-
ఒక ఐడియా అతని జీవితాన్ని మార్చేసింది
ఒక ఐడియా అతని జీవితాన్ని మార్చేసిందంటూ.. మనం తరచుగా వింటుంటాం. ఇప్పుడు ఈ వార్త చదివితే అది నిజమేననిపిస్తుంది. కరోనా నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా హోటళ్లు, రెస్టారెంట్లు మూతపడ్డాయి. వాటిని నడిపే యజమానులు మరో పని దొరక్క దిక్కులేనివారుగా మిగిలిపోయారు. అయితే జపాన్కు చెందిన 41 ఏళ్ల మసనోరి సుగిరా మాత్రం కుంగిపోలేదు. హోటల్ బిజినెస్ నిర్వహించే సుగిరా స్వతహాగా మంచి బాడీ బిల్డర్. జపాన్లో కరోనా సంక్షోభం కాస్త తగ్గిన తర్వాత తన బుర్రకు పదును పెట్టాడు. బాడీ బిల్డర్స్తో ఫుడ్ డెలివరీ చేయించే అంశమై పరిశీలించాడు. అనుకుందే తడవుగా సుగిరా బాడీ బిల్డింగ్ చేసే సమయంలో ఫిట్నెస్ సెంటర్లో తనకు పరిచయమైన స్నేహితులకు విషయం చెప్పాడు. స్నేహితుడు కష్టాల్లో ఉన్నాడని భావించిన వారు ఫుడ్ డెలివరీ బాయ్స్గా పనిచేసేందుకు ముందుకు వచ్చారు. ఆ ఒక్క ఐడియా అతని జీవితాన్నే మార్చేసింది. బాడీ బిల్డర్స్తో ఫుడ్ డెలివరీ చేయిస్తూ వినియోగదారులను ఆకట్టుకుంది. సుగిరా హోటల్ వ్యాపారాన్ని తిరిగి గాడిన పడేలా చేసింది. (చదవండి :నువ్వు నిజంగా దేవుడివి సామి) ఇంతటితో ఇది ఆగిపోలేదు. వ్యపారాన్ని విస్తరించి ఫుడ్ డెలవరీకి మరింత మంది బాడీ బిల్డర్లను పనిలో పెట్టుకున్నాడు. ఫుడ్ ఆర్డర్ రాగానే ఈ బాడీబిల్డర్లు సూట్ ధరించి ఆహారం తీసుకెళ్తారు. వినియోగదారుడికి ఫుడ్ ఇచ్చి, వెంటనే సూట్ విప్పి దేహదారుఢ్య ప్రదర్శన చేస్తారు. 7వేల యెన్ల ఫుడ్ ఆర్డర్ చేసిన కస్టమర్కు మాత్రమే దేహదారుడ్య ప్రదర్శన అవకాశం కల్పించాడు. ఇదేదో కొత్తగా ఉందని భావించిన కస్టమర్లు ఈ హోటల్ నుంచే ఎక్కువగా ఆర్డర్స్ ఇస్తున్నారు. ప్రస్తుత సుగిరా నెలకు 1.5 మిలియన్ యెన్స్ (మన కరెన్సీలో రూ. 10 లక్షలకు పైగా) సంపాదిస్తున్నాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది.(చదవండి : అద్భుతం.. బ్లాక్ పాంథర్ను దించేశాడు) This sushi restaurant in Japan is using bodybuilders to deliver food to its customers https://t.co/sm7p9BVG5C pic.twitter.com/sIi5qLLSTj — Reuters (@Reuters) September 5, 2020 -
జొమాటో బాయ్స్ దేశ భక్తికి సెల్యూట్!
కోల్కతా : కొంతమంది జొమాటో ఫుడ్ డెలివరీ బాయ్స్ వినూత్నంగా తమ దేశ భక్తికి చాటుకున్నారు. పస్తులు ఉండి చస్తాం కానీ, చైనా పెట్టుబడులు ఉన్న కంపెనీలో పనిచేయమంటూ ఉద్యోగాలు వదులుకున్నారు. ఈ సంఘటన పశ్చిమ బెంగాల్లోని కోల్కతాలో శనివారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. లద్దాఖ్ గల్వాన్ లోయలో జరిగిన చైనా దాడిలో 20 మంది భారత సైనికులు మృతి చెందిన సంగతి తెలిసిందే. దీంతో దేశవ్యాప్తంగా చైనా వ్యతిరేక ఉద్యమాలు మొదలయ్యాయి. చైనా వస్తువులను బ్యాన్ చేయాలని, ఎవరూ వాడకూడదని ప్రముఖులు సైతం పిలుపునిస్తున్నారు. ఈ నేపథ్యంలో కోల్కతాకు చెందిన కొందరు జొమాటో బాయ్స్ అక్కడి బెహాలా వద్ద వినూత్నంగా నిరసనలు తెలియజేసి తమ దేశ భక్తిని చాటుకున్నారు. ( అమెరికన్ సంస్థతో జొమాటో ఒప్పందం..) నిరసన తెలుపుతున్న జొమాటో బాయ్స్ జొమాటో అధికారిక టీషర్టులను ఓ చోట కుప్పగా పోసి తగలబెట్టారు. అనంతరం జొమాటోలో చైనా పెట్టుబడులు ఉన్నాయని, దీని ద్వారా ఆహార పదార్థాలు ఆర్డర్ చేయవద్దని పిలుపునిచ్చారు. తమ ఉద్యోగాలను వదిలేస్తున్నట్లు తెలిపారు. చైనా.. భారత దేశం నుంచి ఆదాయం పొందుతూ దేశ సైనికులపై దాడి చేస్తోందని, భారత భూభాగాన్ని సొంతం చేసుకోవటానికి ప్రయత్నిస్తోందని.. అలా జరగకుండా చేయాలని అన్నారు. పస్తులు ఉండి చస్తాం కానీ, చైనా పెట్టుబడులు ఉన్న వాటిలో పనిచేయమని తేల్చిచెప్పారు. -
ఆన్లైన్ డెలివరీ ఉద్యోగులమని చెప్పి..
