-
డెలివరీ పార్ట్నర్స్కు శీతల పానీయాలు
న్యూఢిల్లీ: ఎండ వేడిమి నుంచి ఉపశమనానికి డెలివరీ పార్ట్నర్స్ సేద తీరేందుకు ఫుడ్ డెలివరీ, ఈ–కామర్స్ కంపెనీలు పలు చర్యలకు శ్రీకారం చుట్టాయి. దేశవ్యాప్తంగా 450 రెస్ట్ పాయింట్స్ ఏర్పాటు చేసినట్టు జొమాటో ప్రకటించింది. డెలివరీ పార్ట్నర్స్ ఈ కేంద్రాల్లో సౌకర్యవంతంగా కూర్చోవచ్చు. మొబైల్ చార్జింగ్, మంచి నీరు, వాష్రూమ్స్ ఏర్పాట్లు ఉంటాయి. 250 నగరాలు, పట్టణాల్లో 450 కేంద్రాల్లో డెలివరీ పార్ట్నర్స్కు అందించేందుకు శీతల పానీయాలు, పళ్ల రసాలు, గ్లూకోస్ వంటి 5 లక్షల ప్యాక్లను కంపెనీ కొనుగోలు చేసింది. అత్యవసర వైద్యం అవసరమైతే 15 నిముషాల్లో చేరుకునేలా 530కిపైగా నగరాలు, పట్టణాల్లో అంబులెన్స్ సౌకర్యం ఏర్పాటు చేసింది. ఫుల్ స్లీవ్, డ్రై ఫిట్ టీ–షర్టులను అందుబాటులోకి తెచి్చనట్టు జొమాటో సీఈవో రాకేశ్ రంజన్ తెలిపారు. అత్యవసరం అయితే తప్ప ఎండ తీవ్రత ఉన్న సమయంలో ఫుడ్ ఆర్డర్ చేయకూడదని కంపెనీ తన కస్టమర్లకు ఎక్స్ వేదికగా విన్నవించింది. బీమా కవరేజ్ సైతం.. స్విగ్గీ ఇన్స్టామార్ట్ 900లకుపైగా రీచార్జ్ జోన్స్ను ఏర్పాటు చేసింది. ఈ కేంద్రాల్లో సీటింగ్, మొబైల్ చార్జింగ్, మంచి నీరు, వాష్రూమ్స్ ఏర్పాట్లు ఉంటాయి. అత్యవసర వైద్యం కోసం జొమాటోకు చెందిన క్విక్ కామర్స్ ప్లాట్ఫామ్ బ్లింకిట్ తన యాప్లో ఎస్వోఎస్ సపోర్ట్ ప్రవేశపెట్టింది. డెలివరీ పార్ట్నర్స్ వేచి ఉండే ప్రాంతాల్లో ఎయిర్ కూలర్స్ను ఏర్పాటు చేసినట్టు బ్లింకిట్ సీఈవో అల్బీందర్ ధిండ్సా తెలిపారు. జొమాటో, బ్లింకిట్ డెలివరీ పార్ట్నర్స్ ఆసుపత్రిలో చేరితే రూ.1 లక్ష వరకు, ఔట్ పేషెంట్ సేవలు పొందితే రూ.5,000 వరకు బీమా కవరేజ్ ఆఫర్ చేస్తోంది. గ్లూకోస్ పానీయాలను అందిస్తున్నట్టు ఫ్లిప్కార్ట్ తెలిపింది. ఫెసిలిటీస్ వద్ద ఫ్యాన్స్, కూలర్స్ను అదనంగా ఏర్పాటు చేసినట్టు వివరించింది. -
స్టార్ హీరోయిన్ను పట్టించుకోని డెలివరీ బాయ్.. నెటిజన్ల ప్రశంసలు!
ఎవరైనా సెలబ్రిటీ మనకు ఎదురైతే చాలు. సెల్ఫీల కోసం ఎగబడే కాలం ఇది. ఇక పొరపాటున స్టార్స్ హీరోయిన్స్, హీరోలు కనపడితే ఇంక అంతే. సెల్పీ కోసం క్యూ కడతారు. అలాంటి ఈ రోజుల్లో ఓ డెలివరీ బాయ్ చేసిన పని నెట్టింట తెగ వైరలవుతోంది. అసలేం అతను ఏం చేశాడు? ఎందుకు అంతలా హాట్ టాపిక్గా మారిందో తెలుసుకుందాం.తాజాగా ముంబయిలోని ఓ సెలూన్ నుంచి స్టార్ హీరోయిన్ తాప్సీ పన్ను బయటకొచ్చింది. దీంతో ఆమె అక్కడే వేచి ఉన్న ఫోటోగ్రాఫర్స్ ఫోటోలు తీసేందుకు సిద్ధమయ్యారు. ఇంతలో ఓ ఫుడ్ డెలివరీ బాయ్ అనుకోకుండా అదే సమయంలో సెలూన్ లోపలికి వెళ్తూ కనిపించారు. అతనికి ఎదురుగా హీరోయిన్ తాప్సీ వస్తున్నప్పటికీ అసలు ఆమెను పట్టించుకోకుండా తన పనేంటో చూసుకుంటూ వెళ్లిపోయాడు. అక్కడే ఉన్న ఫోటోగ్రాఫర్స్ జరుగు అంటూ గట్టిగా అరిచినా ఎవరినీ లెక్కచేయకుండా సైలెంట్గా లోపలికి వెళ్లిపోయాడు. దీంతో ఆ డెలివరీ బాయ్పై నెటిజన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు. అతని డెడికేషన్కు హ్యాట్సాఫ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అతను తన పని పట్ల అంకితభావంతో ఉన్నాడంటూ మరొకరు రాసుకొచ్చారు. అతన్ని చూస్తుంటే సంతోషంగా ఉందంటూ మరో నెటిజన్ పోస్ట్ చేశారు. అతనికి కంపెనీ ప్రోత్సాహం ఇవ్వాలని కొందరు సూచించారు.ఆ తర్వాత తాప్సీ తన కారులో ఎక్కి అక్కడి నుంచి వెళ్లిపోయింది. కాగా.. ఈ ఏడాది మార్చిలో తాప్సీ తన చిరకాల ప్రియుడు, బ్యాడ్మింటన్ ప్లేయర్ మథియాస్ బోయ్ను పెళ్లాడిన సంగతి తెలిసిందే. దాదాపు 13 ఏళ్ల పాటు డేటింగ్లో ఉన్న వీరిద్దరు రాజస్తాన్లోని ఉదయపూర్లో వివాహబంధంతో ఒక్కటయ్యారు. ఇక సినిమావ విషయానికొస్తే ఖేల్ ఖేల్ మే, ఫిర్ అయి హసీన్ దిల్రుబాలో తాప్సీ కనిపించనుంది.Hey @Swiggy, this delivery partner deserves an incentive for his dedication!! 😬😂pic.twitter.com/8MM6RfDZ2V— Divya Gandotra Tandon (@divya_gandotra) May 19, 2024 -
దొంగతనం చేసిన డెలివరీ బాయ్కు సపోర్ట్.. సోనూసూద్పై ట్రోలింగ్
