-
USA Presidential Elections 2024: తప్పుకోవాలంటూ బైడెన్పై ఒత్తిళ్లు
వాషింగ్టన్: అట్లాంటాలో టీవీలో ముఖాముఖి చర్చలో రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ధాటికి చేతులెత్తేసిన డెమొక్రటిక్ అభ్యర్థి, అధ్యక్షుడు జో బైడెన్పై సొంత పారీ్టలోనే వ్యతిరేకత ఎక్కువవుతోంది. 81 ఏళ్ల వయసున్న ఆయన అధ్యక్ష రేసు నుంచి తప్పుకోవాలని డిమాండ్లు పెరుగుతున్నాయి. ఆయన మాత్రం తాను తప్పుకునే ప్రసక్తే లేదని పునరుద్ఘాటించారు! ట్రంప్తో చర్చలో బైడెన్ పేలవ ప్రదర్శనను పలు మీడియా సంస్థలు సంపాదకీయాల్లో ఏకిపారేశాయి. సోషల్ మీడియాలో మీమ్స్కు కొదువే లేదు. ఈ విమర్శలపై బైడెన్ స్పందించారు. ‘‘బరాక్ ఒబామా మాదిరి ప్రత్యర్థిని నేను వాగ్ధాటితో ఇరుకున పెట్టలేకపోయిన మాట వాస్తవమే. దీనిపై నా మద్దతుదారులు, పారీ్టలోనూ కొంత అసంతృప్తి నెలకొందని తెలుసు. కానీ ట్రంప్పై మరింతగా పోరాడతా’ అని అన్నారు. డెమొక్రటిక్ ముఖ్యుల్లో పెరిగిన అసంతృప్తి ట్రంప్తో డిబేట్ తర్వాత బైడెన్ అభ్యరి్థత్వంపై చాలా మంది డెమొక్రటిక్ నేషనల్ కమిటీ(డీఎన్సీ) సభ్యుల్లో అసమ్మతి పెరిగింది. యువనేతకు అవకాశమిశ్వాలన్న డిమాండ్ తెరపైకి వస్తోంది. షికాగోలో ఆగస్ట్ 19న జరిగే డెలిగేట్ల భేటీలో దీనిపై కీలక నిర్ణయం తీసుకోవచ్చని పార్టీ వర్గాల కథనం. -
Presidential Debate: ట్రంప్ జోరు బైడెన్ బేజారు
అట్లాంటా: అమెరికా అధ్యక్ష ఎన్నికల రేసులో రిపబ్లికన్ అభ్యర్థి, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (78) దూకుడు పెంచారు. దేశాధ్యక్షుడు, డెమొక్రాట్ల అభ్యర్థి జో బైడెన్తో తొలి ప్రెసిడెన్షియల్ డిబేట్లో స్పష్టమైన ఆధిక్యం ప్రదర్శించారు. శుక్రవారం (భారత కాలమానం ప్రకారం) సీఎన్ఎన్ చానల్లో దాదాపు 90 నిమిషాల పాటు జరిగిన వాదనలో బైడెన్ సర్వశక్తులూ ఒడ్డారు. తన వయసుపై విమర్శలు, అధ్యక్ష బాధ్యతలను సజావుగా నిర్వర్తించడంపై అమెరికన్లలో నానాటికీ పెరుగుతున్న అనుమానాలను కొట్టిపారేసేందుకు అన్ని ప్రయత్నాలూ చేశారు. ట్రంప్ తనకంటే కేవలం మూడేళ్లే చిన్నవాడని పదేపదే చెప్పుకున్నారు. కానీ డిబేట్ పొడవునా బైడెన్ పదేపదే తడబడ్డారు. ప్రసంగం మధ్యలో ఉన్నట్టుండి మౌనాన్ని ఆశ్రయించారు. మాటల కోసం తడుముకున్నారు. తనలో తానే గొణుక్కుంటూ కన్పించారు. మాట్లాడుతున్న అంశాన్ని అర్ధంతరంగా వదిలేసి మరో విషయం ఎత్తుకుని ఆశ్చర్యపరిచారు. కొన్నిసార్లు బైడెన్ ఏం చెప్తున్నదీ ఎవరికీ అర్థం కూడా కాలేదు. పలు అంశాలపై ట్రంప్ పచ్చి అబద్ధాలు చెప్పినా వాటిని ఎత్తిచూపడంలో, సొమ్ము చేసుకోవడంలో ఆయన పూర్తిగా విఫలమయ్యారు. తనకు అనుకూలమైన గణాంకాలను సమయానుకూలంగా ప్రస్తావించడంలో కూడా చతికిలపడ్డారు. డిబేట్లో ట్రంపే నెగ్గారని సీఎన్ఎన్ పోలింగ్లో ఏకంగా 67 శాతం మంది ఓటర్లు పేర్కొన్నారు. బైడెన్కు 33 శాతం ఓట్లే లభించాయి. న్యూయార్క్ టైమ్స్ వంటి ప్రఖ్యాత వార్తా పత్రికలు కూడా తొలి డిబేట్ ట్రంప్దేనని పేర్కొన్నాయి. ‘‘బైడెన్పై వయోభారం కొట్టొచ్చినట్టు కని్పస్తోంది. ఆయన మాటతీరులోనూ అది స్పష్టంగా ప్రతిఫలించింది. ఆయన చెబుతున్న విషయాల్లో పొందికే లేకుండా పోయింది’’ అంటూ విమర్శలు గుప్పించాయి. దూకుడుకు మారుపేరైన ట్రంప్కు 81 ఏళ్ల బైడెన్ ఏ మేరకు పోటీ ఇవ్వగలరోనంటూ డెమొక్రాట్లలో ఇప్పటికే గట్టిగా ఉన్న అనుమానాలు కాస్తా తాజా డిబేట్ నేపథ్యంలో ఆందోళనగా మారాయి. వాదనలో బైడెన్ తొలుత కాస్త వెనకబడ్డారని ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ కూడా అంగీకరించారు. అయితే క్రమంగా పుంజుకుని సమర్థంగా ముగించారని చెప్పుకొచ్చారు. బైడెన్ భార్య జిల్ మాత్రం తన భర్త భలే బాగా మాట్లాడారంటూ ప్రశంసించారు! ‘‘ప్రతి ప్రశ్నకూ చక్కగా బదులిచ్చావు. అన్ని సమాధానాలూ తెలుసు నీకు!’’ అంటూ ఆయన్ను మెచ్చుకున్నారు. కానీ ఈ డిబేట్ నేపథ్యంలో బైడెన్ అధ్యక్ష రేసు నుంచి తప్పుకోవాలంటున్న వారి సంఖ్య డెమొక్రాట్లలో క్రమంగా పెరుగుతోంది. ట్రంప్, బైడెన్లను అధ్యక్ష అభ్యర్థులుగా ఇంకా లాంఛనంగా ప్రకటించాల్సి ఉంది. జూలై 15–18 మధ్య జరిగే సదస్సులో రిపబ్లికన్లు, ఆగస్టు 19న సదస్సులో డెమొక్రాట్లు తమ అభ్యర్థుల పేర్లను అధికారికంగా ప్రకటిస్తారు. అమెరికా అధ్యక్ష ఎన్నికలు నవంబర్ 5న జరగనున్నాయి. పరస్పర విమర్శల వర్షం... అమెరికా ఆర్థిక వ్యవస్థ, అబార్షన్ చట్టం, విదేశీ వ్యవహారాలు, వలసల వంటి పలు అంశాలపై ట్రంప్, బైడెన్ మధ్య వాడివేడి వాదనలు సాగాయి. ఆ క్రమంలో నేతలిద్దరూ తిట్ల పర్వానికి దిగారు. ‘‘నువ్వే అబద్ధాలకోరు. అమెరికా చరిత్రలోనే అత్యంత చెత్త ప్రెసిడెంట్ కూడా నువ్వే’’ అంటూ పరస్పరం దుయ్యబట్టుకున్నారు. పలు రకాల విమర్శలు చేసుకున్నారు. హష్ మనీ కేసు దోషి అంటూ ట్రంప్కు బైడెన్ చురకలు వేశారు. ‘‘జరిమానాలుగా నువ్వు ఎన్ని బిలియన్ డాలర్లు కట్టాలో గుర్తుందా? భార్య గర్భవతిగా ఉండగా నీలి చిత్రాల తారతో గడిపావు. నైతికత విషయంలో వీధుల్లో విచ్చలవిడిగా తిరిగే పిల్లి కంటే కూడా హీనం’’ అంటూ విమర్శల వర్షం కురిపించారు. బైడెన్తో పాటు ఆయన కుమారుడు హంటర్ కూడా క్రిమినలేనంటూ మాజీ అధ్యక్షుడు ట్రంప్ కూడా విరుచుకుపడ్డారు. అస్తవ్యస్తమైన వలసల విధానంతో దేశ భవితవ్యాన్నే బైడెన్ ప్రమాదంలోకి నెట్టారంటూ దుయ్యబట్టారు. డిబేట్ ఆరంభం నుంచే ట్రంప్ పై చేయి కనబరిచారు. ఆయనను ఇరుకున పెట్టేందుకు బైడెన్ చేసిన ప్రయత్నాలు పెద్దగా ఫలించలేదు. -
USA Presidential Elections 2024: బైడెన్, ట్రంప్ రె‘ఢీ’
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల సందర్భంగా ఇరు పారీ్టల అభ్యర్థులు వాదనలతో ఎదురెదురుగా బలాబలాలు తేల్చుకునే ‘చర్చల’ అంకానికి డెమొక్రటిక్ అభ్యర్థి జో బైడెన్, రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ తెరలేపారు. సీఎన్ఎన్ టీవీ ఛానల్లో జూన్ 27వ తేదీన, ఏబీసీ ఛానల్లో సెప్టెంబర్ పదో తేదీన ఈ డిబేట్లు ఉంటాయి. మూడు దశాబ్దాలుగా డిబేట్లు నిర్వహించే ‘కమిషన్ ఆన్ ప్రెసిడెన్షియల్ డిబేట్’ను కాదని ఈసారి మీడియాసంస్థల ఆధ్వర్యంలో టీవీ ఛానళ్లలో డిబేట్కు బైడెన్ ప్రచార బృందం ఓకే చెప్పింది. ‘‘అట్లాంటా స్టూడియోలో ఈ డిబేట్ను నిర్వహిస్తాం’ అని సీఎన్ఎన్ తెలిపింది. జనం మధ్యలో డిబేట్ జరిపితే బాగుంటుందని ట్రంప్ అన్నారు. -
US presidential election 2024: బైడెన్.. బైడెన్.. బై బై ఎందుకు చెప్పలేదు?
