deadline
-
Taxpayers-ITR Filing: ఆలస్యమైతే రూ. 5 వేలు కట్టాలి!
2022–23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆదాయపు పన్ను రిటర్న్స్ను జూలై 31లోపు దాఖలు చేయాలి. ఏప్రిల్ 1 నుంచి 2023–24 అసెస్మెంట్ సంవత్సరానికి కొత్త ఐటీఆర్ ఫారమ్లు అందుబాటులో ఉంటాయి. నిబంధనల ప్రకారం రూ. 2.5 లక్షల ప్రాథమిక మినహాయింపు కంటే ఎక్కువ సంపాదించే వ్యక్తులు తమ ఐటీఆర్లను గడువుకు ముందే సమర్పించాలి. ఇదీ చదవండి: Fact Check: ఐటీ నుంచి రూ.41 వేల రీఫండ్! నిజమేనా? అయితే రూ. 5 లక్షల ఆదాయం వరకు పన్ను మినహాయింపులకు అర్హత పొందిన వారు మాత్రం పన్నులు చెల్లించాల్సిన అవసరం లేదు. ప్రభుత్వం పలు కారణాల వల్ల ఐటీఆర్ దాఖలు గడువును గత ఏడాది జూలై 31 నుంచి సెప్టెంబర్ 30కి పొడిగించింది. అయితే ఈ సంవత్సరం కూడా పొడిగింపు ఏమైనా ఉంటుందా అన్నది ఇప్పటివరకూ తెలియదు. (ట్యాక్స్పేయర్ల కోసం స్పెషల్ యాప్, ఎలా పనిచేస్తుంది?) ఆలస్యమైతే ఏమవుతుంది? ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 234F కింద ఐటీఆర్ దాఖలు ఆలస్యమైతే ఆలస్య రుసుము రూ. 5,000 చెల్లించాలి. ఒక వేళ వార్షికాదాయం రూ. 5 లక్షల కంటే తక్కువైతే ఈ ఆలస్య రుసుమును రూ.1000లకు తగ్గిస్తారు. గడువు ముగిసిన తర్వాత రిటర్న్ను సమర్పించినట్లయితే ఆలస్య రుసుముతోపాటు వడ్డీ కూడా చెల్లించాల్సి ఉంటుంది. ఆదాయపు పన్ను శాఖ సెక్షన్ 234A ప్రకారం పన్ను బకాయిపై నెలకు 1 శాతం చొప్పున వడ్డీ వసూలు చేస్తుంది. ఐటీఆర్ ఫైలింగ్ గడువు దాటిపోతే మరో నష్టం కూడా ఉంది. ఆలస్య రుసుము, వడ్డీ చెల్లించి గడువు ముగిసిన తర్వాత కూడా రిటర్న్స్ను ఫైల్ చేయవచ్చు. కానీ తదుపరి సర్దుబాట్ల కోసం నష్టాలను అందులో చేర్చడానికి వీలుండదు. సాధారణంగా స్టాక్లు, మ్యూచువల్ ఫండ్లు, రియల్ ఎస్టేట్ లేదా ఏదైనా సంస్థల్లో పెట్టుబడుల వల్ల నష్టాలు ఉంటే వాటిని ఐటీఆర్లో చేర్చి వచ్చే ఏడాది ఆదాయంతో సర్దుబాటు చేసుకోవచ్చు. ఫలితంగా పన్ను భారం బాగా తగ్గుతుంది. ఇది గడువు తేదీలోపు ఐటీఆర్ సమర్పిస్తేనే. ఇదీ చదవండి: Hindenburg Research: త్వరలో హిండెన్బర్గ్ మరో బాంబ్.. ఈసారి ఎవరి వంతో..! -
గడువు సమీపిస్తోంది, ఖాతాదారులకు అలర్ట్: లేదంటే తప్పదు మూల్యం!
సాక్షి, ముంబై: బ్యాంక్ ఆఫ్ బరోడా (BoB) తన కస్టమర్లకు కీలక హెచ్చరిక జారీ చేసింది. మార్చి 24, 2023లోపు సెంట్రల్ కేవైసీ (C-KYC)ని పూర్తి చేయాలని తన వినియోగ దారులను కోరింది. అలా చేయకపోతే భారీ మూల్యం తప్పదని కూడా హెచ్చరించింది. ఈ మేరకు అధికారిక ట్విటర్లో ఒ కప్రకటన జారీ చేసింది. నిర్ధేశిత సమయంలోపు బ్యాంకు వినియోగదారులు సెంట్రలైజ్డ్ నో యువర్ కస్టమర్ (సీ-కేవైసీ)ని పూర్తి చేయని పక్షంలో అకౌంట్ డీయాక్టివేట్ అవుతుందని తెలిపింది. ఇప్పటికే ఎస్ఎంఎస్, నోటీసులు సంబంధిత ఖాతాదారులకు పంపించామని, వెంటనే వారు సమీప ఖాతాను సందర్శించిన అవసరమైన పతత్రాలు సమర్పించాలని సూచించింది. మార్చి 24, 2023లోపు సెంట్రల్ KYC ప్రాసెస్ను పూర్తి చేయని కస్టమర్లు తమ ఖాతాలను యాక్సెస్ చేయడంలో ఇబ్బంది పడవచ్చు. ఈ నేపథ్యంలో వీలైనంత త్వరగా ఈ ప్రక్రియను పూర్తి చేయాలని సూచించింది. సెంట్రల్ రిజిస్ట్రీ ఆఫ్ సెక్యూరిటైజేషన్ అసెట్ రీకన్స్ట్రక్షన్ అండ్ సెక్యూరిటీ ఇంట్రెస్ట్ ఆఫ్ ఇండియా (CERSAI) సీ-కేవైసీని నిర్వహిస్తుంది. దీంతో కస్టమరు బ్యాంకుకో, డీమ్యాట్ ఖాతాకో ఇలా ఏదో ఒకదానికి ఒకసారి నో యువర్ కస్టమర్ వివరాలిచ్చిన తరువాత డిజిటల్ ఫార్మాట్ సెంట్రలైజ్డ్ నంబరు కేటాయిస్తారు. కేవైసీ వివరాలకు ఈ నంబరు ఇస్తే సరిపోతుంది. అంటే కస్టమర్ ఒక్కసారి సీ-కేవైసీని పూర్తి చేశాక కొత్త ఖాతాలను తెరవడం, జీవిత బీమా, లేదా డీమ్యాట్ ఖాతా లాంటి విభిన్న ప్రయోజనాల కోసం మళ్లీ ప్రక్రియను కొనసాగించాల్సిన అవసరం లేదు. ఆ నంబరు తీసుకున్న ఆర్థిక సంస్థ ఆన్లైన్లో చెక్ చేసుకోవచ్చు. కేవైసీ ప్రాసెస్ను, కేవేసీ రికార్డ్లను సమర్థవంతంగా వినియోగించు కోవడం లక్ష్యాలుగా ‘సీ-కేవైసీ’ని అందుబాటులోకి తెచ్చిన సంగతి తెలిసిందే. pic.twitter.com/HZOMQN9pbJ — Bank of Baroda (@bankofbaroda) March 13, 2023 -
మార్చిలో ముఖ్యమైన డెడ్లైన్లు.. తప్పిస్తే నష్టమే!