స్విగ్గీ డెలివరీ బాయ్ ఫుడ్ ఇవ్వడానికి వెళ్లి.. సదరు ఇంటి ముందు షూ దొంగిలించిన ఘటన హర్యానా రాష్ట్రంలోని గురుగ్రామ్లో చోటు చేసుకుంది. ఈ నెల 9న జరిగిన ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దీనిపై ప్రముఖ నటుడు సోనూసూద్ పాజిటివ్గా స్పందించాడు. 'మీకు ఫుడ్ తీసుకొచ్చే క్రమంలో డెలివరీ బాయ్ షూలు ఎత్తుకెళ్లిపోతే తిట్టుకోకండి.. దయచేసి తనమీద ఎలాంటి చర్యలు తీసుకోవద్దు. వీలైతే అతడికి కొత్త షూలు కొనివ్వండి. బహుశా అతడికి అవి ఎంతో అవసరమయి ఉండొచ్చు. దయతో ప్రవర్తించండి' అని ట్వీట్ చేశాడు. ఇది చూసిన నెటిజన్లు సోనూసూద్ను విమర్శిస్తున్నారు. 'దొంగతనం చేస్తే ఏమీ అనకూడదా? పేదరికం, అవసరం ఉన్నంతమాత్రాన దొంగిలిస్తే తప్పు ఒప్పయిపోతుందా? ఈ డెలివరీ బాయ్ కంటే పేదవాళ్లు సమాజంలో ఎంతోమంది ఉన్నారు. వాళ్లందరూ తమ కష్టార్జితంతో బతుకుతున్నారే తప్ప ఇలా పక్కవాళ్ల వస్తువులు దొంగలించిట్లేదు' అని ఓ వ్యక్తి నటుడిపై విరుచుకుపడ్డాడు. 'ఎవరైనా బంగారు గొలుసు దొంగిలించినా ఏం పర్లేదని వదిలేయాలా? అతడికి కారు అవసరమనుకోండి.. ఎవరిదో ఒకరిది ఎత్తుకుపోతే సరిపోతుందా? పేదరికంలో ఉన్నంతమాత్రాన దొంగతనం తప్పు కాకుండా పోతుందా?' అని ట్రోల్ చేస్తున్నారు. If Swiggy’s delivery boy stole a pair of shoes while delivering food at someone’s house. Don’t take any action against him. In fact buy him a new pair of shoes. He might be really in need. Be kind ❤️🙏 — sonu sood (@SonuSood) April 12, 2024 If an actor tried to be a saviour, don't take him seriously. He might running a different business using his skill. — Bodhan Biswas 🇮🇳 (@bodhan11) April 12, 2024 So if I need anything, am I allowed to steal anything from anyone’s house? This is one of the weirdest posts I have ever read. — Naveen (@_naveenish) April 12, 2024 Swiggy's drop and PICK up service. A delivery boy just took my friend's shoes (@Nike) and they won't even share his contact. @Swiggy @SwiggyCares @SwiggyInstamart pic.twitter.com/NaGvrOiKcx — Rohit Arora (@_arorarohit_) April 11, 2024 చదవండి: సల్మాన్ చెల్లితో పెళ్లి.. నా దగ్గర పైసా లేదు! నాన్నే పోషించాలని చెప్పా! -
Banjara Hills: యువతిపై లైంగిక దాడి.. ఫుడ్ డెలివరీ బాయ్ అరెస్ట్
హైదరాబాద్: మాట్లాడే పని ఉందని చెప్పి హోటల్కు పిలిచి యువతిపై లైంగిక దాడికి పాల్పడిన ఫుడ్ డెలివరీ బాయ్ను జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.. మల్లేపల్లికి చెందిన ఒబేదుల్లాఖాన్ (23) ఫుడ్ డెలివరీ బాయ్. ఎనిమిది నెలల క్రితం లక్డీకాపూల్లో ఓ సెమినార్కు హాజరైన ప్రైవేటు ఉద్యోగిని (22) ఫుడ్ ఆర్డర్ చేయడంతో ఒబేదుల్లా ఆమెకు అందజేశాడు. ఆమె డబ్బులను గూగుల్ పే చేయడంతో ఆ నంబర్ తీసుకున్న ఒబేదుల్లా ఆమెతో ఫోన్లో మాట్లాడుతూ పరిచయం పెంచుకున్నాడు. కేపీహెచ్బీ కాలనీలోని ఓ ప్రైవేటు హాస్టల్లో ఉండే సదరు యువతి ఒబేదుల్లాకు సన్నిహితమైంది. ఇదే అదనుగా భావించినన ఒబేదుల్లా గురువారం రాత్రి మాట్లాడే పని ఉందని ఆమెను తన బైక్పై తీసుకుని బంజారాహిల్స్లోని ఓయో రూమ్కు వచ్చాడు. రాత్రి ఒంటి గంట తర్వాత ఆమె నిద్ర మత్తులో ఉండగా లైంగిక దాడికి పాల్పడ్డాడు. శుక్రవారం ఉదయం బాధితురాలు జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితుడిపై ఐపీసీ 376, 354, 354 (ఏ), డి, 376, 66 (ఇ) సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి అరెస్టు చేశారు. -
డెలివరీ బాయ్గా దిగ్గజ కంపెనీ సీఈఓ!
కరోనా... రెండు సంవత్సరాల పాటు ప్రపంచాన్ని గడగడలాడించిన మహమ్మారి. ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది ప్రజల ప్రాణాలను పొట్టన పెట్టుకుంది. ఎన్నో కోట్ల కుటుంబాలను చిన్నాభిన్నం చేసింది. ముఖ్యంగా ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ సమయంలో ప్రజలు అనుభవించిన నరకం మాటల్లో చెప్పలేం. అయినవారి ప్రాణాలు కాపాడుకునేందుకు ఎన్నో కుటుంబాలు రూ.కోట్లు కుమ్మరించడం, చికిత్స కోసం ఆస్తులు అమ్ముకున్న ఘటనలు కోకొల్లలు. అప్పటి పరిస్థితులను గుర్తుచేసుకుంటే ఇప్పటికీ చాలామంది భయంతో వణికిపోతుంటారు. కరోనా సోకిన వారి కుటుంబాలు ఎంతటి మానసిక క్షోభ అనుభవించాయో తలుచుకుంటేనే గుండె బరువెక్కిపోతోంది. అలాంటి విపత్కర పరిస్థితుల్లోనూ ఉబర్ సీఈఓ దారా ఖోస్రోషాహి డెలివరీ బాయ్గా పనిచేసినట్లు చెప్పారు. భారత పర్యటనలో ఉన్న ఆయన ఇన్ఫోసిస్ కో-ఫౌండర్ నందన్ నిలేకనితో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఖస్రోషాహి ఆ చీకటి రోజుల్ని గుర్తు చేసుకున్నారు. కరోనా లాక్ డౌన్ సమయంలో ఇంట్లో ఉండి పిచ్చెక్కిపోయేది. అందుకే నేను ఇంటి నుండి బయటకు వెళ్లాలని అనుకున్నాను. వెంటనే ఈబైక్ సాయంతో ఉబర్ ఈట్స్ లో డెలివరీగా బాయ్గా చేరాను. ఫుడ్ డెలివరీ చేయడం, కస్టమర్లను రేటింగ్స్ అడిగినట్లు చెప్పారు. మాస్క్ పెట్టుకుని విధులు నిర్వహించడంతో తాను డెలివరీ డెలివరీ బాయ్గా పనిచేయడం మరింత సులభమైందని అన్నారు. View this post on Instagram A post shared by CNBC-TV18 (@cnbctv18india) కోవిడ్ ముగిసిన తర్వాత టెస్లా కారు ఉబెర్ డ్రైవర్ గా పనిచేశారంటూ నందన్ నిలేకనితో తన అనుభవాల్ని పంచుకున్నారు. కాగా, ఉబర సీఈఓ భారత్ లో తమ సర్వీస్లను విస్తరించేందుకు ప్రభుత్వ ఈ-కామర్స్ ప్లాట్ఫామ్ ఓఎన్డీసీలో ఉబర్ చేరింది. -