ఎస్.రాజమహేంద్రారెడ్డి: చట్టం తన పని తాను చేసుకుపోతున్నట్టే కాలమూ తన మానాన తాను పరిగెడుతూనే ఉంటుంది. ఎవరి కోసమూ ఆగదు. ఈ పరుగెత్తే కాలమే ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కాళ్లకు అడ్డం పడుతోంది. అయినా సరే, 80 ఏళ్ల బైడెన్ ఆగేదే లేదంటున్నారు. ‘అప్పుడేనా...!’ అంటూ మరో విడత అధ్యక్ష పదవికి సిద్ధమయ్యారు. 2024 అధ్యక్ష ఎన్నికల బరిలో డెమొక్రాట్ల అభ్యర్థిని తానేనని మొన్న మంగళవారం ఆయన అధికారకంగా ప్రకటించేశారు. ఎదురు పడేది టెంపరి డొనాల్డ్ ట్రంపే కదా, ఇంకోసారి ఓడించలేనా అన్నది ఆయన ధీమా. ‘ఆయనకు 76, నాకు 80... అంతే కదా’ అన్నది ఆయన ధైర్యం. అంతేగానీ, ఇక కొత్త తరానికి వదిలేద్దామన్న భావన మాత్రం ఇద్దరిలోనూ లేకపోవడం గమనార్హం. డొనాల్డ్ ట్రంప్ విషయంలో చట్టం, ప్రెసిడెంట్ బైడెన్ విషయంలో కాలం తమ మానాన తమ పని చేసుకుంటూ వెళ్లిపోతూనే ఉంటాయి. గిర్రున ఏడాది తిరిగేసరికి ఎన్నికల నగారా మోగుతుంది. గెలుపెవరిదో, ఓడేదెవరో మళ్లీ కాలమే చెబుతుంది... రెండో ప్రపంచ యుద్ధం భీకరంగా సాగుతున్న కాలంలో, అమెరికా ఆ యుద్ధ మైదానంలోకి దిగిన ఏడాదికి 1942లో బైడెన్ జన్మించారు. కాలచక్రం మరో 30 ఏళ్లు తిరిగేసరికి 1973లో తొలిసారి సెనేటర్ అయ్యారు. అప్పటికి వైట్హౌస్లో రిచర్డ్ నిక్సన్ కొలువుదీరి ఉన్నారు. అత్యంత పిన్న వయసు సెనేటర్గా చరిత్ర సృష్టించిన బైడెన్కు, 15 ఏళ్లు విరామం లేకుండా ఆ పదవిలో కొనసాగాక ‘నేనెందుకు శ్వేతసౌధంలో అడుగుపెట్టకూడదు?’ అన్న ఆలోచన వచ్చింది. 1988లో ఆ ముచ్చటా తీర్చుకుందామనుకున్నా పరిస్థితులు అనుకూలించలేదు. డెమొక్రాట్ల అధ్యక్ష అభ్యర్థి రేసులో ముందు వరుసలో నిలిచి ముచ్చటగా మూడు నెలలు ముమ్మరంగా ప్రచారం కూడా చేసుకున్నాక అనివార్యంగా, అర్ధంతరంగా వైదొలగాల్సి వచ్చింది. ఆ సమయానికి అమెరికా, సోవియట్ యూనియన్ మధ్య ప్రచ్ఛన్నయుద్ధం ఇంకా ముగియలేదు. ఇక్కడ సీన్ కట్ చేస్తే, 2020లో బైడెన్ 78 ఏళ్ల వయసులో వైట్హౌస్ మెట్లెక్కి అధ్యక్ష బాధ్యతలు చేపట్టారు. ఆ వయసులో అధ్యక్షుడు కావడం కూడా అమెరికా చరిత్రలో రికార్డే. తన రికార్డును తానే బద్దలు కొట్టేందుకు ఈ డెలావర్ పెద్దాయన బరిలో దిగుతున్నారు. గెలిచి తీరతానన్న ఆత్మవిశ్వాసమే ఆయనను ముందుకు నడిపిస్తోంది. ఈ ధీమా వెనక పలు కారణాలున్నాయి. మళ్లీ ట్రంపే ప్రత్యర్థి అవుతారని... దూకుడుకు కాసింత దుందుడుకుతనం కలిపితే డొనాల్డ్ ట్రంప్. అదే ఆయన స్వభావం. అదే ఆయన పెట్టుబడి కూడా. ఒకసారి తన చేతిలో ఓడిన ఈ ట్రంపే ఈసారి కూడా తన రిపబ్లికన్ ప్రత్యర్థి అని బైడెన్ ఫిక్సయిపోయారు. రిపబ్లికన్ పార్టీ తమ తుది అభ్యర్థిని ఇంకా ప్రకటించకపోయినా, ట్రంప్కే చాన్స్ దక్కే సూచనలు పుష్కలంగా ఉన్నాయి. సౌత్ కరోలినా మాజీ గవర్నర్ నికీ హేలీ, టెక్ దిగ్గజం వివేక్ రామస్వామి, రేడియో హోస్ట్ లారీ ఎల్డర్, అర్కన్సాస్ మాజీ గవర్నర్ అసా హుచిన్సన్ ప్రధానంగా ఆయనతో పోటీ పడుతున్నారు. వీరిలో నికీ హేలీ నుంచే ట్రంప్కు కొంచెం గట్టి పోటీ ఎదురవ్వచ్చు. ట్రంప్ను పక్కకు నెట్టి బరిలోకి దిగుతాడనుకున్న ఫ్లోరిడా గవర్నర్ రాన్ డిసాంటిస్ తన అభ్యర్థిత్వాన్ని ప్రకటించే యోచనలో ఉన్నట్టు లేరు. మొత్తమ్మీద బైడెన్ ప్రత్యర్థిగా ట్రంప్ దాదాపుగా ఖాయమైనట్టే. 2020 అధ్యక్ష ఎన్నికల్లో ఓడినా తానే గెలిచానని డాంబికాలు పలికి, కేపిటల్ హిల్పై దాడికి తన అభిమానులను, రిపబ్లికన్ పార్టీ కార్యకర్తలను ఉసిగొల్పడంతో ట్రంప్ గ్రాఫ్ దారుణంగా పడిపోయిందన్నది బైడెన్ అంచనా. అపప్రథ మూటగట్టుకున్న ట్రంప్ను ఓడించడం ఈసారి మరింత తేలికని ఆయన భావిస్తున్నారు. మీద పడుతున్న వయసును లెక్కచేయకుండా బైడెన్ ముందుకురకడానికి ఇదే ప్రధాన కారణం. పోర్న్ నటికి డబ్బుల చెల్లింపు విషయంలో ట్రంప్ను కోర్టు ముద్దాయిగా ప్రకటించడమూ తనకు లాభిస్తుందని ఆశపడుతున్నారు. అయితే ట్రంప్ను అన్యాయంగా ఈ కేసులో ఇరికించారని రిపబ్లికన్లలో చాలామంది నమ్ముతుండటంతో ఆ పార్టీ అధ్యక్ష అభ్యర్థిగా ఆయన అవకాశాలు మరింత మెరుగయ్యాయన్నది విశ్లేషకుల అంచనా. రిపబ్లికన్ పార్టీ మద్దతుదారుల్లో ట్రంప్ హవా కొనసాగుతున్నా ప్రజల్లో మాత్రం ఆయన పట్ల అసంతృప్తి పెరిగిందన్నది డెమొక్రాట్ల వాదన. 2018 నుంచీ ట్రంప్ పయనం ఓటమి బాటలోనే సాగుతుండటం గమనార్హం. 2018 మిడ్టర్మ్ ఎన్నికల్లో రిపబ్లికన్లు సెనేట్ను, హúజ్ను రెండింటినీ కోల్పోయారు. 2020లో అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ ఓటమి చవిచూశారు. 