-
Asia Cup 2022: బంగ్లాదేశ్ కోచ్గా టీమిండియా మాజీ క్రికెటర్!
Asia Cup 2022- T20 World Cup 2022: ఆసియా కప్-2022, టీ20 ప్రపంచకప్-2022 టోర్నీల నేపథ్యంలో బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మెగా ఈవెంట్ల కోసం టీమిండియా మాజీ క్రికెటర్ శ్రీధరన్ శ్రీరామ్ను కోచ్గా నియమించినట్లు సమాచారం. ఈ విషయాన్ని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు డైరెక్టర్ వెల్లడించినట్లు ది డైలీ స్టార్ తన కథనంలో పేర్కొంది. ‘‘అవును.. ప్రపంచకప్ ఈవెంట్ వరకు మేము శ్రీరామ్తో కలిసి పనిచేయబోతున్నాం. ఆసియా కప్ నుంచి సరికొత్త ఉత్సాహంతో ముందుకు సాగేందుకు ఈ నిర్ణయం తీసుకున్నాం. మా ప్రధాన లక్ష్యం టీ20 ప్రపంచకప్. నిజానికి... వరల్డ్కప్ టోర్నీ సమయంలో ఈ నియామకం జరిగినట్లయితే.. అప్పటికప్పుడు పరిస్థితులను అర్థం చేసుకుని జట్టుతో మమేకమయ్యే అవకాశాలు తక్కువగా ఉంటాయి కాబట్టి.. ఆసియా కప్ ఈవెంట్ నుంచే జట్టుతో కలిసేలా ప్రణాళికలు వేశాం’’ అని సదరు అధికారి పేర్కొన్నట్లు డైలీ స్టార్ తెలిపింది. మరి పాత కోచ్? అదే విధంగా పరిమిత ఓవర్ల క్రికెట్కు శ్రీరామ్ నియామకం నేపథ్యంలో ప్రస్తుత కోచ్ రసెల్ డొమింగో బంగ్లాదేశ్ టెస్టు జట్టుకు మార్గదర్శనం చేస్తాడని తెలిపినట్లు పేర్కొంది. కాగా చెన్నైకి చెందిన శ్రీధరన్ శ్రీరామ్ లెఫ్టార్మ్ స్పిన్నర్గా ఎదిగాడు. 2000- 2004 మధ్య కాలంలో టీమిండియా తరఫున ఎనిమిది వన్డేలు ఆడిన అతడు కోచింగ్ను కెరీర్గా ఎంచుకున్నాడు. ఆసీస్ను విజేతగా నిలపడంలో! ఈ క్రమంలో ఆస్ట్రేలియా పురుషుల క్రికెట్ జట్టుకు మెంటార్గా వ్యవహరించి.. అష్టన్ అగర్, ఆడం జంపా వంటి యువకులకు స్పిన్ బౌలింగ్లో మెళకువలు నేర్పించాడు. టీ20 ప్రపంచకప్-2021 గెలిచిన ఆసీస్ జట్టుకు అసిస్టెంట్ కోచ్గా పనిచేశాడు. అదేవిధంగా ఐపీఎల్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు కోచింగ్ స్టాఫ్లో భాగంగా ఉన్నాడు. గతంలో పంజాబ్ బౌలింగ్ కోచ్గానూ శ్రీధరన్ శ్రీరామ్ పనిచేశాడు. ఘోర పరాభవం! కాగా ఇటీవల బంగ్లాదేశ్.. జింబాబ్వే చేతిలో ఘోర ఓటమి పాలైన విషయం తెలిసిందే. జింబాబ్వేలో పర్యటించి వన్డే, టీ20 సిరీస్లను 2-1 తేడాతో ఆతిథ్య జట్టుకు సమర్పించుకుంది. ఆసియా కప్-2022కు ముందుకు ఇలాంటి పరాభవం ఎదురైన నేపథ్యంలో బోర్డు దిద్దుబాటు చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే కోచ్గా శ్రీధరన్ శ్రీరామ్ నియామకం జరిగినట్లు సమాచారం. చదవండి: Ind Vs Zim: అతడిని ముట్టుకున్నా.. జింబాబ్వే యువతి సంతోషం! ఫిదా చేసిన భారత క్రికెటర్! LLC 2022: గంభీర్ అభిమానులకు గుడ్ న్యూస్.. మళ్లీ బ్యాట్ పట్టనున్న గౌతీ! -
టీమిండియా మెంటల్ హెల్త్ కోచ్గా మళ్లీ అతనే..!
టీమిండియా మెంటల్ హెల్త్ కండీషనింగ్ కోచ్గా ప్యాడీ అప్టన్ మళ్లీ నియమితుడయ్యాడు. గతంలో పలు సందర్భాల్లో టీమిండియా తరఫున ఈ బాధ్యతలు నిర్వహించిన అప్టన్ను ఈ ఏడాది చివర్లో జరుగనున్న టీ20 వరల్డ్కప్ కోసం బీసీసీఐ ఏరికోరి ఎంపిక చేసింది. అప్టన్ ఎంపిక తక్షణమే అమల్లోకి వస్తుందని, అతను విండీస్ పర్యటనలో ఉన్న టీమిండియాతో జాయిన్ అవుతాడని బీసీసీఐ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. అప్టన్ 2011లో టీమిండియా వన్డే వరల్డ్కప్ గెలవడంలో కీలకంగా వ్యవహరించాడు. అటగాళ్ల మానసిక ఒత్తిడిని దూరం చేయడంలో అప్టన్కు నిపుణుడిగా మంచి పేరుంది. టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్తో అప్టన్కు మంచి సంబంధాలు ఉండటంతో ఈ ఎంపిక జరిగినట్లు తెలుస్తోంది. ద్రవిడ్ టీమిండియాలో సభ్యుడిగా ఉన్నప్పటి నుంచి వీరిద్దరికి సత్సంబంధాలు ఉన్నాయి. ఈ ఇద్దరూ ఐపీఎల్లో (ద్రవిడ్-రాజస్థాన్ రాయల్స్, అప్టన్-ఢిల్లీ డేర్డెవిల్స్) కూడా వివిధ ఫ్రాంచైజీలకు పని చేశారు. చదవండి: 'అతడిని సరిగ్గా ఉపయోగించుకోండి.. మరో ఏడేళ్ల పాటు భారత్కు' -
ప్రధాని మోదీకి జిమ్ కోచ్గా మంచిర్యాల జిల్లా వాసి
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్లో జరగనున్న బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పాల్గొనేందుకు వస్తున్న ప్రధాని మోదీకి జిమ్ కోచ్గా మంచిర్యాల జిల్లా వాసిని రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. రాష్ట్రంలో మోదీ పర్యటించే రోజుల్లో ట్రెడ్మిల్, జిమ్ సైకిల్ ఇన్స్ట్రక్టర్గా ఉండేందుకు జిల్లా కేంద్రానికి చెందిన గడప రాజేశ్ను నియమిస్తూ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. రాజేశ్ ప్రస్తుతం జింఖానా గ్రౌండ్స్లో అథ్లెటిక్ కోచ్గా వ్యవహరిస్తున్నారు. చదవండి: (కిషన్రెడ్డి చేతగాని దద్దమ్మలా మిగిలిపోయారు: బాల్కసుమన్) -