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2022-23) ఈ మార్చి 31తో ముగుస్తుంది. ఆర్థికపరంగా ఈ మార్చి నెల ముగిసేలోపు మీరు చేయాల్సిన ముఖ్యమైన పనులు కొన్ని ఉన్నాయి. పాన్- ఆధార్ లింక్, ముందస్తు పన్ను చెల్లింపు, పన్ను ఆదా చేసే పెట్టుబడులు, ప్రధానమంత్రి వయా వందన యోజన దరఖాస్తుకు మార్చిలో గడువులు ముగుస్తాయి. ఇదీ చదవండి: వాహనదారులకు షాక్! హైవే ఎక్కితే బాదుడే.. పెరగనున్న టోల్ చార్జీలు! పాన్-ఆధార్ కార్డ్ లింక్ మార్చి 31లోపు శాశ్వత ఖాతా సంఖ్య (పాన్)ను ఆధార్తో లింక్ చేయడాన్ని కేంద్ర ప్రభుత్వం తప్పనిసరి చేసింది. ఇంతకు ముందు కూడా పాన్-ఆధార్ లింక్ చేయడానికి గడువును చాలాసార్లు పొడిగించింది. ప్రస్తుతం రూ. 1,000 పెనాల్టీ చెల్లించి లింక్ చేసుకోవాలి. ప్రస్తుత గడువు తప్పితే ఏప్రిల్ 1 నుంచి పాన్ కార్డ్ పని చేయదని ఆదాయపు పన్ను శాఖ చెబుతోంది. ముందస్తు పన్ను చెల్లింపు ఆదాయపు పన్ను శాఖ ప్రకారం.. ముందస్తు పన్ను చెల్లింపు చివరి వాయిదా చెల్లింపునకు చివరి తేదీ మార్చి 15. ముందస్తు పన్ను చెల్లింపులో ఏదైనా డిఫాల్ట్ అయితే పన్ను చెల్లింపుదారు సంబంధిత పెనాల్టీలను చెల్లించాల్సి ఉంటుంది. ఆదాయపు పన్ను చట్టం ప్రకారం.. టీడీఎస్ మినహాయించిన తర్వాత రూ.10వేలు లేదా అంతకంటే ఎక్కువ పన్ను చెల్లించాల్సి ఉంటుందని అంచనా ఉన్న వ్యక్తి ఆదాయపు పన్ను చట్టం ప్రకారం ముందస్తు పన్ను చెల్లించాల్సి ఉంటుంది. పన్ను ఆదా చేసే పెట్టుబడులు 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పన్ను ఆదా చేసే పెట్టుబడులకు మార్చి 31 చివరి తేదీ. పన్ను భారాన్ని తగ్గించుకోవడానికి, ట్యాక్స్ను ఆదా చేయడానికి ఈ పన్ను ప్రణాళిక సహాయపడుతుంది. పన్ను చెల్లింపుదారులు గణనీయమైన మొత్తంలో పన్ను ఆదా చేసుకోవడానికి అందుబాటులో ఉన్న పన్ను ఆదా అవకాశాలను ఉపయోగించుకోవచ్చు. ప్రధాన మంత్రి వయ వందన యోజన ఇది సీనియర్ సిటిజన్లకు భద్రతను అందించే బీమా పాలసీ కమ్ పెన్షన్ పథకం. ఈ పథకాన్ని భారతీయ బీమా సంస్థ అందిస్తోంది. ఇందులో రూ.15 లక్షల వరకు పెట్టుబడి పెట్టవచ్చు. మార్చి 31 వరకు ధరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పథకంపై 10 సంవత్సరాలకు ఏటా 7.4 శాతం వడ్డీ వస్తుంది. నెలవారీ, త్రైమాసికం, లేదా వార్షిక ప్రాతిపదికన పెన్షన్ పొందవచ్చు. ఇదీ చదవండి: ఎస్బీఐ కస్టమర్లకు అలర్ట్! రూ.295 కట్ అవుతోందా? ఎందుకో తెలుసుకోండి.. -
ఈపీఎఫ్ఓ అధిక పెన్షన్: ఖాతాదారులకు గుడ్న్యూస్
సాక్షి, ముంబై: ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్ఓ) అధిక పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకునేవారికి శుభవార్త. దీనికి సంబంధించిన గుడువుపై ఆందోళన అవసరం లేదు. 2023 మార్చి 3 తో గడువు ముగిసి పోతుందున్న ఆందోళన నేపథ్యంలో ఈపీఎఫ్వో గడువును పొడిగించింది. అధికారిక పోర్టల్ సమాచారం ప్రకారం ఈ గడువు మే 3 వ తేదీవరకు ఉంది. ఈ పరిధిలోని చందాదారులు, పెన్షన్దారుల్లో ఇప్పుడు అధిక పెన్షన్ కోసం మే 3 తేదీ వరకు అప్లయ్ చేసుకోవవచ్చు. (ఇదీ చదవండి: ఈపీఎఫ్ఓ సర్క్యులర్ జారీ.. ‘అధిక పెన్షన్’కు ఏం చేయాలి?) సుప్రీంకోర్టు నవంబర్ 4, 2022న తన ఆదేశాలలో ఈపీఎఫ్ఓ అర్హతగల సభ్యులందరికీ అధిక పెన్షన్ను ఎంచుకోవడానికి నాలుగు నెలల సమయం ఇవ్వాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో నాలుగు నెలల వ్యవధి మార్చి 3, 2023తో ముగిసిపోనుందనే ఆందోళన సభ్యులలో నెలకొంది. అయితే తాజాగా 60 రోజుల పొడిగింపుతో అర్హత ఉన్న సభ్యులందరూ, యజమానులతో కలిసి మే 3, 2023 వరకు రిటైర్మెంట్ ఫండ్ బాడీ ఏకీకృత సభ్యుల పోర్టల్లో అధిక పెన్షన్ కోసం సంయుక్తంగా దరఖాస్తు చేసుకోవచ్చు. గత నవంబర్లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పునకు లోబడి దీనికి సంబంధించిన అర్హతలపై ఈపీఎఫ్ఓ తన జోనల్ కార్యాలయాల్లోని అదనపు చీఫ్ ప్రావిడెంట్ కమిషనర్లు, ఈపీఎఫ్ఓ ప్రాంతీయ కార్యాలయాల్లోని రీజినల్ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్లకు ప్రత్యేక సూచనలు చేసిన సంగతి తెలిసిందే. -
వొడాఫోన్ ఓసీడీల జారీకి చెక్, ముగిసిన గడువు
న్యూఢిల్లీ: భారీ రుణ భారాన్ని మోస్తున్న వొడాఫోన్ ఐడియా ప్రతిపాదిత ఐచ్చిక మార్పిడిగల డిబెంచర్ల(ఓసీడీలు) జారీకి తాజాగా చెక్ పడింది. మొబైల్ టవర్ల సంస్థ ఏటీసీ టెలికం ఇన్ఫ్రాస్ట్రక్చర్కు రూ. 1,600 కోట్ల విలువైన ఓసీడీల జారీకి కంపెనీ గతంలో ప్రతిపాదించింది. అయితే ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన కనిపించక పోవడంతో ఇందుకు గడువు తిరిపోయినట్లు మొబైల్ టెలికం దిగ్గజం వొడాఫోన్ ఐడియా తాజాగా వెల్లడించింది. వడ్డీబకాయిలను ఈక్విటీగా మార్పు చేసుకునే విషయంలో ప్రభుత్వం నుంచి ఎలాంటి సమాచారం లభించలేదని పేర్కొంది. ఏటీసీ టెలికంకు ప్రిఫరెన్షియల్ పద్ధతిలో రూ. 1,600 కోట్ల విలువైన ఓసీడీలను జారీ చేసేందుకు గత నెలలో వొడాఫోన్ ఐడియా వాటాదారులు అనుమతించారు. అయితే వీటిని 15 రోజుల్లోగా జారీ చేయవలసి ఉన్నట్లు వొడాఫోన్ ఐడియా తెలియజేసింది. అంతకంటే ముందు ప్రభుత్వానికి 16వేల రూపాయల కోట్ల వడ్డీ(స్పెక్ట్రమ్, ఏజీఆర్) బకాయిలకుగాను ఈక్వీటీని జారీ చేయవలసి ఉన్నట్లు వివరించింది. దీంతో ఈ ఒప్పందాన్ని పొడిగించేందుకు ఏటీసీతో చర్చలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించింది. అవసరానుగుణంగా వాటాదారుల నుంచి మరోసారి అనుమతి తీసుకోనున్నట్లు పేర్కొంది. చెక్ -
ఆధార్ కార్డు హోల్డర్లకు హెచ్చరిక.. ఇలా చేయకపోతే ఇబ్బందులు తప్పవ్!
ఇటీవల ఆధార్ కార్డ్ అనేది చాలా ముఖ్యంగా మారిపోయింది. ప్రస్తుతం ప్రతి దానిలో ఆధార్ అనుసంధానం చేయాల్సి వస్తోంది. ఇప్పటి వరకు చాలా వాటిలో ఈ అనుసంధాన ప్రక్రియ పూర్తవగా, పాన్ కార్డులో ఇది ఇంకా కొనసాగుతోంది. అందుకే ఆధార్ కార్డుతో పాన్ అనుసంధానం చేసుకోవడానికి ఆదాయాపన్ను శాఖ చివరి అవకాశాన్ని కల్పించింది. వచ్చే ఏడాది మార్చి 31వ ( March 2023) లోపు లింక్ చేసుకోవాలిని సూచిస్తోంది. వాస్తవానికి ఈ అనుసంధానం కోసం ఇప్పటికే పలుమార్లు గడువు ఇచ్చింది ఐటీ శాఖ. ఈ క్రమంలో మరో మారు గడువు పెంచే యోచనలో ప్రభుత్వం లేనట్లు తెలుస్తోంది. గడువు వచ్చే ఏడాది మార్చి వరకు ఇచ్చినా, ఇక్కడ ఇంకో నిబంధన కూడా తెలిపింది. ఈ ఏడాది జూన్ వరకు పాన్ కార్డుతో ఆధార్తో లింకు చేసుకోవడానికి ఉచితంగా అవకాశం కల్పించింది. జూన్ తర్వాత గడువు లోపు లింకు చేస్తున్న వారు రూ.1000 చెల్లించాల్సి ఉంటుంది. గతంలోనే జూన్ 30 వరకు ఉన్న పాన్-ఆధార్ లింక్ గడువును సెప్టెంబర్ 30 వరకు పొడగించిన సంగతి తెలిసిందే. తాజా పరిస్థితులు గమనిస్తే.. మరోమారు ఈ ప్రక్రియకు పొడగించే అవకాశాలు తక్కువగా కనిపిస్తున్నాయి. అందుకే ఈ గడువు తేదిలోపు లింక్ చేసుకోవడం ఉత్తమం. మీ పాన్ను ఆధార్తో లింక్ చేయకపోతే బ్యాంకింగ్ లావాదేవీల విషయంలో అసౌకర్యానికి గురి అయ్యే అవకాశం అవకాశం ఉంటుంది. ఇంకా పెన్షన్, స్కాలర్షిప్, ఎల్పీజి సబ్సిడీ వంటి పథకాలకు ద్రవ్య ప్రయోజనాలను పొందేటప్పుడు పాన్ తప్పనిసరి. చదవండి: ఆన్లైన్ షాపింగ్ మోసాలు: రూల్స్ ఏం చెప్తున్నాయి, ఎలా కంప్లైంట్ చేయాలి! -