2022 మిడ్ టర్మ్ ఎన్నికల్లోనూ ట్రంప్ సారథ్యం వల్ల పార్టీ అనూహ్య పరాజయం చవిచూసింది. మొత్తమ్మీద రిపబ్లికన్లకు ట్రంప్ గుదిబండగా తయారవుతున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కోర్టు కేసులు ట్రంప్కు కొత్త ఊపిరిలూదినా ఆయనను ఓడించడం తనకొక్కడికే సాధ్య మని బైడెన్ నొక్కివక్కాణిస్తున్నారు. ఇప్పటికే ఒకసారి ఓడించి చూపించానని పదేపదే చెబుతున్నారు. వయసుదేముంది, అదో అంకె మాత్రమేనన్నది ఆయన భావన. వచ్చే ఏడాది బరిలో దిగే సమయానికి ట్రంప్కు 78 ఏళ్లొస్తాయి. తనకన్నా నాలుగేళ్లే చిన్న కదా అంటారు బైడెన్. ఒకవేళ అంచనాలన్నీ తారుమారై ట్రంప్కు రిపబ్లికన్ అభ్యర్థిత్వం దక్కకున్నా ఆయన స్వతంత్రుడిగా బరిలోకి దిగడం ఖాయం. రిపబ్లికన్ మద్దతుదార్ల ఓట్లు చీలడం తథ్యం. అదే జరిగితే బైడెన్ పని మరింత సులువవుతుంది. ఓటు ‘విచ్ఛి్చత్తి’ అబార్షన్ల (గర్భవిచ్ఛిత్తి) చట్టబద్ధత చెల్లదని రిపబ్లికన్స్ అనుకూల సుప్రీంకోర్టు తేల్చిచెప్పడం కూడా డెమొక్రాట్లకు రాజకీయంగా లాభించింది. అబార్షన్లు అనైతికమని రిపబ్లికన్లు బాహాటంగా ప్రచారం చేసి స్వేచ్ఛావాదులు, స్త్రీవాదుల ఆగ్రహానికి గురయ్యారు. తన దేహం మీద స్త్రీకే పూర్తి హక్కుంటుందని, అబార్షన్ చేయించుకోవాలా, వద్దా అన్నది ఆమె ఇష్టాయిష్టాల మీదే ఆధారపడి ఉంటుందనేది బైడెన్ టీమ్ వాదన. సనాతనవాదులు, మతవాదులకు ఇది రుచించకపోయినా ప్రజల్లో అధిక భాగం బైడెన్తో ఏకీభవించారు. ఈ పరిణామం వచ్చే అధ్యక్ష ఎన్నికల్లో తీవ్ర ప్రభావం చూపుతుంది. అబార్షన్ల చట్టబద్ధతను తిరస్కరిస్తూనే, ఆయా రాష్ట్రాలు తమ అభీష్టం మేరకు దాన్ని అమలు చేసే వెసులుబాటును సుప్రీంకోర్టు కల్పించడం గమనార్హం. అమెరికావ్యాప్తంగా ఈ తీర్పుకు అనుకూల, ప్రతికూల ప్రదర్శనలు మిన్నంటాయి. రిపబ్లికన్ పాలిత కాన్సాస్, కెంటకీ, మోంటానా రాష్ట్రాలు ఆగమేఘాల మీద అబార్షన్లపై ఉక్కుపాదం మోపాయి. డెమొక్రటిక్పాలిత కాలిఫోర్నియా, మిషిగన్, వెర్మోంట్ అబార్షన్ హక్కుల పరిరక్షణకు ప్రతినబూనాయి. ఈ పరిణామాలు ఓటర్లనూ రెండు వర్గాలుగా చీల్చాయి. సుప్రీం తీర్పు తర్వాత జరిగిన మిడ్ టర్మ్లో రిపబ్లికన్ల ఓటు బ్యాంకు చెల్లాచెదురు కావడానికి ఇదే ప్రధాన కారణమైంది. అబార్షన్ వ్యతిరేకతను రాజకీయ నినాదంగానే భావించిన రిపబ్లికన్ పార్టీ, ప్రజలు ఇంతగా ప్రభావితమవుతారని అంచనా వేయలేకపోయింది. పరోక్షంగా డెమొక్రాట్లకు అదనపు లాభం చేకూరింది. అబార్షన్లపై రిపబ్లికన్ల వైఖరే తన విజయానికి రెండో మెట్టు అవుతుందని బైడెన్ గట్టిగా నమ్ముతున్నారు. అనుకూల ఓటు పదిలం బైడెన్ విజయావకాశాలను ప్రభావితం చేసే పై రెండు అంశాలు ట్రంప్ వ్యతిరేక ఓటుతో ముడిపడి ఉన్నాయి. సగటు ఓటరును తమవైపు తిప్పుకునే మంచి పనులు కూడా బైడెన్ గత రెండేళ్లలో చాలానే చేశారు. అనుకూల ఓటు, కొత్త ఓటును పదిలం చేసుకోవడానికి ఇవి అండగా నిలుస్తాయి. ట్రంప్ పాలనలో అమెరికాను ఉక్కిరిబిక్కిరి చేసిన కరోనాను బైడెన్ సమర్థంగా అరికట్టి పార్టీలకతీతంగా ప్రజల మనన్నలు అందుకున్నారు. దిగుమతుల మీద ఆధారపడకుండా స్వదేశీ తయారీ ‘మేడిన్ అమెరికా’ భావానికి బహుళ ప్రచారం కల్పించారు. ఆ దిశగా మాన్యుఫాక్చరింగ్ యూనిట్ల స్థాపనకు బిల్లు తెచ్చారు. వైద్య చికిత్స ఖర్చులను తగ్గించడంతో పాటు ఉద్యోగ కల్పనకు చర్యలు తీసుకున్నారు. విదేశీ వ్యవహారాల్లోనూ చెప్పుకోదగ్గ ప్రగతి సాధించారు. నాటోకు వెన్నుదన్నుగా, ఉక్రెయిన్కు అండగా నిలిచి రష్యాను నిలువరించడం గమనించదగ్గవి. ప్రపంచంపై తన పెత్తనాన్ని నిలుపుకోవాలంటే చైనాపై ఓ కన్నేసి ఉంచాలనే సూక్ష్మాన్ని కూడా బైడెన్ గుర్తించడం విశేషం. వచ్చే ఎన్నికల్లో ఈ అంశాలన్నీ తనకు అనుకూలంగా ఓటుబ్యాంకును సుస్థిరం చేస్తాయనే నమ్మకమే బైడెన్ను ఎన్నికలవైపు నడిపిస్తోంది. కొస మెరుపు బైడెన్కు ఇన్ని అనుకూలతలున్నా ట్రంప్కు 2020 ఎన్నికల్లో 7.4 కోట్ల ఓట్లు వచ్చాయన్నది తోసిపుచ్చలేని అంశం. రిపబ్లికన్లు ట్రంప్ను పక్కన పెట్టి అనూహ్యంగా తమ తురుపు ముక్క డిసాంటిస్ను తెరపైకి తెస్తే మాత్రం బైడెన్ వయసు చర్చనీయాంశంగా మారుతుంది. అన్నీ మంచి శకునములేనని బైడెన్ భావిస్తున్నా ఆర్థిక నిర్వహణ వంటి వ్యవహారాల్లో ఆయన పనితీరుపై విశ్లేషకులు పెదవి విరుస్తున్నారు. వెక్కిరిస్తున్న ద్రవ్యోల్బణం వంటివాటిని ఉదాహరణగా చూపుతున్నారు. అనుకూల, ప్రతికూల పవనాలెలా ఉన్నా వయసు విషయంలో మాత్రం బైడెన్, ట్రంప్ దొందూ దొందే అన్నది తటస్థుల అభిప్రాయం. 2024 నవంబర్లో జరిగే ఎన్నికల్లోగా ఏమైనా జరగొచ్చు. చివరికి గెలుపు ఎవరినైనా వరించవచ్చు. ఇప్పటికైతే బైడెన్ ఆత్మవిశ్వాసాన్ని కొట్టిపారేయలేం. అయినా రాజకీయాల్లో వయసుతో పనేముంది? అధికారమే ముఖ్యం! బైడెన్కైనా, ట్రంప్కైనా లక్ష్యం అదే! ‘‘రాజకీయం ఒక రంగులలోకం అధికారమొక తీరని దాహం’’ -
అమెరికాలో ప్రారంభమైన ఎలక్టోరల్ ఓటింగ్
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలకు సంబంధించి మరో ప్రక్రియ ప్రారంభమైంది. మొత్తం 538 మంది ఎలక్టర్లు సోమవారం తమ తమ రాష్ట్రాల రాజధానుల్లో సమావేశమై అధ్యక్ష అభ్యర్థులకు ఓట్లు వేస్తున్నారు. మీడియా కథనాల ప్రకారం తుది సమాచారం అందేవరకు డెమొక్రట్ అభ్యర్థి బైడెన్కు 156, ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (రిపబ్లికన్ పార్టీ)కు 106 ఎలక్టోరల్ ఓట్లు వచ్చాయి. మొత్తం బ్యాలెట్లు డిసెంబర్ 23వ తేదీ నాటికి వాషింగ్టన్ చేరుకుంటాయి. జనవరి 6వ తేదీన అమెరికా పార్లమెంటు ఉభయసభలు సంయుక్తంగా సమావేశమై ఆ బ్యాలెట్లను లెక్కిస్తాయి. కొత్త అధ్యక్షుడిగా బైడెన్ ఎన్నిక లాంఛనమే. అమెరికాలో రాష్ట్రాల వారీగా ఎలక్టోరల్ ఓట్లు ఉంటాయన్న విషయం తెలి సిందే. -
