అభిమానుల మధ్య వాడీవేడి చర్చను రేకెత్తించింది. సినిమా చిత్రీకరణ సమయంలో సామాజీక దూరంను పాటిస్తాం, లవ్యూ బంగారం, సోదర, బాస్ అని ఒడెయర్ చేసిన ట్విట్కు హీరో యశ్ అభిమానులు అభినందనలు చెబుతుండగా, హీరో దర్శన్ అభిమానులు ఆక్రోశం వ్యక్తం చేస్తున్నారు. కన్నడ సినిమా రంగంలో ‘బాస్’ అనే పదం ఒక దర్శన్కు మాత్రమే దక్కుతుందని అయన ఫ్యాన్స్ వాదిస్తున్నారు. యశ్ను బాస్ అనడం జీర్ణించుకోలేక పోతున్నారు. దీంతో దర్శన్ అభిమానులు పవన్ ఒడెయర్పై ట్విట్టర్లో మండిపడుతున్నారు. ‘బాస్’ కోసం ఆది నుంచి గొడవలు నిజానికి యశ్–దర్శన్ మంచి స్నేహితులు. అయితే బాస్ అనే పదం కోసం వారి అభిమానుల మధ్య ట్విటర్లో మాటల యుద్ధం జరుగుతున్నా హీరోలు స్పందించలేదు. బాస్ అనే పదాన్ని ఎవరైనా ఉపయోగించవచ్చు అని యశ్ అభిమానులు వాదనకు దిగుతున్నారు. గతంలో శాండల్వుడ్లో ఎవరు బాస్ అనే విషయంపై పెద్ద వివాదం జరిగింది. హీరో శివరాజ్కుమార్కు చందనవన బాస్ అని బిరుదునివ్వడంతో గొడవకు తెరదించారు. మరో పక్క యశ్ ఇటీవల కొనుగోలు చేసిన కారుకు బాస్ అని అక్షరాలు వచ్చేలా 8055 నంబర్ను రిజిస్టర్ చేయించారు. రగడెందుకు: పవన్ ఒడెయర్ సినిమా రంగంలో సామాన్యంగా అందరినీ బాస్ పదంతో సంబోధిస్తారు. యశ్ను కలిసిన సందర్భంగా బాస్ అని అంటూ ట్వీట్ చేయటంపై ఇంత రాద్ధాంతం అవసరంలేదని దర్శకుడు పవన్ ఒడెయర్ అన్నారు. దర్శకులు, నిర్మాతలను తను బాస్ అని పిలుస్తానంటూ క్లారిటీ ఇచ్చారు. -
'పాత బాయ్ఫ్రెండ్తో రాత్రంతా.. అందుకే'
పెరంబూరు : బిగ్బాస్ రియాలిటీ గేమ్ షోతో పాపులర్ అయిన నటుడు దర్శన్, నటి సనంశెట్టితో కలిసి ఒక చిత్రంలో నటిస్తున్నారు. అప్పుడే వారిద్దరి మధ్య ప్రేమాయణం సాగింది. కాగా చిత్ర షూటింగ్ మధ్యలోనే దర్శన్ బిగ్బాస్ షోలో పాల్గొన్నాడు. అయితే ఆ షో నుంచి బయటకు వచ్చిన తరువాత ఏమైందో తెలియదుకానీ సనంశెట్టి.. దర్శన్పై శుక్రవారం చెన్నై పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఫిర్యాదు చేసింది. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ దర్శిన్ తాను ప్రేమించకున్నామని... తమకు 2019 మేలో వివాహ నిశ్చితార్థం కూడా జరిగిందని, ఇరు కుటుంబాల సమ్మతితో జూన్లో పెళ్లి చేసుకోవడానికి సిద్ధమైనట్లు తెలిపింది. అయితే దర్శన్కు బిగ్బాస్ గేమ్షోలో పాల్గొనే అవకాశం రావడంతో పెళ్లిని వాయిదా వేసుకుందామన్నాడని, అందుకు తానూ అంగీకరించినట్లు చెప్పింది. బిగ్బాస్ కారణంగా దర్శన్కు పేరు వచ్చిందంటే అందుకు కారణం తానేనని పేర్కొంది. దర్శన్ కోసం రూ.15 లక్షల వరకూ ఖర్చు చేశానని, అయితే బిగ్బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తరువాత దర్శన్ మారిపోయాడని, పెళ్లిని ఆపేశాడని ఆరోపించింది. ఈ విషయమై దర్శన్ తల్లిదండ్రులను సంప్రదిస్తే ‘అప్పుడు దర్శన్కు నీపై ప్రేమ కలిగిందని, ఇప్పుడు అది పోయిందని’ అంటున్నారని వాపోయింది. దర్శన్ తనకు నమ్మకద్రోహం చేశాడని సనంశెట్టి ఆరోపించింది. కాగా దర్శన్ ...సనంశెట్టి ఆరోపణలపై స్పందించాడు. శనివారం అతను మీడియా ముందుకు వచ్చాడు. సనంశెట్టి ఇటీవల తన పాత బాయ్ఫ్రెండ్తో ఒక రాత్రి అంతా గడిపిందంటూ పలు ఆరోపణలను చేశాడు. అలాంటి ఆమెను తానెలా పెళ్లి చేసుకుంటానని వ్యాఖ్యలు చేశాడు. సనంశెట్టిని వివాహం చేసుకునే ప్రసక్తే లేదని దర్శన్ తేల్చి చెప్పాడు. -