బెంగుళూరు : లాక్డౌన్ ముసుగులో కొందరు ఆన్లైన్ డెలివరీ పేరుతో తప్పుడు పనులు చేస్తున్నారు. తాజాగా ఆన్లైన్ డెలివరీ ఉద్యోగులమని చెప్పి సాండ్ బోవా అనే రెండు తలల పామును అమ్మేందుకు ప్రయత్నించిన ఇద్దరిని గురువారం బెంగుళూరు పోలీసులు అరెస్టు చేశారు. బెంగుళూరుకు చెందిన మహ్మద్ రిజ్వాన్, అజర్ ఖాన్లు జల్సాలకు అలవాటు పడ్డారు. ఈ క్రమంలో డంజో డెలివరీ సంస్థలో ఉద్యోగులుగా పని చేస్తున్నామని చెప్పి అంతరించిపోయే దశలో ఉన్న సాండ్ బోవా అనే రెండు తలల పామును విక్రయించేందుకు ప్రయత్నించారు.కొంతమందికి వీరు చేస్తున్న పనిపై అనుమానమొచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు. (లాక్డౌన్: యూపీలో తాత్కాలిక జైళ్లు) బెంగుళూరు జాయింట్ కమిషనర్ సందీప్ పాటిల్ మాట్లాడుతూ.. 'లాక్డౌన్ నేపథ్యంలో బెంగుళూరు నగరంలో డంజో డెలివరీ సంస్థ ఆన్లైన్ ద్వారా నిత్యావసరాలు సరఫరా చేస్తూ మంచి పేరు సంపాదించింది. అయితే వీరిద్దరు ఆ సంస్థ ఉద్యోగులమని చెప్పి రెండు తలల పామును అమ్మడానికి ప్రయత్నించారు. వన్యప్రాణి సంరక్షణ చట్టం కింద రిజ్వాన్, అజర్లపై కేసు నమోదు చేశామని' పాటిల్ తెలిపారు. కాగా అంతరించిపోయే దశలో ఉన్న సాండ్ బోవా( రెండు తలల పాము)ను ఇంట్లో పెట్టుకుంటే అదృష్టం కలిసొస్తుందట. -
అంతా మా ఇష్టం
నెల్లూరు(పొగతోట) : ఇంటింటికి వంట గ్యాస్ను డెలివరీ చేసే సిబ్బంది ఆగడాలకు అడ్డూ అదుపు లేకుండాపోతోంది. రవాణా చార్జీల పేరుతో డెలివరీ బాయ్స్ వినియోగదారుల నుంచి సిలిండర్పై అదనంగా రూ.50 వసూలు చేస్తున్నారు. సిలిండర్ ధర రూ.847లు ఉంటే రూ.900లు చార్జీ చేస్తున్నారు. ఇలా జిల్లా వ్యాప్తంగా నెలకు సుమారుగా రవాణా చార్జీల పేరుతో వినియోగదారుల నుంచి రూ.3 కోట్లు వరకు అక్రమ వసూళ్లు జరుగుతున్నట్లు సమాచారం. గ్యాస్ రవాణాకు సంబంధించి పైసా కూడా చెల్లించవద్దని నిబంధనలు ఉన్నా వాటిని అమలు చేయడం లేదు. ఈ విషయం అధికారులకు తెలిసినా పట్టీపట్టనట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. వినియోగదారులు ఎవరైనా అధికారులకు ఫిర్యాదు చేస్తే నామమాత్రపు చర్యలతో సరిపెడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. రవాణా చార్జీల పేరుతో గ్యాస్ ఏజెన్సీలు చేస్తున్న అక్రమ సంపాదనలో అధికారులకు కూడా వాటాలు అందుతున్నాయనే విమర్శలు ఉన్నాయి. అక్రమ వసూళ్లపై ఇంతవరకు ఒక్క కేసు కూడా నమోదు కాకపోవడం గమనార్హం. కొన్ని ఘటనలు.. ♦ జనార్ధన్రెడ్డికాలనీకి చెందిన మస్తాన్ వారం రోజుల కిందట గ్యాస్ బుక్ చేశాడు. ఈ నెల 18వ తేదీన గ్యాస్ డెలివరీ సిబ్బంది సిలిండర్ ఇచ్చాడు. స్లిప్పై రూ.847 నమోదు చేసి ఉంది. డెలివరీ బాయ్ మాత్రం రూ.900లు వసూలు చేశాడు. అదేమని మస్తాన్ ప్రశ్నిస్తే రవాణా చార్జీ అని సమాధానం చెప్పాడు. ♦ ములాపేటకు చెందిన వెంకటేశ్వర్లు గ్యాస్ బుక్ చేశాడు. ఈనెల 18వ తేదీన గ్యాస్ సిలిండర్ డెలివరీ ఇచ్చారు. సిలిండర్కు రూ.900లు వసూలు చేశారు. అదేమని ప్రశ్నిస్తే రవాణా చార్జీలని సమాధానం ఇచ్చారు. దూర ప్రాంతాలకు ఆటోలో గ్యాస్ సిలిండర్లు తీసుకురావాలి, పనిచేస్తున్న వారికి భోజనం పెట్టి రోజుకు రూ.300లు ఇవ్వాలని, దాని వలనే సిలిండర్పై రూ.50 వసూలు చేస్తున్నామని సమాధానం చెబుతున్నారు. జిల్లా వ్యాప్తంగా.. జిల్లా వ్యాప్తంగా 80కి పైగా గ్యాస్ ఏజెన్సీలు ఉన్నాయి. 8.90 లక్షలకు పైగా గ్యాస్ వినియోగదారులు ఉన్నారు. జిల్లా వ్యాప్తంగా రోజుకు 18 నుంచి 20 వేల సిలిండర్లు డెలివరీ జరుగుతోంది. నెలకు ఆరు లక్షలకు పైగా సిలిండర్లు వినియోగదారులకు అందజేస్తున్నారు. సిలిండర్కు రూ.50 చొప్పున రవాణా పేరుతో నెలకు రూ.3 కోట్లు అక్రమంగా వసూలు చేస్తున్నారు. గా>్యస్ సిలిండర్లు అధికంగా మహిళలే తీసుకుంటారు. స్లిప్పై ఎంత ఉంటుందో పరిశీలించరు. స్లిప్పై సంతకం పెట్టి గ్యాస్ డెలివరీకి వచ్చిన వారు ఎంత అడిగితే అంత ఇస్తున్నారు. తనిఖీలు లేకపోవడంతోనే.. జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారుల తనిఖీలు లేకపోవడంతో గ్యాస్ ఏజెన్సీలు ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తున్నారని వినియోగదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధిక వసూళ్లపై ఫిర్యాదు చేస్తే సిలిండర్లు సక్రమంగా ఇవ్వరని వినియోగదారులు భయపడుతున్నారు. 15 కిలోమీటర్ల లోపు వరకు సిలిండర్ డెలివరీ ఉచితంగా చేయాల్సి ఉంది. నెల్లూరు, కావలి, గూడూరు, నాయుడుపేట, సూళ్లూరుపేట, ఆత్మకూరు, ఉదయగిరి తదితర ప్రాంతాల్లో ఏజెన్సీలు రవాణా పేరుతో వినియోగదారుల నుంచి అధికంగా వసూళ్లు చేస్తున్నారు. రవాణా చార్జీలు చెల్లించనవసరం లేదు ప్రభుత్వ, ప్రైవేట్ ఏజెన్సీలు గ్యాస్ సిలిండర్ల డెలివరీకి సంబంధించి అదనపు వసూళ్లు చేయకూడదు. వినియోగదారుల స్లిప్పై ఎంత ధర ఉంటే అంత వరకు మాత్రమే ఇవ్వాలి. సిలిండర్లను ఉచితంగా రవాణా చేయవలసి ఉంది. అక్రమ వసూళ్లకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం.– బాలకృష్ణారావు, డీఎస్ఓ -
గ్యాస్ సిలిండర్పై ‘చిల్లర’ దోపిడీ