మస్క్ మరో బాంబు: వన్ అండ్ ఓన్లీ ఆప్షన్, డెడ్లైన్
న్యూఢిల్లీ: ట్విటర్ టేకోవర్ తరువాత బిలియనీర్, టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ ట్విటర్ ఉద్యోగులకు చుక్కలు చూపిస్తున్నారు. ట్విటర్ డీల్ పూర్తి చేసిన వెంటనే కీలక ఉద్యోగులపై వేటు, వారం రోజుల్లో సంస్థలో సగం మందిని ఇంటికి పంపించిన మస్క్ మిగిలిన ఉద్యోగులకు కూడా కఠిన షరతులు పెడుతున్నారు. చాలా తీవ్రంగా పని చేస్తారా లేక నిష్క్రమిస్తారా తేల్చుకోవాలంటూ ఉద్యోగులకు డెడ్లైన్ విధించారు. ఈ మేరకు ఉద్యోగులకు ఈ మెయిల్ సమాచారం అందించింది ట్విటర్. కంపెనీతో కలిసి ఉండటానికి ప్రతిజ్ఞ చేయాలని, ట్విటర్ సంస్థాగతపునర్నిర్మాణంలో భాగంగా తీవ్ర ఒత్తిడితో, ఎక్కువ గంటలు పని చేయాలని లేదా వైదొలగేందుకు అంగీకరించాలని ఈ మెయిల్ సందేశాన్ని ఉద్యోగులకు అందించింది. న్యూయార్క్ కాలమానం ప్రకారం నవంబర్ 17వ తేదీ గురువారం సాయంత్రం 5 గంటలలోపు ఆన్లైన్ ఫారమ్ను పూర్తి చేయాల్సిందేనని స్పష్టం చేసింది. ఉద్యోగులు పూర్తి చేయాలని మస్క్ కోరుకున్న ఫారమ్లో ఒకే ప్రశ్న ఉంది: "మీరు ట్విట్టర్లో ఉండాలనుకుంటున్నారా?" అలాగే ఆన్లైన్ ఫాంని సమర్పించేందుకు .. నో అనే అప్షన్ లేనేలేదు. కేవలం ఎస్ అనే ఆప్షన్ మాత్రమే ఇచ్చింది. దీనికి అంగీకరించని వాళ్లు మూడు నెలల సెవరెన్స్ పే అందుకుంటారని ఇమెయిల్ పేర్కొంది. అంతేకాదు అసాధారణ పనితీరు ఆధారంగానే గ్రేడ్ ఉంటుందని ట్విటర్ తెగేసి చెప్పింది. (మస్క్ 13 కిలోల వెయిట్ లాస్ జర్నీ: ఫాస్టింగ్ యాప్పై ప్రశంసలు) సంస్థ ఆదాయం 50 శాతం పెంచేలా ఉద్యోగులు కష్టపడాల్సిందేనంటూ తన తొలి ఈమెయిల్లో మస్క్ ఆదేశాలు జారీ చేశారనీ, అలాగే సంస్థ సక్సెస్ కోసం చాలా హార్డ్కోర్గా ఉండాలని ఆదేశించిన ఈమెయిల్ సందేశాన్ని ఉటంకిస్తూ, వాషింగ్టన్ పోస్ట్, బ్లూమ్బెర్గ్ రిపోర్ట్ చేశాయి. దీనిపై పలువురు ఉద్యోగులు సలహా కోసం న్యాయవాదులను సంప్రదిస్తుండగా, తాజా పరిణామంపై ఉద్యోగ, పౌరహక్కుల సంఘాలు విమర్శలు గుప్పిస్తున్నాయని తెలుస్తోంది. -
డెబిట్, క్రెడిట్ కార్డు నిబంధనలు: చివరి తేదీ వచ్చేస్తోంది
సాక్షి,ముంబై: ఆన్లైన్ షాపింగ్ సౌలభ్యం కోసం ఆర్బీఐ‘టోకనైజేషన్’ అనే కొత్త పద్దతిని ప్రవేశపెట్టింది. అలాగే చాలా సురకక్షితంగా కాంటాక్ట్ లెస్ చెల్లింపులు చేసుకోవచ్చని కేంద్ర బ్యాంకు వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆన్లైన్,ఆఫ్సేల్ యాప్లో లావాదేవీలలో ఉపయోగించిన మొత్తం క్రెడిట్, డెబిట్ కార్డ్ డేటాను సెప్టెంబర్ 30, 2022 నాటికి ప్రత్యేక టోకెన్లతో భర్తీ చేయాలని ఆదేశించింది. బ్యాంకులు, నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు జూలై 1 నుండి 'క్రెడిట్ కార్డ్ డెబిట్ కార్డ్' మార్గదర్శకాలను అమలు చేయాల్సవ ఉంది. అయితే, పరిశ్రమ వాటాదారుల విజ్ఞప్తి మేరకు ఈ గడువును అక్టోబరు 1కి పెంచింది. కస్టమర్లు సురక్షితమైన లావాదేవీలు చేయడంలో సహాయపడతాయని, కార్డ్ వివరాలు ఎన్క్రిప్టెడ్ “టోకెన్”గా స్టోర్ అవుతాయని తెలిపింది. ఒరిజినల్ కార్డ్ డేటాను ఎన్క్రిప్టెడ్ డిజిటల్ టోకెన్తో భర్తీ చేయడం తప్పనిసరి చేసింది. ఈ టోకెన్లు కస్టమర్ వివరాలను బహిర్గతం చేయకుండా చెల్లింపు చేయడానికి అనుమతిస్తాయి. ఫలితంగా కార్డ్ హోల్డర్ల ఆన్లైన్ లావాదేవీల అనుభవాలను మెరుగుపరుస్తుంది. సైబర్ నేరగాళ్లనుంచి కార్డ్ సమాచారాన్ని భద్ర పరుస్తుంది. కార్డులు లేకుండానే ఆన్ లైన్ లో షాపింగ్ చేసుకోవచ్చు. ఆన్ లైన్ షాపింగ్ లో దిగ్గజాలైన అమెజాన్, ప్లిఫ్ కార్ట్, బిగ్ బాస్కెట్..ఇతరత్రా ఆన్ లైన్ వెబ్ సైట్ లలో షాపింగ్ మరింత సులభతరం చేయాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భావిస్తోంది. అందుకనుగుణంగా మార్పులు, చేర్పులు చేస్తోంది. కొత్త సంవత్సరం సందర్భంగా 2022, జనవరి నుంచి డెబిట్, క్రెడిట్ కార్డులు లేకుండానే ఆన్ లైన్ షాపింగ్ చేసేందుకు కొత్త చెల్లింపుల విధానాన్ని ప్రవేశపెట్టింది. దీని ద్వారా ప్రజల సమాచారం కూడా భద్రంగా వీలు ఉండే అవకాశం ఉందని వెల్లడిస్తోంది. టోకెన్లు ఎలా రూపొందించుకోవాలి ♦ కొనుగోలుకుముందు చెల్లింపు లావాదేవీని ప్రారంభించడానికి, ఇ-కామర్స్ వ్యాపారి వెబ్సైట్ లేదా అప్లికేషన్కు వెళ్లాలి ♦ ఉత్పత్తులను కొనుగోలు చేసే క్రమంలో..తమ కార్డు పూర్తి సమాచారం నమోదు చేయాల్సి ఉంటుంది. ♦ షాపింగ్ వెబ్ సైట్ కు చెందిన చెక్ అవుట్ పేజీలో కార్డు వివరాలను నమోదు చేయాలి. అనంతరం టోకనైజేషన్ సెలక్ట్ చేసుకోవాలి. ♦ క్రియేట్ టోకెన్ను సెలక్ట్ చేసి,అధికారిక మొబైల్ ఫోన్ లేదా ఇమెయిల్లో ద్వారా వచ్చిన ఓటీపీ ఎంటర్ చేయాలి. దీంతోటోలావాదేవీ పూర్తి అవుతుంది. ♦ తమకు నచ్చినన్ని కార్డులను టోకనైజ్ చేసుకొనే ఛాన్స్ ఉంది. అదే వెబ్సైట్ లేదాయాప్లో తదుపరి కొనుగోళ్లకు నాలుగు అంకెల టోకెన్ ఇస్తే సరిపోతుంది. ♦ తద్వారా మోసాలకు తావుండదని, కొనుగోలుదారు సమాచారాన్ని సేకరించడం హ్యాకర్లకు కష్టమవుతుందని ఆర్బీఐ అభిప్రాయం. ♦ దీని ప్రకారం ఇకపై 16 అంకెల కార్డు వివరాలను, కార్డు గడువు తేదీని గుర్తించుకోవాల్సిన అవసరం ఉండదు. అలాగే కార్డ్ జారీ చేసేవారు క్రెడిట్ కార్డ్ను యాక్టివేట్ చేయడానికి కార్డ్ హోల్డర్ నుండి వన్ టైమ్ పాస్వర్డ్ ఆధారిత సమ్మతిని తప్పనిసరిగా పొందాలి. ఒకవేళ అది జారీ చేసిన తేదీ నుండి 30 రోజుల కంటే ఎక్కువ కస్టమర్ యాక్టివేట్ చేయపోతే, ఎలాంటి సమ్మతి రాకపోయినా, కన్ఫర్మేషన్ కోరిన తేదీ నుండి ఏడు పని దినాలలోగా, కస్టమర్కు ఎటువంటి ఖర్చు లేకుండా క్రెడిట్ కార్డ్ ఖాతా క్లోజ్ అవుతుంది. -
రిలయన్స్ క్యాపిటల్ ప్రణాళికకు డెడ్లైన్ పొడిగింపు
న్యూఢిల్లీ: ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన రిలయన్స్ క్యాపిటల్ను (ఆర్సీఎల్) కొనుగోలు చేసేందుకు ఆసక్తి గల సంస్థలు తగు పరిష్కార ప్రణాళిక సమర్పించేందుకు గడువును రుణదాతలు ఆగస్టు 28 వరకూ పొడిగించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. విలువ మదింపు కోసం మరింత సమయం కావాలంటూ బిడ్డర్లు కోరడంతో డెడ్లైన్ను పొడిగించడం ఇది అయిదోసారని పేర్కొన్నాయి. గడువు ఆగస్టు 10తో ముగియాల్సి ఉంది. బరిలో ఉన్న పిరమల్, టోరెంట్ సంస్థలు సెప్టెంబర్ 30 వరకూ సమయం ఇవ్వాలని కోరగా రుణదాతల కమిటీ (సీవోసీ) తిరస్కరించింది. ఇండస్ఇండ్ బ్యాంక్ ఆగస్టు 30 వరకూ గడువు కోరింది. వాస్తవానికి పరిష్కార ప్రణాళిక సమర్పించేందుకు మే 26 అసలు డెడ్లైన్. అప్పటి నుంచి దాన్ని పొడిగిస్తూ వస్తున్నారు. చెల్లింపుల్లో విఫలం కావడంతో పాటు గవర్నెన్స్పరంగా లోపాలు ఉండటంతో గతేడాది నవంబర్ 29న ఆర్సీఎల్ బోర్డును రిజర్వ్ బ్యాంక్ రద్దు చేసి అడ్మినిస్ట్రేటరును నియమించింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో కంపెనీ విక్రయానికి అడ్మినిస్ట్రేటర్ బిడ్లను ఆహ్వానించారు. -
నిను వీడని నీడను నేనే.. మనశ్శాంతి ఉండదు! త్వరపడండి!
