-
ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన 10 సముద్ర జీవులు
-
షాకింగ్: 100కు పైగా డేంజరస్ యాప్స్, వెంటనే డిలీట్ చేయకపోతే
యాప్స్కు సంబంధించి యూజర్లకు మరో షాకింగ్న్యూస్. స్మార్ట్ ఫోన్లను హ్యాక్ చేసి భయంకర వైరస్లను ఆండ్రాయిడ్ యాప్స్ ద్వారా డేటాను కొట్టేస్తున్న కేటుగాళ్లపై తాజా పరిశోధన సంచలన విషయాలను వెల్లడించింది. తాజాగా గూగుల్ ప్లే స్టోర్లోని 100 కంటే ఎక్కువ యాప్లకు సోకిన అత్యంత ప్రమాదకరమైన మాల్వేర్ను పరిశోధకులు గుర్తించారు. గూగుల్ ప్లే స్టోర్ లోని 100 కంటే ఎక్కువ యాప్లకు సోకిన ‘స్పిన్ ఓకే’ అనే కొత్త స్పైవేర్ను ఇటీవల గుర్తించారు. పైగా ఈ యాప్స్ 400 మిలియన్లకు పైగా డౌన్లోడ్లు నమోదైనాయి, అంటే దాదాపు 40 కోట్ల మంది సైబర్ ముప్పులో పడిపోయినట్టే. రోజువారీ రివార్డ్లు, మినీ గేమ్లను ద్వారా ఈ ట్రోజన్ మాల్వేర్ నిజమైందిగా కనిపిస్తుందని, వినియోగదారులను ఆకర్షిస్తుందని పరిశోధకులు కనుగొన్నారు. ఈ విషయాన్ని గూగుల్కి తెలియజేసి. వాటిని తొలగించినప్పటికీ, ఇలాంటి డేంజరస్ యాప్స్పై అప్రమత్తంగా ఉండాలని పరిశోధకులు సూచిస్తునారు. భవిష్యత్తులో ఇలాంటి యాప్లను గుర్తించి, డౌన్లోడ్ చేయొద్దని హెచ్చరించారు. (బుగట్టి రెసిడెన్షియల్ టవర్...నెక్ట్స్ లెవల్: దిమ్మదిరిగే ఫోటోలు) ప్రభావితమైన యాప్లు ఇవే నాయిజ్: వీడియో ఎడిటర్ విత్ మ్యూజిక్ జాప్యా: ఫైల్ బదిలీ, షేర్ వీఫ్లై: వీడియో ఎడిటర్&వీడియో మేకర్ ఎంవీ బిట్- ఎంవీ వీడియో స్టేటస్ మేకర్ బియూగో- వీడియో మేకర్&వీడియో ఎడిటర్ క్రేజీ డ్రాప్ క్యాష్జైన్ – క్యాష్ రివార్డ్ ఫిజ్జో నావల్ – ఆఫ్లైన్ రీడింగ్ క్యాష్ ఈఎం: రివార్డ్స్ టిక్: వాట్ టు ఎర్న్ మాల్వేర్ సోకిన యాప్లను ఎలా గుర్తించాలి ♦ యాప్ అనుమతులను చెక్ చేసుకోవాలి.యాక్సెస్ లేదా నెట్వర్క్ కనెక్టివిటీ వంటి వాటిని పరిశీలించాలి. ♦ నకిలీ ఆఫర్లు లేదా రివ్యూస్లో అధిక ప్రకటనలుంటే పట్ల జాగ్రత్తగా ఉండాలి. యూజర్ అభిప్రాయానికి, సపోర్ట్కు స్పందించే డెవలపర్ల విశ్వసనీయతను గమనించాలి. ♦ ఇన్స్టాల్ల-టు-రివ్యూల రేషియోను గమనించాలి. ఇన్స్టాల్ల-టు-రివ్యూల నిష్పత్తి ఎంత; ఎంతమంది యాప్ను ఇన్స్టాల్ చేసారనే దానితో పోలిస్తే ఎంతమంది రివ్యూ చేశారనేది చూడాలి. డౌన్లోడ్లకు మించి రివ్యూలుంటే అనుమానించాల్సిందే. ♦ యాప్ డెవలపర్ని ఇతర సోషల్మీడియా హాండిల్స్, చట్టబద్ధతను చూడాలి. (మనవరాలికోసం అంబానీ ఏం చేశారో తెలుసా? ఇంటర్నెట్లో వీడియో వైరల్) ♦ స్పెల్లింగ్ లేదా వ్యాకరణ లోపాలు, అస్పష్టమైన సమాచారం లేదా యాప్ ఫంక్షనాలిటీ వివరాల కొరత గురించి జాగ్రత్తగా గమనించాలి. ♦ పాస్వర్డ్లు లేదా క్రెడిట్ కార్డ్ వివరాల వంటి సున్నితమైన డేటాను అభ్యర్థించే యాప్ల జోలికి అసలు వెళ్ల వద్దు. ముఖ్యంగా యాప్లను డౌన్లోడ్ చేసేటప్పుడు జాగ్రత్త గా ఉండాలి. యాప్ అనుమానాస్పదంగా అనిపిస్తే, ఇన్స్టాల్ చేయకపోవడమే మంచిది. మరిన్ని బిజినెస్ వార్తలు, అప్డేట్స్ కోసం చదవండి:సాక్షిబిజినెస్ -
ప్రపంచంలోని టాప్ 10 విషపూరిత పాములు
-
ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన ఎయిర్పోర్టులు, ఇవే (ఫోటోలు)
-
ప్రపంచంలోని టాప్ 10 అత్యంత ప్రమాదకరమైన రోడ్లు
-
NIA: ముంబైలో 'డేంజర్ మ్యాన్'... పోలీసుల హై అలర్ట్..
ముంబై: దేశ ఆర్థిక రాజధాని ముంబైలో ఎన్ఐఏ హై అలర్ట్ ప్రకటించింది. పోలీసులు సహా మహారాష్ట్రలోని అన్ని దర్యాప్తు సంస్థలు అప్రమత్తంగా ఉండాలని అధికారులకు మెయిల్స్ పంపింది. ఇండోర్కు చెందిన ఓ ప్రమాదకర వ్యక్తి మంబైలోని ప్రవేశించాడని, అతడు చైనా, పాకిస్థాన్, హాంకాంగ్లో శిక్షణ తీసుకుని వచ్చాడని హెచ్చరించింది. ఈ డేంజర్ మ్యాన్ పేరు సర్ఫరాజ్ మిమాన్. ఇతనికి సంబంధించిన ఆధార్ కార్డు, పాస్పోర్టు, డ్రైవింగ్ లైసెన్స్ కాపీలను ఎన్ఐఏ అన్ని దర్యాప్తు సంస్థలకు పంపింది. కొద్ది రోజుల క్రితం ఓ గుర్తు తెలియని వ్యక్తి సర్ఫరాజ్ మిమాన్ గురించి ఎన్ఐఏకు మెయిల్ చేసి అప్రమత్తం చేశాడు. దీంతో సర్ఫరాజ్ను అరెస్టు చేసేందుకు పోలీసు ప్రత్యేక బృందాలు రంగంలోకి అతని కోసం గాలిస్తున్నాయి. రెండు రోజుల క్రితమే ఫిబ్రవరి 25న ఢిల్లీ పోలీసులు ఇద్దరిని అరెస్టు చేశారు. వీరు ఆయుధాల శిక్షణ తీసుకునేందుకు పాకిస్తాన్కు వెళ్లేందుకు ప్రయత్నిస్తుండగా గుర్తించి చాకచక్యంగా అరెస్టు చేశారు. ఇద్దరిలో ఒకరు థానే వెస్ట్కు చెందిన ముబారక్ ఖాన్ కాగా.. మరొకరు తమళనాడుకు చెందిన అబ్దుల్లా అని ఢిల్లీ పోలీసులు వెల్లడించారు. చదవండి: సీబీఐ అరెస్ట్పై సుప్రీంకోర్టుకు సిసోడియా.. -
RGV తో సాక్షి స్పెషల్ ఇంటర్వ్యూ
-
ద్యావుడా.. ఒకే రోజు 17 సినిమాలు...ఎందుకిలా?
