-
నా జీవితం.. ‘అందమైన పూలతోట’ కాదు
తెనాలి: ‘నా జీవితం అందమైన పూలతోట కాదు.. జీవనం కోసం ఎన్నెన్నో చిరుద్యోగాలు చేశాను. అన్నింటిలోను అత్తెసరు సంపాదనే. చివరకు రచనా వ్యాసంగమే బాలసాహిత్య ప్రపంచంలో నిలబెట్టింది. గుర్తింపువచ్చాక వెనుదిరిగి చూసుకోలేదు. కథలు, నవలికలు, నవలలు, టెలీఫిలింస్తో బిజీ అయ్యాను. కమ్యూనిస్టు నేపథ్యం ఉండటంతో కమర్షియల్ కాదలచుకోలేదు. సీరియస్ సాహిత్యాన్నే చేశాను. సామాజిక సమస్యలతో కూడిన ఇతివృత్తాలతోనే సాహిత్య సృజన చేశాను. ఇప్పుడీ అవార్డుకు ఎంపికవటం సంతోషంగా ఉంది..’ కేంద్ర సాహిత్య అకాడమీ బాలసాహిత్య అవార్డుకు ఎంపికైన ప్రముఖ బాలసాహితీవేత్త, నవలా రచయిత, కాలమిస్ట్, టెలీఫిలింస్ కథ, మాటలు, స్క్రీన్ప్లే రచయిత పి.చంద్రశేఖర ఆజాద్ స్పందన ఇది. అవార్డు వచ్చిన నేపథ్యంలో ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. చంద్రశేఖర అజాద్ స్వస్థలం ఉమ్మడి గుంటూరు జిల్లా భట్టిప్రోలు మండల గ్రామం వెల్లటూరు. 1955 మే 24న జన్మించారు. తండ్రి పమిడిముక్కల లక్ష్మణరావు. అప్పట్లో కమ్యూనిస్టు యోధుడు. తెలంగాణ పోరాటంలో పాల్గొని జైలుకెళ్లారు. కొడుక్కి స్వాతంత్య్రయోధుడు చంద్రశేఖర అజాద్ పేరు పెట్టారు. అజాద్కు ఏడేళ్ల వయసులోనే ఆయన మరణించారు. గుంటూరులోని సీపీఎం కార్యాలయం ఆయన పేరుతోనే ఉంటుంది. రేపల్లెలో ఇంటర్ వరకు చదివిన అజాద్.. ఆ మరుసటిరోజే తెనాలిలోని బావగారి హోటల్లో పనికి కుదిరాడు. ఏ ఉద్యోగంలోను ఎక్కువకాలం చేయలేదు. నవభారత్ టొబాకోలో కొంతకాలం, తర్వాత మరికొన్నింటిలో పనిచేశారు. అపరాధ పరిశోధన.. నిలబెట్టింది ఏదో ఒక ఉద్యోగం చేస్తూనే తనలోని భావాలను అక్షరాల్లోకి మార్చే ప్రయత్నం చేశారు అజాద్. వాటిని అప్పటి దినపత్రికలకు పంపేవారు. ఆరోజుల్లో ‘అపరాధ పరిశోధన’ మాసపత్రిక వచ్చేది. తన కథలు, నవలికలు పంపుతుండేవారు. ‘ఆ పుస్తకమే తనను రచయితగా నిలబెట్టింది..’ అని అజాద్ గుర్తుచేసుకున్నారు. ‘ఆ పత్రికకు 16–17 నవలికలు, 40కి పైగా కథలు రాశాను. అప్పటో్లనే కథకు రూ.75, నవలికకు రూ.125 నుంచి రూ.150 చొప్పున ఇచ్చేవారు. చేసే ఉద్యోగంతో నెలకు రూ.180 వరకు వచ్చేవి. అమ్మ విజయలక్ష్మి వాళ్లంతా తెనాల్లో ఉండేవారు. ఆ డబ్బులు తీసుకుని అమ్మను చూడ్డానికి వెళే్లవాడిని..’ అని చెప్పారు. తర్వాత ఆంధ్రప్రదేశ్ ట్రేడింగ్ కార్పొరేషన్లో చేరారు. రోజుకు రూ.10 వేతనం. సెలవులొస్తే అది కూడా ఉండేది కాదు. 1974లో పెళ్లయింది. భార్య, ఇద్దరు పిల్లలు. 1982 వరకు నెలకొచ్చే వేతనం ఏనాడు రూ.180కి మించలేదు. అందమైన పూలతోటకు మొదటి బహుమతి 1983లో ఒక దినపత్రిక ఆధ్వర్యంలో నడుస్తున్న బాలల మాసపత్రిక బాలల నవలల పోటీని ప్రకటించింది. ‘అందమైన పూలతోట’ అనే నవలను రాసి పంపారు. తెలుగు బాలసాహిత్యంలో ఒక ప్రయోగాత్మకమైన ఆ నవలకు ప్రథమ బహుమతి, ఆరుద్ర భార్య రామలక్ష్మి రాసిన నవలకు ద్వితీయ బహుమతి వచ్చాయి. ‘మహదానందం కలగటమే కాదు.. ఆ నవలతో నా జీవితం మలుపు తిరిగింది..’ అన్నారు అజాద్. ‘అప్పటికే యండమూరి వీరేంద్రనాథ్, యద్దనపూడి సులోచనారాణి వంటి రచయితలు సాహితీ ప్రపంచాన్ని ఏలుతున్నారు. నాలాంటి వర్ధమాన రచయితలకు ఖాళీలేదని అర్థమైంది. బాలసాహిత్యంలో అవకాశం ఉందనిపించటంతో అప్పట్నుంచి పిల్లలకోసం అంకితమయ్యాను..’ అంటారు అజాద్. విజయవాడ నుంచి వెలువడే ‘స్వాతి’ మాసపత్రికలో అవకాశమిచ్చారు. ‘మా హృదయం’ పేరుతో పదేళ్లలోపు పిల్లలకు అమ్మ, నాన్నతో మొదలుకొని వారికి సంబంధించిన మొత్తం 50 అంశాలను వారి భాషలో రాసిన సీరియల్కు కూడా మంచి గుర్తింపు లభించింది. స్వాతి మాసపత్రికల్లో ఆ సీరియల్ ఆఖరిది. అప్పట్నుంచి రచనలు వేగం పుంజుకున్నాయి. కట్చేస్తే.. ఇప్పటికి 85 నవలలు, 17 నవలికలు, 850కి పైగా కథలు రాశారు. కమ్యూనిస్టు నేపథ్యం కావటంతో సీరియస్ సాహిత్యమే చేశానంటారు అజాద్. సామాజిక అంశాలకు సంబంధించిన ఏదో ఒక సమస్యను చర్చించినవే అన్నీ. వందకుపైగా కథలు, 30కి పైగా నవలలు వివిధ బహుమతులు గెల్చుకున్నాయి. తెలిమబ్బుల ఛాయ, మనోప్రస్థానం, నగరంలో వెన్నెల నవలలకు వరుసగా మూడేళ్లు ఆటా, తానా బహుమతులు లభించాయి. విపరీత వ్యక్తులు, అహానికి రంగుండదు, ముక్తిపర్వం, దేవుడొచ్చాడు నవలలు కూడా గుర్తింపు పొందాయి. పిల్లల ప్రపంచం, నాన్నకో ఉత్తరం, మూడ్స్, ఎక్స్ప్రెషన్స్, ఇంప్రెషన్స్ పేరుతో దినపత్రికల్లో రాసిన కాలమ్స్ ప్రజాదరణ పొందాయి. గతంలో ఆంధ్రభూమి దినపత్రికలో వచ్చిన ‘నగరంలో వెన్నెల’ ఇప్పుడో సాహిత్య మాసపత్రికల్లో సీరియల్గా ఆరంభమైందని తెలిపారు అజాద్. ఆకర్షించిన బుల్లితెర మరోవైపు బుల్లితెర రంగం కూడా అజాద్ను ఆకర్షించింది. దూరదర్శన్లో ‘జీవనతీరాలు’ సీరియల్తో ఆరంభించి, రాధామధు, లయ, అడగక ఇచ్చిన మనసు, ఎదురీత సీరియల్స్తో మొత్తం ఐదువేల ఎపిసోడ్లకు రచనా సహకారం అందించారు. సామాజిక, మానవ భావోద్వేగాలకు సంబంధించిన అన్నిరకాల సమస్యలను చర్చించారు. అజాద్ రచనా సహకారం అందించిన పాండవులు, అడవిపూలు, బోన్సాయ్, తమసోమా టెలీఫిలింస్కు మూడు స్వర్ణాలు, వెండి నంది వచ్చాయి. అడవిపూలు టెలీఫిలింకు కథ, స్క్రీన్ప్లే, సంభాషణలకుగాను వ్యక్తిగతంగా నంది బహుమతిని స్వీకరించారు. సరదా కోసం కొన్ని టెలీఫిలింస్, టీవీ సీరియల్స్లోను ఆయన నటించారు. ఉపాధికోసం గుంటూరు, ఒంగోలు, ఏలూరు, రాజమండ్రిలో ఉన్నపుడు కొన్ని సాంస్కృతిక సంస్థల నిర్వహణలోను పనిచేసిన ఆయన ప్రస్తుతం హైదరాబాద్లో స్థిరపడ్డారు. -
రేపు కేంద్రమంత్రులుగా కిషన్రెడ్డి, సంజయ్ బాధ్యతలు
సాక్షి, న్యూఢిల్లీ: తెలుగు రాష్ట్రాలకు చెందిన కేంద్రమంత్రుల బాధ్యతల స్వీకారానికి ముహూర్తాలు ఖరారయ్యాయి. ఈనెల 13న ఉదయం 11 గంటల కు జి.కిషన్రెడ్డి కేంద్ర బొగ్గు, గనుల శాఖమంత్రి గా శాస్త్రి భవన్లోని ఆ శాఖ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించనున్నారు. కేంద్ర హోంశాఖ సహా య మంత్రిగా బండి సంజయ్ నార్త్ బ్లాక్లోని తన చాంబర్లో బాధ్యతలు స్వీకరించనున్నారు.తెలుగు రాష్ట్రాలకు చెందిన కేంద్రమంత్రులు సీఎంగా చంద్రబాబునాయుడు ప్రమాణ స్వీకారం తర్వాత బాధ్యతలు స్వీకరించే అవకాశముంది. కేంద్ర పౌర విమానయానశాఖ మంత్రిగా రామ్మోహన్ నాయు డు, కేంద్ర సహాయ మంత్రులు పెమ్మసాని చంద్రశేఖర్ గురువారం లేదా శుక్రవారం, శ్రీనివాస వర్మ శుక్రవారం బాధ్యతలు స్వీకరించనున్నారు. -
కేంద్ర కేబినెట్లోకి రామ్మోహన్నాయుడు?
