-
బీఆర్ఎస్ బాటలోనే కాంగ్రెస్ నడుస్తోంది- బండి సంజయ్
-
Bengaluru: కేంద్రమంత్రి ప్రచారంలో అపశృతి.. కార్యకర్త మృతి
బెంగళూరు: కేంద్రమంత్రి శోభా కరంద్లాజె కారును ఢీకొట్టి బెంగళూరులో ప్రకాష్ అనే బీజేపీ కార్యకర్త మృతి చెందాడు. ఈ ఘటన బెంగళూరు కేఆర్పురంలో సోమవారం(ఏప్రిల్ 8)జరిగింది. కేంద్ర మంత్రి కారు డోర్ను స్కూటర్పై వచ్చిన ప్రకాష్ ఢీకొట్టాడు. దీంతో అతను కింద పడిపోయాడు. ఈ సమయంలో అతడిపై నుంచి బస్సు వెళ్లింది. లోక్సభ ఎన్నికల్లో బీజేపీ తరపున బెంగళూరు నార్త్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న కేంద్ర మంత్రి శోభ ప్రచారం కోసం కేఆర్ పురం వెళ్లినపుడు ఈ ఘటన జరిగింది. ప్రమాదం జరిగినపుడు కేంద్ర మంత్రి శోభ కారులో లేరు. కారుకు మరో పక్క నుంచి స్కూటర్పై వస్తున్న ప్రకాష్ను గమనించకుండా డ్రైవర్ డోర్ తెరవడం వల్లే ప్రమాదం జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనలో కారు డ్రైవర్తో పాటు బస్సు డ్రైవర్ ఇద్దరిపై పోలీసులు 304ఏ సెక్షన్ కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రమాదంలో బీజేపీ కార్యకర్త చనిపోవడం తమలో ఎంతో విషాదం నింపిందని, ప్రకాష్ కుటుంబానికి నష్టపరిహారం వచ్చే విధంగా చర్యలు తీసుకుంటామని మంత్రి శోభ తెలిపారు. ఇదీ చదవండి.. కాంగ్రెస్ లైసెన్స్ రద్దు చేశా.. ప్రధాని ఆసక్తికర వ్యాఖ్యలు -
రష్మిక మరో ఫేక్ వీడియో.. కేంద్రమంత్రి కీలక వ్యాఖ్యలు!
సినీనటి రష్మిక మందన్నాపై కొద్ది రోజుల్లోనే రెండు ఫేక్ వీడియోలు వైరల్ కావడంపై కేంద్రం సీరియస్గా తీసుకుంది. రష్మిక డీప్ ఫేక్ వీడియోపై కేంద్ర ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఇలాంటి వీడియోలపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నామని తెలిపారు. ఇకపై ఇలాంటి ఘటనలకు పాల్పడిన వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. చిన్న పిల్లలు, మహిళలపై ఇలాంటి ఘటనలు జరగడం దురదృష్టకరమని అన్నారు. రాజీవ్ చంద్రశేఖర్ మాట్లాడుతూ..'డీప్ ఫేక్ వీడియోలపై దృష్టి సారించాం. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటాం. మార్ఫింగ్ లాంటివి జీవితాలపై తీవ్ర ప్రభావం చూపుతాయి. ఇలాంటి పరిస్థితి రావడం చాలా ప్రమాదకరం. గత రెండేళ్లుగా ఇలాంటి ఘటనలపై దృష్టి పెట్టాం. సోషల్ మీడియా నియంత్రణకు కఠిన చర్యలు తీసుకుంటాం. ఫిబ్రవరి నుంచి నిబంధనలు మరింత కఠినతరం చేస్తాం.' అని అన్నారు. ఇటీవల నేషనల్ క్రష్ రష్మికకు సంబంధించిన ఫేక్ వీడియో సోషల్ మీడియాలో పెద్దఎత్తున వైరలైంది. భారత సంతతికి చెందిన జరా పటేల్ వీడియోను కొందరు డీప్ ఫేక్ టెక్నాలజీతో మార్ఫింగ్ చేసి నెట్టింట వైరల్ చేశారు. ఈ సంఘటనపై పలువురు సెలబ్రిటీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. రష్మికకు సంబంధించిన డీప్ ఫేక్ వీడియో మరవకముందే.. మరో వీడియో నెట్టింట వైరల్గా మారింది. దీనిపై ఆమె అభిమానులు మండిపడుతున్నారు. ఇలాంటి వాటిపై కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు పలువురు విజ్ఞప్తి చేశారు. రష్మికతో పాటు బాలీవుడ్ భామ కత్రినా కైఫ్ టైగర్-3 సినిమాలో ఓ ఫోటోను అలాగే మార్ఫింగ్ చేశారు. దీంతో రోజు రోజుకు ఇలాంటి వాటి బారిన పడే వారిసంఖ్య పెరుగుతోంది. ఈ నేపథ్యంలోనే కేంద్రం కఠినమైన చర్యలు తీసుకునేందుకు సిద్ధమైంది. ఇప్పటికే సోషల్ మీడియా ఫ్లాట్ఫామ్స్కు మార్గదర్శకాలు జారీ చేసింది. -
నితిన్ గడ్కరీ ఆవిష్కరించిన ఫ్లెక్స్ ఫ్యూయెల్ కారు.. ఇది చాలా స్పెషల్!
భారతదేశం అభివృద్ధివైపు వేగంగా పరుగులు పెడుతున్న తరుణంలో ఈ రోజు కేంద్ర మంత్రి 'నితిన్ గడ్కరీ' ప్రపంచంలోనే మొట్ట మొదటి బిఎస్6 హైబ్రిడ్ కారుని ఆవిష్కరించారు. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. పెట్రోల్, డీజిల్ కార్ల వినియోగంతో కర్బన ఉద్గారాలు విపరీతంగా పెరిగిపోయాయి. దీంతో ప్రత్యామ్నాయ ఉత్పత్తులను అభివృద్ధి చేయడానికి ప్రపంచంలోని చాలా దేశాలు తమ ప్రయత్నాలను కొనసాగిస్తూనే ఉన్నాయి. ఇందులో భాగంగానే ఎలక్ట్రిక్ ఫ్లెక్స్ ఫ్యుయల్ పుట్టుకొచ్చింది. టయోటా కంపెనీకి చెందిన ఈ 'ఇన్నోవా హైక్రాస్' ఇథనాల్ శక్తితో నడిచే ప్రోటోటైప్ హైబ్రిడ్ కారు. ఈ లేటెస్ట్ ఫ్లెక్స్ ఫ్యూయల్ ప్రోటోటైప్ ఇంజిన్ E100 గ్రేడ్ ఇథనాల్తో (100 శాతం ఇథనాల్) పనిచేసేలా తయారైంది. సెల్ఫ్ ఛార్జింగ్ లిథియం అయాన్ బ్యాటరీ ఇందులో ఉంటుంది. కావున ఈవీ మోడ్లో కూడా నడుస్తుంది. ఇందులోని 2.0 లీటర్ అట్కిన్సన్ సైకిల్ ఇంజన్ పనితీరు అద్భుతంగా ఉంటుంది. ఫ్లెక్స్ ఫ్యూయెల్ టెక్నాలజీ.. ఫ్లెక్స్ ఫ్యూయెల్ టెక్నాలజీ అనేది ఇంజిన్ను ఇథనాల్-పెట్రోల్ మిశ్రమంతో పనిచేసేలా చేస్తుంది. దీని వల్ల కర్బన ఉద్గారాలు తక్కువగా విడుదలయ్యే అవకాశం ఉంటుంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా E20 ఇంధనం అందుబాటులో ఉంది. ప్రస్తుతం బ్రెజిల్ అత్యధిక ఇథనాల్ మిశ్రమాన్ని 48 శాతం వరకు మిక్స్ చేస్తోంది. భారతదేశంలోని అనేక సంస్థలు తమ వాహనాలను E20 ఇంధన సామర్థ్యంతో ప్రారంభించాయి. ఇదీ చదవండి: ఉత్పత్తి నిలిపివేసిన టయోటా.. షాక్లో కస్టమర్లు - కారణం ఇదే! ఇథనాల్.. ఇతర ఇంధనాలతో పోలిస్తే ఇథనాల్ అనేది తక్కువ ఖర్చుతో లభిస్తుంది. ఎందుకంటే బయోవేస్ట్ నుంచి ఇథనాల్ ఉత్పత్తి చేస్తారు. కావున ఇలాంటి వాహనాల వినియోగానికి అయ్యే ఖర్చు.. పెట్రోల్, డీజిల్ వాహనాలతో పోలిస్తే తక్కువగానే ఉంటుంది. అయితే ఈ రకమైన కార్లు ఎప్పటి నుంచి వినియోగంలోకి వస్తాయనేది తెలియాల్సి ఉంది. -