జార్జియా రీకౌంటింగ్లో బైడెన్ గెలుపు
వాషింగ్టన్: రిపబ్లికన్లకు గట్టి పట్టున్న జార్జియా రాష్ట్రంలో జరిగిన ఎన్నికల రీకౌంటింగ్లో డెమొక్రాటిక్ జోబైడెనే గెలుపు సాధించారు. దీంతో 1992 తర్వాత ఈ రాష్ట్రంలో గెలిచిన డెమొక్రాట్ అభ్యర్థిగా బైడెన్ నిలిచారు. ఇటీవల జరిగిన కౌంటింగ్లో ట్రంప్ కన్నా బైడెన్కు 14వేల ఓట్ల మెజార్టీ లభించింది. ఇరువురి మధ్య మెజార్టీ స్వల్పం కావడంతో ఇక్కడ బ్యాలెట్లను మాన్యువల్గా రీకౌంటింగ్ చేశారు. రీకౌంటింగ్లో బైడెన్కు 12,284 ఓట్ల మెజార్టీ లభించింది. రీకౌంటింగ్ కచ్చితత్వంతో జరిపామని జార్జియా స్టేట్ సెక్రటరీ బ్రాడ్రాఫెన్స్పెర్గర్ చెప్పారు. గత ఫలితాల్లో ఎలాంటి భారీ అవకతవకలు జరగలేదని ఆడిట్లో తేలినట్లు అధికారులు వెల్లడించారు. తమ ఎన్నికల అధికారుల కృషి కారణంగానే స్వల్పకాలంలో రీకౌంటింగ్ పూర్తయిందన్నారు. శుక్రవారం ఈ రీకౌంటింగ్ ఫలితాలన్నీ సర్టిఫై చేయవచ్చని అంచనా. ఈ గెలుపుతో బైడెన్కు జార్జియాలోని 16 ఎలక్ట్రోరల్ ఓట్లు లభిస్తాయి. దీంతో ఆయనకు వచ్చిన ఓట్లు 306కు చేరతాయి. 2016లో ట్రంప్ ఈ రాష్ట్రాన్ని హిల్లరీతో పోటీపడి గెలుచుకున్నారు. తాజా రీకౌంటింగ్పై ట్రంప్ లీగల్ అధికారులు స్పందిస్తూ ఇంకా సర్టిఫై కాకముందే మీడియా అత్యుత్సాహం ప్రదర్శిస్తోందన్నారు. న్యాయం జరిగేందుకున్న అన్ని లీగల్ మార్గాలను పరిశీలిస్తామన్నారు. మళ్లీ డబ్ల్యూహెచ్వోలో చేరతాం: బైడెన్ తమ ఆధ్వర్యంలో ప్రభుత్వం ఏర్పాటయ్యాక తిరిగి ప్రపంచ ఆరోగ్య సమాఖ్య(డబ్ల్యూహెచ్వో)లో చేరతామని అమెరికా ప్రెసిడెంట్ ఎలక్ట్ జోబైడెన్ స్పష్టం చేశారు. అయితే, డబ్ల్యూహెచ్వోలో సంస్కరణలు అవసరమన్నారు. చైనాతో సంబంధాలపై మాట్లాడుతూ ‘శిక్షించడంపై కన్నా నిబంధనలకు అనుగుణంగా నడుచుకోవాలని చైనాకు అవగాహన కల్పించడం ముఖ్యం’ అని చెప్పారు. ఇతర దేశాలతో కలిసి చైనాకు అవగాహన కలిగించేందుకు యత్నిస్తామని చెప్పారు. పారిస్ పర్యావరణ ఒప్పందంలో కూడా మరలా చేరతామన్నారు. అమెరికా–చైనా సంబంధాలు ట్రంప్ హయాంలో బాగా దెబ్బతిన్నాయి. -
అమెరికా ఎన్నికలు: ‘పెద్దన్న’ ఎవరో?!
అగ్రరాజ్యం అమెరికాలో మరికొద్ది గంటల్లో ఎన్నికలు!.. నాలుగేళ్ల అధ్యక్ష అనుభవంతో రిపబ్లికన్ల అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్.. ఒబామా హయాంలో ఉపాధ్యక్షుడు, 40 ఏళ్ల రాజకీయ అనుభవంతో డెమొక్రాట్ పార్టీ తరఫున జో బైడెన్ మధ్య పోరు హోరాహోరీగా సాగుతోంది! విజేత ఎవరో తెలిసేందుకు ఇంకా సమయమున్నా.. కొన్ని నెలలుగా దేశం మొత్తమ్మీద వేర్వేరు సంస్థలు నిర్వహిస్తున్న ఒపీనియన్ పోల్స్ గెలిచేదెవరో చూచాయగా చెప్పేస్తున్నాయి. ఒపీనియన్ పోల్స్ తారుమారైన చరిత్ర ఉన్న నేపథ్యంలో ఈనెల 3న జరిగే ఎన్నికలు ఉత్కంఠ రేపుతున్నాయి. ఒపీనియన్ పోల్స్లో ‘జై’డెన్ ఎన్నికల గడువు ముంచుకొస్తున్న నేపథ్యంలో అమెరికాలోని పలు సంస్థలు అభిప్రాయ సేకరణ చేపడుతున్నాయి. యూనివర్సిటీలు, ప్రైవేట్ సంస్థలు నిర్వహించిన ఈ పోల్స్ అన్నింటి సారాంశం రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి జో బైడెన్ గెలుపు వాకిట్లో ఉన్నారని!. అయితే ఎన్నికల ఫలితాలను కచ్చితంగా తేల్చేందుకు ఇవి పెద్దగా ఉపయోగపడవు. 2016లో హిల్లరీ క్లింటన్ దాదాపు అన్ని నేషనల్ ఒపీనియన్ పోల్స్లో కలిపి ట్రంప్ కంటే దాదాపు 30 లక్షల ఓట్లు అధికంగా సాధించినా అసలు ఎన్నికల్లో మాత్రం ఓటమి పాలయ్యారు. ఎలక్టోరల్ కాలేజీ వ్యవస్థ దీనికి కారణం. ఇక, అక్టోబర్ 29న మూడు సంస్థలు నిర్వహించిన ఒపీనియన్ పోల్స్ ప్రకారం కూడా జో బైడెన్దే పైచేయిగా తేలింది. ఇప్పటివరకు నిర్వహించిన అన్ని ఒపీనియన్ పోల్స్ సగటు తీసుకుంటే బైడెన్ (52%), ట్రంప్ (43%) మధ్య తొమ్మిది శాతం ఓట్ల అంతరం ఉంది. గత ఎన్నికల్లో ఈ అంతరం ఒకట్రెండు శాతానికి మించలేదు. ఈ రాష్ట్రాలు ఎటు మొగ్గితే వారే విజేత! అమెరికా ఎన్నికల్లో ఎవరికి ఎన్ని ఓట్లు పడ్డాయన్నది కాకుండా.. ఎవరికి ఎన్ని ఓట్లు ఏయే రాష్ట్రాల్లో పడ్డాయన్నదే కీలకం. ఉదాహరణకు 2016లో హిల్లరీ క్లింటన్కు పాపులర్ ఓట్లు ఎక్కువగా పోలైనా ఎలక్టోరల్ కాలేజీ ఓట్లు తక్కువగా పడ్డాయి. ట్రంప్కు 303 ఎలక్టోరల్ కాలేజీ ఓట్లు పడటంతో విజేతగా నిలిచారు. సంప్రదాయకంగా అమెరికన్ రాష్ట్రాల్లో ఓటింగ్ సరళి దాదాపుగా ఒకేలా ఉంటుంది. మొత్తం 50 రాష్ట్రాల్లో రిపబ్లికన్లకు కొన్ని, డెమొక్రాట్లకు మాత్రమే ఓటేసే రాష్ట్రాలు కొన్ని ఉంటాయి. వీటిని మినహాయిస్తే మిగిలిన కొన్ని రాష్ట్రాలు ఒక్కోసారి ఒక్కోలా స్పందిస్తుంటాయి. ఈ బ్యాటిల్ గ్రౌండ్ రాష్ట్రాలే అధ్యక్ష ఎన్నికల విజేతను నిర్ణయిస్తుంటాయి. 