సాక్షి, అమరావతి: శ్రీకాకుళం ఎంపీ కింజరపు రామ్మోహన్నాయుడుకి కేంద్ర మంత్రివర్గంలో చోటు దక్కినట్లు తెలిసింది. ప్రధాని మోదీ మంత్రివర్గంలో ఆయనను కేబినెట్ హోదాలో తీసుకోనున్నట్లు సమాచారం. ఎన్డీయే మంత్రివర్గంలో టీడీపీకి మూడు కేంద్ర మంత్రి పదవులు ఇవ్వడానికి బీజేపీ అంగీకరించినట్లు ప్రచారం జరుగుతోంది. వాటిలో ఒకటి కేబినెట్ మంత్రి హోదాతో కాగా మరో రెండు సహాయ మంత్రి పదవులను ఇస్తామని చెప్పగా అందుకు చంద్రబాబు అంగీకరించినట్లు టీడీపీ వర్గాలు తెలిపాయి. కేబినెట్ హోదా మంత్రి పదవికి రామ్మోహన్ నాయుడు పేరును చంద్రబాబు ఖరారు చేసినట్లు చెబుతున్నారు. అలాగే, సహాయ మంత్రి పదవులకు గుంటూరు, నెల్లూరు ఎంపీలు పెమ్మసాని చంద్రశేఖర్, వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డిల పేర్లను ఆయన ఖరారు చేసినట్లు సమాచారం. ప్రధానమంత్రితో పాటు వీరు ముగ్గురూ ఆదివారం మంత్రులుగా ప్రమాణం చేస్తారని టీడీపీ నేతలు చెబుతున్నారు. చంద్రబాబు కుటుంబానికి అత్యంత సన్నిహితుడుగా, మూడుసార్లు ఎంపీగా గెలిచిన రామ్మోహన్నాయుడుకి ఈసారి కేంద్రమంత్రి పదవి ఖాయమని ముందు నుంచి ప్రచారం జరుగుతోంది. జనసేన–బీజేపీకి ఒకటి..జనసేన, బీజేపీల నుంచి కూడా ఒకరికి కేంద్ర సహాయ మంత్రి పదవి దక్కే అవకాశమున్నట్లు తెలుస్తోంది. జనసేనకు మంత్రి పదవి ఇస్తే మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరికి అవకాశం ఉండవచ్చని చెబుతున్నారు. అలాగే, బీజేపీ తరఫున అయితే సీఎం రమేష్ లేదా పురందేశ్వరిలో ఒకరికి ఛాన్స్ ఉండవచ్చని చెబుతున్నారు. -
కష్టాలను అధిగమించి ప్రత్యర్థితో పోరాడి గెలిచిన తాటిపర్తి
యర్రగొండపాలెం: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి 15 సంవత్సరాలుగా నిజాయతీగల కార్యకర్తగా పనిచేసిన తాటిపర్తి చంద్రశేఖర్కు ఫలితం దక్కింది. మంగళవారం జరిగిన కౌంటింగ్లో ఎమ్మెల్యేగా ఆయన ఘన విజయం సాధించారు. సింగరాయకొండలో సామాన్య కార్యకర్తగా పనిచేస్తున్న ఆయనను గుర్తించిన ఆ పార్టీ అధినేత వై.ఎస్.జగన్మోహన్రెడ్డి యర్రగొండపాలెం(ఎస్సీ) టికెట్ ఇచ్చి గౌరవించారు. ఆ గౌరవాన్ని నిలుపుకోవటానికి నియోజకవర్గానికి కొత్త అభ్యర్థి అయినా గ్రామ స్థాయి కార్యకర్త నుంచి మండల స్థాయి నాయకుల వరకు ఆయన కలుపుకొనిపోయారు. నాయకుల మధ్య ఉన్న వర్గ విభేదాలను ఆయన ఎంతో సహనంతో పరిష్కరించగలిగారు. అందరినీ సమన్వయ పరచడంలో ఆయన అనేక కష్టాలను ఎదుర్కోవలసి వచ్చింది. అనతి కాలంలోనే నియోజకవర్గంలో ఉన్న సమస్యలను తెలుసుకొని ఒక్కొక్కటిగా పరిష్కరిస్తూ వచ్చారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఎదుర్కొంటున్న నీటి సమస్యను వెనువెంటనే పరిష్కరించగలిగారు. అస్తవ్యస్తంగా ఉన్న రోడ్లను తన సొంత నిధులతో మరమ్మతులు చేయించి ఆయా ప్రాంత ప్రజల మన్ననలు పొందారు. ప్రత్యర్థి టీడీపీ వర్గానికి చెందిన వారు అడుగడుగునా పెట్టిన కష్టాలను ఎదుర్కొంటూ ఆయన ఎన్నికల్లో ముందుకు సాగారు. ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైనప్పటి నుంచి టీడీపీ నేతలు వైఎస్సార్ సీపీ చేస్తున్న కార్యక్రమాలకు అభ్యంతరం చెప్తూ ఆర్వోకు ఫిర్యాదు చేయడం, కేసులు నమోదు చేయించడం లాంటి కష్టాలను సైతం అధిగమించి ప్రత్యర్థితో పోరాడిన ఆయనను నియోజకవర్గ ప్రజలు 5,477 ఓట్ల మెజార్టీతో గెలిపించారు. తన స్వగ్రామమైన సింగరాయకొండలో చేసిన స్వచ్ఛంద సేవలు ఈ ఎన్నికల్లో బాగా పనిచేశాయని చెప్పవచ్చు. తాటిపర్తి చంద్రశేఖర్ వదిన, జిల్లా సర్పంచ్ల సంఘం అధ్యక్షురాలు వనజ, ఆయన భార్య భాగ్యసీమ చౌదరి, కుమార్తె ఆకాంక్ష ఇంటింటికీ తిరిగి చేసిన ప్రచారం నియోజకవర్గ ప్రజలు గుర్తించి వారికి తగిన ఫలితాన్ని అందించారు. వైఎస్సార్ సీపీకి చెందిన ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, బూత్ కన్వీనర్లు, సచివాలయాల కన్వీనర్లు ఈ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థిని గెలిపించుకోవటానికి తమ స్థాయికి మించి కష్టపడ్డారని చెప్పవచ్చు. -
విషాదం, కన్నీరు.. అనారోగ్యం
శివమొగ్గ: అవినీతిని నిరసిస్తూ ఆత్మహత్య చేసుకున్న వాల్మీకి అభివృద్ధి పాలక మండలి అధికారి చంద్రశేఖర్ భార్య కవిత శనివారం అస్వస్థతకు గురయ్యారు. ఆమెను స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. వాంతులు అవుతూ నీరసంగా ఉండడంతో కవితాను ఆటోలో ఆమె కుమారుడు ఆస్పత్రికి తరలించాడు. చంద్రశేఖర్ ఆకస్మిక మరణంతో ఆమె తీవ్ర ఆవేదనలో ఉండిపోయింది. పదే పదే భర్తను తలుచుకుంటూ విలపిస్తోంది. సరిగ్గా భోజనం చేయలేదని, దీంతో అనారోగ్యం బారిన పడ్డారని కుటుంబ సభ్యులు తెలిపారు. పరామర్శల వెల్లువ మరోవైపు అధికారి ఆత్మహత్య నేపథ్యంలో పలువురు ముఖ్య నేతలు, నాయకులు చంద్రశేఖర్ ఇంటికి వచ్చి తమ సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల కోడ్ నేపథ్యంలో ఇప్పటివరకు మృతుని కుటుంబానికి ఎలాంటి పరిహారం అందించలేదు. ఎంతో మంది నేతలు ఇంటికి వచ్చి తమ సంతాపాన్ని తెలిపి రిక్త హస్తాలతో తిరిగి వెళుతున్నారు. మాజీ మంత్రి కేఎస్ ఈశ్వరప్ప మూడు లక్షల రూపాయలను ఆర్థిక సాయంగా మృతుని కుటుంబానికి అందించారు. -
RR vs RCB: ఎలిమినేట్ అయ్యేది ఎవరు?