మణిపూర్ అల్లర్లపై సుప్రీంకోర్టు సీరియస్
న్యూఢిల్లీ: దేశాన్ని కుదిపేసిన మణిపూర్ ఇద్దరు మహిళల నగ్న ఊరేగింపు సంఘటనపై సుప్రీంకోర్టులో వాదనలు ప్రారంభమయ్యాయి. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన వీడియో బయటకు వచ్చే వరకు ఏం చేస్తున్నారని కేంద్రానికి సుప్రీం కోర్టు సూటి ప్రశ్నలు వేసింది. మణిపూర్ లో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన సంఘటనపై సుప్రీంకోర్టు కేంద్రంపై సీరియస్ అయ్యింది. బాధిత మహిళల తరపున సినియన్ న్యాయవాది కపిల్ సిబాల్ వాదించారు. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ ప్రశ్నిస్తూ.. ఒక వీడియో బయటకు వచ్చేంతవరకు ఏం చేస్తున్నారని, ఇలాంటి సంఘటనలు అదొక్కటే కాదు చాలా జరిగాయని అన్నారు. మే 3న అల్లర్లు జరిగితే ఇప్పటివరకు ఎన్ని ఎఫ్.ఐ.ఆర్.లు నమోదు చేశారని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. మణిపూర్లో ఇప్పటివరకు చాలా మంది చనిపోయారు. ఈ కేసులో సీబీఐ విచారణను బాధిత మహిళలు వ్యతిరేకిస్తున్నట్లు వేరే ఏ కోర్టులోనూ ఈ కేసును బదిలీ చేయవద్దంటున్నట్లు సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ కోర్టుకు తెలిపారు. ప్రభుత్వం తరపున కేసును వాదించిన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కేసును అస్సాం కు బదిలీ చేయమని ప్రభుత్వం కోరలేదని అన్నారు. అయితే విచారణ మణిపూర్ వెలుపల జరిగితే బాగుంటుందని మాత్రమే వారు కోరినట్లు తెలిపారు. బాధితుల్లో ఒకరి సోదరుడు, తండ్రి మృతి చెందారని.. ఇంతవరకు ఆ కుటుంబానికి ఆ మృతదేహాలను అప్పగించలేదని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు కపిల్ సిబాల్. మే 18న ఎఫ్.ఐ.ఆర్ నమోదు చేసినట్లు సుప్రీంకోర్టు కేసును సుమోటోగా స్వీకరించేంత వరకు కేసులో కదలిక రాలేదని అన్నారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 595 ఎఫ్ఐఆర్లు నమోదు అయినట్లు సీనియర్ న్యాయవాది ఇందిరా జైసింగ్ తెలిపారు. కేసు విచారణ విషయమై హైపవర్ మహిళా కమిటీని ఏర్పాటు చేయాలని ఆమె అత్యున్నత న్యాయస్థానాన్ని కోరారు. చదవండి: సుప్రీంకోర్టులో డీకే శివకుమార్కు ఊరట.. -
ఆ యాడ్ చేస్తే.. రూ. కోట్లలో ఇస్తామన్నారు: స్మృతి ఇరానీ
కేంద్ర మహిళా, శిశు అభివృద్ధిశాఖ మంత్రి స్మృతి ఇరానీ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. నటిగా, రాజకీయవేత్తగా, అందరికీ సుపరిచితురాలే. 2014లో మోదీ కేబినెట్లో మంత్రి పదవి చేపట్టిన అత్యంత పిన్న వయస్కురాలిగా స్మృతి ఇరానీ నిలిచారు. తొలుత టెలివిజన్ నటి అయిన స్మృతి అనంతరం రాజకీయ రంగంలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. అమె మోడల్ రంగంలో కూడా రానించారు. (ఇదీ చదవండి: ప్రభాస్ 'ప్రాజెక్ట్ కే' టీషర్ట్ కావాలంటే ఉచితంగా ఇలా బుక్ చేసుకోండి) తాజాగ ఆమె ఓ ఇంటర్వ్యూలో పాల్గొని టీవి సీరియల్స్లలో పనిచేస్తున్న రోజుల్ని గుర్తుచేసుకున్నారు. నటిగా తను కెరీర్ ప్రారంభించిన రోజుల్లో తన వద్ద సరిగ్గా డబ్బుల్లేవు. షూటింగ్ల ద్వారా వచ్చే డబ్బు సరిపోయేది కాదు. కనీసం బ్యాంక్ ఖాతాలో రూ.30 వేలు కూడా ఉండేవి కాదని గుర్తు చేసుకుంది. తనకు పెళ్లైన కొత్తలో బ్యాంక్ నుంచి రూ.25 లక్షలు లోన్ తీసుకుని ఒక ఇంటిని కొనుగోలు చేశామని తెలిపారు. కానీ ఆ సమయంలో ఇంటికి సంబంధించిన ఈఎంఐ చెల్లించడం చాలా కష్టంగా అనిపించేదని చెప్పుకొచ్చారు. ఆ సమయంలో కుటుంబ ఆర్థిక పరిస్థితి కూడా అంత మెరుగ్గా లేదు. అలాంటి సమయంలో ఓరోజు తన వద్దకు కొంతమంది వ్యక్తులు వచ్చి ఒక భారీ ఆఫర్ ఇచ్చారని ఇలా తెలిపింది. 'పాన్ మసాలా యాడ్లో పనిచేయమని, అందుకోసం రూ.కోట్లలో డబ్బులు ఇస్తామని భారీ ఆఫర్ చేశారు. కాకపోతే ఆ ఆఫర్ను నేను తిరస్కరించాను. దీంతో నా స్నేహితులు.. నీకు ఏమైనా పిచ్చి పట్టిందా..? అంత డబ్బు ఇస్తామంటే ఎందుకని కాదంటున్నావు' అని అని స్మృతి ఇరానీ తెలిపారు. (ఇదీ చదవండి: నయనతార రిచ్ లైఫ్.. సొంతంగా విమానంతో పాటు ఇవన్నీ కూడా) ఆ సమయంలో సీరియల్ ద్వారా ప్రేక్షకులందరూ తనను తమ కుటుంబ సభ్యురాలిగా భావించారని ఇరానీ తెలిపారు. దీంతో పాన్ మసాలా లాంటి యాడ్స్లో నటిస్తే వాళ్లు ఎలా తీసుకుంటారోననే ఆలోచన రావడంతో నో చెప్పానని ఆమె తెలిపారు. అంతే కాకుండా చిన్నపిల్లలు కూడా ఈ యాడ్స్ చూసే ప్రమాదం ఉండటంతో పాన్ మసాలా, అల్కహాల్ కంపెనీలకు చెందిన యాడ్స్కు దూరంగా ఉంటూ వచ్చానని స్మృతి ఇరానీ చెప్పుకొచ్చారు. -
మాజీ ట్విటర్ సీఈఓ వ్యాఖ్యలపై విరుచుకుపడ్డ కేంద్రమంత్రి.. కారణం ఇదే!