పంత్ తీవ్ర భావోద్వేగం.. ఆయన వల్లే ఇదంతా అంటూ
ఐపీఎల్-2022 ఆరంభానికి ముందు ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్ భావోద్వేగానికి గురయ్యాడు. పంత్ ఐపీఎల్లోనే కాకుండా అంతర్జాతీయ క్రికెట్లో కూడా టీమిండియా తరపున అద్భుతంగా రాణిస్తున్నాడు. ఇక ఐపీఎల్-2021 సీజన్కు గాయం కారణంగా శ్రేయస్ అయ్యర్ దూరం కావడంతో అతడి స్థానంలో ఢిల్లీ క్యాపిటల్స్ పగ్గాలును పంత్ చేపట్టాడు. గతే ఏడాది సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ను ప్లేఆప్స్కు చేర్చాడు. కాగా తాజాగా టైమ్స్ ఆఫ్ ఇండియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పంత్ తన కోచ్, తండ్రి గురించి మాట్లాడూతూ ఎమోషనల్ అయ్యాడు. తన విజయంలో తండ్రి, కోచ్ తారక్ సిన్హా కీలక పాత్ర పోషించారని అతడు తెలిపాడు. కాగా పంత్ 2019 వన్డే ప్రపంచకప్లో భాగంగా ఇంగ్లండ్లో ఉన్నప్పడు అతడి కోచ్ తీవ్ర అనారోగ్యంతో మరణించాడు. "నేను ప్రపంచకప్ ముగిసిన తర్వాత నా కోచ్ను కలవాలి అనుకున్నాను. కానీ అంతలోనే అతను మమ్మల్ని విడిచి వెళ్లిపోయారు. అప్పుడు నేను ఇంగ్లండ్లో ఉన్నాను. అదే విధంగా మా నాన్నను నేను చాలా మిస్ అవుతున్నాను. మా నాన్న నన్ను వదిలి వెళ్లినప్పుడు కూడా నేను క్రికెట్ ఆడుతూ బిజీగా ఉన్నాను. అతడి చివరి చూపుకు కూడా నోచుకోలేదు. నేను ఈ రోజు ఈ స్ధాయిలో ఉన్నాను అంటే కారణం వీరిద్దరే. నా కోచ్ నాకు ఒక్క మాట చెప్పాడు. 'నీ జీవితంలో ఏమి జరిగినా, నీవు క్రికెట్ను మాత్రం వదలకు" అని అతను నాతో చెప్పారు. అదే విధంగా ఫ్యామిలీని జాగ్రత్తగా చూసుకోవాలి అని నా కోచ్ చెప్పేవారు. చివరగా నా జీవితంలో మా నాన్న , నా కోచ్ లేని లోటును ఎవరూ పూడ్చలేరు" అని పంత్ పేర్కొన్నారు. చదవండి: IPL 2022: అతడి కెప్టెన్సీ భేష్ ఈసారి ఐపీఎల్ టైటిల్ వాళ్లదే: టీమిండియా దిగ్గజం -
ముంబై ఇండియన్స్ హెడ్ కోచ్కు కీలక పదవి..
కొలొంబో: శ్రీలంక దిగ్గజ క్రికెటర్, ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ హెడ్ కోచ్ అయిన మహేళ జయవర్దనేకు కీలక పదవి దక్కింది. అతన్ని ఏడాది కాలం పాటు శ్రీలంక కన్సల్టెంట్ కోచ్గా నియమిస్తున్నట్లు శ్రీలంక క్రికెట్ బోర్డు సోమవారం ప్రకటించింది. వచ్చే ఏడాది శ్రీలంక బిజీ షెడ్యూల్ కలిగి ఉన్న నేపథ్యంలో జయవర్దనేకు కీలక బాధ్యతలు అప్పచెబుతున్నట్లు లంక క్రికెట్ బోర్డు పేర్కొంది. ఈ మేరకు శ్రీలంక క్రికెట్ బోర్డు సీఈవో ఆష్లే డిసిల్వా ట్విట్టర్ వేదికగా వెల్లడించాడు. Sri Lanka Cricket wishes to announce the appointment of former Sri Lanka Captain Mahela Jayawardena as the ‘Consultant Coach’ for the National Teams, effective 1st January 2022. READ:https://t.co/8Kry3xwm62 #LKA #SLC— Sri Lanka Cricket 🇱🇰 (@OfficialSLC) December 13, 2021 కాగా, జయవర్దనే ముంబై ఇండియన్స్ కోచింగ్ బాధ్యతలతో పాటు శ్రీలంక అండర్-19 జట్టుకు హెడ్ కోచ్ గా వ్యవహరిస్తున్నాడు. తాజాగా లంక క్రికెట్ బోర్డు నిర్ణయంతో జయవర్దనేకు ప్రమోషన్ లభించింది. నూతన బాధ్యతల్లో జయవర్దనే.. శ్రీలంక హెడ్ కోచ్ మిక్కీ ఆర్థర్తో పాటు ఇతర శిక్షణా సిబ్బందికి సలహాలిస్తారు. చదవండి: ప్రతిష్టాత్మక ఐసీసీ అవార్డుకు ఎంపికైన ఆసీస్ స్టార్ ఓపెనర్ -
క్రికెట్ చరిత్రలో సంచలనం.. పురుషుల జట్టుకు మహిళా కోచ్
Sarah Taylor Becomes First Woman Coach In Mens team: క్రికెట్ చరిత్రలో సరికొత్త అధ్యాయానికి టీమ్ అబుదాబి శ్రీకారం చుట్టింది. తొలిసారిగా ఓ పురుషుల జట్టుకు మహిళా క్రికెటర్ను కోచ్గా నియమిస్తున్నట్లు టీమ్ అబుదాబి ఫ్రాంచైజీ తెలిపింది. అబుదాబీ టీ10 లీగ్లో మాజీ ఇంగ్లండ్ వికెట్ కీపర్, బ్యాటర్ సారా టేలర్ను అసిస్టెంట్ కోచ్గా నియమిస్తున్నట్లు టీమ్ అబుదాబి ట్విటర్లో వెల్లడించింది. దీంతో మెన్స్ ఫ్రాంఛైజీ క్రికెట్ చరిత్రలో మొట్టమొదటి ఫీమేల్ కోచ్గా బాధ్యతలు స్వీకరిస్తూ సారా టేలర్ చరిత్ర సృష్టించింది. కాగా ఇంతకుముందు ఇంగ్లండ్ మెన్స్ కౌంటీ టీమ్ ససెక్స్ జట్టుకి స్పెషలిస్ట్ కోచ్(వికెట్ కీపింగ్ కోచ్)గా నూ సారా టేలర్ బాధ్యతలు నిర్వహిస్తుంది. ఇక ఇంగ్లండ్ సాధించిన రెండు వన్డే వరల్డ్ కప్లు, ఒక టీ20 వరల్డ్ కప్ జట్లలో ఆమె సభ్యురాలిగా ఉంది. కాగా నవంబర్ 19 నుంచి అబుదాబి టీ10 లీగ్ ప్రారంభం కానుంది. చదవండి: T20 World Cup 2021 Pak Vs Afg: భేష్.. ఇలాంటి జట్టును ఎన్నడూ చూడలేదు: ఇమ్రాన్ ఖాన్ -
కోచ్ కాదు కామాంధుడు.. మసాజ్ పేరుతో మహిళా అథ్లెట్లపై లైంగిక వేధింపులు
