-
‘రాజకీయాల నుంచి తప్పుకుంటే.. గోవా వెళ్తా.. ఎంజాయ్ చేస్తా’
సాక్షి, హైదరాబాద్: తనకు గోవాలో హోటల్ ఉందని.. రాజకీయాల నుంచి తప్పుకుంటే గోవా వెళ్లి ఎంజాయ్ చేస్తానంటూ వ్యాఖ్యానించారు మాజీ మంత్రి మల్లారెడ్డి. శుక్రవారం ఆయన అసెంబ్లీ ఆవరణలో మీడియాతో మాట్లాడుతూ, మనిషి జీవితం ఒకేసారి వస్తుందని..ఎంజాయ్ చేయాలన్నారు తన కుమారుడికి మల్కాజ్గిరి ఎంపీ టికెట్ ఇవ్వమని అడుగుతున్నా.. కేసీఆర్ ఆదేశిస్తే పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నాడని తెలిపారు. చేవెళ్ల ఎంపీ టికెట్ కోసమే రేవంత్ను పట్నం మహేందర్ కలిశారు. ఎంపీ రంజిత్రెడ్డి చేరికకు ముందే మహేందర్ కర్చీఫ్ వేశారు. జగ్గారెడ్డి ఫోకస్ కావడం కోసమే నా పేరు వాడుకుంటున్నారు. ఎంపీ టికెట్ కోసమే జగ్గారెడ్డి.. రేవంత్ను పొగుడుతున్నాడు. మల్లారెడ్డి పేరు చెప్పకపోతే జగ్గారెడ్డిని ఎవరూ పట్టించుకోరు. గతంలో రేవంత్రెడ్డిపై ఆయన చేసిన విమర్శలు అందరికీ గుర్తున్నాయి’’ అంటూ మల్లారెడ్డి వ్యాఖ్యానించారు. సబితారెడ్డితో కేటీఆర్ భేటీ అసెంబ్లీలో సబితారెడ్డితో కేటీఆర్ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా రాజకీయాలపై ఆసక్తికరమైన చర్చ జరిగింది. మహేందర్ రెడ్డి, సునీతారెడ్డి పార్టీ వీడితే ఎదురయ్యే పరిణామాలపై చర్చించారు. ఇప్పటికే ప్రకాష్ గౌడ్, తీగల కృష్ణారెడ్డిలు.. సీఎంను కలవడంపై చర్చాంశనీయంగా మారింది. జిల్లాలో పార్టీ పరిస్థితి పై చర్చించినట్లు సమాచారం ఇదీ చదవండి: ఓటుకు నోటు కేసులో కీలక పరిణామం -
నా జీవితంలో అది ఎప్పటికీ ప్రత్యేకమే: నిహారిక
మెగాడాటర్, నాగబాబు కూతురు నిహారిక కొణిదెల టాలీవుడ్లో పరిచయం అక్కర్లేని పేరు. మెగా కుటుంబం నుంచి వచ్చినా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్గా ఉంటూ అభిమానులను అలరిస్తోంది. ఎప్పటికప్పుడు పోస్టులు చేస్తూ టచ్లో ఉంటోంది. ఈ నేపథ్యంలో తాజాగా నెటిజన్స్తో సరదాగా చిట్ చాట్ నిర్వహించారు. ఈ ఇంటరాక్షన్లో నెటిజన్స్ అడిగిన ప్రశ్నలకు ఆసక్తికర సమాధానాలిచ్చారు. అసలు ఆమెను ఎలాంటి ప్రశ్నలు అడిగారో ఓ లుక్కేద్దాం పదండి. (ఇది చదవండి: ‘భోళా శంకర్’కు తొలి రోజు ఊహించని కలెక్షన్స్.. ఎన్ని కోట్లంటే.. ) నిహారిక తన ఫ్యాన్స్తో నిర్వహించిన చిట్చాట్లో