-
రజనీకాంత్తో పోటీకి దిగుతున్న ధనుష్
నటుడు ధనుష్ కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం కెప్టెన్ మిల్లర్. నటి ప్రియాంక అరుణ్ మోహన్ నాయకిగా నటించగా నివేదిత సతీస్, జాన్ కొక్కెన్, సుమేష్కుమార్, శివరాజ్ కుమార్ తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. అరుణ్ మాదేశ్వరన్ కథ, దర్శకత్వం బాధ్యతలను నిర్వహిస్తున్న ఈ చిత్రాన్ని సత్యజ్యోతి ఫిలిమ్స్ సంస్థ భారీ బడ్జెట్లో నిర్మిస్తోంది. జీవీ ప్రకాష్కుమార్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రం ఇప్పటికే షూటింగ్పూర్తి చేసుకుని నిర్మాణాంతర కార్యక్రమాలను జరుపుకుంటోంది. కాగా కెప్టెన్ మిల్లర్ చిత్రాన్ని సంక్రాంతికి విడుదల చేయనున్నట్లు ముందుగా నిర్మాతలు ప్రకటించారు. ఇదే సమయంలో రజనీకాంత్ సినిమా కూడా విడుదల కానుంది. ఆయన ప్రధాన పాత్రలో నటించిన లాల్ సలామ్ సినిమా కూడా పొంగల్కు రెడీ అయిపోయింది. ఈ చిత్రానికి ఐశ్వర్య రజనీకాంత్ దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే. రజనీకాంత్ సినిమాతో పోటీ ఎందుకని కెప్టెన్ మిల్లర్ చిత్రాన్ని ముందుగానే అంటే డిసెంబర్ నెలలోనే విడుదల చేయనున్నట్లు సామాజిక మాధ్యమాల్లో ప్రచారం అయింది. ఈ విషయంలో చిత్ర నిర్మాతలు క్లారిటీ ఇచ్చారు. కెప్టెన్ మిల్లర్ చిత్రాన్ని ముందుగా నిర్ణయించిన ప్రకారమే అంటే సంక్రాంతి సందర్భంగా విడుదల చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ సంక్రాంతి పండుగరోజు రజనీకాంత్కు, ధనుష్కు మధ్య పోటీ తప్పనిసరిగా మారింది. లాల్ సలామ్ చిత్ర ట్రైలర్ ఇటీవల విడుదలై మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. అదే విధంగా ధనుష్ నటించిన కెప్టెన్ మిల్లర్ చిత్ర టీజర్, పాటలు విడుదలై ట్రెండింగ్ అవుతున్నాయి. దీంతో ఈ రెండు చిత్రాలకు ప్రేక్షకులు ఇచ్చే రిజల్ట్స్ పైనే సినీ వర్గాల్లోనూ, అటు అభిమానుల్లోనూ ఆసక్తి నెలకొంది. కెప్టెన్ మిల్లర్ 2024 జనవరి 15న విడుదల అవుతుండగా... లాల్ సలామ్ సంక్రాంతికి విడుదల అని మాత్రమే ప్రకటించారు. -
అందరిలా నేనెందుకు ఆనందంగా లేనంటే: టాప్ హీరోయిన్
నటి అమలాపాల్ గురించి ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు. మంచి, సంచలన, వివాదాస్పద నటి అంటూ ముద్రవేసుకున్న నటి ఈమె. మైనా చిత్రంతో కోలీవుడ్లో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న అమలాపాల్ ఆ తరువాత వరుసగా పలు చిత్రాల్లో నటించి స్టార్ హీరోయిన్గా ఎదిగింది. విజయ్, ధనుష్ వంటి ప్రముఖ నటులు సరసన నటించిన అమలాపాల్ టాలీవుడ్లోనూ నటించి బహుభాషా నటిగా పేరు తెచ్చుకుంది. నటిగా మంచి పీక్లో ఉండగానే దర్శకుడు విజయ్ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. (ఇదీ చదవండి: డ్రగ్స్ కేసుపై వివరణ ఇచ్చిన వరలక్ష్మీ శరత్కుమార్.. ఆదిలింగం ఎవరంటే) అయితే రెండేళ్లలోపే మనస్పర్థలు రావడంతో వీరి పెళ్లి విడాకులకు దారి తీసింది. కాగా అమలాపాల్కు సంబంధించిన ఒక వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేస్తోంది. అందులో మైనా చిత్రం తరువాత తాను చాలా మానసిక వేదనకు గురయ్యానని పేర్కొంది. జీవితంలో మోసపోయాను అనడం కంటే మోసగించబడ్డాననే చెప్పాలన్నారు. కరోనా కాలంలో రెండేళ్ల పాటు ఇంట్లోనే కూర్చొని తన గురించి తాను ఆలోచించుకుని ఆవేదన చెందానని చెప్పింది. (ఇదీ చదవండి: విజయనిర్మల ఆస్తి ఎవరి సొంతం.. వీలునామాలో ఎవరి పేరు రాశారంటే: నవీన్) తనను చూసి తన కంటే ఎక్కువ తన తల్లి బాధపడిందని చెప్పింది. తనకు మార్గదర్శి అంటూ ఎవరూ లేరంది. ఒక వేళ అలాంటి వ్యక్తి ఎవరైనా వుండి వుంటే తానూ అందరిలా ఆనందంగా ఉండేదానినేమోనని పేర్కొంది. కాగా ఆ మధ్య నిర్మాతగా మారిన అమలాపాల్ ప్రస్తుతం మాతృభాషలో మూడు చిత్రాలు, తమిళంలో ధనుష్ 50వ చిత్రంలో నటిస్తోంది. View this post on Instagram A post shared by Amala Paul (@amalapaul) -
అలాంటి వ్యక్తి నా జీవితంలో లేనట్లే.. ముఖం కూడా చూడను: సోనియా అగర్వాల్
సోనియా అగర్వాల్ టాలీవుడ్లో చేసింది తక్కువ సినిమాలే అయినా కుర్రకారులో ఫుల్ క్రేజ్ దక్కించుకుంది. 2004లో విడుదలైన '7/జీ బృందావన కాలనీ' అప్పట్లో ట్రెండ్ సెట్టర్గా నిలిచింది. ప్రముఖ నిర్మాత ఎంఎం రత్నం కుమారుడు రవికృష్ణ ఈ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఇందులో సోనియా అగర్వాల్ హీరోయిన్ నటించి తెలుగు ప్రేక్షకులను మెప్పించింది. తర్వాత ఇక్కడ అంతగా అవకాశాలు రాకపోవడంతో తమిళ్, కన్నడ సినిమాలపై ఫోకస్ పెట్టి అక్కడ మంచి విజయాలే అందుకుంది. తాజాగ '7/జీ బృందావనీ కాలనీ' సీక్వెల్ తీస్తున్నట్లు మేకర్స్ ప్రకటించిన విషయం తెలిసిందే. (ఇదీ చదవండి: చంద్రయాన్ విజయంపై సంచలన వ్యాఖ్యలు చేసిన పాకిస్తాన్ హీరోయిన్) తమిళంలో వరుస విజయాలతో దూసుకుపోతున్న సమయంలోనే హీరో ధనుష్ అన్నయ్య అయిన దర్శకుడు సెల్వ రాఘవన్ను 2006లో వివాహమాడి ఆపై 2010లో విడాకులు తీసుకుంది. తర్వాత సెల్వరాఘవన్ 2011లో మళ్లీ పెళ్లి చేసుకున్నా.. సోనియా ఒంటరిగానే జీవిస్తోంది. తాజాగ ఓ ఇంటర్వ్యూలో ఆమె పలు ఆసక్తికరమైన విషయాలను ఇలా పంచుకున్నారు. 'దర్శకుడిగా సెల్వరాఘవన్ మొండి పట్టుదలగలవాడు. కానీ వ్యక్తిగత జీవితంలో అలాంటి వ్యక్తి కాదు. చాలా ప్రశాంతమైన వ్యక్తి, ఎల్లప్పుడూ బిజీగా ఉంటారు. రచన వగైరాలతో ఎప్పుడూ తనదైన లోకంలో ఉండేవాడు. కానీ తనతో వైవాహిక జీవితం గురించి ఇక మాట్లాడే ప్రసక్తే లేదు. మేం ఎందుకు విడిపోయామో అతనికి, నాకు తెలుసు. ప్రస్తుతం ఆయన వెళ్తున్న దారిలో ఎంత సంతోషంగా ఉన్నారో.. నేను కూడా అంతే సంతోషంగా ఉన్నాను.' అని సోనియా అన్నారు. జీవితంలో భార్యాభర్తలుగా కలిసి ఉన్నవాళ్లు విడిపోయిన తర్వాత కూడా స్నేహితులుగా ఎలా ఉంటున్నారో తనకు అర్థం కావడం లేదని తెలిపింది. తన వరకు అయితే అది సాధ్యం కాదని చెప్పింది. అలాంటి పని మాత్రం చేయలేనని చెప్పుకొచ్చింది. అంతేకాకుండా అతను తన కంటికి మళ్లీ స్నేహితుడిగా కనిపించడని పేర్కొంది. ప్రేమ చనిపోయిన తర్వాత స్నేహితుడిలా చూడలేమని తెలిపింది. జీవితంలో మళ్లీ తన ముఖం చూడనని, అలాంటి వ్యక్తి తన జీవితంలో ఎప్పుడూ లేనట్లేనని సోనియా అగర్వాల్ అన్నారు. పెళ్లి తర్వాత తన సినిమా కెరీర్ ఆశించిన స్థాయిలో సాగలేదని సోనియా పేర్కొంది. (ఇదీ చదవండి: రాజమౌళి- మహేశ్బాబు సినిమాపై అదిరిపోయే అప్డేట్ వచ్చేసింది) పెళ్లి జరిగిన సమయం నుంచే నటించకూడదని సెల్వ కుటుంబం అభ్యంతరం చెప్పిందని ఆమె గుర్తుచేసుకుంది. అందుకే ఆ సమయంలో బ్రేక్ తీసుకున్నానని తెలిపింది. అయితే 2010లో భర్త నుంచి విడిపోయిన తర్వాత, తిరిగి సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసినట్లు సోనియా చెప్పింది. ఆ తర్వాత ఆమె కన్నడ,తమిళ్లో పలు సినిమాలతో బిజీగానే ఉంటుంది. ఇప్పుడు '7/జీ బృందావన కాలనీ' సీక్వెల్తో మళ్లీ తెలుగు ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ఆమె ప్రకటించింది -
ఆ ఇల్లు వల్లే ధనుష్-ఐశ్వర్య విడిపోయారా..?