చెన్నై: శిక్షణ ఇవ్వాల్సిన ఓ కోచ్ కామంతో కళ్లు మూసుకుపోయి, మహిళా అథ్లెట్లపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఉదంతం ఒకటి తాజాగా వెలుగు చూసింది. వివరాల్లోకి వెళితే.. తమిళనాడుకు చెందిన అథ్లెటిక్స్ కోచ్ పి. నాగరాజన్పై ఓ జాతీయ స్థాయి మహిళా అథ్లెట్(19) లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడంటూ ఈ ఏడాది మే నెలలో ఫిర్యాదు చేసింది. మసాజ్ పేరుతో కోచ్ తనను తాకరాని చోట తాకి పైశాచికత్వాన్ని ప్రదర్శించేవాడని ఆవేదన వ్యక్తం చేసింది. భయం కారణంగా కోచ్కు ఎదురు చెప్పలేకపోయానని, చాలా సందర్భాల్లో ఆత్మహత్య చేసుకుందామనుకున్నాని పేర్కొంది. ఈ కేసులో నాగరాజన్ను విచారించిన పోలీసులు అతనిపై పోక్స్ చట్టం కింద కేసు నమోదు చేసి, ఛార్జిషీట్ ఓపెన్ చేశారు. కాగా, ఈ ఉదంతం వెలుగు చూసాక మరో ఏడుగురు మహిళా అథ్లెట్లు కూడా ఇదే రకమైన ఆరోపణలు చేయడం కలకలం రేపుతోంది. ఫిర్యాదు చేసిన వారిలో కొందరు గతంలో నాగరాజన్ వద్ద శిక్షణ తీసుకున్న వారు కాగా, మరికొందరు ప్రస్తుతం జూనియర్లుగా శిక్షణ పొందుతున్నవారున్నారు. వీరందరూ కామ కోచ్ ఆకృత్యాలను ఒక్కొకటిగా బయటపెట్టడంతో పోలీసులు నివ్వెరపోతున్నారు. ఎంతో మంది అథ్లెట్లను జాతీయ స్థాయిలో ఛాంపియన్లుగా తీర్చిదిద్దిన నాగరాజన్.. ఇలాంటి దారుణాలకు పాల్పడ్డాడని తెలిసి ముక్కున వేలేసుకుంటున్నారు. నాగరాజన్ వెదవ వేశాలపై మరికొందరు ట్విటర్ ద్వారా తమను సంప్రదించారని పోలీసులు పేర్కొన్నారు. చదవండి: ఈ విషయంలో కేంద్రానికి ఆదేశాలు ఇవ్వలేం: సుప్రీం -
కోచ్ ఫిక్సింగ్ చేయమన్నాడు.. భారత స్టార్ ప్లేయర్ సంచలన ఆరోపణలు
న్యూఢిల్లీ: భారత టేబుల్ టెన్నిస్ నేషనల్ కోచ్ సౌమ్యదీప్ రాయ్పై స్టార్ ప్లేయర్ మనికా బత్రా సంచలన ఆరోపణలు చేసింది. దోహా వేదికగా ఈ ఏడాది మార్చిలో జరిగిన ఒలింపిక్స్ క్వాలిఫయర్స్లో జాతీయ కోచ్ తనను మ్యాచ్ ఫిక్సింగ్ చేయమన్నాడని ఆమె ఆరోపించింది. అయితే అందుకు తాను అంగీకరించలేదని, టోక్యో ఒలింపిక్స్లో అందుకే అతని సహాయం తీసుకోలేదని టీటీ సమాఖ్యకు నివేదించింది. ఫిక్సింగ్ ఆరోపణలకు కట్టుబడి ఉన్నానని, ఇందుకు కావాల్సిన సాక్షాధారాలు తన దగ్గరున్నాయని, సరైన సమయంలో వాటిని అధికారుల ముందుంచుతానని పేర్కొంది. మ్యాచ్ ఫిక్సింగ్ అంశంపై మాట్లాడేందుకు కోచ్ నా వ్యక్తిగత హోటల్ గదికి వచ్చాడని, తాను మాట వినకపోవడంతో బెదిరింపులకు దిగాడని, ఓ శిష్యురాలు కోసమే ఆయన ఇదంతా చేశాడని వెల్లడించింది. కాగా, జాతీయ కోచ్పై మనికా బత్రా చేసిన ఆరోపణలపై టీటీఎఫ్ఐ విచారణ చేపట్టకపోవడం పలు అనుమానలకు తావిస్తోంది. ఇదిలా ఉంటే, భారీ అంచనాల మధ్య టోక్యో ఒలింపిక్స్ బరిలోకి దిగిన ప్రపంచ 56వ ర్యాంకర్ మనికా బాత్రా మూడో రౌండ్లోనే ఇంటిదారి పట్టింది. ఒలింపిక్స్ సందర్భంగా నేషనల్ కోచ్ సేవలను తిరస్కరించడంపై అప్పట్లో టేబుల్ టెన్నిస్ సమాఖ్య మనికాపై ఆగ్రహం వ్యక్తం చేసింది. వివరణ ఇవ్వాలంటూ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. చదవండి: వారెవ్వా క్యా సీన్ హై.. ట్రాక్పైనే అంధ అథ్లెట్కు లవ్ ప్రపోజల్ -
ఏసీ ఎకానమీ కోచ్.. ఛార్జీ తక్కువ సౌకర్యాలు ఎక్కువ
సరికొత్త బిజినెస్ పాఠాలతో లాలు ప్రసాద్ యాదవ్ రైల్వేను పరుగులు పెట్టించారు. మట్టిపాత్రల్లో టీలు, ఎక్స్ట్రా బెర్తులతో పాటు పేదల కోసం ప్రత్యేకంగా గరీబ్రథ్ పేరుతో ఏసీ రైళ్లను అందుబాటులోకి తెచ్చారు. ఇప్పుడు అన్ని ఎక్స్ప్రెస్ రైళ్లలో సామాన్యులకు ఏసీ ప్రయాణం అందుబాటులోకి తేవడం కోసం ఏసీ ఎకానమీ కోచ్లను రైల్వేశాఖ అందుబాటులోకి తెచ్చింది. ఏసీ ఎకానమీ కోచ్లు ప్రస్తుతం రైల్వేలో ఏసీ ఫస్ట్క్లాస్, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్ కేటగిరీలు ఉన్నాయి. వీటితో పాటు గరీబ్రథ్ ఏసీ రైళ్లు, కొన్ని ఎక్స్ప్రెస్ రైళ్లలో ఏసీ చెయిర్కార్లు కూడా అందుబాటులో ఉన్నాయి. వీటిలో ఏసీ చెయిర్ కార్, థర్డ్ క్లాస్ ఏసీల టిక్కెట్ ఛార్జీలు తక్కువగా ఉంటాయి. ఇప్పుడు వాటికంటే తక్కువ ధరకే ఏసీ ప్రయాణం అందుబాటులోకి తేనుంది రైల్వే శాఖ. దీనికి ఏసీ ఎకానమీ కోచ్లుగా పేరు పెట్టింది. ధర ఎంతంటే ప్రస్తుతం నడుస్తున్న రైళ్లలో ఏసీ థర్డ్ క్లాస్ టిక్కెట్ ఛార్జీల కంటే 8 శాతం తక్కువగా వీటికి ఛార్జీలుగా నిర్ణయించారు. దీని ప్రకారం స్లీపర్ క్లాస్ టిక్కెట్ బేస్ ఫేర్ కంటే రెండున్నర రెట్లు ఎక్కువ ధర చెల్లించి ఏసీ ప్రయాణం చేయడం వీలవుతుంది. ఈ కోచ్లలో కనీస ఛార్జీ రూ. 440గా నిర్ణయించారు. తొలి ట్రైన్ ఇక్కడే అందులో నార్త్ సెంట్రల్ రైల్వే జోన్ మొదటి కోచ్ను ప్రారంభించేందుకు సిద్ధమైంది. 