సాక్షి,ముంబై: ఈ రోజుతో కలిపి లెక్కిస్తే మరోవారంలో ఆదాయపు పన్ను రిటర్నులు గడువు దాఖలు చేయడానికి తేదీ ముగుస్తోంది. ఆన్లైన్ కాబట్టి 31-07-2022 అర్ధరాత్రి వరకూ టైం ఉంది. గడువు తేదీ పెంచమని అభ్యర్ధనలు ఇస్తున్నారు. దాదాపు గడువుపెంచేది లేదని ఇప్పటికే తేల్చి చెప్పినప్పటికీ చివరిదాకా కానీ అధికారులు ఏ విషయమూ చెప్పరు. కాబట్టి అందాకా వేచి ఉండకండి. ఆలస్యం చేస్తే అనర్ధాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. చట్టప్రకారం గడువు తేదీ లోపల రిటర్ను మీరు దాఖలు చేయాలి. అలా చేయకపోతే ఎన్నో అనర్ధాలు, ఇబ్బందులు, సమస్యలు. ► గడువు తేదీ దాటిన తర్వాత ప్రతి నెలకు .. (నెలలో ఎప్పుడు వేసినా నెల కిందే లెక్కిస్తారు) 1 శాతం చొప్పున వడ్డీ చెల్లించాలి. వివిధ సెక్షన్ల కింద చెల్లిచాల్సిన వడ్డీ తడిసి మోపెడు అవుతుంది. ► వడ్డీతోపాటు అదనంగా జరిమానా పడుతుంది. జరిమానాలు, వడ్డీలు చెల్లించడం వల్ల ఆదాయం పెరగదు, పన్ను భారం తగ్గదు. ఏ ప్రయోజనం లేకుండా వీటిని చెల్లించాలి. మీకు ఎటువంటి ఆధిక్యత, శక్తి, అర్హత, ప్రమాణాలు పెరగవు. ► మీకు ఏదేని కారణం వల్ల నష్టం ఏర్పడితే ఆ నష్టాన్ని వచ్చే సంవత్సరానికి బదిలీ చేసే అవకాశం (దీన్నే క్యారీ ఫార్వార్డ్ అంటారు) రద్దయిపోతుంది. శాశ్వతంగా, హమేషాగా పోతుంది. ఇది నిజంగా అసలైన ‘‘నష్టం’’. ► రిఫండ్ కేసులో గడువు తేదీ తర్వాత దాఖలు చేస్తే రిఫండ్ మొత్తం మీద వడ్డీ ఇవ్వరు. ఆలస్యం చేసినందుకు మీకు వడ్డీ పడకపోవచ్చు కానీ ‘‘జరిమానా’’ పడుతుంది. జరిమానా మేరకు తగ్గించి మిగతా మొత్తాన్నే ఇస్తారు. అంటే రెండు నష్టాలన్నమాట. ► రుణ సదుపాయం కావాలనుకునే వారికి సంబంధించి ఆదాయపు పన్ను రిటర్నులను ఎంతో ప్రామాణికంగా తీసుకుంటారు. ఆదాయానికి తగినంత పన్ను చెల్లించడం చట్టప్రకారం అవసరం. తప్పనిసరి. మీది లేదా మీ సంస్థకి సంబంధించి ‘‘పరపతి’’, సామర్థ్యం పెరుగు తాయి. మీరు అప్లికెంటుగా వ్యవహరించినా, గ్యారంటీదారుగా వ్యవహరించినా ఈ సామర్థ్యం పర్మనెంటుగా రికార్డు రూపంలో ఉంటుంది. కొన్ని సంస్థలు ఆలస్యంగా ఫైల్ చేయడాన్ని తీవ్రంగా పరిగణిస్తాయి. ► విదేశాలు వెళ్లేవారికి వీసా విషయంలో ఇతర సందర్భాల్లో మీ క్రెడిబిలిటీకి, మీ క్లీన్ రికార్డుకు, మీ డిగ్నిటీకి, మీ గొప్పకు, సత్ప్రవర్తనకు, దేశ చట్టాలను గౌరవించే సంస్కృతికి.. సకాలంలో రిటర్నులు వేయడం ఒక గీటురాయి. ► వడ్డీతో, జరిమానాతో సరిపోతుందంటే సరే సరి. డిఫాల్టరుగా పరిగణించి డిపార్ట్మెంట్ మీకు శ్రీముఖాలు.. అంటే నోటీసులు పంపుతారు. నోటీసులకు జవాబు ఇవ్వాలి. రిటర్ను వేయాలి. వివరణలు ఇవ్వాలి. వివరణ సరిపోకపోయినా.. సంతృప్తికరంగా లేకపోయినా మరో నోటీసు.. రిమైండర్ నోటీసు.. వెరసి మీకు మనశ్సాంతి ఉండదు. ‘‘నిను వీడని నీడను నేనే’’ లాగా సాగుతుంది. ఇలా ఎన్నో చెప్పవచ్చు. సకాలంలో రిటర్నులు వేసినంతనే సంతోషం.. సుఖం.. శాంతి.. పరపతి.. చట్టనిబద్ధత ఏర్పడతాయి. ఇది కూడా చదవండి: ఆదాయ పన్నుపరిధిలోకి రాకపోయినా, ఐటీఆర్ ఫైలింగ్ లాభాలు తెలుసా? జొమాటోకు భారీ షాక్, ఎందుకంటే? -
ఐటీఆర్ ఫైల్ చేశారా? లేదా? లేదంటే కత వేరుంటది!
సాక్షి, న్యూఢిల్లీ: ఆదాయపు పన్ను రిటర్న్స్ ( ఐటీఆర్) దాఖలు చేయడానికి చివరి తేదీ దగ్గర పడుతోంది. 2021-22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేయడానికి జూలై 31 చివరి తేదీ. గడువులోగా ఐటీఆర్ ఫైల్ చేస్తే పెనాల్టీ తప్పించుకోవడం మాత్రమే కాదు ఇతర బెనిఫిట్స్ కూడా చాలా ఉన్నాయి. ఈ నేపథ్యంలో గడువులోగా ఐటీ రిటర్స్ ఫైల్ చేస్తే వచ్చే లాభాలు, ఫైల్ చేయకపోతే వచ్చే నష్టాల గురించి ఒకసారి చూద్దాం. గడువు కంటే ముందే ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయడంలోని ప్రాముఖ్యత, ప్రయోజనాలు ♦ పన్ను చెల్లింపుదారులు ఏదైనా జరిమానా లేదా పెనాల్టీని నివారించడానికి గడువు ముగిసేలోపు ఐటీఆర్ను తప్పనిసరిగా ఆన్లైన్లో సమర్పించాలి. ♦ ఖాతాలను ఆడిట్ చేయనవసరం లేని వ్యక్తులు, ఉద్యోగుల ఐటీఆర్ ఫైల్ చేయడానికి చివరి తేదీ జూలై 31. ♦ ఖాతాలను ఆడిట్ చేయాల్సిన వారికి గడువు అక్టోబర్ 31. పెనాల్టీ గడువు తేదీలోపు ఐటీఆర్ ఫైల్ చేయకపోతే ఆదాయపు పన్ను నిబంధనల ప్రకారం 10 వేల రూపాయల దాకా జరిమానా, ఇతర పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఐటీఆర్ ఫైల్ చేయడంలో జాప్యం జరిగితే ఆదాయపు పన్ను చట్టం 1961లోని సెక్షన్ 23ఘే కింద చెల్లించాల్సిన పన్నుపై వడ్డీ కూడా చెల్లించాలి. చట్టపరమైన చర్య ఆదాయపు పన్ను రిటర్న్స్ (ఐటీఆర్) దాఖలు ఆలస్యమైనా లేదా డిఫాల్ట్ అయినా, ఆదాయపు పన్ను శాఖ నోటీసు పంపుతుంది. ఈ నోటీసులకు మనమిచ్చిన సమాధానంతో ఐటీ డిపార్ట్మెంట్ సంతృప్తి చెందకపోతే, ఏమైనా లోపాలు ఉన్నట్టు గమనిస్తే చట్టపరమైన కేసును కూడా ఎదుర్కోవాలి. రుణాలను పొందడం సులభం ఆదాయపు పన్ను రిటర్న్స్ ఫైలింగ్లో క్లీన్ ట్రాక్ రికార్డ్ ఉంటే, బ్యాంకులనుంచి రుణాలను పొందడం సులభమవుతుంది. లోన్లను అందించే సమయంలో ఆదాయానికి రుజువుగా ఐటీఆర్ స్టేట్మెంట్ కాపీని అందించాలని బ్యాంకులు కోరుతున్న సంగతి తెలిసిందే. సో.. అధికారిక రుణం కోసం ఆదాయపు పన్ను రిటర్న్స్ ఫైలింగ్ తప్పనిసరి. ఐటీఆర్ ఫైల్ చేయని వ్యక్తులు సంస్థాగత రుణదాతల నుండి రుణాలు పొందడం కష్టం కేరీ ఫార్వర్డ్ లాసెస్ గడువు తేదీకి ముందు ఐటీఆర్ ఫైల్ చేస్తే వచ్చే ఆర్థిక సంవత్సరానికి నష్టాలను ఫార్వార్డ్ చేయడానికి ఆదాయపు పన్ను నిబంధనలు అనుమతిస్తాయి. ఇది పన్ను చెల్లింపు దారులు తమ భవిష్యత్ ఆదాయాలపై పన్ను బాధ్యతను తగ్గించుకోవడానికి ఉపయోగపడుతుంది. త్వరగా వీసా కావాలంటే వీసాలను పొందే విషయంలో కూడా ఐటీఆర్ ఫైలింగ్ కీలక పాత్ర పోషిస్తుంది. త్వరగా వీసా పొందాలంటే కచ్చితంగా ఐటీఆర్ ఫైలింగ్ క్రమం తప్పకుండా చేయాలి. వీసాల కోసం దరఖాస్తు చేసేటప్పుడు ఐటీఆర్ ఫైలింగ్ హిస్టరీ సమర్పించవలసి ఉంటుంది. దీనికి సంబంధించి క్లీన్ ట్రాక్ రికార్డ్ ఉంటే వీసా అప్లికేషన్ ప్రాసెసింగ్ ఈజీ అవుతుంది. -