నా ఓపికను పరీక్షించొద్దు : హీరో
బెంగళూరు : ‘నేను, నా స్నేహితులు చేతికి వేసుకునేది కంకణం. గాజులు కాదు’ అని బహుభాషా నటుడు కిచ్చ సుదీప్ ప్రకటించారు.తనపైన కుట్రలు చేస్తున్నవారు ఇంక కొన్నిరోజులు మాత్రమే ప్రశాంతంగా నిద్రపోతారని, మరోసారి ట్విట్టర్లో గొడవల జోలికి రావద్దని ప్రత్యర్థులను హెచ్చరించారు. ప్రస్తుతం శ్యాండల్వుడ్లో జరుగుతున్న స్టార్వార్ తీవ్రస్థాయికి చేరడంతో సుదీప్, మరో హీరో దర్శన్ అభిమానుల మధ్య జరుగుతున్న సోషల్ మీడియా యుద్ధం ఆ తారలనూ తాకింది. సుదీప్ హీరోగా తాజాగా విడుదలైన పైల్వాన్ సినిమాను వీరేష్ అనే యువకుడు ఇంటర్నెట్లో పెట్టడంతో పాటు తాను హీరో దర్శన్ అభిమానిని అని ప్రకటించుకున్నాడు. మా శ్రమను వృథా చేస్తున్నారు తన సినిమా నెట్లోకి రావడంతో సుదీప్ ట్విట్టర్లో భగ్గుమన్నారు. ‘నాకు సినిమాలు వదిలేస్తే మరో పని ఏమీ లేదు. అందుకే మౌనంగా ఉన్నాను. నా మౌనానికి పరీక్ష పెడుతున్నారు. ఇంత మంచి సినిమాను సోషల్ మీడియాలో పెట్టడం ద్వారా తననే కాదని పైల్వాన్ సినిమా కుటుంబసభ్యులు పడిన కష్టం మొత్తం వృథా చేస్తున్నారు. దీని వెనకల ఎవరి కుట్ర ఉందో నాకు తెలుసు. ప్రస్తుతం వారు ప్రశాంతంగా నిద్రపోతుండవచ్చు. కానీ ముందురోజుల్లో నిద్రపోనివ్వను’ అని హెచ్చరించారు. పైల్వాన్ వీడియోలను పెట్టి సినిమా కలెక్షన్లను తగ్గించాలని చూస్తున్నారని మండిపడ్డారు. ఇక ఇరు హీరోల అభిమానులు పరస్పరం సోషల్ మీడియాలో విమర్శలకు దిగుతున్నారు. అభిమానులకు మద్దతుగా హీరోలు కూడా యుద్ధంలోకి దిగితే శాండల్వుడ్కు సెగలు తప్పవు. -
2468మందికి మాత్రమే వీఐపీ దర్శనం
తిరుమల : వైకుంఠ ఏకాదశి పర్వదినం, నూతన సంవత్సరం ఒకేసారి రావడంతో... తిరుమలకు వీఐపీలు పోటెత్తారు. అర్ధరాత్రి నుంచే స్వామివారిని దర్శించుకునేందుకు... ఇరు రాష్ట్ర రాజకీయవేత్తలు, ప్రముఖలు పోటీపడ్డారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఎన్వీ రమణ, ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టీస్ రోహిణి, వైఎస్ఆర్ సీపీ నేతలు బుట్టా రేణుక, మేకపాటి రాజమోహన్ రెడ్డి, వరప్రసాద్, మిథున్ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అమర్నాథ్ రెడ్డి, శ్రీనివాసులు, కేంద్రమంత్రి సుజనా చౌదరి, ఎంపీ సీఎం రమేష్, డీకే అరుణ, మహేందర్ రెడ్డి, ప్రముఖ హాస్యనటుడు బ్రహ్మానందం తదితరులు వెంకన్నను దర్శించుకున్నారు. 2468మందికి మాత్రమే టీటీడీ వీఐపీ దర్శనం కల్పించింది. అనంతరం రాష్ట్ర ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.