2021 సెప్టెంబరు 6న ప్రయాగ్రాజ్ నుంచి జైపూర్కి వెళ్లే రైలులో ఈ కోచ్ను తొలిసారిగా ప్రవేశ పెడుతున్నారు. దీనికి సంబంధించిన బుకింగ్స్ మొదలయ్యాయి. సౌకర్యాలు సూపర్ వివిధ కోచ్ ఫ్యాక్టరీలో ఇప్పటికే 50కి పైగా ఏసీ ఎకానమీ కోచ్లు తయారై రెడీగా ఉన్నాయి,. వీటిని వివిధ జోన్లకు కేటాయించారు. వీటిని లింకే హఫ్మన్ బుష్ టెక్నాలజీతో తయారు చేశారు. ఇంటీరియర్ మొత్తం స్టెయిన్లెస్ స్టీల్తో రూపొందించారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఏసీ కోచ్ల కంటే ఎకానమీ కోచ్లలో సౌకర్యాలు బాగున్నాయి, మన దగ్గర ఎప్పుడు ఏసీ ఎకామని కోచ్లు తెలుగు రాష్ట్రాల్లో ఎప్పుడు ప్రవేశపెడతారనే అంశంపై ఇంకా స్పష్టత లేదు. తొలి విడత కేటాయింపులో దక్షిణ మధ్య రైల్వేకు ఈ కోచ్లు కేటాయిస్తే అతి త్వరలోనే ఈ సౌకర్యం తెలుగు ప్రజలకు అందుబాటులోకి వస్తుంది. సాధారణంగా ఈ ఏసీ ఎకానమీ కోచ్లను రెండు జోన్ల మధ్య తిరిగే రైళ్లలో ఎక్కువగా ప్రవేశ పెడుతున్నారు. చదవండి : ‘కరోనా’తో ఆన్లైన్ వ్యసనం!..సర్వేలో భయంకర నిజాలు -
క్రీడా దిగ్గజం కన్నుమూత: విషాదంలో అథ్లెటిక్స్ ప్రపంచం
తిరువనంతపురం: పరుగుల రాణి పీటీ ఉష గురువు, అథ్లెటిక్స్ దిగ్గజం ఓమ్ నంబియార్ (89) గురువారం కన్నుమూశారు. తనకు శిక్షణనిచ్చిన గురువు కన్నుమూయడంతో ఆమె దిగ్ర్భాంతి చెందారు. ఈ విషయాన్ని చెబుతూ ఆమె ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా గురువుతో కలిసి ఉన్న ఫొటోలను పంచుకున్నారు. కేరళకు చెందిన నంబియార్ 1980- 90 కాలంలో పీటీ ఉషకు శిక్షణ ఇచ్చారు. ఆయన శిక్షణలోనే పీటీ ఉష రాటుదేలారు. 1985లో ఆయనకు ద్రోణాచార్య అవార్డు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ ఏడాది పద్మశ్రీతో కేంద్ర ప్రభుత్వం సత్కరించింది. ( చదవండి: పసిపాప కోసం ‘ఒలింపిక్ మెడల్’ వేలానికి ) కోచ్ కాక ముందు నంబియార్ 1955-70 మధ్య భారత వాయుసేనలో పని చేశారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ జాతీయ క్రీడా సంస్థలో కోచింగ్ కోర్సు పూర్తి చేశారు. అనంతరం కేరళ క్రీడా మండలిలో చేరారు. తిరువనంతపురంలో తొలిసారిగా పీటీ ఉష నంబియార్ను కలిసింది. పీటీ ఉషతో పాటు షైనీ విల్సన్, వందనా రావు అంతర్జాతీయ పతకాలు సాధించడంలో నంబియార్ పాత్ర మరువలేనిది. గురువు మృతిపై పీటీ ఉష ట్వీట్ చేశారు. ‘నా గురువు, శిక్షకుడు, మార్గదర్శిని కోల్పోవడం తీరని లోటు. నా జీవితానికి ఆయన చేసిన మేలు మాటల్లో చెప్పలేనిది. మిమ్మల్ని మిస్సవుతున్నాం నంబియార్ సార్. మీ ఆత్మకు శాంతి చేకూరుగాక’ అని చెబుతూ పోస్టు చేశారు. ఈ సందర్భంగా గురువు నంబియార్తో ఉన్న ఫొటోలను ఉష పంచుకుంది. The passing of my guru, my coach, my guiding light is going to leave a void that can never be filled. Words cannot express his contribution to my life. Anguished by the grief. Will miss you OM Nambiar sir. RIP 🙏🏽 pic.twitter.com/01ia2KRWHO — P.T. USHA (@PTUshaOfficial) August 19, 2021 నంబియార్ మృతిపై భారత అథ్లెటిక్స్ ఫెడరేషన్ (ఏఎఫ్ఐ) అధ్యక్షుడు అడిలి జె. సుమారివల్ల సంతాపం ప్రకటించారు. భారత అథ్లెటిక్స్ నంబియార్ సేవలను మరువలేరని పేర్కొన్నారు. 1984 లాస్ఏంజిల్స్ ఒలింపిక్స్లో పీటీ ఉష నంబియార్ సారథ్యంలోనే సత్తా చాటింది. అథ్లెటిక్స్ తరఫున వారి కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతి’ అని తెలిపారు. Sad to inform that Dronacharya Awardee coach OM Nambiar sir passed away a while back. He was coach of @PTUshaOfficial RIP Nambiar Sir, You gave us the Golden Girl. Your contribution to sports in India has been tremendous. Our condolences to the family- AFI President @Adille1 pic.twitter.com/VBVNqBPhzT — Athletics Federation of India (@afiindia) August 19, 2021 చదవండి: తనయుడి గిఫ్ట్కు తన్మయత్వంతో కన్నీళ్లు రాల్చిన తల్లి -
బతుకు చిత్రం : పతకాల సాధనలో కోచుల పాత్ర
-
షారుక్ ట్వీట్ వైరల్: లేటైనా నో ప్రాబ్లం.. వచ్చేటప్పుడు గోల్డ్తో రండి
టోక్యో ఒలింపిక్స్లో భారత మహిళల హాకీ జట్టు అద్భుతమే చేసింది. క్వార్టర్స్లో బలమైన ప్రత్యర్థి ఆస్ట్రేలియాను కట్టడి చేసి సెమీ ఫైనల్కు చేరి సత్తా చాటింది. 