కుటుంబం దివాళా.. ఓ కుర్రాడి అష్టకష్టాలు! ప్రముఖ సీఈవో ‘ఫిలాసఫీ’ కథ
అప్పటివరకూ విలాసవంతంగా గడిపిన కుటుంబం అనుకోని కారణాలతో దివాళా తీస్తే ఆ ఇంట్లోని కుర్రాడు కుటుంబం కోసం డెలివరీ బాయ్గా, డీటీపీ ఆపరేటర్గా ఇలా చిన్నాచితకా పనులు చేస్తూ అష్టకష్టాలు పడ్డాడు. ఏదో సినిమా కథలా ఉంది కదూ.. కానీ ఇది రియల్ స్టోరీనే.. ప్రముఖ ఫిన్టెక్ కంపెనీ క్రెడ్ (CRED) సీఈవో ‘ఫిలాసఫీ’ కథ ఇది.. క్రెడ్ వ్యవస్థాపకుడు, సీఈవో కునాల్ షా (Kunal Shah) తన కుటుంబం దివాళా తీసినప్పుడు డెలివరీ ఏజెంట్గా, డేటా ఎంట్రీ ఆపరేటర్గా పనిచేయవలసి వచ్చింది. తనకు తెలిసిన ఈ చేదు గతాన్ని ఇన్ఫో ఎడ్జ్ వ్యవస్థాపకుడు సంజీవ్ బిఖ్చందానీ సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఈ ఇద్దరు పారిశ్రామికవేత్తలు ఢిల్లీలోని ఒక కాఫీ షాప్లో ఇటీవల కలుసుకున్నప్పుడు కునాల్ షా చిన్నతనంలో పడిన కష్టాలను సంజీవ్ బిఖ్చందానీ తెలుసుకున్నారు. ఆసక్తికర ‘ఫిలాసఫీ’! సంజీవ్ బిఖ్చందానీ ‘ఎక్స్’ (గతంలో ట్విటర్)లో ఇలా షేర్ చేశారు.. “ఢిల్లీలోని ఒక కాఫీ షాప్లో కునాల్ షాతో కలిసి కూర్చున్నాను. ఐఐటీ, ఐఐఎం ఫౌండర్ల ప్రపంచంలో అతను ముంబైలోని విల్సన్ కాలేజీ నుంచి ఫిలాసఫీ గ్రాడ్యుయేట్. అతను ఫిలాసఫీనే ఎందుకు చదివాడు.. 12వ తరగతిలో వచ్చిన మార్కులు అతనికి ఆ సబ్జెక్ట్లో మాత్రమే అడ్మిషన్ ఇచ్చాయా లేదా ఫిలాసఫీపై నిజంగా ఆసక్తి ఉందా అని అడిగాను. కానీ ఇవేం కాదని, కుటుంబం దివాళా తీయడంతో డెలివరీ బాయ్గా, డేటా ఎంట్రీ ఆపరేటర్గా పని చేయాల్సి వచ్చిందని అతను చెప్పాడు. ఉదయం 8 నుంచి 10 గంటల వరకే తరగతులు ఉండే ఏకైక సబ్జెక్ట్ ఫిలాసఫీ కావడమే కారణం అన్నాడు. సెల్యూట్.” Sitting with Kunal Shah at a coffee shop in Delhi. In a world of IIT IIM Founders he stands out as a philosophy graduate from Wilson College in Mumbai. I asked him why he studied philosophy - is it that his marks in Class 12 only gave him admission in that subject or was it out… — Sanjeev Bikhchandani (@sbikh) February 2, 2024 తన కుటుంబం క్లిష్ట ఆర్థిక పరిస్థితి గురించి కునాల్ షా ఇదివరకే తెలియజేశారు. కుటుంబం కోసం తాను చిన్న వయసు నుంచే పనిచేయడం, సంపాదించడం ప్రారంభించాల్సి వచ్చిందని చెప్పారు. 16 సంవత్సరాల వయసు నుంచే తాను చిన్నాచితకా పనులు చేస్తూ సంపాదించడం మొదలు పెట్టానని, సీడీలను పైరసీ చేయడం, సైబర్ కేఫ్ నడపడం వంటి పనులు సైతం చేసినట్లు కునాల్ షా వెల్లడించారు. తన కంపెనీ ఫిన్టెక్ లాభదాయకంగా మారే వరకు తాను నెలకు కేవలం రూ.15,000 జీతం తీసుకుంటానని కూడా చెప్పారు. -
గుడుగుడుమనీ గుర్రమెక్కి నేనొత్త పా నేనొత్త పా
ఫుడ్ డెలివరీ బాయ్ అనగానే బైక్ మీద సర్రున దూసుకుపోయే కుర్రాళ్ల దృశ్యమే కళ్లముందు ఉంటుంది. గుర్రం మీద వెళ్లి ఫుడ్ డెలివరీ చేసే దృశ్యం ఊహకు కూడా అందదు. ట్రక్కు డైవర్ల సమ్మె, పెట్రోల్ బంక్ల ముందు ‘నో స్టాక్’లు కనిపిస్తున్న నేపథ్యంలో తప్పనిసరి పరిస్థితులలో హైదరాబాద్లో జొమాటో బాయ్ ఒకరు హార్స్ రైడింగ్ చేస్తూ ఫుడ్ డెలివరీ చేశాడు. ‘ఎక్స్’లో పోస్ట్ చేసిన ఈ వీడియో వైరల్గా మారింది. ‘దిస్ ఈజ్ అన్బిలీవబుల్... ఇట్స్ జస్ట్ సూపర్బ్’ ‘అలనాటి రవాణా వ్యవ్యస్థను గుర్తుతెస్తోంది. కాలుష్య నివారణకు ఇది తిరుగులేని మార్గం’... ఇలాంటి కామెంట్స్ ఎన్నో నెటిజనుల నుంచి వచ్చాయి. -
పెట్రోల్ తిప్పలు..గుర్రం మీద ఫుడ్ డెలివరీ
-
అశ్వమెక్కి.. ఆర్డర్ అందించి
హైదరాబాద్:నగరంలో మంగళవారం పెట్రోలు కొరత కారణంగా...ఓ జొమాటో డెలివరీ బాయ్ ఏకంగా గుర్రాన్ని అద్దెకు తీసుకుని ఫుడ్ డెలివరీ చేశాడు. పాతబస్తీకి చెందిన మహ్మద్ ఇర్ఫాన్ రోజుమాదిరిగానే జొమాటోలో ఆర్డర్లు స్వీకరించగా..బైకులో పెట్రోల్ అయిపోయింది. బంకులు మూతపడడంతో సమీపంలోని ఓ వ్యక్తి వద్ద రూ.500 అద్దెకు ఓ అశ్వాన్ని తీసుకుని ఆర్డర్లు డెలివరీ చేశాడు. సైదాబాద్లోని ఇంపీరియల్ హోటల్లో పార్శిల్ తీసుకుని చంచల్గూడలో కస్టమర్కు అందించేందుకు వెళ్తుండగా ‘సాక్షి’ ప్రతినిధి పలకరించగా..పై విషయాలు వెల్లడించాడు. #Zomato Agent Delivers Food On Horse after the pumps ran out of petrol#TruckDriversProtest #HitandRunLaw #petrolpump pic.twitter.com/wqbfbAqaUo — rajni singh (@imrajni_singh) January 3, 2024 -
