-
బిల్ ఎంత పని చేసింది!.. రెస్టారెంట్లో కొట్టుకున్న సిబ్బంది, కస్టమర్లు!
సాధారణంగా అప్పుడప్పుడు కుటుంబంతో కలిసి హోటల్కు వెళ్లి నచ్చిన ఫుడ్ని ఆరగించడం ఇటీవల ట్రెండ్గా మారింది. బిల్లు ఎక్కువైనా పర్లేదు కడుపు నిండా తినాల్సిందేనని కొందరు తెగ లాగించేస్తుంటారు. ఇదే తరహాలో ఓ కుటుంబం కూడా రెస్టారెంట్కి వెళ్లి భోజనం చేసింది. అంతా అయ్యాక, వెయిటర్ బిల్లు తెచ్చాడు. బిల్లు చూసి ఆ కుటుంబ సభ్యులు షాక్ తిన్నారు. ఎందుకంటే ఆహార పదార్థాలే కాకుండా బిల్లుపై సర్వీస్ చార్జీలు ఉండడం చూసి ఆశ్చర్యపోయారు. రూ. 970 సర్వీస్ ఛార్జీ ఎందుకు విధించారని, హోటల్ సిబ్బందిని ప్రశ్నించగా, అది కాస్త గొడవకు దారి తీసింది. దీంతో హోటల్ సిబ్బంది, కుటుంబ సభ్యులు కొట్టుకున్నారు. దీనికి సంబంధించిన వీడియోలను స్థానికులు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్త వైరల్గా మారింది. ఆ కుటుంబ సభ్యులలో ఒకరు ట్వీట్ రూపంలో తమకు చేదు అనుభవాన్ని నెటిజన్లకు ఇలా పంచుకున్నారు.. “ఈరోజు మేము నా కుటుంబంతో కలిసి నోయిడాలోని స్పెక్ట్రమ్ మాల్, సెక్టార్-75లో ఉన్న రెస్టారెంట్ ఫ్లోట్ బై ఫ్యూటీ ఫ్రీకి వెళ్లాం. ముందుగా సిబ్బంది మెనూ కార్డ్లో ఉన్న కొన్ని పుడ్ ఐటమ్స్ను ఆర్డర్ చేస్తే.. అవి లేవని చెప్పాడు. సరే అని మేము సర్దుకుని రెస్టారెంట్లో ఉన్న అందుబాటులో ఉన్న ఆహారాన్ని తెప్పించుకుని తిన్నాము. కాసేపు అనంతరం రెస్టారెంట్ సిబ్బంది మా భోజన ఖర్చుకు సంబంధించిన బిల్లు తీసుకువచ్చి మా ముందు ఉంచాడు. అయితే సర్వీస్ ఛార్జీ ఎక్కువగా ఉందని.. దాన్ని తొలగించి బిల్ ఇవ్వమని కోరాము. కానీ సిబ్బంది కుదరదంటూ మొండిగా వాదించాడు. ఈ క్రమంలో సదరు వ్యక్తి నా సోదరుడిపై దుర్భాషలాడడంతో పాటు నాపై కూడా దాడి చేశాడని వాపోయాడు. Customers, restaurant employees clash over ‘service charge’ at Noida’s Spectrum Mall Read: https://t.co/xs0tE4fX6M pic.twitter.com/0iI0nr0QmC — Express Delhi-NCR (@ieDelhi) June 19, 2023 చదవండి: అమర్నాథ్ యాత్రికులకు శుభవార్త.. హోటళ్లు అడ్వాన్స్ బుకింగ్ చేస్తే.. -
కుర్చీలతో వీరంగం చేసిన కాంగ్రెస్ నేతలు.. వీడియో వైరల్
