Devendra Fadanvis
-
ప్రధానికి విషెస్; సీఎం భార్యపై విమర్శలు!
ముంబై : ప్రధాని నరేంద్ర మోదీని.. ‘ఫాదర్ ఆఫ్ కంట్రీ’గా సంభోందించిన మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ భార్య అమృతా ఫడ్నవిస్పై నెటిజన్లు మండిపడుతున్నారు. మన జాతి పిత మహాత్మా గాంధీ అని.. ఆ విషయాన్ని కాస్త గుర్తు పెట్టుకుంటే బాగుంటుందని హితవు పలుకుతున్నారు. అసలు విషయమేమిటంటే... మంగళవారం మోదీ 69వ పుట్టిన రోజు సందర్భంగా అమృత సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు...‘ ఫాదర్ ఆఫ్ కంట్రీ నరేంద్ర మోదీ జీకి జన్మదిన శుభాకాంక్షలు. సమాజాన్ని మెరుగుపరిచే క్రమంలో నిర్విరామంగా కృషి చేసేందుకు స్ఫూర్తినిస్తున్న వ్యక్తి ఆయన’ అని ఆమె ట్వీట్ చేశారు. విషెస్తో పాటు తాను స్టేజీపై గాన ప్రదర్శన ఇస్తున్న వీడియోను కూడా అమృత జతచేశారు. ఈ క్రమంలో అమృత ట్వీట్పై స్పందించిన నెటిజన్లు...‘ మన జాతి పిత మహాత్మా గాంధీ అని తెలుసు. ఇప్పుడు కొత్తగా నరేంద్ర మోదీ దేశానికి తండ్రి అయ్యారా. ఇది ఎప్పుడు జరిగింది? ఓహో దేశంలో ఎన్నడూ లేనంత నిరుద్యోగం పెరగడం, ఆర్థిక వ్యవస్థ కుదేలవడం, ఆర్థిక మాంద్యం.. బహుశా ఇదేనేమో సమాజాన్ని మెరుగుపరచటం అంటే’ అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. కాగా 2016లో నేపథ్య గాయనిగా రంగ ప్రవేశం చేసిన అమృత పలు గీతాలు ఆలపించి సింగర్గా గుర్తింపు పొందారు. అదే విధంగా సామాజిక కార్యక్రమాల్లోనూ చురుగ్గా పాల్గొంటారు. ఇక అమృత నెటిజన్ల ఆగ్రహానికి గురి కావడం ఇదే మొదటిసారి కాదు. గత అక్టోబరులో క్రూయిజ్ షిప్ అంచున కూర్చుని సెల్ఫీలకు ఫోజులిచ్చి విమర్శలు ఎదుర్కొన్నారు. ఇందుకు ఆమె క్షమాపణలు కూడా కోరారు. Wishing the Father of our Country @narendramodi ji a very Happy Birthday - who inspires us to work relentlessly towards the betterment of the society ! #HappyBDayPMModiJi #HappyBdayPMModi #HappyBirthdayPM #happybirthdaynarendramodi pic.twitter.com/Ji2OMDmRSm — AMRUTA FADNAVIS (@fadnavis_amruta) September 17, 2019 -
థ్యాంక్యూ ఆమిర్ : సీఎం ఫడ్నవిస్
ముంబై : బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్ మరోసారి పెద్ద మనసు చాటుకున్నారు. ఇప్పటికే పలు సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటున్న ఆమిర్ తాజాగా వరద బాధితులకు సహాయం చేసి రియల్ హీరో అనిపించుకున్నారు. మహారాష్ట్రలో కొద్ది రోజుల క్రితం కురిసిన వర్షాలకు భారీ వరదలు సంభవించడంతో అక్కడి జనజీవనం అతలాకుతలమైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆమిర్ఖాన్ వరద బాధితులను ఆదుకునేందుకు ముందుకు వచ్చారు. తనవంతు సహాయంగా సీఎం రిలీఫ్ఫండ్కు రూ.25 లక్షలు విరాళాన్ని ప్రకటించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఆమీర్కు కృతజ్ఞతలు తెలిపారు. ఇక బాలీవుడ్ ‘ఖిలాడి’ అక్షయ్ కుమార్ కూడా ఇటువంటి సామాజిక కార్యక్రమాల్లో చురుగ్గా ఉంటారన్న విషయం తెలిసిందే. రైతులు, వరద బాధితులు, అమరవీరుల కుటుంబాలకు ఆయన ఆపన్న హస్తం అందించారు. అసోంకు వరదలు వచ్చినప్పుడు రూ.2 కోట్లను ఇచ్చి తన ఉదార స్వభావాన్ని చాటుకున్నారు. అమీర్, అక్షయ్ బాటలోనే గాన కోకిల లతా మంగేష్కర్ రూ.11 లక్షలను, బాలీవుడ్ బిగ్బీ రూ. 51 లక్షలను విరాళంగా ప్రకటించారు. దీంతో మరికొంతమంది ప్రముఖులు కూడా ముందుకువచ్చి విరాళాలు ఇస్తున్నారు. పారిశ్రామిక దిగ్గజం ముఖేశ్ అంబానీ రూ. 5 కోట్లను విరాళంగా ఇవ్వగా ఆయన చిన్న కుమారుడు అనంత్ అంబానీ రూ. 