ఆమె ఇష్టమైన విషయాల గురించి మాట్లాడారు. మీకిష్టమైన ప్రదేశం, వెబ్ సిరీస్లు ఏవని అడగ్గా.. ఇండోనేషియాలోని బాలి తన బెస్ట్ వెకేషన్ ప్లేస్ అని వెల్లడించింది. ఇక వెబ్ సిరీస్లు విషయానికొస్తే దిస్ ఇజ్ అజ్, డెక్ట్సర్ అని తెలిపింది. మరో నెటిజన్ ఆసక్తికర ప్రశ్న వేయగా.. నిహారిక బదులిచ్చింది. వరుణ్తేజ్తో దిగిన ఏ ఫోటో మీకు ఇష్టమని ప్రశ్నించగా.. ఎంగేజ్మెంట్లో అన్నయ్యతో దిగిన ఫోటోనే నా జీవితంలో అత్యంత ప్రత్యేక సందర్భమని తెలిపింది. అంతే కాకుండా నాకు బోర్డ్ గేమ్స్ అంటే చాలా ఇష్టమని.. రొమాన్స్, మర్డర్ మిస్టరీ జోనర్ సినిమాలంటే తనకు ఆసక్తి అని వెల్లడించింది. కాగా.. ఇటీవలే తన భర్త జొన్నలగడ్డ చైతన్యతో విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. (ఇది చదవండి: 'జైలర్' థియేటర్లో అత్తగారి ముందే ఆ హీరోయిన్తో ధనుష్ రచ్చ) View this post on Instagram A post shared by Niharika Konidela (@niharikakonidela) View this post on Instagram A post shared by Niharika Konidela (@niharikakonidela) -
సరైన టైంలో నిర్ణయం.. అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో 50 శాతం స్థానాల్లో పోటీపై సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటామని ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ తెలిపారు. అసెంబ్లీ ఆవరణలో ఆయన మీడియాతో చిట్చాట్ నిర్వహించారు. తాజ్మహల్ కంటే అందమైన సెక్రటేరియట్ కేసీఆర్ కట్టారు. కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి రావడం మంచి పరిణామం అని అసదుద్దీన్ పేర్కొన్నారు. ‘‘తెలంగాణలో మంచి పరిపాలన చేస్తున్నారు.. దేశమంతా వస్తే మంచిదే. మమ్మల్ని బీజేపీ బీ టీం అని కాంగ్రెస్ వాళ్లు ప్రచారం చేస్తున్నారు. బీజేపీని ఓడించాల్సిన అవసరం ఉంది. పార్లమెంట్లో జేపీసీ కోసం అడిగితే మోదీ ఒప్పుకోవడం లేదు. సెక్రటేరియట్ ఓపినింగ్ అధికారిక కార్యక్రమం.. అక్కడికి వెళ్తాము. పరేడ్ గ్రౌండ్ మీటింగ్ బీఆర్ఎస్ రాజకీయ సమావేశం.. మాకు సంబంధం లేదు.. ఇతర పార్టీలని పిలిస్తే వాళ్ల ఇష్టం అని అసదుద్దీన్ అన్నారు. చదవండి: సీఎం కేసీఆర్తో జగ్గారెడ్డి భేటీ.. కాంగ్రెస్లో ఏం జరుగుతోంది? -
డ్రోన్ అంటే కెమెరా ఒక్కటే కాదు!