-
Qualifier 1: సన్రైజర్స్ విఫలం.. ఫైనల్ చేరిన కేకేఆర్
-
కాళేశ్వరానికి ‘అత్యవసర’ గడువు మించిపోతోంది!
సాక్షి, హైదరాబాద్: మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు మరింత నష్టం జరగకుండా వానాకాలానికి ముందే తీసుకోవాల్సిన నివారణ చర్యలపై సత్వరమే సిఫారసు చేయాలని చంద్రశేఖర్ అయ్యర్ నేతృత్వంలోని నిపుణుల కమిటీకి రాష్ట్ర నీటిపారుదల శాఖ విజ్ఞప్తి చేసింది. వర్షాకాలం ప్రారంభానికి ముందు చేపట్టాల్సిన పనులకు చాలా తక్కువ సమయం మిగిలి ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. ఈ మేరకు రాష్ట్ర నీటిపారుదల శాఖ ఈఎన్సీ జి.అనీల్కుమార్ ఇటీవల అయ్యర్ కమిటీకి లేఖ రాశారు. ఈ నెల ముగిశాక ఎప్పుడైనా వానాకాలం ప్రారంభం కావచ్చని, ఆలోగా అత్యవసర మరమ్మతులు నిర్వహించాల్సి ఉందని పేర్కొన్నారు. నిపుణుల కమిటీ విజ్ఞప్తి మేరకు ఇప్పటికే మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు సంబందించిన ప్రాథమిక సమాచారంతోపాటు మేడిగడ్డ బ్యారేజీలోని 6, 7, 8వ బ్లాకులకు నిర్వహించిన ఎలక్ట్రికల్ రెసిస్టివిటీ టోమోగ్రఫీ (ఈఆర్టీ), గ్రౌండ్ పెనెట్రేటింగ్ రాడార్ (జీపీఆర్) పరీక్షల నివేదికలను సమరి్పంచామని ఈ ఖలో గుర్తుచేశారు. బ్యారేజీల డిజైన్లు, నిర్మాణంలో లోపాలపై అధ్యయనం చేసి వాటి పునరుద్ధరణకు తీసుకోవాల్సిన చర్యలను సిఫారసు చేయడానికి కేంద్ర జలసంఘం మాజీ చైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్ నేతృత్వంలో ఒక కమిటీని నేషనల్ డ్యామ్ సేఫ్టీ ఆథారిటీ ఏర్పాటు చేయడం తెలిసిందే. ఆ కమిటీ ఇప్పటికే రెండుసార్లు రాష్ట్రంలో పర్యటించి వివరాలు సేకరించింది. కమిటీ మధ్యంతర నివేదిక కోసం గత నెల రోజులుగా నీటిపారుదల శాఖ నిరీక్షిస్తోంది. ఎన్నికల ఫలితాలొచ్చాకే మధ్యంతర నివేదిక? సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వచ్చాకే అయ్యర్ కమిటీ మరమ్మతులపై మధ్యంతర నివేదిక ఇచ్చే అవకాశముందని నీటిపారుదల శాఖలో ఉన్నత స్థాయి అధికార వర్గాలు భావిస్తున్నాయి. ఆలోగా వర్షాకాలం మొదలవుతుందని.. దీనివల్ల బ్యారేజీలకు అత్యవసర మరమ్మతులు చేపట్టడానికి వీలుండదని ఆందోళన వ్యక్తమవుతోంది. రాష్ట్ర ప్రభుత్వం అనుమతిస్తే బ్యారేజీలకు అత్యవసరంగా గ్రౌంటింగ్ వంటి పనులను పూర్తి చేయాలని అధికారులు భావిస్తున్నారు. మరోవైపు అయ్యర్ సిఫారసులు వచ్చాకే మరమ్మతులు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించడంతో నీటిపారుదల శాఖలో ఆందోళన వ్యక్తమవుతోంది. -
లక్నో హ్యాట్రిక్ విక్టరీ.. టైటాన్స్ తప్పని పరాభవం
-
IPL 2024: ముంబై గెలుపు బోణీ.. పాండ్యా ముఖంలో నవ్వు
-
ముమ్మరంగా వైఎస్ఆర్సీపీ ఎన్నికల ప్రచారం
-
మేడిగడ్డ డిజైన్లలో వైరుధ్యాలెందుకు?
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టులోని అన్నారం, సుందిళ్ల బ్యారేజీలతో పోల్చితే మేడిగడ్డ బ్యారేజీ నిర్మిత స్థలంతోపాటు ర్యాఫ్ట్–ఎగువ/దిగువ కాటాఫ్ వాల్స్ మధ్య జాయింట్లకు సంబంధించిన డిజైన్లలో వైరుధ్యాలు ఎందుకు ఉన్నాయని నీటిపారుదల శాఖలో కీలకమైన సెంట్రల్ డిజైన్స్ ఆర్గనైజేషన్ (సీడీవో)ను చంద్రశేఖర్ అయ్యర్ నేతృత్వంలోని నిపుణుల కమిటీ ప్రశ్నించింది. ఈ విషయంలో సీడీవో తీసుకున్న అంతర్గత నిర్ణయాలకు సంబంధించిన నోట్స్ను అందించాలని కోరింది. ‘‘కాఫర్ డ్యామ్ నిర్మాణంలో భాగంగా నది గర్భంలో పాతిన షీట్పైల్స్ను మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణం పూర్తయిన తర్వాత పూర్తిగా తొలగించారా? లేదా? కుంగిపోయిన ఏడో బ్లాక్ పునాదులకు ఎదురుగా కొంతభాగంలో షీట్పైల్స్ను అలానే వదిలేశారా? అక్కడ భూమి కోతకు గురికావడానికి ఇదే కారణమా?’’ అని నిలదీసింది. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ) కాళేశ్వరం ప్రాజెక్టు బ్యారేజీల్లోని లోపాలపై అధ్యయనం జరిపి, పరిష్కారాలను సూచించడానికి కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) చైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్ నేతృత్వంలో నిపుణుల కమిటీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఇటీవల రాష్ట్రంలో రెండోసారి పర్యటించిన కమిటీ.. 52 ప్రశ్నలతో సీడీవో విభాగానికి ప్రశ్నావళి అందించి, త్వరగా బదులివ్వాలని కోరింది. ర్యాఫ్ట్, సెకెంట్ పైల్స్ మధ్య జాయింట్లపై ఫోకస్ మేడిగడ్డ బ్యారేజీల పునాది (ర్యాఫ్ట్), సెకెంట్ పైల్స్ మధ్య జాయింట్లకు సంబంధించిన డిజైన్లు, నిర్మాణంపై అయ్యర్ కమిటీ ప్రధాన దృష్టిసారించింది. బ్యారేజీల్లో లోపాలకు ఇవి కూడా ముఖ్యకారణం కావచ్చన్న చర్చ ఉంది. అన్నారం, సుందిళ్ల బ్యారేజీల ఎగువ/దిగువ కాటాఫ్లు–ర్యాఫ్ట్ల మధ్య జాయింట్లకు సంబంధించిన డిజైన్లు, డ్రాయింగ్స్ను అందించాలని సీడీవోను కమిటీ కోరింది. ‘‘జాయింట్లలో లాకింగ్ ఏర్పాట్లున్నాయా? బ్యారేజీలకు రక్షణ కల్పించాల్సిన అప్రాన్ దెబ్బతిని ర్యాఫ్ట్ కుంగిపోతే, సెకెంట్ పైల్స్–ర్యాఫ్ట్ మధ్య జాయింట్లు విరిగిపోవా? మేడిగడ్డ బ్యారేజీ ర్యాఫ్ట్ 2.5 మీటర్ల మందం ఉంటే.. ర్యాఫ్ట్–సెకెంట్ పైల్స్ మధ్య జాయింట్గా వేసిన శ్లాబు మందం 1.5 మీటర్లు మాత్రమే ఉంది. నీటి ఒత్తిడిని జాయింట్ ఎలా తట్టుకుంటుంది?.’’ అని ప్రశ్నించింది. దృఢమైన రాతిపై కటాఫ్వాల్స్ను నిర్మిస్తే.. ర్యాఫ్ట్ కుంగిపోయేందుకు ఉన్న అవకాశాలను ఊహించలేదా? అని అడిగింది. బ్యారేజీలను తేలియాడే కట్టడాలుగా డిజైన్ చేశారా? స్థిరంగా ఉండేలా చేశారా అని ప్రశ్నించింది. సీడీవోలో ఎవరేం చేస్తారు? సీడీవోలో చీఫ్ ఇంజనీర్ నుంచి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ స్థాయి వరకు అధికారాల శ్రేణి, బాధ్యతలను, విభాగం నిర్మాణ క్రమాన్ని తెలపాలని కమిటీ కోరింది. కాళేశ్వరం ప్రాజెక్టు డీపీఆర్ రూపకల్పనలో సీడీవో పాత్ర, ఇతర వివరాలు ఇవ్వాలని అడిగింది. ‘‘బ్యారేజీలకు పరీక్షలను సంతృప్తికర స్థాయిలో జరిపారా? మార్గదర్శకాలకు అనుగుణంగా ఇన్వెస్టిగేషన్లు చేశారా? లోటుపాట్లు ఏమైనా గుర్తించారా?’’ అని ప్రశ్నించింది. డీపీఆర్, ఆ తర్వాత నిర్మాణ దశల్లో ప్రతి బ్యారేజీ విషయంలో నిర్వహించిన సబ్ సర్ఫేస్ జియోలాజికల్/జియో టెక్నికల్ ఇన్వెస్టిగేషన్ల వివరాలను అందించాలని కోరింది. డిజైన్ ఉల్లంఘనలేమిటి ? సీడీవో కన్స్ట్రక్షన్ డ్రాయింగ్స్ను ఉల్లంఘించి ప్రాజెక్టు నిర్మాణ విభాగం జరిపిన నిర్మాణాలేమిటో తెలపాలని నిపుణుల కమిటీ కోరింది. లేఖలు/ సవరణ డ్రాయింగ్స్ ద్వారా ఆ ఉల్లంఘనలకు తర్వాతి కాలంలో అనుమతి ఇచ్చారా? ఇస్తే ఆ సవరణ డ్రాయింగ్స్ జాబితా ఇవ్వండి అని అడిగింది. ‘‘సీడీవో కన్స్ట్రక్షన్ డ్రాయింగ్స్ జారీ చేయడానికి ముందే నిర్మాణ సంస్థలు పనులు ప్రారంభించాయా? దీనివల్ల గత్యంతరం లేని పరిస్థితుల్లో డ్రాయింగ్స్ను మళ్లీ సవరించాలనే ఒత్తిడిని సీడీవో ఎదుర్కోవాల్సి వచ్చిందా? బ్యారేజీల నిర్మాణానికి పరిశీలించిన ప్రత్యామ్నాయ స్థలాలేవి? ఏ ప్రాతిపదికన ఎంపిక చేశారు’’ అని ప్రశ్నించింది. బ్యారేజీల గేట్ల నుంచి విడుదలయ్యే వరదతో దిగువన భూమి కోతకు గురవకుండా తగిన మోతాదులో నీరుండేలా టెయిల్ పాండ్ను డిజైన్ చేశారా అని.. నిబంధనల ప్రకారమే గేట్లను ఆపరేట్ చేశారా? వివరాలు ఇవ్వాలని కోరింది. -
విరాట్ విజృభించేనా..ఆ జట్టుకే విజయావకాశాలు
-
ప్రమాద సంకేతాల విస్మరణతోనే నష్టమా?