Zomato Jobs: ఉద్యోగ నియామకాలపై జొమాటో కీలక వ్యాఖ్యలు
దిగ్గజ ఫుడ్ డెలివరీ సంస్థ అయిన జొమాటో ఉద్యోగాల నియామకంపై కీలక వ్యాఖ్యలు చేసింది. ఉద్యోగాల కోసం వెతుకుతున్న వ్యక్తులను తమ కంపెనీలో ఇకపై ఉద్యోగాలు ఇవ్వబోమని సంస్థ సహ వ్యవస్థాపకుడు, సీఈఓ దీపిందర్ గోయల్ వెల్లడించారు. ఇటీవల యూట్యూబర్ రణ్వీర్ అల్లాబాడియాతో జరిగిన సమావేశంలో ఈ విషయాన్ని చెప్పారు. సంస్థ ఉద్యోగ నియామకం భిన్నమైందని ఆయన అన్నారు. ఉద్యోగాల కోసం వెతుకుతున్న వారికి ఉద్యోగాలు ఇవ్వమని, ఎలాంటి పనిగురించి వెతకకుండా, నమ్మకంగా పని చేసే స్వభావం ఉన్న వారికే తమ సంస్థలో ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. జొమాటో ప్రారంభించి 15 ఏళ్లు అయిందన్నారు. సంస్థలో గత 5-6 ఏళ్ల అనుభవం ఉన్న కంపెనీ అవసరాలకు సరిపడా ఉద్యోగులు ఉన్నట్లు చెప్పారు. ఒకవేళ ప్రత్యేక పరిస్థితుల వల్ల కొత్తవారిని నియమించుకోవాలంటే మాత్రం వారి నైపుణ్యాలకే అధిక ప్రాధాన్యం ఇస్తానన్నారు. ‘కొత్తవారిని నియమించాలంటే ఇంటర్వ్యూకు మూడు నెలలు సమయం అయిపోతుంది. ఒకవేళ ఇంటర్వ్యూ పాసైతే పాత సంస్థలో మరో మూడు నెలలు నోటీస్ పీరియడ్ ఉంటుంది. సంస్థ కార్యకలాపాలు పూర్తిగా తెలుసుకోవాలంటే మరింత సమయం పడుతుంది. అభ్యర్థి పనితనం గురించి తెలియాలంటే మరో ఏడాది సమయం పడుతుంది. మొత్తం దాదాపు 2 ఏళ్లు వృథా అవుతాయి’అని గోయల్ అభిప్రాయపడ్డారు. దానికిబదులుగా సంస్థలోని వారికి శిక్షణ ఇచ్చి వారిని ఉన్నతస్థానంలో నియమిస్తే కంపెనీ విధానాలు తెలిసి ఉంటాయి కాబట్టి పెద్దగా సమస్య ఉండదని చెప్పారు. -
రూ.16 లక్షల బైకుపై ఫుడ్ డెలివరీ - వీడియో వైరల్
సోషల్ మీడియాలో పాపులర్ అవ్వడానికి నేటి యువత ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. ఇందులో భాగంగానే గత కొన్ని రోజులుగా ఖరీదైన బైకుల ద్వారా జొమాటో ఫుడ్ డెలివరీ చేయడం వంటివి చేస్తున్నారు. ఇలాంటి వీడియోలు గతంలో కోకొల్లలుగా వెలుగులోకి వచ్చాయి. తాజాగా మరో సంఘటన వెలుగులోకి వచ్చింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. హెచ్ఎస్బీ అఫీషియల్ ఇన్స్టాగ్రామ్ పేజీలో కనిపించిన వీడియోలో ఒక వ్యక్తి ఖరీదైన 'సుజుకి హయబుసా' (Suzuki Hayabusa) బైక్ రైడ్ చేస్తున్నాడు. ఇందులో రైడర్ జొమాటో డెలివరీ బాయ్ వేషధారణలో ఉండటం గమనించవచ్చు. వీడియోలో కనిపించే ఖరీదైన సూపర్ బైక్ ధర రూ. 13 లక్షల నుంచి రూ. 17 లక్షల (ఎక్స్ షోరూమ్) మధ్య ఉంటుంది. బైక్ రైడర్ నిజంగా డెలివరీ బాయ్ అవునా? కాదా? అనేది తెలియదు. ఎందుకంటే గత కొన్ని రోజులుగా చాలామంది సోషల్ మీడియాలో ఫెమస్ అవ్వడానికి ఇలాంటి వీడియోలు చేస్తున్నారు. ఇదీ చదవండి: ఉద్యోగుల పనిగంటల రిపోర్ట్ - భారత్ ప్రపంచంలోనే.. ఇలాంటి వీడియోలు వెలుగులోకి రావడం ఇదే మొదటిసారి కాదు, గత వారం ఇండోర్లో కూడా ఇలాంటి ఘటనే ఒకటి జరిగింది. ఇందులో రోడ్డుపై జొమాటో బ్రాండింగ్ టీ-షర్ట్ వేసుకున్న ఒక అమ్మాయి యమహా ఆర్15 మోటార్సైకిల్ రైడ్ చేసింది. ఈ వీడియో అతి తక్కువ కాలంలోనే వైరల్ అయింది. దీనిపై స్పందించిన జొమాటో సీఈవో దీపిందర్ గోయల్.. ఆ సంఘటనకు, జొమాటోకు ఎలాంటి సంబంధం లేదని క్లారిటీ ఇచ్చాడు. View this post on Instagram A post shared by HARPREET SINGH (@hsbofficial) -
పిస్టల్తో పారిపోయిన రేపిస్టు... ఎట్టకేలకు అదుపులోకి
నోయిడా: ఒక కస్టమర్పై ఆమె ఫ్లాట్లో అత్యాచారానికి పాల్పడి పోలీసుల నుంచి తప్పించుకున్న డెలివరీ బాయ్ ఆదివారం ఎట్టకేలకు మళ్లీ చిక్కాడు. నోయిడాకు చెందిన డెలివరీ బాయ్ సుమిత్ శర్మ శుక్రవారం ఒక స్థానిక అపార్ట్మెంట్లో పార్సిల్ డెలివరీ సందర్భంగా ఫ్లాట్లో ఒంటరిగా ఉన్న యువతిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. దాంతో పోలీసులు శనివారం అతన్ని ఖరీపుర్లో అరెస్ట్ చేశారు. పోలీస్ స్టేషన్ తీసుకెళ్లే దారిలో అతను పోలీసుల నుంచి పిస్టల్ లాక్కుని పారిపోయాడు. దాంతో పోలీసులు బృందాలుగా ఏర్పడి అతనికోసం వేట సాగించారు. ఎట్టకేలకు వారి కంటబడ్డ సుమిత్ కాల్పులకు దిగాడు. పోలీసుల కాల్పుల్లో కాలికి తూటా దిగి పట్టుబడ్డాడు. అతనికి, సోదరునికి నేర చరిత్ర ఉన్నట్టు పోలీసులు తెలిపారు. -
బెంగుళూరు ట్రాఫిక్ జామ్లో టైమ్కి పిజ్జా డెలివరీ..