ఒకే వారంలో నాలుగైదు చిన్న సినిమాలు రిలీజ్ అవ్వడం టాలీవుడ్కి కొత్తేమి కాదు. ఒక్కోసారి 7-8 సినిమాలు కూడా రిలీజ్ అయిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఈ వారంతం ఒకటి కాదు రెండు కాదు.. ఒకేసారి 17 సినిమాలు బాక్సాఫీస్ బరిలోకి దిగబోతున్నాయి. టాలీవుడ్లో ఇదో రికార్డు అని చెప్పొచ్చు. సాధారణంగా పండుగ సీజన్స్లో పెద్ద సినిమాలు ఎక్కువగా విడుదలవుతాయి కాబట్టి చిన్న చిత్రాలు వెనక్కి తగ్గి.. పోటీలేని టైమ్లో ప్రేక్షకుల ముందుకు వస్తుంటాయి. ఈ క్రమంలో చిన్న చిత్రాల మధ్య బాక్సాఫీస్ వార్ మొదలవుతుంది. ‘తగ్గేదే లే’ అన్నట్లుగా ఒకేసారి ఐదారు బరిలోకి దిగుతాయి. కొంచెం పాజిటివ్ టాక్ వచ్చినా చాలు సేఫ్ జోన్లోకి వెళ్లిపోతాయి. కానీ నెగెటివ్ టాక్ వస్తే.. మరుసటి రోజే థియేటర్స్ నుంచి బయటకు వెళ్లాల్సిందే. అందుకే పోటీగా ఎక్కువ చిత్రాలు ఉన్నా.. విడుదలకు వెనక్కి తగ్గరు చిన్న నిర్మాతలు. (చదవండి: ఈ వారం ఓటీటీ, థియేటర్లలో సందడి చేయనున్న సినిమాలు ఇవే..!) అయితే ఈ వారం మాత్రం బాక్సాఫీస్ పోరు మాములుగా లేదు. ఈ ఏడాది చివరి మాసం కావడం.. సంక్రాంతి బరిలో వరుసగా పెద్ద చిత్రాలు ఉండడంతో.. డిసెంబర్ 9న ఏకంగా 17 చిన్న చిత్రాలు రిలీజ్ అవుతున్నాయి. ఎన్ని థియేటర్స్ దొరికాయి.. ఎక్కడెక్కడ దొరకలేదు అనే విషయాన్ని పట్టించుకోకుండా.. మన సినిమా విడుదలైతే చాలు..అదే పదివేలు అన్నట్లుగా చిన్న నిర్మాతలు వ్యవహరిస్తున్నారు. ఈ శుక్రవారం విడుదలయ్యే సినిమాల జాబితాలో గుర్తుందా శీతాకాలం, పంచతంత్రం, ముఖచిత్రం, ప్రేమదేశం, చెప్పాలని ఉంది, లెహరాయి, నమస్తే సేట్జీ, ప్రేమదేశం(ఈ ఓల్డ్ చిత్రం మళ్లీ థియేటర్స్లో విడుదలవుతుంది), రాజయోగం, డేంజరస్, విజయానంద్, ఏపీ 04 రామపురం, ఐ లవ్ యు ఇడియట్, మనం అందరం ఒక్కటే, ఆక్రోశం, ఏయ్ బుజ్జి నీకు నేనే, సివిల్ ఇంజనీర్ చిత్రాలు ఉన్నాయి. వీటిలో గుర్తుందా శీతాకాలం, పంచతంత్రం, డేంజరస్తో పాటు మరో రెండు, మూడు చిత్రాలు మాత్రమే ప్రచారం ప్రారంభించాయి. మిగతా చిత్రాలన్ని కేవలం పోస్టర్, ట్రైలర్ విడుదల చేసి నేరుగా థియేటర్స్లోకి వస్తున్నాయి. మరి వీటిలో ఏ సినిమాలు ప్రేక్షకులను మెప్పించి విజయం సాధిస్తాయో చూడాలి. -
అందుకే ‘డేంజరస్’ సినిమా తీశా: రామ్గోపాల్ వర్మ
‘‘హీరో, హీరోయిన్ల మధ్య ప్రేమ నేపథ్యంలో లెక్కలేనన్ని సినిమాలు వచ్చాయి. కానీ, ఇద్దరు అమ్మాయిల మధ్య ప్రేమ ఎలా ఉంటుంది? అనే కొత్త ఆలోచనతో ‘డేంజరస్’ సినిమా తీశా. ఈ ప్రేమకథ సరికొత్తగా, ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంటుంది’’ అని డైరెక్టర్ రామ్గోపాల్ వర్మ వర్మ అన్నారు. నైనా గంగూలీ, అప్సరా రాణి లీడ్ రోల్స్లో నటించిన చిత్రం ‘డేంజరస్’. రామ్గోపాల్ వర్మ స్వీయ దర్వకత్వంలో నిర్మించిన ఈ సినిమా తెలుగు, హిందీ, తమిళ భాషల్లో ఈ నెల 9న విడుదలకానుంది. ఈ సందర్భంగా రామ్గోపాల్ వర్మ మాట్లాడుతూ– ‘‘రొమాంటిక్, క్రైమ్, సస్పెన్స్, యాక్షన్ వంటి అంశాలతో ‘డేంజరస్’ తెరకెక్కింది. అబ్బాయిల వల్ల చేదు అనుభవాలు ఎదుర్కొన్న ఇద్దరు అమ్మాయిలు, ఆ అమ్మాయిల మధ్య చిగురించే ప్రేమ నేపథ్యంలో ఈ కథ సాగుతుంది. మంచి హీరోయిన్ డేట్స్ దొరికి హీరో డేట్స్ కుదరకపోయినా ఇద్దరు హీరోయిన్లతో కూడా సినిమాలు చేయొచ్చనే ఆలోచనతో ఈ సినిమా తీశాను. హిందీలో అమితాబ్ బచ్చన్గారితో, కన్నడలో ఉపేంద్రతో నా దర్శకత్వంలో చేయనున్న సినిమాలు వచ్చే ఏడాది ప్రారంభమవుతాయి . ►ఆంధ్రప్రదేశ్లో నెలకొన్న రాజకీయాలపై తొలి భాగం ‘వ్యూహం’, రెండవ భాగం ‘శపథం’ టైటిల్తో సినిమాలు చేయనున్నాను. సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డిగారు చనిపోయాక జరిగిన ఘటనలు, వ్యూహాల నేపథ్యంలో ‘వ్యూహం’ ఉంటుంది.. ఏపీ రాజకీయాల్లో ఉన్న డ్రామా తెలంగాణలో లేదు. అందుకే ఏపీ పాలిటిక్స్ పై సినిమాలు తీస్తున్నాను. పైగా వైసీపీ, టీడీపీ పార్టీల్లో నాకు ఫ్రెండ్స్ ఉండడం కూడా మరో కారణం. -
డేంజరస్ ట్రైలర్.. ఆ అమ్మాయిలిద్దరూ ఎందుకు ప్రేమించుకున్నారు?
అప్సరా రాణి, నైనా గంగూలీ ప్రధాన పాత్రల్లో కంపెనీ పతాకంపై రామ్గోపాల్ వర్మ స్వీయ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘డేంజరస్’. ‘మా ఇష్టం’ అనేది క్యాప్షన్. ఈ సినిమా డిసెంబరు 9న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ సినిమా తెలుగు, తమిళ, హిందీ ట్రైలర్ను రిలీజ్ చేశారు. రామ్గోపాల్ వర్మ, నట్టి కుమార్, ఏబీ శ్రీనివాస్ రామ్గోపాల్ వర్మ మాట్లాడుతూ– ‘‘నా సినిమాల్లో మరో కొత్త కోణం ఈ సినిమా. మగవాళ్లతో ఇద్దరు అమ్మాయిలకు ఎలాంటి ఇబ్బందులు ఎదురయ్యాయి? ఆ అమ్మాయిలిద్దరూ ఎందుకు ప్రేమించుకున్నారు? అనే అంశాల నేపథ్యంలో ఈ సినిమా ఉంటుంది’’ అని అన్నారు. ఈ కార్య క్రమంలో నిర్మాత– డిస్ట్రిబ్యూటర్ నట్టి కుమార్, నిర్మాత ఏబీ శ్రీనివాస్ పాల్గొన్నారు. -
మేము డేంజరా? మరి అణ్వాయుధాలున్న భారత్ ప్రమాదం కాదా?