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్-ఐశ్వర్యలు విడాకులు తీసుకుంటున్నట్లు సుమారు రెండేళ్ల క్రితం ప్రకటించడం ఆపై వారిద్దరూ వేరువేరుగా ఉంటున్న విషయం తెలిసిందే. సుమారు 18ఏళ్ల పాటు కలిసి ఉన్న ధనుష్ దంపతులు ఈ నిర్ణయం తీసుకోవడం ఇండస్ట్రీలో సంచలనంగా మారింది. ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారనేది బహిరంగంగా వారిద్దరిలో ఎవరూ తెలపలేదు. కానీ వారిద్దరి విడాకులకు కారణం ధనుష్ కట్టించుకున్న ఇళ్లే అని సోషల్మీడియాలో వైరల్ అవుతుంది. (ఇదీ చదవండి: బ్రోలో సాయిధరమ్ తేజ్ రెండో చెల్లెలిగా నటించిందెవరో తెలుసా?) చెన్నైలోని పోయేస్ గార్డెన్లో హీరో ధనుష్ రూ.150 కోట్లతో కొత్త ఇంటిని నిర్మించిన సంగతి తెలిసిందే.. ఆ ఇంటిని నిర్మించే సమయంలో ధనుష్కు రజనీకాంత్ ఒక సలహా ఇచ్చారట. ఇళ్లు ఈ ప్రాంతంలో కాకుండా మరోచోట కట్టేందుకు ప్లాన్ చేయమని రజనీకాంత్ సలహా ఇచ్చారట. దీనికి ప్రధాన కారణం వాస్తు, జ్యోతిష్యం పట్ల రజనీకి విశ్వాసం ఎక్కువ. దీంతో ఈ ఇళ్లు కడితే కుటుంబానికి కూడా అంతగా కలిసిరాదని వద్దన్నారట. కానీ ఇవేమి లెక్కచెయకుండా పోయేస్గార్డెన్లో రజనీ ఇంటికి అతి సమీపంలోనే ధనుష్ ఇళ్లు నిర్మించడం 2021లో ప్రారంభించాడు. కానీ ఈ ఇంటి పనులను ప్రారంభించిన కొద్ది నెలల్లోనే ధనుష్-ఐశ్వర్య ఇద్దరి మధ్య గొడవలు రావడం స్టార్ట్ అయ్యాయట. తన నాన్నకంటే ఇంత రిచ్గా ఇళ్లు కట్టడం ఎందుకని వారిద్దరి మధ్య గొడవ మొదలైందట. వీటితో పాటు ఐశ్వర్య సినిమా డైరెక్టర్,నిర్మాత అవడం, అందువల్ల భారీగా డబ్బు నష్టపోవడం ధనుష్కు ఏ మాత్రం ఇష్టం లేదని అందుకే వారి మధ్య గొడవలు వచ్చాయిని కొందరు చెప్పుకొచ్చారు. ఇవన్నీ కాదు ధనుష్ మరో హీరోయిన్తో ఎఫైర్ పెట్టుకోవడం వల్లే విడాకుల వరకు వెళ్లారని మరికొందరి వాదనగా ఉంది. ఏదేమైన ఇక్కడ ఇళ్లు కట్టడం అంత మంచిది కాదని రజనీకాంత్ సూచించడం వాస్తవమేనని పలువురు చెప్పుకొచ్చారు. అలా ధనుష్ నిర్మించిన ఇంటికి వాస్తు లేకపోవడంతోనే వారిద్దరి మధ్య దూరం పెరిగిందని ఇప్పుడు కోలీవుడ్లో ప్రచారం జరుగుతుంది. 2021లో ధనుష్ ఇంటి నిర్మాణం ప్రారంభిస్తే.. 2022లో వారిద్దరు విడిపోయారు. 2023లో ధనుష్ తన తల్లిదండ్రులతో ఆ కొత్త ఇంటిలోకి ప్రవేశించారు. (ఇదీ చదవండి: తన 'కొత్త ప్రేమ'ని వెల్లడించిన సమంత) -
మేనల్లుడి కోసం ధనుష్, అనిరుధ్ మాస్టర్ ప్లాన్ ?
