-
‘తూర్పు’న వరద నష్టం రూ.2,442 కోట్లు
సాక్షి, కాకినాడ, సాక్షి ప్రతినిధి, ఏలూరు: భారీ వర్షాలు, వరదల వల్ల తూర్పు గోదావరి జిల్లాలో వివిధ రంగాలకు రూ.2,442 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు జిల్లా కలెక్టర్ డి.మురళీధర్రెడ్డి కేంద్ర బృందం దృష్టికి తెచ్చారు. కేంద్ర హోంశాఖ సంయుక్త కార్యదర్శి సౌరవ్రాయ్ నేతృత్వంలోని బృందం మంగళవారం జిల్లాలో పర్యటించి పంట నష్టం, రహదారుల పరిస్థితిని పరిశీలించింది. కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ కమిషనర్ ఆయుష్ పునియా, రోడ్డు రవాణా, హైవే మంత్రిత్వశాఖ ఎస్ఈ శ్రావణ్కుమార్ సింగ్, కేంద్ర ఆర్థిక శాఖ వ్యయ విభాగం కన్సల్టెంట్ ఆర్.బి.కౌల్లతో కూడిన బృందం పర్యటనలో పాల్గొంది. బృందం తొలుత రావులపాలెం, పొడగట్లపల్లి, జోన్నాడ తదితర ప్రాంతాల్లో పంట నష్టాన్ని పరిశీలించి రైతులను కలుసుకుంది. పంట పైకి పచ్చగా కనిపిస్తున్నా 21 రోజుల పాటు నీళ్లలో ఉన్నందున వేర్లు కుళ్లిపోయాయని, గెల వేసే పరిస్థితి లేదని ఓ అరటి రైతు ఆవేదన వ్యక్తం చేశారు. కాకినాడ కలెక్టరేట్లో ఫొటో ఎగ్జిబిషన్ను బృందం పరిశీలించింది. నష్టం వివరాలను కలెక్టర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. వర్షాలు, వరదల వల్ల వ్యవసాయ, ఉద్యాన పంటలకు రూ.422.60 కోట్లు, మౌలిక సదుపాయాలకు రూ.2,019.43 కోట్ల మేర నష్టం వాటిల్లిందని తెలిపారు. తూర్పు గోదావరి జిల్లా కొమరాజు లంకలో దెబ్బతిన్న అరటిని కేంద్ర బృందానికి చూపిస్తున్న రైతు. చిత్రంలో ఎమ్మెల్యే జగ్గిరెడ్డి పోలవరం నక్లెస్బండ్ పరిశీలన.. ► పశ్చిమ గోదావరి జిల్లాలో దెబ్బతిన్న వరి చేలు, కూరగాయలు, అరటి తోటలను కేంద్ర బృందం సభ్యులు ఇంధన శాఖ సంచాలకులు ఓపీ సుమన్, వ్యవసాయ శాఖ సంయుక్త సంచాలకులు పొన్నుసామి, జలశక్తి శాఖ సంచాలకులు పి.దేవేందర్రావు పరిశీలించారు. తాడేపల్లిగూడెం మండలం నందమూరుకు చేరుకుని ఎర్రకాలువ వరద ముంపునకు గురైన వరి పొలాలను పరిశీలించి రైతులతో మాట్లాడారు. నందమూరు అక్విడెక్ట్ వద్ద నిడదవోలు ఎమ్మెల్యే శ్రీనివాస్ నాయుడు కేంద్ర బృందానికి ఎర్ర కాలువ కింద సాగు వివరాలను తెలియచేశారు. పోలవరంలో కోతకు గురైన నక్లెస్బండ్ ప్రాంతాన్ని బృందం పరిశీలించింది. కలెక్టర్ ముత్యాలరాజు జిల్లాలో జరిగిన నష్టాన్ని బృందానికి వివరించారు. నేడు సీఎం జగన్తో కేంద్ర బృందం సమావేశం సాక్షి, అమరావతి: రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదల వల్ల వివిధ రంగాలకు జరిగిన నష్టాలను ప్రత్యక్షంగా పరిశీలించిన కేంద్ర బృందం బుధవారం మధ్యాహ్నం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డితో తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సమావేశం కానుంది. కేంద్ర హోంశాఖ సంయుక్త కార్యదర్శి సౌరవ్రాయ్ నేతృత్వంలోని కేంద్ర బృందం రెండు రోజుల పాటు అనంతపురం, గుంటూరు, కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాల్లో పర్యటించి నష్టాలను పరిశీలించిన విషయం తెలిసిందే. -
ఇకపై కశ్మీర్లో భూములు కొనొచ్చు..