5 కోట్ల చెక్కును సీఎంకు అందించారు. అలాగే ఆగస్టు 12న బాలీవుడ్ కపుల్ రితేశ్ దేశ్ముఖ్- జెనీలియా రూ.25 లక్షల విరాళం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో మహరాష్ట్ర సీఎం ఆపన్న హస్తాన్ని అందించిన ప్రతీ ఒక్కరికీ ట్విటర్ వేదికగా కృతజ్ఞతలు తెలిపారు. ఇప్పటికే రాష్ట్ర కేబినెట్ మంత్రులు, ఫడ్నవీస్తో సహా వారి ఒకరోజు వేతనాన్ని రిలీఫ్ ఫండ్కు ఇస్తున్నట్లుగా ప్రకటించారు.వరదల విజృంభన వల్ల పుణెలో ఇప్పటి వరకు 54 మంది చనిపోగా, లక్షలాదిమంది నిరాశ్రయులయ్యారు. Thank you @aamir_khan for your contribution of ₹25,00,000/- (₹25 lakh) towards #CMReliefFund #MaharashtraFloods ! — Devendra Fadnavis (@Dev_Fadnavis) August 20, 2019 -
అసెంబ్లీ ఎన్నికలు.. ఆ పార్టీకి కఠిన పరీక్షే..!
సాక్షి, ముంబై: ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల్లో ఘోర పరాజయంపాలైన కాంగ్రెస్ పార్టీకి.. మరో కఠిన పరీక్ష సవాలు విసురుతోంది. ఆ పార్టీకి కీలకమైన మహారాష్ట్రలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని కీలక నేతల రాజీనామాలతో హస్తం పార్టీ తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. సార్వత్రిక ఎన్నికల వైఫల్యం అనంతరం.. ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఆయనకు మద్దతుగా దేశ వ్యాప్తంగా పీసీసీలు, కీలక పదవుల్లో ఉన్న సీనియర్లు కూడా పదవులకు రాజీనామా చేశారు. ఈ పరిణామం పార్టీ శ్రేణులకు తీవ్ర నిరాశ కలిగిస్తోంది. ముఖ్యంగా ఏడాది చివరన అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న మహారాష్ట్రలో ఆ పార్టీ సీనియర్ నేత అశోక్ చవాన్ తన పదవికి రాజీనామా చేయడం.. మరికొంత మంది కీలక నేతలు పార్టీని వీడి అధికార బీజేపీలో చేరడం ఆ పార్టీ నేతలను తీవ్ర కలవరానికి గురిచేస్తోంది. దశాబ్దాల పాటు మహారాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో చక్రం తిప్పిన రాష్ట్ర ప్రతిపక్ష నేత రాధాకృష్ణ ఊకే పాటీల్ ఇటీవల బీజేపీ చేరి.. ఏకంగా మంత్రి పదవి దక్కించుకున్నారు. ఆయనతో పాటు పలువురు కీలక నేతలు కూడా ఆయన వెంట వెళ్లారు. లోక్సభ ఎన్నికల్లో సాధించిన విజయం స్ఫూర్తితోనే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా గెలుపొందాలని ఆపార్టీ కేంద్ర నాయకత్వం భావిస్తోంది. దీని కోసం కేంద్ర హోంశాఖ మంత్రి, ఆ పార్టీ అధ్యక్షడు అమిత్ షా ప్రత్యేక వ్యూహాలను రచిస్తున్నారు. కాంగ్రెస్, ఎన్సీపీకి చెందిన కీలక నేతలను బీజేపీలోకి ఆహ్వానించాలని రాష్ట్ర శాఖను షా ఆదేశించారు. లోక్సభ ఎన్నికల ఓటమితో కుదేలయిన ఆపార్టీని ఫిరాయింపులతో మరింత దెబ్బతీయాలని కమళ దళం భావిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల ముందు ఎన్సీపీ, కాంగ్రెస్ నుంచి సీనియర్ నేతలు తమ పార్టీలో చేరనున్నారని మంత్రి గిరీష్ మహజన్ ఇటీవల స్పష్టం చేశారు. దీనికి అనుగుణంగానే ఇతర పార్టీ నేతలతో మంతనాలు చేస్తున్నాట్లు ఆయన తెలిపారు. అలాగే కీలకమైన ఎన్నికల ముందు రాష్ట్రానికి కొత్త సారథిని నియమించాలని బీజేపీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా 48 లోక్సభ స్థానాలు గల మహారాష్ట్రలో బీజేపీ, శివసేన కూటమి 41 స్థానాల్లో గెలుపొందిన విషయం తెలిసిందే. ఎన్సీపీ 4 సీట్లను కైవసం చేసుకోగా.. కాంగ్రెస్ కేవలం ఒకే స్థానానికి పరిమితమైంది. ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని.. పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని అమిత్ షా ఇటీవల ప్రారంభించిన విషయం విధితమే. -
సీఎం ‘వికాస్ యాత్ర’.. మరి వారిది ఏ యాత్ర..!