ముంబై: ముంబైలో జరిగిన యూత్ కాంగ్రెస్ మీటింగులో మహారాష్ట్ర యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు కునాల్ నితిన్ రౌత్ మద్దతుదారులకు వ్యతిరేక వర్గానికి మధ్య వివాదం చోటు చేసుకుంది. రెండు వర్గాల మధ్య వాగ్వాదం తీవ్రరూపం దాల్చడంతో యూత్ కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు బి.వి.శ్రీనివాస్ ముందే కుర్చీలు విసురుకుంటూ దాడులకు దిగారు. దీంతో బి.వి.శ్రీనివాస్ సభలో ఏమీ మాట్లాడకుండానే అక్కడినుండి వెళ్లిపోయారు. చాలాకాలంగా మహారాష్ట్ర యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు కునాల్ నితిన్ రౌత్ ను ఆ బాధ్యతల నుండి తప్పించమని ఒక వర్గం కాంగ్రెస్ అధిష్టానానికి విజ్ఞప్తి చేస్తూనే ఉంది. మరో వర్గం మాత్రం ఆయనకు మద్దతుగా నిలుస్తూ వస్తోంది. దీంతో ఈ రెండు వర్గాల మధ్య సమన్వయాన్ని కుదిర్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది మహారాష్ట్ర కాంగ్రెస్. ఇదిలా ఉండగా మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసే ప్రయత్నంలో భాగంగా యూత్ కాంగ్రెస్ సమావేశాన్ని ఏర్పాటుచేసింది అధిష్టానం. తీరా చూస్తే ఈ రెండు వర్గాలు ఆ వేదికను రణరంగంలా మార్చి పరస్పర దాడులకు తెగబడ్డారు. యూత్ కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు బి.వి.శ్రీనివాస్ ముందే కుర్చీలు విసురుకుంటూ వీరంగం సృష్టించారు. దీంతో బి.వి.శ్రీనివాస్ సభలో మాట్లాడకుండానే వెనుదిరిగారు. ప్రస్తుతం ఈ వీడియో ఇంటర్నెట్లో వైరల్ గా మారింది. BREAKING: A meeting of the Youth Congress in a fight between two groups over the demand to remove Maharashtra Youth Congress chief Kunal Nitin Raut.pic.twitter.com/AWW7qhF2fP — ADV. ASHUTOSH J. DUBEY 🇮🇳 (@AdvAshutoshBJP) June 17, 2023 ఇది కూడా చదవండి: ఎన్నికలకు ఫార్ములా రెడీ చేశాం, ఇక రంగంలోకి దూకడమే.. -
తమిళనాడులో ఐటీ శాఖకు చేదు అనుభవం..
-
రెజ్లర్ల దీక్షా శిబిరం వద్ద ఉద్రిక్తత
న్యూఢిల్లీ: భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్కు వ్యతిరేకంగా ఢిల్లీలో రెజ్లర్లు ఆందోళన చేస్తున్న దీక్షా స్థలి ఒక్కసారిగా ఉద్రిక్తతకు కేంద్ర బిందువైంది. రెజ్లర్లు, వారికి మద్దతుగా వచ్చిన ఆప్ కార్యకర్తలు పోలీసులతో వాగ్వాదానికి దిగడం, చివరకు తోపులాట, ఘర్షణకు దారితీసింది. బుధవారం అర్ధరాత్రి ఈ ఘటన జరిగింది. దీక్షా శిబిరం వద్ద వర్షాలతో రెజ్లర్లు వినియోగిస్తున్న పరుపులు తడిసి ముద్దయ్యాయి. వారికి సాయపడేందుకు కొన్ని చెక్క మంచాలను ఢిల్లీ ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే సోమ్నాథ్ భారతి తన కార్యకర్తలతో తెప్పించారు. వాటిని రెజ్లర్లకు ఇచ్చేందుకు అనుమతించేది లేదని, జంతర్మంతర్ను శాశ్వత దీక్షాశిబిరంగా మార్చేందుకు అనుమతులు లేవని అక్కడే మొహరించిన పోలీసులు తెగేసి