1980 మాస్కో ఒలింపిక్స్ తర్వాత భారత్ అత్యుత్తమ ప్రదర్శన కనబరిచి ఒలింపిక్స్లో తొలిసారిగా సెమీస్ చేరింది. తాజాగా ఈ విజయంపై బాలీవుడ్ బాద్ షా షారుక్ఖాన్ తనదైన శైలిలో స్పందించాడు. అంచనాలను తారుమారు చేస్తూ భారత మహిళల హాకీ జట్టు సెమీస్లోకి అడుగుపెట్టింది. ఈ నేపథ్యంలో మహిళల జట్టుపై పలువురు ప్రముఖులు ప్రశంసల జల్లు కురిపించారు. చారిత్రాత్మక సందర్భాన్ని కోచ్ సోయెర్డ్ మరీన్ రియల్ లైఫ్ చక్ దే ఇండియాతో పోల్చాడు. ఎందుకంటే ఆ సినిమా కూడా మహిళల హాకీ కథాంశంతోనే తెరకెక్కింది కనుక. ఈ ఆనందాన్నీ కోచ్ సోషల్మీడియాలో పంచుకుంటూ.. సారీ ఫ్యామిలీ.. నేను రావడం ఆలస్యమవుతుందని ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. ఇక ఆ చిత్రంలో కోచ్ కబీర్ఖాన్ పాత్ర పోషించిన షారుక్ దీనికి స్పందిస్తూ.. సరే ఏం ప్రాబ్లం లేదు. మీరు వచ్చేటప్పుడు భారత్లోని లక్షల కుటుంబాల కోసం గోల్డ్ తీసుకురండి చాలు.. మీ మాజీ కోచ్ కబీర్ ఖాన్ అని రిప్లై ఇచ్చాడు. కాగా ఉత్కంఠ సాగుతున్న మ్యాచ్లో గుర్జీత్ సంచలన గోల్ కొట్టి భారత్కు విజయాన్ని అందించింది. ఆస్ట్రేలియా ఒక్క గోల్ కూడా సాధించలేదు. దీంతో భారత మహిళల హాకీ జట్టు తొలిసారి సెమీస్లో అడుగుపెట్టింది. అటు 49 ఏళ్ల తర్వాత తొలిసారి పురుషుల హాకీ జట్టు కూడా సెమీ ఫైనల్స్లోకి ప్రవేశించిన సంగతి తెలిసిందే. Haan haan no problem. Just bring some Gold on your way back….for a billion family members. This time Dhanteras is also on 2nd Nov. From: Ex-coach Kabir Khan. https://t.co/QcnqbtLVGX — Shah Rukh Khan (@iamsrk) August 2, 2021 -
ఒలింపిక్స్: కాలర్ పట్టి ఆటగాడి చెంపలు వాయించిన కోచ్
టోక్యో: విశ్వ క్రీడా పోటీలు జపాన్ రాజధాని టోక్యోలో జరుగుతుండగా క్రీడాకారులు ప్రతిభ చాటేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఈ క్రీడా పోటీల్లో కొన్ని ఆసక్తికర సంఘటనలు జరుగుతున్నాయి. తాజాగా ఓ క్రీడాకారుడిని కోచ్ రెండు చెంపలు వాయించి పోటీలకు పంపించాడు. కోచ్ కొడుతుంటే ప్లేయర్ ఏమనకుండా ఓకే అంటూ బరిలోకి దిగాడు. దీనికి సంబంధించిన వీడియో వైరల్గా మారింది. అసలు కోచ్ ఎందుకు కొట్టారు? అనే సందేహం అందరిలో ఆసక్తి రేపుతోంది. మీరు చదివి తెలుసుకోండి.. ఎందుకో.. ఒలింపిక్స్లో జూడో మ్యాచ్లు జరుగుతున్నాయి. ఈ పోటీల్లో జర్మనీకి చెందిన జూడో స్టార్ మార్టినా ట్రాడోస్ పాల్గొంది. రింగ్లోకి వెళ్లేముందు కోచ్ క్లాడియో పుస రెండు చేతులతో కాలర్ పట్టుకుని చెంపలపై వేగంగా కొట్టాడు. అక్కడున్న వారికి షాకింగ్ అనిపించింది. అయితే మార్టినా మాత్రం ఒకే అనుకుంటూ రింగ్లోకి వెళ్లింది. బరిలో దిగేముందు కోచ్ క్లాడియో ఇలా చేయడం ఆమెకు అలవాటు అని మార్టినా తెలిపింది. ప్రత్యర్థితో తలపడేలా ఉత్సాహంగా ఉండేందుకు ఇలా చేశారని పేర్కొంది. ఇది తనకు తప్పక అవసరమని చెప్పుకొచ్చింది. రెండు చెంపలు కొట్టడంతో నిద్రమబ్బు వదిలి బరిలో పతకం కొట్టేలా గురి ఉండేందుకు ఇలా కోచ్ చేశారు. A czo tu się odpoliczkowało w ogóle?! pic.twitter.com/mX2r9rMMTA — Mischa Von Jadczak (@michaljadczak) July 27, 2021 -
లైవ్లోనే లవ్ ప్రపోజల్: ఓడిన ప్లేయర్కు షాకిచ్చిన కోచ్!
టోక్యో (జపాన్): విశ్వ క్రీడా సంబరం జపాన్ రాజధాని టోక్యో నగరంలో జరుగుతోంది. ప్రపంచ దేశాల క్రీడాకారులు తమ ప్రతిభ నిరూపించుకోవడానికి తీవ్రంగా శ్రమిస్తున్నారు. అందరూ గెలుపు కోసం ప్రయత్నిస్తారు. కానీ అందులో కొందరికీ మాత్రమే విజయం వరిస్తుంది. ఇక మిగిలిన వారు ఓటమి చెందుతారు. గెలుపోటములనేవి సమానంగా తీసుకోవాలి. ఈ విషయాన్ని గుర్తిస్తే ఆటలోనైనా.. జీవితంలోనైనా మానసికంగా సిద్ధమైతే ఏ పరిస్థితిని అయినా ఎదుర్కొనవచ్చు. అలా బాధలో ఉన్న ఓ ప్లేయర్కు ఆమె కోచ్ ఊహించని షాక్ ఇచ్చాడు. ఇన్నాళ్లు నీ వెంట నేనున్నా.. ఇకపై నా వెంట నువ్వుంటావా? అని మీడియా వేదికగా లవ్ ప్రపొజల్ చేశాడు. దీనికి సంబంధించిన వీడియో వైరల్గా మారింది. అర్జెంటీనా ఫెన్సర్ మారియా బెలెన్ పెరెజ్ మారిస్ టోక్యోలో జరుగుతున్న ఒలింపిక్స్ పోటీల్లో పాల్గొని తొలి రౌండ్లోనే పరాజయం పొంది నిరాశకు గురయ్యింది. తన ప్రదర్శనపై మీడియాతో మాట్లాడుతోంది. ఈ సమయంలో ఆమె కోచ్ లుకాస్ ససిడో వెంట నిలబడి ‘నన్ను పెళ్లి చేసుకుంటావా?’ అని వారి మాతృ భాషలో రాసిన ఒక పేపర్ పట్టుకుని నిలబడ్డారు. వీటిని చూసిన మీడియా ప్రతినిధులు గట్టిగా నవ్వారు. ఎందుకు నవ్వుతున్నారో తెలియక ఆమె వెనకకు తిరిగి చూసింది. కోచ్ చేసిన ప్రేమ అభ్యర్థనను చూసి ఒక్కసారిగా నోరెళ్లబెట్టింది. వెంటనే అతడి ప్రేమ అభ్యర్థనను అంగీకరించింది. బెలెన్ మూడుసార్లు ఒలింపిక్స్ పోటీల్లో పాల్గొంది. బెలెన్కు లుకాస్ కొన్నేళ్లుగా కోచ్గా ఉన్నారు. 2010లో పారిస్లో జరిగిన ప్రపంచ చాంపియన్ షిప్ పోటీల్లోనూ కోచ్ లుకాస్ ఇదే విధంగా ప్రపోజ్ చేశాడు. అయితే అప్పుడు ‘నువ్వు జోక్ చేస్తున్నావా?’ అని చెప్పి లైట్గా తీసుకుంది. ఇప్పుడు 2021లో అదే విధంగా ప్రపోజ్ చేయడంతో ఆమె చివరకు లుకాస్ను అంగీకరించింది. తాము పెళ్లి చేసుకుంటామని మీడియా ముఖంగానే ప్రకటించారు. ఈ లైవ్ లవ్ ప్రపోజల్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. -
మరింత విలాసవంతంగా రైలు ప్రయాణాలు..!