బెంగళూరు: లాంగ్ వీకెండ్ కావడంతో బెంగళూరు టెకీలు ఒక్కసారిగా ఇంటిబాట పట్టారు. దీంతో గురువారం సాయంత్రం నుంచి రాత్రి వరకు బెనాలూరు ప్రధాన రహదారుల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. ఈ సమయంలో ట్రాఫిక్లో ఇరుక్కున్న ఓ వ్యక్తి డామినోస్ పిజ్జా ఆర్డర్ చేయగా అంత ట్రాఫిక్ జామ్లో కూడా సమయానికి డెలివరీ చేశాడు డెలివరీ బాయ్. ఈ విషయాన్నీ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు సదరు వ్యక్తి. ఆన్టైమ్ డెలివరీ.. ఎలాగూ ట్రాఫిక్ జామ్ అయ్యింది కాబట్టి ఇప్పట్లో గమ్యానికి చేరుకోలేమని భావించి రిషివత్స అనే వ్యక్తి డామినోస్ ద్వారా పిజ్జా ఆర్డర్ చేసి లైవ్ లొకేషన్ ఇచ్చాడు. కానీ అతడిని ఆశ్చర్యానికి గురిచేస్తూ డామినోస్ పిజ్జా డెలివరీ బాయ్ అంత ట్రాఫిక్ జామ్లో కూడా ప్రామిస్ చేసినట్టుగా ట్రాఫిక్ ఉండగానే అర్ధగంటలో డెలివరీ చేశాడు. ఈ విషయాన్నీ సోషల్ మీడియా ప్లాట్ఫాం ఎక్స్(ట్విట్టర్)లో పోస్ట్ చేశాడు. ఈ వీడియోకు విశేష స్పందన రాగా కామెంట్లలో నెటిజన్లు డామినోస్పై ప్రశంసల వర్షాన్ని కురిపిస్తున్నారు. When we decided to order from @dominos during the Bangalore choke. They were kind enough to track our live location (a few metres away from our random location added in the traffic) and deliver to us in the traffic jam. #Bengaluru #bengalurutraffic #bangaloretraffic pic.twitter.com/stnFDh2cHz — Rishivaths (@rishivaths) September 27, 2023 బారులు తీరిన వాహనాలు.. ఈరోజు మిలాద్-ఉన్-నబీ, రేపు కావేరీ జల వివాదం కారణంగా కర్ణాటక బంద్, ఎల్లుండి శనివారం, తర్వా ఆదివారం, సోమవారం గాంధీ జయంతి ఇలా బెంగుళూరు వాసులకు వరుసగా ఐదు రోజులు సెలవులు దొరికాయి. దీంతో అత్యధిక సంఖ్యలో ఉద్యోగస్తులు సుదీర్ఘ వారాంతాన్ని ఎంజాయ్ చేయడానికి సొంతూళ్ళకు బయలుదేరారు. ఒక్కసారిగా అందరూ రోడ్లపైకి రావడంతో సాయంత్రం 5 నుంచే బెంగళూరు మహానగరంలో రహదారులన్నీ రద్దీగా మారిపోయాయి. కిలోమీటర్ల మేర బారులుతీరిన వాహనాలన్నీ గంటల తరబడి రోడ్లపైనే నిలిచిపోయి భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. ఔటర్ రింగ్ రోడ్డు ప్రాంతంలో అయితే వాహనాలు చాలా వరకు నిలిచిపోయాయి. వర్షం కారణంగా ఎక్కడికక్కడ నీళ్లు నిలిచిపోవడం వలన కూడా ట్రాఫిక్ అంతరాయం ఏర్పడిందని చెబుతున్నారు ట్రాఫిక్ పోలీసులు. This is every day before a long weekend in Bangalore, it's same 3-8pm today. Karnataka taking highest tax on liquor (83%) if can utilize even 10% of that can make proper roads and infra. #BangaloreTraffic #bangalore #longweekendhttps://t.co/XlOarOY6hj pic.twitter.com/goU6PIR9ae — nsrivastava.eth (@nitinkr1991) September 27, 2023 #bangaloretraffic Yesterday I saw most my friends in bangalore tweet about massive traffic jam. 2 hours for 8-10 kms and even more..when we are gonna diversify companies to other parts of KA? Bangalore has almost choked bec of political greed,ppl are suffering..feels sorry!! pic.twitter.com/caOvvfTRx7 — North karnataka Rises (@NorthKA_Rises) September 28, 2023 ఇది కూడా చదవండి: లోకోపైలట్ నిర్వాకం..రైలును ప్లాట్ఫారం ఎక్కించేశాడు.. -
డెలివరీ బాయ్కి ఇంత ఖరీదైన బైకా? అవాక్కవుతున్న నెటిజన్లు - వీడియో వైరల్
జొమాటో, స్విగ్గి వంటివి అందుబాటులోకి వచ్చిన తరువాత ఫుడ్ ఆర్డర్ చేసుకునే వారే కాదు, వాటి ద్వారా సంపాదించుకునే వారు కూడా ఎక్కువైపోయారు. దీంతో కొంతమంది తమ లగ్జరీ బైకులను డెలివరీ చేయడానికి ఉపయోగిస్తున్నారు. ఇలాంటి సంఘటనలు ఇప్పటికే చాలా వెలుగులోకి వచ్చాయి. తాజాగా మరో సంఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ఇన్స్టాగ్రామ్ యూజర్ రాజ్ గోథాంకర్ పోస్ట్ చేసిన ఈ వీడియో చూసినట్లయితే ఇందులో ఖరీదైన డుకాటి కంపెనీ బైక్ కనిపిస్తుంది. దీని ధర సుమారు రూ. 10 లక్షల వరకు ఉండే అవకాశం ఉంటుంది. దీనిపైన కూర్చున్న డెలివరీ బాయ్ జొమాటో షర్ట్ ధరించి ఉన్నాడు. అతడు తన ప్రతి ఆర్డర్కు 200 వరకు సంపాదిస్తున్నట్లు, అందులో రూ. 50 పెట్రోలు కోసం వెచ్చించినా.. తనకి రూ. 150 మిగులుతుందని.. ఇలా రోజుకి 20 ఆర్డర్స్ డెలివరీ చేస్తానని చెప్పాడు. నెలకు రూ. 45,000.. వీడియోలో కనిపించే వ్యక్తి చెప్పినదాని ప్రకారం, అతడు నెలకు రూ. 45,000 సంపాదిస్తానని చెప్పాడు. నిజానికి ప్రతి ఆర్డర్కు రూ. 30 నుంచి రూ. 40 మాత్రమే వస్తుందని తెలుస్తోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ చేస్తున్నారు. ఇదీ చదవండి: ఒక్కొక్కరికి రూ. 2లక్షల స్కాలర్షిప్.. 5వేల విద్యార్థులకు అవకాశం - లాస్ట్ డేట్ ఎప్పుడంటే? అతడు చెప్పినదాని ప్రకారం రోజుకి రూ. 3000, ఇలా నెలకు రూ. 90,000 సంపాదించాలి అంటూ ఒకరు. డుకాటి ఇండియా కూడా ఎమోజితో కామెంట్ చేసింది. మరి కొంతమంది కామెడీ కోసం చేసిన వీడియో మాదిరిగా ఉందని చెబుతున్నారు. మొత్తానికి ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిపోతోంది. View this post on Instagram A post shared by Raj Gothankar (@raj_official_2151) -
డెలివరీ బాయ్గా మారిన జొమాటో సీఈవో! బైక్పై ఫుడ్ డెలివరీ
ప్రముఖ ఫుడ్ డెలివరి సంస్థ జొమాటో (Zomato) సీఈఓ దీపిందర్ గోయల్ (Deepinder Goyal) ఫుడ్ డెలివరీ బాయ్గా మారిపోయారు. ఫ్రెండ్షిప్ డే (Friendship Day) సందర్భంగా సాధారణ డెలివరీ బాయ్ లాగా రెడ్ టీ షర్ట్ ధరించి బైక్పై ఫుడ్ డెలివరీలు చేశారు. దీనికి సంబంధించిన ఫొటోలను ఆయన ట్విటర్లో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో యూజర్లను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. జొమాటో టీ షర్ట్ వేసుకున్న దీపిందర్ గోయల్ ఫ్రెండ్షిప్డే సందర్భంగా పలువురు కస్టమర్లకు, డెలివరీ పార్ట్నర్స్కు, రెస్టారెంట్ పార్ట్నర్స్కు ఫుడ్ పార్సిల్స్, ఫ్రెండ్షిప్ బ్యాండ్లు అందించేందుకు రాయల్ ఎన్ఫీల్డ్ బైక్పై బయలుదేరారు. ఇదీ చదవండి: ..అలా 15 కేజీలు బరువు తగ్గాను: ఫిట్నెస్ సీక్రెట్ చెప్పిన ఫుడ్ డెలివరీ యాప్ సీఈవో 'రెస్టారెంట్లు, వినియోగదారులతోపాటు డెలివరీ పార్ట్నర్స్కు ఆహారం, ఫ్రెండ్షిప్ బ్యాండ్లను అందించేందుకు వెళ్తున్నా. ఇది నాకు ప్రత్యేకమైన ఆదివారం' అంటూ దీపిందర్ గోయాల్ ట్వీట్ చేశారు. ఈ ఫొటోలు నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి. వీటిపై యూజర్లు తమకు తోచిన విధంగా స్పందించారు. అంతా బాగుంది కానీ, ఆర్డర్లపై ఫ్రెండ్షిప్ డే చార్జ్లేవీ విధించరు కదా అంటూ ఓ యూజర్ కామెంట్ చేశారు. Going to deliver some food and friendship bands to our delivery partners, restaurant partners and customers. Best Sunday ever!! pic.twitter.com/WzRgsxKeMX — Deepinder Goyal (@deepigoyal) August 6, 2023 -
ఫుడ్ కోసం వెయిటింగ్.. కస్టమర్కు షాకిచ్చిన డెలివరీ బాయ్.. ఇంత లేజీగా ఉన్నావేంటి!