సౌత్ ఇండియాలో స్టార్ హీరోగా ధనుష్ కొనసాగుతున్నారు. 'సార్' విజయం తర్వాత ఆయన మరింత జోరుగా సినిమాలు చేస్తున్నారు. తాజాగా ఆయన నటిస్తోన్న 'కెప్టెన్ మిల్లర్' చిత్రీకరణ ముగింపు దశకు చేరుకుంది. పీరియాడికల్ వార్ డ్రామాగా ఆయన కెరీర్లోనే భారీ బడ్జెతో రానుంది. తర్వాత తన మైల్స్టోన్ 50వ చిత్రానికి కూడా ప్లాన్ చేస్తున్నాడు. అయితే ధనుష్ ఈ చిత్రంలో ప్రధాన పాత్ర పోషించకుండా అతిధి పాత్రలో మాత్రమే కనిపించనున్నాడు. కానీ ఇందులో ముఖ్య విషయం ఏమిటంటే ఈ మూవీని ఆయనే డైరెక్ట్ చేయనున్నారు. (తల్లి విజయలక్ష్మి, అక్కలు విమల గీత (కుడి), కార్తీక (ఎడమ)తో ధనుష్) పవర్ పాండి తర్వాత ధనుష్ దర్శకత్వం వహించిన రెండవ చిత్రం ఇది. ఇందులో S.J సూర్య,సందీప్ కిషన్, అపర్ణ బాలమురళి, అనిఖా సురేంద్రన్, దుషార విజయన్, సెల్వరాఘవన్లు ఉండగా కీలక పాత్ర కోసం మట్టి కుస్తి హీరో విష్ణు విశాల్ను తీసుకున్నాడు. ఇదిలా ఉండగా తన మూడవ చిత్రాన్ని కూడా ధనుస్ లైన్లో పెట్టాడట. ఈ సినిమాతో అతని మేనల్లుడు ఆరంగేట్రం చేస్తున్నాడట. ధనుష్, సెల్వరాఘవన్లకు ఇద్దరు సోదరీమణులు ఉన్నారు. డాక్టర్ విమల గీత, డాక్టర్ కార్తీక వారిద్దరూ చెన్నైలో ఒక ఆస్పత్రి నిర్వహిస్తున్నారు. వారిలో ధనుష్ అక్క అయిన విమల గీత కుమారుడు సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చేందుకు రెడీగా ఉన్నాడు. అందుకోసం అతను ఇప్పటికే శిక్షణ కూడా ప్రారంభించాడట. ఇదే నిజమైతే ధనుష్ల ఫాలోయింగ్తో అతని ఎంట్రీ కూడా భారీ రేంజ్లో ఉంటుందని అభిమానులు పేర్కొంటున్నారు. (ధనుష్ అక్క విమల గీత ఫ్యామిలీ) మేనల్లుడికి ఇండస్ట్రీలో మంచి ప్లాట్ఫామ్ క్రియేట్ చేయాలని అందుకు కావాల్సిన కథను ఇప్పటికే రెడీ చేశాడట. ఈ సినిమా కోసం మ్యూజిక్ కింగ్ అనిరుధ్ రవిచందర్ను ఏర్పాటు చేస్తున్నాడట. ఈ సినిమాతో పాటు శేఖర్ కమ్ములతో 'D51' కూడా జరుగుతుంది. -
స్కూల్ ఫ్రెండ్స్తో రీ యూనియన్ అయిన టాప్ హీరో.. ఫోటోలు వైరల్
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సినవసరం లేదు. ధనుష్కు టాలీవుడ్ లోను భారీగా ఫ్యాన్స్ ఉన్నారు. ప్రస్తుతం సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న ఆయన తాజాగ తన స్కూల్ స్నేహితులను కలుసుకున్నారు. అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. (ఇదీ చదవండి: రీ- రిలీజ్ సినిమాలకు ఎందుకంత క్రేజ్..?) ధనుష్ స్కూల్లో చదువుకునే రోజుల్లోనే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఒకరకంగా సినిమాపై ఉండే పిచ్చి అభిమానమే చదువుకు ఫుల్స్టాప్ పెట్టి ఆయన్ను ఇండస్ట్రీ వైపు నడిపించింది. ఇప్పడు అంతర్జాతీయ స్థాయిలో తానేమిటో ప్రూవ్ చేసుకున్న ధనుష్ మళ్లీ తన స్కూల్ ఫ్రెండ్స్తో ఇలా కలిశాడు. ఎప్పుడో విడిపోయిన వారందరూ మళ్లీ ఇలా ఒక్కసారి రీయూనియన్ అయ్యారు. ధనుష్ ఇప్పుడు పెద్ద స్టార్ అయ్యాడు కదా తమతో కలుస్తాడా..? తమతో కలిసి భోజనం చేస్తాడా..? కనీసం ఫోటో అయినా దిగుతాడా..? అనే సందేహాలు వారిలో వచ్చాయట. ఎవరు ఏ స్థాయిలో ఉన్నా గత మూలాలు ఎలా మరిచిపోతామని ధనుష్ పేర్కొన్నాడట. వారితో ఒకరోజంతా గడపడమే కాకుండు పలు పాటలకు డ్యాన్స్లు చేయడమే కాకుండా అందరూ కలిసి భోజనం చేయడం. ఇలా ఆనందంగా గడిపారు. తల్లిదండ్రుల కంటే ఎక్కువ సమయం గడిపింది మీతోనే కదా అని ఆయన తెలపడంతో వారంతా ఎంతో సంతోషంగా ధనుష్తో ఫోటోలు దిగారట. ప్రస్తుతం ధనుష్ సినిమాలకు సంబంధించిన కార్యక్రమాలను స్కూల్ డేస్ నుంచి ఉన్న కొందరు స్నేహితులే చూసుకుంటున్నారు. గతంలో స్కూల్ డేస్ గురించి ధనుష్ ఏమన్నారంటే సార్ సినిమా విడుదల సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో తన చదువు గురించి చాలా ఎమోషనల్ అయ్యాడు. అప్పట్లో చదువును నిర్లక్ష్యం చేశానంటూ ఆవేదన వ్యక్తం చేశారు. చదువుకునే సమయంలో చాలా అల్లరి పనులు చేశానని ధనుష్ గుర్తు చేసుకున్నారు. చదువు కోసం కాకుండా ఓ అమ్మాయి కోసం ట్యూషన్లో చేరానని, అక్కడ టీచర్ అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేకపోవడంతో సిగ్గేసి కొన్ని రోజుల తర్వాత ట్యూషన్ మానేశానని పేర్కొన్నారు. అప్పట్లో తాను ఒక అమ్మాయి కోసం బయట వేచి చూస్తుండేవాడినని, తాను వచ్చినట్టు ఆమెకు తెలిసేందుకు బైక్తో సౌండ్ చేసేవాడినని అన్నారు. ఇది చూసి టీచర్ లోపలున్న విద్యార్థులతో.. మీరంతా బాగా చదువుకుని పరీక్షలు పాసైతే ఉన్నత స్థానాల్లో ఉంటారని, బయట బైక్తో శబ్దం చేసేవాడు వీధుల్లో డ్యాన్స్ చేసుకోవాల్సిందేనని వారితో అన్న విషయం తనకు తెలిసిందన్నారు. ఆ తర్వాత ఆ టీచర్ చెప్పినట్టే తమిళనాడులో ప్రస్తుతం తాను డ్యాన్స్ చేయని వీధంటూ ఏమీలేదని నవ్వుతూ చెప్పారు. అప్పట్లో తానెందుకు సరిగ్గా చదువుకోలేదని అనిపిస్తూ ఉంటుందని, ఇప్పటికీ ఆ విషయంలో బాధపడుతూ ఉంటానని అన్నారు. ఇప్పుడు ఆ మిత్రులందరిని ధనుష్ మరోసారి కలుసుకుని తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు. -
అందానికి, అశ్లీలతకు చాలా తేడా ఉంది: హీరోయిన్
తమిళనాడు రాజకీయ కుటుంబం నుంచి సినీ రంగప్రవేశం చేసిన నటి దుషారా. పా.రంజిత్ దర్శకత్వంలో రూపొందిన సార్పట్టా పరంపరై చిత్రంలో అయ్యకు జంటగా కథానాయికిగా నటించి తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న ఈ భామ ఆ తరువాత నక్షత్రం నగర్గిరదు చిత్రంలో మరోసారి నటిగా తానేమిటో నిరూపించుకున్నారు. కాగా తాజాగా వసంత బాలన్ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన అనిత చిత్రంలో నటుడు అర్జున్దాస్తో పోటీ పడి నటించి ప్రశంసలు అందుకున్నారు. ప్రస్తుతం బాలాజి మోహన్ దర్శకత్వంలో నటిస్తున్న దుషారా ఈ చిత్రంతో పాటు ధనుష్ సరసన నటించే ఛాన్స్ కొట్టేసింది. దుషారా ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ నటన అంటే తనకు చాలా ఇష్టమని చెప్పారు. అందుకే ఎలాంటి పాత్రలో నటించడానికై నా సిద్ధం అన్నారు. అయితే చిత్రంలో తన పాత్ర ఐదు నిమిషాలు ఉన్నా దానికి ప్రాధాన్యత ఉండాలన్నారు. (ఇదీ చదవండి: అమల అక్కినేనితో బాలీవుడ్ హీరో, ఫోటో వైరల్) కుటుంబకథా చిత్రాల నాయకి ఇమేజ్ తెచ్చుకున్న తనను గ్లామర్ పాత్రల్లో నటిస్తారా అని చాలామంది అడుగుతున్నారని, అందానికి, అశ్లీలతకు చాలా తేడా ఉందని, అలా ప్రేక్షకులు ముఖం తిప్పుకునేది ఏది గ్లామర్ కాదని అన్నారు. అందాలారబోతలో హద్దులు తనకు తెలుసని, అలాంటి పరిమితులుతో కూడిన గ్లామర్ పాత్రల్లో నటించడానికి తాను సిద్ధమేనని అన్నారు. బాలుమహేంద్ర, మణిరత్నం దర్శకులు అంటే ఇష్టం అని చెప్పారు. -
ఆ సూపర్ హిట్ సినిమాకు పార్ట్-2 ఉంది: వెట్రిమారన్
ధనుష్ హీరోగా వడచైన్నె- 2 చిత్రాన్ని కచ్చితంగా చేస్తానని దర్శకుడు వెట్రిమారన్ పేర్కొన్నారు. 2018లో పార్ట్-1 ఎంత పెద్ద హిట్ అందుకుందో తెలిసిందే. తాజాగా తమిళ్ సినిమా చిత్ర పాత్రికేయుల సంఘం నిర్వాహకులు ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా దర్శకుడు వెట్రిమారన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా నటుడు ధనుష్ కథా నాయకుడిగా వడచైన్నె - 2 చిత్రాన్ని కచ్చితంగా చేస్తానని ఆయన చెప్పారు. అంతకుముందు రెండు చిత్రాలు చేయాల్సి ఉందన్నారు. (ఇదీ చదవండి: అర్జున్ కూతురు పెళ్లి ఎప్పుడంటే.. వారి పరిచయం మొదలైంది అక్కడే) అదే విధంగా నటుడు సూర్య కథా నాయకుడిగా ఆజన్బీ పుస్తకాన్ని చిత్రంగా తెరకెక్కించాలని అసురన్ చిత్ర షూటింగ్ సమయంలోనే నిర్ణియించానన్నారు. షూటింగ్కు ప్రారంభించాలనుకున్న సమయంలో కరోనా రావడంతో అది ఆగిపోయిందని చెప్పారు. పార్ట్-2 కథ రెడీగానే ఉంది. త్వరలో హీరో ధనుష్తో చర్చిస్తానని ఆయన పేర్కొన్నాడు. తాజాగా తెలుగులో ఆయన దర్శకత్వం వహించిన 'విడుదల' సినిమా మంచి గుర్తింపు తెచ్చుకుంది. అందులో కమెడియన్ సూరి హీరోగా నటించగా విజయ్ సేతుపతి ముఖ్యపాత్ర పోషించాడు. (ఇదీ చదవండి: ఆమెకు ఇష్టం లేకున్నా ఎలా పట్టుకుంటావ్.. నటుడిపై ట్రోల్స్) -
Amala Paul: మూడోసారి రొమాన్స్ చేసేందుకు రెడీ?