సాక్షి, కర్నూలు(సెంట్రల్) : నంద్యాలలోని ఓ గ్యాస్ ఏజెన్సీ బాయ్ సిలిండర్ను డెలివరీకి తెచ్చిన సమయంలో రూ.50 అదనంగా ఇవ్వాలని ఓ మహిళను అడిగాడు. ఎందుకివ్వాలని ఆమె ప్రశ్నించింది. కచ్చితంగా ఇవ్వాల్సిందేనని బాయ్ దబాయించాడు. విధిలేని పరిస్థితుల్లో ఆమె రూ.30 ఇచ్చి గ్యాస్ సిలిండర్ను తీసుకుంది. ఈ విషయాన్ని బాయ్ మనసులో పెట్టుకుని అక్టోబర్ ఒకటో తేదీన గ్యాస్ బుక్ చేసినా ఇప్పటి వరకు సిలిండర్ తీసుకురాలేదు. ఏజెన్సీ ఆఫీసుకు ఫోన్ చేస్తే ‘మీ గ్యాస్ నంబర్ మీద ఇంకా బిల్లింగ్ కాలేదు. రేపు వస్తుంది. గ్యాస్ డెలివరీ బాయ్తో ఎందుకు గొడవపడ్డారు. అతను అడిగిన డబ్బు ఇచ్చి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా?’ అంటూ ఫోన్ పెట్టేశారు. కర్నూలులోని ఓ ఏజెన్సీలో బుధవారపేటకు చెందిన మహిళ గ్యాస్ సిలిండర్ను బుక్ చేసి.. ఆన్లైన్లో బిల్లు చెల్లించింది. ఆ మరుసటి రోజు డెలివరీ బాయ్ సిలిండర్ తీసుకొచ్చాడు. ఆ మహిళ ముందుగానే బిల్లు చెల్లించి ఉండడంతో ఖాళీ సిలిండర్ను ఇంటి బయట పెట్టి ఆఫీసుకు వెళ్లిపోయింది. బాయ్ ఆమెకు ఫోన్ చేశాడు. మీరు రెండో అంతస్తులో ఉన్నారు కాబట్టి రూ.50 డెలివరీ చార్జీ ఇవ్వాలని అడిగాడు. మొత్తం బిల్లులోనే చెల్లించాను కదా అని ఆమె ప్రశ్నించింది. రూ.50 ఇస్తేనే సిలిండర్ను ఇక్కడ పెట్టిపోతా.. లేదంటే ఏజెన్సీకే వచ్చి తెచ్చుకోండంటూ వెనక్కి తీసుకెళ్లాడు. జిల్లాలో గ్యాస్ డెలివరీ బాయ్ల వ్యవహారం వినియోగదారులకు తలనొప్పిగా మారింది. డబ్బు ఇస్తేనే సిలిండర్లను డెలివరీ చేస్తున్నారు. ఉచితంగా దింపాల్సిన సిలిండర్కు ముక్కుపిండి కనీసం రూ.30 డెలివరీ చార్జీని అనధికారికంగా వసూలు చేస్తున్నారు. అపార్టుమెంట్లలో అంతస్తు పెరిగే కొద్దీ రేటు కూడా పెంచుతున్నారు. ఎవరైనా ఎందుకివ్వాలని ప్రశ్నిస్తే..వారికి వచ్చే నెలలో సిలిండర్ డెలివరీ చేయకుండా వేధిస్తున్నారు. ఇలా దోపిడీ చేసిన మొత్తంలో గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులకూ వాటా వెళుతోంది. ఈ వ్యవహారం తెలిసినా పౌర సరఫరాల శాఖ అధికారులు పట్టించుకోవడం లేదు. వినియోగదారులపై రూ.3.5 కోట్ల భారం జిల్లాలో 73 గ్యాస్ ఏజెన్సీలు ఉన్నాయి. వీటి పరిధిలో ఏడు లక్షలకు పైగానే గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. భారత్, హెచ్పీ, ఐఓసీ కంపెనీలు గ్యాస్ సిలిండర్లను సరఫరా చేస్తున్నాయి. నిబంధనల ప్రకారం వినియోగదారులకు సిలిండర్లను డెలివరీ చేసేందుకు ఏజెన్సీలే వాహనాలు, బాయ్స్ను అందుబాటులో ఉంచుకోవాలి. బాయ్స్కు వారే జీతాలివ్వాలి. అయితే ఏజెన్సీ నిర్వాహకులు ఇక్కడే ట్రిక్కు ప్లే చేస్తున్నారు. సొంతంగా ఆటోలున్న వారికి సిలిండర్ల డోర్ డెలివరీ బాధ్యతను అప్పగిస్తున్నారు. ఆటోకు బాడుగ గానీ, డెలివరీ బాయ్కు వేతనం గానీ చెల్లించరు. ఆటో యజమానే వినియోగదారుల నుంచి వసూలు చేసుకోవాలి. ఇదే అదనుగా వారు దోపిడీ చేస్తున్నారు. ఎక్కువ కనెక్షన్లు ఉన్న ఏజెన్సీలకు అయితే ఆటో యజమానులే ఎదురు చెల్లించి మరీ ఒప్పందం చేసుకుంటున్నారు. తర్వాత సిలిండర్పై రూ.30 నుంచి రూ.60 వరకు అదనంగా వసూలు చేసుకుని గిట్టుబాటు చేసుకుంటున్నారు. జిల్లాలోని వినియోగదారుల నుంచి నెలకు సగటున రూ.3.50 కోట్ల వరకు డెలివరీ బాయ్స్ దోపిడీ చేస్తున్నారు. పట్టించుకోని అధికారులు చిల్లర దోపిడీ గురించి పౌర సరఫరాల అధికారులు పట్టించుకోవడం లేదు. నెలవారీగా ఏజెన్సీ నిర్వాహకుల నుంచి మామూళ్లు తీసుకుని మిన్నకుండిపోతున్నట్లు ఆరోపణలున్నాయి. ఎక్కడైనా బాయ్స్ డెలివరీ కోసం డబ్బు వసూలు చేస్తే తమకు చెప్పాలని పేపర్లలో ప్రకటనలు ఇవ్వడం తప్పా ఎక్కడా డెలివరీ తీరును పరిశీలించడం లేదు. వారు కార్యాలయాలను వదిలి సిలిండర్ల డెలివరీ సమయంలో మెరుపు దాడులు నిర్వహిస్తే దోపిడీ బాగోతం బయటకు వస్తుంది. ఫిర్యాదులు వస్తే స్పందిస్తున్నాం గ్యాస్ సిలిండర్ డెలివరీ కోసం ఐదు కిలోమీటర్ల వరకు ఎలాంటి రుసుమూ వసూలు చేయరాదు. అలా చేస్తే మాకు ఫిర్యాదు చేయాలి. వచ్చిన ఫిర్యాదులపై తక్షణం స్పందిస్తున్నాం. 5 నుంచి 15 కిలోమీటర్ల వరకు సిలిండర్పై రూ.20, ఆపైన దూరం ఉంటే రూ.30 వసూలు చేయాలని ప్రభుత్వ నిబంధనలున్నాయి. వీటిని ఏజెన్సీలు విధిగా పాటించాలి. – పద్మశ్రీ, జిల్లా పౌరసరఫరాల అధికారి నిబంధనలు ఇవీ.. గ్యాస్ సిలిండర్ డెలివరీ కోసం ఐదు కిలోమీటర్ల వరకు ఎలాంటి రుసుమూ వసూలు చేయరాదు. 5 కిలోమీటర్ల నుంచి 15 కిలోమీటర్ల వరకు సిలిండర్పై రూ.20లు, 15 కిలోమీటర్లు దాటితే రూ.30 వసూలు చేయాలని ప్రభుత్వం నిబంధన విధించింది. అయితే ఎక్కడా ఈ నిబంధన అమలు కావడం లేదు. ఐదు కిలోమీటర్లలోపే సిలిండర్లు డెలివరీ అవుతున్నా..ఒక్కో దానిపై కనీసం రూ.30 డెలివరీ చార్జీ వసూలు చేస్తున్నారు. అదే అపార్టుమెంట్లలో అయితే అంతస్తుకు రూ.15 చొప్పున పెంచుకుంటూ పోతున్నారు. ఉదాహరణకు మొదటి అంతస్తులోకి సిలిండర్ డెలివరీ చేయాలంటే రూ.45, రెండో అంతస్తు అయితే రూ.60 అధికంగా వసూలు చేస్తున్నారు. -
జొమాటో, స్విగ్గీల్లో..ఇలా ‘వేటే’శారు..