ఇంట్లో ఎన్ని వెరైటీ వంటకాలు ఉన్నప్పటికీ అప్పుడప్పుడు రెస్టారెంట్లలో పుడ్ టేస్ట్ చేస్తూ ఉంటాం. టెక్నాలజీ పుణమ్యా అని ఆన్లైన్ డెలివరీ యాప్లు రాకతో చేతిలో మొబైల్ ఉంటే చాలు నచ్చిన పుడ్ ఇంటి దగ్గరకే డోర్ డెలివరీ అవుతున్నాయి. ఇక్కడ వరకు అంతా బాగానే ఉన్నా.. ఇందులో మరో కోణం కూడా దాగుంది. వివిధ కారణాలతో డెలివరీ ఏజెంట్లు కస్టమర్లు ఆర్డర్ పెట్టిన ఆహారాన్ని అందివ్వడంతో విఫలమవుతున్నారు. అలా జరిగినప్పుడు, వారు తరచుగా సాకులు చెబుతారు. మరో విషయం ఏమిటంటే.. కొన్ని సందర్భాల్లో డెలివరీ ఏజెంట్లు కస్టమర్ల ఆహారాన్ని స్వయంగా తింటున్నారు కూడా. తాజాగా ఈ తరహా ఘటనే సోషల్మీడియాలో ఒకటి చక్కర్లు కొడుతోంది. వివరాల్లోకి వెళితే.. ఓ వ్యక్తి తన పిల్లల కోసం ఆన్లైన్లో పుడ్ ఆర్డర్ పెట్టి ఎదురుచూస్తుంటాడు. డెలివరీ సమయం సమీపిస్తున్న ఆహారం రాకపోవడంతో డెలివరీ ఏజెంట్కి ఈ విషయమై మెసేజ్ చేస్తాడు. ఆ సంభాషణలో.. సారీ బ్రదర్ మీరు ఆర్డర్ పెట్టిన ఫుడ్ని నేనే తిన్నట్లు కస్టమర్కు మెసేజ్ చేస్తాడు. దీంతో రూల్స్ ఉల్లంఘించినందుకు ఉద్యోగం నుంచి తొలగిస్తారని ఏజెంట్కు కస్టమర్ మెసేజ్ చేశాడు. అందుకు ఏజెంట్ వెటకారంగా స్పందిస్తూ, "మీరు దానిని నిరూపించలేరు, మిత్రమా అంటూ బదులిచ్చాడు. డెలివరీ ఏజెంట్ తమ హౌసింగ్ కాంప్లెక్స్లోకి ప్రవేశించలేదని నిరూపించడానికి తమ ప్రాంగణంలో సీసీ కెమెరాలు ఉన్నట్లు పేర్కొంటాడు కస్టమర్. అయితే, ఏజెంట్ కస్టమర్ను ఫుడ్ కోసం ఆన్లైన్లో ఆర్డర్ పెట్టావ్ ఇంత సోమరిగా ఉన్నావేంటి అని పిలవడంతో వీరి మధ్య సంభాషణ కాస్త సీరియస్గా మారింది. చివరిలో ఆ డెలివరీ ఏజెంట్ కస్టమర్ ఆర్డర్ చేసిన ఆహారం అద్భుతంగా ఉందని, అతను ఆర్డర్ చేసిన ఆహారాన్ని తిన్నానని నిర్ధారిస్తూ సంభాషణను ముగించాడు. ప్రస్తుతం ఈ చాట్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. దీన్నిచూసిన నెటిజన్లు డెలివరీ ఏజెంట్ చేసిన పనికి మండిపడుతున్నారు. చదవండి: Video: ఎమ్మెల్యే చెంప చెల్లుమనిపించిన వరద బాధితురాలు -
ఎంత కష్టం! కంటతడి పెట్టిస్తున్న జొమాటో డెలివరీ బాయ్ వీడియో
జొమాటో ఫుడ్ డెలివరీ బాయ్ ప్లాస్టిక్ కవర్లో ఆహారాన్ని తింటున్న వీడియో ఒకటి పోస్ట్ చేసి.. మన కడుపు నింపడం కోసం కడుపు మాడ్చుకుని పనిచేసే ఇలాంటి డెలివరీ బాయ్ ల యోగక్షేమాలు కూడా పట్టించుకోండని ఒక ఐఏఎస్ అధికారి నెటిజెన్లను కోరారు. క్షణాల్లో వైరల్ గా మారిన ఆ వీడియో నెటిజన్లను కంటతడి పెట్టిస్తోంది. బాగా బిజీగా ఉన్న ఒక రెసిడెన్షియల్ అపార్ట్ మెంట్లో ఫుడ్ డెలివరీ చేయడానికి వెళ్లిన జొమాటో డెలివరీ బాయ్ పార్సిల్ అందించిన తర్వాత అక్కడే పార్కింగ్ ఏరియాలో తన బైక్ వద్ద నిలబడి ప్లాస్టిక్ కవర్లో తన వెంట తెచ్చుకున్న ఆహారాన్ని కంగారుగా తింటున్న వీడియో ఇంటర్నెట్లో వైరల్ గా మారింది. చూస్తుంటేనే హృదయం ద్రవించిపోయే ఈ సన్నివేశాన్ని అవనీశ్ శరణ్ అనే ఒక ఐఏఎస్ అధికారి ట్విట్టర్లో అప్లోడ్ చేయగా మూడు లక్షల కంటే ఎక్కువ మంది వీక్షించారు. వీడియోతో పాటుగా.. "ఈ విపత్కర పరిస్థితుల్లో ఇలాంటి వారి గురించి కూడా కొంచెం పట్టించుకోండి.." అని రాశారు. इस मौसम में इनका भी ख्याल रखें. pic.twitter.com/Rf2kHs4srk — Awanish Sharan 🇮🇳 (@AwanishSharan) June 20, 2023 ఈ వీడియోకు వీక్షకుల నుంచి కూడా అంతే స్థాయిలో స్పందించారు. అలాంటి వారికి మీకు తోచినది పెట్టి వారి కడుపు నింపమని, కనీసం గ్లాసు మంచి నీళ్ళైనా ఇచ్చి వారి గొంతు తడపమని అభ్యర్థిస్తున్నారు నెటిజన్లు. ఆన్ లైన్ ఫుడ్ డెలివరీ సదుపాయం అందుబాటులోకి వచ్చిన తర్వాత అందరి జీవన విధానం తేలికైపోయింది. వైవిధ్యమైన, నోరూరించే ఆహారాల్లో ఏది కావాలంటే అది ఫోన్లో ఆర్డర్ పెడితే చాలు నచ్చిన ఐటమ్ నిముషాల్లో మన ముందు వాలిపోతుంది. కానీ దాని వెనుక ఇలాంటి ఎందరో శ్రామికుల కష్టం దాగుంది. కుటుంబ పోషణ కష్టమైన ఈ రోజుల్లో, వారు ఆకలికి ఓర్చుకుని ఎదుటివారి ఆకలిని తీరుస్తున్నారన్న విషయాన్ని మరువకూడదు. ఇది కూడా చదవండి: 106 ఏళ్ల వయసులో బంగారు పతకాలు సాధించిన బామ్మ -
పిజ్జా సైజ్ ఎందుకు తగ్గిందంటే..
