-
‘దోస్త్’తో ఎక్కడైనా సీటు
నిజామాబాద్నాగారం : డిగ్రీ కళాశాలల్లో ప్రవేశం పొందేవారు ‘దోస్త్’ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని తెలంగాణ ఉన్నతవిద్యా మండలి ప్రొఫెసర్ పాపిరెడ్డి అన్నారు. బుధవారం ఆర్అండ్బి అతిథిగృహంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ సంవత్స రం ఇంటర్లో 2లక్షల 80వేల మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారని, సప్లిమెంటరీలోనూ విద్యార్థులు ఉత్తీర్ణులయ్యే అవకాశం ఉందన్నారు. రాష్ట్రంలో గతేడాది కంటే ఈ సంవత్సరం డిగ్రీ కళాశాలల్లో సీట్లు తగ్గినప్పటికీ.. విద్యార్థులకు సరిపడా 3లక్షల 90వేల సీట్లు అందుబాటులో ఉన్నాయి. ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలు వసతులను బట్టి విద్యార్థుల ప్రవేశాలు తీసుకోవాలన్నారు. కానీ కొన్ని ప్రైవేట్ పాఠశాలలు ప్రవేశాలు తక్కువగా తీసుకుంటున్నారని, వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. చివరి సమయంలో విద్యార్థులను ప్రలోభ పెట్టి ప్రవేశాలు పొందుతున్నారని ఆరోపించారు. న్యాయంగా ప్రవేశాలు పొందకుండా, అడ్డదారిలో వెళితే దోస్త్నుంచి తొలగిస్తామన్నారు. తప్పుడు ప్రవేశాలు చేపట్టకుండా చర్యలు తీసుకోవాలని యూనివర్సిటీలకు లేఖలు రాస్తానన్నారు. మొదటివారం నుంచే కళాశాలలు సక్రమంగా తరగతులు నిర్వహణ, విద్యార్థుల హాజరు, విద్యాబోధన తదితర అంశాలపై ఎప్పటికప్పుడు ఆరా తీస్తామన్నారు. యూనివర్శిటీ నిబంధనల ప్రకారం కళాశాలలు నిర్వహించకపోతే శాఖపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. ఫీజు రీయింబర్స్మెంట్ ద్వారా చదువుతున్న విద్యార్థులు తరగతులకు క్రమం తప్పకుండా హాజరు కావాలన్నారు. ఫోన్ ద్వారా ప్రవేశాలు.. విద్యార్థులు ఫోన్ ద్వారానే డిగ్రీలో ప్రవేశాలు పొందే అవకాశం ఉందని ఉన్నతవిద్యా మండలి వైస్చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి అన్నారు. విద్యార్థులు తమ ఫోన్నంబర్కు ఆధార్తో అనుసంధానం చేసుకుంటే ఉన్న చోట నుంచే ప్రవేశప్రక్రియ పూర్తి చేసుకోవచ్చన్నారు. మీసేవ కేంద్రాల్లో, ఇంటర్నెట్ల ద్వారా కూడా ఈ అవకాశం ఉందన్నారు. 74 హెల్ప్ సెంటర్లు ఏర్పాటు చేశామన్నారు. ఆధార్కార్డు, ఇతర ధ్రువపత్రాలు లేకున్నా ఖైరదాబాద్లోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రత్యేక విభాగం ఏర్పాటు చేశామన్నారు. ప్రవేశ ప్రక్రియ మూడు ఫేస్లో ఉంటుందని, ఒకసారి దరఖాస్తు చేసుకుంటే 1100 కళాశాలల్లో ఎక్కడైనా ప్రవేశాలు పొందవచ్చన్నారు. -