ఇస్లామాబాద్: అణ్వాయుధ సమన్వయం లేని పాకిస్థాన్ ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన దేశమని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఈ విషయంపై పాక్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. బైడెన్ వాఖ్యలపై వివరణ ఇవ్వాలని ఇస్లామాబాద్లోని అమెరికా రాయబారి డొనాల్డ్ బ్లోమ్కు సమన్లు పంపింది. పాకిస్థాన్ తన సమగ్రత, భద్రత విషయంలో మొండిగా ఉంటుందని ఆ దేశ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో అన్నారు. ఒకవేళ ప్రశ్నలు లేవనెత్తాల్సి వస్తే భారత్లో అణ్వాయుధాలపై కూడా ప్రశ్నించాలని పేర్కొన్నారు. బైడెన్ కామెంట్లు తనను షాక్కు గురిచేశాయని భుట్టో అన్నారు. సమన్వయ లోపం వల్లే బైడెన్ పొరబడి ఉంటారని చెప్పారు. లాస్ ఏంజెల్స్లో ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ పాకిస్థాన్ అత్యంత ప్రమాదకర దేశమని బైడెన్ అన్నారు. పాక్ ప్రధాని అమెరికాతో సంబంధాలు బలోపేతం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో బైడెన్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. చదవండి: పాకిస్తాన్పై బైడెన్ సంచలన వ్యాఖ్యలు -
పాకిస్తాన్పై బైడెన్ సంచలన వ్యాఖ్యలు... ఆ దేశాలతో ముప్పు
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అణ్వాయుధాల సమన్వయం లేని పాకిస్తాన్ని ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన దేశాల్లో ఒకటిగా అభివర్ణించారు. ఈ మేరకు బైడెన్ లాస్ ఏంజిల్స్లో జరిగిన డెమోక్రటిక్ కాంగ్రెస్ క్యాంపెయిన్ కమిటీ రిసెప్షన్ కార్యక్రమంలో ఈ వ్యాఖ్యలు చేశారు. చైనా రష్యా తీరుపై కూడా విమర్శలు కురింపించారు. బైడెన్ చైనా, రష్యాలతో గల యూసెస్ విదేశాంగ పాలసీ విధానం గురించి చెబుతూ పాకిస్తాన్పై ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేగాదు చైనా అధ్యక్షుడు జిన్పింగ్కి తనకు కావల్సిన దానిపై పూర్తి క్లారిటీ ఉందని, కానీ పలు వివాదాలను ఎదుర్కొంటున్నాడని అన్నారు. ఈ 21వ శతాబ్దంలో రెండో త్రైమాసికంలో అమెరికాను మరింత శక్తివంతంగా మార్చేందుకు పలు అపారమైన అవకాశాలు ఉన్నాయని నమ్మకంగా చెప్పారు. ఈ మేరకు అమెరికా జాతీయ భద్రతా వ్యూహాం విదేశాంగ పాలసీ సంబంధించిన కీలక పత్రాలను విడుదల చేసింది. ఐతే అమెరికా విడుదల చేసిన 48 పేజీల ఈ డాక్యుమెంట్లలో పాకిస్తాన్కి సంబంధించి ఎలాంటి ప్రస్తావన లేదు. ఆ డాక్యుమెంట్లో... హద్దులేని భాగస్వామ్యంతో చైనా, రష్యాలు కలిసిపోతున్నాయని హెచ్చరించారు. ఆ రెండు దేశాలు విసిరే సవాళ్లు చాలా విభిన్నంగా ఉన్నాయన్నారు. ఈ రెండు దేశాలతో యూఎస్కి ఎదురయ్యే ముప్పు గురించి నొక్కి చెప్పారు. రష్యా ఆగడాలకు అడ్డుకట్టవేస్తూ పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనాపై శాశ్వతమైన పోటీని కొనసాగించేందుకు ప్రాధాన్యత ఇస్తానని చెప్పారు. ముఖ్యంగా ఇండో పసిఫిక్ ప్రాంతాల్లో చైనాతో పోటీ ఎక్కువగా ఉంటుందని, ప్రపంచవ్యాప్తంగా కూడా పెరిగే అవకాశం ఉంటుందని స్పష్టం చేశారు. (చదవండి: 'నాటో యుద్ధానికి దిగితే ప్రపంచ విపత్తు తప్పదు': పుతిన్ స్ట్రాంగ్ వార్నింగ్) -
‘104’ మృత్యు మార్గాలు.. ఈ రోడ్లు యమడేంజర్ గురూ!
సాక్షి, చెన్నై: రాజధాని నగరం చెన్నైలో 104 మార్గాలు ప్రమాదకరంగా ఉన్నట్లు తేలింది. ఈ మార్గాల్లోనే అధిక ప్రమాదాలు జరుగుతున్నట్లు ప్రత్యేక బృందం పరిశీలనలో వెలుగు చూసింది. ప్రమాదాల నివారణ లక్ష్యంగా ప్రత్యేక కార్యచరణపై దృష్టి పెట్టారు. చెన్నై రోడ్లు నిత్యం వాహనాల రద్దీతో కిటకిటలాడుతుంటాయి. ఈ క్రమంలో రోడ్డు ప్రమాదాలు కూడా అధికంగా జరుగుతుంటాయి. ట్రాఫిక్ పోలీసులు అతి వేగంపై దృష్టి పెడుతున్నా, జరిమానాలు విధిస్తున్నా, అతి వేగంగా దూసుకెళ్లే వాళ్లల్లో మాత్రం మార్పు రావడం లేదు. జాతీయ స్థాయి నేర పరిశోధ రికార్డుల మేరకు దేశంలో అత్యధిక ప్రమాదాలు జరిగే జాబితాలో మొదటి మూడు నగరాల్లో చెన్నై కూడా ఉంది. ఆ మేరకు ఇక్కడ ప్రమాదాలు జరుగుతున్నాయి. దీంతో ప్రమాదాలు అధికంగా జరిగే ప్రాంతాలను గుర్తించేందుకు ప్రత్యేక బృందం నెల రోజుల క్రితం రంగంలోకి దిగింది. ఐపీఎస్ అ«ధికారి వినిత్ మన్కోడో నేతృత్వంలో ఐఐటీ నిపుణులు, చెన్నై కార్పొరేషన్, రహదారుల శాఖ వర్గాలతో కూడిన బృందం గత నెల రోజులుగా చెన్నైలోని రోడ్లపై సుదీర్ఘ పరిశీలన జరిపింది. కమిషనర్ సమాలోచన ఈ బృందం జరిపిన పరిశీలనలో 104 మార్గాలు మృత్యుమార్గాలు, ప్రమాదాలకు నెలవుగా ఉన్నట్లు గుర్తించారు. ఈ మార్గాల్లో నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయని, మరణాలతో పాటు గాయాలపాలయ్యే వారి సంఖ్య అధికంగా ఉన్నట్టు తేలింది. చిన్న ప్రమాదాలు సైతం పై మార్గాల్లో జరుగుతున్నట్టు తేల్చారు. దీంతో ఈ మార్గాల్లో ప్రమాదాల నివారణకు చర్యలపై దృష్టి పెట్టారు. శుక్రవారం కమిషనర్ శంకర్ జివ్వాల్తో ఈ బృందం సమావేశమైంది. ప్రమాదాలు అధికంగా జరిగే మార్గాల గురించి చర్చించారు. ఈ మార్గాల్లో ప్రమాదాల నివారణకు చేపట్టాల్సిన చర్యలపై కార్యచరణకు సిద్ధమయ్యారు. ఈ విషయంగా కమిషనర్ శంకర్జివ్వాల్ మాట్లాడుతూ.. నగరంలో ప్రమాదాల నివారణ లక్ష్యంగా ముందుకెళుతున్నామన్నారు. 2021తో పోల్చితే ఈ 8 నెలలు చెన్నైలో ప్రమాదాలు 20 శాతం తక్కువగానే ఉన్నట్టు పేర్కొన్నారు. అయినా, ప్రమాదాలకు ఆస్కారం ఇవ్వకుండా వాహనదారులను అప్రమత్తం చేసే విధంగా ప్రత్యేక కార్యచరణపై దృష్టి పెట్టనున్నామని తెలిపారు. ఈ బృందం పేర్కొంటున్న 104 మార్గాల్లో పరిశీలన జరపనున్నామని, ఇక్కడ నివారణ లక్ష్యంగా చేపట్టాల్సిన పనులపై దృష్టి పెట్టనున్నామని తెలిపారు. -