సాక్షి, సిటీబ్యూరో: ‘అకస్మాత్తుగా కమీషన్లు తగ్గించేశారు. గతంలో ఇచ్చిన ప్రోత్సాహకాలు ఇప్పుడు ఇవ్వడం లేదు. ఆరు కిలోమీటర్లు దాటితే బోనస్ ఇచ్చేవారు. ఇప్పుడు అదీ లేదు. రాత్రింబవళ్లు కష్టపడ్డా రూ.700 కూడా దాటడం లేదు. రెండేళ్లు కష్టపడి పని చేశాను. ఇప్పుడు ఇంటి కిరాయి కూడా కట్టలేకపోతున్నాను. ఇంకేదైనా పని చేసుకోవాల్సిందే...’ స్విగ్గీ ఆన్లైన్ డెలివరీ బాయ్గా పని చేస్తున్న నరేష్ ఆవేదన ఇది. ఒక్క నరేషే కాదు. వేలాది మంది ఆన్లైన్ ఫుడ్ డెలివరీ బాయ్స్లోనూ ఇదే ఆవేదన గూడు కట్టుకొని ఉంది. ఒకప్పుడు నెలకు రూ.20 వేలకు పైగా సంపాదించిన వాళ్లు ఇప్పుడు రూ.12 వేల కంటే ఎక్కువ ఆర్జించలేకపోతున్నారు. ♦ తమ ఆకలి సంగతి మరిచిపోయి ఎంతోమంది వినియోగదారుల ఆకలి తీర్చే డెలీవరీ బాయ్స్ ఇప్పుడు కనీస వేతనాలను సైతం అందుకోలేకపోతున్నారు. కొంతకాలంగా ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సంస్థలు అనేక మార్పులు తెచ్చాయి. కమిషన్లలో కోత విధించాయి. ప్రోత్సాహకాలను తగ్గించాయి. దీంతో డెలివరీ బాయ్స్ ఆందోళనకు గురవుతున్నారు. జొమాటో, స్విగ్గీ, ఊబర్ ఈట్స్, ఫుడ్పాండా వంటి అన్ని ప్రధాన ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సంస్థల్లోనూ కమిషన్లను భారీగా తగ్గించి టార్గెట్లను పెంచారు. నిజానికి కొన్నేళ్లుగా ఆన్లైన్ ఫుడ్ ఆర్డర్ నగరవాసుల జీవన శైలిలో భాగమైంది. అన్ని వర్గాల ప్రజలు తమకు నచ్చిన ఆహారం కోసం ఆర్డర్లు ఇచ్చేస్తున్నారు. వినియోగదారుల నుంచి ఆర్డర్లు అందుకున్న డెలివరీ పసందైన రుచులతో క్షణాల్లో వాలిపోతున్నారు. చిన్న చిన్న హోటళ్లు మొదలుకొని అతి పెద్ద రెస్టారెంట్ల వరకు ఇప్పుడు ఆన్లైన్పైన ఆధారపడి ఉన్నాయి. కానీ డెలివరీ బాయ్స్ మాత్రం తమ ఆదాయాలను కోల్పోయి ఆందోళనకు గురవుతున్నారు. ఇలా ‘వేటే’శారు.... నగరంలో ఆన్లైన్ ఫుడ్ డెలవరీ యాప్లలో జొమాటో, స్విగ్గీ అగ్రస్థానంలో ఉన్నాయి. ప్రధాన యాప్ల ద్వారా ప్రతి నెలా సుమారు 15 లక్షలకు పైగా ఫుడ్ ఆర్డర్లు సరఫరా అవుతున్నట్లు అంచనా. 25 వేల మందికి పైగా ఈ రంగంలో పనిచేస్తున్నారు. ఇంకా వేలమంది నిరుద్యోగ యువకులు పార్ట్టైమ్ జాబ్గా దీనిని ఎంపిక చేసుకుంటున్నారు. ఇటీవల వరకు నిరుద్యోగులకు ఒక చక్కటి ఉపాధి మార్గంగా ఉన్న ఈ యాప్లలో ప్రస్తుతం కోతలు మొదలయ్యాయి. స్విగ్గీలో గతంలో ఒక ఆర్డర్పై రూ.35 చొప్పున కమీషన్ లభించింది. ఇప్పుడు కొత్తగా ఆ యాప్తో అనుంధానమయ్యే వారికి రూ.15 మాత్రమే చెల్లిస్తున్నారు. ఒక రోజుకు ఆర్డర్లపైన రూ.900 లభిస్తే మరో రూ.200 ఇన్సెంటివ్ ఇచ్చేవారు. ఇప్పుడు ఇన్సెంటివ్లలో కోత విధించారు. ‘మధ్యాహ్నం 12 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు పని చేస్తే 15 ఆర్డర్లు అందజేయగలుగుతున్నాం. ఒకప్పుడు రూ.1300 కు పైగా ఆదాయం వచ్చేది. ఇప్పుడు రూ.600 నుంచి రూ.700 దాటడడం లేదు.’’ అని ఆర్టీసీ క్రాస్రోడ్స్ నుంచి వివిధ ప్రాంతాలకు ఫుడ్ డెలివరీ చేస్తున్న భాస్కర్ విస్మయం వ్యక్తం చేశారు. నాలుగేళ్లుగా పని చేస్తున్న తనకు ఎప్పుడు ఇంత తక్కువ ఆదాయం లభించలేదని ఆందోళన వ్యక్తం చేశాడు. గతంలో 6 కిలోమీటర్లు దాటితే బోనస్ ఇచ్చేవారు. ఇప్పుడు ఆ బోనస్ నిలిపివేశారు. ‘ కమిషన్లను సగానికి తగ్గించిన విషయం తెలియక చాలామంది కొత్తగా వచ్చి చేరుతున్నారు. దీంతో పాత వాళ్లకు ఆర్డర్లు ఇవ్వకుండా కొత్త వాళ్లకే ఎక్కువగా ఇస్తున్నారు. ఇది చాలా అన్యాయం.’అని రాజు అనే డెలివరీ బాయ్ అభిప్రాయపడ్డారు. సైకిల్పై వస్తే తక్కువే.... మరోవైపు ఇటీవల జొమాటాలో బైక్లకు బదులు సైకిళ్ల పై వచ్చే డెలివరీబాయ్స్ను ప్రోత్సహిస్తున్నారు. గతంలో ఒక ఆర్డర్కు రూ.40 కమిషన్ ఇచ్చేవారు. ఇప్పుడు రూ.30 కి తగ్గించారు. పైగా సైకిల్పై డెలివరీ చేసేవాళ్లకు రూ.20 మాత్రమే ఇస్తున్నారు. 2 నెలల క్రితం వరకు రోజుకు 18 ఆర్డర్లపై కమిషన్లు, ప్రోత్సాహకాలు కలిపి రూ.1000 సంపాదించిన శివ ఇప్పుడు రూ.700 మాత్రమే పొందగలుగుతున్నాడు. ఎల్బీనగర్ కేంద్రంగా అతడు ఫుడ్ డెలివరీ చేస్తున్నాడు. కమిషన్లు, ప్రోత్సాహకాలు తగ్గడంతో డెలివరీ బాయ్స్ నగరంలో ఆందోళనకు దిగుతున్నారు. ఇటీవల కొండాపూర్, హైటెక్సిటీ, మాదాపూర్ ప్రాంతాల్లో డెలివరీని నిలిపివేసి సమ్మెకు దిగారు. కానీ సమ్మెకు ప్రోత్సహించారనే నెపంతో కొంతమంది ఐడీలను బ్లాక్ చేసినట్లు సమాచారం. ఆన్లైన్ ఫుడ్ వెరీగుడ్... నగరవాసి జీవితంలో ఆన్లైన్ ఫుడ్ ఒక భాగమైంది. బ్యాచ్లర్స్కు ఇది ఒక వరప్రదాయినిగా మారింది. ఉదయం లేచిన వెంటనే కావాల్సిన అల్పాహారం మొదలుకొని చికెన్, మటన్ బిర్యానీల వరకు ఆన్లైన్పై ఆర్డర్ చేయడం సాధారణమైంది. ఆహార సరఫరా సంస్థల గణాంకాల ప్రకారం ఉదయం అల్పాహార బుకింగ్లు ఎక్కువగా కార్యాలయాలకు ఉన్నాయి. గ్రేటర్ హైదరాబాద్లో ప్రతి నెలా ఆర్డర్లు సుమారు : 15 లక్షలు స్విగ్గీ, జొమాటా,తదితర యాప్ల డెలివరీ బాయ్లు : 25వేల మందికి పైగా గతంలో స్విగ్గీ నుంచి ఒక ఆర్డర్పై లభించిన కమిషన్ రూ.35. ఇప్పుడు రూ.15 జొమాటా నుంచి గతంలో లభించిన కమిషన్ రూ.40. ఇప్పుడు రూ.30 -
అప్పుడు జొమాటో..ఇప్పుడు మెక్డొనాల్డ్స్!
ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో తరహాలో ప్రస్తుతం మెక్డొనాల్డ్స్ కూడా నెటిజన్ల ఆగ్రహానికి గురవుతోంది. ‘మేము హాలాల్ మాంసం కూడా సరఫరా చేస్తాం’ అనే ట్యాగ్తో జొమాటో చేసిన ట్వీట్కి నెటిజన్ల నుంచి విమర్శల వర్షం వెల్లువెత్తిన విషయం తెలిసిందే. తాజాగా మెక్డొనాల్డ్స్ ఇండియాపై కూడా నెటిజన్లు విమర్శల వర్షం కురిపిస్తున్నారు. ‘మెక్డొనాల్డ్స్ ఇండియా హలాల్ సర్టిఫికెట్ ను కలిగి ఉందా’ అని ఓ కస్టమర్ అడిగిన ప్రశ్నకు బదులుగా.. భారతదేశంలోని వారి రెస్టారెంట్లన్నింటికీ హలాల్ సర్టిఫికెట్ ఉందని, వారు ఉపయోగించే మాంసం కూడా అత్యధిక నాణ్యతతో ఉంటుందని మెక్డొనాల్డ్స్ సమాధానం ఇచ్చింది. అంతేకాక వాటికి ప్రభుత్వ ఆమోదం పొందిన హేచ్ఎసీసీపీ(హజార్డ్ అనాలిసిస్ క్రిటికల్ కంట్రోల్ పాయింట్) సర్టిఫికేట్ కూడా ఉందని తెలిపింది. అదేవిధంగా ‘మా రెస్టారెంట్లన్నింటికీ హలాల్ సర్టిఫికెట్లు ఉన్నాయి. కావాలంటే సంబంధిత రెస్టారెంట్ యజమానులను ధృవీకరణ పత్రాన్ని చూపించమని అడిగి మీ సందేహన్ని తీర్చేకోవచ్చు’ అంటూ ట్విటర్ వేదికగా పేర్కొంది. ఈ క్రమంలో ముస్లిమేతర మెజారిటీ దేశంలో హలాల్ మాంసం విక్రయానికి ప్రాధాన్యత ఇస్తున్నారంటూ మెక్డొనాల్డ్స్ ఇండియాపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘బాయ్కాట్మెక్డొనాల్డ్స్’ అనే హ్యాష్ట్యాగ్తో నిరసన తెలియజేస్తున్నారు. ‘హిందువులు జాట్కా మాంసాన్ని మాత్రమే తింటారు, మన సంప్రదాయం కూడా అదే చెబుతోంది. ఇప్పటికైనా మీరు దీన్ని ఆపకుంటే మీ వద్ద మాంసాహర పదార్థాల విక్రయాన్ని తగ్గించాల్సి ఉంటుంది. అప్పడు మీరు భారీ నష్టాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది’ అని హెచ్చరిస్తూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. కాగా జూలై నెలలో జొమాటో ‘ఆహారానికి మతం లేదు’ అని ట్విటర్ పోస్ట్ చేసి అభాసుపాలైన విషయం తెలిసిందే. ఈ ట్వీట్పై స్పందించిన నెటిజన్లు.. ‘ఆహారానికి మతం లేనప్పడు మరెందుకని హలాల్ మాంసం అని ప్రత్యేకంగా ట్యాగ్ను చేర్చారు’ అంటూ విమర్శించారు. Thank you for taking the time to contact McDonald's India. We truly appreciate this opportunity to respond to your comments. The meat that we use, across our restaurants, is of the highest quality and is sourced from government-approved suppliers who are HACCP certified. (1/2) — McDonald's India (@mcdonaldsindia) August 22, 2019 -
డెలివరీ బాయ్ల సమ్మె : జొమాటో వివరణ
కోల్కతా : పశ్చిమ బెంగాల్లోని హౌరాలో జొమాటో డెలివరీబాయ్ల నిరసనల నేపథ్యంలో ఆన్లైన్ ఫుడ్ డెలివరీ దిగ్గజం వివరణ ఇచ్చింది. తమ మత విశ్వాసాలకు విరుద్ధంగా బీఫ్, ఫోర్క్ సరఫరా చేయబోమని డెలివరీబాయ్లు సోమవారం నుంచి సమ్మెకు పిలుపు ఇవ్వడంతో జొమాటో స్పందించింది. భారత్ వంటి వైవిధ్య దేశంలో వెజ్, నాన్వెజ్ ప్రాధామ్యాలుగా ఎంచుకుని డెలివరీ చేయడం సాధ్యం కాదని స్పష్టం చేసింది. పనిలోకి వచ్చే ముందే డెలివరీ ఎగ్జిక్యూటివ్లు తమ ఉద్యోగ స్వభావాన్ని అవగతం చేసుకుంటారని, తమ భాగస్వాములు అందరూ ఈ ప్రక్రియపై అవగాహన కలిగి ఉన్నారని పేర్కొంది. ‘ఈ ఉద్యోగం ఎలాంటిదో వారు అర్థం చేసుకోవాలి. భారత్లోని భిన్నత్వం ఇందులో ప్రతిబింబిస్తుంది. డెలివరీ చేయాల్సింది శాకాహారమా.. మాంసాహారమా అన్న విషయంలో తేడా చూపలేము. ఇది అర్థం చేసుకోవాలి’ అని స్పష్టం చేసింది. కాగా, తమ మత విశ్వాసాలకు విరుద్ధంగా ఉండే ఆహారాన్ని సరఫరా చేయబోమని చెబుతూ హిందూ, ముస్లిం ఫుడ్ డెలివరీబాయ్స్ అందరూ సోమవారం నుంచి సమ్మె చేపట్టాలని నిర్ణయించారు. తమ డిమాండ్లపై తాము ఇప్పటికే ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చినా ఇంతవరకూ వారి నుంచి ఎలాంటి స్పందనా రాలేదని వెల్లడించారు. ఇటీవల కొన్ని ముస్లిం రెస్టారెంట్లును ఆన్లైన్ ఫుడ్ డెలివరీ యాప్లో యాడ్ చేశారని, అయితే వీటి నుంచి బీఫ్ను సరఫరా చేసేందుకు కొందరు హిందూ డెలివరీ బాయ్లు నిరాకరిస్తున్నారని జొమాటో ఫుడ్ డెలివరీ ఉద్యోగి మౌసిన్ అఖ్తర్ చెప్పుకొచ్చారు. అయితే కొన్ని సందర్భాల్లో తాము పందిమాంసం డెలివరీ చేయాల్సి వస్తోందని ముస్లిం డెలివరీ బాయ్స్ వీటిని డెలివరీ చేసేందుకు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. మరోవైపు వేతన, చెల్లింపుల సమస్యలపై కూడా తాము అసంతృప్తిగా ఉన్నామని పేర్కొన్నారు. -
డెలివరీ బాయ్స్పై పోలీసుల సీరియస్