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు 2019 వానాకాలం తర్వాత ప్రమాద సంకేతాలు ఇచ్చినా.. నివారణ చర్యలు తీసుకోకపోవడంతోనే నష్టాన్ని పెంచిందా? అని కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) మాజీ చైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్ నేతృత్వంలోని నిపుణుల కమిటీ నీటి పారుదల శాఖను ప్రశ్నించింది. మూడు బ్యారేజీలను ప్రారంభించిన కొద్దిరోజులకే వాటి దిగువన రక్షణ కోసం ఏర్పాటు చేసిన ప్లింత్ శ్లాబు, సీసీ బ్లాకులు, టోయ్ వాల్, లాంచింగ్ అప్రాన్ వంటివి ఎందుకు కొట్టుకుపోయాయని నిలదీసింది. ఇటీవల మూడు రోజుల పాటు రాష్ట్రంలో పర్యటించిన అయ్యర్ కమిటీ.. నీటి పారుదలశాఖలోని అన్ని విభాగాలతో విస్తృత స్థాయి సమావేశాలు నిర్వహించింది. తిరిగి వెళ్లేప్పుడు ఒక ప్రశ్నావళిని అందించి, సీల్డ్ కవర్లో సమాధానాలు అందజేయాలని కోరింది. ప్రమాదం పొంచి ఉంటే ఏం చేశారు? బ్యారేజీలకు ప్రమాదాలు పొంచి ఉన్నట్టు/నష్టాలు జరిగినట్టు గుర్తించిన సమాచారాన్ని వరుస క్రమంలో తెలుపుతూ సమగ్ర నివేదిక సమర్పించాలని అయ్యర్ కమిటీ కోరింది. ‘‘ప్రమాదాలు పొంచి ఉన్నట్టు గుర్తించినప్పుడు తీసుకున్న చర్యలేమిటి? నిర్మాణ సంస్థలకు జారీచేసిన ఆదేశాలేమిటి? తక్షణమే నిర్మాణ సంస్థలు మరమ్మతులు నిర్వహించాయా? వంటి వివరాలు నివేదికలో ఉండాలి. ముందు జాగ్రత్త చర్యలేమైనా తీసుకుని ఉంటే తెలపాలి. తీసుకోకపోతే కారణాలు వెల్లడించాలి. బ్యారేజీలలో ఏదైనా అసాధారణ మార్పును గుర్తించిన సందర్భాల్లో పరికరాల డేటా నమోదు, విశ్లేషణ, అన్వయింపు(డేటా ఇంటర్ప్రిటేషన్), వాటి ఆధారంగా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసే విభాగం ఏదీ? దీనికోసం ఎలాంటి ప్రొటోకాల్స్ను అనుసరిస్తున్నారు?’’ అని ప్రశ్నించింది. జరిగిన తప్పులేమిటి? చేసింది ఎవరు? నీటి పారుదల శాఖలోని వివిధ విభాగాల పనితీరు, సమన్వయా న్ని అర్థం చేసుకోవడానికి శాఖ మౌలిక స్వరూపం వివరాలును అయ్యర్ కమిటీ కోరింది. బ్యారేజీల నిర్మాణంలో జరిగిన లోటుపాట్లకు బాధ్యులను తేల్చడానికి ఈ సమాచారం కీలకమని పే ర్కొంది. శాఖలోని అన్ని విభాగాల ఈఎన్సీల నుంచి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ స్థాయి వరకు ఉన్న అధికారుల క్రమాన్ని తెలిపేలా శాఖ ఆర్గనైజేషన్ చార్ట్ను సమరి్పంచాలని కమిటీ కోరింది. ‘‘ఈఎన్సీ (జనరల్), హైడ్రాలజీ అండ్ ఇన్వెస్టిగేషన్, సీడీఓ, ప్రాజెక్ట్ కన్స్ట్రక్షన్, క్వాలిటీ కంట్రోల్ అండ్ ఇన్స్పెక్షన్, ఓ అండ్ ఎం, ఇతర విభాగాల బాధ్యతలు, విధులు వివరించండి. బ్యారేజీల నిర్మాణంలో కీలకంగా వ్యవహరించిన సెంట్రల్ డిజైన్స్ ఆర్గనైజేషన్ (సీడీఓ) చీఫ్ ఇంజనీర్, రామగుండం చీఫ్ ఇంజనీర్, క్వాలిటీ కంట్రోల్ అండ్ ఇన్స్పెక్షన్ విభాగం చీఫ్ ఇంజనీర్, ఈఎన్సీ (ఓఅండ్ఎం)లు తమపై అధికారిగా ఎవరికి రిపోర్ట్ చేస్తారు?’’ అని ప్రశ్నించింది. సీడీఓ, క్వాలిటీ సలహాలను పాటించారా? ‘‘సీడీఓ, క్వాలిటీ కంట్రోల్ అండ్ ఇన్స్పెక్షన్ విభాగాలు ఇచ్చే సలహాలు/ఆదేశాలకు ప్రాజెక్టుల కన్స్ట్రక్షన్ విభాగం కట్టుబడి ఉంటుందా? బ్యారేజీల గేట్లను ఎత్తే సమయం (ఆపరేషన్ షెడ్యూలింగ్)ను నిర్ణయించడంలో బాధ్యులు ఎవరు? ఈ విషయంలో సీడీఓ/ తెలంగాణ స్టేట్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ల్యాబ్(టీఎస్ఈఆర్ఎల్)ల సలహాను ఏమైనా ఉల్లంఘించారా?’’ అని కమిటీ ప్రశ్నించింది. ప్రాజెక్టు డీపీఆర్ను కేంద్ర జల సంఘాని (సీడబ్ల్యూసీ)కి సమరి్పంచడానికి ముందు దాని రూపకల్పన సీడబ్ల్యూసీ మార్గదర్శకాలకు అనుగుణంగా జరిగేలా పర్యవేక్షణ చేసే విభాగం ఏది? దానికోసం నీటిపారుదల శాఖలో ఎలాంటి ప్రొటోకాల్స్ ఉన్నాయో తెలపాలని కోరింది. బ్యారేజీలు నీటి మళ్లింపు కోసమా? నిల్వ కోసమా? మూడు బ్యారేజీలను నీటి నిల్వ అవసరాలను దృష్టిలో పెట్టుకుని డిజైన్, నిర్మాణం చేశారా? లేక నీటి మళ్లింపు అవసరాలను దృష్టిలో పెట్టుకుని జరిపారా? అని అయ్యర్ కమిటీ ప్రశ్నించింది. బ్యారేజీలను ప్రారంభించిన నాటి నుంచి నిల్వ స్థాయిలను నెలవారీగా తెలియజేసే నివేదికను సమరి్పంచాలని కోరింది. బ్యారేజీలకు తనిఖీలు, మరమ్మతులు, నిర్వహణ పనుల కోసం ఎప్పుడైనా నిల్వలను తగ్గించారా? చేస్తే వివరాలు అందించాలని సూచించింది. బ్యారేజీల నిర్మాణ ప్రారంభం, ముగింపు తేదీలను అందించాలని.. డీపీఆర్ల ప్రకారం బ్యారేజీల విశిష్టతల(సేలియంట్ ఫీచర్స్)ను తెలిపాలని పేర్కొంది. నిర్మాణంలో ఈ విశిష్టతలను పాటించారా? అని ప్రశ్నించింది. బ్యారేజీల నిర్మాణానికి అనుమతిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవోలను సమరి్పంచాలని కోరింది. సీడబ్ల్యూసీ అభ్యంతరాలను పరిష్కరించారా? డీపీఆర్ మదింపు సందర్భంగా సీడబ్ల్యూసీలోని వివిధ డైరెక్టరేట్లు వ్యక్తం చేసిన అభ్యంతరాలు ఏమిటి? సీఎస్ఎంఆర్ఎస్, జీఎస్ఐ, సీజీడబ్ల్యూబీ వంటి ఇతర సంస్థల కామెంట్లు/ అబ్జర్వేషన్లు ఏమిటి? వాటిని తగిన రీతిలో పరిష్కరించారా? అని అయ్యర్ కమిటీ కోరింది. నిర్మాణ దశ డిజైన్లు ఎవరివి? నిర్మాణ దశలో మూడు బ్యారేజీల డిజైన్లు, బ్యారేజీల వివిధ విభాగాల డ్రాయింగ్స్ను రూపొందించింది ఎవరని కమిటీ ప్రశ్నించింది. బ్యారేజీల నిర్మాణానికి