న్యూ ఢిల్లీ: రానున్న రోజుల్లో రైలు ప్రయాణాలు మరింత సౌకర్యవంతంగా ఉండనున్నాయి. త్వరలోనే సరికొత్త ‘ఎసీ ఎకానమీ' కోచ్లను ఇండియన్ రైల్వేస్ ప్రారంభించనుంది. కోవిడ్ రాకతో ఈ కోచ్ల తయారీకి ఆటంకం ఏర్పడింది. ఈ కోచ్లను కపుర్తాలా, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ తయారు చేసింది. ప్రస్తుతం ఉన్న ఎసీ 3-టైర్ కంటే తక్కువగా, నాస్ ఎసీ స్లీపర్ కంటే ఎక్కువగా ఎసీ ఎకానమీ కోచ్ ధరలు ఉండనున్నట్లు తెలుస్తోంది. ఈ కోచ్ల రాకతో ప్రయాణికులకు తక్కువ ధరలో ఎసీ ప్రయాణాలను ఇండియన్ రైల్వేస్ అందించనుంది. కాగా ఎసీ ఎకానమీ కోచ్ల అధికారిక పేరును, లాంచ్ డేట్లను ఇండియన్ రైల్వేస్ ఇంకా నిర్ణయించలేదు. కపుర్తాలా రైల్వే కోచ్ ఫ్యాక్టరీ తయారుచేసిన కోచ్లను దేశవ్యాప్తంగా డిస్ట్రిబ్యూట్ చేసినట్లు తెలుస్తోంది. ఎసీ ఎకానమీ కోచ్ల ఫీచర్లు ప్రతి కోచ్లో కనిపించే 72 బెర్తులకు బదులుగా 83 బెర్తులను కలిగి ఉంటుంది. ఇది ప్రయాణీకుల సామర్థ్యాన్ని పెంచుతుంది. ప్రతి బెర్త్లో వ్యక్తిగత రీడింగ్ లైట్లు, మొబైల్ ఛార్జింగ్ పాయింట్లతో పాటు బెర్త్లకు స్వంత ఎసీ వెంట్ల ఏర్పాటు ఉంది. ప్రతి కంపార్ట్మెంట్లో ఫోల్డబుల్ స్నాక్ టేబుల్, వాటర్ బాటిళ్ల హోల్డర్లు, మ్యాగజైన్స్, మొబైల్ ఫోన్ల హోల్డర్లను అమర్చారు. ఈ ఎసీ ఎకానమీ కోచ్లు దివ్యాంగులకు అనువుగా ఉంటాయి. కంపార్ట్మెంట్లకు వీల్ చైర్ యాక్సెస్ను ఏర్పాటు చేశారు. Despite Covid-19 restrictions affecting production in workshops, Rail Coach Factory, Kapurthala rolls out 15 coaches of 3 Tier AC Economy class with updated design, divyangjan friendly doors & toilets, with a plan to produce 248 such coaches this fiscal. pic.twitter.com/CFijKEVWdl — Ministry of Railways (@RailMinIndia) June 2, 2021 -
శ్రీలంక పర్యటనకు కోచ్గా ద్రవిడ్
ముంబై: భారత ‘ఎ’, అండర్–19 జట్లకు కోచ్గా యువ ఆటగాళ్లను తీర్చిదిద్దిన మాజీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్ తొలి సారి సీనియర్ టీమ్తో కలిసి పని చేయనున్నాడు. వచ్చే జూలైలో శ్రీలంకలో పర్యటించే భారత జట్టుకు ద్రవిడ్ కోచ్గా వ్యవహరిస్తాడు. భారత ద్వితీయ శ్రేణి జట్టుగా గుర్తించబడుతున్న ఈ టీమ్లో పరిమిత ఓవర్ల స్పెషలిస్ట్లు అయిన పలువురు యువ ఆటగాళ్లను ఎంపిక చేయనున్నారు. టూర్లో భాగంగా భారత్, లంక మధ్య 3 వన్డేలు, 3 టి20లు మ్యాచ్లు జరుగుతాయి. అగ్రశ్రేణి ఆటగాళ్లతో కూడిన భారత జట్టు ఇంగ్లండ్తో టెస్టుల్లో తలపడుతున్న సమయంలోనే ఈ సిరీస్ జరగనుంది. హెడ్ రవిశాస్త్రితో పాటు బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్, బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్ కూడా అక్కడే ఉంటారు. దాంతో మరో ప్రత్యామ్నాయం కోసం చూసిన బీసీసీఐ...ద్రవిడ్ను అందుకు సరైన వ్యక్తిగా గుర్తించింది. పైగా జట్టులో ఎంపికయ్యే అవకా శం ఉన్న యువ ఆటగాళ్లందరూ ఇప్పటి వరకు అండర్–19, ‘ఎ’ టీమ్ సభ్యులుగా ద్రవిడ్ మార్గనిర్దేశనంలోనే తమ ఆటను మెరుగపర్చుకున్నవారే. దాంతో జట్టు పని మరింత సులువవుతుందని బోర్డు భావించింది. ప్రస్తుతం జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ) హెడ్గా వ్యవహరిస్తున్న ద్రవిడ్... కొన్నాళ్ల క్రితమే అండర్–19, ‘ఎ’ టీమ్ బాధ్యతలనుంచి తప్పుకున్నాడు. శ్రీలంక పర్యటనకు భారత మాజీ పేసర్, యూత్ కోచ్ పారస్ మాంబ్రే బౌలింగ్ కోచ్గా వెళ్లే అవకాశం ఉంది. -
చరిత్రలో తొలిసారి.. పురుషుల జట్టుకు కోచ్గా ఎవరో తెలుసా?
లండన్: ఇంగ్లండ్ మాజీ మహిళా క్రికెటర్ సారా టేలర్ అరుదైన ఘనత సాధించింది. తొలిసారి ఒక పురుషులు జట్టుకు వికెట్కీపింగ్ కోచ్గా ఎంపికైంది. ఇంగ్లండ్లోని దేశవాలీ జట్టైన ససెక్స్కు టేలర్ కోచ్గా బాధ్యతలు నిర్వర్తించనుంది. సమకాలీన క్రికెట్లో పురుషులతో సమానంగా అత్యున్నత క్రికెటర్గా టేలర్ పేరు పొందిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ''ససెక్స్కు వికెట్ కీపింగ్ కోచ్గా పనిచేయనుండడం సంతోషంగా ఉంది. ఆ జట్టులో ప్రతిభావంతమైన క్రికెటర్ల బృందం ఉంది. వారితో పనిచేయడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నా. నా అనుభవం.. నైపుణ్యాలను వారికి పంచి నా వంతు సహకారం అందిస్తా. వికెట్ కీపింగ్లోని ప్రాథమిక సూత్రాలపై ఎక్కువగా దృష్టి సారించి ఆటగాళ్లకు మెళుకువలు ఇచ్చేందుకు ప్రయత్నిస్తా'' అంటూ చెప్పుకొచ్చింది. సారా టేలర్ ఇంగ్లండ్ తరపున 10 టెస్టుల్లో 300 పరుగులు, 126 వన్డేల్లో 4056 పరుగులు, 90 టీ20ల్లో 2177 పరుగులు సాధించింది. ఇక వికెట్కీపర్ మూడు ఫార్మాట్లు కలిపి 104 స్టంపింగ్స్.. 128 క్యాచ్లు అందుకుంది. ఇంగ్లండ్ జట్టు 2017 ఐసీసీ ఉమెన్స్ వరల్డ్కప్ గెలవడంలో సారా టేలర్ కీలకపాత్ర పోషించింది. 2019లో టేలర్ అంతర్జాతీయ క్రికెట్కు గుడ్బై చెప్పింది. చదవండి: కరోనా కలకలం.. బీసీసీఐ కీలక నిర్ణయం -
షాకింగ్ : కోచ్లు, మహిళా రెజ్లర్ల దారుణ హత్య