Rajeev Chandrasekhar Vs Jack Dorsey: మాజీ ట్విటర్ సీఈఓ 'జాక్ డోర్సే' (Jack Dorsey) భారత ప్రభుత్వంపై కొన్ని ఆరోపణలు చేశారు. ఇందులో తమ బృందానికి షట్డౌన్ మాత్రమే కాకుండా వారి ఇళ్లపై కూడా దాడులు జరుగుతాయని బెదిరింపులు వచ్చినట్లు వెల్లడించాడు. ఈ ఆరోపణలలో ఏ మాత్రం నిజం లేదని కేంద్ర మంత్రి 'రాజీవ్ చంద్రశేఖర్' స్ఫష్టం చేశారు. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. సెంట్రల్ స్కిల్ డెవలప్మెంట్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెక్నాలజీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్.. జాక్ డోర్సే చేసిన ప్రకటనలు పూర్తిగా అవాస్తవాలని ట్విటర్ ద్వారా పేర్కొన్నారు. ట్విటర్ బృందం మీద ఎవరూ దాడి చేయలేదని, జైలుకి పంపలేదని స్పష్టం చేసారు. అంతే కాకుండా డోర్సే, అతని బృందం భారతదేశ చట్టాన్ని పదేపదే ఉల్లంఘించిందని 2020 నుంచి 2022 వరకు ఇదే పద్దతిని పాటించినట్లు చెప్పుకొచ్చాడు. జాక్ డోర్సే భారత చట్టానికి సంబంధించిన సార్వభౌమాధికారాన్ని అంగీకరించడానికి సుముఖ చూపడంలేదని, చట్టాలు అతనికి ఏ మాత్రం వర్తించనట్లు ప్రరవర్తించారని చెప్పడమే కాకుండా, దేశంలో ఉన్న కంపెనీలన్నీ చట్టాలను తప్పకుండా అనుసరించాలాని పేర్కొన్నారు. రైతుల నిరసనను డోర్సే ప్రత్యేకంగా ఎందుకు ప్రస్తావించారో కూడా చంద్రశేఖర్ వివరించారు. నిరసనల సందర్భంగా చాలా తప్పుడు సమాచారం ప్రచారంలో ఉందని, అలాంటి తప్పుడు వార్తలను తొలగించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. డోర్సీ ఆధ్వర్యంలోని ట్విట్టర్ కేవలం భారతీయ చట్టాన్ని ఉల్లంఘించడమే కాదు, మన రాజ్యాంగంలోని ఆర్టికల్ 14,19ని ఉల్లంఘిస్తూ ఏకపక్షంగా, పక్షపాతంతో వ్యవహరించిందని.. తప్పుడు సమాచారాన్ని ఆయుధాలుగా చేయడంలో సహాయం చేస్తుందని అన్నారు. ప్రస్తుతం భారత ప్రభత్వం విధి విధానాలు స్పష్టంగా ఉన్నాయని.. సంస్థలు కూడా విశ్వసనీయంగా, జవాబుదారీగా వ్యవహరించాలని చంద్రశేఖర్ సూచించారు. This is an outright lie by @jack - perhaps an attempt to brush out that very dubious period of twitters history Facts and truth@twitter undr Dorsey n his team were in repeated n continuous violations of India law. As a matter of fact they were in non-compliance with law… https://t.co/SlzmTcS3Fa — Rajeev Chandrasekhar 🇮🇳 (@Rajeev_GoI) June 13, 2023 -
రెజ్లర్ల ఆందోళనలపై మీడియా ప్రశ్నలకు మంత్రి పరుగులు
రెజ్లర్ల ఆందోళనలపై మీడియా ప్రశ్నలకు మంత్రి పరుగులు -
‘శ్రీవారి ఆలయ మహాసంప్రోక్షణకు రండి’
న్యూఢిల్లీ: జమ్మూలో టీటీడీ నూతనంగా నిర్మించిన శ్రీ వేంకటేశ్వరస్వామి వారి ఆలయ మహాసంప్రోక్షణకు హాజరు కావాలని టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి జమ్ము కాశ్మీర్ లెఫ్టి నెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ,కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ను ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఢిల్లీలో శుక్రవారం సాయంత్రం చైర్మన్ వీరిని కలసి మహాసంప్రోక్షణ ఆహ్వాన పత్రికను అందజేశారు. జూన్ 3వ తేదీ నుంచి 8 వ తేదీ వరకు జమ్మూ శ్రీవారి ఆలయంలో మహా సంప్రోక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వారికి వైవీ సుబ్బారెడ్డి వివరించారు. జూన్ 8వ తేదీ మహా సంప్రోక్షణ నిర్వహించి భక్తులకు స్వామివారి దర్శనం కల్పించనున్నట్లు చెప్పారు. చైర్మన్ వీరిద్దరినీ శాలువతో సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. చదవండి: సివిల్స్ ఫలితాల్లో ఇద్దరికి ఓకే ర్యాంకు, రోల్ నెంబర్.. నాదంటే.. నాది.. చివరికి! -
అడ్వెంచర్ టూరిజానికి విస్తృత అవకాశాలు: కిషన్ రెడ్డి
సాక్షి, న్యూఢిల్లీ: దేశీయంగా సాహస పర్యాటకాని(అడ్వెంచర్ టూరిజం)కి విస్తృత అవకాశాలు ఉన్నా యని కేంద్ర పర్యాటక మంత్రి కిషన్రెడ్డి తెలిపారు. విదేశీ పర్యాటకులను ఆకట్టుకోవడానికి అనేక ప్రదేశాలున్నాయని తెలిపారు. ఆయా అవకాశాలు సద్వినియోగం చేసుకోవడానికి వినూత్న విధానాలతో కేంద్రం ముందుకెళ్తోందని తెలిపారు. రెండో పర్యాటక రంగ జీ20 వర్కింగ్ గ్రూప్ సమావేశాల సందర్భంగా పశ్చిమబెంగాల్లోని సిలిగురిలో ‘సాహస పర్యాటకం’పై ఏర్పాటు చేసిన సమావేశానికి కిషన్రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..అడ్వెంచర్ టూరిజానికి హిమాలయాలను మించిన ఉత్తమమైన ప్రదేశం మరొకటి ఉండదని, అందుకే ఈ సామర్థ్యాన్ని సద్వినియోగ పరుచుకునే దిశగా కేంద్రం కృషి చేస్తోందని తెలిపారు. ట్రెక్కింగ్ అండ్ క్యాంపింగ్, మౌంటనీరింగ్ వంటి వాటికి డిమాండ్ పెరిగిందని కిషన్రెడ్డి తెలిపారు. దేశంలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసేందుకు జాతీయ పర్యాటక విధానాన్ని తీసుకురానున్నట్లు చెప్పారు. పులుల సంరక్షణలో తెలంగాణ విఫలం పులుల సంరక్షణలో తెలంగాణ ప్రభుత్వం విఫలమైందని కేంద్ర మంత్రి జి.కిషన్రెడ్డి విమర్శించారు. రాష్ట్ర బడ్జెట్లో గొప్పలు మినహా క్షేత్రస్థాయిలో నిధులు అందడం లేదని, పులుల సంరక్షణకు రూ.2.2 కోట్లు కూడా కేటాయించక పోవడమే అందుకు నిదర్శనమన్నారు. దేశంలో పులుల సంరక్షణను ప్రోత్సహించే లక్ష్యంతో ‘ప్రాజెక్ట్ టైగర్’ను ప్రారంభించి శనివారంతో యాభై ఏళ్లు పూర్తి కాగా ప్రపంచ అడవి పులుల సంఖ్యలో భారత్లోనే 70 శాతానికి పైగా పులులున్నాయని తెలిపారు. హైదరాబాద్లోని నెహ్రూ జూలాజికల్ పార్క్, ఏటూరు నాగారం, కిన్నెరసాని, పాఖల్, పోచారం, మంజీర, ప్రాణహిత వంటి వన్యప్రాణుల అభయారణ్యాలకు కేంద్రం రూ.30 కోట్లు ఇచి్చందని తెలిపారు. అనంతరం...కిషన్రెడ్డి అడ్వెంచర్ టూరిజంకు ఉన్న అవకాశాలపై వివిధ దేశాల ప్రతినిధులు ప్యానల్ చర్చలో పాల్గొన్నారు. -
గుడ్న్యూస్..కేంద్రంలో దాదాపు 10 లక్షల ఉద్యోగ ఖాళీలు!