ఉచిత పథకాలు దేశానికి ప్రమాదకరం
జలౌన్: ఉచిత పథకాల ద్వారా ఓట్లు దండుకునే సంస్కృతి దేశం అభివృద్ధికి చాలా ప్రమాదకరమని ప్రధాని మోదీ అన్నారు. ఇటువంటి తాయిలాల పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రజలను ఆయన హెచ్చరించారు. యూపీలో రూ.14,850 కోట్లతో నిర్మించిన 296 కిలోమీటర్ల బుందేల్ఖండ్ ఎక్స్ప్రెస్ వేను జలౌన్ జిల్లా కైతెరి గ్రామం వద్ద శనివారం ప్రధాని ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. ఈ రహదారితో వాహనాల వేగం మాత్రమే కాదు, బుందేల్ఖండ్ ప్రాంతంలో పారిశ్రామిక అభివృద్ధి కూడా వేగవంతమవుతుందని చెప్పారు. చిత్రకూట్– ఢిల్లీ మధ్య ప్రయాణ కాలం మూడు నుంచి నాలుగు గంటలు తగ్గుతుందని కూడా చెప్పారు. ‘‘మన దేశంలో రేవడీ(ఉత్తర భారతంలో ఒక స్వీట్ పేరు)లు పంచుతూ ఓట్లు రాబట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. రేవడీలతో ప్రజలను కొనుగోలు చేయవచ్చని అనుకుంటున్నారు. ఈ సంస్కృతి దేశం అభివృద్ధికి ప్రమాదకరం. రేవడీ సంస్కృతితో కొత్త ఎక్స్ప్రెస్ వేలు, ఎయిర్పోర్టులు, డిఫెన్స్ కారిడార్లు రావు. ఈ సంస్కృతిని దేశ రాజకీయాల నుంచి పారదోలినప్పుడే కొత్త రహదారులు, కొత్త రైలు మార్గాలు నిర్మించి ప్రజల ఆకాంక్షలను నెరవేర్చవచ్చు’’అంటూ ఎన్నికల సమయంలో ఉచిత పథకాలను ప్రకటించే రాజకీయ పార్టీలపై పరోక్షంగా విమర్శలు చేశారు. బీజేపీ డబుల్ ఇంజిన్ ప్రభుత్వాలు సులువైన రేవడీ సంస్కృతిని వదిలి, రాష్ట్రాభివృద్ధికి తీవ్రంగా పాటుపడుతున్నాయని ప్రధాని చెప్పారు. దేశ అభివృద్ధికి పునాదులు: కేజ్రీవాల్ ఉచిత పథకాలపై ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలపై ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ స్పందించారు. తమ ప్రభుత్వం ప్రజలకు ఉచితంగా ఇస్తున్న విద్య, ఆరోగ్యం, విద్యుత్ సౌకర్యాలు ఓట్లు గుంజే తాయిలాలు కావని తెలిపారు. మన దేశం ప్రపంచంలోనే నంబర్ వన్గా నిలిచేందుకు పునాది వేసేందుకు చేస్తున్న ప్రయత్నాలని పేర్కొన్నారు. -
అత్యంత ప్రమాదకరమైన ఈ మూడు పాముల గురించి తెలుసా?
పశ్చిమ గోదావరి (బుట్టాయగూడెం): వర్షాకాలం మొదలైంది. పాములు ఎక్కడపడితే కనిపిస్తుంటాయి. అటవీ ప్రాంతంలోని సరిహద్దు గ్రామాల్లో, దట్టమైన పొదల సమీపంలో పాములు తరచూ కనిపిస్తూనే ఉంటాయి. రైతులు పొలాలకు నీరుపెట్టేందుకు వ్యవసాయ పనులకు వెళ్తుంటారు. ఈ సమయంలో అప్రమత్తంగా లేకపోతే పాముల రూపంలో కాలయముడు కాచుకుని ఉంటాడు. గత వారం రోజుల్లో పోలవరం నియోజకవర్గంలోని వేలేరుపాడు, కుక్కునూరు, పోలవరం, బుట్టాయగూడెం, జీలుగుమిల్లి మండలాల్లో గల ప్రభుత్వాస్పత్రుల్లో పాము కాటు కేసులు నమోదవుతున్నట్లు వైద్యులు చెబుతున్నారు. బుట్టాయగూడెం మండలంలో గత మూడు రోజుల్లో ఇద్దరు పాముకాటుకు గురై మృతి చెందిన సంఘటనలు చోటు చేసుకున్నాయి. అదేవిధంగా మండ్రకప్ప, తేలు కాటుకు గురై పలువురు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఏటా జూన్ నుంచి సెప్టెంబర్ వరకూ పాములు, ఇతర విష కీటకాల బెడద ఉంటుంది. వీటి బారిన పడకుండా తప్పించుకోవడానికి అప్రమత్తతే ప్రధానమని వైద్యులు చెబుతున్నారు. అన్ని పాములు ప్రమాదకరం కాదు మనకు కనిపించే అన్ని పాములు విషపూరితం కాదని వైద్య నిపుణులు అంటున్నారు. నాగుపాము, కట్లపాము, రక్తపింజర వంటి పాముల వల్లే ప్రమాదం ఉందని చెబుతున్నారు. సాధారణంగా 50 శాతంపైగా పాముల వల్ల ఎలాంటి ప్రమాదం ఉండదని వైద్యులు అంటున్నారు. పాము కాటేసిన వెంటనే వైద్యం చేయించుకుంటే ఎలాంటి సమస్య ఉండదు. రక్తపింజర ఎక్కువగా అటవీప్రాంతంలో తిరుగుతుంది. ఈ పాము కాటు వేస్తే 2 గంటల తర్వాత విషం శరీరానికి ఎక్కుతుందని చెబుతున్నారు. రక్తపింజర కాటువేసిన వెంటనే అందుబాటులో ఉన్న ప్రాథమిక ఆస్పత్రులకు వెళ్లి వైద్యం పొందాలి. నాగుపాము నాగుపాము అత్యంత ప్రమాదకరమైంది. ఈ పాము కాటువేస్తే 15 నిమిషాల్లో విషం ఎక్కుతుందని అంటారు. ముందుగా పాముకాటు వేసిన చోట వెంటనే కట్టు కట్టాలి. తదుపరి పాము కాటుకు గురైన వ్యక్తిని ఆస్పత్రికి తరలించాలి. నాగుపాము విషం ప్రధానంగా నాడీ వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతుంది. కట్లపాము కట్లపాము కాటువేసిన వెంటనే విషం రక్తంలో కలుస్తుంది. ప్రాణాపాయం ఎక్కువ. పాము కాటు వేసిన వెంటనే ఆస్పత్రిలో చేర్పించి వైద్యం చేయించాలి. కట్లపాము విషం రక్తంలోకి చేరకముందే వైద్యం చేయిస్తే ప్రాణాపాయం నుంచి బయటపడే అవకాశం ఉంది. ఈ జాగ్రత్తలు పాటించాలి ► పాముకాటుకు గురైన వారు ఎలాంటి ఆందోళన చెందకూడదు. తీవ్రమైన ఒత్తిడికి గురైతే గుండెపోటు వచ్చే ప్రమాదం ఉంది. ► పాము కాటువేయగానే గాయాల పైభాగంలో కట్టుకట్టాలి. ► ఏ పాము కాటు వేసిందో తెలుసుకొని యాంటీ వీనమ్(విషానికి విరుగుడు) తీసుకుంటే ప్రాణాపాయం నుంచి తప్పించుకోవచ్చు. ► రైతులు రాత్రిపూట పొలాలకు వెళ్ళేప్పుడు కాళ్ళకు చెప్పులు, టార్చిలైట్లతో పాటు శబ్దాలు చేసే పరికరాన్ని వెంట తీసుకుని వెళ్ళడం వల్ల పాముకాటు నుంచి రక్షించుకోవచ్చు. అన్ని ఆస్పత్రుల్లో యాంటివీనమ్ పాముల నుంచి రక్షించుకునేందుకు అప్రమత్తత అవసరం. పాముకాటుకు గురైతే యాంటివీనమ్ మందులు అన్ని ప్రాథమిక కేంద్రాల్లో ఉంటాయి. కాటుకు గురైన వ్యక్తి శరీరంలో మార్పులు రాకుండా తగు జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉంది. – జె. సురేష్, వైద్యుడు, పులిరామన్నగూడెం -
ఒకే రోజు నాలుగు సినిమాలు, ప్రేక్షకుడి ఓటు ఎవరికో?