రేపటి నుంచి డిగ్రీ ప్రవేశాలకు ఆప్షన్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని డిగ్రీ కాలేజీల్లో ఆన్లైన్ ప్రవేశాలకు డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ (దోస్త్) నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నెల 10 నుంచి విద్యార్థు లు ఆన్లైన్లో (ఛీౌట్ట.ఛిజజ.జౌఠి.జీn) రిజిస్ట్రేషన్ చేసుకునేలా, వెబ్ ఆప్షన్లు ఇచ్చుకునేలా చర్యలు చేపట్టింది. ప్రవేశాల నోటిఫికేషన్, షెడ్యూలు వివరాలను ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ తుమ్మల పాపిరెడ్డి, కళాశాల విద్య కమిషనర్ నవీన్ మిట్టల్, దోస్త్ కన్వీనర్ ప్రొ. లింబాద్రి మంగళవారం వెల్లడించారు. డిగ్రీ ప్రవేశాల కోసం రిజిస్ట్రేషన్ చేసుకునే విద్యార్థులు మొబైల్ నంబర్ తప్పనిసరిగా ఇవ్వాలని సూచించారు. ప్రవేశాలు, సీట్ల కేటాయింపు వివరాలను మొబైల్కే పంపిస్తామన్నారు. విద్యార్థులు తమ ఆధార్ నంబర్ ఇవ్వాలని, మొబైల్ నంబరు ఆధార్తో లింక్ అయ్యుంటే ఏదైనా నెట్ సెంటర్లో వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవచ్చన్నారు. ఆధార్తో అనుసంధానం చేసుకోని వారు మీసేవ/హెల్ప్లైన్ కేంద్రాల్లో అథెంటికేషన్ చేయించుకోవాలన్నారు. అక్కడా అథెంటికేషన్ కాకపోతే ఖైరతాబాద్ డిగ్రీ కాలేజీలో ప్రత్యేక కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నామ న్నారు. దరఖాసుల్లో పొరపాట్లను ఆన్లైన్లోనే పరిష్కరిస్తా మన్నారు. పూర్తిగా పేరు మారిపోతే మీసేవ/హెల్ప్లైన్ కేంద్రాల్లో బయోమెట్రిక్ అథెంటికేషన్ చేయించుకోవాలన్నారు. విద్యార్థుల సమస్యల పరిష్కారానికి హెల్ప్లైన్ కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. చాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టంలో చదువుకున్న వారు, ఇతర రాష్ట్రాల వారు, స్పెషల్ కేటగిరీల వారు తమ జిల్లాల్లోని హెల్ప్లైన్ కేంద్రాల్లో వెరిఫికేషన్కు హాజరుకావాలన్నారు. మూడు దశల్లో కౌన్సెలింగ్: ఈసారి డిగ్రీ ప్రవేశాల కు మూడు దశల్లో కౌన్సెలింగ్ నిర్వహించేందుకు దోస్త్ చర్యలు చేపట్టింది. ఈలోగా ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లి మెంటరీ ఫలితాలు రాకపోతే స్పెషల్ రౌండ్ కౌన్సెలింగ్ నిర్వహించాలని భావిస్తోంది. కాలేజీ స్థాయిలోనే విద్యార్థులు సీట్లను బట్టి గ్రూపుల మార్పు, మీడియం మార్చు కునేందుకు అధికారులే కౌన్సెలింగ్ నిర్వహించనున్నా రు. రాష్ట్రంలోని 1,173 డిగ్రీ కాలేజీలకు జియో ట్యాగిం గ్ చేస్తున్నారు. డిగ్రీలో చేరిన విద్యార్థి ఇంజనీరింగ్కు దరఖాస్తు చేసుకుంటే అక్కడ సీటు వచ్చి ఇంజనీరింగ్కు వెళ్తే డిగ్రీలో ఆటోమేటిగ్గా సీటు రద్దయ్యేలా రెండు ప్రవేశాలకు