ముంబై : సార్వత్రిక ఎన్నికల్లో ఎదురైన ఘోర పరాభవం నుంచి కాంగ్రెస్ బయటపడినట్టు లేదు. ఎన్నికల్లో పార్టీ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ రాజీనామా చేశారు. ఆయన బాటలోనే ముంబై కాంగ్రెస్ చీఫ్ మిలింద్ డియోరా, ఏఐసీసీ జనరల్ సెక్రటరీ జ్యోతిరాదిత్య సింధియా రాజీనామా చేశారు. ఇక ఎన్నికల ముందే రాజీనామా చేస్తానని బెదిరింపులకు దిగిన మహారాష్ట్ర కాంగ్రెస్ ప్రెసిడెంట్, మాజీ ముఖ్యమంత్రి అశోక్ చవాన్ కూడా అదే బాటలో నడిచారు. అయితే, లోక్సభ ఎన్నికల సమయంలో సీట్ల పంపకంలో తన మాట చెల్లుబాటు కావడం లేదనే అసహనంతో కాకుండా రాహుల్ రాజీనామా అనంతరం ఆయన పదవికి గుడ్బై చెప్పడం గమనార్హం. అయితే, ఈయేడు చివర్లో మహారాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరుగునున్న నేపథ్యంలో కాంగ్రెస్ నేతల వైఖరి బీజేపీకి మరింత బలం చేకూర్చేదిగా తయారైంది. బీజేపీని ఎదుర్కొంటుందా..! అంతర్గత కుమ్ములాటలతో కునారిల్లుతున్న మహారాష్ట్ర కాంగ్రెస్ లోక్సభ ఎన్నికల్లో తేలిపోయిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలోని 48 సీట్లలో కాంగ్రెస్ 1 చోట మాత్రమే విజయం సాధించగా ఎన్డీయే కూటమి 41 సీట్లను కైవసం చేసుకుంది. ఇక ఈయేడు చివరల్లో అసెంబ్లీ జరుగనుండటంతో అధికార బీజేపీ దూకుడు పెంచింది. సభ్యత్వ నమోదు ప్రక్రియకు శ్రీకారం చుట్టిన ఆ పార్టీ లక్ష్యం దిశగా దూసుకుపోతోంది. లోక్సభ ఎన్నికల విజయంతో ఆగిపోవద్దని, మరింత కష్టపడి పార్టీని వరుసగా రెండోసారి అధికారంలోకి తెద్దామని ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ‘వికాస్ యాత్ర’ పేరుతో ఆయన త్వరలో జిల్లాల్లో పర్యటించనున్నారు. మరోవైపు అటు జాతీయస్థాయిలో, ఇటు రాష్ట్రంలోనూ నాయకత్వ కొరతను ఎదుర్కొంటున్న కాంగ్రెస్ పరిస్థితి జిల్లాల్లో మరింత గందగోళంగా తయారైంది. మంత్రి పదవి ఇచ్చి లాగేసుకున్నారు.. ఇక రాష్ట్ర కాంగ్రెస్లో ప్రతిపక్ష నేతగా ఉన్న సీనియర్ లీడర్ రాధాకృష్ణ విఖే పాటిల్ను బీజేపీ లాగేసుకుంది. ఆయనకు మంత్రిపదవి కూడా కట్టబెట్టింది. బీజేపీలో చేరేందుకు కాంగ్రెస్ కీలక నేతలు క్యూ కట్టారని రాష్ట్ర మంత్రి గిరిష్ మహాజన్ వంతి నేతలు చెప్తుండటం గమనార్హం. మహారాష్ట్ర కాంగ్రెస్ ప్రెసిడెంట్గా మాజీమంత్రి బాలాసాహెబ్ థారోట్ బాధ్యతలు చేపట్టనున్నట్టు విశ్వసనీయవర్గాల సమాచారం. అయితే, చవాన్ రాజీనామామై పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకోలేనట్టు తెలుస్తోంది. కాంగ్రెస్తో పొత్తుకు ఎన్సీపీ సై..! అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్తో జట్టుకట్టేందుకు ఎన్సీపీ సిద్ధమైంది. ఈ విషయమై రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి మల్లిఖార్జున ఖర్గేతో చర్చలు జరుపేందుకు సుముఖంగా ఉంది. అయితే, సీట్ల పంపకానికి సంబంధించి కాంగ్రెస్ ఎవరిని రంగంలోకి దించుతుందో, జాతీయ, రాష్ట్ర స్థాయిలో నాయకుడు కరువైనవేళ ఏమేరకు బీజేపీతో ఢీకొంటుందో చూడాలి..!! -
రుణమాఫీ లిస్ట్లో ఓ ఎమ్మెల్యే పేరు!