సాక్షి, ముంబై: ఇళ్లకు, కార్యాలయాలకు వేడివేడి ఫుడ్ సరఫరా చేస్తున్న ప్రముఖ స్విగ్గీ, జొమాటో కంపెనీ యాజమాన్యాలకు నోటీసులు జారీచేయాలని ట్రాఫిక్ శాఖ భావిస్తోంది. ఇందులో పనిచేసే డెలివరీ బాయ్లు తమ ప్రాణాలను ఫణంగా పెడుతూట్రాఫిక్ నియమాలు ఉల్లంఘిస్తూ ద్విచక్ర వాహనాలపై దూసుకెళుతున్నారు. దీంతో వారిని నియంత్రించాలని హెచ్చరిస్తూ నోటీసులు జారీ చేయనుంది. డెలివరీ తొందరగా ఇవ్వడానికి.. నేటి ఆధునిక యుగంలో బయట ఫుడ్కు చాలా మంది అలవాటు పడ్డారు. డబ్బుకు విలువలేకుండా పోయింది. ఉద్యోగం చేసే దంపతులతోపాటు ఇళ్లలో ఉండే సామాన్య ప్రజలు కూడా రెడీమేడ్ ఫుడ్కు ఆకర్షితులయ్యారు. డోమినోజ్ ఫిజ్జా,పాశ్చత్యదేశాల ఫుడ్పై కూడా మోజు పెంచుకున్నారు. కేవలం ఫోన్ చేస్తే చాలు కొద్ది నిమిషాల్లోనే ఇంటి గుమ్మం ముందుకు తము ఆర్డర్ చేసిన ఫుడ్ ప్రత్యక్షమైతుంది. ఇలాంటి వారికి తినుబండారాలు సరఫరా చేసే స్విగ్గి, జోమేటో కంపెనీలునగరంలో అక్కడక్కడ తమ బ్రాంచ్లు తెరిచాయి. కానీ, అందులో పనిచేస్తున్న డెలీవరి బాయ్లు పనితీరు సక్రమంగా లేదు. అడ్డగోలుగా బైక్లు వేగంగా నడుపుతున్నారు. డబ్బు సంపాదించడమే లక్ష్యంగా పెట్టుకున్న ఈ బాయ్లు తొందరగా డెలీవరి చేసి మరో ఆర్డర్ దక్కించుకోవాలనే తపనతో ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘిస్తున్నారు. ట్రాఫిక్ పోలీసులు బైక్లను ఆపే ప్రయత్నం చేసినా తప్పించుకు పారిపోతున్నారు. వీరి ప్రాణాలకు రక్షణ లేకపోవడమేగాకుండా ఇతరుల ప్రాణాలకు హాని కలిగించే ఆస్కారముంది. దీంతో డెలీబాయ్లకు మార్గదర్శనం చేయాలని లేదంటే వారిపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరిస్తూ నోటీసులు జారీ చేయకతప్పదని ట్రాఫిక్ పోలీసులు హెచ్చరించారు. -
స్విగ్గి డెలివరీ బాయ్స్ ఆందోళన
అమీర్పేట: వినియోగదారులకు ఆహార పదార్థాలు డెలివరీ చేస్తున్నందుకు తమకు ఇచ్చే కమీషన్ను తగ్గించారని స్విగ్గి డెలివరీ బాయ్స్ ఆందోళకు దిగారు. ఎస్ఆర్నగర్లోని స్విగ్గి రెస్టారెంట్ ఎదుట సోమవారం ధర్నా చేశారు. అమీర్పేట జోన్ పరిధిలో సుమారు 250 మంది డెలివరీ బాయ్స్గా పనిచేస్తున్నారు. కాగా వినియోగదారులకు ఫుడ్ డెలివరీ చేస్తే సంస్థ ద్వారా రూ.37 చెల్లించేవారన్నారు. అదే విధంగా 7 నుంచి 10 కిలోమీటర్ల దూరానికి ఒక్కో ఆర్డర్కు రూ.65 చెల్లిస్తూ 15 డెలివరీలు చేస్తే రూ.200 ఇన్సెంటివ్స్ ఇచ్చేవారన్నారు. అయితే గత రెండు రోజులుగా ఇన్సెంటివ్స్ ఇవ్వకపోగా కమీషన్ కూడా తగ్గించారని వాపోయారు. కమీషన్ను ఎప్పటిలాగే ఇవ్వాలని, ఇన్సెంటివ్స్ డబ్బులు యథావిధిగా చెల్లించాలని డిమాండ్ చేశారు. సంస్థ మేనేజర్తో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తామని, అప్పటి వరకు డెలివరీలు చేయాలని రెస్టారెంట్ ఇన్చార్జి కోరారు. అయితే, తమ డిమాండ్లను పరిష్కరించే దాకా డెలివరీలు చేసేదిలేదని బాయ్స్ స్పష్టం చేశారు. డెలివరీ బాయ్స్ ఆందోళనకు దిగడంతో మధ్యాహ్నం నుంచి అమీర్పేట జోన్ పరిధిలోని అన్ని ఫుడ్ ఆర్డర్లు నిలిచిపోయాయి. -
గ్యాస్ డెలివరీ చేయకుండానే చేసినట్లు ఎస్ఎంఎస్లు
అత్తాపూర్కు చెందిన సుభాషిణీ రెడ్డి ఈ నెల 4న తన మొబైల్ ద్వారా సిలిండర్ను బుక్ చేసింది. నాలుగు రోజులు తరువాత క్యాష్ మెమో కూడా జనరేట్ అయింది. అయితే సిలిండర్ ఇంటికి డెలివరి కాలేదు. విచిత్రమేమంటే 10వ తేదీన సిలిండర్ డెలివరీ అయినట్లు ఎస్ఎంఎస్ వచ్చింది. దీంతో అవాక్కైన ఆమె డిస్ట్రిబ్యూటర్ను సంప్రదించగా మరో సారి బుక్ చేయాలని ఉచిత సలహా ఇచ్చారు. సిలిండర్ రాకపోవడానికి కారణం మాత్రం సమాధానం చెప్పలేదు. దీంతో చేసేదిలేక ఆమె మరోసారి బుక్ చేయక తప్పలేదు. మూడు రోజుల్లో క్యాష్ మెమో జారీ అయింది.. కానీ. వారం గడుస్తున్నా సిలిండర్ మాత్రం ఇంటికి చేరలేదు. దిల్సుఖ్నగర్కు చెందిన గోపాల్ ఈనెల 15న గ్యాస్ బుక్ చేశారు. రెండు రోజుల్లో క్యాష్ మెమో జారీ అయింది. మూడు రోజుల తర్వాత బాయ్ సిలిండర్ ఇంటికి తీసుకొచ్చారు. మీ బుకింగ్ క్యాన్సిల్ అయింది. తిరిగి బుక్ చేస్తే తెచ్చిన సిలిండర్ డెలివరి చేసి వెళ్తానన్నాడు. చేసేది లేక బాయ్ ముందే మరోసారి మొబైల్ ద్వారా బుక్ చేయక తప్పలేదు. బుకింగ్ ఎస్ఎంఎస్ చూసి సిలిండర్ డెలవరీ చేసి వెళ్లాడు బాయ్. ఆ తరువాత సిలిండర్ డెలివరీ అయినట్లు ఎస్ఎంఎస్ వచ్చింది. రెండో సారి బుకింగ్కు మరుసటిరోజు క్యాష్ మెమో జారీ అయింది. అ తర్వాత సిలిండర్ డెలవరీ ఎస్ఎంఎస్ వచ్చింది. అయితే సిలిండర్ మాత్రం రెండో సారి రాలేదు. సాక్షి, సిటి బ్యూరో : మహా నగరంలో ఇదీ గ్యాస్ వినియోగదారుల పరిస్థితి. ఏజెన్సీలు ముప్పుతిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాపిస్తున్నారు. వంట గ్యాస్ ధర పెరిగే కొద్దీ డిస్ట్రిబ్యూటర్లు తెలివిమీరుతున్నారు. సబ్సిడీ పై వంట గ్యాస్ ఏడాదికి 12 సిలిండర్ల పరిమితి కారణంగా గ్యాస్ బుకింగ్కు బుకింగ్కు మధ్య ఒక గడువు అంటూ లేకుండా పోయింది. ఎప్పుడైనా గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకొని తెప్పించుకునే వెసులు బాటు ఉంది. ఇక్కడే డీలర్లు చేతివాటం ప్రదర్శించి వినియోగదారుల సబ్సిడీ సిలిండర్ ఎత్తుకెళుతున్నారు. ఫలితంగా వాణిజ్య అవసరాల్లో గృహోపయోగ (డొమెస్టిక్) వంట గ్యాస్ రాజ్యమేలుతోంది. వాణిజ్య అవసరాలకూడొమెస్టిక్ సిలిండర్లు... ఇంటీవసరాలకు ఉపయోగపడాల్సిన వంట గ్యాస్ హోటళ్లు, ఇతర వాణిజ్య సంస్ధల అవసరాలను తీరుస్తోంది. మహానగరంలో పెద్ద హోటల్స్ ఐదువేలకు పైగా ఉండగా, చిన్న చితక హోటల్స్, టీ, టిఫిన్, గరం మర్చి సెంటర్లు, బండీలు సుమారు లక్షల వరకు ఉంటాయన్నది అంచనా. పెద్ద హోటల్స్, రెస్టారెంట్స్లో వాణిజ్య పరమైన సిలిండర్లు వినియోగమవుతుండగా, మిగిలినా చిన్నాచితకా హోటల్స్, బండీల్లో డొమెస్టిక్ సిలిండర్లు దర్శనమిస్తున్నాయి...దీంతో ప్రతిరోజు లక్షకుపైగా డొమెస్టిక్ వంట గ్యాస్ సిలిండర్లు దారిమళ్లుతున్నట్లు తెలుస్తోంది. వాణిజ్య కనెక్షన్లు అంతంతే.. మహా నగరంలోని హైదరాబాద్–రంగారెడ్డి –మేడ్చల్ జిల్లాలో కలిపి మూడు చమురు సంస్ధలకు చెందిన వాణిజ్య కనెక్షన్లు 50 వేలకు మించిలేవు. డొమెస్టిక్ మాత్రం 26.21 లక్షల వరకు ఉన్నాయి. నగరంలో మొత్తం 135 ఎల్పీజీ ఏజెన్సీలుండగా ప్రతిరోజు 1.20 లక్షవరకు డొమెస్టిక్ సిలిండర్ల డిమండ్ ఉంటుంది. కానీ, ప్రస్తుతం 60 వేలకు మించి డోర్ డెలివరి కావడం లేదు. వాణిజ్యఅవసరాలకు కొరత లేకుండా పోయింది. -
రెస్టారెంట్ను ధ్వంసం చేసిన డెలివరీ భాయ్స్
-
బైక్ పార్కింగ్ చేయనీయలేదని..
సాక్షి, న్యూఢిల్లీ : బైక్ పార్కింగ్ విషయం గొడవపడి ఓ రెస్టారెండ్ను ధ్వంసం చేశారు డెలివరీ భాయ్స్. పార్కింగ్ చేయనీయనందుకు సుమారు 25 మంది డెలివరీ భాయ్స్ దక్షిణ ఢిల్లీలోని ఓ రెస్టారెంట్పై దాడికి దిగాడు. అద్దాలు పగులగొట్టారు, కుర్చీలను గాలిలోకి విసేరాశారు. ఒక్కసారిగా దాడి జరగడంతో రెస్టారెంట్లో ఉన్న కస్టమర్లు భయానికి గురయ్యారని, వారికి ఎలాంటి హానీ జరగకుండా వంటగది ద్వారా బయటకు పంపించామని రెస్టారెంట్ యజమాని రోహిత్ తెలిపారు. ‘సాయంత్రం కావడంతో హోటల్ వెలుపల ట్రాఫిక్ జామ్ అయింది. తమ మోటార్ వాహనాలు ఎక్కడ పార్కింగ్ చేయాలో వారికి తెలియలేదు. బీట్ ఆఫీసర్ వారిని అక్కడ్నించి వెళ్లాల్సిందిగా కోరడంతో సమస్య మొదలైంది' అని రోహిత్ చెప్పారు. కాగా, పార్కింగ్కు నిరాకరించడంతో ఆగ్రహించిన డెలివరీ బాయ్స్ వెంటనే వాట్సాప్ గ్రూప్లోని 25 మందిని కాంటాక్ట్ చేశారు. వారంతా కలిసి రాత్రి 8.30గంటల సమయంలో రెస్టారెంట్పై దాడికి దిగారు. అద్దాలు పగులగొట్టారు. ఈ దాడి ఘటన మొత్తం సీసీ కెమెరాలో రికార్డెంది. ఈ ఘటన జరిగిన సమయంలో హోటల్లో సుమారు 30 మంది ఉన్నట్టు ప్రత్యేక్ష సాక్షులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టినట్లు పేర్కొన్నారు. -
కారమే వారి ఆయుధం
అమీర్పేట్: ఆన్లైన్లో సెల్ఫోన్లు బుక్చేసుకుంటారు. వాటిని తీసుకుని వచ్చే డెలివరీ బాయ్స్కు నకిలీ డెబిట్ కార్డులు ఇచ్చి కళ్లల్లో కారం చల్లి వస్తువులను లాక్కొని పరారవుతారు. పసిగట్టిన పోలీసులు అరెస్టుచేసి రూ.1.5 లక్షలు విలువచేసే సొత్తును స్వాధీనం చేసుకున్నారు. ఎస్ఆర్నగర్ పోలీస్స్టేషన్లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పంజగుట్ట ఏసీపీ విజయ్కుమార్ వివరాలను వెల్లడించారు. నెల్లూరు జిల్లా ఆత్మకూర్కు చెందిన సంగన కిషోర్ నగరంలోని గుడిమ ల్కపూర్లో ఉంటూ ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నాడు.రాజమండ్రి సీతమ్మపేట నివాసి మల్లిరెడ్డి శివశంకర్ డిగ్రీ వరకు చదువుకుని ఉద్యోగం కోసం వచ్చి చింతల్లో ఉంటున్నాడు. వీరికి పరిచయం ఏర్పడి జులాయిగా తిరుగుతున్నారు.అడ్డదారిలో డబ్బు సంపాదించాలన్న దుర్భుద్ది కలిగింది. ఆన్లైన్లో ఫ్లిప్కార్ట్,అమేజాన్ వెబ్సైట్ ద్వారా ఖరీదైన ఫోన్లను బుక్ చేసుకుంటారు. ఆ సంస్థల్లో పనిచేసే డెలివరీ బాయ్స్ వాటిని తీసుకుని వారికి ఫోన్ చేయగా జనసంచారం లేని ప్రాంతాలకు పిలిపించుకుంటారు. నకిలీ డెబిట్,క్రెడిట్ కార్డులను బాయ్కి ఇచ్చి వాటిని స్వైప్ చేస్తున్న సమయంలో కళ్లల్లో కారంచల్లి పార్సిళ్లను ఎత్తుకు వెళుతారని ఏసీపీ వివరించారు. ఎస్ఆర్నగర్, శంషాబాద్, జీడిమెట్ల పోలీస్స్టేషన్ పరిధిలో దోపిడీలకు పాల్పడి తప్పించుకు తిరుగుతున్న ఇద్దరిని క్రైం పోలీసులు పట్టుకున్నారు. వారి నుంచి 5 స్మార్ట్ సెల్ఫోన్లు, ఒక ట్యాప్ టాప్ను స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించారు. దొంగలను పట్టు కోవడంలో కీలకంగా వ్యవహరించిన డిటెక్టివ్ కిషోర్ పాటు డీఎస్సై జి.శ్రీనివాస్ ఇతర సిబ్బందిని ఏసీపీ అభినందించారు. ఇన్స్పెక్టర్లు వహిదుద్దీన్, క్రైం సిబ్బంది పాల్గొన్నారు. -
స్నాప్డీల్లో కొట్టేసి.. ఓఎల్ఎక్స్లో అమ్మేశారు!