రుణ చెల్లింపులో రష్యా విఫలం
మాస్కో/కీవ్: అంతర్జాతీయ ఆంక్షల ప్రభావం రష్యాపై తీవ్రంగానే పడుతోంది. దాంతో విదేశీ రుణాల చెల్లింపులో విఫలమైంది. గత 104 ఏళ్లలో రష్యాకు ఇలాంటి పరిస్థితి ఎదురవడం ఇదే తొలిసారి. ఉక్రెయిన్పై యుద్ధానికి దిగిన నేపత్యంలో స్విఫ్ట్తో పాటు పలు అంతర్జాతీయ చెల్లింపు వ్యవస్థల నుంచి రష్యాను అంతర్జాతీయ సమాజం దూరం పెట్టిన విషయం తెలిసిందే. దాంతో నిధులున్నా కూడా పలు విదేశీ రుణాలపై 10 కోట్ల డాలర్ల మేర వడ్డీలను నిర్ణీత తేదీలోపు రష్యా చెల్లించలేకపోయింది. ఈ మొత్తాన్ని యూరోక్లియర్ బ్యాంకుకు పంపినా అక్కడే నిలిచిపోయింది. చెల్లింపులు ఆగిపోవడం నిజమేనని రష్యా ఆర్థిక మంత్రి ఆంటోన్ సిల్యానోవ్ అంగీకరించారు. అయితే ఇది అంతర్జాతీయ సహాయ నిరాకరణ ఫలితమే తప్ప ఎగవేత కాదని వివరించారు. ఈ నేపథ్యంలో విదేశీ చెల్లింపులను రష్యన్ బ్యాంకు ద్వారా రూబుల్స్లో చెల్లించాలని అధ్యక్షుడు పుతిన్ భావిస్తున్నారు. లీసిచాన్స్క్పై నిప్పుల వర్షం డోన్బాస్లోలో ఉక్రెయిన్ ఆధీనంలో ఉన్న చివరి నగరం లీసిచాన్స్క్పై రష్యా సేనలు సోమవారం నిప్పుల వర్షం కురిపించాయి. దాంతో భారీగా ఆస్తి నష్టం జరిగింది. నాటో దేశాధినేతల భేటీ కొనసాగుతుండగానే రష్యా దాడులను ఉధృతం చేయడం గమనార్హం. గత 24 గంటల్లో రష్యా సాగించిన క్షిపణి దాడుల్లో కనీసం ఆరుగురు పౌరులు మృతిచెందారని, మరో 31 మంది గాయపడ్డారని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ కార్యాలయం ప్రకటించింది. ఖర్కీవ్, ఒడెసా, మైకోలైవ్ తదితర నగరాలపై రష్యా దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ఇక స్లొవియాన్స్క్పైనా రష్యా క్లస్టర్ బాంబు ప్రయోగించినట్లు ఉక్రెయిన్ సైనికాధికారులు తెలిపారు. ఈ ఘటనలో పలు భవనాలు ధ్వంసమయ్యాయని పేర్కొన్నారు. స్లొవియాన్స్క్లో ఉక్రెయిన్ మిలటరీ బేస్ ఉంది. 1,000 మంది ఉన్న మాల్పై... రష్యా క్షిపణి దాడి ఉక్రెయిన్లో సామాన్య పౌరులపైనా రష్యా సేనలు క్షిపణి దాడులు చేస్తుండడం ఆందోళన కలిగిస్తోంది. సోమవారం మధ్యాహ్నం క్రెమెన్చుక్లో 1,000 మందికిపైగా జనంతో కిక్కిరిసి ఉన్న ఓ భారీ షాపింగ్ మాల్పై రష్యా భీకర దాడికి దిగింది. ఈ ఘటనలో ఇప్పటికే 10 మందికి పైగా మరణించారని, 40కి పైగా గాయపడ్డారని ఉక్రెయిన్ అధికారులు ప్రకటించారు. మృతుల సంఖ్య భారీగా పెరిగే ప్రమాదముందన్నారు. దాడి తర్వాత షాపింగ్ మాల్ మంటల్లో చిక్కుకుంది. జనం హాహాకారాలు చేస్తూ బయటకు పరుగులు తీస్తున్న దృశ్యాలు మీడియాలో కనిపించాయి. క్రెమెన్చుక్లో రష్యా క్షిపణి దాడి పట్ల ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ స్పందించారు. బాధితుల సంఖ్యను ఊహించడం సాధ్యం కాదని చెప్పారు. రష్యా నుంచి మర్యాద, మానవత్వాన్ని ఆశించడం అత్యాశే అవుతుందన్నారు. సాధారణ జనజీవితాలను రష్యా అస్తవ్యస్తం చేస్తోందని మండిపడ్డారు. సెంట్రల్ ఉక్రెయిన్లో ఉన్న క్రెమెన్చుక్ ప్రముఖ పారిశ్రామికకేంద్రంగా అభివృద్ధి చెందింది. -
సీఎం అభ్యర్థిని ప్రకటించండి!
చండీగఢ్: పంజాబ్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కాంగ్రెస్లో అంతర్గత విభేదాలు బయటపడుతున్నాయి. వచ్చే 7– 10 రోజుల్లో పంజాబ్ కాంగ్రెస్ అభ్యర్థి పేరును ప్రకటించాలని రాహుల్గాంధీకి పీపీసీసీ చీఫ్ నవ్జోత్సింగ్ సిద్ధూ గురువారం డెడ్లైన్ విధించారు. జలంధర్లో జరుగుతున్న ప్రచారంలో రాహుల్ను సిద్ధూ ప్రశ్నించారు. తనను షోకేస్లో బొమ్మలాగా ఎల్లకాలం చూపాలని కోరడం లేదని సిద్ధూ స్పష్టం చేశారు. సీఎం అభ్యర్ధి విషయంలో కాంగ్రెస్ హైకమాండ్ తక్షణం నిర్ణయం తీసుకోవాలని కోరారు. కాంగ్రెస్ను ఎవరు నడిపిస్తారో పంజాబ్ ప్రజలకు వెల్లడించాలని, అప్పుడే కాంగ్రెస్ సులభంగా 70 సీట్లు నెగ్గుతుందని చెప్పారు. ఇదే వేదికపై ఉన్న ప్రస్తుత సీఎం చరణ్జిత్ సింగ్ చన్నీ కూడా అదే డిమాండ్ను వినిపించారు. వేదికపై సిద్దూను ఆలింగనం చేసుకొని తమ మధ్య ఏలాంటి విభేదాలు లేవని చెప్పారు. అయితే సీఎం అభ్యర్ధి పేరును ప్రకటించడం ద్వారా అరవింద్ కేజ్రీవాల్ నోరు మూయించాలని చన్నీ కోరారు. పంజాబ్ కోసం తాను ప్రాణమిస్తానని, అయితే ప్రజలు ఈ రోజు సీఎం అభ్యర్ధి ఎవరని అడుగుతున్నారని చెప్పారు. రాహుల్ తనకు ఎన్నో ఇచ్చారన్నారు. సీఎం కేండిడేట్గా ఎవరిని ప్రకటించినా తనకు సంతోషమేనన్నారు. కాంగ్రెస్కు పెళ్లికొడుకు ( సీఎం అభ్యర్ధి) లేరనే కేజ్రీవాల్ విమర్శలు వినదలుచుకోలేదని చెప్పారు. త్వరలో నిర్ణయిస్తాం పంజాబ్ కాంగ్రెస్ కార్యకర్తలను సంప్రదించిన అనంతరం సీఎం అభ్యర్థిని త్వరలో ప్రకటిస్తామని రాహుల్గాంధీ ప్రకటించారు. అలా ప్రకటించాల్సిన అవసరం ఉందో, లేదో కూడా కార్యకర్తలను అడుగుతామన్నారు. ఎవరో ఒక్కరే పార్టీని ముం దుండి నడిపిస్తారని చెప్పారు. ఒకరికి అవకాశం ఇస్తే మరొకరు మద్దతు ఇస్తామని ఇద్దరూ(చన్నీ, సిద్ధూ) వాగ్దానం చేశారని, ఇద్దరి గుండెల్లో కాంగ్రెస్ ఉందని ఆయన వ్యాఖ్యానించారు. -
క్రిప్టో ఇన్వెస్టర్లకు కేంద్రం డెడ్లైన్..! ఉల్లంఘిస్తే భారీ జరిమానా..!