నటుడు ధనుష్ సరసన మూడోసారి నటించడానికి నటి అమలాపాల్ సిద్ధమవుతున్నారా? అంటే అలాంటి అవకాశమే ఉందంటున్నారు కోలీవుడ్ వర్గాలు. ధనుష్ ప్రస్తుతం కెప్టెన్ మిల్లర్ చిత్రాన్ని పూర్తి చేసే పనిలో ఉన్నారు. తదుపరి ఆనంద్ రాయ్ దర్శకత్వంలో ఒక హిందీ చిత్రాన్ని, తెలుగులో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఒక చిత్రాన్ని చేయనున్నారు. ఈ రెండు చిత్రాల్లో ఏకకాలంలో నటించే అవకాశం ఉన్నట్లు సమాచారం. తదుపరి ఆయన తన 50వ చిత్రానికి రెడీ అవుతున్నారు. ధనుష్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించనున్న ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ సంస్థ భారీ ఎత్తున నిర్మించడానికి సన్నాహాలు చేస్తోంది. (ఇదీ చదవండి: Drugs Case: ఆషూ రెడ్డి వీడియో విడుదల) ఉత్తర చైన్నె నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో ఇందులో నటి దుషార విజయన్, నటుడు విష్ణువిశాల్ తదితరులు ముఖ్య పాత్రలకు ఎంపికై నట్లు ప్రచారం జరుగుతోంది. ఇందులో ధనుష్ సరసన నటించే హీరోయిన్ ఎవరన్నది చర్చగా మారింది. ముందుగా త్రిష నటించనున్నట్లు ప్రచారం సాగింది. ఆ తర్వాత అపర్ణ బాలమురళి పేరు వెలుగులోకి వచ్చింది. తాజాగా సంచలన నటి అమలాపాల్ పేరు వినిపిస్తోంది. (ఇదీ చదవండి: ఆకాంక్ష పూరి నడుమును కెమెరాల ముందే పట్టుకున్న నటుడు) ఇటీవల కోలీవుడ్లో అవకాశాలు లేకపోవడంతో బాలీవుడ్పై దృష్టి సారించిన అమలాపాల్ ఇంతకుముందు ధనుష్కు జంటగా రఘువరన్ బీటెక్ పార్ట్ 1, పార్ట్ 2 చిత్రాల్లో నటించిన విషయం తెలిసిందే. ఆ రెండు చిత్రాలు విజయాన్ని సాధించాయి. దీంతో మళ్లీ మూడోసారి ధనుష్ 50వ చిత్రంలో ఈ మలయాళీ భామ నటించడానికి సిద్ధమవుతున్నట్లు టాక్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. -
త్రిష VS శ్రీలీల ఫుల్ డిమాండ్
-
సార్ మీ అందరి కథ – ధనుష్
‘‘సార్’ సినిమా అన్నివర్గాల వారికి నచ్చుతుంది. ఎందుకంటే ప్రేక్షకులు వాళ్ల కథతో కనెక్ట్ అవుతారు. ‘సార్’ మీ అందరి కథ.. మీకు నచ్చుతుందని, అందరూ ఎంజాయ్ చేస్తారనే నమ్మకం ఉంది’’ అని హీరో ధనుష్ అన్నారు. వెంకీ అట్లూరి దర్శకత్వంలో ధనుష్, సంయుక్త మీనన్ జంటగా తెరకెక్కిన ద్విభాషా చిత్రం ‘సార్’ (తమిళంలో ‘వాతి’). శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్ మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించిన ఈ సినిమా ఈ శుక్రవారంవిడుదలకానుంది. హైదరాబాద్లో నిర్వహించిన ప్రీ రిలీజ్ వేడుకలో ధనుష్ మాట్లాడుతూ– ‘‘2002లో నా తొలి చిత్రం విడుదలయినప్పుడు నెర్వస్గా ఉన్నా.. ఇప్పుడు 2023లో నా తొలి తెలుగు సినిమా రిలీజ్ అవుతోంది.. ఇప్పుడు కూడా అలాగే ఉంది. తమిళ్, హిందీ, ఇంగ్లిష్ సినిమాలు చేశాను.. ప్రతి సినిమాని నా మొదట దిగానే భావిస్తా. ‘సార్’ ఒక సింపుల్ ఫిల్మ్.. కానీ, గ్రాండ్ ఎమోషన్స్, మెసేజ్ ఉంటుంది. నా తర్వాతి తెలుగు సినిమాకి తప్పకుండా తెలుగులో మాట్లాడతాను’’ అన్నారు. డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ మాట్లాడుతూ–‘‘ఒక మనిషి జీవన శైలిని మార్చేది చదువు మాత్రమే. అంత గొప్ప ఆయుధాన్ని డబ్బులేని వాళ్లకి దూరం చేయడం ఎంత వరకు న్యాయం? అనే ప్రశ్నే ‘సార్’ సినిమాలో వెంకీ అడిగే ప్రయత్నం చేశాడు. భారతీయ సినిమా చరిత్రలో ఒకప్పటి తరంలో శివాజీ గణేశన్గారు, కమల్ హాసన్గారు, తెలుగులో ఎన్టీఆర్గారు, నాగేశ్వరరావుగారు.. ఇలా తొలి తరం నటుల్లో ఎంత గొప్పవారుఉన్నారో తర్వాతి తరం గొప్ప నటుల్లో ధనుష్కి నేను టాప్ ప్లేస్ ఇస్తాను.. ఎందుకంటే సినిమా హిట్ అయినా, ఫ్లాప్ అయినా ఆయనకు భయం లేదు. పని చేయడాన్ని మాత్రమే ఇష్టపడతాడు. అలా పనిచేసుకుంటూ పోయే ధనుష్ని ఎవరూ ఆపలేరు’’ అన్నారు. ‘‘మా సార్’ చిత్రం ప్రీమియర్స్ ఒక రోజు ముందే వేస్తున్నామంటే సినిమాపై మాకు ఎంత నమ్మకం ఉందో జనాలకు ఇప్పటికే అర్థమై ఉంటుంది.. చాలా మంచి సినిమా ఇది.. ఎవరూ నిరుత్సాహపడరు’’ అన్నారు సూర్యదేవర నాగవంశీ. ‘‘నా ‘తొలి ప్రేమ’ సినిమా తర్వాత ఇంత నమ్మకంగా చెబుతున్నా. ‘సార్’ ప్రీమియర్స్ అయిన తర్వాత వచ్చే మౌత్ టాక్తో 17న అందరూ సినిమాకి వస్తారు’’ అన్నారు వెంకీ అట్లూరి. ఈ వేడుకలో నిర్మాత ఎస్.రాధాకృష్ణ, కెమెరామేన్ జె.యువరాజ్, నటుడు సాయికుమార్, పాటల రచయిత రామజోగయ్య శాస్త్రి పాల్గొన్నారు. -
కొత్త కబురు
హీరో మాధవన్ కొత్త కబురు చెప్పా రు. తన తర్వాతి సినిమా డైరెక్టర్ మిత్రన్తో చేయనున్నట్లు పేర్కొన్నారాయన. తమిళ చిత్ర పరిశ్రమలో గత ఏడాది హిట్ కొట్టిన చిత్రాల్లో ‘తిరుచిత్రంబలం’ (తెలుగులో ‘తిరు’) ఒకటి. ధనుష్ హీరోగా నటించిన ఈ సినిమాకు మిత్రన్ ఆర్.జవహర్ దర్శకత్వం వహించారు. ఆ సినిమా హిట్ కావడంతో మిత్రన్కి మరో మంచి అవకాశం లభించింది. మాధవన్ హీరోగా ఆయన దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనుంది. ‘‘దర్శకుడు మిత్రన్తో సినిమా చేయడానికి ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నాను’’ అన్నారు మాధవన్. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ మొదలు కానుంది. -
హైదరాబాద్లో ప్రారంభమైన ధనుష్ ద్విభాషా చిత్రం ‘సార్’