శ్రీనగర్: జమ్మూకశ్మీర్లో ఇకపై ఎవరైనా భూములను కొనొచ్చు. ఈ మేరకు కేంద్ర హోంశాఖ గెజిట్ నోటిఫికేషన్ను మంగళవారం విడుదల చేసింది. జమ్మూకశ్మీర్లోని పలు చట్టాలకు చేసిన సవరణల్లో ఈ మార్పులను తీసుకొచ్చారు. ఆర్టికల్ 370 రద్దుకు ముందు కేవలం ఆ రాష్ట్రంలోని శాశ్వత నివాసితులు మాత్రమే భూములు కొనే హక్కును కలిగి ఉండేవారు. సెక్షన్ 17లోని ఆ హక్కును కేంద్రం తొలగించడంతో, ఇప్పుడు ఎవరైనా జమ్మూకశ్మీర్లో భూములను కొనొచ్చు. అయితే వ్యవసాయ భూములను, వ్యవసాయేతరులకు అమ్మేందుకు ఈ సవరణ అంగీకరించలేదని లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా చెప్పారు. అయితే వ్యవసాయ భూములను విద్య, వైద్యానికి సంబంధించిన లక్ష్యాలకు వినియోగించుకోవచ్చు. ఈ చర్యను పీపుల్స్ అలియన్స్ ఫర్ గుప్కర్ డిక్లరేషన్ (పీఏజీడీ) వ్యతిరేకించింది. ఈ సవరణలు ఆమోదనీయం కాదని నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా వ్యాఖ్యానించారు. జమ్మూకశ్మీర్ను అమ్మకానికి పెట్టారని అన్నారు. పీడీపీ అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ మాట్లాడుతూ.. రాజ్యాంగ వ్యతిరేకంగా ఆర్టికల్ 370ని రద్దు చేశాక, ఇప్పుడు జమ్మూకశ్మీర్ను అమ్మకానికి పెట్టారని, తమ సహజవనరులను దోచుకోవడానికి అవకాశం కల్పిస్తున్నారని వ్యాఖ్యానించారు. -
అత్యాచార కేసుల్లో జీరో ఎఫ్ఐఆర్ నమోదు
సాక్షి, అమరావతి: మహిళలు, ఆడపిల్లలపై రోజురోజుకీ పెరిగిపోతున్న దారుణాలపై కేంద్ర హోం శాఖ స్పందించింది. ఉత్తరప్రదేశ్లో జరిగిన హాథ్రస్ హత్యాచార ఘటన నేపథ్యంలో మహిళల భద్రతకు తీసుకోవాల్సిన చర్యలపై అన్ని రాష్ట్రాలకు మార్గదర్శకాలు జారీ చేసింది. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ చట్టాలను అనుసరించి కేంద్ర హోం శాఖ జారీ చేసిన మార్గదర్శకాలు ఇలా ఉన్నాయి.. ► మహిళలపై నేరాలు.. ప్రధానంగా అత్యాచారం వంటి కేసుల్లో పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలి. లైంగిక దాడి వంటి ఘటనల్లో తప్పనిసరిగా ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి. ఒకవేళ నేరం బాధితురాలుండే పోలీస్స్టేషన్ పరిధి వెలుపల జరిగితే.. ఎక్కడైనా సరే ‘జీరో ఎఫ్ఐఆర్’ నమోదు చేయాల్సిందే. లేకపోతే సదరు పోలీస్ అధికారి శిక్షార్హుడు. ► లైంగిక దాడి గురించి సమాచారం అందిన 24 గంటల్లోగా బాధితురాలికి వైద్య పరీక్షలు నిర్వహించాలి. న్యాయాధికారి ముందు రికార్డు చేయనప్పటికీ.. బాధితురాలి మరణ వాంగ్మూలం పరిగణనలోకి తీసుకోవాలి. ► లైంగిక దాడుల కేసుల్లో సాక్ష్యాలను సేకరించేందుకు సెక్సువల్ అసెల్ట్ ఎవిడెన్స్ కలెక్షన్ కిట్లను ఉపయోగించాలి. అత్యాచార కేసుల్లో పోలీసుల దర్యాప్తు 60 రోజుల్లో పూర్తి చేయాలి. ► దర్యాప్తులో రాష్ట్ర పోలీసులకు సహకారం అందించేందుకు ‘ఇన్వెస్టిగేషన్ ట్రాకింగ్ సిస్టమ్ ఫర్ సెక్సువల్ అఫెన్సెస్’ ఆన్లైన్ పోర్టల్ను కేంద్ర హోం శాఖ అందుబాటులోకి తెచ్చింది. ఈ మార్గదర్శకాలు పాటించని పోలీసులపైనా కఠిన చర్యలు ఉంటాయి. ఆదర్శంగా ఆంధ్రప్రదేశ్ మహిళలు, ఆడపిల్లల రక్షణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవడంలో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ ఆదర్శంగా నిలిచింది. తెలంగాణలో జరిగిన ‘దిశ’ ఘటన నేపథ్యంలో.. ఏపీలోని ఆడబిడ్డలెవరికీ అలాంటి అన్యాయం జరగకూడదనే ఉద్దేశంతో వైఎస్ జగన్ ప్రభుత్వం పటిష్ట చర్యలు చేపట్టింది. మహిళలు, బాలికల రక్షణకు ప్రత్యేకంగా ‘దిశ’ యాక్ట్ తెచ్చింది. దిశ పోలీస్ స్టేషన్లు, సైంటిఫిక్ ల్యాబ్లు ఏర్పాటు చేసింది. ఫలితంగా మహిళలు, చిన్నారులపై అత్యాచారానికి, లైంగిక వేధింపులకు పాల్పడిన దుర్మార్గులకు 21 రోజుల్లోనే