2020 ఎన్నికల విషయా నికొస్తే.. ఈసారి 38 ఎలక్టోరల్ కాలేజీ ఓట్లున్న టెక్సాస్ బ్యాటిల్గ్రౌండ్ రాష్ట్రాల్లో అతి పెద్దది. కేవ లం 4 ఎలక్టోరల్ కాలేజీ ఓట్లు ఉన్న న్యూహ్యాంప్షైర్ అతిచిన్నది. అమెరికా మొత్తమ్మీద 538 ఎలక్టోరల్ ఓట్లు అందుబాటులో ఉండగా, 270 ఓట్లు సాధించిన పార్టీ అభ్యర్థి విజయం సాధిస్తాడు. బ్యాటిల్ గ్రౌండ్ రాష్ట్రాల్లో జరిగిన ఒపీనియన్ పోల్స్ ప్రకారం జో బైడెన్ అధ్యక్షుడు ట్రంప్ కంటే ఆధిక్యంలో ఉన్నారు. హాట్హాట్గా డిబేట్ అమెరికా ఎన్నికల్లో ఒపీనియన్ పోల్స్, బ్యాటిల్గ్రౌండ్ రాష్ట్రాల పరిస్థితి ఎంత ముఖ్యమో.. అధ్యక్ష స్థానానికి పోటీచేస్తున్న అభ్యర్థుల ముఖాముఖి చర్చలూ అంతే ముఖ్యం. సెప్టెంబర్ 29న జరిగిన తొలి ముఖాముఖి చర్చపై సీబీఎస్ న్యూస్/యూగవ్ సంస్థలు బ్యాటిల్గ్రౌండ్ రాష్ట్రాల్లో సర్వే నిర్వహించాయి. టెలివిజన్ చానళ్లలో చర్చను వీక్షించిన వారిలో 48% మంది బైడెన్కు, 41% మంది ట్రంప్కు ఓటేశారు. సీఎన్ఎన్ ఆకస్మిక పోలింగ్లో బైడెన్ ఏకంగా 60 శాతం మంది మద్దతు కూడగట్టగలిగారు. అక్టోబర్ 22న జరిగిన మూడో డిబేట్పై సీఎన్ఎన్, యూగవ్ నిర్వహించిన పోల్లోనూ బైడెన్ వైపు ఎక్కువ మంది మొగ్గు చూపారు. శతాబ్దపు రికార్డు... ముందస్తు ఓటింగ్ అధ్యక్ష ఎన్నికలలో 2020 అక్టోబర్ 29వ తేదీ నాటికి అత్యధికంగా 8.63 కోట్ల మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇది ఈ శతాబ్దపు రికార్డుగా భావిస్తున్నారు. దేశమంతటా కోవిడ్ సమస్య ఉండటంతో ఓటర్లు ఎవరికి వారు వీలుని బట్టి ఓటు వేస్తున్నారు. ఓటర్లలో చైతన్యం పెరిగిందనీ, మొదటిసారి ఓటేస్తున్న యువత, ఓటు హక్కు కొత్తగా వచ్చిన విదేశీయులు కూడా ముందస్తు ఓటింగ్లో ఉత్సాహంగా పాల్గొంటున్నారని అంటున్నారు. దాదాపు దేశమంతా ముందస్తు ఓటింగ్ రికార్డు స్థాయిలో పెరిగింది. ముందస్తు ఓటర్లలో ఆఫ్రికన్ అమెరికన్ల సంఖ్య మామూలుగానే ఉందని తెలుస్తోంది. ముందుగానే ఓటు హక్కు వినియోగించుకున్న వారిలో 27 శాతం మంది కొత్త ఓటర్లని తేలింది. 2016లో 10% ముందస్తు ఓటు వేసిన ఈ వర్గం వారిలో ఇప్పటికి 9% మంది ఓటేశారు. మంగళవారం కూడా ఎక్కువ శాతం పోలింగ్ జరిగే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ట్రంప్ ర్యాలీలతో 30వేల మందికి కోవిడ్ డొనాల్డ్ ట్రంప్ జూన్ 20 నుంచి సెప్టెంబర్ 22 వరకు నిర్వహించిన ఎన్నికల ప్రచార కార్యక్రమాల ద్వారా 30 వేల మందికి పైగా కరోనా సోకిందని, వారిలో 700 మంది చనిపోయారని స్టాన్ఫోర్డ్ వర్సిటీ పరిశోధకులు తెలిపారు. ట్రంప్ ఎన్నికల ర్యాలీలలో పాల్గొన్న ప్రజలు వ్యాధుల రూపంలో, మరణాల రూపంలో తీవ్రంగా నష్టపోయినట్టు చెప్పారు. ‘ది ఎఫెక్ట్స్ ఆఫ్ లార్జ్ గ్రూప్ మీటింగ్స్ ఆన్ ది స్ప్రెడ్ ఆఫ్ కోవిడ్ 19 : ద కేస్ ఆఫ్ ట్రంప్ ర్యాలీస్’ పేరుతో స్టాన్ఫోర్డ్ వర్సిటీ ఈ అధ్యయనాన్ని నిర్వహించింది. భారీ సభల ద్వారా కోవిడ్ విజృంభించే ప్రమాదం ఉంటుందని, అధికారులు చేసిన హెచ్చరికలను, సిఫార్సులను తమ విశ్లేషణ బలపరుస్తోందని వారు తెలిపారు. ‘‘ట్రంప్ మీ గురించి పట్టించుకోడు. తన సొంత మద్దతుదారులనూ పట్టించుకోడు’’ అని డెమొక్రటిక్ అధ్యక్ష అభ్యర్థి జో బైడెన్ ఈ అధ్యయనంపై స్పందిస్తూ ట్వీట్ చేశారు. మాస్కులు ధరించకుండా, భౌతిక దూరం పాటించకుండా హాజరయ్యే వ్యక్తిగత సభలు కోవిడ్ వ్యాప్తికి అవకాశం కల్పిస్తాయని ది సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) సూచించింది. -
భారత్తో భాగస్వామ్యాన్ని గౌరవిస్తున్నాం
వాషింగ్టన్: భారత్లో వాయు కాలుష్యంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలను మాజీ ఉపాధ్యక్షుడు, డెమొక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి జో బైడెన్ తప్పుపట్టారు. తాను, తమ ఉపాధ్యక్ష అభ్యర్థి కమలా హారిస్ భారత్తో అమెరికా భాగస్వామ్యానికి అత్యధిక విలువ ఇస్తున్నామని, ఎంతగానో గౌరవిస్తున్నామని పేర్కొన్నారు. తమ విదేశాంగ విధానంలో అమెరికా–భారత్ సంబంధాలకు అత్యంత ప్రాధాన్యం ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ మేరకు ఆయన శనివారం ట్వీట్ చేశారు. ఒబామా–బైడెన్ హయాంలో ఇరు దేశాల మధ్య సంబంధాలు మెరుగుపడ్డాయని గుర్తుచేశారు. బైడెన్–కమలా హారిస్ హయాంలో ఈ సంబంధాలను మరింత ఉన్నత స్థాయికి చేరుస్తామని స్పష్టం చేశారు. ఇండియా ఒక మురికి దేశమని ట్రంప్ విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. వాతావరణ మార్పులు మానవాళికి పెను సవాళ్లు విసురుతున్నాయని, ఆ సమస్యను పరిష్కరించడంపై దృష్టి పెట్టకుండా మిత్రుల గురించి చెడుగా మాట్లాడడం మంచిది కాదని బైడెన్ హితవు పలికారు. చైనా, ఇండియా, రష్యా దేశాలు వాయు కాలుష్యానికి కారణమవుతున్నాయని గురువారం అధ్యక్ష అభ్యర్థుల సంవాదంలో ట్రంప్ ఆరోపించిన సంగతి తెలిసిందే. -
ట్రెండింగ్లో ‘మై నేమ్ ఈజ్’