సాక్షిప్రతినిధి, వరంగల్: ‘‘పిల్లలూ డ్రోన్ ఎలా పనిచేస్తుందో మీకు తెలుసా? డ్రోన్ అంటే కెమెరా ఒక్కటే కాదు.. దానితో పొలాల్లో పురుగుమందు స్ప్రే చేయవచ్చు.. అమ్మాయిల భద్రత విషయంలో చర్యలు తీసుకోవచ్చు. గుట్టలు, చెరువులు, కుంటల సరిహద్దులను నిర్ధారించవచ్చు. సరిహద్దుల్లో ఎవరు చొరబడకుండా చూడవచ్చు. భవిష్యత్లో మనుషులను తీసుకెళ్లే వాహనం కూడా అవుతుంది’’అంటూ గురుకుల విద్యార్థులతో మంత్రి కేటీఆర్ చిట్చాట్ చేశారు. మంగళవారం హుజూరాబాద్ నియోజకవర్గంలోని కమలాపూర్, గూడూరు శివారులో మహాత్మా జ్యోతిబాపూలే తెలంగాణ బీసీ వెల్ఫేర్ బాలుర, బాలికల గురుకుల పాఠశాల భవనాలను కేటీఆర్ ప్రారంభించారు. తర్వాత విద్యార్థులతో కలిసి ముచ్చటిస్తూ భోజనం చేశారు. ఈ సందర్భంగా కవరేజ్లో భాగంగా ఆ వైపు వచ్చిన డ్రోన్ను చూసిన కేటీఆర్ దానివల్ల ఏమేం చేయొచ్చో విద్యార్థులకు వివరించారు. చదువుకుని ఏమవుతారని, ఉద్యోగం చేస్తారా? అని ప్రశ్నించారు. ఉద్యోగం చేయడమే కాకుండా పది మందికి ఉద్యోగం కల్పించే స్థాయికి ఎదగాలన్నారు. ఇక్కడ పదో తరగతి, ఇంటర్మీడియెట్ చదివే పిల్లలను హైదరాబాద్లోని టీ–హబ్కు తీసుకువెళ్లి చూపించాలని ప్రిన్సిపాల్కు సూచించారు. తాను నాన్వెజ్ బంద్ చేశానని.. అందుకే పప్పు, చారు, పెరుగుతో ముగిస్తున్నానని విద్యార్థులకు చెప్పారు. భారీగా అభివృద్ధి పనుల ప్రారంభం హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం గూడూరు, కమలాపూర్ గ్రామాల్లో రూ.49 కోట్ల అంచనాలతో చేపట్టిన అభివృద్ధి పనులను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. అంతకుముందు మంత్రులు గంగుల కమలాకర్, ఎర్రబెల్లి దయాకర్రావు, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్, ఎమ్మెల్సీ పాడి కౌశిక్రెడ్డి, బీఆర్ఎస్ హుజూరాబాద్ నియోజకవర్గ ఇన్చార్జి గెల్లు శ్రీనివాస్యాదవ్ తదితరులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. కమలాపూర్ తహసీల్దార్ కార్యాలయం వద్ద శిలాఫలకాలను ఆవిష్కరించారు. తర్వాత కుల సంఘాల భవన సముదాయాన్ని ప్రారంభించారు. కాగా.. మంత్రి కేటీఆర్ పర్యటన సమయంలో ఎన్ఎస్యూఐ కార్యకర్తలు కాన్వాయ్లోకి చొరబడి నల్లచొక్కాలతో నిరసన తెలిపారు. పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. -
మహేష్ బాబు ఒకప్పటిలా లేడు: సుధీర్ బాబు
-
వాల్తేరు వీరయ్య తో సాక్షి చిట్ చాట్
-
బిగ్ బాస్ 6 కంటెస్టెంట్ కీర్తి భట్ తో " చిట్ చాట్ "
-
బిగ్ బాస్ 6 కంటెస్టెంట్ శ్రీ సత్యతో " చిట్ చాట్ "
-
జాన్ సే డైరెక్టర్ తో " చిట్ చాట్ "
-
మట్టి కుస్తీ మూవీ టీంతో " స్పెషల్ చిట్ చాట్ "
-
జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్ తో " చిట్ చాట్ "
-
యాంకర్ ఓంకార్, కొరియోగ్రాఫర్ యష్ మాస్టర్ తో " స్పెషల్ చిట్ చాట్ "