శిక్షలు పడేలా కృషి చేస్తోంది. ఏపీలోని దిశ యాక్ట్ తరహాలోనే ప్రత్యేక చట్టం తెచ్చేందుకు మహారాష్ట్ర, తదితర రాష్ట్రాలు ఏపీలో అధ్యయనం కూడా చేశాయి. అన్యాయానికి గురైన మహిళలు ఎక్కడైనా ఫిర్యాదు చేసేలా 2019 డిసెంబర్ 5 నుంచే రాష్ట్రంలో జీరో ఎఫ్ఐఆర్ను అమలులోకి తెచ్చారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 341 జీరో ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. సీఎం వైఎస్ జగన్ నేతృత్వంలో రాష్ట్రంలో తీసుకొచ్చిన దిశ యాక్ట్, జీరో ఎఫ్ఐఆర్ తదితరాలు మహిళలు, చిన్నారుల రక్షణలో సత్ఫలితాలను ఇస్తున్నాయని ఏపీ పోలీస్ శాఖ టెక్నికల్ చీఫ్ పాల్రాజ్ ‘సాక్షి’కి తెలిపారు. -
15 నుంచి తెరుచుకోనున్న థియేటర్లు
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర హోం శాఖ తాజాగా అన్లాక్–5 మార్గదర్శకాలను జారీ చేసింది. కంటైన్మెంట్ జోన్లు మినహా మిగిలిన ప్రాంతాల్లో మరిన్ని కార్యకలాపాలు ప్రారంభించేందుకు వీలుగా బుధవారం అన్లాక్–5 మార్గదర్శకాలను విడుదల చేసింది. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు కేంద్ర మంత్రిత్వ శాఖతో విస్తృత సంప్రదింపులు జరిపిన తర్వాత ఈ మార్గదర్శకాలను జారీ చేసింది. ఇందులో భాగంగా పాఠశాలలు, విద్యా, శిక్షణ సంస్థలు తెరిచే అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వాలకే వదిలేసింది. 50 శాతం సీట్ల సామర్థ్యంతో థియేటర్లు, మల్టీప్లెక్స్లకు అనుమతిచ్చింది. అంతర్జాతీయ విమాన ప్రయాణాలపై ఆంక్షలను యథాతథంగా కొనసాగించింది. అక్టోబర్ 15 నుంచి అనుమతించేవి.. ► 50 శాతం సీట్ల సామర్థ్యంతో సినిమా హాళ్లు, థియేటర్లు, మల్టీప్లెక్స్లు తెరుచుకోవచ్చు. దీనికోసం కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ప్రత్యేక నియమావళి జారీ చేస్తుంది. ► వాణిజ్య శాఖ జారీ చేసే ప్రత్యేక నియమావళి ఆధారంగా వాణిజ్య సంస్థలు (బిజినెస్ టు బిజినెస్) ఎగ్జిబిషన్లు తెరుచుకోవచ్చు. ► క్రీడాకారుల శిక్షణ కోసం ఉపయోగించే స్విమ్మింగ్ పూల్స్కు అనుమతి. దీనిపై క్రీడల మంత్రిత్వ శాఖ ప్రత్యేక ప్రామాణిక నియమావళి జారీ చేస్తుంది. ► ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ జారీ చేసే నియమావళి ఆధారంగా ఎంటర్టైన్మెంట్ పార్కులు, ఈ తరహా సంస్థలు తెరుచుకోవచ్చు. విద్యా సంస్థల ప్రారంభంపై మార్గదర్శకాలు.. ► అక్టోబర్ 15 తర్వాత పాఠశాలలు, కళాశాలలు, శిక్షణ సంస్థలను దశల వారీగా ప్రారంభించుకునే వెసులుబాటును కేంద్రం రాష్ట్రాలకు విడిచిపెట్టింది. అయితే ఆయా సంస్థలు కేంద్రం విధించిన షరతులను పాటించాలి. ► ఆన్లైన్ విద్య, దూరవిద్య కొనసాగాలి. హాజరు నిబంధనలు అమలు చేయరాదు. ► విద్యార్థులు పాఠశాలకు రాకుండా ఆన్లైన్ తరగతులకు హాజరు కావడానికి ఇష్టపడితే అందుకు వారిని అనుమతించాలి. ► తల్లిదండ్రుల రాతపూర్వక అనుమతితో మాత్రమే పాఠశాలలు, శిక్షణ సంస్థలకు విద్యార్థులు హాజరుకావచ్చు. ► పాఠశాలలు, శిక్షణ సంస్థలను తెరిచేందుకు కేంద్ర విద్యా శాఖ జారీ చేసే నియమావళి ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వాలు విద్యార్థుల ఆరోగ్యం, భద్రతకు సంబంధించి నియమావళి తయారు చేసుకోవాలి. ► రాష్ట్రాల ప్రామాణిక నియమావళిని పాఠశాలలు తప్పనిసరిగా పాటించాలి. ► కరోనా పరిస్థితిని అంచనా వేసి కేంద్ర హోం శాఖతో సంప్రదించి కళాశాలలు, ఉన్నత విద్యాసంస్థలు ప్రారంభించవచ్చు. ► సైన్స్ అండ్ టెక్నాలజీ స్ట్రీమ్లోని పీహెచ్డీ, పీజీ విద్యార్థులకు అక్టోబర్ 15 నుంచి ఉన్నత విద్యా సంస్థలు తెరిచేందుకు అనుమతిస్తారు. ఈ విషయంలో కేంద్ర నిధులతో పనిచేసే ఉన్నత విద్యా సంస్థల అధిపతి ఈ అవసరాన్ని గుర్తిస్తారు. రాష్ట్ర విశ్వవిద్యాలయాలు, ప్రైవేట్ వర్సిటీలు తదితరాలపై రాష్ట్ర ప్రభుత్వాలదే నిర్ణయం. 