పార్లమెంట్లో క్రిప్టోకరెన్సీపై నియంత్రణ బిల్లును ప్రవేశపెట్టేందుకు కేంద్రం సిద్ధమైన విషయం తెలిసిందే. బిల్లు వస్తోన్న నేపథ్యంలో...భారత్లోని క్రిప్టోకరెన్సీ హోల్డర్స్ ఆస్తులను ప్రకటించడానికి, రాబోయే కొత్త నిబంధనలకు అనుగుణంగా ఉండటానికి వారికి గడువు ఇవ్వాలనే ప్రతిపాదనలను కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తోన్నట్లు బ్లూమ్బర్గ్ ఒక నివేదికలో పేర్కొంది. ఆస్తులుగా పరిగణించే అవకాశం..! ముఖ్యంగా క్రిప్టోకరెన్సీలను పర్యవేక్షించడానికి, నియంత్రించడానికి సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) పర్యవేక్షించనున్నట్లు తెలుస్తోంది. క్రిప్టోకరెన్సీలను ఫైనాన్షియల్ ఆస్తులుగానే పరిగణించే అవకాశం ఉంది. ఇటీవల సర్క్యులేట్ చేయబడిన క్యాబినెట్ నోట్ ప్రకారం...క్రిప్టోకరెన్సీలకు బదులుగా బిల్లులో 'క్రిప్టో ఆస్తులు' అనే పదాన్ని చేర్చనున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా వచ్చే ఏడాది ప్రారంభంలో ఆర్బీఐ రిలీజ్ చేస్తోన్న డిజిటల్ కరెన్సీలకు, క్రిప్టో కరెన్సీలకు స్పష్టమైన వ్యత్యాసం ఉండనుంది. ఉల్లంఘిస్తే రూ. 20 కోట్ల జరిమానా..! క్రిప్టోకరెన్సీపై కేంద్ర ప్రభుత్వం తెస్తోన్న బిల్లును క్రిప్టో ఇన్వెస్టర్లు ఉల్లంఘిస్తే ఏకంగా రూ. 20 కోట్ల జరిమానా లేదా 1.5 సంవత్సరాల జైలు శిక్ష విధించే అవకాశం ఉందని బ్లూమ్బెర్గ్ నివేదించింది. అంతేకాకుండా చిన్న పెట్టుబడిదారులను రక్షించడానికి క్రిప్టో ఆస్తులలో పెట్టుబడి పెట్టడానికి సంబంధించి కనీస థ్రెషోల్డ్ లేదా పరిమితిని కేంద్రం సెట్ చేయనున్నట్లు తెలుస్తోంది. వర్చువల్ కరెన్సీల ద్వారా జరిపే లావాదేవీలపై పన్నులను విధించే అవకాశం ఉన్నట్లు బ్లూమ్బర్గ్ పేర్కొంది. భారత్లో 641 శాతం మేర వృద్ధి..! చైనాలిసిస్ నివేదిక ప్రకారం...2021లో భారత్లో క్రిప్టో ఇన్వెస్టర్లు ఏకంగా 641 శాతం మేర పెరిగారని వెల్లడించింది. అంతేకాకుండా 2021 గ్లోబల్ క్రిప్టో అడాప్షన్ ఇండెక్స్ ప్రకారం 154 దేశాలలో క్రిప్టోకరెన్సీ యజమానుల సంఖ్య పరంగా రెండో స్థానంలో... 'క్రిప్టో-అవగాహన'లో ఏడో దేశంగా భారత్ నిలిచింది. చదవండి: క్రిప్టోకరెన్సీ బిల్లు..! ఆర్థిక శాఖ కీలక వ్యాఖ్యలు..! -
15 వరకే ఎయిరిండియా గడువు
న్యూఢిల్లీ: పీఎస్యూ దిగ్గజం ఎయిరిండియా కొనుగోలుకి బిడ్స్ దాఖలు గడువు ఈ నెల 15తో ముగియనున్నట్లు అధికారిక వర్గాలు స్పష్టం చేశాయి. ప్రాథమిక బిడ్స్ దాఖలుకు ఇంతవరకూ ఐదుసార్లు గడువును పొడిగించిన నేపథ్యంలో దీనికి ప్రాధాన్యత ఏర్పడింది. గతేడాది డిసెంబర్లో టాటా గ్రూప్సహా పలు కంపెనీలు ప్రాథమిక బిడ్స్ దాఖలు చేశాయి. ఎయిరిండియా కొనుగోలుకి అర్హత సాధించిన కంపెనీలకు వర్చువల్ డేటా రూమ్(వీడీఆర్) ద్వారా తగిన సమాచారాన్ని పొందేందుకు వీలుంటుంది. ప్రాథమిక బిడ్స్ విశ్లేషణ తదుపరి ఈ ఏడాది ఏప్రిల్లో ప్రభుత్వం ఫైనాన్షియల్ బిడ్స్కు ఆహ్వానం పలికిన సంగతి తెలిసిందే. వీటికి సెపె్టంబర్ 15 వరకూ గడువును ప్రకటించింది. గడువు ముగిశాక ప్రభుత్వం రిజర్వ్ ధరపై నిర్ణయాన్ని తీసుకోనున్నట్లు అధికారిక వర్గాలు తెలియజేశాయి. తద్వారా భారీ నష్టాలతో సవాళ్లు ఎదుర్కొంటున్న ఎయిరిండియా విక్రయం డిసెంబర్ చివరికల్లా పూర్తయ్యే వీలున్నట్లు వివరించాయి. -
ఇన్ఫీకి సెప్టెంబర్ 15 డెడ్లైన్
న్యూఢిల్లీ: కొత్త ఐటీ (ఆదాయ పన్ను) పోర్టల్లో లోపాలన్నింటినీ సెప్టెంబర్ 15లోగా సరిదిద్దాలంటూ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ దిగ్గజం ఇన్ఫోసిస్కు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ డెడ్లైన్ విధించారు. పోర్టల్ సమస్యలపై ఇన్ఫీ సీఈవో సలిల్ పరేఖ్, ఆయన బృందంతో మంత్రి సోమవారం భేటీ అయ్యారు. వెబ్సైట్ అందుబాటులోకి వచ్చి రెండున్నర నెలలు అవుతున్నా సాంకేతిక సమస్యలు వెన్నాడుతుండటంపై ఆమె తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. లోపాలను పరిష్కరించలేకపోతుండటంపై వివరణ ఇవ్వాలని ఆదేశించారు. ఆదాయ పన్ను శాఖ ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. ‘పోర్టల్ విషయంలో పన్ను చెల్లింపుదారులు, నిపుణులు ఎదుర్కొంటున్న సమస్యలను సెప్టెంబర్ 15లోగా పరిష్కరించాలంటూ మంత్రి ఆదేశించారు‘ అని పేర్కొంది. ఈ ప్రాజెక్టుపై 750 మంది పైగా సిబ్బంది పనిచేస్తున్నారని, సీవోవో ప్రవీణ్ రావు స్వయంగా పర్యవేక్షిస్తున్నారని నిర్మలా సీతారామన్కు పరేఖ్ వివరించారు. ఈ అంశంపై ఇన్ఫీ అధికారులతో నిర్మలా సీతారామన్ సమావేశం కావడం ఇది రెండోసారి. గతంలో జూన్ 22న పరేఖ్, ఇన్ఫీ సీవోవో ప్రవీణ్ రావులతో ఆమె భేటీ అయ్యారు. రిటర్నుల ప్రాసెసింగ్ వ్యవధిని 63 రోజుల నుంచి ఒక్క రోజుకి తగ్గించేందుకు, రిఫండ్ల ప్రక్రియను వేగవంతం చేసేందుకు కొత్త పోర్టల్ రూపొందించే కాంట్రాక్టును 2019లో ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ దక్కించుకుంది. ఈ పోర్టల్ జూన్ 7న అందుబాటులోకి వచ్చింది. అయితే, అప్పట్నుంచీ సాంకేతిక సమస్యలు వెన్నాడుతూనే ఉన్నాయి. తాజాగా రెండు రోజులపాటు నిర్వహణ పనుల కోసమంటూ సైట్ను ఇన్ఫీ నిలిపివేసింది. -
గుర్తుందా.. 15 తర్వాత ఫాస్టాగ్ లేకుంటే..