న్యూఢిల్లీ: కేంద్రంలో పలు విభాగాల్లో 9.79 లక్షలకు పైగా ఉద్యోగాలను భర్తీ చేయాల్సి ఉందని ప్రభుత్వం బుధవారం తెలిపింది. లోక్సభలో ఒక ప్రశ్నకు కేంద్ర సిబ్బంది శాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్ ఈ మేరకు లిఖితపూర్వక సమాధానమిచ్చారు. ‘‘2021 మార్చి 1 నాటికి అన్ని శాఖలు, విభాగాలు, సంస్థల్లో 9.79 లక్షలకుపైగా ఖాళీలున్నాయి. రైల్వేశాఖలోనే 2.93 లక్షలున్నాయి. రక్షణ శాఖలో 2.64 లక్షలు, హోం శాఖలో 1.43 లక్షలు, రెవెన్యూలో 80,243, ఆడిట్–అకౌంట్ విభాగంలో 25,934, అణు ఇంధన శాఖలో 9,460 ఖాళీలున్నాయి. వీటిని ఎప్పటికప్పుడు భర్తీ చేయాలని ఆదేశించాం’’ అన్నారు. -
జడ్జీల సెర్చ్ కమిటీలో ప్రభుత్వ ప్రతినిధి ఉండాలి
-
మళ్లీ 'షా'రొస్తున్నారు..అప్పటిదాకా ఇక్కడే మకాం..!
తెలంగాణలో కాషాయ జెండా ఎగురవేయడం లక్ష్యంగా కేంద్ర హోంమంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా నేరుగా కదన రంగంలోకి దిగుతున్నారు. బీజేపీ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఇన్చార్జిగా బాధ్యతలు చేపట్టనున్నారు. ఎన్నికల వ్యూహాల రూపకల్పన నుంచి క్షేత్రస్థాయిలో ప్రచారం దాకా పర్యవేక్షించనున్నారు. ఇందుకోసం అసెంబ్లీ ఎన్నికల పోరు ముగిసేదాకా అమిత్షా హైదరాబాద్లోనే మకాం వేసి పార్టీ శ్రేణులను ఉరుకులు, పరుగులు పెట్టించనున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి. ప్రధానంగా రాష్ట్ర పార్టీ ముఖ్య నేతల మధ్య సమన్వయ లేమి, ఆధిపత్య పోరు సమస్యను పరిష్కరించడానికి చర్యలు చేపట్టనున్నారని వివరించాయి. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన వెంటనే ఆయన తెలంగాణపైనే పూర్తిగా దృష్టి కేంద్రీకరించనున్నారని పేర్కొన్నాయి. ఇప్పటికే కర్ణాటకలో షురూ.. కర్ణాటకలో మరో మూడు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అక్కడ తిరిగి అధికారాన్ని నిలబెట్టుకోవాలని బీజేపీ జాతీయ నాయకత్వం భావిస్తోంది. అయితే కొంతకాలం నుంచి కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వంపై అసంతృప్తి పెరుగుతోందన్న అభిప్రాయం ఉంది. దీనికితోడు రాహుల్ గాంధీ భారత్జోడో యాత్రతో కాంగ్రెస్ పార్టీ కాస్త పుంజుకుందన్న అంచనాలూ వెలువడ్డాయి. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన బీజేపీ. ఆ రాష్ట్రంలో పార్టీని విజయతీరాలకు చేర్చే బాధ్యతను అమిత్షాకే అప్పగించింది. గత ఎన్నికల్లో కర్ణాటకలో బీజేపీకి పూర్తి మెజారిటీ దక్కకపోవడానికి నేతల మధ్య కుమ్ములాటలు, సమన్వయం లేకపోవడమే ముఖ్య కారణమని గుర్తించిన నాయకత్వం.. ఈసారి ఆ సమస్య పునరావృతం కాకుండా అమిత్షా నేతృత్వంలో జాగ్రత్తలు తీసుకుంటోంది. ఆ రాష్ట్రంలో యావత్ ఎన్నికల వ్యూహ రచన ఆయన కనుసన్నల్లోనే సాగుతోంది. ఎన్నికల సమయం దగ్గరపడుతుండటంతో.. అక్కడే ఇల్లు అద్దెకు తీసుకుని, పూర్తి సమయం కేటాయించేందుకూ అమిత్షా సిద్ధమవుతున్నారు. కర్ణాటకలో ఎన్నికలు ముగిశాక.. అదే తరహాలో తెలంగాణపైనా దృష్టి పెట్టనున్నారు. సమన్వయ లేమి సమస్యతో.. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చేందుకు సానుకూల వాతావరణం ఉందని.. కానీ రాష్ట్ర పార్టీ ముఖ్య నేతల మధ్య సమన్వయ లేమి సమస్యగా మారిందని ఆ పార్టీ వర్గాలు చెప్తున్నాయి. దీనిని పార్టీ అగ్ర నాయకత్వం గుర్తించిందని అంటున్నాయి. గతంలో ఎన్నడూ లేనివిధంగా బీజేపీ పట్ల ప్రజల్లో ఆదరణ పెరగడం, అందుకు కేంద్రంలోని మోదీ ప్రభుత్వం సాధించిన ఫలితాలు, సుపరిపాలన దోహదపడ్డాయని ఆ పార్టీ నేతలు అంటున్నారు. రాష్ట్రంలో కేసీఆర్ సర్కార్కు వ్యతిరేకంగా బీజేపీ చేపడుతున్న కార్యక్రమాలు, అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్ర, మోదీ, అమిత్షా, జేపీ నడ్డా, కేంద్ర మంత్రుల పర్యటనలతో మంచి ఫలితాలు వచ్చాయని చెప్తున్నారు. కాషాయ జెండా ఎగిరేందుకు ఇంత అనుకూలంగా ఉన్న పరిస్థితిని.. ఎట్టి పరిస్థితుల్లోనూ చేజార్చుకోవద్దనే అభిప్రాయంతో అధినాయకత్వం ఉందని వివరిస్తున్నారు. ఇప్పటికే పరోక్షంగా పర్యవేక్షణ అమిత్షా ఇప్పటికే పరోక్షంగా రాష్ట్ర పార్టీ కార్యకలాపాలను పర్యవేక్షిస్తున్నారు. ఇక్కడి రాజకీయ పరిస్థితులు, బీఆర్ఎస్ సర్కార్ తీరు, సీఎం కేసీఆర్ వ్యవహారశైలి, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిశీలిస్తున్నారు. పార్టీ పరంగా చేపడుతున్న కార్యక్రమాలన్నీ ఆయన అదుపాజ్ఞలు, పర్యవేక్షణలోనే కొనసాగుతున్నాయని పార్టీ నేతలు చెప్తున్నారు. ఈ క్రమంలోనే అమిత్షా, ఇతర అగ్రనేతలు కలసి.. గతంలో లోక్సభ, యూపీ ఎన్నికల్లో పార్టీ గెలుపుకోసం కృషిచేసిన జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సల్ను రాష్ట్ర పార్టీ సంస్థాగత ఇన్చార్జిగా నియమించారు. ప్రస్తుతం బన్సల్ నేతృత్వంలోనే ‘ప్రజాగోస– బీజేపీ భరోసా’ స్ట్రీట్ కార్నర్ మీటింగ్లు, పోలింగ్ బూత్ స్థాయిలో పార్టీ సంస్థాగత పటిష్టత, బూత్ సశక్తికరణ్ అభియాన్ వంటివి చేపడుతున్నారు. ఇక పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఐదు విడతల్లో చేపట్టిన పాదయాత్రతో దాదాపు సగం అసెంబ్లీ నియోజకవర్గాలు కవర్ అయ్యాయి. ఎన్నికలు దగ్గరపడుతుండటంతో పాదయాత్రలు కాకుండా.. రాష్ట్రంలోని నాలుగైదు రూట్లలో ముఖ్యనేతలంతా సమాంతరంగా పాల్గొనేలా రథయాత్రలు నిర్వహించాలనే ఆలోచనతో ఉన్నట్టు పార్టీ నేతల సమాచారం. దీనికి సంబంధించి త్వరలోనే జాతీయ నాయకత్వం ఓ నిర్ణయం తీసుకోనున్నట్టు తెలిసింది. -