-
లిఫ్ట్లో బాలికకు లైంగిక వేధింపులు
బనశంకరి: ఫుడ్ డెలివరీ బాయ్ లిఫ్ట్లో ఓ బాలికను లైంగికంగా వేధించాడు. ఈఘటన తలఘట్టపుర పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. చేతన్ అనే ఫుడ్ డెలివరీ బాయ్ ఈనెల 21న తలఘట్టపురలోని ఒక అపార్టుమెంటులోని మూడో అంతస్తుకు వెళ్లేందుకు లిఫ్ట్లోకి వెళ్లాడు. 13వ అంతస్తుకు చెందిన ఒక బాలిక ట్యూషన్కు వెళ్లేందుకు ఇదే లిఫ్ట్లో ఎక్కింది. ఈ సమయంలో ఫుడ్ డెలివరీ బాయ్ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. లిఫ్ట్నుంచి బయటికి వచ్చిన బాలిక ట్యూషన్ టీచర్కు విషయం తెలిపింది. ఆమె బాలిక తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వగా సెక్యూరిటీ సిబ్బంది చేతన్ను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. నిందితుడిపై పోక్సో చట్టంకింద కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు. -
డెలివరీ బాయ్ మృతి.. బైకును ఢీకొట్టి వంద మీటర్లు లాకెళ్లిన కారు
యశవంతపుర(బెంగళూరు): కారు ఢీకొని ఫుడ్ డెలివరి బాయ్ మృతి చెందిన ఘటన బెంగళూరు బ్యాటరాయనపుర పోలీసుస్టేషన్ పరిధిలో సోమవారం తెల్లవారుజామున జరిగింది. మృతుడిని మైసూరు జిల్లా హెచ్డీ కోటె తాలూకాకు చెందిన ప్రసన్నకుమార్ (25)గా గుర్తించారు. ప్రసన్న ఆదివారం అర్ధరాత్రి వరకు ఓ సంస్థలో క్యాషియర్గా పనిచేసి , తెల్లవారుజామున ఫుడ్ డెలివరీకి బయలుదేరాడు. ఫుడ్ ఇవ్వడానికి బైక్పై మైసూరు రోడ్డులో వెళ్తుండగా వాయు వేగంతో వచ్చిన ఓ కారు ప్రసన్నను బలంగా ఢీకొంది. దాదాపు వంద మీటర్ల వరకు బైక్ను కారు లాక్కెళ్లడంతో ప్రసన్న అక్కడికక్కడే మృతి చెందాడు. కారులోని వ్యక్తులు పారిపోతుండగా ఆర్ఆర్నగర మెట్రో స్టేషన్ వద్ద స్థానికులు అడ్డగించి కారు అద్దాలను ధ్వంసం చేశారు. కారును నడుపుతున్న వినాయక్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రమాద దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. చదవండి: ఒడిశా రైలు ప్రమాద దుర్ఘటన.. అతడి ఇంటికి సీబీఐ సీల్ -
కన్నీళ్లు తెప్పిస్తున్న డెలివరీ బాయ్ కష్టాలు.. కస్టమర్ సాయంతో జాబ్ కొట్టాడిలా!
Swiggy Delivery Boy: ప్రస్తుతం చాలామంది ఉద్యోగులు ఏసీ గదుల్లో పనిచేస్తూ లక్షల్లో జీతాలు తీసుకుంటూ కూడా ఏదో కారణాలు చెబుతూ అసంతృప్తి చెందుతూ ఉంటారు. అయితే మరి కొంతమంది వారు చేసే ఉద్యోగం చిన్నదైనా.. ఆ పనిని ఎంజాయ్ చేస్తూ ముందుకు వెళుతుంటారు. కుటుంబ బాధ్యతలు, ఆర్థిక సమస్యలతో సతమతమవుతూ చేసే పనిలో ఎన్ని ఆటంకాలు ఎదురైనా పట్టు వదలని విక్రమార్కుల్లా సాహసాలు చేస్తూ ఉంటారు. అలాంటి కోవకు చెందిన వారిలో ఒకరు 'సాహిల్ సింగ్'. ఇంతకీ ఈ సాహిల్ సింగ్ ఎవరు? అతనికొచ్చిన కష్టమేంటి అనే మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. జమ్మూ & కాశ్మీర్ ప్రాంతానికి చెందిన 30 సంవత్సరాల సాహిల్ సింగ్ మేవార్ యూనివర్సిటీ నుంచి 2018లో బిటెక్ పూర్తి చేశారు. చదువు పూర్తయిన తరువాత నింజాకార్ట్లో పని చేశాడు. ఆ తరవాత బైజూస్లో కూడా పనిచేశాడు. అయితే దేశంలో అధికంగా కరోనా మహమ్మారి సమయంలో తన సొంతూరుకు వెళ్ళిపోయాడు. కాగా కరోనా పూర్తిగా తగ్గుముఖం పట్టిన తరువాత మళ్ళీ స్విగ్గిలో డెలివరీ బాయ్ ఉద్యోగంలో చేరాడు. ఇటీవల ఓ టెక్ కంపెనీలో మార్కెటింగ్ మేనేజర్గా పని చేస్తున్న 'ప్రియాన్సీ చాందెల్' అనే మహిళ స్విగ్గిలో ఫుడ్ ఆర్డర్ చేసింది. అయితే ఆమెకు డెలివరీ బాయ్ సాహిల్ సింగ్ ఫుడ్ డెలివరీ ఇచ్చాడు. డెలివరీ ఇచ్చిన తరువాత మెట్లపైన ఆయాసపడుతూ కూర్చున్నప్పుడు ఆమె ఏమైందని పలకరించింది. అప్పుడతడు.. మేడమ్, ట్రావెల్ చేయడానికి నా దగ్గర స్కూటర్ లేదు. ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ కూడా ఇవ్వలేదు. అందుకే 3 కిలోమీటర్లు నడుచుకుంటూ ఆర్డర్ డెలివరీ చేసాను. నా దగ్గర డబ్బు లేదు. ఉన్న డబ్బు మా ఫ్లాట్మేట్కి అవసరం ఉన్నాయంటే ఇచ్చాను. (ఇదీ చదవండి: ఐఫోన్ లవర్స్కి ఇది కదా శుభవార్త - ఈ ఆఫర్స్తో పండగ చేసుకోండి!) నేను అబద్ధం చెబుతున్నానని మీకు అనిపించొచ్చు. కానీ నేను గ్రాడ్యుయేట్ చేసాను. ఇప్పటికే నింజాకార్ట్, బైజూస్లో కొద పనిచేసాను. ఇప్పుడు ఒక ఆర్డర్ డెలివరీ చేస్తే నాకు రూ. 20 నుంచి రూ. 25 మాత్రమే వస్తాయని, అందులోనూ కస్టమర్ ఇచ్చిన టైమ్ లోపల డెలివరీ చేయాల్సి ఉంటుందని చెప్పాడు. అంతే కాకుండా సరిగ్గా తిండి తిని వారం రోజులైందని, కేవలం టీ.. వాటర్తో గడిపేస్తున్నాని, అమ్మానాన్న వయసు కూడా పెరుగుతోందని ఇప్పుడు కూడా వారిపై ఆధారపడటం ఇష్టం లేదని, కనీసం నెలకు 25 వేలు సంపాదించాలనుందని, ఏదైనా జాబ్ ఉంటే చూడమని చెప్పాడు. (ఇదీ చదవండి: నెటిజన్లను భయపెడుతున్న ఆనంద్ మహీంద్రా ట్విటర్ వీడియో) ఇదంతా విన్న ప్రియాన్సీ చాందెల్ అతడు చెప్పినవన్నీ సోషల్ మీడియాలో పోస్ట్ చేసి క్వాలిఫికేషన్, ఎక్స్పీరియన్స్, మార్క్ షీట్స్, అడ్రెస్ వంటి వాటిని కూడా యాడ్ చేసింది. ఆఫీస్ బాయ్, అడ్మిన్ వర్క్, కస్టమర్ సపోర్ట్ లాంటి ఏదైనా జాబ్ దయచేసి చెప్పండని రిక్వెస్ట్ చేసింది. ఇది చూసిన చాలామంది అతనికి డబ్బు సహాయం కూడా చేసారు, మరి కొంతమంది ఫుడ్ ఆర్డర్ కూడా చేశారు. చివరికి అతనికి ఉద్యోగం వచ్చేసింది. సాహిల్కి ఉద్యోగం లభించిందని ప్రియాన్సీ గుడ్ న్యూస్ చెప్పింది. ఈ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిపోతోంది. -
మరో దారుణం.. మృతదేహాన్ని బెడ్షీట్లో చుట్టి...