డిఫరెంట్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ అవుతూ నేటితరం ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్నారు రామ్ గోపాల్ వర్మ. విలక్షణ దర్శకుడిగా వెండితెరపై తన మార్క్ చూపిస్తున్న ఆయన.. దేశంలోనే తొలిసారిగా 'మా ఇష్టం' సినిమా రూపంలో ఓ లెస్బియన్ కథను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. ఇద్దరమ్మాయిల ప్రేమకథతో తెరకెక్కిన ఈ సినిమాను మే 6న రిలీజ్ చేయనున్నారు. ఇక అదే రోజు అశోకవనంలో అర్జున కళ్యాణం, జయమ్మ పంచాయితీ, భళా తందనాన సినిమాలు రిలీజవుతున్నాయి. మరి వీటిలో ప్రేక్షకులు ఏ సినిమాకు ఓటు వేస్తారు? ఏ మూవీ హిట్ అందుకోనుందనేది వేచి చూడాల్సిందే! View this post on Instagram A post shared by RGV (@rgvzoomin) var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_771247577.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); చదవండి: నోరా ఫతేహితో డేటింగ్పై స్పందించిన కొరియోగ్రాఫర్ పెళ్లిపీటలెక్కబోతున్న రీల్ లైఫ్ జంట -
గ్యాస్ సిలిండర్కి ఎక్స్పైరీ తేదీ ఉంటుంది!..గడువు దాటితే ప్రమాదమే
బలిజిపేట: గ్యాస్ కనెక్షన్ కొనుగోలు చేసి వినియోగించడం ప్రస్తుతం ఎంత అవసరమో, దాని వినియోగంలో జాగ్రత్తలు తీసుకోవడం అంతే ముఖ్యం. జాగ్రత్తలు పాటించకపోతే ప్రమాదం పొంచి ఉన్నట్లే. అందులో అత్యంత ముఖ్యమైనది గ్యాస్ సిలిండర్కూ కాలపరిమితి ఉంటుందని తెలియకపోవడమే. గ్యాస్ సిలిండర్కు ఉండే కాలపరిమితిని సాధారణంగా ఎవరూ గమనించరని, కాలపరిమితి దాటితే పెనుప్రమాదం ఉంటుందని పలువురు నిపుణులు చెబుతున్నారు. గ్యాస్ సిలిండర్ ఎక్స్పైరీ తేదీ ముగిసినా వినియోగిస్తే గ్యాస్ లీయయ్యే ప్రమాదం ఉందంటున్నారు. సరఫరా చేసే ప్రతి సిలిండర్పై ఎక్స్పైరీ సంవత్సరాన్ని, నెలను కోడ్ విధానంలో మెటల్ ప్లేట్పై వంటగ్యాస్ కంపెనీలు ముద్రిస్తాయి. సిలిండర్ మారుతున్నప్పుడల్లా ఎక్స్పైరీ గడువును చూసుకుని తీసుకోవడం, వినియోగించుకోవడం ఎంతో అవసరమని హితవు పలుకుతున్నారు. కాలపరిమితిని ఎలా గుర్తించాలంటే.. సిలిండర్ మెటల్ ప్లేటుపై ఆంగ్ల అక్షరంతో సంవత్సరం, నెల ఉంటుంది. దాని ప్రకారం అది ఏసంవత్సరం, ఏనెల తరువాత ఎక్స్పైరీ అవుతుందో తెలుస్తుంది. ఉదాహరణగా ఎ–24అని ఉంటే ఆ సిలిండర్ 2024 మార్చిలో ఎక్స్పైర్ అవుతుందని అర్థం. ఆంగ్ల అక్షరం త్రైమాసికానికి సూచిక. ఎ అక్షరం జనవరి నుంచి మార్చి వరకు, బి అక్షరం ఏప్రిల్ నుంచి జూన్ వరకు, సి అక్షరం జూలై నుంచి సెప్టెంబరు వరకు, డి అక్షరం అక్టోబర్ నుంచి డిసెంబరు వరకు అని గుర్తించాలి. గడువును గుర్తించాలి సిలిండర్ ఇంటి వద్దకు వచ్చిన వెంటనే మెటల్ ప్లేట్పై కోడ్ విధానంలో ఉండే ఎక్స్పైరీ గడువును గుర్తించి తీసుకోవాలి. అది నెల రోజులకు సమీపంలో ఉంటే అటువంటి సిలిండర్ను తీసుకోకూడదు. చిన్నచిన్న కుటుంబాలవారు, అతి తక్కువ వేతనం సంపాదించేవారు గ్యాస్ వినియోగం ఎక్కువ రోజులు చేస్తుంటారు. కనుక ఎక్స్పైరీ తేదీ లోపల వారి సిలిండర్ పూర్తయ్యే అవకాశాలు తక్కువగా ఉండే అవకాశాలు ఉన్నందున అటువంటి సిలిండర్లతో ప్రమాదం సంభవించే ఆస్కారం ఉంది. అందుకు గడువును గుర్తించి సిలిండర్ తీసుకోవాలి. దానిస్థానంలో వేరే సిలిండర్ అడిగే హక్కు వినియోగదారునికి ఉంది. సిలిండర్కు పదేళ్ల గడువు సిలిండర్ తయారైన నాటి నుంచి పదేళ్ల వరకు దానికి గడువు ఉంటుంది. సిలిండర్ను ప్రత్యేకమైన ఉక్కుతో, లోపల భాగం సురక్షితమైన కోటింగ్తో బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్స్(బీఐఎస్) ప్రమాణాలతో తయారుచేస్తారు. బీఐఎస్ అనుమతుల తరువాతే సిలిండర్ మార్కెట్లోకి వస్తుంది. గడువు ముగిసేవి ఉండవు గ్యాస్ సిలిండర్లు గడువు ముగిసేవి ఉండవు. ముందే వాటిని కండెమ్ సరుకుగా తీసివేస్తారు. తయారై వచ్చిన వాటిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించి గ్యాస్ ఫిల్లింగ్ చేస్తారు. పకడ్బందీగా చర్యలు ఉంటాయి. హర్ష, గ్యాస్ ఏజెన్సీ యజమాని, పలగర, బలిజిపేట మండలం (చదవండి: రైతును శాస్త్రవేత్తను చేయడమే వైఎస్సార్ పొలంబడి లక్ష్యం) -
డేంజరస్ మూవీకి వరుస షాక్లు.. ఫైనల్గా ఆర్జీవీ కీలక నిర్ణయం!
రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన పాన్ ఇండియా చిత్రం ‘డేంజరస్’(తెలుగులో ‘మా ఇష్టం’) విడుదల వాయిదా పడింది. శుక్రవారం ( ఏప్రిల్ 8) విడుదల కావాల్సిన ఈ సినిమాని వాయిదా వేస్తున్నట్లు ట్విటర్ ద్వారా ఆర్జీవీ వెల్లడించారు. ‘లెస్బియన్ నేపథ్యం కారణంగా చాలా థియేటర్లు సహకరించకపోవడంతో సినిమా విడుదల పోస్ట్ పోన్ చేస్తున్నాం. అన్ని విధాలుగా ఈ అన్యాయం ని ఎలా ఎదుర్కోవాలో పరిశీలించి తగు చర్యలు తీసుకున్నా తరువాత మరో విడుదల తేదీ తెలియజేస్తాను’అని ఆర్జీవీ ట్వీట్ చేశాడు. మరోవైపు ఆర్జీవీ ‘మా ఇష్టం’ సినిమా విడుదలను వాయిదా వేయాలని నిర్మాత నట్టి కుమార్ సివిల్ కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. తనకు 5 కోట్ల 29 లక్షలు ఇవ్వాలని, ఇవ్వాల్సిన ఇవ్వకుండా తప్పించుకుంటున్నాడ నిర్మాత నట్టి కుమార్ కోర్ట్ లో పిటిషన్ వేశారు. దీంతో ‘మా ఇష్టం’ సినిమా రిలీజ్ ను ఆపాలని సిటీ సివిల్ కోర్ట్ ఆదేశాలు జారీ చేసింది. ఇలా వరుస వివాదాలు చుట్టుముట్టడంతో సినిమాను వాయిదా వేస్తున్నట్లు ఆర్జీవీ ప్రకటించాడు. రామ్ గోపాల్ వర్మ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన సినిమా ‘డేంజరస్’. అప్సర రాణి, నైనా గంగూలీ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం తెలుగులో ‘మా ఇష్టం’పేరుతో విడుదల కాబోతోంది. ఇద్దరమ్మాయిల మధ్య కలిగిన ప్రేమ ఎలాంటి పరిస్థితులకి దారి తీసింది? అనే థ్రిల్లింగ్ అంశాలతో క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్గా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. I regret to inform that we are postponing the film KHATRA DANGEROUS due to non cooperation of many theatres due to its lesbian theme ..We will proceed in all ways to fight this injustice and come at a later date — Ram Gopal Varma (@RGVzoomin) April 7, 2022 -
‘మా ఇష్టం’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫోటోలు)
-
అలాంటి సినిమాలు తీయడం నాకు చేతకాదు : రామ్ గోపాల్ వర్మ
‘నా నుంచి పెద్ద బడ్జెట్ మూవీలు వస్తాయని అస్సలు ఎక్స్ పెక్ట్ చేయద్దు. దానికి సంబంధించిన ఫ్యామిలీ ఆడియన్స్ చాలా మంది ఉంటారు. అలాంటి సినిమాలు తీయడం నాకు చేతకాదు. తీయలేను’ అన్నారు ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. తాజాగా ఆయన తెరకెక్కించిన పాన్ ఇండియా మూవీ ‘డేంజరస్’(తెలుగులో ‘మా ఇష్టం’పేరుతో విడుదలవుతోంది). అప్సర రాణి, నైనా గంగూలీ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం.. ఏప్రిల్ 8న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఏప్రిల్7న వర్మ బర్త్డే. ఈ సందర్భంగా బుధవారం ఆయన పాత్రికేయులతో ముచ్చటించారు. ఆ విశేషాలు.. ‘మా’ ఇష్టం కథేంటి? ‘మా ఇష్టం’అనేది ఓ క్రైమ్ డ్రామా మూవీ. ఇద్దరు అమ్మాయిలు ఒక క్రైమ్ లో ఇరుక్కుంటారు. ఆ క్రైమ్ నుంచి బయటపడే క్రమంలో వీరి మధ్య ప్రేమ ఎలా పుట్టింది అనేదే ఈ మూవీ కథ. ఇందులో లెస్బియన్స్ గా లీడ్ పెయిర్ లలో నైనా గంగూలీ, అప్సర రాణి ఇద్దరు అద్భుతంగా నటించారు. కాంట్రవర్సీ అయితే? నేను ఎలాంటి కాంట్రవర్సీస్ ను పట్టించుకోను. నేను తీసే సినిమా నాకు నచ్చినట్టుగా నా కోసమే తీసుకుంటాను. మంచి ఫాలోయింగ్ ఉన్న మీరు ఇలాంటి సినిమాలు తీస్తే ఎలా? నేను ఒక కాన్సెప్ట్ అనుకోని సినిమా తీస్తాను. నాకు నచ్చినట్టుగా సినిమా తీస్తాను . నచ్చితే చూడండి నచ్చకపోతే లేదు .అంతే తప్ప ఎవ్వరినీ ఇబ్బంది పెట్టను. పెద్ద సినిమాలు ఎక్స్పెక్ట్ చేయ్యొచ్చా? నా నుంచి పెద్ద బడ్జెట్ సినిమాలు వస్తాయని ఆశించొద్దు. పెద్ద సినిమాలకు ఫ్యామిలీ ఆడియన్స్ చాలా ముఖ్యం. అందరూ చూస్తేనే ఆ సినిమా లాభాల్లోకి వెళ్తుంది. నాకు అలాంటి సినిమాలు చేయడం చేతకాదు. నేను ఇప్పడు తీయలేను. ‘మా ఇష్టం’లో బోల్డ్ కంటెంట్ ఎంతవరకు ఉంటుంది ? ఇందులో బోల్డ్ కంటెంట్ కంటే యాక్షన్ ఓరియెంటెడ్ పాత్ర ఎక్కువగా ఉంటుంది. ఇందులో నావల్టీ తక్కువగా ఉంటుంది. అయితే ప్రేక్షకులు ఈ మధ్య నావల్టీ ఎక్కువ చూస్తున్నందున పోస్టర్స్ ను చూసి దానికే ఎక్కువ కనెక్ట్ అవుతున్నారు. ఇద్దరి హీరోయిన్స్ మధ్య రొమాన్స్, యాక్షన్ తీయడానికి గల కారణం? ప్రపంచంలో ఇప్పటివరకు ఇద్దరి హీరోయిన్స్ లతో రొమాంటిక్ పాట షూట్ చేయడం జరగలేదు. ఇలాంటి కథ ఈ మధ్య ఎవ్వరూ తీయలేదు. హీరో,హీరోయిన్స్ మధ్య ప్రేమ అనేది కామన్ అది రెగ్యులర్ గా అందరూ తీసేదే..కానీ ఇలా తీయడం నేనే మొదటిసారి . మీ తదితర ప్రాజెక్ట్స్ ఏంటి? ఇప్పటి వరకు నేను అనౌన్స్ చేసిన సినిమాలన్నీ వచ్చాయి. ఇండో,చైనా మీద మార్షల్ ఆర్ట్స్ మీద ఒక సినిమా తీశాం. జూన్ లో రిలీజ్ అవుతుంది , కొండ సినిమా రెడీ గా ఉంది, దహనం వెబ్ సిరీస్ ఇవి కాక ఇంకా 20 స్క్రిప్ట్స్ రెడీ గా ఉన్నాయి. -
ఆర్ఆర్ఆర్ మూవీపై ఆర్జీవీ షాకింగ్ కామెంట్స్
ఆర్ఆర్ఆర్ మూవీపై సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరోసారి షాకింగ్ కామెంట్ చేశారు. ఈ చిత్రంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ లిప్లాక్ పెట్టుకోలేదని, అందుకే అది ఫ్రెండ్షిప్ అయిందని, ఒకవేళ లిప్లాక్ పెట్టుకొని ఉంటే.. అది గే ఫిలిం అవుతుందని వర్మ చెప్పుకొచ్చాడు. లిప్లాక్ ఉన్నా లేకున్నా స్టోరీ మాత్రం మారదన్నారు. తాజాగా ఆయన తెరకెక్కించిన మూవీ ‘డేంజరస్’(తెలుగులో ‘మా ఇష్టం’పేరుతో విడుదలవుతోంది). అప్సర రాణి, నైనా గంగూలీ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం.. ఏప్రిల్ 8న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆర్జీవీ మాట్లాడుతూ.. ‘డేంజరస్ ’ రెగ్యులర్ కథే.. ఇందులో ఇద్దరు అమ్మాయిలు ఉండడమే కొత్తదనం’ అన్నారు. అప్సర, నైనా వారి పెరెంట్స్ తో మాట్లాడిన తర్వాతే ఈ సినిమా చేశమని తెలిపారు. కాగా, ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని తన సినిమా ప్రమోషన్స్కు వాడుకోవడం ఇది మొదటిసారేం కాదు. ఆ మధ్య ఎన్టీఆర్, చరణ్లతో.. ‘డేంజరస్’ హీరోయిన్లు నైనా గంగూలి, అప్సర రాణిలతో పోల్చారు. ‘రాజమౌళి.. మీకు రామ్ చరణ్, ఎన్టీఆర్ లాంటి డేంజరస్ బాయ్స్ ఉంటే.. నాకు అప్సర రాణి, నైనా గంగూలీ వంటి డేంజరస్ అమ్మాయిలు ఉన్నారు’అంటూ ట్వీట్ చేస్తూ.. ఎన్టీఆర్, చరణ్లతో ఉన్న జక్కన్న ఫోటోకు ఇద్దరు హీరోయిన్లతో కలిసి ఉన్న తన ఫోటోని జతచేశాడు. ఇప్పుడు మళ్లీ అదే సినిమా ప్రమోషన్స్లో ఆర్ఆర్ఆర్ని వాడేశాడు. ట్రెండింగ్లో ఉంది కాబట్టే ఆర్ఆర్ఆర్ని వాడేస్తున్నానని స్వయంగా ఆర్జీవే చెప్పడం గమనార్హం. -