ఆన్లైన్ లింకు చేశారు. ‘ఆ కాలేజీలపై చర్యలు’ యూనివర్సిటీలు నిర్ణయించిన ఫీజుల కంటే అదనంగా వసూలు చేయడం సరికాదని, అలాంటి కాలేజీలపై చర్యలు చేపడతామని కళాశాల విద్య కమిషనర్ నవీన్ మిట్టల్ తెలిపారు. రాష్ట్రంలో 19 కాలేజీలు సొంతంగా ప్రవేశాలు చేపట్టుకునేందుకు కోర్టును ఆశ్రయించాయన్నారు. సీట్ల వివరాలివీ.. (2017–18) యూనివర్సిటీ సీట్లు కాకతీయ 1,29,257 మహత్మాగాంధీ 38,240 ఉస్మానియా 1,46,240 పాలమూరు 32,850 శాతవాహన 47,470 తెలంగాణ 27,890 (ఇందులో వరుసగా మూడేళ్లలో 25 శాతం లోపు భర్తీ కాని సీట్లు తగ్గిపోయే అవకాశం ఉంది) -
7,259 సీట్లు మిగిలాయి!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని గురుకుల డిగ్రీ కాలేజీల్లో సీట్లు అధిక సంఖ్యలో మిగిలిపోయాయి. రాష్ట్రంలో పాత గురుకులాలతో పాటు ఈసారి కొత్తగా ఏర్పాటు చేసిన గురుకులాలు కలుపుకొని మొత్తంగా 52 ప్రభుత్వ గురుకుల డిగ్రీ కాలేజీలు ఉండగా వాటిల్లో 15,360 సీట్లు అందుబాటులో ఉన్నాయి. వాటిల్లో 8,101 సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయి. మరో 7,259 సీట్లు ఖాళీగా ఉండిపోయాయి. 52 కాలేజీల్లో కొత్తగా ఏర్పాటు చేసినవే 40కి పైగా కాలేజీలు ఉన్నాయి. వాటిల్లో విద్యా బోధన పట్ల విద్యార్థులకు పెద్దగా అవగాహన లేని కారణంగా సీట్లన్నీ భర్తీ కాలేదని అధికారులు పేర్కొంటున్నారు. మరోవైపు రాష్ట్రంలోని 1,186 ప్రభుత్వ, ప్రైవేటు డిగ్రీ కాలేజీల్లో 4,48,457 సీట్లు అందుబాటులో ఉండగా, అందులో 2,23,427 సీట్లు భర్తీ కాగా, మరో 2,25,030 సీట్లు ఖాళీగానే ఉండిపోయాయి. ప్రభుత్వ కాలేజీల్లోనూ మిగులు: వివిధ ప్రైవేటు కాలేజీలతో ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లోనూ సీట్లు మిగిలిపోయాయి. ప్రభుత్వ కాలేజీల్లో 60 వేల వరకు సీట్లు అందుబాటులో ఉండగా, 29 వేల వరకు సీట్లు మిగిలిపోయాయి. ఇక ప్రైవేటు కాలేజీల్లో 3.22 లక్షల సీట్లు అందుబాటులో ఉండగా, అందులో 1.70 లక్షల సీట్లు ఖాళీగా ఉండిపోయాయి. ఈసారే కాదు ఏటా మిగిలిపోతున్న నేపథ్యంలో అవసరం లేని సీట్లకు కోత పెట్టాలని ఉన్నత విద్యా మండలి ఇదివరకే నిర్ణయించింది. వచ్చే ఏడాది లక్ష సీట్లను తగ్గించేందుకు కసరత్తు చేస్తోంది. ఈసారి 30 శాతం సీట్లు కూడా భర్తీ కాని కాలేజీల్లో ప్రవేశాలను రద్దు చేసి, ఆ విద్యార్థులను ఇతర కాలేజీల్లోకి పంపించాలని ఇదివరకే వర్సిటీలకు ఆదేశాలు జారీ చేసింది. -
డిగ్రీ ఆన్లైన్ అడ్మిషన్లకు నేడే చివరి తేదీ