చెప్పారు. అయినా సరే కొన్ని మంచాలను రెజ్లర్లకు కార్యకర్తలు ఇవ్వడం, వాటిని రెజ్లర్లు శిబిరంలోకి తీసుకెళ్తుండటంతో పోలీసులు, ఆప్ కార్యకర్తలకు మధ్య గొడవ జరిగింది. తమకు సాయపడేందుకు వచ్చిన ఆప్ కార్యకర్తలను పోలీసులు అడ్డుకోవడంతో రెజ్లర్లు వారితో వాదనకు దిగారు. దీంతో రెజ్లర్లు, కార్యకర్తలను నిలువరించేందుకు పెద్ద ఎత్తున పోలీసులు బలప్రయోగం చేశారు. ఇరువర్గాల వాదనలు చివరకు తోపులాటలు, ఘర్షణకు దారితీశాయి. ఈ ఘటనలో రాహుల్ యాదవ్, దుష్యంత్ ఫొగాట్సహా పలువురు రెజ్లర్లకు గాయాలయ్యాయి. వినేశ్ ఫొగాట్ కంటతడి నన్ను తిట్టారు. నేలకు పడేశారు. పురుష పోలీసులు తమతో అనుచితంగా ప్రవర్తించారు. ఒక్క మహిళా పోలీసు అయినా ఉన్నారా ఇక్కడ?. మమ్మల్ని చంపేద్దామనుకుంటున్నారా? చంపేయండి. ఇలాంటి రోజు కోసమేనా మేం దేశం కోసం పతకాలు సాధించింది? అంటూ ప్రముఖ మహిళా రెజ్లర్ వినేశ్ ఫొగాట్, సాక్షి మలిక్ కన్నీరు పెట్టుకున్నారు. తాము సాధించిన పతకాలు, కేంద్రం ఇచ్చిన అవార్డులు, పద్మశ్రీ అన్నీ వెనక్కి ఇస్తామని రెజ్లర్లు హెచ్చరించారు. విపక్షాల తీవ్ర ఆగ్రహం రెజ్లర్లపై పోలీసుల దాడి దారుణమని విపక్షాలు ఆగ్రహం వ్యక్తంచేశాయి. ‘ఆటగాళ్లపై పోలీసుల దాడి సిగ్గు చేటు. సమాఖ్య చీఫ్ శరణ్ను ఆ పదవి నుంచి మోదీ తొలగించాలి’ అని రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. ‘కోర్టు పర్యవేక్షణలో ఘటనపై దర్యాప్తు జరగాలి. కనీసం ఘటనాస్థలికి వెళ్లి మోదీ రెజ్లర్లకు సంఘీభావం ప్రకటించాలి’ అని కాంగ్రెస్ డిమాండ్చేసింది. పశ్చిమ బెంగాల్, తమిళనాడు, ఢిల్లీ రాష్ట్రాల ముఖ్యమంత్రులు తదితర నేతలూ పోలీసుల తీరును తీవ్రంగా తప్పుబట్టారు. -
ఉద్రిక్తంగా మారిన సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పాదయాత్ర
-
నెల్లూరులో మద్యం మత్తులో యువకుల మధ్య ఘర్షణ
-
చంద్రబాబు పుట్టినరోజు వేడుకల్లో టీడీపీ కార్యకర్తల వాగ్వాదం
-
తూర్పు గోదావరి జిల్లా గోపాలపురంలో టీడీపీ వర్గాల ఘర్షణ
-
దావత్లో గొడవ.. వెలుగులోకి లీక్!
సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: టీఎస్పీఎస్సీ ఈ నెల ఐదో తేదీన నిర్వహించిన అసిస్టెంట్ ఇంజినీర్స్ పరీక్ష పేపర్ల లీకేజీకి సంబంధించి ఆసక్తికరమైన సమాచారం వెలుగులోకి వచ్చింది. పరీక్ష అనంతరం ఈ కేసులో నిందితులతో పాటు మరికొందరు వనపర్తిలో దావత్ చేసుకున్నారని, ఆ సమయంలో ‘లీకేజీ డబ్బులు’విషయమై గొడవ జరిగిందని, ఆ గొడవతోనే పేపర్ లీక్ విషయం బయటపడిందని తెలిసింది. ఈ బాగోతంలో తొమ్మిది మందిని పోలీసులు అదుపులోకి తీసుకోగా.. ఇందులో ఆరుగురు పాలమూరుకు చెందినవారేనన్న సంగతి తెలిసిందే. పంచాంగల్లో ప్రిపరేషన్..