50 శాతం భర్తీకి అనుమతి.. ► సామాజిక, విద్య, క్రీడలు, వినోదం, సాంస్కృతిక, మత, రాజకీయ వేడుకలు, ఇతర సమ్మేళనాలకు సంబంధించి ప్రస్తుత మార్గదర్శకాల ప్రకారం 100 మంది వరకు అనుమతించారు. అక్టోబర్ 15 తర్వాత కంటైన్మెంట్ జోన్ల వెలుపల 100 మందికి మించి ఇలాంటి సమావేశాల నిర్వహించే అనుమతిని రాష్ట్ర ప్రభుత్వాలకు కల్పించింది. ఇందుకు ఈ నియమాలు పాటించాలి. ► హాల్ సామర్థ్యంలో గరిష్టంగా 50 శాతం భర్తీకి అనుమతిస్తారు. గరిష్టంగా 200 మందికి మించకూడదు. మాస్క్లు ధరించడం, భౌతిక దూరాన్ని పాటించడం, థర్మల్ స్కానింగ్, హ్యాండ్ వాష్ లేదా శానిటైజర్ వాడకం తప్పనిసరి. అంతర్జాతీయ ఆంక్షలు యథాతథం.. ► హోం శాఖ అనుమతించిన ప్రయాణాలు మినహా అంతర్జాతీయ విమాన ప్రయాణాలపై ఆంక్షలు యథాతథంగా కొనసాగుతాయి. ► కంటైన్మెంట్ జోన్లలో అక్టోబర్ 31 వరకు లాక్డౌన్ కొనసాగుతుంది. ► కంటైన్మెంట్ జోన్ల వెలుపల రాష్ట్రాలు కేంద్రంతో సంప్రదించకుండా లాక్డౌన్ విధించరాదు. -
అంతిమ నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వానిదే
-
అంతిమ నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వానిదే: కేంద్రం
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని విషయంలో తమ జోక్యం ఉండదని మరోసారి కేంద్రం స్పష్టీకరించింది. ఈ మేరకు ఏపీ హైకోర్టులో కేంద్ర హోంశాఖ అనుబంధ పిటిషన్ దాఖలు చేసింది. రాష్ట్రానికి ఒకే రాజధాని ఉండాలని చట్టంలో ఎక్కడా లేదని పేర్కొంది. సెక్షన్ 13 ప్రకారం రాజధాని అంటే ఒకటికే పరిమితం కావాలని కాదని పేర్కొంది. 2018లో అప్పటి ప్రభుత్వం అమరావతిలో హైకోర్టు పెట్టిందని,హైకోర్టు ఉన్నంత మాత్రాన అమరావతినే రాజధాని అని చెప్పలేమని స్పష్టం చేసింది. రాజధాని విషయంలో రాష్ట్ర ప్రభుత్వానిదే అంతిమ నిర్ణయం అని కేంద్రం తెలిపింది. (చదవండి: అభివృద్ధి వికేంద్రీకరణకే కట్టుబడి ఉన్నాం : వైఎస్ జగన్) -
రికార్డు స్థాయిలో కొత్త కేసులు..
న్యూఢిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి రోజురోజుకూ తీవ్ర రూపం దాలుస్తోంది. శుక్రవారం తాజాగా మరో 77,266 కేసులు బయటపడ్డాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 33,87,500కు చేరుకుంది. గత 24 గంటల్లో 60,177 మంది కోలుకోగా 1,057 మంది మరణించారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 61,529కు చేరుకుందని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 25,83,948కు చేరుకోగా, యాక్టివ్ కేసుల సంఖ్య 7,42,023గా ఉంది. మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసుల శాతం 21.90గా ఉంది. యాక్టివ్ కేసుల కంటే కోలుకున్న కేసులు 18 లక్షలకు పైగా అధికంగా ఉన్నాయి. అంతేగాక యాక్టివ్ కేసుల కంటే 3.5 రెట్లు కోలుకున్న కేసులు ఉండటం గమనార్హం. దేశంలో కరోనా రికవరీ రేటు క్రమంగా పెరుగుతోంది. బుధవారానికి ఇది 76.28 శాతానికి పెరిగినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. మరణాల రేటు క్రమంగా తగ్గుతోందని ప్రస్తుతం 1.82 శాతానికి పడిపోయిందని తెలిపింది. ఆగస్టు 27 వరకు 3,94,77,848 శాంపిళ్లను పరీక్షించినట్లు ఐసీఎంఆర్ తెలిపింది. గురువారం మరో 9,01,338 శాంపిళ్లను పరీక్షించినట్లు తెలిపింది. రోజుకు పది లక్షల పరీక్షలు జరిపే దిశగా దేశం పయనిస్తోందని తెలిపింది. గత రెండు వారాల్లోనే ఏకంగా కోటికి పైగా పరీక్షలు జరిపినట్లు వెల్లడించింది. ప్రతి పది లక్షల మందిలో 28,607 మందికి పరీక్షలు నిర్వహించినట్లు వెల్లడించింది. -
అక్రమంగా అడుగిడుతూ.. ఇక్కడే స్థిరపడుతూ..