ప్రత్యామ్నాయ ప్రాంతాల ఎంపిక కోసం జరిపిన అధ్యయనాలు, ప్రస్తుత ప్రాంతాల ఎంపికను సమర్థించే కారణాలు, బ్యా రేజీల కింద భూగర్భంలో నీటి ప్ర వాహంపై చేసిన అంచనాల వివరాలను ఇవ్వాలని కోరింది. లోపాలు బహిర్గతమైన తర్వాత బ్యారేజీలకు ని ర్వహించిన సబ్సర్ఫేస్ జియోలాజికల్ పరీక్షల నివేదికలు సమరి్పంచాలని సూచించింది. లోపాలు, పునరుద్ధరణ పనులపై మీ అభిప్రాయమేంటి? ‘‘మేడిగడ్డ బ్యారేజీ ర్యాఫ్ట్, పియర్లు కుంగిపోవడానికి కారణాలేమిటి? బ్యారేజీల పునాదుల కింద ఇసుక కొట్టుకుపోయి సీపేజీ జరగడానికి కారణాలేమిటి? వచ్చే వర్షాకాలంలో బ్యారేజీలకు మరింత నష్టం జరగకుండా రక్షించడానికి తీసుకోవాల్సిన చర్యలు ఏమిటో వివరించండి’’ అని నీటి పారుదల శాఖను అయ్యర్ కమిటీ కోరింది. ఈ ప్రశ్నావళి మేరకు తగిన సమాధానాలను సిద్ధం చేస్తున్నట్టు నీటిపారుదల శాఖ వర్గాలు వెల్లడించాయి. -
బ్యారేజీల వైఫల్యం తర్వాత చేసిందేంటి?
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోవడం, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల్లో సీపేజీలు ఏర్పడిన తర్వాత డ్యామ్ సేఫ్టీ యాక్ట్ ప్రకారం తీసుకున్న చర్యలేంటి? ఏమైనా కమిటీలు వేసి, విచారణ జరిపారా? వైఫల్యానికి కారణాలను నిర్ధారించారా?.. అని స్టేట్ డ్యామ్ సేఫ్టీ ఆర్గనైజేషన్ (ఎస్డీఎస్ఓ)ను చంద్రశేఖర్ అయ్యర్ నేతృత్వంలోని నిపుణుల కమిటీ ప్రశ్నించింది. మూడు రోజుల రాష్ట్ర పర్యటనలో భాగంగా చివరి రోజు శుక్రవారం నిపుణుల కమిటీ ఎస్డీఎస్ఓ, ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ (ఓ అండ్ ఎం) అధికారులతో సమావేశమై బ్యారేజీల రక్షణకు తీసుకున్న చర్యలపై ఆరా తీసింది. 2024 ముగిసే వరకు బ్యారేజీల నిర్వహణ నిర్మాణ సంస్థల చేతుల్లోనే ఉండటంతో వార్షిక మరమ్మతులపై ఎలాంటి నివేదికలు తమకు అందలేదని, బ్యారేజీల్లో లోపాలు ఉన్నట్లు క్షేత్రస్థాయి సిబ్బందీ నివేదించలేదని అధికారులు బదులిచ్చినట్టు తెలిసింది. బ్యారేజీల నిర్మాణంలో పాలుపంచుకున్న అధికారులను కమిటీ ప్రశ్నించింది. డిజైన్లు, డ్రాయింగ్స్ను అనుసరించి పనులు చేశారా? మధ్యలో ఏమైనా మార్పులు చేశారా? అని కమిటీ అడగ్గా, డిజైన్ల ప్రకారమే నిర్మించినట్టు అధికారులు బదులిచ్చారు. బ్యారేజీల నిర్మాణం పూర్తయిన తర్వాత తొలి వరదలకే మూడు బ్యారేజీల కింద సీసీ బ్లాకులు కొట్టుకుపోయి అప్రాన్ దెబ్బతిన్నా నాణ్యత సర్టిఫికెట్లు ఎలా జారీ చేశారని కమిటీ ప్రశ్నించింది. ఐఎస్ కోడ్ ప్రకారమే నిర్మాణ పనులు జరిగినట్లు గుర్తించి, సర్టిఫికెట్లు ఇచ్చామని క్వాలిటీ కంట్రోల్ అధికారులు బదులిచ్చారు. కాగా, రాజేంద్రనగర్లోని తెలంగాణ ఇంజనీరింగ్ రీసెర్చ్ లేబొరేటరీని అయ్యర్ కమిటీ సందర్శించి కాళేశ్వరం బ్యారేజీలకు సంబంధించిన నమూనా బ్యారేజీల పనితీరును పరిశీలించింది. అత్యవసర రక్షణ చర్యలు సూచించండి వర్షాకాలం ప్రారంభానికి ముందే బ్యారేజీల రక్షణకు అత్యవసరంగా తీసుకోవాల్సిన చర్యలను సిఫారసు చేయాలని అయ్యర్ కమిటీకి రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా, ప్రత్యేక కార్యదర్శి ప్రశాంత్ జీవన్ పాటిల్, ఈఎన్సీ (జనరల్) జి.అనిల్ కుమార్ కమిటీతో సమావేశమై ఈ అంశంపై చర్చించారు. మంగళవారంలోగా తాము అడిగిన మొత్తం సమాచారాన్ని అందిస్తే అత్యవసర పనులను సిఫారసు చేస్తామని అయ్యర్ వారికి హామీ ఇచ్చారు. బ్యారేజీల రక్షణకు తీసుకోవాల్సిన అత్యవసర పనులను ఈఎన్సీ అనిల్కుమార్ కమిటీకి ప్రతిపాదించి అభిప్రాయాన్ని కోరగా, పరిశీలించి చెప్తామని కమిటీ బదులిచ్చింది. ఆ పనులు ఇలా ఉన్నాయి.. ► ఒరిజినల్ డిజైన్లకు అనుగు ణంగా బ్యారేజీలను పున రుద్ధరించేలా.. సంబంధిత ఇండియన్ స్టాండర్డ్ (ఐఎస్) కోడ్స్ ప్రకారం నిర్వహణ, పర్యవేక్షణ పనులను నిర్మాణ సంస్థలు చేపట్టాలి. ► బ్యారేజీల పునాదుల (ర్యాఫ్ట్) కింద ఇసుక కొట్టుకుపోయి ఏర్పడిన ఖాళీలను ప్రెజర్ గ్రౌటింగ్ ద్వారా భర్తీ చేసేందుకు తగిన పద్ధతులను అవలంబించాలి. ► బ్యారేజీలు పూర్తిగా నిండి ఉన్నప్పుడు గేట్లను తక్కువగా ఎత్తి స్వల్ప పరిమాణంలో నీళ్లను విడుదల చేసినప్పుడు తీవ్ర ఉధృతితో వరద బయటకు పొంగివస్తుంది. దీంతో బ్యారేజీల దిగువన భారీ రంధ్రాలు పడుతున్నాయి. ఇలా జరగకుండా స్వల్ప మోతాదుల్లో నీళ్లను విడుదల చేసేందుకు బ్యారేజీల్లో అనువైన చోట కొత్తగా రెగ్యులేటర్లను నిర్మించాలి. ► 3డీ మోడల్ స్టడీస్ ఆధారంగా బ్యారేజీల ఎగువన, దిగువన ప్రవాహాలకు అడ్డంగా ఉండే రాళ్లను తొలగించాలి. ► బ్యారేజీలకి ఎగువ, దిగువ న పేరుకుపోయిన ఇసుకను నీటిపారుదల శాఖ పర్యవేక్షణ లో శాస్త్రీయంగా తొలగించాలి. ► వానాకాలంలో గేట్లన్నీ తెరిచే ఉంచాలి. ► మేడిగడ్డ బ్యారేజీ 7వ బ్లాక్లో జామ్ అయిన గేట్లను తొలగించాలి. ఈ బ్లాక్కు స్టీల్ షీట్ పైల్స్ను అదనంగా ఏర్పాటు చేయాలి. సమాచారం అందిన తర్వాతే స్పష్టత: చంద్రశేఖర్ అయ్యర్ కాళేశ్వరం బ్యారేజీలపై లోతుగా అధ్యయనం చేయాల్సి ఉందని, అన్ని పత్రాలు పరిశీలించిన తర్వాతే బ్యారేజీల వైఫల్యాల పై ఒక అంచనాకు రాగలమని చంద్రశేఖర్ అయ్యర్ స్పష్టం చేశా రు. పర్యటన ముగి సిన తర్వాత ఆయన విలేకరులతో మాట్లాడారు. మరికొంత సమాచారాన్ని కోరామని, అందిన తర్వాతే స్పష్టత వస్తుందన్నారు. -
కలిసి పనిచేద్దాం..