వనపర్తిలో దావత్ ఏ–1 నిందితుడు ప్రవీణ్ నుంచి పేపర్ తీసుకున్న తర్వాత.. పరీక్షకు ఒకట్రెండు రోజుల ముందు రేణు క, డాక్యా దంపతులు గండేడ్ మండలం పంచాంగల్ తండాలోని ఇంటికి వచ్చారు. వీరితో పాటు ఆమె పెద్ద నాన్న కొడుకు శ్రీనివాస్ (మేడ్చల్ కానిస్టేబుల్), ఈయన స్నేహితులు కేతావత్ నీలేశ్ నాయక్, అతడి తమ్ముడు రాజేంద్ర నాయక్, వికారాబాద్ జిల్లా దుగ్యాల మండలం లగచర్ల తండాకు చెందిన పత్లావత్ గోపాల్ నాయక్ కూడా వచ్చినట్లు సమాచారం. రేణుక తమ్ముడు రాజేశ్వర్ కూడా వీరితో జత కాగా.. వారిని అక్కడే చదివించి 5న సరూర్నగర్లోని పరీక్ష కేంద్రానికి తీసుకెళ్లారు. పరీక్ష రాసిన తర్వాత రేణుక కారులో రాజేశ్వర్, శ్రీనివాస్, నీలేశ్, రాజేంద్ర నాయక్ వనపర్తి ఇంటికి వచ్చారని, అంతా కలిసి దావత్ చేసుకున్నారని సమాచారం. ఆ సమయంలో డాక్యా, గోపాల్నాయక్ వారితో ఉన్నారా? లేరా? అనేది తెలియలేదు. పేరులో తప్పు సరిచేసుకునేందుకు వెళ్లి.. రేణుకకు హిందీ పండిట్ ఉద్యోగం వచ్చిన తర్వాత రికార్డుల్లో ఆమె పేరులో తప్పుదొర్లింది. దీన్ని సరిచేసుకునేందుకు వెళ్లిన క్రమంలో ప్రవీణ్తో పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత వారు తరచుగా కలిసేవారని.. రేణుక టీఎస్పీఎస్సీ కార్యాలయానికి వెళ్లేదని తెలిసింది. ఈ క్రమంలోనే కవిత, ఆమె భర్త డాక్యా, ప్రవీణ్తో కలిసి పేపర్ లీకేజీ స్కెచ్ వేశారు. రేణుక సొంతూరు గండేడ్ మండలంలోని మన్సూర్పల్లి కాగా అత్తగారిల్లు ఇదే మండలంలోని పంచాంగల్ తండా. ఇలావుండగా వికారాబాద్ జిల్లా పరిగికి చెందిన ఇంటెలిజెన్స్ అధికారులు బుధవారం ఈ రెండు తండాల్లో పర్యటించి వివరాలు సేకరించినట్లు తెలిసింది. ఘర్షణ, బెదిరింపుతో.. దావత్ క్రమంలో రేణుక డబ్బుల విషయం లేవనెత్తినట్లు సమాచారం. ఒక్కొక్కరు రూ.10 లక్షల చొప్పున ఇచ్చేందుకు ఒప్పందం కుదరగా.. రూ.5 లక్షలు చొప్పున ఇచ్చి మిగతా డబ్బు తర్వాత ఇస్తామని రేణుకకు చెప్పారు. అయితే ఆమె ఇప్పుడే పూర్తిగా ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు తెలిసింది. ఈ క్రమంలోనే నీలేశ్నాయక్, రేణుక మధ్య పెద్ద ఎత్తున ఘర్షణ జరిగినట్లు సమాచారం. నీలేశ్ను రేణుక బెదిరించడంతో ఆయన బయటకు వచ్చి డయల్ 100కు ఫోన్ చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఆ ఇంటికి వచ్చి అందరినీ తీసుకెళ్లారు. వారు విచారించడంతో లీకేజీ డొంక కదిలినట్లు తెలుస్తోంది. -
భూపాలపల్లిలో రచ్చకెక్కిన ఫ్లెక్సీల వివాదం