మనదేశంలో ఎంతమంది విదేశీయులు అక్రమంగా ఉంటున్నారన్న ప్రశ్నకు కేంద్ర హోం శాఖ వద్ద సమాచారం లేదు.’ తెలంగాణలో ఎందరు రోహింగ్యాలు పాస్పోర్టు, ఆధార్ వంటి గుర్తింపు పత్రాలు కలిగి ఉన్నారన్న విషయంపై ఆర్టీఐ దరఖాస్తుకు తెలంగాణ డీజీపీ కార్యాలయం ఇంకా సమాధానం వెల్లడించలేదు. సాక్షి,హైదరాబాద్: విజిటింగ్ వీసాల పేరిట భారత్లోకి వస్తున్న విదేశీయులు ఏం చేస్తున్నారు? వారిపై నిఘా ఉందా? మొన్న తబ్లిగీ జమాత్ కోసం వచ్చిన ఇండోనేషియన్లు విజిటింగ్ వీసాను దుర్వినియోగం చేయడం, వారివల్ల దేశంలో కరోనా వ్యాపించడంపై ఆలస్యంగా మేల్కొన్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వారి వీసాలు రద్దు చేసి, వారిపై వీసా ఉల్లంఘన కింద కేసులు నమోదు చేశాయి. అయితే ఇప్పటికే భారత్ పొరుగునే ఉన్న బంగ్లాదేశ్ వల్ల దేశంలోకి అక్రమ వలసలు పెరుగుతున్నాయి. ఈ విషయంలో అక్రమ వలసలకు తోడు విజిటింగ్ వీసాల మీద వచ్చిన వారిపైనా పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే బంగ్లాదేశ్లోని పలు ముఠాలు భారత్లో మానవ అక్రమ రవాణా, పశువుల అక్రమ రవాణా, దొంగనోట్ల కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. ఉగ్రదాడులకూ ప్రణాళికలు రచిస్తున్నాయి. వాటిలో దొంగనోట్లు దేశ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తూ.. దేశంలో విధ్వంసాలకు కారణంగా మారుతోంది. 9 లక్షలకు పైగానే.. తబ్లిగీ జమాత్ ఉదంతం నేపథ్యంలో ఆగస్టు 2019 నుంచి మార్చి 2020 వరకు దేశంలోకి ఎందరు విజిటింగ్ వీసాలపై వచ్చారన్న సమాచారం ‘సాక్షి’ సేకరించింది. దీనిపై బంగ్లాదేశ్లోని ఢాకాలో ఉన్న భారత ఎంబసీకి సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేయగా ఆగస్టు నుంచి మార్చి వరకు 9.6 లక్షల మంది బంగ్లాదేశీయులు విజిటింగ్ వీసాలపై భారత్లోకి వచ్చారు. అలాగే వియత్నాం నుంచి 1,126 మంది, కౌలాలంపూర్లోని 1,405 మంది ఇండోనేషియన్లకు భారత్లో పర్యటించేందుకు వీసాలు ఇచ్చామని వాళ్లెవరికీ మతపరమైన వీసాలు జారీ చేయలేదని స్పష్టం చేసింది. తెలంగాణలోనూ అధికంగా..! వివిధ దేశాల నుంచి విజిటింగ్ వీసాలపై వచ్చిన వారిలో కొందరు వీసా గడువు ముగిసినా వెనక్కి వెళ్లట్లేదు. ఇలాంటి వారిలో కొందరు తెలంగాణలోనూ స్థిరపడుతున్నారన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. తెలంగాణ జిల్లాలు, గ్రేటర్ హైదరాబాద్లో కలిపి 10 వేల మందికిపైగానే రోహింగ్యాలు, ఇతర విదేశీయులు అక్రమంగా ఉంటున్నారని సమాచారం. వారికి కొన్ని స్వచ్ఛంద సంస్థలు ఆశ్రయం కల్పిస్తుండగా మిగిలిన వారు భూములను కబ్జా చేసి స్థిర నివాసం ఏర్పరుచు కుంటున్నారు. ఆధార్, పాస్పోర్ట్, పా¯Œ కార్డు, ఓటర్ కార్డు, డ్రైవింగ్ లైసె¯Œ ్స వంటి గుర్తింపు పత్రాలను సులువుగా సంపాదిస్తున్నారు. -
వైరస్పై యుద్ధం.. ఇలా చేద్దాం
సాక్షి, హైదరాబాద్: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్పై పోరాటం చేయాలంటే జాగ్రత్తలు తీసుకుంటే మాత్రమే సరిపోదు. మంచి పోషకాలతో కూడిన ఆహారం తీసుకుంటూ రోగనిరోధక శక్తి (ఇమ్యూనిటీ)ని పెంచుకోవాలి. ప్రస్తుత పరిస్థితుల్లో ఇంతకుమించిన మందు మరేదీ లేదు. వైరస్ వ్యాప్తి దృష్ట్యా ప్రతి ఒక్కరు భౌతికదూరం పాటించాలని, జనం సమూహాలుగా ఏర్పడరాదనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం లాక్డౌన్ విధించింది. ఈ క్రమంలో