తారక్, చరణ్ డేంజరస్ బాయ్స్.. ‘ఆర్ఆర్ఆర్’ని అలా వాడేసిన ఆర్జీవీ
సినిమాలను ప్రచారం చేయడంలో రామ్గోపాల్ వర్మ స్టైలే వేరు. ట్రెడింగ్లో ఉన్న ప్రతి అంశాన్ని ఆయన సినిమా ప్రమోషన్ల కోసం వాడేస్తాడు. తాజాగా ఆయన తెరకెక్కించిన ‘డేంజరస్’(తెలుగులో ‘మా ఇష్టం’పేరుతో విడుదలవుతోంది) మూవీ కోసం ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని వాడేశాడు. ‘రాజమౌళి.. మీకు రామ్ చరణ్, ఎన్టీఆర్ లాంటి డేంజరస్ బాయ్స్ ఉంటే.. నాకు అప్సర రాణి, నైనా గంగూలీ వంటి డేంజరస్ అమ్మాయిలు ఉన్నారు’అంటూ ట్వీట్ చేస్తూ.. ఎన్టీఆర్, చరణ్లతో ఉన్న జక్కన్న ఫోటోకు ఇద్దరు హీరోయిన్లతో కలిసి ఉన్న తన ఫోటోని జతచేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ అవుతోంది. కాగా, ఇటీవల ఆర్ఆర్ఆర్ మూవీపై ఆర్జీవీ ప్రశంసల జల్లు కురిపించిన విషయం తెలిసిందే. ‘బాహుబలి-2 అనేది చరిత్ర.. ఆర్ఆర్ఆర్ అనేది చారిత్రాత్మకం’అని ఆర్జీవీ ట్వీట్ చేశాడు. ఇప్పుడేమో ఇలా తన సినిమా ప్రమోషన్స్కి వాడుకోవడం గమనార్హం. ఇక డేంజరస్ సినిమా విషయానికొస్తే..అప్సర రాణి, నైనా గంగూలీ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం.. ఏప్రిల్ 8న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. తెలుగులో ‘మా ఇష్టం’పేరుతో రిలీజ్ కాబోతుంది. ఇద్దరమ్మాయిల మధ్య కలిగిన ప్రేమ ఎలాంటి పరిస్థితులకి దారి తీసింది? అనే థ్రిల్లింగ్ అంశాలతో క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్గా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. Well sirrr @ssrajamouli sir, if u have ur DANGEROUS men like @AlwaysRamCharan and @tarak9999 ,I also have my DANGEROUS women like @NainaGtweets and @_apsara_rani pic.twitter.com/XWDkb9ufSH — Ram Gopal Varma (@RGVzoomin) March 30, 2022 -
ఆర్జీవీ ‘మా ఇష్టం’ వచ్చేస్తుంది
సంచలన దర్శకుడు రామ్గోపాల్ వర్మ తాజాగా తెరకెక్కించిన చిత్రం ‘మా ఇష్టం’. తెలుగు-తమిళ-కన్నడ-మలయాళం-హిందీ భాషల్లో రూపొందించిన ఈ చిత్రం హక్కులను ప్రముఖ నిర్మాత తుమ్మలపల్లి రామ సత్యనారాయణ సొంతం చేసుకున్నారు. ఈ మూవీ మిగతా భాషల్లో ‘డేంజర్’ పేరుతో విడుదలవుతుంది. గతంలో భీమవరం టాకీస్ బ్యానర్ లో ఆర్జీవితో ఐస్ క్రీమ్ సినిమా నిర్మించిన రామ సత్యనారాయణ తాజాగా ఈ చిత్రం తెలుగు రైట్స్ దకించుకున్నారు. ఏప్రిల్ 8 వ తేదీన తెలుగు-హిందీ-తమిళ్-కన్నడ భాషలలో ఒకేసారి విడుదల కానుంది. ఇద్దరమ్మాయిల మధ్య కలిగిన ప్రేమ ఎలాంటి పరిస్థితులకి దారి తీసింది? అనే థ్రిల్లింగ్ అంశాలతో క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్గా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. తెలుగు చలన చిత్ర రంగంలో మొట్టమొదటి పూర్తి స్థాయి లెస్బియన్ చిత్రంగా ‘మా ఇష్టం’ రావడం గమనార్హం. అప్సర-నైనా గంగోలి ఈ క్రేజీ చిత్రంలో ముఖ్యపాత్రలలో నటించారు. . @NainaGtweets SHUTTING UP @_apsara_rani in DANGEROUS..Film releasing in theatres on APRIL 8th pic.twitter.com/XbXlPUDZfE — Ram Gopal Varma (@RGVzoomin) March 26, 2022 -
వాసాలతిప్పలో ప్రపంచంలోకెల్లా రెండో విషపూరితమైన చేప!
సాక్షి, తూర్పుగోదావరి: ఉప్పలగుప్తం మండలం వాసాలతిప్పలో మనిషి ముఖంతో పోలిన రూపంతో ఉన్న అరుదైన చేప మత్స్యకారులకు చిక్కింది. సోషల్ మీడియాలో ఈ చేప వైరల్గా మారింది. విచిత్రం ఏమిటంటే.. తనకు ప్రమాదం ఉందని భావిస్తే మాత్రం గాలి పీల్చుకొని బెలూన్లా ఉబ్బుతుంది. అందుకే దీన్ని బెలూన్ ఫిష్ అని కూడా పిలుస్తారు. ఈ చేపను బొంక చేప, బెలూన్ ఫిష్, గ్లోబ్ ఫిష్ తదితర పేర్లతోనూ పిలుస్తారు. ఇది చూసేందుకు మూములుగానే ఉంటుంది. కానీ తనకు ప్రమాదం ఉందని భావిస్తే మాత్రం గాలి పీల్చుకొని బెలూన్లా (ఉబ్బుతుంది)మారిపోతుంది. అందుకే బెలూన్ ఫిష్ అంటారు. చేప అలా ఉబ్బిపోగానే.. దాన్ని తినడానికి వచ్చిన జీవులు వెంటనే అక్కడి నుంచి భయంతో పారిపోతాయి. టెట్రాడాంటిడీ జాతికి చెందిన ఈ చేప శాస్త్రీయ నామం టెట్రాడాన్ ఇది ప్రపంచంలోకెల్లా రెండో విషపూరితమైన చేపగా మత్స్యశాఖ అధికారులు చెబుతున్నారు. జపాన్కు చెందిన ‘ఫుగు’ లేదా ‘బ్లో ఫిష్’. జపాన్లోని షిమోనోసెకి అనే ప్రాంతంలో దీన్ని ఎక్కువగా వండుకుని తింటారు. జపాన్, కొరియాల్లో ప్రత్యేక శిక్షణ పొందిన చెఫ్లు ఈ చేపలతో టేస్టీ ఆహారం సిద్ధం చేస్తారు. ఈ చేపను వండాలంటే సుమారుగా పదేళ్ల అనుభవం, లైసెన్స్ ఉన్న వాళ్లే చేయాలి. ఎందుకంటే ఈ చేప చాలా విషపూరితమైనది. కట్ చేసేటప్పుడు జాగ్రత్త పడకపోతే ఆ విషం వల్ల ప్రాణాలకే ప్రమాదకరం. -
ఉక్రెయిన్పై యుద్ధం: భారతీయ విద్యార్థి మృతి తర్వాత ప్రధాని మోదీ ఉన్నత స్థాయి సమావేశం