సాక్షి, హైదరాబాద్: గూగుల్ సంస్థ రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పనిచేయడానికి సంసిద్ధత వ్యక్తం చేసింది. గూగుల్ వైస్ ప్రెసిడెంట్ చంద్రశేఖర్ తోట గురువారం సీఎం రేవంత్రెడ్డిని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఉన్న అవకాశాలపై చర్చించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రతి రంగాన్ని ప్రభావితం చేస్తోందని, రాష్ట్రం కోసం వ్యవసాయం, విద్య, ఆరోగ్యం వంటి రంగాలకు సంబంధించిన డిజిటలైజేషన్ ఎజెండాను అభివృద్ధి చేయడంలో భాగస్వాములు కావడానికి ఆసక్తిగా ఉన్నట్టు చెప్పారు. పౌరుల అవసరాలకు తగ్గట్టు నాణ్యమైన సేవలు అందించడానికి అవసరమైన సాంకేతికత, నైపుణ్యం తమ వద్ద ఉందని వివరించారు. రహదారుల భద్రత విషయంలో గూగుల్ మ్యాప్స్, గూగుల్ ఎర్త్ సేవలను వినియోగించేందుకు ఉన్న అవకాశాలపై కూడా చర్చించారు. ఈ సమావేశంలో మంత్రులు డి.శ్రీధర్బాబు, కోమటిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. సీఎంను కలిసిన అరుణ్తివారీ, చిన్నబాబు ‘వింగ్స్ ఆఫ్ ఫైర్’ పుస్తక రచయిత అరుణ్తివారీ, కేన్సర్ రోబోటిక్ సర్జన్ డాక్టర్ చిన్నబాబు సుంకవల్లి సీఎం రేవంత్రెడ్డిని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. సీఎంతో మైక్రాన్ ప్రెసిడెంట్, సీఈఓ భేటీ ప్రపంచంలోనే అతిపెద్ద మెమొరీ చిప్ల తయారీ కంపెనీ మైక్రాన్టెక్నాలజీ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొస్తే ప్రభుత్వం అన్నిరకాల సహకారాలు అందిస్తుందని సీఎం రేవంత్రెడ్డి స్పష్టం చేశారు. మైక్రాన్ కంపెనీ అధ్యక్షుడు, సీఈఓ సంజయ్ మెహ్రోత్రా గురువారం సచివాలయంలో సీఎం రేవంత్రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్రంలో పెట్టుబడులకు, పరిశ్రమల స్థాపనకు అనుకూలమైన వాతావరణం ఉందని ఆయన ఆనందం వ్యక్తం చేశారు. మైక్రాన్ టెక్నాలజీ సెమీ కండక్టర్ల తయారీ రంగంలో ప్రపంచంలోనే నాలుగో అతిపెద్ద కంపెనీ. -
ప్లాంట్–మ్యాన్ని ఆదరిస్తున్నందుకు థ్యాంక్స్
‘‘డైరెక్టర్గా ‘కాలింగ్ బెల్, రాక్షసి’ వంటి సినిమాలు తీశాను. నిర్మాతగా నేను చేసిన మొదటి సినిమా ‘ప్లాంట్–మ్యాన్’. మా చిత్రాన్ని ఇంత బాగా ఆదరిస్తున్న ప్రేక్షకులకు ధన్యవాదాలు. ఇలాంటి స్పందన వస్తే ఏడాదికి రెండు చిన్న సినిమాలు చేసి కొత్త వారిని పరిచయం చేయాలని ఉంది’’ అని నిర్మాత పన్నారాయల్ అన్నారు. చంద్రశేఖర్, సోనాలి జంటగా కె.సంతోష్బాబు దర్శకత్వం వహించిన చిత్రం ‘ప్లాంట్–మ్యాన్’. డీఎం యూనివర్సల్ స్టూడియోస్పై పన్నారాయల్ నిర్మించిన చిత్రం ‘ప్లాంట్–మ్యాన్’. ఇటీవల విడుదలైన ఈ సినిమా థ్యాంక్స్ మీట్లో కె.సంతోష్బాబు మాట్లాడుతూ–‘‘మా ‘ప్లాంట్–మ్యాన్’ సినిమాకి ఇంత పెద్ద విజయాన్ని అందించిన ప్రేక్షకులకు థ్యాంక్స్. నటీనటులు, సాంకేతిక నిపుణుల సహకారం వల్లే ఇంత మంచి సినిమా చేయగలిగాను’’ అన్నారు. ‘‘మా సినిమాని ఆదరిస్తున్న ప్రేక్షకులకు ధన్యవాదాలు. నాకు హీరోగా అవకాశం ఇచ్చిన పన్నాగారికి కృతజ్ఞతలు’’ అన్నారు చంద్రశేఖర్. ‘‘ఇలాంటి ఒక మంచి సినిమాలో భాగమైనందుకు సంతోషం’’ అన్నారు సోనాలి. -
మేయర్ ఫోన్ చేస్తే మాట్లాడవా? నా చాంబర్ ఎదుట30 నిమిషాలు నిల్చో!
ఎంజీఎం: ఎంజీఎం సూపరింటెండెంట్ డాక్టర్ చంద్రశేఖర్ తన తండ్రి వృత్తిని కించపరుస్తూ తనను డీఎంఓ వచ్చే వరకు 30 నిమిషాలు ఆయన చాంబర్ ఎదుట నిల్చోబెట్టాడని కాకతీయ మెడికల్ కాలేజీలో జనరల్ మెడిసిన్ విభాగంలో పీజీ రెండో సంవత్సరం చదువుతున్న డాక్టర్ వీర ప్రసాద్ ఆరోపించడం కలకలం రేపింది. మనస్తాపానికి గురైన ప్రసాద్ తన పీజీ సీటు వదిలేస్తానని లేఖ రాసి.. తనకు అవమానం జరిగిందంటూ జూడా ప్రతినిధు లకు ఫిర్యాదు చేశాడు. ఆ ఫిర్యాదు విషయం బుధవారం సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. సదరు లేఖ, ఫిర్యాదులోని వివరాల ప్రకారం..’’ ఈ నెల రెండో తేదీన వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో డ్యూటీలో ఉండగా ఓ రోగి ఛాతీనొప్పితో రావడంతో పరీక్షిస్తున్నాను. సరిగ్గా అదే సమయంలో అటెండర్ ఫోన్ తీసుకువచ్చి మేయర్ మాట్లాడాలనుకుంటున్నారు అని చెప్పగా.. రోగికి వైద్యం అందించగానే మాట్లాడతానని చెప్పాను. వెంటనే ఫోన్ తీసుకోలేదన్న కారణంగా సూపరింటెండెంట్ డాక్టర్ చంద్రశేఖర్.. నన్ను చాంబర్ దగ్గరికి పిలిపించాడు. నా తండ్రి వృత్తిని పేర్కొంటూ వ్యక్తిగతంగా కించపరిచాడు. డీఎంఓ వచ్చే వరకు 30 నిమిషాలు తన చాంబర్ ఎదుట నిలుచోబెట్టి తీవ్రంగా అవమాపరిచాడు’ అని ఆ లేఖ, ఫిర్యాదుల్లో పేర్కొన్నారు. ఈ పరిస్థితుల్లో ఇక్కడ చదవడంకంటే పీజీ సీటు వదిలేసుకోవడం ఉత్తమమని పేర్కొన్నాడు. ప్రజాప్రతినిధుల ఫోన్లకు స్పందించాలని చెప్పారంతే: ఆర్ఎంఓ శ్రీనివాస్ ఆర్ఎంఓ డాక్టర్ శ్రీనివాస్ ఈ ఘటనపై స్పందించారు. సదరు పీజీ వైద్యుడితో సూపరింటెండెంట్ దురుసుగా ప్రవర్తించలేదని, సాధారణంగా పీజీ విద్యార్థి ఏ స్థాయి నుంచి వచ్చారో అనే కోణంలో ప్రశ్నించారని తెలిపారు. చాంబర్ ముందు 30 నిమిషాలు ఉండమన్నందుకు సదరు విద్యార్థి మనస్తాపానికి గురైనట్లు తెలిపారు. ప్రభుత్వ ఆస్పత్రి కాబట్టి ప్రజాప్రతినిధుల ఫోన్లకు స్పందించాలని చెప్పారే తప్ప వ్యక్తిగతంగా దూషించలేదని వివరణ ఇచ్చారు. -
12 గంటల్లోనే తల్లిదండ్రుల చెంతకు..