అత్యవసర పనులపై బయటకు వచ్చి.. తిరిగి ఇళ్లకు చేరుకునే విషయంలో, సరుకుల కొనుగోలు, ఇతర సమయాల్లో ప్రజలు అనుసరించాల్సిన విధానాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కేంద్ర హోంమంత్రిత్వ శాఖ తాజా మార్గదర్శకాలను జారీచేసింది. ఈ సలహా సూచనలను కుటుంబంలోని ప్రతి ఒక్కరు తప్పనిసరిగా అనుసరించాలని స్పష్టంచేసింది. పోషకాహారం.. యోగాసనాలు కరోనా వైరస్ కట్టడికి ఇంతవరకు వ్యాక్సిన్ లేదు. ప్రత్యామ్నాయ పద్ధతుల్లో చికిత్స అందించి రోగం తీవ్రతను తగ్గిస్తున్నప్పటికీ సరైన మందులు అందుబాటులో లేవు. అందువల్ల సరైన ఆహారం తీసుకుంటూ శరీరంలో రోగ నిరోధకశక్తిని పెంచుకోవడం, వ్యాయామం చేయడం ద్వారా కరోనాను జయించవచ్చు. రోజూ కనీసం 30నిమిషాల పాటు యోగాసనాలు, ప్రాణాయామం వంటివి ఆచరించాలి. మాస్క్, శానిటైజర్, భౌతికదూరం.. ► ఇంటి బయటకు వెళ్లేముందు ట్రిపుల్ లేయర్ లేదా ఎన్–95 లేదా సర్జికల్ మాస్క్ తప్పక ధరించాలి. కాలికి ప్లాస్టిక్ స్లిప్పర్లు వేసుకోవాలి. ► సరుకుల కోసం సంచి లేదా ప్లాస్టిక్ బాస్కెట్ తీసుకెళ్లాలి. మార్కెట్లో/బయట వివిధ ఉపరితలాలను తాకకుండా జాగ్రత్త పడాలి. ► దుకాణాదారు లేదా ఇతరులకు కనీసం ఆరడుగుల దూరంలో ఉండాలి. మార్కెట్కు వెళ్లేవారు వెంట హ్యాండ్ శానిటైజర్ను తీసుకెళ్లాలి. ► అత్యవసరమైతేనే మార్కెట్కు వెళ్లాలి. వారంలో రెండుసార్లకు మించి వెళ్లకపోవడం మంచిది. ► ఏటీఎంలో నగదు డ్రా చేయాలంటే ముందు మిషన్ కీబోర్డును శానిటైజ్ చేయాలి. కార్డు వినియోగించాక కూడా శానిటైజర్తో శుభ్రంచేయాలి. ► ఇంట్లో ఉన్నప్పుడు కరోనా లక్షణాలు లేని వారు మాస్కు వాడనవసరం లేదు. లిఫ్ట్ వద్దు.. మెట్లే ముద్దు ► ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, ఇతర భవనాల్లో లిఫ్ట్ వాడకాన్ని తగ్గించాలి. ఎక్కువ మంది దీన్ని విని యోగించడం, తక్కువ విస్తీర్ణం గల వీటిలో భౌతికదూరం పాటించడం కష్టం కాబట్టి.. మెట్లు వాడాలి. ూ ► వాడటం తప్పనిసరైతే పేపర్ ముక్కల ద్వారా బటన్లు నొక్కి.. ఆపై వాటిని డస్ట్బిన్ లో పారేయాలి. ూ ఇంట్లోకి వెళ్లే ముందు ఎక్కడా, ఎలాంటి ఉపరితలాలను తాకకూడదు. నేరుగా బాత్రూమ్కు వెళ్లి బట్టలు వదిలేసి స్నానం చేయాలి (ఎక్కువ మందిని తక్కువ దూ రంతో తాకినట్టు భావిస్తే). లేదంటే చేతులు, ము ఖాన్ని సబ్బు/హ్యాండ్వాష్తో శుభ్రం చేసుకోవాలి. ► చెప్పులను కూడా శుభ్రం చేసుకోవాలి. ► ఇంట్లోకి బయటి వ్యక్తులను అనుమతించేటప్పుడు వారి శరీర ఉష్ణోగ్రతలను పరిశీలించాలి. సమస్య లేకుంటే, శానిటైజర్తో చేతులు శుభ్రం చేసుకున్న తర్వాతే వారిని లోనికి అనుమతించాలి. ఇంటి పరిశుభ్రత ఇలా... ► ఇళ్లను రోజూ డిటర్జెంట్ ఉన్న ద్రావణంతో శుభ్రం చేయాలి. ముఖద్వారంతో పాటు కాలింగ్బెల్ను క్రమం తప్పకుండా శానిటైజ్ చేయాలి. ► సబ్బు లేదా హ్యాండ్వాష్తో చేతులను 20 సెకన్లపాటు రుద్ది కడుక్కోవాలి. ► మార్కెట్ నుంచి తెచ్చిన కూరగాయలు, పాలప్యాకెట్లను ఉప్పు/బేకింగ్ సోడాలో 2శాతం డిటర్జెంట్ ద్రావణంతో కలిపి కడిగి శుభ్రం చేయాలి. ► ఇంట్లోకి తెచ్చిన ఇతర వస్తువులను.. 72 గంటల అనంతరం వినియోగించడం మంచిది. అవసరం లేని వస్తువులను కొనుగోలు చేయొద్దు. వైరస్ ఏ ఉపరితలంపై ఎంతకాలం ఉంటుందంటే.. అల్యూమినియం: 2–8 గంటలు చెక్క: 4 రోజులు ప్లాస్టిక్: 2–5 రోజులు మెటల్: 5 రోజులు సెరామిక్: 5 రోజులు స్టీల్: 2–28 రోజులు గ్లాస్: 4–5 రోజులు -