సాక్షి, చండీగఢ్ : హరియాణాలో దారుణం చోటు చేసుకుంది. రోహ్తక్లో రెజ్లింగ్ అకాడెమీలో దుండగులు మారణహోమం సృష్టించారు. సాయుధులైన కొంతమంది కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో ఐదుగురు రెజర్లు ప్రాణాలు కోల్పోయారు. మరో ఏడుగురు గాయపడ్డారు. చనిపోయిన వారిలో ఇద్దరు కోచ్లు కాగా, మరో ఇద్దరు మహిళా రెజ్లర్లు ఉండటం తీవ్ర విషాదాన్ని నింపింది. శుక్రవారం సాయంత్రం ఈ విషాదం చోటు చేసుకుంది. తాజా సమాచారం ప్రకారం, రెజ్లింగ్ కోచ్ల మధ్య వ్యక్తిగత శత్రుత్వమే కాల్పులకు దారితీసినట్టు తెలుస్తోంది. బరోడా గ్రామానికి చెందిన రెజ్లింగ్ కోచ్ సుఖ్వీందర్, మరికొందరు ఈ కాల్పులు జరిపినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. కేసు నమోదు చేసి, వివరాలను పరిశీలిస్తున్నామని పోలీసుల అధికారులు వెల్లడించారు. సంఘటన స్థలాన్ని సందర్శించిన రోహతక్ ఎస్పీ రాహుల్ శర్మ మాట్లాడుతూ (మనోజ్, సాక్షి) దంపతుల మూడేళ్ల కుమారుడికి కూడా బుల్లెట్ గాయాలయ్యాయని తెలిపారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం తరలించామన్నారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నామని తెలిపారు. నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేశామనీ, దర్యాప్తు అనంతరం పూర్తి వివరాలను వెల్లడిస్తామని చెప్పారు. మృతులు ఐదుగురిలో కోచ్ దంపతులు సోనిపట్ లోని సరగ్తాలా గ్రామానికి చెందిన మనోజ్ కుమార్, అతని భార్య సాక్షి, ఉత్తరప్రదేశ్ కు చెందిన రెజ్లింగ్ కోచ్ సతీష్ కుమార్, మహిళా రెజ్లర్పూ జా, ప్రదీప్ మాలిక్గా గుర్తించారు. 5 people have died & 3 hospitalised. Main accused, a wrestling coach named Sukhwinder, was terminated by one of the deceased after a complaint. Prima facie, anger seems to be the motive. Postmortem & probe underway. Accused carries Rs 1 lakh bounty on him: Rahul Sharma, SP Rohtak https://t.co/wE3cAu1hH8 pic.twitter.com/IzOHAUDVO3 — ANI (@ANI) February 13, 2021 -
ముంబై కోచ్గా రమేశ్ పొవార్ నియామకం
సాక్షి, ముంబై: ఈనెల 20 నుంచి ప్రారంభం కానున్న విజయ్ హజారే ట్రోఫీలో ముంబై జట్టు ప్రధాన కోచ్గా భారత మాజీ ఆఫ్ స్పిన్నర్ రమేశ్ పొవార్ను ముంబై క్రికెట్ అసోసియేషన్(ఎంసీఏ) మంగళవారం నియమించింది. భారత్ తరఫున రెండు టెస్టులు, 31 వన్డేలకు ప్రాతినిధ్యం వహించిన 42 ఏళ్ల పొవార్.. గతంలో భారత మహిళా క్రికెట్ జట్టుకి కోచ్గా వ్యవహరించాడు. పొవార్ నియామకం ప్రస్తుతానికి తాత్కాలికమే(ప్రస్తుత సీజన్) అయినప్పటికీ.. జట్టు అవసారాల దృష్ట్యా భవిష్యత్త్లో కొనసాగించే అంశాన్ని పరిశీలిస్తామని ఎంసీఏ సెక్రెటరీ సంజయ్ నాయక్ తెలిపారు. కాగా, ఇటీవల ముగిసిన సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నీలో ముంబై జట్టు పేలవ ప్రదర్శన కారణంగా అమిత్ పాగ్నిస్ ప్రధాన కోచ్ పదవి నుంచి తప్పుకున్నాడు. కోచ్ పదవికి ముంబై మాజీ కెప్టెన్ అమోల్ ముజుందార్, రమేశ్ పొవార్ల మధ్య తీవ్ర పోటీ నెలకొన్నప్పటికీ.. సెలక్టర్లు రమేశ్ పొవార్వైపే మొగ్గు చూపారు. -
కోచ్ పదవికి వసీం జాఫర్ రాజీనామా
ముంబై: టీమిండియా మాజీ ఓపెనర్ వసీం జాఫర్ ఉత్తరాఖండ్ జట్టు ప్రధాన కోచ్ పదవికి రాజీనామా చేశాడు. గతేడాది కరోనా పరిస్థితుల నడుమ(మార్చి నెలలో) కోచ్ బాధ్యతలు చేపట్టిన ఈ దేశవాళీ పరుగుల యంత్రం.. ఏడాది తిరిగేలోపే పదవికి రాజీనామా చేయడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. అతని ఆకస్మిక నిర్ణయానికి కారణాలు తెలియాల్సి ఉంది. ఫిబ్రవరి 20 నుంచి విజయ్ హజారే ట్రోఫీ ప్రారంభం కానున్న నేపథ్యంలో అతను జట్టు ప్రధాన కోచ్ పదవికి రాజీనామా చేయడం ఉత్తరాఖండ్కు పెద్ద ఎదురుదెబ్బగా పరిగణించాలి. జాఫర్ కోచ్ పదవి నుంచి తప్పుకున్న విషయాన్ని ఉత్తరాఖండ్ క్రికెట్ అసోసియేషన్ అధికారులు ధ్రువీకరించినప్పటికీ.. అతని రాజీనామాను మాత్రం ఆమోదించలేదు. కాగా, వసీం జాఫర్ ఆధ్వర్యంలో ఉత్తరాఖండ్ జట్టు ఇటీవల ముగిసిన సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో పేలవ ప్రదర్శనతో నిరాశపరిచింది. ఈ టోర్నీలో ఉత్తరాఖండ్ జట్టు ఐదు మ్యాచ్ల్లో కేవలం ఒకేఒక్క విజయం సాధించింది. రంజీ క్రికెట్ చరిత్రలో అత్యధిక పరుగులు(12000 పై చిలుకు పరుగులు) సాధించిన ఆటగాడిగా చరిత్ర పుటల్లో నిలిచిన వసీం జాఫర్.. భారత జట్టు తరఫున 31 టెస్టుల్లో 2 ద్విశతాకాలు, 5 శతకాలు, 11 అర్ధ శతకాల సాయంతో 1944 పరుగులు సాధించాడు. -
ఇంకా మెరుగ్గా నిర్వర్తించాల్సింది: కుంబ్లే