వాషింగ్టన్: డెమొక్రాటిక్ ఉపాధ్యక్ష అభ్యర్ధి కమలాహారిస్ పేరును రిపబ్లికన్ సెనేటర్ తప్పుగా పలకడం ఆమె మద్దతుదారులకు ఆగ్రహం తెప్పించింది. ఇందుకు నిరసనగా బైడెన్ బృంద ఏసియన్ అమెరికన్ పసిఫిక్ ఐలాండర్ కోఆర్డినేటర్ అమిత్ జాని ఆరంభించిన ‘‘మై నేమ్ ఈజ్..’’ క్యాంపైన్ ట్రెండింగ్లో నిలిచింది. జార్జియాకు చెందిన రిపబ్లికన్ సెనేటర్ డేవిడ్ పెర్డ్యూ ఇటీవల ఒక ర్యాలీలో కమలా హారిస్ పేరును వ్యంగంగా ఉచ్ఛరించారు. ‘‘ఖ మ లా? ఖ మ్మ లా? కమలా మలా మాలా? ఏమో నాకు తెలీదు.. ఏదో ఒకటిలే’’ అని ఆయన ర్యాలీలో కమలా హారిస్ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు చెలరేగాయి. దీంతో పలువురు సోషల్ మీడియాలో తమ పేరు ఉత్పత్తి, అర్థాన్ని వివరిస్తూ పోస్టులు పెట్టడం ఆరంభించారు. డేవిడ్ కావాలనే కమలా పేరును అలా పలికారని, నాలుగేళ్లు తనతో పనిచేసిన తోటి సెనేటర్ పేరును గుర్తుంచుకోలేరా? అని కమలా మద్దతుదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఈ #MyN్చఝ్ఛఐటహ్యాష్ట్యాగ్తో పోస్టులు ట్రెండ్ అవుతున్నాయి. పలువురు సెలబ్రెటీలు కూడా ఈ హ్యాష్ట్యాగ్తో పోస్టులు చేశారు. డేవిడ్ సమర్థకులు మాత్రం ఈ ఆగ్రహాన్ని తేలిగ్గా తీసుకుంటున్నారు. సెనేటర్ డేవిడ్ తెలీక కమలా పేరును తప్పుగా పలికారని, ఇందులో ఎలాంటి దురర్ధం లేదని ఆయన మద్దతుదారులు చెబుతున్నారు. గతంలోకూడా కమలా పేరును కొందరు కావాలని తప్పుగా పలకడం గమనార్హం. -
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో హోరాహోరీ
వాషింగ్టన్: కరోనా వైరస్కి వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుంది? ఈ మహమ్మారి పీడ ఎప్పటికి విరగడ అవుతుంది? ఈ ప్ర«శ్నలతో పాటు ప్రపంచవ్యాప్తంగా మరో ప్రశ్న అందరినీ వేధిస్తోంది. అదే ప్రపంచానికి పెద్దన్న ఎవరు కాబోతున్నారు? అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలుపెవరిది? రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్, డెమొక్రాట్ల అభ్యర్థి జో బైడెన్ మధ్య హోరాహోరీ పోరు సాగుతోంది. దీంతో స్వింగ్ స్టేట్స్ ఎటువైపు మొగ్గు చూపిస్తాయన్నది కీలకంగా మారింది. నవంబర్ 3న జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికల పైనే అందరి దృష్టి నెలకొని ఉంది. ఎన్నికల ప్రచారం జోరందుకున్న నేపథ్యంలో స్వింగ్ స్టేట్స్ (ఆఖరి నిమిషం వరకు ఏ పార్టీ వైపు ఉంటారో అంచనా వేయలేని రాష్ట్రాలు) ఎటు వైపు మొగ్గుతాయన్న ఉత్కంఠ రేగుతోంది. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో జాతీయ స్థాయిలో ప్రజాదరణ ఓట్లు సాధించిన వారే పీఠాన్ని దక్కించుకుంటారని చెప్పలేం. గత ఎన్నికల్లో ట్రంప్ కంటే పాపులర్ ఓట్లు 30 లక్షలు అధికంగా హిల్లరీ క్లింటన్ సాధించినప్పటికీ ఎలక్టోరల్ కాలేజీ ఓట్లు ట్రంప్కి ఎక్కువ రావడంతో ఆయన అ«ధ్యక్ష పీఠాన్ని దక్కించుకున్నారు. నవంబర్ 3న జరిగే ఎన్నికల్లో ప్రజలు తమకు నచ్చిన అభ్యర్థి పార్టీకి ఓటు వేస్తారు. ఆ ఓటింగ్ రాష్ట్రాల స్థాయిలోనే ఉంటుంది. అక్కడ ఎన్నిౖకైన ప్రతినిధులంతా కలిసి అధ్యక్షుడిని ఎన్నుకుంటారు. దేశం మొత్తమ్మీద 50 రాష్ట్రాలు, డిస్ట్రిక్ట్ కొలంబియాలో జనాభా ప్రాతిపదికన ఎలక్టోరల్ కాలేజీ ఓట్లు ఉంటాయి. దేశవ్యాప్తంగా 538 ఎలక్టోరల్ కాలేజీ ఓట్లకిగాను 270 ఓట్లు సాధించిన వారే అధ్యక్షుడిగా ఎన్నికవుతారు. స్వింగ్ రాష్ట్రాలు ఇవే ఈసారి ఎన్నికల్లో మొత్తం 14 రాష్ట్రాల్లో ఎవరి వైపు ప్రజలు మొగ్గు చూపుతారో తెలీని పరిస్థితి నెలకొంది. ఇప్పటివరకు అమెరికా ఎన్నికల చరిత్రలో ఈ స్థాయిలో జనం నాడి తెలియకుండా ఎప్పుడూ లేదు. టెక్సాస్ (38 ఎలక్టోరల్ ఓట్లు), ఫ్లోరిడా (29 ), పెన్సిల్వేనియా (20), ఒహియో (18), మిషిగాన్ (16), జార్జియా (16 ), నార్త్ కరోలినా (15), వర్జీనియా (13), అరిజోనా (11), విస్కాన్సన్ (10), మిన్నెసోటా (10), నెవడా (6), అయోవా (6) న్యూ హ్యాంప్షైర్ (4) రాష్ట్రాల్లో ప్రతీ నెల జనం మూడ్ మారిపోతున్నట్టుగా సర్వేలు చెబుతున్నాయి. తాజా సర్వేల్లో జార్జియా, అయోవా, టెక్సాస్ రాష్ట్రాల్లో ట్రంప్కి మొగ్గు కనిపిస్తూ ఉంటే, మిగిలిన స్వింగ్ స్టేట్స్లో బైడెన్ దూసుకుపోయే అవకాశాలున్నట్టుగా రియల్ క్లియర్ పాలిటిక్స్ సర్వే అంచనా వేస్తోంది. టెక్సాస్, జార్జియా రాష్ట్రాలు ఎప్పుడూ రిపబ్లికన్ల వైపు ఉంటాయి. ఈసారి కూడా ట్రంప్వైపే ఉన్నప్పటికీ మొగ్గు చాలా స్వల్పంగా ఉందని అంచనా. అందుకే టెక్సాస్, జార్జియా రాష్ట్రాల్లో ఎలాగైనా పాగా వెయ్యాలని బైడెన్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఆ రాష్ట్రాల్లో ప్రచారం కోసం డాలర్ల వరద పారిస్తున్నారు. జాతీయ స్థాయిలో చూసుకుంటే ట్రంప్ కంటే బైడెన్కు 10 పాయింట్లు అధికంగా ఉన్నాయి. ఫ్లోరిడా ఫ్యాక్టర్ అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో 1964 నుంచి ఫ్లోరిడాలో నెగ్గిన వారికే అధ్యక్ష పదవి దక్కుతూ వస్తోంది. 1992 ఎన్నికలు మాత్రం దీనికి మినహాయింపుగా ఉన్నాయి. గత ఎన్నికల్లో ట్రంప్కి 48.6% ఓట్లు వస్తే, హిల్లరీకి 47.4% ఓట్లు వచ్చాయి. అంతకు ముందు ఎన్నికల్లో బరాక్ ఒబామా 51% ఓట్లను సాధించి అవలీలగా అధ్యక్ష పదవిని అందుకున్నారు. ఈ రాష్ట్రంలో ప్రజల ఆలోచనా ధోరణి వినూత్నంగా ఉంటుంది. యువ ఓటర్లు ఎక్కువ మంది ఉన్నారు. ఇక్కడ ఓటర్లు అధ్యక్ష అభ్యర్థుల మధ్య జరిగే డిబేట్లను విన్నాక ఓటుపై నిర్ణయం తీసుకుంటారు. ఎన్నికలకి ముందు మూడు సార్లు సెప్టెంబర్ 29, అక్టోబర్ 7, అక్టోబర్ 15న అధ్యక్ష అభ్యర్థుల మధ్య బిగ్ డిబేట్స్ జరుగుతాయి. ఈ డిబేట్స్లో ట్రంప్, బైడెన్ తాము అధికారంలోకి వస్తే ఏం చేస్తారో వివరిస్తారు. ఆ డిబేట్స్ తర్వాత పరిస్థితులన్నీ మారే అవకాశాలైతే ఉన్నాయి. ఈ డిబేట్స్లో