-
హైదరాబాద్ : సెంట్రల్ యూనివర్సిటీలో విద్యార్థుల మధ్య ఘర్షణ
-
హైదరాబాద్ పాతబస్తీలో బీజేపీ, ఎంఐఎం నేతల మధ్య ఘర్షణ
-
కోమటిరెడ్డి నల్లగొండ పర్యటనలో ఉద్రిక్తత
సాక్షి, నల్లగొండ: కాంగ్రెస్ సీనియర్ నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి నల్లగొండ పర్యటనలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. గురువారం ఆయన జిల్లాలోని శాలిగౌరారం మండలంలోని ఇటుకలపాడులో పర్యటించారు. అయితే.. ఈ పర్యటనలో బీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. బొడ్రాయి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాన్ని హాజరైన కోమటిరెడ్డి ప్రసంగించారు. రోడ్లు బాగోలేవని, ఇటుకలపాడుకు రావడానికి మూడు గంటలకు పైగా సమయం పట్టిందని.. సీఎం కేసీఆర్పై ఆయన విమర్శలు గుప్పించారు. అయితే.. ఆ వ్యాఖ్యలు అక్కడే ఉన్న కొందరు బీఆర్ఎస్ కార్యకర్తలకు ఆగ్రహం తెప్పించాయి. బొడ్రాయి ప్రతిష్టాపనకు వచ్చి రాజకీయం మాట్లాడుతున్నారంటూ అడ్డుకునే యత్నం చేశారు. ఈ క్రమంలో ఆయనపై కుర్చీలు, కర్రలు విసిరి దాడి చేసేందుకు యత్నించారు బీఆర్ఎస్ కార్యకర్తలు. అయితే దాడి నుంచి ఆయన తప్పించున్నారు. ఈ క్రమంలో.. పోటీగా రంగంలోకి కాంగ్రెస్ కార్యకర్తలు.. బీఆర్ఎస్ కార్యకర్తలతో తోపులాటకు దిగారు. దీంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారగా.. పోలీసులు పరిస్థితిని అదుపు చేసేందుకు యత్నించారు. -
కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల మధ్య ఘర్షణ
-
Hyderabad: భర్తతో గొడవపడి.. భార్య అదృశ్యం
సాక్షి, హైదరాబాద్: భర్తతో గొడవపడి ఓ మహిళ అదృశ్యమైన సంఘటన గురువారం హయత్నగర్ పోలీస్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల సమాచారం మేరకు... హయత్నగర్ డివిజన్ సూర్యానగర్లో నివసించే మహీంద్రారెడ్డి ప్రైవేటు ఉద్యోగి. ఆయన భార్య శిరీష(25) బుధవారం రాత్రి గుర్తు తెలియని వారితో ఫోన్లో చాటింగ్ చేస్తుంది. ఈ విషయమై భర్త ప్రశ్నించడంతో వారి మధ్య గొడవ జరిగింది. ఈ క్రమంలో శిరీషపై భర్త చేయి చేసుకున్నాడు. దీంతో మనస్తాపానికి గురైన శిరీష చెప్పకుండా ఇంట్లోంచి వెళ్లిపోయింది. చుట్టుపక్కల, తెలిసిన వారి వద్ద వెతికినా ఆమె ఆచూకీ లభించలేదు. దీంతో భర్త మహీంద్రారెడ్డి గురువారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. చదవండి: వీబీఐటీ కేసు: వల వేసి.. సవాల్ విసిరి.. పోలీసులకు చిక్కాడు -
పటాన్చెరు: భార్యాభర్తల మధ్య గొడవ.. ఆపేందుకు వెళ్లిన వదినపై..