ఒక్కరోజులో 1,074 మంది రికవరీ
న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ బారిన పడిన వారిలో గత 24 గంటల్లో 1,074 మంది కోలుకున్నారని కేంద్ర ఆరోగ్యశాఖ జాయింట్ సెక్రెటరీ లవ్ అగర్వాల్ చెప్పారు. ఇప్పటిదాకా ఒక్కరోజులో కోలుకున్న వారిలో ఇదే అత్యధికం. రికవరీ రేటు ప్రస్తుతం 27.52 శాతానికి పెరిగిందన్నారు. ఇప్పటికే 11,706 మంది కరోనా బాధితులు కోలుకొని డిశ్చార్జి అయ్యారు. కరోనా నిర్ధారణకు టెస్టింగ్ కిట్ల కొరత లేదన్నారు. కరోనా పరీక్షల సామర్థ్యం పెంచుతున్నామన్నారు. దేశంలో కరోనా విజృంభణ ఆగడం లేదు. ఆదివారం సాయంత్రం నుంచి సోమవారం సాయంత్రం వరకు 24 గంటల వ్యవధిలో 83 మంది కరోనా కాటుతో ప్రాణాలు విడిచారు. అలాగే కొత్తగా 2,573 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటిదాకా ఒక్కరోజులో నమోదైన కేసుల్లో ఇదే గరిష్టం. దీంతో మొత్తం మరణాలు 1,389కు, పాజిటివ్ కేసులు 42,836కు చేరాయి. సరుకు రవాణాలో సమస్యలుండొద్దు్ద దేశవ్యాప్తంగా రాష్ట్రాల మధ్య సరుకు రవాణా విషయంలో ఇబ్బందులు ఎదురు కాకుండా చర్యలు తీసుకోవాలని కేంద్ర హోంశాఖ అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు సూచించింది. ఎక్కడైనా ఏమైనా సమస్యలు ఉత్పన్నతమైతే ట్రక్కు డ్రైవర్లు కంట్రోల్ రూమ్ నంబర్ ‘1930’కు ఫోన్ చేయాలని పేర్కొంది. ఈ కంట్రోల్ రూమ్ రోజంతా పనిచేస్తుందని కేంద్ర హోంశాఖ జాయింట్ సెక్రెటరీ పుణ్యసలీల శ్రీవాస్తవ సోమవారం చెప్పారు. డ్రైవర్లు ‘1930’కు ఫోన్ చేసి సాయం పొందవచ్చు. -
వలస కూలీలు రాష్ట్రం దాటరాదు
సాక్షి, అమరావతి: వలస కూలీల విషయంలో రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్ర ప్రభుత్వం తాజాగా పలు సూచనలు చేసింది. రాష్ట్ర పరిధిలోని వలస కూలీలు అదే రాష్ట్రంలోని వేరే ప్రాంతంలో ఉంటే.. వారికి స్క్రీనింగ్ చేసి సొంతూళ్లకు పంపవచ్చని కేంద్రం పేర్కొంది. అలాగే స్వరాష్ట్రంలోని పనిచేసే ప్రాంతాలకు కూడా అనుమతించవచ్చని తెలిపింది. అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి, కేంద్ర పాలిత ప్రాంతాలకు వలస కూలీలను అనుమతించరాదని స్పష్టం చేసింది. ఈ మేరకు కేంద్ర హోం శాఖ కార్యదర్శి రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదివారం లేఖ రాశారు. ఈ ఆదేశాలు సోమవారం నుంచి అమల్లోకి రానున్నాయి. కంటైన్మెంట్ జోన్ల అవతల సోమవారం నుంచి పనిచేసే పరిశ్రమలు, మాన్యుఫాక్చరింగ్ యూనిట్లు, నిర్మాణ పనులు, వ్యవసాయ పనులు, ఉపాధి హామీ పనుల్లో పనిచేసే కూలీలు, వర్కర్లను దృష్టిలో ఉంచుకుని కేంద్రం ఈ మార్గదర్శకాలను జారీ చేసింది. ► కూలీలను సొంతూళ్లకు లేదా పనిచేసే ప్రాంతాలకు పంపించే సమయంలో బస్సుల్లో తగిన భౌతిక దూరం పాటించాలి. కూలీలను తరలించే బాధ్యత స్థానిక అధికార యంత్రాంగం తీసుకోవాలి. బస్సు ప్రయాణ సమయంలో కూలీలకు స్థానిక అధికార యంత్రాంగం ఆహారం, నీటి సౌకర్యం కల్పించాలి. ► ఇతర రాష్ట్రాల నుంచి వలస వచ్చిన కూలీలు ఎక్కడ ఉంటే అక్కడనే ఉండాలి. రాష్ట్రాల మధ్య వలస కూలీల రవాణాకు అనుమతించరాదు. ► ప్రస్తుతం సహాయ శిబిరాలు, షెల్టర్లలో ఉన్న వలస కూలీల వివరాలను ఆయా రాష్ట్ర ప్రభుత్వ అధికార యంత్రాంగం నమోదు చేసుకోవాలి. కూలీల పని నైపుణ్యాలు తెలుసుకుని అక్కడే తగిన పనులు కల్పించేందుకు చర్యలు తీసుకోవాలి. -
ఆ రోహింగ్యాలు ఎక్కడ?