ట్రంప్ నెగ్గుతారని 47% మంది అమెరికన్లు భావిస్తూ ఉంటే, బైడెన్ వైపు 41% మంది మాత్రమే ఉన్నారు. కరోనా ఎఫెక్ట్ ఈసారి ఎన్నికల్లో కరోనా వైరస్ నంబర్ గేమ్ని మార్చేస్తుందని అంచనాలున్నాయి. కరోనా కట్టడిలో ట్రంప్ వైఫల్యంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. అగ్రరాజ్యంలో ఎన్నికల నాటికి వైరస్ కారణంగా 2 లక్షల 60 వేల వరకు మరణాలు నమోదవుతాయని అంచనాలున్నాయి. ట్రంప్ చెబుతున్నట్టుగా అక్టోబర్ సర్ప్రైజ్ సాకారమై పోలింగ్ తేదీలోగా వ్యాక్సిన్ వస్తే ఆయనకి మళ్లీ అనుకూలంగా పరిస్థితులు మారే అవకాశాలున్నాయి. ఆర్థిక మాంద్యం, పెరిగిపోతున్న నిరుద్యోగం, జాతివివక్ష, వలసవిధానం, వాతావరణంలో మార్పులు వంటి అంశాలు కూడా ఎన్నికల్లో ప్రధాన అంశాలు కానున్నాయి. -
బైడెన్కు అధికారమిస్తే కలలన్నీ నాశనం: ట్రంప్
వాషింగ్టన్: డెమొక్రాటిక్ అధ్యక్ష అభ్యర్థి జో బైడెన్కు అధికారాన్ని అప్పగిస్తే అమెరికా కన్న కలలన్నీ సర్వనాశనం అవుతాయని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. అమెరికా గొప్పతనాన్ని నాశనం చేయడంతో పాటుగా ప్రజలకెవరికీ ఉద్యోగాలు ఉండవన్నారు. కరోనా సంక్షోభం నుంచి బయట పడడానికి ఈ ఏడాది చివరిలోగా వ్యాక్సిన్ తీసుకువస్తానని హామీ ఇచ్చారు. రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థిగా రెండోసారి నామినేషన్ను ఆమోదించిన సందర్భాన్ని పురస్కరించుకొని గురువా రం ట్రంప్ పార్టీ సదస్సులో మాట్లాడారు. అందరి చూపు మెలానియా,ఇవాంక పైనే సదస్సు వేదికపై మెలానియా ట్రంప్, ట్రంప్ మొదటి భార్య కుమార్తె ఇవాంకా ఒకరికొకరు ఎదురుపడిన వీడియో ఇంటర్నెట్లో హల్ చల్ చేస్తోంది. తన తండ్రిని అధ్యక్ష అభ్యర్థిగా పరిచయం చేసి వేదిక దిగి వస్తుండగా ఎదురపడిన మెలానియా ఇవాంకను చూసి చిరునవ్వుతో పలకరించారు. ఇవాంక కాస్త ముందుకు వెళ్లగానే మెలానియా ముఖంలో రంగులు మారాయి. -
చీకటి నుంచి వెలుగులోకి
వాషింగ్టన్: డొనాల్డ్ ట్రంప్ పరిపాలనలో అగ్రరాజ్యం అమెరికా చీకట్లో చిక్కుకుపోయిందని డెమొక్రటిక్ పార్టీ తరఫున అధ్యక్ష బరిలో ఉన్న జో బైడెన్ ఆరోపించారు. ఆ చీకట్లో నుంచి వెలుగు రేఖలోకి ప్రయాణించడానికి దేశ ప్రజలందరూ ఏకతాటిపైకి రావాలని అన్నారు. అమెరికాలో వెలుగులు నింపడానికి తన శక్తి మేర కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అధ్యక్ష అభ్యర్థిగా డెమొక్రట్ పార్టీ చేసిన నామినేషన్ను పార్టీ జాతీయ సదస్సు ముగింపు రోజైన గురువారం ఆయన ఆమోదించారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని 77 ఏళ్ల వయసున్న బైడెన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడుతూ అధ్యక్ష అభ్యర్థిగా నిల్చోవడం తనకు దక్కిన అత్యంత గౌరవమని అన్నారు. ‘‘అమెరికా చరిత్రలోనే ఇవి అత్యంత చీకటి రోజులు. సమాజం రెండుగా విడిపోయింది. ప్రజల్లో భయాందోళనలు పెరిగిపోతున్నాయి. నేను ఈ సందర్భంగా దేశ ప్రజలందరికీ ఒక మాట ఇస్తున్నాను. మీరు నాకు అధికారాన్ని అప్పగిస్తే నాలో అత్యుత్తమ పని తీరు మీరు చూస్తారు. నేనే ఒక కాంతి పుంజంలా మారి అమెరికా చీకట్లను పారదోలతాను’’అని అన్నారు. ‘‘యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలోనే యునైటెడ్ అన్న పదం ఉంది. మనం అందరమూ కలసికట్టుగా మన భవిష్యత్ కోసం, మన పిల్లల భవిష్యత్ కోసం, మనందరి ఉమ్మడి కలల్ని సాకారం చేసుకోవడం కోసం పాటుపడాలి’’అని బైడెన్ పిలుపునిచ్చారు. కరోనా మహమ్మారిని ఎదుర్కోవడంలో ప్రభుత్వం వైఫల్యంతో ఆర్థికంగా గ్రేట్ డిప్రెషన్ను మించిన సంక్షోభంలో పడిపోయామన్నారు. జాతి వివక్ష అంశంలో తిరిగి 1960లలోకి వెళ్లిపోయామన్న బైడెన్ వాతావరణంలో మార్పుల్ని కూడా సమర్థవంతంగా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలన్నారు. కమలా హ్యారిస్ అమెరికన్ జో బైడెన్ తన ప్రసంగంలో భారత సంతతి మహిళ, ఉపాధ్యక్ష అభ్యర్థి కమలా హ్యారిస్పై ప్రశంసలు కురిపించారు. ఆమెది అత్యంత శక్తిమంతమైన గళమని కొనియాడారు. భారతీయ, నల్లజాతి మూలాలున్నప్పటికీ కమల ఎప్పటికీ అమెరికనేనని అన్నారు. కమలా హ్యారిస్ తనని తాను అమెరికన్గా నిరూపించుకోవడానికి ఎన్నో అడ్డంకుల్ని అధిగమించారని చెప్పుకొచ్చారు ‘‘కమలా హ్యారిస్ కథ ఒక అమెరికన్ కథ. మన దేశంలో ఆమె ఎన్నో ముళ్ల బాటల్ని దాటుకుంటూ ఈ స్థాయికి ఎదిగారు. ఆమె ఒక మహిళ, నల్లజాతి మహిళ. దక్షిణాసియా అమెరికన్, వలసదారు.. ఇవన్నీ ఆమె ఎదుగుదలకు అడుగడుగునా అవరోధాలు కల్పించాయి. వాటన్నింటినీ దాటుకుంటూ అత్యంత శక్తిమంతంగా ఎదిగి ఈ స్థాయికి వచ్చారు’’అని బైడెన్ అన్నారు. అమెరికా ప్రజలకి హామీ ఇచ్చినట్టుగా అధ్యక్ష పదవిని అందుకోవడానికి తాను ఒక్కడే పోరాడనక్కర్లేదని, తన వెన్నంటి అతి గొప్ప ఉపాధ్యక్ష అభ్యర్థి ఉన్నారని కొనియాడారు. -
ఉపాధ్యక్ష అభ్యర్థిగా కమలా హ్యారిస్ నామినేట్