-
బిగ్ బాస్ 6 కంటెస్టెంట్ బాలాదిత్య తో " స్పెషల్ చిట్ చాట్ "
-
యశోద మూవీ నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ తో " స్పెషల్ చిట్ చాట్ "
-
" లైక్, షేర్ & సబ్స్క్రైబ్ " మూవీ టీంతో చిట్ చాట్
-
లైగర్ ఫ్లాప్పై తొలిసారి స్పందించిన పూరీ
-
లైగర్ ఫ్లాప్పై తొలిసారి స్పందించిన పూరీ, ఏమన్నాడంటే
విజయ్ దేవరకొండ హీరోగా డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ అంత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్చించిన చిత్రం లైగర్. పాన్ ఇండియా మూవీగా రూపొందిన లైగర్ భారీ అంచనాల మధ్య ఆగస్ట్ 25న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ బడ్జెట్తో తెరకెక్కించిన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద బొల్తా పడింది. దీంతో ఈ మూవీ నిర్మాతలు, బయ్యర్లు, డిస్ట్రిబ్యూటర్లకు లైగర్ నష్టాలను మిగిల్చింది. ఇదిలా ఉంటే విడుదలకు ముందు బ్లాక్బస్టర్ హిట్ ఖాయమంటూ ధీమా వ్యక్తం చేసిన పూరీ విడుదల అనంతరం సినిమా గురించి ఎక్కడ ప్రస్తావించలేదు. చదవండి: ‘బాహుబలి’ ఆఫర్ వదులుకున్నందుకు గర్వపడుతున్నా: మంచు లక్ష్మి మూవీ పరాజయంపై ఇంతవరకు ఆయన నేరుగా స్పందించింది లేదు. ఈ నేపథ్యంలో చిరుతో ఇన్స్టాగ్రామ్ వేదికగా లైవ్లో పాల్గొన్న పూరీ ఈ సందర్భంగా లైగర్ ఫ్లాప్పై స్పందించాడు. కాగా గాడ్ ఫాదర్ బ్లాక్బస్టర్ హిట్ నేపథ్యంలో పూరీ జగన్నాథ్-చిరంజీవి ఇన్స్ట్రాగ్రామ్ లైవ్ ద్వారా ముచ్చటించారు. ఈ నేపథ్యంలో చిరు, పూరీని ఇలా ప్రశ్నించాడు. పూరీ మీరు అనుకున్న రిజల్ట్ రాకపోతో ఎలా తీసుకుంటారు? అని అడగ్గా.. ‘దెబ్బ తగినప్పుడు హీలింగ్ టైమ్ ఉంటుంది చూశారా.. అది తక్కువగా పెట్టుకోవాలి. ఆస్తులు పోవచ్చు లేదా యుద్ధాలు జరగోచ్చు ఏం జరిగినా హీలింగ్ టైమ్ నెలకు మించి ఉండకూడదు. ఒక నెలలో వేరే పనిలో పడిపోవాలి అంతే. కొన్నిసార్లు నమ్మిన వాళ్లు కూడా ఫ్లిప్ అవ్వచ్చు, ఏమైనా జరగచ్చు’ అన్నాడు. చదవండి: వెండితెర ఎంట్రీ ఇస్తున్న కార్తీక దీపం ఫేం ‘వంటలక్క’, ఫస్ట్లుక్ రిలీజ్ అనంతరం ‘నేను లైగర్ సినిమా తీశాను. మూడేళ్లు సినిమాకి పనిచేస్తూ ఎంతో ఎంజాయ్ చేశాను. మంచి సెట్స్ వేశాం. కాస్ట్ అండ్ క్రూ, మైక్ టైసన్ ఇలా అంతా ఎంతో ఆనందంగా చేశాం. కానీ, సినిమా ఫ్లాప్ అయ్యింది. శుక్రవారం విడుదలైన ఈ సినిమా రిజల్ట్ కోసం ఆదివారం వరకు వేచి చూశా. ఆ తర్వాత మూవీ ప్లాప్ అని అర్థమైంది. ఆ మరుసటి రోజు సోమవారం జిమ్కు వెళ్లి 100 స్క్వాడ్స్ చేశా. ఒత్తిడి మొత్తం పోయింది. నా జీవితం నేను బాధగా ఉన్న రోజుల కంటే నవ్వుతూ ఉన్న రోజులే ఎక్కువ’ అంటూ పూరీ సమాధానం ఇచ్చాడు. ఇక ప్రస్తుతం తాను ముంబైలో కొత్త కథలు రాసే పనిలో ఉన్నానంటూ చెప్పుకొచ్చాడు. కాగా గాడ్ ఫాదర్లో పూరీ జర్నలిస్ట్గా కీ రోల్ పోషించిన సంగతి తెలిసిందే. -