ధనుష్ హీరోగా వెంకీ అల్లూరి దర్శకత్వంలో రూపొందుతున్న ద్విభాషా చిత్రం ‘సార్’. సోమవారం ఈ సినిమాలో హైదరాబాద్లో ప్రారంభం అయ్యింది. ముహుర్తపు సన్నివేశానికి నిర్మాత కేఎల్ నారాయణ, పారిశ్రామికవేత్త సూరేశ్ చుక్కపల్లి కెమెరా స్విచ్చాన్ చేయగా, దర్శకుడు త్రివిక్రమ్ క్లాప్ ఇచ్చారు. నిర్మాత ఎస్ రాధాకృష్ణ స్క్రిప్ట్ను చిత్రబృందానికి అందించాడు. పీడీవీ ప్రసాద్ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ, లక్ష్మీ సౌజన్య నిర్మిస్తున్న ఈ చిత్రంలో కేరళ బ్యూటీ సంయుక్తా మీనన్ హీరోయిన్గా నటిస్తున్నారు. జనవరి 5న ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ను ప్రారంభం కానుందని ఈ సందర్భంగా మూవీ యూనిట్ స్పష్టం చేసింది. ఈ సినిమాలో ధనుష్ లెక్చరర్ పాత్ర కనిపించనుండగా.. సాయి కుమార్, తనికెళ భరణి, నర్రా శ్రీను కీలక పాత్రలు పోషించనున్నారు. ఈ మూవీకి జీవీ ప్రకాశ్ సంగీతం అందిస్తున్నారు. -
67వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రదానోత్సవం
-
పాన్ ఇండియా మోజులో టాలీవుడ్ స్టార్స్, అదే అందరి టార్గెట్
భాషతో సంబంధం లేకుండా పాన్ ఇండియా సినిమాపై దృష్టి పెట్టారు టాలీవుడ్ హీరోలు, డైరెక్టర్స్. బాహుబలి సిరీస్ తర్వాత ప్రపంచ మార్కెట్ మీదనే కన్నేశారు. గతంలో మాదిరి ఒక భాషకి పరిమితం కాకుండా... రెండు మూడు భాషలు లక్ష్యంగా సినిమాలు చేస్తున్నారు. పాన్ ఇండియా స్టార్గా ఎదగాలనేదే అందరి టార్గెట్. అందుకే పాన్ ఇండియా లెవెల్లో కొత్త కాంబినేషన్స్కు ట్రెండ్ ఊపందుకుంది. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాతగా దలపతి విజయ్ హీరో గా తెలుగు, తమిళ భాషల్లో పాన్ ఇండియా సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. మరో 6 నెలల్లో ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. ఈ సినిమా మీద భారీ అంచనాలు పెట్టుకున్నారు దర్శక, నిర్మాతలు. ఇక మరో తమిళ స్టార్ ధనుష్ దర్శకుడు శేఖర్ కమ్ములతో సినిమా చేయునున్నాట్టు అధికారికంగా ప్రకటన వచ్చింది. ఈ సినిమా నెక్ట్ జనవరి నుండి సెట్స్ మీదకు వెళ్లనుంది. ఈ సినిమాలో హీరోయిన్గా సాయి పల్లవి నటిస్తుంది అని టాక్. అంతే కాకుండా ధనుష్ మరో తెలుగు దర్శకుడితోనూ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. రామ్ చరణ్ 15 వ సినిమాగా వస్తున్న ప్రతిష్టాత్మక చిత్రానికి అగ్ర దర్శకుడు శంకర్ దర్శకత్వం వహిస్తున్నాడు . సుమారు 500 కోట్ల తెరకెక్కుతున్న ఈ సినిమా త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది.ఈ సినిమా ద్వారా ఇండియన్ పొలిటికల్ సిప్టమ్ మీద స్ట్రాంగ్ సెటైర్స్ వేయనున్నారట శంకర్. అంతే కాకుండా ఈ పాన్ ఇండియా మూవీలో అమితా బచ్చన్ ఓ కీలకపాత్ర పోషించనున్నారు . కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్ తో ప్రభాస్ 'సలార్' సినిమా చేస్తున్నారు. ఇప్పటికే మెదటి షెడ్యూల్ పూర్తి చేసుకొని రెండు షెడ్యూల్ లోకి కూడా అడుగుపెట్టారు చిత్ర యూనిట్. సుమారు 350 కోట్లతో తెరకెక్కుతున్న ఈ సినిమా మీద సినిమా ఇండస్ట్రీలో భారీ అంచనాలే ఉన్నాయి . దీంతో పాటు ఖైదీ ఫేమ్ లోకేష్ కనకరాజ్తో ఓ సినిమా చేయబోతున్నాడట ప్రభాస్. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ లో ఈ సినిమా తెరకెక్కనుంది అని టాక్. రామ్తో తమిళ దర్శకుడు లింగుస్వామి ఈ మధ్యనే సినిమా స్టార్ట్ చేసారు.ఈ సినిమా షూటింగ్ కూడా శరవేగంగా జరుగుతుంది . ఇదిలా ఉంటే అల్లు అర్జున్ హీరోగా మురగాదాస్ దర్శకత్వంలో గజనీ 2 సినిమా చేసేందుకు సన్నద్ధమవుతున్నారు నిర్మాత అల్లు అరవింద్. సూర్య కోసం బోయపాటి శ్రీను ఓ భారీ యాక్షన్ ధ్రిల్లర్ను రెడీ చేసాడట. శివకార్తికేయన్ కోసం 'జాతిరత్నాలు' ఫేమ్ అనుదీప్ కథలు సిద్ధం చేశారు అని తెలుస్తుంది . 'రాక్షసుడు-2' చిత్రం కోసం విజయ్ సేతుపతి రంగంలోకి దిగే అవకాశాలున్నాయనీ కూడా ప్రచారం సాగుతోంది. -
నవ్వులు పూయిస్తున్న డాక్టర్ ‘రౌడీ బేబీ’ పేరడీ సాంగ్
తమిళ హీరో ధనుష్, నాచ్యురల్ బ్యూటీ సాయిపల్లవి కలిసి స్టెప్పులేసిన ‘రౌడీ బేబీ’ సాంగ్ ఎంత సూపర్ హిట్ అయిందో అందరికి తెలిసిందే. రెండేళ్ల క్రితం ఏ ఫంక్షన్లో చూసినా, ఎవరి ఫోన్ రింగ్ అయినా ఈ పాటనే వినబడేది. అంతలా ఆకర్షించింది ఈ ‘రౌడీ బేబీ’. యూట్యూబ్లో అత్యధిక వ్యూస్ సాధించి రికార్డు సాధించింది. ప్రస్తుతం ఇండియా సినిమాల్లో ఏ పాటకు రానన్ని వ్యూస్ ‘రౌడీ బేబీ’సొంతం చేసుకుంది. దానికి కారణం కేవలం సాయిపల్లవి క్రేజ్, యాక్టింగ్ అనే చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఆమె వేసిన స్టెప్పులకి సీనీ అభిమానులు ఫిదా అయ్యారు. ఇప్పుడిప్పుడే ఈ పాటను కాస్త మర్చిపోతున్న తరుణంలో ఓ డాక్టర్ పుణ్యమా అని మళ్లీ అంతా ‘రౌడీ బేబీ’ని ఆస్వాదిస్తున్నారు. అయితే ఈ సారి ఒరిజినల్ ‘రౌడీ బేబీ’ని కాకుండా.. పేరడీ పాటను విని తెగ నవ్వుకుంటున్నారు. వివరాల్లోకి వెళితే.. దేశంలో గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతన్న వారి సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. ఈ తరుణంలో భాస్కర్ అనే ఓ వైద్యుడు గుండె ఆరోగ్యం గురించి చెబుతూ.. ‘రౌడీ బేబీ’ పెరడీ పాడారు. మధ్యపానం, ధూమపానం చేయకూడదని, ఉప్పు, మసాల కూడా తక్కువగా తినాలని పాట రూపంలో చెప్పాడు. ప్రస్తుతం ఈ పేరడీ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. -