వాషింగ్టన్: భారత సంతతికి చెందిన కమలా హ్యారిస్ను అమెరికా ఉపాధ్యక్ష పదవికి డెమొక్రాట్ అభ్యర్థిగా పార్టీ నామినేట్ చేసింది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరుగుతున్న పార్టీ జాతీయ సదస్సులో బుధవారం ఆమె అ«భ్యర్థిత్వాన్ని అధికారికంగా ప్రకటించింది. ఈ సందర్భంగా కమలా హ్యారిస్ మాట్లాడుతూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నాయకత్వ వైఫల్యాల కారణంగా అమెరికా ప్రజలు తమ జీవితాల్నే పణంగా పెట్టారన్నారు. తాను భారత్, జమైకా వలసదారుల బిడ్డగా చెప్పుకున్నారు. అమ్మ పై నుంచి చూస్తూ ఉంటుంది తల్లి శ్యామలా గోపాలన్ చెప్పిన మాటల్నే ఆమె మళ్లీ తలచుకున్నారు. ‘‘ఇతరులకు సేవ చేస్తే మన జీవితానికి పరమార్థం వచ్చినట్టవుతుంది. ఇప్పుడు నాకు ఆ సేవ చేసే అవకాశం దక్కబోతోంది. ఇలాంటి సమయంలో అమ్మ నా దగ్గరే ఉండాలని కోరుకున్నాను. కానీ పై నుంచి అమ్మ అంతా చూస్తూ ఉంటుందని నాకు తెలుసు’’అని అన్నారు. ‘‘అమెరికా ఉపాధ్యక్ష అభ్యర్థిగా మీరు చేసిన నామినేషన్ను నేను ఆమోదిస్తున్నాను. బహుశా నేను ఈ స్థాయికి ఎదుగుతానని మా అమ్మ ఊహించి ఉండదు’’అని చెప్పారు. ‘‘నల్లజాతి మూలాలు, భారతీయ వారసత్వం కలిగినందుకు గర్వపడేలా అమ్మ పెంచారు ’’అని కమల చెప్పారు. -
హిందుత్వాన్ని నమ్మిన అమెరికన్
అన్నీ కలిసొస్తే ఆమె అగ్రదేశాధినేత అవుతారు.. అమెరికా తొలి మహిళా అధ్యక్షురాలవుతారు. అమెరికా పీఠం అధిష్టించిన తొలి క్రైస్తవేతర, తొలి హిందూ మహిళగా మన దేశానికి గర్వకారణం అవుతారు. ఆమే.. తులసీ గబార్డ్. 2020లో జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ను ఢీకొనేందుకు డెమోక్రటిక్ అభ్యర్థిగా బరిలో దిగనున్నట్టు 37 ఏళ్ల తులసి ప్రకటించడం తెలిసిందే. అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయనున్నట్టు మరికొందరు మహిళలూ ప్రకటించారు. అయితే వారితో పోలిస్తే తులసికి కొన్ని ప్లస్ పాయింట్లు ఉన్నాయి. పుట్టుకతో అమెరికన్ అయినా చిన్న వయసులోనే హిందూ మతం స్వీకరించి హిందుత్వాన్ని పాటిస్తున్నారు. ఇండియన్ అమెరికన్లలో ఆమెకు మంచి పేరు ఉంది. తులసి వరుసగా నాలుగోసారి అమెరికన్ కాంగ్రెస్కు ఎన్నికయ్యారు. కాంగ్రెస్కు ఎన్నికైన తొలి హిందూ మహిళ తులసి. హిందూ మహిళగానే చెప్పుకోవడానికి ఇష్టపడతారు. వరల్డ్ హిందూ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఉన్నారు. 21 ఏళ్ల వయసులోనే హవాయి ప్రతినిధుల సభకు ఎన్నికయిన తులసి రెండేళ్లు దాంట్లో కొనసాగారు. 2012లో అమెరికన్ కాంగ్రెస్కు ఎంపికయ్యారు. అమెరికా సైన్యంలో పని చేశారు. ఆరోగ్య సంరక్షణ, వాతావరణ మార్పు, నేర న్యాయవ్యవస్థలో సంస్కరణలపై తులసి ఎక్కువ శ్రద్ధ చూపుతారు. ప్రజా సమస్యల పట్ల మెరుగైన అవగాహన ఉంది. ఈ అనుకూలాంశాలతో మిగతా వారికంటే రేసులో ఆమె ఒకడుగు ముందుంది. నేటివిటీ సమస్య తులసికి నేటివిటీ పెద్ద సమస్య కావచ్చునని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. తులసి అమెరికా పౌరురాలే. అయితే ఆమె అమెరికా గడ్డమీద పుట్టలేదు. దక్షిణ పసిఫిక్ మహాసముద్రం లోని తుతులియా దీవిలో 1981లో పుట్టారు. తర్వాత ఆమె కుటుంబం హవాయికి వచ్చింది. అమెరికా ఇమ్మిగ్రేషన్ అండ్ నేషనాలిటీ చట్టం(ఐఎన్ఏ)ప్రకారం తుతులియా వంటి ప్రాంతాల్లో పుట్టినవారు అమెరికా జాతీయులే కాని పుట్టుక తో అమెరికన్లుగా పరిగణించబడరు. అమెరికా రాజ్యాంగం ప్రకారం అధ్యక్ష పదవికి పోటీ చేయాలంటే ఆ వ్యక్తి తప్పనిసరిగా ‘నేచురల్ బోర్న్ సిటిజన్’అయి ఉండాలి. అయితే, నేచురల్ బోర్న్ సిటిజన్ అంటే ఎవరో రాజ్యాంగం స్పష్టంగా నిర్వచించలేదు. సాధారణంగా పుట్టుకతో అమెరికా పౌరుడయిన వారిని నేచురల్ బోర్న్ సిటిజన్గా పరిగణిస్తుంటారు. తులసి తల్లిదండ్రులిద్దరూ అమెరికా పౌరులే. కాబట్టి చట్ట ప్రకారం తులసి అమెరికా పౌరురాలే అవుతుంది. అయితే అమెరికా బయట పుట్టినవారెవరూ ఇంతవరకు అధ్యక్ష పదవికి ఎన్నికవలేదు. -
హిల్లరీకి వ్యతిరేకంగా కథనాలు ప్రసారం చేయొద్దు
అమెరికా మాజీ సెక్రటరీ ఆఫ్ స్టేట్ హిల్లరీ క్లింటన్కు వ్యతిరేకంగా కథనాలు ప్రసారం చేయవద్దని దేశంలో ప్రముఖ న్యూస్ చానల్స్కు ద రిపబ్లికన్ పార్టీ మంగళవారం హెచ్చరించింది. యూఎస్లోని ప్రముఖ న్యూస్ చానల్స్ సీఎన్ఎన్, ఎన్బీసీలకు ఈ మేరకు ద రిపబ్లికన్ నేషనల్ కమిటీ చైర్మన్ రినిస్ ప్రిబస్ మంగళవారం లేఖ రాశారు. 2016లో అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఆమె ఆ దేశాధ్యక్ష పదవికి డెమెక్రటిక్ అభ్యర్థిగా బరిలో నిలవనున్నారు. వ్యతిరేక కథనాల వల్ల హిల్లరీ తీవ్రంగా కలత చెందే అవకాశాలున్నాయన్నారు. అలాగే ఆమెపై రూపొందించి ప్రసారం చేసే కథనాలపై అమెరికన్లు ఆ న్యూస్ చానల్స్ ప్రశ్నించే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. దానితోపాటు ఆ న్యూస్ చానల్స్ విశ్వసనీయత దెబ్బతినే ప్రమాదం ఉందన్నారు. కాగా అధ్యక్ష ఎన్నికల్లో భాగంగా జరిగే ప్రాధమిక చర్చల కథనాలను మాత్రం ప్రసారం చేయాలని ఆయా న్యూస్ చానల్స్కు సూచించారు. అయితే హిల్లరీపై చిన్న చిన్న కథనాలను రూపొందించి ప్రసారం చేయాలని ప్రణాళికలు సిద్ధం చేసినట్లు ఎన్బీసీ తెలిపింది. అలాగే ఆమెపై డాక్యుమెంటరీని నిర్మిస్తున్నట్లు సీఎన్ఎన్ పేర్కొంది. ఈ నేపథ్యంలో రినిస్ ప్రిబస్ ఆ న్యూస్ చానల్స్ ఈ హెచ్చరికలు జారీ చేశారు.