ముంబైకి చెందిన ఒక డెలివరీ బాయ్ పొరుగింటిలో ఉంటున్న వ్యక్తిని దారుణంగా హతమార్చాడు. వీరిద్దరి మధ్య జరిగిన చిన్నపాటి వివాదమే ఈ దారుణానికి కారణమని తెలుస్తోంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ముంబైలోని షాహూనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఫుడ్ డెలివరీ ఏజెంట్గా పని చేస్తున్న పాల్ కానారన్ అనే వ్యక్తి తన పొరుగు ఇంటిలో ఉంటున్న వ్యక్తిని హత్య చేశాడు. నిందితునిపై కేసు నమోదు చేసిన పోలీసులు అతనిని అరెస్టు చేశారు. ఒక సీనియర్ పోలీసు అధికారి తెలిపిన వివరాల ప్రకారం ఆ ప్రాంతంలోని కొందరు వ్యక్తులు ఒక ఇంటి నుంచి దుర్ఘంధం వస్తున్నదని పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించగా ఆ ఇంటిలో దుప్పటిలో చుట్టిన స్థితిలో ఒక మృతదేహం కనిపించింది. పోలీసుల దర్యాప్తులో ఆ ఫుడ్ డెలివరీ ఏజెంట్ను అతని పొరుగింటిలో ఉన్న వ్యక్తి మందు పార్టీకి ఆహ్వానించాడు. పార్టీ చేసుకుంటున్న సందర్భంలో వారి మధ్య గొడవ చోటుచేసుకుంది. ఆగ్రహంతో ఊగిపోతూ ఆ ఫుడ్ డెలివరీ ఏజెంట్ పొరుగింటిలోని వ్యక్తిని దారుణంగా హతమార్చి, మృతదేహాన్ని ఒక బెడ్షీట్లో చుట్టి, అక్కడి నుంచి పారిపోయాడు. పోలీసులు వలపన్ని నిందితుడిని పట్టుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇది కూడా చదవండి: ‘బయటకు వెళ్లి సిగరెట్ కాల్చుకో’ అన్నాడని.. -
యువతితో డెలివరి బాయ్ అసభ్య ప్రవర్తన.. బుద్ధి చెప్పిన స్థానికులు
-
కుక్కకు భయపడి.. మూడో అంతస్తు పైనుంచి దూకి..
సాక్షి, హైదరాబాద్: డెలివరీ పార్సిల్ను అందించేందుకు వచ్చిన ఓ యువకుడు...పెంపుడు కుక్క అరవడంతో భయపడి అపార్టుమెంట్ మూడో అంతస్తు నుంచి దూకేశాడు. దీంతో తీవ్రగాయాలపాలవగా ఆస్పత్రిలో చేర్పించారు. ఆదివారం సాయంత్రం మణికొండ మున్సిపాలిటీ పరిధిలోని పంచవటి కాలనీలోని శ్రీనిధి హైట్స్ అపార్ట్మెంట్లోని మూడవ అంతస్తులో అద్దెకు ఉంటున్న నీలారాణి మూడు రోజుల క్రితం అమెజాన్లో పరుపు(బెడ్)ను ఆర్డర్ చేసింది. దాంతో ఆదివారం దాన్ని తీసుకుని డెలివరీ బాయ్ ఇలియాజ్ వారి ఇంటికి లిఫ్ట్లో వచ్చాడు. అతను తెచ్చిన బెడ్ను తలుపు తెరచి ఉండటంతో ఇంట్లోకి నేరుగా వచ్చి హాల్లో వేశాడు. దాని చప్పుడుకు ఇంట్లో ఉన్న లాబ్ జాతి కుక్క ఒక్కసారిగా అరవటంతో అతను భయపడి పోయాడు. ఆ సమయంలో కుక్క ఎక్కడ కరుస్తుందో అనే భయంతో ఏకంగా మూడవ అంతస్తు బాల్కనీ నుంచి కిందకు దూకాడు. నేరుగా అపార్ట్మెంట్ ప్రహరీగోడపై పడటంతో నడుము భాగంలో గాయమయ్యింది. దీంతో నీలారాణి భర్త డాక్టర్ సుబ్బరామిరెడ్డి సపర్యలు చేసి 108కు సమాచారం ఇచ్చి ఆసుపత్రికి పంపారు. డెలివరీ బాయ్ ఉదయం ఫోన్ చేసి ఈరోజు డెలివరీ చేస్తామని చెప్పాడని, వచ్చే ముందు ఎలాంటి ఫోన్ చేయటం, ఇంటి ముందుకు వచ్చి బెల్ కొట్టడం చేయలేదని, నేరుగా ఇంట్లోకి రావడం వల్లే కుక్క అరిచిందని నీలారాణి తెలిపారు. బాధితుడు తన అన్నకు ఫోన్ చేయటంతో ఓవైసీ ఆసుపత్రికి తీసుకుని రావాలని చెప్పటంతో 108 సిబ్బంది అతన్ని అక్కడకు తరలించినట్టు సమాచారం. రాయదుర్గం పోలీసులు సంఘటనా స్థలానికి వచ్చి సమాచారం సేకరించారు. అనంతరం నీలారాణిపై కేసు నమోదు చేశారు. చదవండి: కొత్త రేషన్ కార్డులు ఇప్పట్లో లేనట్టే! -
Hyderabad: లిఫ్ట్ విషయంలో గొడవ.. స్విగ్గీ డెలివరీ బాయ్పై దాడి
సాక్షి, హైదరాబాద్: ఓ స్విగ్గీ డెలివరీ బాయ్పై సెక్యూరిటీ గార్డులు విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డ ఘటన రాయదుర్గం పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ మహేష్ తెలిపిన వివరాల ప్రకారం.. ఉదయం 8.58 గంటల సమయంలో స్విగ్గీ డెలివరీ బాయ్ శాంతకుమార్ గచ్చిబౌలిలోని ఎన్సీసీ నాగార్జున రెసిడెన్సీ గేటెడ్ కమ్యూనిటీలో ఫుడ్ డెలివరీకి వెళ్లాడు. తిరిగి వస్తుండగా అక్కడ విధులు నిర్వర్తిస్తున్న సెక్యూరిటీ గార్డులు ఆపి నువ్వు ఏ లిఫ్ట్లో వెళ్లావని అడగ్గా, స్విగ్గీ బాయ్ సర్వీస్ లిఫ్ట్లో వెళ్లానని చెప్పగా, లేదు నువ్వు మెయిన్ లిఫ్ట్లో వెళ్లావంటూ గొడవకు దిగారు. ఆరుగురు సెక్యూరిటీ గార్డులు దాడి చేయగా, గాయపడిన శాంతకుమార్ అక్కడి నుంచి తప్పించుకొని రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు సీసీ పుటేజీ ఆధారంగా దాడికి పాల్పడిన ముగ్గురు సెక్యూరిటీ గార్డులను అరెస్ట్ చేశారు. మరో ముగ్గురి కోసం గాలిస్తున్నట్టు సీఐ తెలిపారు. చదవండి: జనవరిలో పెళ్లి.. నెల రోజులుగా గొడవలు.. ఉన్నట్టుండి భర్త మాయం!