సాక్షి, ముంబై : రైతుల రుణమాఫీ వ్యవహారం మహారాష్ట్రంలో రాజకీయంగా పెను కలకలం రేపుతున్న విషయం తెలిసిందే. రైతుల డిమాండ్ల కోసం సొంత నేత యశ్వంత్ సిన్హా దీక్ష చేపట్టడం, బీజేపీ ప్రభుత్వ తీరు నచ్చక మరో నేత ఎంపీ అయిన నానా పటోలే ఏకంగా పార్టీకి గుడ్బై చెప్పిన పరిస్థితులు బీజేపీ ప్రభుత్వానికి మరింత ఇబ్బందికరంగా మారాయి. తాజాగా ఈ అంశంపై అధికారులు ఎంత చిత్తశుద్ధితో తెలియజేసే ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. రుణమాఫీ రైతుల పేర్ల జాబితాలో శివ సేన ఎమ్మెల్యే ప్రకాశ్ అబిట్కర్ పేరు కనిపించటం మీడియాలో చర్చనీయాంశంగా మారింది. కొల్హాపూర్ సెంట్రల్ కో-ఆపరేటివ్ బ్యాంక్ తరపున ఆయన రుణం కోసం దరఖాస్తు చేసినట్లు.. ఆయనకు 25 వేల రూపాయలు మంజూరు అయినట్లు ఉంది. కరువు ప్రాంత రైతులకు అందించిన రుణమాఫీ కింద ఆయనకు రుణం కూడా రద్దు అయ్యింది. దీనిపై స్పందించిన కొల్హాపూర్ ఎమ్మెల్యే ప్రకాశ్ అబిట్కర్ తాను ఎలాంటి రుణానికి దరఖాస్తు చేసుకోలేదని చెప్పటం విశేషం.‘‘ఆ వార్త మీడియాలోనే చూసి నేను తెలుసుకున్నా. షాక్కు గురయ్యాను. నేను ఎక్కడా నా పేరును నమోదు చేసుకోలేదు. ఆ రుణమాఫీతో నాకు ఎలాంటి సంబంధం లేదు. దీనిపై విచారణ చేపట్టాలని సంబంధిత అధికారులను కోరాను’’ అని ఆయన చెప్పారు. కాగా, సుమారు 34 వేల కోట్ల రుణమాఫీ విషయంలో తప్పులు దొర్లిన మాట వాస్తవమేనని.. త్వరలో వాటిని సరిదిద్దుకుంటామని స్వయానా ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ ప్రకటన చేసిన మరుసటి రోజే ఈ అంశం వెలుగులోకి వచ్చింది. రుణమాఫీ వ్యవహారం అంతా ముఖ్యమంత్రి కార్యాలయం పరిధిలో ఉండటంతో ప్రతిపక్షాలు ఫడ్నవిస్పై మండిపడుతున్నాయి. శివ సేన ఎమ్మెల్యే ప్రకాశ్ అబిట్కర్ -
ప్రతికూల వాతావరణంతో వెనక్కి మళ్లిన సీఎం ఛాపర్
రాజ్కోట్: మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ప్రతికూల వాతావరణంలో చిక్కుకోవడంతో రెండు రాష్ట్రాల అధికారులు కలవరపాటుకు గురయ్యారు. రాజస్థాన్ లోని రాజ్ కోట్ విమానాశ్రయం నుంచి ప్రసిద్ధ ఆథ్యాత్మిక క్షేత్రం పరబ్ వావధికి హెలికాప్టర్ లో బయలుదేరారు. అయితే టేకాఫ్ అయిన తర్వాత సీఎం హెలికాప్టర్ కు ప్రతికూల వాతావరణం ఎదురు కావడంతో 15 నిమిషాలకే వెనక్కితిరిగి వచ్చేసింది. దీంతో అధికారులు కలవరపడ్డారు. మరో 20 నిమిషాల అనంతరం సీఎం ఫడ్నవిస్ అదే హెలికాప్టర్ లో గమ్యానికి సురక్షితంగా చేరుకున్నారు.