మహబూబ్నగర్ విద్యావిభాగం : డిగ్రీలో ఇప్పటి వరకు సీటు రాని వారికి, గతంలో దరఖాస్తు చేసుకోని వారికి కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు, ఆప్షన్ల ఎంపికకు గురువారం చివరి గడువని ఎంవీఎస్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ యాదగిరి ఒక ప్రకటనలో తెలిపారు. ఇంతకు ముందు సీటు వచ్చిన వారికి అవకాశం లేదని పేర్కొన్నారు. -
డిగ్రీ విద్యార్థులకు న్యాయం చేయాలి
అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) జిల్లా కన్వీనర్ కరుణాకర్రెడ్డి చేవెళ్ల: డిగ్రీలో ఇప్పటివరకు ప్రవేశం పొందని సుమారు రెండు లక్షల మందికి ప్రభుత్వం న్యాయం చేయాలని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) జిల్లా కన్వీనర్ జే.కరుణాకర్రెడ్డి తెలిపారు. ఈ విషయంపై ఆయన మంగళవారం పత్రిక ప్రకటన విడుదల చేశారు. డిగ్రీలో ప్రవేశంకోసం ప్రభుత్వం 2016-17 ఈ విద్యాసంవత్సరం నుంచి మొట్టమొదటిసారిగా ఆన్లైన్లో ప్రవేశాలను ప్రవేశపెట్టిందని తెలిపారు. విద్యాసంవత్సరం ప్రారంభమై రెండు నెలలు గడిచినా ఇప్పటివరకు ఫేజ్-1, ఫేజ్-2 కౌన్సెలింగ్ నిర్వహించినా ఇప్పటికీ రెండు లక్షల మందికి ప్రవేశాలు లభించలేదని ఆవేదన వ్యక్తంచేశారు. ప్రభుత్వ, ప్రైవేట్ డిగ్రీ కళాశాలల్లో ఇంకా చాలావరకు సీట్లు ఖాళీగానే ఉన్నాయని తెలిపారు. ఇటు సీట్లు భర్తీకాక, అటు విద్యార్థులకు ప్రవేశంలేక డిగ్రీ విద్యా విధానం ఆగమ్యగోచరంగా తయారైందని చెప్పారు. డిగ్రీ ప్రవేశాలకు ఆన్లైన్ భర్తీ విధానం ప్రవేశపెట్టిన ప్రభుత్వం దానిపై పూర్తిస్థాయిలో అవగాహన కల్పించలేదన్నారు. ఆన్లైన్ విధానంలో తమపేర్లు నమోదు చేసుకునే విధానం తెలియక 2లక్షల మంది ఇంకా ప్రవేశాలకోసం ఎదురుచూస్తున్నారని తెలిపారు. ఈ విషయంలో ప్రభుత్వం స్పందించకుంటే విద్యార్థులు ఈ విద్యాసంవత్సరం కోల్పోయే ప్రమాదం ఉందన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి డిగ్రీలో ప్రవేశంకోసం ఎదురుచూస్తున్న విద్యార్థులకు న్యాయం చేయాలని ఆయన విజ్ఞప్తిచేశారు. అంతేకాకుండా ఆన్లైన్లో దరఖాస్తు, ప్రవేశాలు, తదితర అంశాల్లో అవగాహన కోసం ప్రభుత్వం సహాయ కేంద్రాన్ని ఏర్పాటుచేసి విద్యార్థులకు అవగాహన కల్పించాలన్నారు. -
డిగ్రీ ఆన్లైన్ ప్రవేశాల గడువు పొడిగింపు
కేయూ క్యాంపస్ : కాకతీయ యూనివర్సిటీ పరిధి వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాల్లోని డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాలకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునే గడువును ఈనెల 15వ తేదీ వరకు పొడిగించారు. ఇటీవల ప్రారంభమైన దరఖాస్తుల స్వీకరణ గడువు సోమవారంతో ముగియగా.. పొడిగించినట్లు కేయూ ఇన్చార్జి రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఖాజా అల్తాఫ్ హుస్సేన్ తెలిపారు. ఈ మేరకు విద్యార్థులు తమ దరఖాస్తులను జాగ్రత్తగా అప్లోడ్ చేయూలని, సందేహాలు ఉంటే హెల్ప్లైన్ సెంటర్లలో సంప్రదించాలని సూచించారు. అంతేకాకుండా ఏ కాలేజీ బాధ్యులకు కూడా సర్టిఫికెట్లు ఇవ్వకుండా జాగ్రత్త పడాలని ఆయన తెలిపారు. ఇప్పటివరకు 17,845 దరఖాస్తులే కాకతీయ యూనివర్సిటీ పరిధిలో డిగ్రీ ప్రవేశాల కోసం ఆన్లైన్లో ఇప్పటి వరకు 17,845 దరఖాస్తులే వచ్చాయి. మొత్తం 21,633 మంది విద్యార్థులు రూ.100 చొప్పున ఫీజు చెల్లించినా అందరూ దరఖాస్తు చేసుకోలేదు. మూడు జిల్లాల్లోని కళాశాలల్లో ఒక లక్ష 25వేల వరకు సీట్లు ఉన్నాయి. ఎంసెట్ కౌన్సెలింగ్ ముగిసి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు విడుదలైతే దరఖాస్తుల సంఖ్య పెరగవచ్చని అధికారులు భావిస్తున్నారు. -
డిగ్రీ ప్రవేశాలకు ఆధార్ తప్పనిసరి
ఉస్మానియా వర్సిటీ రిజిస్ట్రార్ స్పష్టీకరణ నేటి నుంచి ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ హైదరాబాద్: ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో వివిధ డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు ఈ విద్యా సంవత్సరం నుంచి ఆధార్ నంబర్ తప్పనిసరి అని వర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ సురేశ్కుమార్ తెలిపారు. ఓయూ పరిధిలోని ప్రభుత్వ, అటానమస్, ప్రైవేట్, యూనివర్సిటీ అనుబంధ, ఎయిడెడ్ బాలుర, బాలికల డిగ్రీ కళాశాలల్లో 2016-17 విద్యా సంవత్సరానికి బీఏ, బీకాం(జనరల్/కంప్యూటర్స్), బీఎస్సీ, బీబీఏ, బీసీఏ కోర్సుల్లో ప్రథమ సంవత్సరంలో ప్రవేశానికి నేటి నుంచి జూన్ 6 వరకు ఆన్లైన్ దరఖాస్తులు స్వీకరించనునట్లు చెప్పారు. రూ.500 అపరాధ రుసుముతో జూన్ 8 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఓయూతో పాటు కాకతీయ, శాతవాహన, తెలంగాణ, మహాత్మాగాంధీ, పాలమూరు విశ్వవిద్యాలయాలకు సైతం డిగ్రీలో ప్రవేశాలకు http:// dost.cgg.gov. in వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. అయితే ఏ వర్సిటీలో దరఖాస్తు చేసుకున్నా ఆ వర్సిటీ పరిధిలోనే చదవాల్సి ఉంటుందన్నారు. రిజిస్ట్రేషన్ ఫీజు రూ.100 మాత్రమే చెల్లించాలన్నారు. అయితే ఓయూ పరిధిలో కేవలం జంట నగరాల్లో కొనసాగుతున్న బీకాం ఆనర్స్ కోర్సులో ప్రవేశాలకు ప్రత్యేకంగా పరీక్షలు నిర్వహించి కౌన్సెలింగ్ ద్వారా అడ్మిషన్లు చేపట్టనున్నట్లు తెలిపారు. బీకాం ఆనర్స్ ప్రవేశ పరీక్షను ఓయూ కామర్స్ విభాగం ఆధ్వర్యంలో 21న నిర్వహించనున్నారు. పూర్తి వివరాలకు ఉస్మానియా వెబ్సైట్లో చూడవచ్చు.