హైదరాబాద్: టోల్గేట్ల వద్ద నగదు రహిత టోల్ ఫీజు చెల్లింపులకు ప్రవేశపెట్టిన విధానం ‘ఫాస్టాగ్’. వాహనాలు ఆగకుండా వెళ్లేందుకు ప్రవేశపెట్టిన విధానం ఈనెల 15వ తేదీ నుంచి పక్కాగా అమలు చేస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. మీ వాహనాలు ఫాస్టాగ్ విధానంలోకి మార్చుకోకపోతే ఇక టోల్ద్ట్లు దాటలేవు. దానికి ఇంకా వారం రోజులే గడువు ఉండడంతో ప్రభుత్వ అధికారులు అవగాహన కార్యక్రమాలు పెంచారు. దేశవ్యాప్తంగా ఉన్న టోల్గేట్ల వద్ద నగదు రహిత చెల్లింపుల కోసం కేంద్రం ప్రభుత్వం 2017లో ‘ఫాస్టాగ్’ విధానం తీసుకొచ్చింది. అప్పటి నుంచి అమలు చేస్తున్న ఈ విధానం గడువు పొడగిస్తూనే వస్తున్నారు. ఇక ఫిబ్రవరి 15 చివరి గడువు అని కేంద్రం స్పష్టం చేస్తోంది. ఆ తర్వాత ‘ఫాస్టాగ్’ లేకపోతే వాహనం టోల్గేట్ దాటదని అధికారులు చెబుతున్నారు. టోల్గేట్ల వద్ద ట్రాఫిక్ జామ్ తగ్గించడంతో నగదు రహిత చెల్లింపుల ప్రోత్సాహానికి ఈ ఫాస్టాగ్ దోహదం చేస్తుంది. ఫిబ్రవరి 15 డెడ్ లైన్ ఆఖరు అని తేల్చి చెప్పింది. ఫాస్టాగ్ లేకపోతే జాతీయ రహదారులపై మీ కార్లు, లారీలు తదితర వాహనాలు అనుమతించరు. అయితే ఫాస్టాగ్ చేసుకునేందుకు కేంద్రం ఇప్పటికే దేశవ్యాప్తంగా 720 టోల్ప్లాజాల వద్ద ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఇప్పటివరకు చేయించుకోకపోతే వెళ్లి ఫాస్టాగ్ చేసుకోండి. -
టిక్టాక్కు ఫైనల్ వార్నింగ్
వాషింగ్టన్ : చైనా చెందిన ప్రముఖ వీడియో షేరింగ్ సోషల్ నెట్వర్కింగ్ ప్లాట్ఫాం టిక్టాక్ నిషేధం గడువుపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫైనల్ అల్టి మేటం జారీ చేశారు. టిక్టాక్ యాప్ కొనుగోలు వ్యవహారాన్ని సెప్టెంబరు 15లోపు పూర్తి చేసుకోవాలని, లేదంటే నిషేధమేనని తేల్చి చెప్పారు. ఇప్పటికే ఒకసారి గడువు డెడ్ లైన్ పెంచిన ట్రంప్ ఇకపై ఈ గడువు పెంచే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. టిక్టాక్ను ఒక అమెరికన్ కంపెనికి విక్రయిస్తారా, లేదా మూసివేస్తారా తేల్చుకోవాలని ట్రంప్ గురువారం ప్రకటించారు. అమెరికా కంపెనీ యాజమాన్యంలోని లేని టిక్టాక్ను భద్రతా కారణాల దృష్ట్యా నిషేధిస్తామని ట్రంప్ వెల్లడించారు. తాజా పరిణామంపై మైక్రోసాఫ్ట్, ఒరాకిల్, టిక్టాక్ స్పందించాల్సి ఉంది. (టిక్టాక్ : ట్రంప్ తాజా డెడ్లైన్) గత నెలలో జారీ చేసిన కార్యనిర్వాహక ఉత్తర్వులలో ట్రంప్ సెప్టెంబర్ 15వ తేదీని గడువుగా విధించిన సంగతి తెలిసిందే. బీజింగ్ కేంద్రంగా పనిచేస్తున్న ఇంటర్నెట్ టెక్నాలజీ సంస్థ బైట్డాన్స్తో ప్రధానంగా మైక్రోసాఫ్ట్, ఒరాకిల్ చర్చల్లో ఉన్నాయి. మరోవైపు టిక్టాక్ యజమాని బైట్ డాన్స్, నిర్దేశిత గడువు కోల్పోయే అవకాశం ఉందని సమాచారం. అమెరికాలో ఎన్నికలు సమీపిస్తుండటం, చైనా కొత్త నిబంధనలు, బిడ్డర్లతో సంక్షిమైన చర్చల కారణంగా కొనుగోలు ఒప్పందం కుదరకపోవచ్చనే వాదన వినిపిస్తోంది. (టిక్టాక్ : రేసులో మరో దిగ్గజం) -
టిక్టాక్ : ట్రంప్ తాజా డెడ్లైన్
వాషింగ్టన్ : చైనాకు చెందిన ప్రముఖ సోషల్ మీడియా యాప్ ‘టిక్టాక్’ కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ డెడ్ లైన్ ఫిక్స్ చేశారు. అమెరికాకు చెందిన ఏదైనా కంపెనీకి విక్రయించాలని, లేనట్లయితే ఆ యాప్ను తమ దేశంలో నిషేధిస్తామని ఇప్పటికే స్పష్టం చేసిన ఆయన తాజాగా మరో హెచ్చరిక జారీ చేశారు. (మైక్రోసాఫ్ట్ ‘టిక్టాక్’ షో!) టిక్ టాక్ అమెరికా కార్యకలాపాలను ఒక అమెరికన్ కంపెనీకి విక్రయించడానికి ఆరు వారాల గడువు ఇచ్చారు. సెప్టెంబర్ 15వ తేదీ లోపు ఏదో ఒకటి తేల్చుకోవాలని లేదంటే నిషేధం తప్పదని స్పష్టం చేశారు. మైక్రోసాఫ్ట్ , లేదా మరో పెద్ద సంస్థ ఏదైనా తనకు అభ్యంతరం లేదు కానీ సురక్షితమైన అమెరికన్ సంస్థ కావాలి అని ట్రంప్ అన్నారు. భద్రతతో తమకు ఎటువంటి సమస్య ఉండకూడదని తెలిపారు. అలాగే ఈ ఒప్పందం నుండి ప్రభుత్వం ఆర్థిక ప్రయోజనం కోరుకుంటుందని చెప్పారు. మరోవైపు టిక్ టాక్ ను కొనుగోలు చేయనున్నట్టు ఐటీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ ఇప్పటికే ప్రకటించింది. దీనికి సంబంధించిన చర్చలను సెప్టెంబర్ 15 కల్లా పూర్తి చేస్తామని, సమాచార భద్రతకు పటిష్ట చర్యలు తీసుకుంటామని ప్రకటించిన సంగతి తెలిసిందే. -
పన్ను చెల్లింపు దారులకు ఊరట
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి సంక్షోభ సమయంలో ఆదాయ పన్ను శాఖ పన్ను చెల్లింపుదారులకు మరో ఊరట కల్పించింది. ఆదాయపు పన్ను రిటర్నుల (ఐటీఆర్) ఫైలింగ్ గడువును పొడిగించింది. 2019-20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఐటీఆర్ ఫైలింగుల గడువును ఈ ఏడాది నవంబర్ 30 వరకు పొడిగిస్తున్నట్లు ఆదాయపు పన్ను శాఖ శనివారం ప్రకటించింది. ప్రస్తుత కష్టసమయాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నామని ఐటీ శాఖ ట్వీట్ చేసింది. ఇది పరిస్థితులను చక్కదిద్దుకోవడానికి పన్ను చెల్లింపుదారులకు సహాయపడుతుందని పేర్కొంది. Understanding & keeping in mind the times that we are in, we have further extended deadlines. Now, filing of ITR for FY 2019-20 is extended to 30th Nov, 2020. We do hope this helps you plan things better.#ITDateExtension#FacilitationDuringCovid#WeCare #IndiaFightsCorona pic.twitter.com/ZoGBpok3V7 — Income Tax India (@IncomeTaxIndia) July 4, 2020 -
టెల్కోలకు మరోషాక్: డాట్ డెడ్లైన్
సాక్షి, న్యూఢిల్లీ: ఏజీఆర్ బకాయిల చెల్లింపులపై సుప్రీంకోర్టు, తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయగా, తాజాగా టెలికాం విభాగం (డాట్) మరోషాక్ ఇచ్చింది. రాత్రి 11. 59 నిమిషాల్లోపు బకాయిలు చెల్లించాలని భారతీ ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియాకు టెలికాం విభాగం గడువు విధించింది. శుక్రవారం అర్థరాత్రి లోపు మొత్తం బకాయిలు చెల్లించాల్సిందేనని స్పష్టం చేసింది. ఈ మేరకు వారికి డిమాండ్ నోటీసులు జారీ చేసింది. బకాయిల వసూళ్లపై సుప్రీంకోర్టు డాట్పై కూడా ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యంలో ఈ పరిణామం చోటు చేసుకుంది. దీంతో తమకు ఉపశమనం లభిస్తుందని ఎదురు చూస్తున్న టెల్కోలకు ఊహించని షాక్ తగిలింది. ముఖ్యంగా వోడాఫోన్ఐడియాకు ఈ సమయంలో బకాయిలు చెల్లించడం తలకుమించిన భారమే. మరోవైపు సుప్రీంకోర్టు తాజా ఆదేశాలతో వోడాఫోన్ ఐడియా షేరు భారీగా నష్టపోయింది. కాగా ఏజీఆర్ బకాయిల విషయంలో కోర్టు ఆదేశాలను బేఖాతరు చేశారంటూ టెలికం కంపెనీలపై సుప్రీంకోర్టు శుక్రవారం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. బకాయిలను చెల్లించమని ఆదేశాలు జారీచేసినప్పటికీ పెడచెవిన పెట్టడంతో కోర్టు ధిక్కరణకింద భావిస్తున్నట్లు సుప్రీం కోర్టు పేర్కొంది. దీంతో వచ్చే నెల 16న చేపట్టనున్న తదుపరి విచారణకు భారతీ ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా కంపెనీల ఎండీలతోపాటు డైరెక్టర్లను హాజరుకావలసిందిగా ఆదేశాలు జారీ చేసింది. రూ .1.47 లక్షల కోట్లు టెలికాం శాఖకు చెల్లించాలన్న ఆదేశాన్ని పాటించనందుకు వారిపై ధిక్కార చర్యలు ఎందుకు తీసుకోకూడదో వివరించాలని సుప్రీం టెలికాం కంపెనీలను ఆదేశించింది. ఈ అంశంలో సంబంధిత టెలికం శాఖ(డాట్) అధికారిని సైతం కోర్టు తప్పుపట్టింది. భారతీ ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా మొత్తం టెలికాం విభాగానికి రూ .88,624 కోట్లు చెల్లించాల్సివుంది. రిలయన్స్ జియో రూ.177 కోట్లను ఇప్పటికే చెల్లించిన సంగతి తెలిసిందే. చదవండి : రూ.10 వేల కోట్లు కడతాం -