ముంబై: భారత క్రికెట్(టీమిండియా)లో మంచి సౌమ్యుడిగా పేరు సంపాదించుకున్న క్రికెటర్లలో అనిల్ కుంబ్లే ఒకడు. టీమిండియా జట్టు కెప్టెన్గానే కాకుండా ప్రధాన కోచ్గా కూడా తనదైన ముద్ర వేశాడు కుంబ్లే. అయితే తాజాగా జింబాంబ్వే మాజీ క్రికెటర్ పొమ్మి మాంగ్వా నిర్వహించిన ఆన్లైన్ సెషన్లో తన కోచ్ పదవిపై కుంబ్లే స్పందించారు. ఆయన స్పందిస్తూ.. టీమిండియాకు ప్రధాన కోచ్గా తన పాత్రను సమర్ధవంతంగా నిర్వహించానని, కానీ తన కోచ్ పదవిని చివర్లో ఇంకా మెరుగ్గా నిర్వహిస్తే బాగుండేదని తెలిపాడు. తాను కోచ్ పదవిని మెరుగ్గా నిర్వర్తించానని కుంబ్లే అన్నాడు. అయితే ప్రస్తుత టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లితో విభేదాలు కారణంగానే కుంబ్లే తన పదవిని అర్థాంతరంగా వదులుకోవాల్సి వచ్చిందని పలువురు ఆరోపించిన విషయం తెలిసిందే. అయితే ఐపీఎల్లో కూడా కుంబ్లే కీలక పాత్ర పోషించాడు. ఇప్పటివరకు ముంబై ఇండియన్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్లకు మెంటార్గా కుంబ్లే వ్యవహరించాడు. కేవలం కెప్టెన్గా, కోచ్గా మాత్రమే కాకుండా తన బౌలింగ్ నైపుణ్యంతో టీమిండియాకు ఎన్నో చారిత్రాత్మక విజయాలను కుంబ్లే అందించాడు. (చదవండి: అప్పుడు కుంబ్లేను కోహ్లి వద్దన్నాడు.. ఇప్పుడైతే?) -
కపిల్ సలహాతోనే కోచ్నయ్యా
న్యూఢిల్లీ: ఆటకు రిటైర్మెంట్ ప్రకటించాక తదుపరి ఏం చేయాలనే విషయంపై సందిగ్ధత నెలకొన్నప్పడు దిగ్గజ ఆల్రౌండర్ కపిల్దేవ్ సలహాలు తనకు ఎంతో ఉపయోగపడ్డాయని భారత మాజీ కెప్టెన్, ప్రస్తుత అండర్–19 జట్టు కోచ్ రాహుల్ ద్రవిడ్ అన్నాడు. కెరీర్ చివరి దశలో ఐపీఎల్ ఫ్రాంచైజీ రాజస్తాన్ రాయల్స్కు కెప్టెన్, కోచ్గానూ వ్యవహరించిన తాను అదృష్టవశాత్తు ఇంకా కోచింగ్తోనే కొనసాగుతున్నానని సంతోషం వ్యక్తం చేశాడు. భారత మహిళల జట్టు కోచ్ డబ్ల్యూవీ రామన్తో జరిపిన సంభాషణలో ద్రవిడ్ పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. ‘ఆటగాడిగా కెరీర్ ముగించాక తదుపరి నాకు చాలా దారులు కనబడ్డాయి. వాటిలో ఏది ఎంచుకోవాలో పాలుపోలేదు. అప్పుడే కపిల్ దేవ్ మంచి సలహా ఇచ్చారు. తొందరపడి ఏ నిర్ణయం తీసుకోకు రాహుల్... కొన్నేళ్లు అన్నీ ప్రయత్నించి నీకు ఏది నచ్చుతుందో చివరకు దానికే కట్టుబడి ఉండు అని చెప్పారు. ఆ మాటలు నాకు చాలా ఉపయోగపడ్డాయి. కొన్నాళ్లు వ్యాఖ్యాతగా పనిచేశాను. కానీ ఆటకు దూరంగా వెళ్తున్నట్లు అనిపించింది. అందుకే సంతృప్తినిచ్చే కోచింగ్ వైపే మొగ్గు చూపాను. అండర్–19, భారత ‘ఎ’ జట్లకు కోచ్గా అవకాశం వచ్చినప్పుడు ఆనందంగా స్వీకరించా’ అని ‘ది వాల్’ వివరించాడు. టీమిండియాకు ప్రాతినిధ్యం వహిస్తున్నప్పుడు వన్డే జట్టుకు తాను సరితూగననే అభద్రతా భావానికి గురయ్యానని ద్రవిడ్ గుర్తుచేసుకున్నాడు. నిజానికి తాను టెస్టు ప్లేయర్ని అని పేర్కొన్న ద్రవిడ్ తన శిక్షణ కూడా టెస్టు క్రికెటర్లాగేó సాగిందన్నాడు. తన సుదీర్ఘ కెరీర్లో 344 వన్డేలు ఆడిన ద్రవిడ్ 10889 పరుగులు సాధించాడు. -
జొకోవిచ్ కోచ్ ఇవానిసెవిచ్కూ కరోనా
బెల్గ్రేడ్: ప్రపంచ నంబర్వన్ నొవాక్ జొకోవిచ్ ఆడించిన ఆటతో కోవిడ్–19 పాజిటివ్ బాధితులు పెరిగిపోతున్నారు. అడ్రియా టూర్ ఎగ్జిబిషన్ సిరీస్ ద్వారా తాజాగా క్రొయేషియా టెన్నిస్ గ్రేట్, జొకోవిచ్ కోచ్ అయిన గొరాన్ ఇవానిసెవిచ్ కరోనా వైరస్ బారిన పడ్డాడు. పది రోజుల క్రితం రెండుసార్లు కోవిడ్ పరీక్షలు చేయించుకోగా నెగెటివ్ రిపోర్ట్ వచ్చిందని... తాజాగా మూడోసారి పాజిటివ్ వచ్చిందని గొరాన్ తెలిపాడు. లక్షణాలు లేకపోయినా తాను వైరస్ బారిన పడ్డానని చెప్పాడు. తనతో ఇటీవల సన్నిహితంగా మెలిగిన వారు జాగ్రత్తగా పరీక్షలు చేయించుకొని చికిత్స తీసుకోవాలని సూచించాడు. అడ్రియా టూర్లో సెర్బియా అంచె పోటీలు ముగిశాక.. క్రొయేషియాలో రెండో అంచె పోటీలు నిర్వహిస్తుండగా ఆటగాళ్లు, సహాయ సిబ్బంది కోవిడ్ బారిన పడ్డారు. దీంతో ఫైనల్ మ్యాచ్ను రద్దు చేశారు. ఇప్పటికే నిర్వాహకుడు, ఆటగాడు జొకోవిచ్ సహా, మరో ముగ్గురు ప్లేయర్లు దిమిత్రోవ్, బోర్నా చోరిచ్, విక్టర్ ట్రయెస్కీలకు వైరస్ సోకింది. -
4 రాష్ట్రాల్లో 204 ఐసోలేషన్ కోచ్లు
న్యూఢిల్లీ: కరోనాను ఎదుర్కొనేందుకు రైల్వే శాఖ దేశంలోని నాలుగు రాష్ట్రాల్లో 204 ఐసోలేషన్ కోచ్లను ఏర్పాటుచేసింది. అందులో 54 కోచ్ లను ఢిల్లీలోని షకుర్బస్తి రైల్వే స్టేషన్ లో ఏర్పాటు చేసింది. రానున్న రోజుల్లో ఢిల్లీలో 500 కోచ్లను ఏర్పాటు చేస్తామని అధికారులు తెలిపారు. ఉత్తర ప్రదేశ్లో 70 కోచ్లు, తెలంగాణలో 60 కోచ్లు (సికింద్రాబాద్, కాచిగూడ, ఆదిలాబాద్లలో 20 చొప్పున), ఆంధ్రప్రదేశ్ (విజయవాడ)లో 20 కోచ్లను ఏర్పాటు చేసింది. ఉత్తరప్రదేశ్ 240 కోచ్లు కావాలని, తెలంగాణ 60 కోచ్లు కావాలని గతంలో రైల్వే శాఖను కోరాయి. -
ప్రతికూలమే...కానీ ప్రాణాలేం పోవులే
న్యూఢిల్లీ: తీవ్రమైన వాయు కాలుష్యంతో విలవిల్లాడుతున్న ఢిల్లీ నగరంలో మ్యాచ్ నిర్వహణకు వచ్చే ముప్పేమీ లేదని బంగ్లాదేశ్ కోచ్ రసెల్ డొమింగో అన్నారు. ‘వాతావరణం ప్రతికూలమే అయినా... ప్రాణాలు పోయేంత కష్టమేమీ లేదు. ఇది కేవలం మూడు గంటల ఆటే. మ్యాచ్ సజావుగానే జరుగుతుంది. కళ్లకు, గొంతుకు కాస్త ఇబ్బంది కలగొచ్చేమో కానీ అంతకుమించిన ముప్పేమీ ఉండదు’ అని అన్నారు. గతంలో ఇక్కడ శ్రీలంకకు కూడా ఇలాంటి అనుభవమే ఎదురైందన్న సంగతి తెలుసని, బంగ్లాదేశ్లోనూ వాతావరణ కాలుష్యం ఉంటుందని చెప్పారు. ఇదేమీ తీవ్రంగా పరిశీలించాల్సిన అంశం కానేకాదని... ఆటగాళ్లు మ్యాచ్పై దృష్టి పెడితే సరిపోతుందని అన్నారు. షకీబ్ సస్పెన్షన్ ఉదంతం జట్టుపై ప్రభావం చూపుతుందని కోచ్ అంగీకరించారు. స్టార్ ఆటగాడు కీలకమైన సిరీస్కు లేకపోవడం లోటేనన్నారు.