జిన్నా మూవీ టీం తో స్పెషల్ చిట్ చాట్
-
గాడ్ ఫాదర్ గ్రాండ్ సక్సెస్.. మూవీ టీమ్ స్పెషల్ చిట్ చాట్
-
మంచు లక్ష్మితో స్పెషల్ చిట్ చాట్
-
అడగరాని ప్రశ్న అడిగిన నెటిజన్.. స్ట్రాంగ్ కౌంటరిచ్చిన బిగ్బాస్ బ్యూటీ
బిగ్బాస్ రియాల్టీ షో ద్వారా పాపులర్ అయిన నటి పునర్నవి భూపాలం. అంతకు ముందు కొన్ని చిత్రాల్లో నటించినప్పటికీ.. అంతగా గుర్తింపు రాలేదు. కానీ బిగ్బాస్ మూడో సీజన్లో పాల్గొని, తనదైన ఆటతీరుతో అందరిని ఆకట్టుకుంది. ఏ విషయంలోనైనా ఓపెన్గా మాట్లాడుతూ..బోల్డ్ బ్యూటీగా పేరు తెచ్చకుంది. బిగ్బాస్ షో తర్వాత చాలా సినిమా అవకాశాలు వచ్చినప్పటికీ.. నో చెప్పి పై చదువుల కోసం లండన్ వెళ్లింది. ప్రస్తుతం ఆమె లండన్లో సైకాలజీ హయ్యర్ స్లడీస్ చేస్తోంది. సినిమాల ద్వారా కాకపోయినా.. సోషల్ మీడియా ద్వారా అయినా అభిమానులతో టచ్లో ఉంటుంది ఈ బోల్డ్ బ్యూటీ. ఇటీవల ఇన్ స్టా లైవ్లోకి వచ్చిన పునర్నవి తన డేటింగ్ విషయంపై స్పందించింది. మీరు ఎవరితోనైనా డేటింగ్లో ఉన్నారా? అని ఓనెటిజన్ ప్రశ్నించగా.. ఎస్ అని అన్సర్ ఇచ్చింది. అలాగే మీరు వర్జిన్ నా? అని మరో నెటిజన్ ప్రశ్నించగా.. పునర్నవి మొహమాటం లేకుండా నేను ఇలాంటి ప్రశ్న కోసమే ఎదురుచూస్తున్నానని సమాధానం చెప్పారు. పునర్నవి చేసిన ఈ చిట్ చాల్ నెట్టింట వైరల్ అవుతోంది. -
నల్లగొండ: పార్టీ మార్పుపై కోమటిరెడ్డి రాజగోపాల్ చిట్చాట్
-
సితార సోఫాలో నుంచి కిందపడిపోయింది: మహేశ్ బాబు
Mahesh Babu About Sitara In Chit Chat With Youtubers: 'ఆ సీన్ చూసి సితార ఇచ్చిన రియాక్షన్ ఇప్పటివరకు నేను ఎప్పుడూ చూడలేదు' అని సూపర్ స్టార్ మహేశ్ బాబు పేర్కొన్నాడు. ప్రస్తుతం 'సర్కారు వారి పాట' సినిమా విజయాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు మహేశ్ బాబు. ఇందులో భాగంగా శనివారం (మే 21) పలువురు యూట్యూబర్లతో చిట్చాట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహేశ్ బాబు, కీర్తి సురేశ్, డైరెక్టర్ పరశురామ్ పాల్గొన్నారు. యూట్యూబర్లు అడిగిన ప్రశ్నలకు సరదాగా, ఆసక్తికర సమాధానాలు ఇచ్చారు. ఈ క్రమంలో షూటింగ్ సమయంలో జరిగిన ఒక ఆసక్తికర సంఘటనను వారితో పంచుకోవాలని మహేశ్ బాబు తెలిపాడు. ''ఈ సినిమాలోని ఓ సన్నివేశంలో కీర్తి నన్ను తిట్టాలి. 3 టేకులు తీసుకున్నప్పటికీ కీర్తి చేయలేకపోయింది. దీంతో డైరెక్టర్ ఆమె దగ్గరికి వెళ్లి 'మేడమ్.. మీరు సార్ను తిట్టాలి. గుర్తుపెట్టుకోండి ఆయన్ను మీరు తిట్టాలి.' అని చాలాసార్లు చెప్పారు. కీర్తి ఇబ్బందిపడుతోందని నాకు అర్థమైంది. అప్పుడు నేను 'పర్వాలేదు కీర్తి.. నన్ను నువ్వు తిట్టు' అని చెప్పాను. దానికి ఆమె 'సార్.. నేను మిమ్మల్ని తిట్టలేను. ఒకవేళ నేను మిమ్మల్ని తిడితే మీ ఫ్యాన్స్ నన్ను ఏదో ఒకటి అంటారు.' అని చెప్పింది. 