తిరుపతి క్రైం: తిరుపతి ఆర్టీసీ బస్టాండ్లో తల్లిదండ్రుల పక్కన నిద్రిస్తున్న ఓ బాలుడు తెల్లవారుజామున కిడ్నాప్ కాగా... 12 గంటల్లోనే పోలీసులు ఈ కేసును ఛేదించి తిరిగి ఆ బాలుడిని తల్లిదండ్రులకు అప్పగించారు. ఈ కేసు వివరాలను మంగళవారం తిరుపతి జిల్లా ఎస్పీ పరమేశ్వర్రెడ్డి మీడియాకు వివరించారు. చెన్నైకి చెందిన చంద్రశేఖర్, మీనా దంపతులు తమ ఇద్దరు కుమారులతో కలిసి సోమవారం అర్ధరాత్రి తిరుపతి ఆర్టీసీ బస్టాండ్లోని చెన్నై ప్లాట్ఫాం వద్ద నిద్రపోయారు. తెల్లవారుజామున మెలకువ వచ్చి చూడగా, రెండో కుమారుడు అరుల్ మురుగన్(2) కనిపించలేదు. దీంతో వెంటనే తిరుపతి ఈస్ట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తిరుపతి డీఎస్పీ సురేందర్రెడ్డి, క్రైం డీఎస్పీ రవికుమార్, సీఐ మహేశ్వర్రెడ్డి నేతృత్వంలో నాలుగు ప్రత్యేక బృందాలు వెంటనే బాలుడి కోసం గాలింపు చర్యలు చేపట్టాయి. సీపీ ఫుటేజ్ ఆధారంగా బాలుడిని తెల్లవారుజామున 2.12 గంటలకు కిడ్నాప్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. కిడ్నాప్ చేసిన వ్యక్తిని అవిలాల సుధాకర్గా నిర్ధారించుకుని పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ప్రచారం చేశారు. దీంతో అవిలాల సుధాకర్ కిడ్నాప్ చేసిన బాలుడిని ఏర్పేడు మండలంలోని మాల గ్రామంలో తన అక్క నెల్లూరి ధనమ్మ వద్దకు తీసుకెళ్లి వదిలిపెట్టినట్టుగా సమాచారం అందింది. మంగళవారం ఉదయం 11.30 గంటల సమయంలో పోలీసులు వెళ్లి బాలుడిని తీసుకువచ్చి తల్లిదండ్రులకు అప్పగించారు. నిందితుడు సుధాకర్తోపాటు ధనమ్మ, మరికొందరిని ఈస్ట్ పోలీసులు అదుపులోకి తీసుకుని సమగ్రంగా విచారణ చేపడుతున్నారు. -
పోటీకి రెడీ.. నియోజకవర్గం ఏది!
వికారాబాద్: మాజీ మంత్రి ఎ.చంద్రశేఖర్ వచ్చే ఎన్నికల్లో ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలనే విషయంలో ఇంకా సందిగ్ధత వీడడం లేదు. ఆయన నేటికీ ఈ విషయంలో డోలాయమానంలోనే ఉన్నారు. అనేక పార్టీలు మారిన ఆయన చివరకు బీజేపీని వీడి మళ్లీ హస్తం గూటికి చేరిన విషయం విదితమే. ఆయన కాంగ్రెస్లో చేరుతారనే ప్రచారం మొదలైననాటి నుంచి పోటీ చేసే స్థానం విషయంలోనూ ఎన్నో ప్రచారాలు కొనసాగుతున్నాయి. వికారాబాద్ వాస్తవ్యుడైన ఆయన నాలుగుసార్లు ఎమ్మెల్యేగా.. మంత్రిగా ఓ వెలుగు వెలిగారు. కాంగ్రెస్ నుంచి మరో మాజీ మంత్రి బలమైన నాయకుడు గడ్డం ప్రసాద్ కుమార్ ఉండడంతో ఏసీఆర్ నియోజకవర్గం వీడడం అనివార్యమైంది. ఆయన జహీరాబాద్ లేదా చేవెళ్ల నుంచి బరిలో ఉంటారనే ప్రచారం సాగుతోంది. పరిచయాలు ఇక్కడ.. ప్రాంతం అక్కడ కాంగ్రెస్లో చేరింది మొదలు ఏసీఆర్ పోటీ చేసే నియోజకవర్గం విషయంలో స్పష్టత ఇవ్వడంలేదు. దీంతో ఆయన అనుచరగనం, అభిమానులు ఆందోళనకు గురవుతున్నారు. ఆయన పార్టీలో చేరిన తొలినాళ్లలో చేవెళ్ల నుంచి పోటీ చేస్తారనే ప్రచారం జరిగింది. ఆయన తన సన్నిహితులతోనూ ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. పార్టీలో చేరిన కొద్ది రోజులకే ఆయన తల్లిదండ్రులు, తాత ముత్తాతల సొంత నియోజకవర్గం జహీరాబాద్ నుంచి పోటీ చేస్తారనే ప్రచారమూ సాగింది. ఇప్పటికే ఆయన అక్కడ పలుమార్లు పర్యటించారు. కాగా ఏ నియోజకవర్గంలో గెలుపు సునాయాసమనేది తేల్చుకోలేక పోతున్నారు. జహీరాబాద్ సొంత నియోజకవర్గమైనప్పటికీ అక్కడ పెద్దగా పరిచయాలు లేవు. ఆయన రాజకీయ ప్రస్థానం మొత్తం వికారాబాద్ నియోజకవర్గంలోనే సాగింది. దీంతో ఆయన పునరాలోచనలో పడి చేవెళ్ల నుంచే పోటీ చేయాలనే ఆలోచనలో ఉన్నారని.. తాజాగా పార్టీ పెద్దలతోనూ చర్చించినట్లు ఆయన సన్నిహితులు చెబుతున్నారు. గతంలో వికారాబాద్ నియోజకవర్గంలో ఉన్న నవాబుపేట మండలం ఇప్పుడు చేవెళ్ల నియోజకవర్గంలో ఉండడం, నవాబుపేట యాదయ్య సొంత మండలమైనా మిగతా మండలాలతో పోలిస్తే ఓటింగ్ సరళి వ్యతిరేకంగా ఉంటూ రావడం.. నవాబుపేట మండలంపై ఏసీఆర్కు పూర్తిగా పట్టుండడంతో.. చేవెళ్ల నియోజకవర్గంలోనూ పరిచయాలుండడంతో ఆయనకు చేవెళ్ల నుంచి పోటీ చేస్తేనే గెలుపు అవకాశాలుంటాయని సర్వేలు చెబుతున్నట్టు తెలుస్తోంది. టీఆర్ఎస్లో ఉన్న రత్నం, ఆయన వర్గం నేతలు యాదయ్యతో అంటీముట్టనట్టు ఉండడం తదితర కారణాల నేపథ్యంలో ఏసీఆర్ తాజాగా చేవెళ్ల నుంచే బరిలో ఉండాలని నిర్ణయించుకుంటున్నట్లు తెలుస్తోంది. పార్టీలు మారినా దక్కని ఫలితం మూడున్నర దశాబ్దాల క్రితం ఎన్టీఆర్ హయాంలో వికారాబాద్ నుంచి రాజకీయ ప్రవేశం చేసిన ఏసీఆర్ మళ్లీ తిరిగి చూడాల్సిన అవసరం రాలేదు. వరుసగా నాలుగు సార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేసిన ఆయన 2008 వైఎస్ హయాంలో జరిగిన ఉప ఎన్నికలో ప్రసాద్కుమార్ చేతిలో ఓటమి చవిచూశారు. తరువాత 15 ఏళ్ల పాటు ఆయన ప్రతీ ఎన్నికలో ఓటమి తప్పలేదు. దీంతో ఆయన ఒక్క గెలుపు కోసం పరితపిస్తున్నారు. ఈ క్రమంలో ఎన్ని పార్టీలు మారినా గెలుపును అందుకోలేకపోయారు. బీజేపీలోనూ గెలుపు సాధ్యం కాదని భావించి ఇటీవల కాంగ్రెస్ కండువా కప్పుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మళీ ఏదో ఒక నియోజకవర్గం నుంచి గెలుపొంది ఫామ్లోకి రావాలని చూస్తున్నారు. -
రత్నగిరీశునికి ముత్యాల వస్త్రం
అన్నవరం: దేవతామూర్తులకు బంగారు, వజ్ర, వైఢూర్యాలతో ఆభరణాలు తయారుచేసి భక్తితో అలంకరించి తరిస్తుంటాం. అలాగే మంచి ముత్యాలతో నఖశిఖ పర్యంతం ఉండే ఒక ముత్యాల వస్త్రం (ముత్తంగి) అలంకరించడం కూడా పలు దేవాలయాల్లో ఆనవాయితీగా వస్తోంది. శ్రీరంగంలో శ్రీరంగనాథుడు, తిరుమల బ్రహ్మోత్సవాల్లో మలయప్పస్వామి, భద్రాద్రిలో సీతారాములు ముత్తంగి అలంకరణలో దర్శనమిస్తూ ఉంటారు. అన్నవరం పుణ్యక్షేత్రంలో శ్రీ వీర వేంకట సత్యనారాయణ స్వామి వారు, దేవేరి అనంతలక్ష్మీ సత్యవతీదేవి, ఈశ్వరుడు కార్తీకమాసం నుంచి ముత్తంగి అలంకరణలో దర్శనమివ్వనున్నారు. దీని తయారీకి అయ్యే ఖర్చు రూ.8 లక్షలు సమకూర్చేందుకు దేవస్థానం వ్రత పురోహిత సంఘం ముందుకు వచ్చింది. ప్రాచీన కళను కాపాడుతూ.. ముత్తంగి తయారీ ప్రాచీనమైన కళ. దీన్ని హైదరాబాద్కు చెందిన సుధీర్ చరణ్ కుటుంబం వంశపారంపర్యంగా కాపాడుతూ వస్తోంది. తమిళనాడులోని