సాక్షి, హైదరాబాద్: భార్యాభర్తల మధ్య వివాదం కత్తిపోట్లకు దారి తీసింది. దాడిలో ఒకరు మృతి చెందగా, మరో ఇద్దరికి గాయాలయ్యాయి. ఈ సంఘటన అమీన్పూర్ పోలీసు స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. బొల్లారం సీఐ సురేందర్ రెడ్డి, అమీన్పూర్ ఎస్ఐ కిష్టారెడ్డి కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. మహబూబాబాద్ జిల్లా చిన్నగూడురు మండలం జయ్యారం గ్రామానికి చెందిన శ్రీనివాస్ బతుకుదెరువు కోసం వచ్చి బాల్నగర్ చింతల్లో ఉంటున్నారు. కూలి పనిచేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. కాగా శ్రీనివాస్ అతడి భార్య సునీత కొన్ని రోజులుగా గొడవపడుతున్నారు. సునీత అమీన్పూర్ శ్రీవాణి నగర్లో ఉంటున్న తన అక్క సుజాత(46) వద్దకు నెల క్రితం వచ్చింది. అక్కడే ఉంటూ బాచుపల్లి సమీపంలోని అరవిందో పరిశ్రమలో కూలి పనిచేస్తోంది. ఈ క్రమంలో శనివారం ఉదయం 5.30 గంటలకు సునీత డ్యూటీకి వెళ్లింది. వెనుక అక్క సుజాత, ఆమె కుమారుడు సాయికిరణ్ బైక్పై వచ్చారు. పరిశ్రమ సమీపంలో సునీత ఆమె భర్త శ్రీనివాస్ గొడవపడుతున్నారు. వారిని ఆపే ప్రయతనం చేసేందుకు వెళ్లిన సుజాత, సాయికిరణ్తో పాటు సునీతపై శ్రీనివాస్ కత్తితో దాడి చేశాడు. దాడిలో సుజాత అక్కడికక్కడే మృతిచెందగా, సునీత, సాయికిరణ్ తీవ్రంగా గాయపడ్డారు. వారిని వెంటనే స్థానిక మమత ఆస్పత్రికి తరలించారు. నిందితుడిని అదుపులోకి తీసుకొని పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. సమాచారం తెలుసుకున్న పటాన్చెరు డీఎస్పీ భీంరెడ్డి, సీఐ వేణుగోపాల్రెడ్డి సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు తెలుసుకున్నారు. చదవండి: (భర్త ఇంట్లో ఒంటరిగా ఉండగా.. ప్రియుడిని రప్పించి చాకచక్యంగా..) -
కామారెడ్డిలో కాసేపు హైటెన్షన్.. రైతులు, BRS నేతల మధ్య వాగ్వాదం
-
గాంధీభవన్ లో కాంగ్రెస్ నేతల ఘర్షణ
-
కర్రలతో కొట్టుకున్న ప్రైవేటు కాలేజ్ విద్యార్థులు.. వీడియో వైరల్
సాక్షి, ఖమ్మం: నగరంలోని ఓ ప్రైవేటు కళాశాల స్టూడెంట్స్ మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. సీనియర్, జూనియర్ విద్యార్థులు కొట్టుకున్నారు. ఇరు వర్గాలు కర్రలతో దాడి చేసుకున్నారు. కాలేజీ నుంచి విద్యార్థులు బయటకు వస్తున్న సమయంలో గొడవ జరిగింది. జూనియర్లు కాపుకాసి సీనియర్ విద్యార్థిని చితకబాదారు. జూనియర్లు మూకుమ్మడిగా దాడి చేయడంతో సీనియర్ విద్యార్థికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో యువకుడిని వెంటనే ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అయితే ఓ విషయంలో తెలెత్తిన వివాదం కారణంగా ఘర్షణ చోటుచేసుకున్నట్లు సమాచారం. గాయపడిన విద్యార్థి ఓ కార్పొరేటర్ కొడుకుగా తెలుస్తుంది. పట్టపగలే విద్యార్థులు కర్రలతో దాడి చేసుకోవడం వారి తల్లిదండ్రులను ఆందోళనకు గురిచేస్తుంది. కాగా విద్యార్థులు కొట్టుకున్న దృశ్యాలు కళాశాల గేట్ వద్ద ఉన్న సీసీటీవీ ఫుటేజీలో రికార్డయ్యాయి. ప్రస్తుతం ఈ వీడియో వైరల్గా మారింది. చదవండి: సంగారెడ్డిలో రెస్క్యూ ఆపరేషన్ విజయవంతం.. చిరుత చిక్కిందిలా! -
మాచర్లలో పథకం ప్రకారం రెచ్చిపోయిన టీడీపీ ముఠా
-
చైనా ఆర్మీని తరిమికొట్టిన భారత బలగాలు.. వీడియో వైరల్