ఒకే వేదికపై మామ అల్లుడికి అవార్డులు
చెన్నై: మామ అల్లుళ్లు నటుడు రజినీకాంత్, ధనుష్ ఒకే వేదికపై ప్రతిష్టాత్మకమైన అవార్డులను అందుకోవడానికి సిద్ధమవుతున్నారు. రజనీ, కేంద్ర ప్రభుత్వం దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే అంతకుముందే అసురన్ చిత్రంలో నటనకు, ఆయన అల్లుడు, ధనుష్ కేంద్ర ప్రభుత్వం జాతీయ ఉత్తమ నటుడు అవార్డు ప్రకటించింది. 67వ జాతీయ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమాన్ని మే 3న నిర్వహిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అదే వేదికపై రజనీకాంత్ను దాదాసాహెబ్ ఫాల్కే అవార్డులతో సత్కరించనున్నారు. ఇలా ఒకే వేదికపై మామ అల్లుళ్లు ప్రతిష్టాత్మక అవార్డులు అందుకోవడం అరుదైన విషయమే. చదవండి: ఒక అవార్డు... ఎన్నో ప్రశ్నలు! -
నా ప్రేయసి వద్దకు వచ్చేశా
తమిళ హీరోల్లో ఏడాదికి మూడు సినిమాలు చేస్తుంటారు ధనుష్. ఎప్పటికప్పుడు సినిమాలను ప్రారంభిస్తూ, పూర్తి చేస్తూ బిజీబిజీగా ఉంటారాయన. కరోనా కారణంగా సుమారు ఏడు నెలలు షూటింగ్స్కు దూరమయ్యారు ధనుష్. ఆయన చేతిలో దాదాపు నాలుగు సినిమాలున్నాయి. తాజాగా మళ్లీ షూటింగ్ లొకేషన్లో అడుగుపెట్టారు. బాలీవుడ్ దర్శకుడు ఆనంద్ ఎల్. రాయ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘అత్రంగీ’. అక్షయ్ కుమార్, ధనుష్, సారా అలీ ఖాన్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ మొదలుపెట్టారు ధనుష్. కెమెరాతో దిగిన ఫోటోను పంచుకొని, ‘నా ప్రేయసి (కెమెరాని ఉద్దేశించి) దగ్గరకు తిరిగొచ్చేశాను’ అని పేర్కొన్నారు. -
ట్రెండింగ్లో ‘హ్యాపీ బర్త్ డే ధనుష్’
తమిళ హీరో ధనుష్ కోలీవుడ్లోనే కాకుండా టాలీవుడ్, బాలీవుడ్లోను మంచి నటుడిగా పేరు సంపాదించుకున్నారు. ఇక ధనుష్లో నటుడితో పాటు కథకుడు, గాయకుడు, గీత రచయిత, దర్శకుడు, నిర్మాత ఉన్నారన్న విషయం తెలిసిందే. ఆయన నేడు (జూలై 28) 37వ వసంతంలోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా ధనుష్ అభిమానులు, పలువురు సినీ ప్రముఖులు సోషల్ మీడియాలో ఆయనకు బర్త్డే విషెష్ తెలియజేశారు. దీంతో ‘అసురన్’, ‘హ్యాపీ బర్త్డే ధనుష్’ హ్యాష్ ట్యాగ్లు ట్విటర్లో ట్రెండింగ్ అవుతున్నాయి. Happy birthday my bro @dhanushkraja ... to another fantastic year ahead 🤗😃 — Anirudh Ravichander (@anirudhofficial) July 28, 2020 ‘హ్యాపీ బర్త్డే మై బ్రో.. మరో అద్భుతమైన సంవత్సరంలోకి అడుగుపెడున్నారు’ అని సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచంద్రన్ ట్విటర్లో ధనుష్కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అదే విధంగా ‘హ్యాపీబర్త్ డే ధనుష్, మీరు చాలా ప్రేమ, అదృష్టాన్ని పొందాలి’ అని హీరోయిన్ జెనిలియా ట్విటర్లో విష్ చేశారు. ‘హ్యాపీ బర్త్డే ధనుష్, మరో అద్భుతమైన ఏడాదిలో అడుగుపెతున్నారు’ అని హీరోయిన్ కాజల్ బర్త్డే విషెష్ తెలియజేశారు. మలయాళ హీరో టోవినో థామస్ ధనుష్తో దిగిన ఓ ఫొటోను ట్విటర్లో పోస్ట్ చేసి బర్త్డే విషెష్ తెలియజేశారు. Happy Birthday brother!! ❤️ @dhanushkraja #HappyBirthdayDhanush pic.twitter.com/60EpzvQl4O — Tovino Thomas (@ttovino) July 28, 2020 వీరితో పాటు మెహ్రీన్ పిర్జాదా, ఐశ్వర్య రాజేష్, విష్ణు విశాల్, సంతోష్ నారాయన్ ట్విటర్లో ధనుష్కు బర్త్డే శుభాకాంక్షలు తెలిపారు. ధనుష్ ప్రస్తుతం తన నటించిన ‘జగామే తంతిరామ్’ విడుదల కోసం ఎదురు చూస్తున్నారు. అదే విధంగా ధనుష్ నటించే బాలీవుడ్ చిత్రం ‘అట్రాంగి రే’ షూటింగ్ అక్టోబర్ నుంచి ప్రారంభం కానుంది. ఈ చిత్రానికి ఆనంద్ ఎల్ రాయ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో అక్షయ్ కుమార్, సారా అలీ ఖాన్ ప్రధాన పాత్రల్లో నటించనున్నారు. Happy birthday @dhanushkraja have a fab one 💕 — Kajal Aggarwal (@MsKajalAggarwal) July 28, 2020 -
అన్నయ్య దర్శకత్వంలో ధనుష్ మూవీ
చెన్నై : తనను హీరోగా చేసిన అన్నయ్యకు ఇప్పుడు తమ్ముడు చెయ్యి అందించడానికి సిద్ధం అవుతున్నాడు. దర్శకుడు సెల్వరాఘవన్, నటుడు ధనుష్ గురించే ఈ వార్త. తుళ్లువదో ఇళౖయె చిత్రంతో ధనుష్ను హీరోగా పరిచయం చేసింది ఆయన అన్న సెల్వరాఘవన్ అన్న విషయం తెలిసిందే. ఆ తరువాత కూడా కాదల్ కొండాన్, పుదుపేటై వంటి చిత్రాలతో సెల్వరాఘవన్ తన తమ్ముడు ధనుష్ను హీరోగా నిలబెట్టాడు. ప్రస్తుతం స్టార్ హీరోగా రాణిస్తున్న ధనుష్, ఇటీవల సరైన సక్సెస్లు లేని తన అన్నయ్యకు చెయ్యి అందించడానికి సిద్ధం అయ్యారన్నది తాజా సమాచారం. సెల్వరాఘవన్ ఇటీవల సూర్య హీరోగా తెరకెక్కించిన ఎన్జీకే చిత్రం నిరాశ పరిచింది. దీంతో ఆయన ధనుష్ హీరోగా చిత్రం చేయడానికి రెడీ అవుతున్నారని తెలిసింది. దీన్ని ప్రముఖ నిర్మాత కలైపులి ఎస్.