Live Updates: ►మరో సారి రష్యా ఉక్రెయిన్ మధ్య చర్చలు.. రష్యా, ఉక్రెయిన్ మధ్య రెండవ రౌండ్ చర్చలు మార్చి 2 న జరగనున్నాయని వార్తా సంస్థ రాయిటర్స్ తెలిపింది. అయితే ఈ చర్చలకు సంబంధించి ఎక్కడ జరగనున్నాయి, దీనికి ఎవరు హాజరుకానున్నారన్న పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. ►భారతీయ విద్యార్థి మృతి తర్వాత ప్రధాని మోదీ ఉన్నత స్థాయి సమావేశం ఉక్రెయిన్లో ఖార్కివ్ కాల్పుల్లో భారతీయ విద్యార్థి మృతి చెందడంతో పరిస్థితిపై ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించనున్నారు. గత రెండు రోజుల్లో ప్రధాని ఇలా నిర్వహించడం ఇది నాలుగోసారి. ఈ సమావేశంలో ఉక్రెయిన్లోని పరిస్థితులతో పాటు భారత విద్యార్థులను త్వరగతిన స్వదేశానికి రప్పించే ప్రక్రియ మరింత వేగవంతం చేసే చర్యలు గురించి చర్చించే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ► 660,000 కంటే ఎక్కువ మంది శరణార్థులు పొరుగు దేశాలలో ఆశ్రయం పొందేందుకు ఉక్రెయిన్ నుంచి వెళ్లిపోయారని యూఎన్ రెఫ్యూజీ ఏజెన్సీ తెలిపింది. ►మా లక్ష్యాలు పూర్తయ్యే వరకు దాడిని కొనసాగుతుంది: రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ రష్యా తన లక్ష్యాలను సాధించే వరకు ఉక్రెయిన్పై దాడిని కొనసాగిస్తుందని రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. కాగా దాదాపు వారం రోజులుగా ఉక్రెయిన్ పై రష్యా దాడులు చేస్తోంది. ►2022 వాలీబాల్ ప్రపంచ ఛాంపియన్షిప్లకు ఆతిథ్యం ఇవ్వకుండా రష్యాపై నిషేధం 2022లో వాలీబాల్ ప్రపంచ ఛాంపియన్షిప్లకు రష్యా అతిధ్యం ఇవ్వనుంది. అయితే ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా రష్యా అతిధ్యాన్ని నిషేదిస్తున్నట్లు ఫెడరేషన్ ఇంటర్నేషనల్ డి వాలీబాల్ ప్రకటించింది. ►ఉక్రెయిన్ నుంచి ఢిల్లీకి చేరుకున్న ఆరుగురు ఏపీ విద్యార్థులు విమానాశ్రయం నుంచి నేరుగా వారి వారి స్వస్థలాలకు పంపించేందుకు ఏర్పాట్లు ►ఉక్రెయిన్పై రష్యా దాడిలో భారతీయ విద్యార్థి మృతి ఖార్కీవ్లో రష్యన్ బలగాలు కాల్పుల్లో విద్యార్థి మృతి కర్నాటకకు చెందిన వైద్య విద్యార్థి నవీన్గా గుర్తింపు With profound sorrow we confirm that an Indian student lost his life in shelling in Kharkiv this morning. The Ministry is in touch with his family. We convey our deepest condolences to the family. — Arindam Bagchi (@MEAIndia) March 1, 2022 ► ఖార్కివ్, చెర్నిహివ్(ఉక్రెయిన్)పై రష్యా బలగాల దాడులు. ఒకిట్రికా ఎయిర్బేస్పై దాడిలో 70మంది దుర్మరణం. ► భారతీయ విద్యార్థుల బృందం ఒకటి పోల్యాండ్లోకి ప్రవేశించింది. A group of Indian students stranded in Ukraine has entered Poland, to undertake the onward journey to India pic.twitter.com/Rm3YvumzoC — ANI (@ANI) March 1, 2022 ► వాయుసేనను రంగంలోకి దించిన కేంద్ర ప్రభుత్వం.. భారతీయుల తరలింపు వేగవంతం చేయాలని చూస్తోంది. ► కీవ్లోని భారతీయులు అర్జెంట్గా నగరం వీడాలని భారత ఎంబసీ కీలక సూచన చేసింది. ► రష్యా బలగాలు కీవ్ నగరంవైపు వేగంగా కదులుతున్నాయి. దీంతో ఏం జరుగుతుందా? అనే టెన్షన్ నెలకొంది. ► ఓఖ్టిర్కా (ఉక్రెయిన్) సైనిక స్థావరంపై రష్యా ఫిరంగిదళం దాడి చేయడంతో 70 మందికి పైగా ఉక్రేనియన్ సైనికులు మరణించినట్లు సమాచారం. ► రష్యాకు అమెరికా ఊహించని దెబ్బ: ఆంక్షల మీద ఆంక్షలతో రష్యా ఉక్కిరి బిక్కిరి అవుతోంది. ఈ తరుణంలో తాజాగా అమెరికా.. రష్యాకు ఊహించని షాక్ ఇచ్చింది. ఐక్యరాజ్యసమితిలో రష్యా దౌత్య మిషన్లోని 12 మంది సభ్యులను యునైటెడ్ స్టేట్స్ బహిష్కరిస్తున్నట్లు ప్రకటించింది. ఈ విషయాన్ని ఐక్యరాజ్యసమితిలో రష్యా శాశ్వత ప్రతినిధి వాసిలీ నెబెంజియా విలేకరుల సమావేశంలో తెలిపారు. అమెరికా చేష్టల్ని ఖండిస్తున్నట్లు మీడియా ముఖంగా ప్రకటించారాయన. #WATCH 12 members of Russia's diplomatic mission to the UN have been expelled by the United States, said Russia's Permanent Representative to the United Nations Vassily Nebenzia during a press conference (Source: UN Web TV) pic.twitter.com/0JVT66C3nu — ANI (@ANI) March 1, 2022 ► కీవ్ నుంచి 64 కిలోమీటర్ల మేర రష్యన్ దళాల మోహరింపు. శాటిలైట్ చిత్రాలు వైరల్. ► ఉక్రెయిన్లోని రెండవ అతిపెద్ద నగరం ఖార్కివ్లోని అనేక నివాస ప్రాంతాలపై రష్యన్ ఫిరంగిదళం దాడి చేసింది. ఖార్కివ్లో జరుగుతున్న షెల్లింగ్లో కనీసం 11 మంది పౌరులు మరణించినట్లు సమాచారం. ► ఉక్రెయిన్ సంక్షోభం.. ఆపరేషన్ గంగలో భాగంగా ముంబైకి చేరిన ఏడో విమానం. సురక్షితంగా 182 మంది స్వదేశానికి రాక. ► ఆరవ రోజు యుద్ధంలో భాగంగా.. జనావాస ప్రాంతాల్లో రష్యా దాడులకు పాల్పడుతోందని ఉక్రెయిన్ ఆరోపిస్తోంది. దాడుల్లో 350 మంది పౌరులు మరణించినట్లు చెబుతోంది. చర్చలు అసంపూర్తిగా ముగిసిన వేళ .. ఉక్రెయిన్పై రష్యా ఆక్రమణ కొనసాగుతోంది. ఉక్రెయిన్ సైన్యం ధీటుగా ఎదుర్కొంటుండటంతో ఆరో రోజు రష్యా దళాలు ముందుకు సాగలేకపోతున్నాయి. అయితే కీలక పట్టణాలను మాత్రం సమర్థవంతంగా చుట్టుముట్టగలిగాయి రష్యా బలగాలు. ఈ క్రమంలో.. ► రష్యా తమపై వాక్యూమ్ బాంబ్ ప్రయోగించినట్లు ఆరోపిస్తోంది ఉక్రెయిన్. ఈ మేరకు అమెరికాలో ఉక్రెయిన్ రాయబారి ఒక్సానా మరకరోవా సోమవారం అమెరికా కాంగ్రెస్(చట్ట సభ)లో ప్రకటించారు. జెనీవా కన్వెక్షన్ నిషేధించిన వాక్యూమ్ బాంబ్ను దురాక్రమణలో భాగంగా రష్యా మాపై(ఉక్రెయిన్) ప్రయోగించింది అని పేర్కొన్నారు. ఉక్రెయిన్లో రష్యా పెను విధ్వంసం చేయాలనుకుంటోంది అని ఆమె ఆరోపించారు. వాక్యూమ్ బాంబు అనేది ఒక రకమైన పేలుడు పదార్థం. ఇది అధిక-ఉష్ణోగ్రత పేలుడును ఉత్పత్తి చేయడానికి చుట్టుపక్కల గాలి నుండి ఆక్సిజన్ను ఉపయోగించుకుంటుంది. ఆ ఒత్తిడి కారణంగా భారీ పేలుడు సంభవించి.. లక్క్ష్యం తునాతునకలు అయిపోతుంది. ఇదిలా ఉండగా.. రష్యా వాక్యూమ్ బాంబ్ను ప్రకటించినట్లు ధృవీకరణ రావాల్సి ఉంది. అయితే శనివారం మధ్యాహ్నాం ఉక్రెయిన్ సరిహద్దు సమీపంలో థర్మోబారిక్ బహుళ రాకెట్ లాంచర్ను గుర్తించినట్లు ఓ ప్రముఖ మీడియా సంస్థ కథనం ప్రకటించింది.