చార్జీ పెంపు.. ఎయిర్టెల్ను ప్రశ్నించనున్న కేంద్రమంత్రి
న్యూఢిల్లీ: డేటా వ్యయం, పరికరాల ధర పెరగడం ఆందోళన కలిగిస్తోందని ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ అన్నారు. కనీస నెలవారీ చార్జీని ఎయిర్టెల్ 57 శాతం పెంచిన నేపథ్యంలో మంత్రి వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ‘డేటా ధరలు అధికం కావడం వేగవంతమైన డిజిటైజేషన్కు అవరోధాలు. 2025 నాటికి 120 కోట్ల భారతీయులను ఆన్లైన్కు తీసకురావాలన్నది మా లక్ష్యం. ప్రస్తుతం 83 కోట్ల మంది ఇంటర్నెట్ వినియోగిస్తున్నారు. పెరుగుతున్న డేటా వినియోగం లేదా పరికరాల ధరలో ఏదైనా పెరుగుదల వంటి సమస్యలు వస్తే ఖచ్చితంగా పరిశీలిస్తాం. ఎయిర్టెల్ ఇటీవల మొబైల్ సేవల ధరల పెంపుపై అధ్యయనం చేయలేదు. టెలికం నియంత్రణ సంస్థ ట్రాయ్ పరిశీలించే వరకు వేచి చూస్తాం.ట్రాయ్తో తప్పకుండా మాట్లాడబోతున్నాం. రష్యా–ఉక్రెయిన్ సమస్య కారణంగా ఇది స్వల్పకాలికమా? లేదా దీర్ఘకాలికమా? ఇది ట్రెండ్గా మారబోతుందా? ఇవీ మేం అడగబోయే ప్రశ్నలు. రష్యా–ఉక్రెయిన్ యుద్ధం కారణంగా ప్రపంచవ్యాప్తంగా ధరలపై ప్రభావం పడింది. డేటా ధరల ప్రభావాన్ని పరిశీలించాల్సిన అవసరం ఉంది. చార్జీలు పెంచడానికి కారణం ఏమిటని ఆపరేటర్ను ప్రశ్నిస్తాం. డేటా వ్యయాలు అందుబాటులో ఉండాలన్నదే మా ఆశయం’ అని ఆయన అన్నారు. చదవండి: గూగుల్ నుంచి ఇది అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు! -
తెలంగాణ రాష్ట్రం నుంచి మరో కేంద్రమంత్రి?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర బీజేపీ నేతలకు జాతీ యస్థాయిలో మరో కీలక పదవి లభించనుందా ? ఈ ప్రశ్నకు ఢిల్లీ పార్టీ వర్గాల నుంచి అవుననే సమాధానం వస్తోంది. 2024 ఏప్రిల్లో లోక్సభ ఎన్నికలతో పాటు, ఈ ఏడాది 9 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కేంద్ర కేబినెట్ పునర్వ్యవస్థీకరణ జరిగే అవకాశాలున్నట్టు చెబుతున్నారు.ప్రస్తుతం జాతీయస్థాయిలో రాజకీయ మార్పులు చేర్పులు వేగంగా చోటుచేసుకుంటున్నాయి. ఈ కీలక పరిణా మాల్లో జాతీయ, రాష్ట్ర స్థాయిల్లో సంస్థాగతంగా కూడా కీలక మార్పులు జరిగే అవకాశాలున్నాయని పార్టీ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ నెల 16, 17 తేదీల్లో ఢిల్లీలో జరగనున్న పార్టీ జాతీయకార్యవర్గ భేటీలో పలు అంశాలపై నిర్ణయాలు తీసుకునే అవకాశాలున్నాయని అంటున్నారు. కేంద్రమంత్రివర్గ విస్తరణతో పాటు ఈ ఏడాది ఎన్నికలు జరగాల్సిన కొన్ని రాష్ట్రాల్లో పార్టీ అధ్యక్షుల మార్పు కూడా జరగొచ్చుననే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కీలకంగా మారిన తెలంగాణ... ప్రస్తుతమున్న పరిస్థితుల్లో కర్ణాటక, తెలంగాణ, మధ్యప్రదేశ్, రాజస్తాన్, ఛత్తీస్గఢ్ ఎన్నికలకు అత్యంత ప్రాధాన్యత ఏర్పడింది. తెలంగాణలో అధికారంలోకి రావడంతోపాటు మధ్యప్రదేశ్, కర్ణాటకలలో అధికారాన్ని నిలబెట్టుకోవడం, రాజస్తాన్, ఛత్తీస్గఢ్లలో కాంగ్రెస్ను ఓడించడం అనేది బీజేపీకి కీలకంగా మారింది. గతంలో బీజేపీ ఎప్పుడూ గెలవని, రెండోస్థానంలో నిలిచిన, మిత్రపక్షాలకు కేటాయించిన 160 ఎంపీ సీట్లను జాతీయనాయకత్వం గుర్తించింది. 2024 ఎన్నికల్లో వీటిలో గణనీయమైన సంఖ్యలో సీట్లు గెలవాలనే లక్ష్యంతో కార్యాచరణ ప్రణాళికను ఇప్పటికే బీజేపీ అమలు చేయడం మొదలుపెట్టింది. వచ్చే లోక్సభతో పాటు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో... ఇప్పటికే కేంద్రమంత్రిగా ఉన్న కిషన్రెడ్డికి తోడుగా తెలంగాణ నుంచి ఎంపీలుగా ఉన్న బండిసంజయ్, ధర్మపురి అరవింద్, సోయం బాపూరావులలో ఒకరికి కేబినెట్బెర్త్ దక్కే అవకాశాలున్నాయన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఉత్తరప్రదేశ్ నుంచి రాజ్యసభకు ఎన్నికైన డా.కె.లక్ష్మణ్ కూడా మంత్రి పదవి రేసులో ఉన్నట్టుగా చెబుతున్నారు. కేసీఆర్ సర్కారు వైఫల్యాలను మరింతగా ఎండగట్టేలా... తెలంగాణలో కచ్ఛితంగా విజయం సాధించాలనే పట్టుదలతో ఉన్న జాతీయనాయకత్వం ఈ దిశలో కేసీఆర్ సర్కారు వైఫల్యాలను మరింత గట్టిగా ఎండగట్టేందుకు మరో కేబినెట్ పదవి ఇచ్చే అవకాశాలున్నాయని అంటున్నారు. గత 8 ఏళ్లలో మోదీ ప్రభుత్వం అమలుచేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను గురించి తెలంగాణలో విస్తృతంగా ప్రచారం చేయలేకపోయామనే అభిప్రాయంతో జాతీయనాయకత్వం ఉన్నట్టు సమాచారం. మరో పది నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నందున ఇప్పటికైనా మోదీ ప్రభుత్వ విజయాలు, తెలంగాణలో వివిధవర్గాల పేదలకు చేకూరిన ప్రయోజనాలను గురించి ప్రజలకు తెలియచేయాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో త్వరలో జరగబోయే కేబినెట్ విస్తరణలో తెలంగాణకు చెందిన నేతకు మంత్రి పదవి దక్కుతుందనే ప్రచారం జరుగుతోంది. ఒకవేళ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా ఉన్న సంజయ్ను కేంద్రమంత్రిని చేస్తే రాష్ట్ర పార్టీలో బీసీవర్గం నుంచి కీలకనేతగా ఉన్న మరో ముఖ్యనేతకు రాష్ట్ర అధ్యక్షుడిగా పార్టీ పగ్గాలు అప్పగించవచ్చునని ప్రచారం జరుగుతోంది. ఈ మేరకు ఇప్పటికే సోషల్ మీడియాలోని కొన్ని వెబ్సైట్లలో వార్తలు పెద్దఎత్తున హల్చల్ చేస్తున్నాయి. -