'నా ఫ్యాన్స్ ఏం అనరమ్మ. నువ్వు తిట్టు.' అని నచ్చజెప్పి ఆ సీన్ పూర్తయ్యేలా చేశాం. కానీ మొన్న నా ఫ్యామిలీతో కలిసి ఆ సీన్ చూసినప్పుడు సితార ఇచ్చిన రియాక్షన్ ఇప్పటివరకూ నేను ఎప్పుడూ చూడలేదు. తను సోఫాలో నుంచి కిందపడిపోయి మరి నవ్వింది.'' అని చెప్పుకొచ్చాడు మహేశ్బాబు. చదవండి: అలా ఎందుకు జరిగిందో తెలియదు: మహేశ్ బాబు ఆ సినిమా చూసి ఏడ్చేశాను : మహేశ్ బాబు var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_721246091.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
ఆ రెండింటికి దూరంగా ఉండాలనుకుంటున్నా : సమంత
స్టార్ హీరోయిన్ సమంత తాజాగా నటించిన సినిమా కాతువాక్కుల రెండు కాదల్. ఈ సినిమాని తెలుగులో ‘కణ్మణి ర్యాంబో ఖతీజా’ పేరుతో విడుదల చేశారు. విజయ్ సేతుపతి, నయనతారతో పాటు సమంత నటించిన ఈ సినిమా ఏప్రిల్28న ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సందర్బంగా ట్విట్టర్ వేదికగా అభిమానులతో ముచ్చటించిన సమంత వారు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు చెప్పింది.చదవండి: ఎప్పటికీ కృతజ్ఞురాలినే,మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నా : సమంత ప్రేక్షకులను నవ్వించడం కోసమే ఖతీజా పాత్రలో నటించానని చెప్పిన సమంత ప్రతి ఒక్కరు వారి జీవితంలో కాస్త విరామం ఇచ్చి ఈ సినిమా చూసి హాయిగా నవ్వుకోమని కోరింది. ఇక ఈ సినిమాలో తనకు ‘డిప్పం డిప్పం’ పాట అంటే ఎంతో ఇష్టమని సమంత ఈ సందర్భంగా పేర్కొంది. నయనతార గురించి చెబుతూ..తాను కలిసిన వాళ్లలో మోస్ట్ హార్డ్ వర్కింగ్ పర్సన్ నయనతార అని ఆమెలాంటి వ్యక్తి మరొకరు ఉండరు అని పేర్కొంది. ఇక ఓ నెటిజన్ ఒకే సమయంలో ప్రేక్షకుల నుంచి ప్రేమ, విపరీతమైన ద్వేషం రావడం ఎలా అనిపిస్తుంది అని అడగ్గా.. ఆ రెండింటికి దూరంగా ఉంటానని, అయితే అభిమానులు తనపై చూపించే ప్రేమకు కృతఙ్ఞతతో ఉంటానని సామ్ చెప్పుకొచ్చింది. దీంతో ప్రేమపై కూడా తనకు నమ్మకం లేదని ఈ సమాధానం ద్వారా సమంత చెప్పకనే చెప్పింది అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. చదవండి: సమంతపై ప్రాంక్.. విజయ్ సర్ప్రైజ్ మామూలుగా లేదుగా I try not to buy into the love or the hate .. stay a safe distance away from it all ♥️#AskSam https://t.co/RyLXiPjxca — Samantha (@Samanthaprabhu2) April 29, 2022 #Nayanthara is #Nayanthara💕there is no one like her . She is real,fiercely loyal and one of the most hard working people I have met #Kanmani #KaathuvakulaRenduKaadhal #AskSam https://t.co/8Crkmn8BLE — Samantha (@Samanthaprabhu2) April 29, 2022 -
KGF Chapter 2 మూవీ టీం తో స్పెషల్ ఇంటర్వ్యూ