నలుగురు వ్యక్తులు కలిసి మంచి ప్లాన్ వేశారు. స్నాప్డీల్ ద్వారా డెలివరీకి వచ్చే సరుకులను దారిలోనే కొట్టేసి, వాటిని ఓఎల్ఎక్స్లో పెట్టి అమ్మేశారు. ఒకటి, రెండు రోజులు కాదు.. చాలా కాలం ఇలాగే చేయడంతో చివరకు పట్టుబడ్డారు. వాళ్లలో స్నాప్డీల్ సరుకులు చేరవేసే లాజిస్టిక్స్ సంస్థలో పనిచేసే ముగ్గురు డెలియరీ బోయ్లు కూడా ఉన్నారు. ఈ నలుగురు కలిసి తప్పుడు పేర్లు, చిరునామాలతో స్నాప్డీల్లో వివిధ వస్తువులు బుక్ చేసి, ఆ తర్వాత వాటిని తీసేసుకుని వాటి స్థానంలో రాళ్లు, సబ్బులు పెట్టేసి డెలివరీ తీసుకోనట్లుగా వాటిని రిటర్న్ చేసేసేవారు. తీసుకున్న సరుకులను ఎంచక్కా ఓఎల్ఎక్స్లో అమ్మేసుకునేవారు. ఈ కేసులో ఢిల్లీకి చెందిన రవికాంత్, హరి ఓం, అమృత్, కరణ్ శర్మ అనే నలుగురిని అరెస్టు చేసి గుర్గ్రామ్ కోర్టులో ప్రవేశపెట్టారు. స్నాప్డీల్ తరఫున పార్సిల్స్ తీసుకుని వాటిని నగరంలోని వివిధ ప్రాంతాల్లో డెలివరీ చేసే వల్కన్ ఎక్స్ప్రెస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఏరియా మేనేజర్ రమేష్ కుమార్ గత నెలలో ఈ వ్యవహారంపై ఫిర్ఆయదు చేశారు. విచారణలో ఈ సంస్థలో పనిచేసే డెలివరీ బోయ్లే ఈ నేరానికి పాల్పడినట్లు తేలింది. ముందుగా రవికాంత్, హరి ఓం అనే ఇద్దరు డెలివరీ బోయ్లను అరెస్టు చేయగా, వాళ్లిచ్చిన సమాచారంతో హరి ఓం అన్న కరణ్ను అరెస్టు చేశారు. అతడే మొత్తం కుట్రకు సూత్రధారి. ఖరీదైన వస్తువులు బుక్ చేసి, వాటికి క్యాష్ ఆన్ డెలివరీ పద్ధతిలో చెల్లింపు ఆప్షన్ పెట్టేవాడు. డెలివరీ బోయ్లు అతడి అడ్రస్ సరిగా లేదని చెప్పి వాటిని తిరిగి ఇచ్చేసేవారు. అప్పటికే లోపలి సరుకు మారిపోయేది. సరుకు విలువలో 15% మొత్తాన్ని డెలివరీ బోయ్లకు కమీషన్గా ఇచ్చేవారు. దాదాపు 50 పార్సిళ్లను ఇలా ఓఎల్ఎక్స్లో అమ్మేశారని డీసీపీ క్రైం సుమిత్ కుమార్ తెలిపారు. -
బండ బాదుడు!
సిలిండర్ నిర్ణీత ధర కంటే అదనపు వసూళ్లు డెలివరీ బాయ్స్ ఆగడాలు వినియోగదారుల జేబులకు చిల్లులు నెలకు రూ.8.17 కోట్లకు పైగా భారం సిటీబ్యూరో: మహా నగరంలో ఎల్పీజీ వంట గ్యాస్ వినియోగదారులకు అ‘ధన’పు బాదుడు తప్పడం లేదు. సిలిండర్ అసలు ధర కంటే అదనంగా వసూలు చేస్తూ డెలివరీ బాయ్స్ పబ్లిక్గా దోచుకుంటున్నారు. ఇలా ఒక నెలలో వినియోగదారులు చెల్లిస్తున్న మొత్తమెంతో తెలుసా? అక్షరాలా 8 కోట్ల 17 లక్షల రూపాయల పైమాటే. కొందరు వినియోగదారులు ‘చిల్లర’ కదా... అని తేలికగా తీసుకోవడంతో అది కాస్త డిమాండ్గా మారింది. ఎవరైనా ఇలా ఇచ్చుకోలేకపోతే రుసరుసలు తప్పవు. దీంతో అందరూ అదన ంగా చెల్లించాల్సి వస్తోంది. ఇది పేదలకు భారంగా మారుతోంది. డెలివరీ బాయ్స్కు కాసుల వర్షం కురిపిస్తోంది. ప్రస్తుతం సిలిండర్ రీఫిల్ ధర రూ.662 ఉండగా... డెలివరీ బాయ్స్ వినియోగదారుల నుంచి బలవంతంగా వసూలు చేస్తోంది రూ.690. అంటే నిర్ణీత ధర కంటే అదనంగా రూ.28 వంతున లాక్కుంటున్నారు. మహా నగరం మొత్తం వినియోగదారులు నెలకు ముట్ట జెప్పుతోంది లెక్కిస్తే కళ్లు బైర్లు కమ్ముతాయి. ఏజెన్సీల నిర్లక్ష్యం... వినియోగదారులకు సిలిండర్ను డోర్ డెలివరీ చేయడంలో ఏజెన్సీలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయి. ఫలితంగా చమురు సంస్థలు నిర్దేశించిన ధర అమలు కావడం లేదు. గ్యాస్ డిస్ట్రిబ్యూటర్లు రీఫిల్ ధర, డోర్ డెలివరీ చార్జీ (రవాణా, హమాలీ, నిర్వహణ)తో కలుపుకొని బిల్లు వేసి.. వినియోగదారులకు సరఫరా చేయాల్సి ఉంటుంది. చమురు సంస్థల ధరనే బిల్లుపై వేస్తున్న ఏజెన్సీలు సిలిండర్ సరఫరా భారాన్ని డెలివరీ బాయ్స్పై పెట్టి చేతులు దులుపుకుంటున్నాయి. దీంతో వారు ఇష్టమొచ్చినట్టుగా వసూలు చేస్తున్నారు. వాస్తవంగా డెలివరీ బాయ్స్కు ఏజెన్సీలు కనీస వేతనాలను అమలు చేయాల్సి ఉంటుంది. కొందరు నామమాత్రంగా వేతనాలు అందిస్తుండగా... మరికొందరు సిలిండర్ల సంఖ్యను బట్టి కమీషన్ చెల్లిస్తున్నారు. ఫలితంగా డెలివరీ బాయ్స్ అదనపు వసూళ్లపై దృష్టి పెడుతున్నారు. నిబంధనల ప్రకారం సరఫరా సమయంలో ప్రత్యేక పరికరంతో రీఫిల్ నిర్ణీత బరువును వినియోగదారులకు చూపించాలి. కానీ ఇది ఎక్కడా అమలవుతున్న దాఖలాలు లేవు. కేవలం బిల్లింగ్పై అదనపు బాదుడు ధ్యాస తప్ప బరువు చూపించాలన్న నిబంధనలను వారు మరచిపోయారు. ఇవీ నిబంధనలు వినియోగదారుడు ఆన్లైన్లో గ్యాస్ రీఫిల్ బుక్ చేసుకున్న తర్వాత బిల్లుతో డోర్ డెలివరీ చేయాలి. ఏజెన్సీ నుంచి 5 కిలోమీటర్ల వరకు ఉచితంగా సరఫరా చేయాలి. 6 నుంచి 15 కిలోమీటర్ల వరకూ రవాణా చార్జీల పేరిట రూ.10 వసూలు చేయాలి. 16-30 కిలోమీటర్ల దూరానికి రూ.15 వసూలు చేయాలి వినియోగదారుడు సిలిండర్ రీఫిల్ను గ్యాస్ కంపెనీ గోదాముకు వెళ్లి తీసుకుంటే బిల్లులో రూ.8 మినహాయించాలి.