తెలంగాణ మెట్రో కారిడార్కు రూ.8,453 కోట్లు
సాక్షి, న్యూఢిల్లీ: 2017 మెట్రో రైల్ పాలసీలో భాగంగా 50:50 ఈక్విటీ షేర్ పద్ధతిలో రూ.8,453 కోట్లు కేంద్ర ప్రభుత్వాన్ని తెలంగాణ కోరినట్లు కేంద్ర గృహ నిర్మాణం, పట్టణ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి కౌశల్ కిశోర్ వెల్లడించారు. మెట్రోకారిడార్ సాయం ఏమైందని టీఆర్ఎస్ ఎంపీ రంజిత్రెడ్డి అడిగిన ఓ ప్రశ్నకు కేంద్రమంత్రి గురువారం లిఖితపూర్వక సమాధానమిచ్చారు. అదేవిధంగా రాయదుర్గం స్టేషన్ నుంచి శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు వరకు రూ.6,105 కోట్లతో రాష్ట్ర ప్రభుత్వం నిర్మించ తలపెట్టిన మెట్రో ప్రాజెక్టు విషయం కూడా తమ దృష్టిలో ఉందని తెలిపారు. ఎన్హెచ్–65లో 6 లేన్లు అవసరం లేదు ప్రస్తుతం నందిగామ సెక్షన్లో నాలుగు లేన్లు సరిపోతాయి లోక్సభలో ఎంపీలు కోమటిరెడ్డి, ఉత్తమ్ల ప్రశ్నలకు కేంద్రమంత్రి గడ్కరీ జవాబు ఇచ్చారు. ఎన్హెచ్-65లో 6 లేన్లు అవసరం లేదని స్పష్టం చేశారు. ఇదీ చదవండి: హైదరాబాద్–విజయవాడ ఎన్హెచ్-65పై నితిన్ గడ్కరీ కీలక వ్యాఖ్యలు.. -
హిమాచల్లో బీజేపీ ఓటమి.. అనురాగ్ ఠాకూర్ను ఏకిపారేస్తున్న నెటిజన్లు!
షిమ్లా: హిమాచల్ ప్రదేశ్లో అధికారంలో ఉన్న బీజేపీ పరాజయం పాలైంది. ప్రతి ఐదేళ్లకోసారి అధికార మార్పు సంప్రదాయాన్ని కొనసాగిస్తూ కాంగ్రెస్కు పట్టంకట్టారు హిమాచల్ ప్రదేశ్ ఓటర్లు. అయితే, అధికారంలో ఉండి కూడా బీజేపీ ఓడిపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్రంలో కాషాయ దళం పరాజయం చెందడానికి కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ కారణమంటూ సామాజిక మాధ్యమాల్లో విమర్శలు వస్తున్నాయి. హిమాచల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన క్రమంలో అనురాగ్ ఠాకూర్పై ట్రోల్స్తో ఆయన ట్రెండింగ్లోకి వచ్చారు. రాష్ట్ర బీజేపీలో ఠాకూర్ అంతర్యుద్ధానికి తెరలేపారంటూ కొందరు కాషాయ మద్దతుదారులు ఆరోపిస్తున్నారు. I am presuming C. R. PATIL new BJP president on card. Great leader with thumping majority in Gujarat. Anurag Thakur should be sacked from BJP for family politics over and above party lines. — 🇮🇳🌞 GIREESH JUYAL 🇮🇳🌞जय श्री राम, (@juyal3405) December 8, 2022 బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా స్వరాష్ట్రమైన హిమాచల్ ప్రదేశ్లో ఈసారి రెబల్ అభ్యర్థుల నుంచి గట్టి పోటీ ఎదురైంది. మొత్తం 68 స్థానాల్లో 21 ప్రాంతాల్లో బీజేపీ రెబల్ అభ్యర్థులు పోటీ చేశారు. రెండు చోట్ల మాత్రమే విజయం సాధించినప్పటికీ.. బీజేపీ అనుకూల ఓట్లు చీలిపోయాయని స్పష్టంగా తెలుస్తోంది. అదే కాంగ్రెస్ విజయానికి సాయపడింది. మరోవైపు.. ఈ ఎన్నికల్లో బీజేపీలో మూడు వర్గాలు ఏర్పడినట్లు స్పష్టమవుతోంది. అనురాగ్ ఠాకూర్, జేపీ నడ్డా, సీఎం జైరాం ఠాకూర్ వర్గం. దీంతో అభ్యర్థుల ఎంపికలో ఏకాభిప్రాయం కుదరకపోవడంతో రెబల్స్ బరిలోకి దిగారు. ఎవరి వర్గం వారిని వారు గెలిపించుకునేందుకు ప్రయత్నాలు చేయటం పార్టీ ఓటమికి కారణమైంది. మరోవైపు.. బీజేపీలో కీలక నేత, మాజీ సీఎం ప్రేమ్కుమార్ థుమాల్ గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. దీంతో ఆయనకు ఈసారి టికెట్ ఇవ్వలేదు అధిష్ఠానం. దీంతో ఆయన కుమారుడు, కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ పార్టీకి వ్యతిరేకంగా పని చేసినట్లు కొందరు ఆరోపిస్తున్నారు. అనురాగ్ ఠాకూర్ సొంత జిల్లాలోనే ఐదు సీట్లలో బీజేపీ ఓడిపోవడం విమర్శలకు తావిచ్చింది. బీజేపీలో కీలక నేతలు ఉన్నప్పటికీ.. హిమాచల్ ప్రదేశ్లో కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ఒక్కరే ప్రచారం చేసి హస్తం పార్టీకి ఘన విజయం సాధించిపెట్టారని ఓ నెజిటన్ కామెంట్ చేశారు. In a head to head contest, in Nadda's state, in Anurag Thakur's state, against the might of the BJP's money, media and institutions, Priyanka Gandhi has defeated Modi. — Dushyant A (@atti_cus) December 8, 2022 Choice of candidates by JP Nadia & Anurag Thakur is questionable If a rebel is winning means the rebel was right candidate Also the home state of BJP Chief Nadda? Any effects of that? Look at the effect of Narendra Modi on his Home State Gujarat If BJP means business then act — Flt Lt Anoop Verma (Retd.) 🇮🇳 (@FltLtAnoopVerma) December 8, 2022 ఇదీ చదవండి: ఛండీగఢ్ కాదు.. షిమ్లాలోనే! కాంగ్రెస్ సీఎం అభ్యర్థి ఎవరు?.. ఉత్కంఠ -
మినిమం బ్యాలెన్స్ నిర్వహించని ఖాతాలపై పెనాల్టీ.. కేంద్రం ఏం చెప్పిందంటే?