శ్రీరంగంలో సుమారు 12 అడుగుల పొడవున పవళించి ఉండే శ్రీరంగనాథునికి 17వ శతాబ్దంలో నాయకర్ రాజులు ముత్తంగి తయారు చేయించి అలంకరించారు. వందేళ్ల తరువాత వన్నె తగ్గడంతో దాన్ని తీసి భద్రపరిచారని సుదీర్ చరణ్ ‘సాక్షి’కి చెప్పారు. తరువాత 1932లో చెన్నైకి చెందిన ఆయన ముత్తాత కృష్ణాజీని శ్రీరంగం దేవస్థానం ప్రతినిధులు సంప్రదించి, భద్రపరిచిన ముత్తంగిని మళ్లీ ముత్యాలు, వజ్రాలు, కెంపులతో తయారు చేయించి శ్రీరంగనాథునికి అలంకరించారు. ఎలా తయారు చేస్తారంటే.. ముత్తంగి తయారీ చాలా శ్రమ, నైపుణ్యం, ఏకాగ్రతతో కూడిన కళ. ఇందుకు అవసరమయ్యే ముత్యాల వ్యయం తక్కువే అయినప్పటికీ వాటిని వస్త్రంగా తయారు చేయడానికి నెలల తరబడి కష్టపడాల్సి ఉంటుంది. శిరస్సు దగ్గర నుంచి పాదాల వేళ్ల వరకూ దేవతామూర్తుల కొలతలు తీసుకుని, ముందుగా వెండి లేదా రాగి రేకుతో వస్త్రంలా తయారు చేసి, దానికి వివిధ సైజుల్లో ముత్యాలు అతికిస్తారు. వీటి మధ్యలో ఎటువంటి ఖాళీ ఉండదు. కేవలం స్వామి, అమ్మవార్ల ముఖాలు మాత్రమే కనిపిస్తాయి. మిగిలిన భాగమంతా మంచిముత్యాలే కనిపిస్తాయి. సత్యదేవునికీ ముత్తంగి సేవ సత్యదేవుడు, అమ్మవారు, శంకరులకు ప్రతి సోమవారం ముత్తంగి అలంకరించి, ప్రత్యేక పూజలు చేయించాలని నిర్ణయించాం. దీనికి దేవస్థానం చైర్మన్ ఐవీ రోహిత్ కూడా అంగీకరించారు. దాతల ద్వారా ముత్తంగి చేయించాలనుకున్నాం. అదే సమయంలో వ్రతపురోహిత సంఘం ముందుకు వచ్చింది. – ఎస్ఎస్ చంద్రశేఖర్ ఆజాద్, ఈవో, అన్నవరం దేవస్థానం -
ఎన్సీటీఈ డిప్యూటీ కార్యదర్శికి నాన్ బెయిలబుల్ వారెంట్
సాక్షి, అమరావతి: కోర్టు ఆదేశాలున్నప్పటికీ విచారణకు గైర్హాజరు కావడం పట్ల జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి (ఎన్సీటీఈ) డిప్యూటీ కార్యదర్శిపై హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. ఆయనకు నాన్ బెయిలబుల్ వారెంట్ (ఎన్బీడబ్ల్యూ)) జారీ చేసింది. ఆయనను అరెస్ట్ చేసి తమ ముందు హాజరుపరచాలని పోలీసులను ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు ఆదేశాలు జారీ చేశారు. తమ కాలేజీ గుర్తింపును రద్దు చేయడాన్ని సవాల్ చేస్తూ ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురంలోని నెహ్రూ మెమోరియల్ ఎక్స్ సర్వీస్మెన్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ప్రిన్సిపల్ పీడీ చంద్రశేఖర్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై న్యాయమూర్తి జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు విచారణ జరిపారు. గత విచారణ సమయంలో పిటిషనర్ తరఫు న్యాయవాది మతుకుమిల్లి శ్రీవిజయ్ వాదనలు వినిపిస్తూ.. గుర్తింపు రద్దు కోసం ఇచ్చిన షోకాజ్ నోటీసుకు వివరణ ఇచ్చామని, అయినా కూడా ఆ వివరణను పరిగణనలోకి తీసుకోకుండా గుర్తింపు రద్దు చేస్తూ జూలై 7, 2020లో ఉత్తర్వులు జారీ చేశారన్నారు. దీనిపై ఎన్సీటీఈ ముందు ఆన్లైన్లో అప్పీల్ దాఖలు చేశామని, చట్టం నిర్దేశించిన ఫీజు కూడా చెల్లించామన్నారు. అలాగే పోస్టు ద్వారా వినతిపత్రం కూడా పంపామని తెలిపారు. అయితే తమ ముందు ఎలాంటి అప్పీల్ దాఖలు చేయలేదని ఎన్సీటీఈ తరఫు న్యాయవాది కోర్టుకు నివేదించారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి.. ఎన్సీటీఈ డిప్యూటీ కార్యదర్శి ఈ నెల 18న స్వయంగా హాజరై వివరణ ఇవ్వాలని స్పష్టం చేశారు. శుక్రవారం జరిగిన విచారణకు డిప్యూటీ కార్యదర్శి రాలేదు. వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ను కొట్టేసిన న్యాయమూర్తి డిప్యూటీ కార్యదర్శికి నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేశారు. తదుపరి విచారణను వాయిదా వేశారు. -
కాంగ్రెస్లో చేరిన సీనియర్ నేత చంద్రశేఖర్
-
కాంగ్రెస్లో చేరిన సీనియర్ నేత.. బీజేపీకి బిగ్ షాక్
సాక్షి, వికారాబాద్: తెలంగాణలో బీజేపీకి ఎదురుదెబ్బ తగిలింది. కొంతకాలం అసంతృప్తితో ఉన్న సీనియర్ నేత, మాజీ మంత్రి చంద్రశేఖర్.. కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి.. కాంగ్రెస్లోకి చంద్రశేఖర్ను ఆహ్వానించారు. పార్టీ కండువా కప్పి పార్టీ సభ్యత్వం అందించారు. ఈ సందర్బంగా రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్ కుటుంబ పాలనకు ముగింపు పలకాలి. తెలంగాణకు కేసీఆర్ చీడపీడ. సీనియర్ నేత చంద్రశేఖర్ను కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించాం. కేసీఆర్ లక్ష కోట్ల విలువైన పదివేల ఎకరాల భూమి కాజేశారు. కేసీఆర్ అవినీతిపై బీజేపీ చర్యలు తీసుకుంటుదని ఆశించారు.. కానీ, అలా జరగకపోవడంతో బీజేపీకి రాజీనామా చేశారు. కేసీఆర్ వ్యతిరేక శక్తుల పునరేకీకరణలో భాగంగా చంద్రశేఖర్ కాంగ్రెస్లో చేరడానికి అంగీకరించారు. ఈనెల 18న కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే తెలంగాణలో పర్యటించనున్నారు. తెలంగాణలో దళితులకు ఇచ్చిన అసైన్డ్ భూములను ప్రభుత్వం లాక్కుని రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తోంది. దళితులకు, గిరిజనులకు ఇచ్చిన అసైన్డ్ భూముల యాజమాన్య పట్టాలు ఇవ్వడానిఇక హక్కులు ఇవ్వాలని చంద్రశేఖర్ కోరారు. భవిష్యత్తులో దీనిపై డిక్లరేషన్ చేస్తాం. దళితుల మధ్య వర్గీకరణ చిచ్చు లేకుండా పంచాయితీ తెంచుతాం అని తెలిపారు. ఇదిలా ఉండగా.. గతంలో టీడీపీ, టీఆర్ఎస్, కాంగ్రెస్లో పనిచేసిన చంద్రశేఖర్.. మూడేళ్ల క్రితం బీజేపీలో చేరారు. తిరిగి కాంగ్రెస్ గూటికి చేరుకున్నారు. గత కొంత కాలంగా బీజేపీకి దూరంగా ఉంటున్న చంద్రశేఖర్.. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో వికారాబాద్లో ఇండిపెండెంట్గా పోటీ చేసి ఓడిపోయారు. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో పెద్దపల్లి నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిన ఆయన.. 1985 నుంచి 2008 వరకు వరుసగా 5 సార్లు వికారాబాద్ ఎమ్మెల్యేగా గెలిచారు. ఇది కూడా చదవండి: బీఆర్ఎస్లో కొత్త టెన్షన్.. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ పొలిటికల్ వార్ -
ఈ నెల 18న కాంగ్రెస్ లో చేరుతున్నాను