పన్ను చెల్లింపుదారులకు మరో అవకాశం
సాక్షి, న్యూఢిల్లీ: పన్ను చెల్లింపుదారులకు ప్రభుత్వం మరో అవకాశం కల్పించింది. ఆదాయపు పన్ను నేరాల కాంపౌండింగ్ కు కల్పించిన ప్రత్యేక అవకాశాన్ని మరో నెలపాటు పొడిగిస్తూ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సేషన్ (సీబీడీటీ) ప్రకటించింది. డిసెంబరు 31తో ముగిసిన గడువును జనవరి 31 వరకు పెంచుతున్నట్టు సీబీడీటీ జారీ చేసిన ఉత్తర్వులో పేర్కొంది. ఆదాయపు పన్ను నేరాల సమ్మేళనం కోసం దరఖాస్తు చేసుకోవడానికి పన్ను చెల్లింపుదారులు సదుపాయాన్ని పొందటానికి చివరి తేదీ జనవరి 31 వరకు సిబిడిటి పొడిగించినట్లు శుక్రవారం జారీ చేసిన ఉత్తర్వులలో తెలిపింది. ఐపీఏఐ (ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా)తో సహా మిగిలిన క్షేత్ర నిర్మాణాల నుంచి వచ్చిన అభ్యర్ధనల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. ఈ తుది అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరింది. కాగా న్యాయబద్ధమైన కేసుల్లో పన్ను చెల్లింపుదారుల ఇక్కట్లను తప్పించేందుకు, ప్రాసిక్యూషన్ కేసుల పెండింగ్ను తగ్గించేందుకు ‘‘వన్-టైమ్" అవకాశాన్నిగత ఏడాది సెప్టెంబరులో ప్రకటించింది. డిసెంబరు 31వరకు అవకాశాన్నికల్పించింది. పన్ను నేరాలు లేదా పన్ను ఎగవేతకు పాల్పడిన వారు పన్ను బకాయిలు, సర్చార్జీలు చెల్లించేందుకు అవకాశం ఇవ్వాలన్న లక్ష్యంతో వారిపై ప్రాసిక్యూషన్ దాఖలు చేయకపోవడాన్నే కాంపౌండింగ్గా వ్యవహరిస్తారు. -
మహా రాజకీయం : డెడ్లైన్ చేరువైనా అదే ఉత్కంఠ
ముంబై : మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడి 13 రోజులైనా తదుపరి సీఎం ఎవరనేది ఇంతవరకూ వెల్లడికాలేదు. అధికార పంపంకంపై బీజేపీ, శివసేనల మధ్య చిక్కుముడి వీడకపోవడం, శివసేనతో కలిసేందుకు ఇతర విపక్షాలు ముందుకురాని పరిస్థితితో తదుపరి మహారాష్ట్ర సర్కార్ ఏర్పాటులో ప్రతిష్టంభన కొనసాగుతోంది. మరోవైపు ఈనెల 9న నూతన ప్రభుత్వం ఏర్పాటుకు డెడ్లైన్ తరుముకొస్తుండటంతో రాజకీయ పార్టీలతో పాటు సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. డెడ్లైన్ నేపథ్యంలో గురువారం మహారాష్ట్ర గవర్నర్ను బీజేపీ ప్రతినిధి బృందం కలవనుంది. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మేజిక్ ఫిగర్కు ఆ పార్టీ చాలా దూరంలో నిలిచిన క్రమంలో ఈ ప్రతినిధి బృందానికి సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ దూరంగా ఉన్నారు. శివసేన లేకుండా మైనారిటీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు బీజేపీ సుముఖంగా లేదని చెబుతున్నారు. మరోవైపు డెడ్లైన్ ముగిసిన తర్వాత ఏకైక అతిపెద్ద పార్టీగా అవతరించిన బీజేపీని ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ ఆహ్వానించే అవకాశం ఉంది. ఇక ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ శివసేనకు మద్దతు ఇచ్చే విషయంలో కాంగ్రెస్ పార్టీ గ్రీన్సిగ్నల్ ఇవ్వడం లేదని చెబుతున్నారు. సిద్ధాంత వైరుధ్యాల నేపథ్యంలో శివసేన-ఎన్సీపీ-కాంగ్రెస్ కూటమి ప్రభుత్వం కొలువుతీరే అవకాశం లేదని ఆయన అభిప్రాయపడ్డారు. మహారాష్ట్ర ప్రజలు బీజేపీ-శివసేన కూటమికి అనుకూలంగా తీర్పు ఇచ్చినందున ప్రభుత్వ ఏర్పాటుకు ఇరు పార్టీలు చొరవ చూపాలని అన్నారు. కాగా శివసేన మాత్రం తనతో కలిసి వచ్చే పార్టీలను కలుపుకుని ప్రభుత్వ ఏర్పాటుకు సంసిద్ధమని విస్పష్టంగా పేర్కొంటోంది. బీజేపీపై ఒత్తిడి పెంచేలా సేన వ్యాఖ్యలున్నాయని రాజకీయ పరిశీలకులు పేర్కొంటున్నారు. ఇక శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే తన నివాసంలో కొత్తగా ఎన్నికైన పార్టీ ఎమ్మెల్యేలతో భేటీ కానున్నారు. -
ఐటీ రిటర్నుల దాఖలు గడువుపై తప్పుడు ప్రచారం
సాక్షి, న్యూఢిల్లీ: ఆదాయపు పన్ను రిటర్నుల దాఖలుకు సంబంధించి సోషల్ మీడియాలో ఒక తప్పుడు వార్త హల్చల్ చేస్తోంది. దీనిపై కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ), ఐటీ శాఖ స్పందించాయి. 2018-19 సంవత్సరానికి (అసెస్మెంట్ ఇయర్ 2019–20) సంబంధించి ఆదాయపు పన్ను రిటర్నుల దాఖలుకు గడువులో ఎలాంటి పొడిగింపు లేదని సీబీడీటీ స్పష్టం చేసింది. సోషల్ మీడియాలో ప్రచారమవుతున్న ఆర్డర్ ఫేక్ ఆర్డర్ అనీ, ఆగస్టు 31వ తేదీ అంటే రేపటితో ఐటీఆర్ ఫైలింగ్ గడువు ముగియనుందని ఐటీ విభాగం ట్వీట్ చేసింది. ఐటి రిటర్న్స్ దాఖలు చేయడానికి గడువును పొడిగిస్తూ సీబీడీటీ ఆర్డర్ పేరుతో చలామణి అవుతున్న వార్త నిజమైంది కాదని సీబీడీటీ స్పష్టం చేసింది. గడువులోపు పన్ను చెల్లింపుదారులు తమ ఐటీ రిటర్న్లను దాఖలు చేయాలని సూచించింది. కాగా ఐటీఆర్లు దాఖలు చేయడానికి ఐదు వెబ్సైట్లు అందుబాటులో ఉన్నాయి. ఆదాయపు పన్ను విభాగం పోర్టల్... ఐటీఆర్ దాఖలు చేయడానికి అధికారిక వెబ్సైట్గా అందుబాటులో ఉంది. క్లియర్ ట్యాక్స్, మైఐటీ రిటర్న్, ట్యాక్స్స్పానర్, పైసాబజార్ ఈ వెబ్సైట్ల ద్వారా కూడా ఐటీఆర్లు దాఖలు చేయవచ్చు. ఇవే కాకుండా చాలా బ్యాంక్లు ఈ–ఫైలింగ్ ఆప్షన్ను అందిస్తున్నాయి. ఐటీఆర్లు దాఖలు చేయాలనుకుంటున్న వాళ్లు సంబంధిత బ్యాంక్ల ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా ఐటీఆర్లను దాఖలు చేయవచ్చు. ఈ నెల 31లోపు ఐటీఆర్ దాఖలు చేయలేకపోతే, ఈ ఏడాది డిసెంబర్ వరకూ రూ. 5,000 జరిమానాతో, ఆ తర్వాత రూ.10,000 ఫైన్తో దాఖలు చేయవచ్చు. It has come to the notice of CBDT that an order is being circulated on social media pertaining to extension of due dt for filing of IT Returns. It is categorically stated that the said order is not genuine.Taxpayers are advised to file Returns within extended due dt of 31.08.2019 pic.twitter.com/m7bhrD8wMy — Income Tax India (@IncomeTaxIndia) August 30, 2019 -
ఐటీ రిటర్న్ల దాఖలుకు మూడు రోజులే గడువు
ముంబై: ఆదాయపు పన్ను రిటర్న్లు దాఖలు చేయడానికి మరో మూడు రోజులే గడువుంది. గత ఆర్థిక సంవత్సరానికి(అసెస్మెంట్ ఇయర్ 2019–20) సంబంధించిన ఆదాయపు పన్ను రిటర్న్లను ఎలక్ట్రానిక్ పద్దతిలో దాఖలు చేయడానికి గడవు తేదీ ఈ నెల 31వ తేదీ. కాగా ఐటీఆర్లు దాఖలు చేయడానికి ఐదు వెబ్సైట్లు అందుబాటులో ఉన్నా యి. ఆదాయపు పన్ను విభాగం పోర్టల్... ఐటీఆర్ దాఖలు చేయడానికి అధికారిక వెబ్సైట్గా అందుబాటులో ఉంది. క్లియర్ ట్యాక్స్, మైఐటీ రిటర్న్, ట్యాక్స్స్పానర్, పైసాబజార్ ఈ వెబ్సైట్ల ద్వారా కూడా ఐటీఆర్లు దాఖలు చేయవచ్చు. ఇవే కాకుండా చాలా బ్యాంక్లు ఈ–ఫైలింగ్ ఆప్షన్ను అందిస్తున్నాయి. ఐటీఆర్లు దాఖలు చేయాలనుకుంటున్న వాళ్లు సంబంధిత బ్యాంక్ల ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా ఐటీఆర్లను దాఖలు చేయవచ్చు. ఈ నెల 31లోపు ఐటీఆర్ దాఖలు చేయలేకపోతే, ఈ ఏడాది డిసెంబర్ వరకూ రూ. 5,000 జరిమానాతో, ఆ తర్వాత రూ.10,000 ఫైన్తో దాఖలు చేయవచ్చు.