ప్రస్తుత రోజుల్లో ప్రతి ఒక్కరూ బ్యాంక్ అకౌంట్ను కలిగి ఉన్నారు. ఇక ఉద్యోగులు, వ్యాపారస్తులు ఏకంగా రెండు పైనే ఖాతాలను నిర్వహిస్తున్నారు. కొందరు బ్యాంకు ఖాతాలు తెరిచి అందులో మినిమం బ్యాలెన్స్ (కనీస మొత్తంలో నగదు) నిల్వ చేయలేక జరిమానాలు, అదనపు ఛార్జీలు చెల్లిస్తున్న సంగతి తెలిసిందే. అయితే బ్యాంక్ అకౌంట్లో ఇక మినిమం బ్యాలెన్స్ జరిమానాలపై తాజాగా కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి భగవంత్ కిషన్రావ్ కారడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. మినిమం బ్యాలెన్స్ నిర్వహించని ఖాతాలపై పెనాల్టీని మాఫీ చేయడంపై వ్యక్తిగత బ్యాంకుల బోర్డులు నిర్ణయం తీసుకోవచ్చని కారడ్ తెలిపారు. ‘బ్యాంకులు స్వతంత్ర సంస్థలు. పెనాల్టీని రద్దు చేసే నిర్ణయం తీసుకునే అధికారం బోర్డులకు ఉన్నాయని’ అన్నారు. బ్యాంక్ రూల్స్ ప్రకారం తక్కువ నిల్వ (మినిమం బ్యాలెన్స్) ఉన్న ఖాతాలపై జరిమాన విధిస్తున్న విషయం విదితమే. అయితే ఇలాంటి అకౌంట్లపై ఎలాంటి పెనాల్టీ వసూలు చేయవద్దని బ్యాంకులను ఆదేశించడంపై కేంద్రం పరిశీలిస్తుందా అని అడిగిన ప్రశ్నకు మంత్రి ఈ విధంగా సమాధానమిచ్చారు. జమ్మూ కాశ్మీర్లో క్రెడిట్-డిపాజిట్ నిష్పత్తి 58 శాతంగా ఉందని, దానిని పెంచాలని అధికారులను కోరినట్లు కారడ్ తెలిపారు. అయితే ఇక్కడ క్లిష్టమైన భూభాగాలు ఉన్నప్పటికీ, జమ్మూ కాశ్మీర్లో బ్యాంకు కమ్యూనికేషన్ లేని ఒక్క గ్రామం కూడా లేదని మంత్రి సంతృప్తి వ్యక్తం చేశారు. చదవండి: ఐసీఐసీఐ బ్యాంకు కస్టమర్లకు బంపర్ ఆఫర్ -
తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారు : కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
-
తెలంగాణలో రాచరిక పాలన నడుస్తోంది: కిషన్ రెడ్డి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్పై విమర్శలు గుప్పించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ప్రధాని మోదీ రాష్ట్రానికి వస్తే ప్రభుత్వం మర్యాద పాటించలేదని, దేశంలో ఎక్కడా ఇలాంటి పరిస్థితి లేదన్నారు. కుటుంబ పాలనలో తెలంగాణ రాష్ట్రం బందీ అయ్యిందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ పర్యటనలో భాగంగా బేగంపేటలో నిర్వహించిన సభలో మాట్లాడారు. ‘తెలంగాణ ప్రభుత్వానికి కనీస మర్యాద లేదు. ప్రధాని తెలంగాణకు వస్తే ప్రభుత్వం మర్యాద పాటించలేదు. దేశంలో ఎక్కడా ఇలాంటి పరిస్థితి లేదు. సీఎం కేసీఆర్ది నిజాం రాజ్యాంగం. సీఎం కేసీఆర్ వైఖరితో తెలంగాణకు నష్టం జరుగుతోంది. తెలంగాణ ముఖ్యమంత్రికి అభివృద్ధి పట్టదు. తెలంగాణ.. కుటుంబ పాలనలో బందీ అయ్యింది. రాష్ట్రంలో కుటుంబ, రాచరిక పాలన నడుస్తోంద’ అని తీవ్ర విమర్శలు గుప్పించారు కిషన్ రెడ్డి. ఇదీ చదవండి: తెలంగాణ రామగుండంలో ప్రధాని మోదీ పర్యటన.. కీలక అప్డేట్స్ -
Viral Video: కేంద్ర మంత్రి చేసిన పనికి అంతా షాక్!
సిమ్లా: హిమాచల్ప్రదేశ్ ఎన్నికలు దగ్గర పడుతున్న క్రమంలో కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్నారు. బిలాస్పూర్ నియోజకవర్గం పరిధిలో ఆయన పర్యటిస్తుండగా.. ఆసక్తికర సంఘటన జరిగింది. నడి రోడ్డుపై బస్సు బ్రేక్డౌన్ అయ్యింది. దీంతో ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కేంద్ర మంత్రి ఠాకూర్ కాన్వాయ్ సైతం నిలిచిపోవాల్సిన పరిస్థితి తలెత్తింది. విషయం తెలుసుకున్న ఆయన కారు దిగి అక్కడున్న వారితో కలిసి బస్సును వెనక్కి తోశారు. అనంతరం బస్సు డ్రైవర్, ప్రయాణికులతో కాసేపు మాట్లాడి వారి యోగక్షేమాలు తెలుసుకున్నారు. ట్రాఫిక్ సర్దుకున్నాక అక్కడి నుంచి ప్రచారానికి వెళ్లిపోయారు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. అంతకుముందు బిలాస్పూర్ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఠాకూర్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో మరోసారి భాజపా ప్రభుత్వం అధికారంలోకి వస్తే అన్ని గ్రామాల్లో రోడ్లను అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. అన్ని పర్యటక ప్రాంతాలు, పుణ్యక్షేత్రాల్లో మౌలిక సదుపాయాలను కల్పిస్తామన్నారు. ‘ప్రాజెక్ట్ శక్తి’ పేరిట వచ్చే 10 ఏళ్ల కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా రవాణా సౌకర్యాలను అభివృద్ధి చేస్తామని అన్నారు. ఇదీ చదవండి: షాకింగ్ రిపోర్ట్: కరోనాను మించిన వైరస్ తయారీలో పాక్-చైనా! -
ట్విటర్ ఉద్యోగుల తొలగింపు సరైంది కాదు, అలా చేసుండాల్సింది: కేంద్రం ఆగ్రహం!
ప్రపంచ కుబేరుడు, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ప్రముఖ మైక్రోబ్లాగింగ్ ప్లాట్ఫాం ట్విట్టర్ని స్వాధీనం చేసుకున్న తర్వాత ఆ సంస్థలో భారీ స్థాయిలో మార్పులకు నాంది పలికారు. అందులో ప్రధానంగా ఉద్యోగుల తీసివేత, అది కూడా ట్విటర్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా తొలగింపులు ఉండడంతో అది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఉద్యోగులను తొలగిస్తూ ట్విటర్ సంస్థ తీసుకున్న నిర్ణయాన్ని తాజాగా కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ ఖండించారు. ఈ అంశంపై స్పందిస్తూ.. భారత్లో ట్విటర్ ఉద్యోగుల అకస్మిక తొలగింపు సరైన చర్యకాదన్నారు. తొలగించిన వారికి మరో ఉద్యోగంలో మారేందుకు తగిన సమయం ఇవ్వాల్సి ఉందని అభిప్రాయపడ్డారు.దేశంలో దాదాపు 150-180 మంది ఉద్యోగులతో సహా ప్రపంచవ్యాప్తంగా ట్విట్టర్ వర్క్ఫోర్స్లో సగం మందిని తొలగించిన సంగతి తెలిసిందే. భారత్లో సేల్స్ నుంచి మార్కెటింగ్ వరకు, కంటెంట్ క్యూరేషన్ నుంచి కార్పొరేట్ కమ్యూనికేషన్ల విభాగాలలో పని చేస్తున్న ఉద్యోగులను తొలగించారు. ఇదిలా ఉండగా ట్విట్టర్ ఇండియాలో మిగిలిన ఉద్యోగులు కూడా భవిష్యత్తులో తమ పరిస్థతి ఏంటని భయంతో జీవిస్తున్నారు. మరో వైపు మస్క్ మాత్రం ట్విట్టర్ సంస్థ రోజుకు 4 మిలియన్ డాలర్లకు పైగా నష్టపోతున్నందున కంపెనీలోని సగం మంది ఉద్యోగులను తొలగించడం తప్ప వేరే మార్గం లేదంటున్నారు. చదవండి: ట్విటర్కు షాక్: లక్షలకొద్దీ కొత్త యూజర్లతో ప్రత్యర్థులకు పండగ -
ఫిరాయింపులకు కేరాఫ్ అడ్రస్ కేసీఆర్ కుటుంబమే : కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
-
దేశానికే ఆర్ధికశాఖ మంత్రి..కూరగాయల మార్కెట్లో ఇలా..