అరుణాచల్ ప్రదేశ్లోని తవాంగ్ సెక్టర్లోని వాస్తవాధీన రేఖ వద్ద ఇటీవల భారత్ చైనా బలగాల మధ్య ఘర్షణ చోటుచేసుకున్న విషయం తెలిసిందే. డిసెంబర్9న భారత్ భూభాగాన్ని ఆక్రమించేందుకు చైనా ఆర్మీ ప్రయత్నించిందని.. డ్రాగన్ చర్యను భారత బలగాలు ధీటుగా అడ్డుకున్నాయని మంగళవారం లోక్సభలో కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ వెల్లడించారు. అయితే చైనా, భారత్ దళాల దాడి ఘటనను కేంద్రం ధృవీకరించిన మరుసటి రోజే ఓ వీడియో బయటకు వచ్చింది. తాజాగా వైరల్ అవుతున్న ఈ వీడియోలో.. చైనా దళాలు భారత భూభాగంలోకి వచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోంది. అరుణాచల్ ప్రదేశ్లోని లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ వద్ద ఈ ఘర్షణ జరిగినట్లు తెలుస్తోంది.భారత్ భూభాగంలోకి చొచ్చుకు వస్తున్న చైనా జవాన్లను భారత బలగాలు సమర్థవంతంగా తిప్పి కొట్టాయి. సరిహద్దు దాటాలనుకుంటున్న చైనా ఆర్మీని.. భారత సైనికులు ధైర్యంగా అడ్డుకున్నారు. గుంపుగా వచ్చిన చైనా దళాలపై ఇండియన్ ఆర్మీ లాఠీలతో మూకుమ్మడిగా దాడి చేసింది. అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియో డిసెంబర్ 9 జరిగిన ఘటనకు సంబంధించినది కాదని ఇండియన్ ఆర్మీ వెల్లడించింది. 2020లో తూర్పు లడఖ్లోని గాల్వాన్ లోయలో జరిగిన ఘర్షణ తర్వాత ఈ దాడి ఘటన జరిగి ఉంటుందని భావిస్తున్నారు. -
భారత్-చైనా సైనికుల ఘర్షణపై అమెరికా కీలక వ్యాఖ్యలు
వాషింగ్టన్: అరుణాచల్ ప్రదేశ్లోని తవాంగ్ సెక్టార్లో వాస్తవాధీన రేఖ(ఎల్ఏసీ) వద్ద భారత్-చైనా సైనికుల మధ్య జరిగిన ఘర్షణపై స్పందించింది అమెరికా. తవాంగ్ ఘర్షణ తలెత్తగా ఇరు దేశాలు త్వరగా వెనక్కి తగ్గి ఉద్రిక్తతలు సద్దుమణగటం ఆహ్వానించదగ్గ విషయమని అమెరికా శ్వేతసౌధం పేర్కొంది. వైట్హౌస్లో మంగళవారం జరిగిన మీడియా సమావేశంలో ప్రెస్ సెక్రెటరీ కరీన్ జీన్-పీయెర్ మాట్లాడారు. భారత్-చైనా సరిహద్దుల్లో పరిస్థితులను అమెరికా నిశితంగా పరిశీలిస్తున్నట్లు చెప్పారు. వివాదాస్పద సరిహద్దుల అంశంపై ప్రస్తుత దౌత్యపరమైన మార్గాల ద్వారా చర్చించి పరిష్కరించుకోవాలని సూచించారు. ‘ఘర్షణ నుంచి ఇరు పక్షాలు వెనక్కి తగ్గటం ఆహ్వానించదగ్గ విషయం. మేము పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తున్నాం. వివాదాస్పద అంశాలపై ద్వైపాక్షిక మార్గాల ద్వారా చర్చించి పరిష్కరించుకోవాలి. ఈసారి ఘర్షణ వాతావరణం త్వరగా సద్దుమణిగినందుకు సంతోషం.’ అని తెలిపారు శ్వేతసౌధం ప్రెస్ సెక్రెటరీ కరీన్ జీన్-పీయెర్. మరోవైపు.. సరిహద్దులో ఉద్రిక్తతలు సద్దుమణిగేందుకు భారత్ తీసుకున్న చర్యలకు తమ మద్దతు ఉంటుందని పెంటగాన్ తెలిపింది. అరుణాచల్ ప్రదేశ్లోని తవాంగ్ సెక్టార్ వద్ద డిసెంబర్ 9న సుమారు 300 మంది చైనీస్ పీపుల్ లిబరేషన్ ఆర్మీ సైనికులు భారత్లోకి ప్రవేశించేందుకు యత్నించారు. వారిని భారత సైనికులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ తలెత్తింది. దీంతో పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. భారత సైనికులు చైనా కుతంత్రాన్ని దీటుగా తిప్పికొట్టారని పార్లమెంట్లో ప్రకటన చేశారు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్. ఇదీ చదవండి: సైనికుల ఘర్షణపై స్పందించిన చైనా.. సరిహద్దులో పరిస్థితులపై ప్రకటన -
మోదీ సర్కారు మెతక వైఖరి వల్లే చైనా ఆగడాలు!