ధాను నిర్మించనున్నట్లు సమాచారం. ఈయన ధనుష్తో వరుసగా మూడు చిత్రాలు చేయడానికి ఒప్పందం కుదుర్చుకున్నారు. ప్రస్తుతం అసురన్ చిత్రాన్ని ధనుష్ హీరోగా నిర్మిస్తున్నారు. దీని తరువాత మారి సెల్వరాజ్ దర్శకత్వంలో మరో చిత్రం చేయనున్నారు. ఇక మూడో చిత్రాన్ని సెల్వరాఘవన్ దర్శకత్వంలో చేయనున్నట్లు తాజా సమాచారం. ప్రస్తుతం ధనుష్ అరసన్ చిత్రంతో పాటు దురై సెంథిల్ దర్శకత్వంలో ఒక చిత్రం, కార్తీక్సుబ్బరాజ్ దర్శకత్వంలో ఒక చిత్రం, మారి సెల్వరాజ్ దర్శకత్వంలో మరో చిత్రం అంగీకరించారు. వీటిలో వెట్ట్రిమారన్ దర్శకత్వంలో నటిస్తున్న అసురన్, దురైసెంథిల్ దర్శత్వంలో నటిస్తున్న చిత్రం నిర్మాణం చివరి దశకు చేరుకున్నాయి. కాగా కార్తీక్సుబ్బరాజ్ దర్శకత్వం వహించనున్న చిత్ర షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది. అదే విధంగా మారి సెల్వరాజ్తో చిత్రం కూడా పూర్తయిన తరువాత తన అన్న సెల్వరాఘవన్ దర్శకత్వంలో నటించే అవకాశం ఉంది. మొత్తం మీద ఈ చిత్రం 2020లో ప్రారంభం అయ్యే అవకాశం ఉంది. అయితే సెల్వరాఘవన్ ఇటీవల పుదుపేట్టై చిత్రానికి సీక్వెల్ చేస్తానని ప్రకటించారు. బహుశా ఇదే అది అవుతుందా? అన్న చర్చ ఇప్పుడు కోలీవుడ్లో జరుగుతోంది. -
అల్లుడికి మరో చాన్స్
చెన్నై : అల్లుడు ధనుష్కు తలైవా మరో చాన్స్ ఇవ్వడానికి ఫిక్సయినట్టున్నారు. రజనీకాంత్ ఎప్పటినుంచో రాజకీయాల్లోకి రావాలని ఆశిస్తున్నారు. ఆయన అభిమానులు త్వరగా రాజకీయ పార్టీని ప్రారంభించాలని కోరుకుంటున్నారు. ఇవి రెండూ నిజమే అయినా రజనీకాంత్ను మాత్రం సినిమాలు వదల బొమ్మాళి వదలా! అని అంటున్నాయి. రజనీకాంత్కు కాలా చిత్రమే చివరిది అనే ప్రచారం జరిగింది. అయితే ఆ తరువాత పేట చిత్రం చేసేశారు. అదీ హిట్ అయ్యి కూర్చుంది. తాజాగా ఏఆర్.మురుగదాస్ దర్శకత్వంలో దర్బార్ చేస్తున్నారు. నయనతార నాయకిగా నటిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం ముంబైలో ముమ్మరంగా షూటింగ్ను జరుపుకుంటోంది. తదుపరి కేఎస్.రవికుమార్ దర్శకత్వంలో నటించడానికి రజనీకాంత్ పచ్చజెండా ఊపినట్లు ప్రచారంలో ఉంది. తాజాగా తన అల్లుడు ధనుష్కు మరో అవకాశం ఇవ్వాలని రజనీకాంత్ నిర్ణయించుకున్నట్లు ప్రచారం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. నటుడు ధనుష్ హీరోగా బిజీగా ఉన్నారు. అయితే ఈయన తన వండర్బార్ ఫిలింస్ పతాకంపై నిర్మించిన చిత్రాలు ఆశించిన స్థాయిలో సక్సెస్ కాకపోవడంతో, వండర్బార్ ఫిలింస్ నష్టాల్లో ఉందనే వదంతి ప్రచారంలో ఉంది. ఈ విషయం రజనీకాంత్ దృష్టికి వెళ్లడంతో అల్లుడిని నష్టాల్లోంచి బయడ పడేసేందుకు ఆయన సంస్థలో ఒక చిత్రం చేయాలని నిర్ణయించుకున్నట్లు తాజాగా టాక్ స్ప్రెడ్ అయ్యింది. ధనుష్ ఇంతకుముందు తన మామ రజనీకాంత్ హీరోగా కాలా చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్ర సక్సెస్ వారి అంచనాలను రీచ్ కాలేదనే టాక్ ప్రచారంలో ఉంది. దీంతో వండర్బార్ ఫిలింస్ సంస్థకు రజనీకాంత్ మరో చాన్స్ ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు తాజా సమాచారం. దీనికి పేట చిత్రం ఫేమ్ కార్తీక్సుబ్బరాజ్ను దర్శకుడిగా ఎంపిక చేయాలని ధనుష్ భావిస్తున్నారు. కార్తీక్సుబ్బరాజ్ ధనుష్ హీరోగా ఒక చిత్రం చేయనున్నట్లు ఇప్పటికే ప్రచారం జరుగుతోంది. అయితే రజనీకాంత్, కార్తీక్సుబ్బరాజ్ల కాంబినేషన్లో చిత్రం చేయడానికి ధనుష్ సన్నాహాలు చేస్తున్నట్లు తాజా సమాచారం. రజనీకాంత్ నటిస్తున్న తాజా చిత్రం దర్బార్ 2020 ప్రథమార్థంలో తెరపైకి వచ్చే అవకాశం ఉంది. దీంతో రజనీకాంత్ వండర్బార్ ఫిలింస్ సంస్థలో నటించే చిత్రం ఈ ఏడాది చివర్లో గానీ, వచ్చే ఏడాది మొదట్లోగానీ సెట్పైకి వెళ్లే అవకాశం ఉంది. ఈ క్రేజీ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడే అవకాశం ఉంది. -
స్పృహతప్పి పడిపోయిన అనుపమ..
టీ.నగర్: ఒక చిత్రంలో నటిస్తూ వచ్చిన అనుపమ హఠాత్తుగా స్పృహ తప్పడం సంచలనం కలిగించింది. ధనుష్కు జంటగా ‘కొడి’ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్ నటించారు. ప్రస్తుతం మళయాల, తెలుగు చిత్రాల్లో నటిస్తున్నారు. గురువారం ఆమె ఒక తెలుగు చిత్రంలో ప్రకాష్రాజ్తో నటిస్తూ వచ్చారు. ఒక టెన్షన్ సీన్లో నటిస్తుండడంతో భావోద్వేగానికి గురైన అనుపమ స్పృహతప్పి కిందపడ్డారు. వెంటనే చిత్ర యూనిట్ సభ్యులు ఆమెను ఆస్పత్రిలో చేర్చారు. చికిత్స అనంతరం ఆమె కోలుకున్నారు. దీనిగురించి అనుపమ తన ఫేస్బుక్లో ఈ విధంగా పోస్ట్ చేశారు. ప్రకాష్రాజ్తో నటిస్తుండగా డైలాగ్ను పూర్తిగా చెప్పలేక తటపాయించానని, వెంటనే ఆయన మళ్లీ డైలాగ్ చదివి నటించాలని తెలిపారన్నారు. ఇదివరకే తనకు చలిజ్వరంతో బాధపడ్డానని, లో బీపీతో బాధపడినట్లు తెలిపారు. దీంతో స్పృహతప్పడం జరిగిందని, ప్రస్తుతం కోలుకున్నట్లు తెలిపారు. -
కేన్స్ చిత్రోత్సవాల్లో ధనుష్
తమిళసినిమా: తమిళ సినిమా గర్వించదగ్గ నటులలో ధనుష్ ఒకరు. నటుడు, గాయకుడు, గీతరచయిత, దర్శకుడు, నిర్మాత అంటూ తనకంటూ గుర్తింపును తెచ్చుకున్నారు. సినిమాలోని బహు శాఖల్లో తన ప్రతిభను చాటుకుంటున్న ధనుష్ నటుడిగానూ కోలీవుడ్, బాలీవుడ్ను దాటి హాలీవుడ్ ప్రేక్షకులను త్వరలోనే అలరించడానికి రెడీ అవుతున్నారు. ఈయన నటించిన హాలీవుడ్ చిత్రం ‘ది ఎక్స్ట్రార్డనరీ జర్నీ ఆఫ్ ద ఫకీర్’ చిత్రం నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. త్వరలో ప్రపంచ వ్యాప్తంగా విడుదలకు సిద్ధం అవుతోంది. ఆంగ్లం, ఫ్రెంచ్ భాషల్లో రూపొందిన లవ్, కామెడీ, అడ్వంచర్ కథా చిత్రంగా ఉంటుంది. చిత్ర ట్రైలర్ ఇప్పటికే విడుదలై మంచి స్పందనను తెచ్చుకుంది. ఈ చిత్రం మరో రికార్డును సాధించింది. చిత్రాన్ని కేన్స్ అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో ప్రదర్శించారు. ఈ చిత్రోత్సవాలు ఈ నెల 8వ తేదీ ఫ్రాన్స్లో ప్రారంభమయ్యాయి. ఈ చిత్రోత్సవాల్లో పాల్గొనడానికి నటుడు ధనుష్ గురువారం ‘ది ఎక్స్ట్రార్డనరీ జర్నీ ఆఫ్ ది ఫకీర్’చిత్ర యూనిట్తో కలిసి ఫ్రాన్స్కు వెళ్లారు. అక్కడ చిత్ర బృందంతో కలిసి తీసుకున్న ఫొటోలను తన ట్విట్టర్ అకౌంట్లో పోస్ట్ చేశారు. -