ఎప్పుడూ దేశ బడ్జెట్, జీడీపీ, జీఎస్టీ అంటూ ఆర్ధిక అంశాల్లో ఊపిరి సలపని పనితో బిజీగా ఉండే కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ సాధారణ మహిళగా మారారు. చెన్నైకి చెందిన ఓ వీధిలో కూరగాయలు కొంటూ స్థానికుల కంట పడ్డారు. ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. చెన్నై జిల్లా మైలాపూర్ దక్షిణ మాడ వీధిలో శనివారం సాయంత్రం నిర్మలా సీతారామన్ సందడి చేశారు. కేంద్ర మంత్రి హోదాను పక్కన పెట్టి సాధారణ గృహిణిగా కూరగాయాల్ని కొనుగోలు చేశారు. న్యూఢిల్లీకి బయలు దేరే ముందు ఇంట్లో వంటకు కావాల్సిన టర్కీ బెర్రీ (ఉస్తికాయలు), పిడి కరణై (కందగడ్డ), ములై కీరై (ఒక రకమైన ఉసిరికాయ), మనతక్కలి కీరై (పాల కూర)ను కొనుగోలు చేశారు. During her day-long visit to Chennai, Smt @nsitharaman made a halt at Mylapore market where she interacted with the vendors & local residents and also purchased vegetables. pic.twitter.com/emJlu81BRh — NSitharamanOffice (@nsitharamanoffc) October 8, 2022 కూరగాయలు కొనుగోలు చేసే సమయంలో స్థానికులతో ముచ్చటించారు. వారితో సెల్ఫీలు దిగ్గారు. ఈ సందర్భంగా నిర్మలా సీతారామన్ను ఉద్దేశిస్తూ ‘వీధిల్లో కూరగాయలు కొనుగోలు చేసే సమయంలో ఆమె సెక్యూరిటీని చూసి వ్యాపారులు కాస్త బయపడ్డారు. ఇక్కడికి వచ్చింది నిర్మలా సీతారామన్ అని తెలుసుకొని సంతోషించారని, స్థానికులు టీ తాగేందుకు పిలిచినట్లు బీజేపీ ఎమ్మెల్యే వానతీ శ్రీనివాసన్ అన్నారు. చదవండి👉 ‘ప్రైవేట్ రంగం హనుమంతుడిలాంటిది’: నిర్మలా సీతారామన్ -
లోక్సభ స్థానాల్లో రాజకీయ వేడి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వరుస పర్యటనలతో కేంద్ర మంత్రులు రాజకీయ దుమారం రేపుతున్నారు. ‘పార్లమెంట్ ప్రవాస్ యోజన’ కార్యక్రమంలో భాగంగా ఇప్పటికే పలువురు కేంద్ర మంత్రులు రాష్ట్రంలో క్షేత్ర స్థాయిలో పర్యటించారు. తాజాగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ జహీరాబాద్ లోక్సభ పరిధిలో పర్యటన చేపట్టారు. గురువారం రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ఆమె ఘాటైన విమర్శలు చేయడం తెలిసిందే. ఇక శుక్రవారం బీర్కూర్లో జిల్లా కలెక్టర్ను రేషన్ బియ్యంపై నిలదీయడం చర్చనీయాంశమ య్యింది. ఈ పథకం కింద కిలో బియ్యానికి రూ.35 వరకు ఖర్చవుతుంటే, కేంద్రం 28 చెల్లిస్తున్న విషయాన్ని వెల్లడించడంతో పాటు రేషన్ షాపుల్లో మోదీ చిత్రపటాలు పెట్టాలంటూ ఆదేశించడం టీఆర్ఎస్ ఆగ్రహానికి కారణమైంది. గతంలో పర్యటించిన కేంద్ర మంత్రులు కూడా రాష్ట్ర సర్కార్, గులాబీ పార్టీపై విమర్శలు గుప్పించడం, అందుకు దీటుగా రాష్ట్ర మంత్రులు స్పందించడం తెలిసిందే. 14 ఎంపీ స్థానాల్లో..పక్కా వ్యూహంతో వచ్చే అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల నేపథ్యంలో పలువురు కేంద్ర మంత్రులు రాష్ట్రంలోని 14 ఎంపీ స్థానాల్లో (బీజేపీ సిట్టింగ్ స్థానాలు సికింద్రాబాద్, కరీంనగర్, నిజామాబాద్ మినహాయించి) పర్యటించి కేంద్రం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ, అభివృద్ధి పథకాలను గురించి ప్రజలకు ప్రత్యక్షంగా తెలియజేయా లని బీజేపీ జాతీయ నాయకత్వం ఆదేశించింది. పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడంపై క్షేత్రస్థాయి పరిశీలనలు నిర్వహించాలని సూచించింది. విభిన్న పథకాల ద్వారా వివిధ వర్గాల పేదలకు కేంద్రం నుంచి అందుతున్న సహాయం, ఆయా సంక్షేమ, అభివృద్ధి పథకాలకు కేంద్ర వాటాగా అందజేస్తున్న నిధులు కేంద్రమంత్రుల ద్వారా వివరిస్తే దాని ప్రభావం ప్రజల్లో ఎక్కువగా ఉంటుందనే భావనతో బీజేపీ ఈ వ్యూహాన్ని ఎంచుకుంది. ఈ నేపథ్యంలోనే కేంద్ర మంత్రులు జిల్లాల్లో మకాం వేస్తున్నారు. లోక్సభ ఎన్నికలు ముగిసేదాకా.. లోక్సభ ఎన్నికలు ముగిసేదాకా ఈ పర్యట నలు కొనసాగనున్నాయి. ఇప్పటికే హైదరా బాద్ లోక్సభ పరిధిలో జ్యోతిరాధిత్య సింధియా, ఆదిలాబాద్ (ఎస్టీ) స్థానంలో పురు షోత్తం రూపాలా, మల్కాజిగిరిలో ప్రహ్లాద్ జోషి, నల్లగొండలో కైలాష్చౌదరి, భువనగి రిలో దేవీసింగ్, ఖమ్మంలో బీఎల్ వర్మ పర్యటించారు. తాజాగా నిర్మలా సీతారామన్ జహీరాబాద్ పర్యటన చేపట్టారు. ఇక మహబూబ్నగర్ లోక్సభ పరిధిలో కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి మహేంద్రనాథ్ పాండే శుక్రవారం నుంచి పర్యటన ప్రారంభించారు. ఈ నెల 4,5 తేదీల్లో మహబూబా బాద్ ఎంపీ స్థానంలో కేంద్రమంత్రి బీఎల్ వర్మ పర్యటించనున్నారు. ఇప్పటికే పర్యటించినా మళ్లీ నెలా, రెండునెలల వ్యవధిలో మరోసారి తమకు కేటాయించిన లోక్సభ సీట్ల పరిధిలో పర్యటిస్తారు.