న్యూఢిల్లీ: సరిహద్దు విషయంలో నిజాలు బయటకు రాకుండా నరేంద్ర మోదీ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా తొక్కిపెడుతోందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి జైరామ్ రమేశ్ ఆరోపించారు. మన ప్రభుత్వ వైఖరి వల్లే చైనా రెచ్చిపోతుందని అన్నారు. మోదీ సర్కారు మెతక వైఖరిని డ్రాగన్ ఉపయోగించుకుంటోందని చెప్పారు. అరుణాచల్ప్రదేశ్లో ఎల్ఏసీ వద్ద భారత్, చైనా జవాన్ల ఘర్షణ నేపథ్యంలో ఆయన సోమవారం ట్వీట్ చేశారు. చైనా నుంచి దాడులు పెరుగుతున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం మొద్దు నిద్ర వీడడం లేదని, మేల్కొల్పేందుకు తాము ప్రయత్నిస్తున్నా పట్టించుకోవడం లేదని దుయ్యబట్టారు. రాజకీయ ప్రతిష్టను కాపాడుకొనేందుకు చైనాపై నోరు మెదపడం లేదని ధ్వజమెత్తారు. సరిహద్దుల్లో మన సైనికులు ప్రదర్శిస్తున్న ధైర్యసాహసాలను చూసి గర్వపడుతున్నామని జైరామ్ రమేశ్ పేర్కొన్నారు. చైనా చర్యను తీవ్రంగా ఖండిస్తున్నామని స్పష్టం చేశారు. దేశం కంటే ఎవరూ ఎక్కువ కాదని, నరేంద్ర మోదీ మాత్రం తన వ్యక్తిగత ప్రతిష్టం కోసం దేశాన్ని ప్రమాదంలోకి నెడుతున్నారని ఆరోపించారు. సరిహద్దుల్లో ఘర్షణలు ఆందోళన కలిగిస్తున్నాయని వెల్లడించారు. సరిహద్దులో భారత్-చైనా బలగాల మధ్య ఘర్షణ.. ఇరు వర్గాలకు స్వల్ప గాయాలు! -
పొన్నూరు సభలో చంద్రబాబు ఎదుటే తన్నుకున్న తెలుగు తమ్ముళ్లు
సాక్షి, గుంటూరు జిల్లా: పొన్నూరు చంద్రబాబు సభలో తెలుగు తమ్ముళ్లు మద్యం మత్తులో వీరంగం సృష్టించారు. ఐలాండ్ సెంటర్లో చంద్రబాబు ప్రసంగిస్తుంటే.. ఆ పక్కనే ఉన్న బార్ అండ్ రెస్టారెంట్లో దూరారు. తెలుగు తమ్ముళ్లు పీకల వరకు మద్యం సేవించి బయటికి వచ్చి తాగిన మైకంలో ఒకరిపైన ఒకరు దాడులు చేసుకున్నారు. ఒక వైపు చంద్రబాబు ప్రసంగిస్తుంటే.. మరో వైపు టీడీపీ నేతలు మాత్రం ఆయనను పట్టించుకోకుండా ఒకరిపై ఒకరు కర్రలతో దాడి చేసుకోవడంతో పాటు కాళ్లతో ఎగిరేగిరి తన్నుకున్నారు. ఇది చూసిన జనం ఒక్కసారిగా షాక్ అయ్యారు. చివరకు పోలీసులు రంగంలో దిగడంతో తెలుగుదేశం పార్టీ తాగుబోతు తమ్ముళ్ల గొడవ సద్దుమణిగింది గొడవపడేవారిని విడదీసి పోలీసులు పంపించేశారు. చదవండి: చంద్రబాబు వీక్నెస్ అదే.. కొంప మునగడం ఖాయమా? -
తూర్పు గోదావరి జిల్లా నిడదవోలు టీడీపీలో వర్గపోరు