వారసురాలు వస్తోంది
వ్యాపారం, వాణిజ్యం, రాజకీయం, సినీరంగం... ప్రస్తుతం అన్నిచోట్లా వారసత్వం ఆనవాయితీగా మారింది. అదే కోవలో ప్రముఖ నటులు రజనీకాంత్ సైతం కొత్తగా పెట్టబోయే రాజకీయపార్టీలో ఆయన చిన్న కుమార్తె సౌందర్యను వారసురాలిగా రంగంలోకి దించబోతున్నట్లు సమాచారం. అలాగే రజనీ పెద్ద కుమార్తె ఐశ్వర్య భర్త, నటుడు ధనుష్ సైతం మామకు తోడుగా నిలుస్తారని తెలుస్తోంది. దీన్ని ధృవీకరిస్తూ మధురైలో ధనుష్ అభిమానుల పేరుతో ‘అరసియల్ వారిసే’ (రాజకీయ వారసుడా) గురువారం పోస్టర్లు కూడా వెలిశాయి. సాక్షి ప్రతినిధి, చెన్నై: అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత ఆకస్మిక మరణం రాష్ట్రంలో అతిపెద్ద రాజకీయ శూన్యతకు దారి తీసింది. ఈ శూన్యాన్ని భర్తీ చేసేందుకు నటుడు కమల్హాసన్ ‘మక్కల్ నీది మయ్యం’ అనే పార్టీని స్థాపించేశారు. అన్నాడీఎంకే బహిష్కృత నే టీటీవీ దినకరన్ సైతం ‘అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం’ అనే పార్టీని గురువారం ప్రకటించారు. రాజకీయాల్లోకి రావడం ఖాయమని జనవరి ఆరంభంలో రజనీకాంత్ ప్రకటించారు. రెండు కోట్ల సభ్యత్వం లక్ష్యంగా పనులు ప్రారంభించారు. రజనీకాంత్ ప్రజా సంఘాలకు ఇన్చార్జ్ల నియామకం దాదాపు పూర్తయింది. పార్టీ పేరును ప్రకటించడం మినహా అన్ని ఏర్పాట్లు పూర్తవుతున్న దశలో రజనీ హిమాలయాలకు ఆధ్యాత్మిక పర్యటనకు పయనమయ్యారు. సూపర్స్టార్ రజనీకాంత్ వెండితెర వారసురాలిగా చిన్న కుమార్తె సౌందర్య స్వీయ దర్శకత్వంలో కొచ్చడయన్ అనే యానిమేషన్ సినిమాను నిర్మించారు. ఆ సినిమా ఘోరపరాజయం పొంది రజనీ కుటుంబాన్ని అప్పులపాలు చేసిన తరువాత కూడా సినిమారంగంలోనే కొనసాగడంలో వెనకడుగు వేయలేదు. వెండితెర వెనుక తండ్రికి అండగా నిలిచిన ఆమె రాజకీయాల్లో సైతం తోడుగా నిలవాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. రజనీ పెద్ద కుమార్తె ఐశ్వర్య కూడా తన భర్త, నటుడు ధనుష్ను తండ్రికి తోడుగా రాజకీయాల్లోకి సిద్ధం చేస్తున్నట్లు వార్తలు వెలువడ్డాయి. కొందరు ధనుష్ అభిమానులు మధురైలో పోస్టర్లు కూడా వేసేశారు. ధనుష్ను రజనీకాంత్ ఆశీర్వదిస్తున్నట్లు ఉన్న ఫొటోలతో ‘అరసియల్ వారిసే’ (రాజకీయ వారసుడా) అని పోస్టర్లలో నినాదాన్ని రాశారు. కోలీవుడ్లో ధనుష్కు మంచి ఫాలోయింగ్ ఉంది. పెద్ద ఎత్తున యువత అభిమానాన్ని ఆయన చూరగొన్నాడు. రజనీకాంత్ రాజకీయాలకు ధనుష్ తోడైతే రాజకీయ పార్టీకి మరింత ఊపు ఖాయమని అంచనా వేస్తున్నారు. హిమాలయాల్లోనూ సాధ్యం కాదు సాధారణ వ్యక్తిలా తిరిగేందుకు హిమాలయాలకు వచ్చే నేను ఇకపై ఇక్కడ కూడా అలా తిరగడం సాధ్యం కాదని తెలుసుకున్నట్లు నటులు రజనీకాంత్ చెప్పారు. రిషికేష్లోని ధ్యానానంద సరస్వతి ఆశ్రమంలో బుధవారం సాయంత్రం ప్రత్యేక ప్రార్థనలు చేసిన అనంతరం అక్కడి ఇంగ్లీషు చానల్ ప్రతినిధితో రజనీకాంత్ మాట్లాడారు. ఒక మనిషి తనను తాను తెలుసుకోవడంలోనే జన్మసార్ధకత చేకూరుతుందన్నారు. అందుకే హిమాలయాలకు వచ్చానని, «ధ్యానం చేయడం, ఆధ్యాత్మికపరమైన పుస్తకాలు చదవడం, ఎలాంటి కట్టుబాట్లు లేకుండా ప్రజలతో కలిసి సంచరించడం కోసమే ఇలాంటి ప్రయాణాలు చేస్తుంటానన్నారు. రాజకీయ పార్టీల నేతలు, సినిమా రంగంలోని వారు నాకు ఇక్కడ అవసరం లేదని, ఇక్కడి ప్రజలు, ప్రకృతి మాత్రమే నాకు చాలునన్నారు. తమిళనాడులో ఇలా సంచరించడం సాధ్యం కాదని, ప్రజల్లో సా«ధారణ వ్యక్తిలా తిరిగే అవకాశాలను ఏనాడో కోల్పోయానని తెలిపారు. ఆ లోటును భర్తీ చేసుకునేందుకే 1995 నుంచీ హిమాలయాలకు వస్తూ స్వేచ్ఛగా తిరిగేవాడినని పేర్కొన్నారు. అయితే రాజకీయాల్లోకి రావడంతో ఇక్కడ కూడా తిరిగే అవకాశాలు లేవన్నారు. రాజకీయాల్లోకి వచ్చినవారు త్యాగాలకు సిద్ధం కావాలని, తాను సైతం అందుకు సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు. ఆ దేవుడు నటుడిగా ఇచ్చిన పాత్రను సరిగా పోషించానని, ఇక రాజకీయ నాయకుడిగా కొత్తపాత్రకు నూరుశాతం న్యాయం చేయగలనని నమ్ముతున్నట్టు తెలిపారు. ప్రజలు ఎంతో నమ్మకం పెట్టుకున్నారని, త్యాగాలు చేయడం ద్వారా వాటిని నెరవేర్చేందుకు సిద్ధమన్నారు. -
రజనీ పార్టీలోకి ధనుష్, సౌందర్య
సాక్షి ప్రతినిధి, చెన్నై: ప్రముఖ నటుడు రజనీకాంత్ తమిళనాట కొత్తగా పెట్టబోయే రాజకీయ పార్టీలో ఆయన కుటుంబసభ్యులు చేరనున్నట్లు తెలుస్తోంది. రజనీకాంత్ చిన్న కూతురు సౌందర్యతోపాటు పెద్ద కుమార్తె ఐశ్వర్య భర్త, నటుడు ధనుష్లు పార్టీలో చేరతారని సమాచారం. రజనీకాంత్ ప్రస్తుతం హిమాలయాల్లో ఆధ్యాత్మిక పర్యటనలో ఉన్నారు. కాగా, రాజకీయాల్లోకి వచ్చిన వారు త్యాగాలకు సిద్ధం కావాలని, తాను సైతం అందుకు సిద్ధంగా ఉన్నానని రజనీకాంత్ అన్నారు. రిషీకేశ్లో ఓ ఇంగ్లిష్ చానల్ ప్రతినిధితో ఆయన మాట్లాడారు. ‘రాజకీయ నాయకుడిగా కొత్త పాత్రను దేవుడిచ్చాడు. ఈ పాత్రకూ 100 శాతం న్యాయం చేయగలను’ అని చెప్పారు.