సాక్షి, హైదరాబాద్: ఢిల్లీ తబ్లిగీ జమాత్కు సంబంధించి రోజుకో ఉదంతం బయటపడుతోంది. మొన్న ఢిల్లీ ప్రార్థనలు, నిన్న యూపీలోని దేవ్బంద్కు తబ్లిగీ జమాత్కు లింకులు బయటపడిన సంగతి తెలిసిందే. తాజాగా ఢిల్లీలోని నిజాముద్దీన్, హరియాణాలోని మేవాట్లో జరిగిన మత ప్రార్థనలలో విదేశాల నుంచి వచ్చిన మత ప్రచారకులతోపాటు మన దేశంలో అక్రమంగా వలస ఉంటున్న రోహింగ్యాలు కూడా పాల్గొన్నారని కేంద్ర నిఘా వర్గాలు గుర్తించాయి. వీరిలో చాలామంది క్యాంపులకు చేరుకోలేదని సమాచారం. దీంతో ఆయా రాష్ట్రాల్లో క్యాంపుల్లో తలదాచుకుంటోన్న రోహింగ్యాల ఆచూకీని గుర్తించి, వారికి పరీక్షలు నిర్వహించాలని అన్ని రాష్ట్రాల డీజీపీలకు కేంద్ర హోంశాఖ ఆదేశాలు జారీచేసింది. దీంతో పోలీసులకు కొత్త చిక్కు వచ్చి పడింది. దీంతో ఇప్పటికే మర్కజ్ వెళ్లినవారిని, తరువాత దేవ్బంద్కు వెళ్లిన వారిని గుర్తించేందుకు నానాతిప్పలు పడ్డ పోలీసులు.. ఇప్పుడు రోహింగ్యాల వేటలో పడ్డారు. అందుకే వెళ్లారా..? ఢిల్లీలో జరిగే తబ్లిగీ మత ప్రార్థనలకు దేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి పలువురు హాజరవుతారు. ఈ ప్రార్థనలకు హైదరాబాద్, తెలంగాణలో ఉంటున్న రోహింగ్యాలు కూడా వెళ్తుంటారు. మొన్న మార్చి రెండో వారంలో జరిగిన మత ప్రార్థనలకు వీరు సైతం హాజరయ్యారు. రోహింగ్యాలు అధికంగా ఉండే నగర శివార్లలోని పోలీసు అధికారులు కూడా ఈ విషయాన్ని ధ్రువీకరిస్తున్నారు. ఢిల్లీలో జరిగే మత ప్రార్థనలకు రోహింగ్యాలు హాజరవడంలో వింతేమీ లేదన్నారు. అయితే, తెలంగాణ నుంచి వెళ్లిన రోహింగ్యాలంతా హరియాణాలోని మేవాట్లో జరిగిన జమాత్లో పాల్గొన్నారని సమాచారం. రోహింగ్యాలు వలస జీవులు. చాలా కుటుంబాలు పేదరికంలో ఉంటాయి. రంజాన్ సమీపిస్తోన్న నేపథ్యంలో మేవాట్కు వచ్చే భక్తుల నుంచి విరాళాలు ఆశించి వీరంతా వెళ్లి ఉంటారని పోలీసులు అభిప్రాయపడుతున్నారు. వీరు మేవాట్తోపాటు, నిజాముద్దీన్లో జరిగిన ప్రార్థనలకు సైతం హాజరయ్యారని కేంద్ర నిఘా వర్గాలు చెబుతున్నాయి. మేవాట్కు నిజాముద్దీన్కు మధ్య దూరం కేవలం 90 కిలోమీటర్లే కావడంతో రెండు చోట్లా వీరు ప్రార్థనల్లో పాల్గొన్నట్లు అధికారులు గుర్తించారు. ఒకవేళ వీరికి కరోనా సోకి ఉంటే వీరి ద్వారా ఇతర ప్రాంతాలకు వ్యాపించే ప్రమాదం ఉండటంతో వారిని గుర్తించాలని కేంద్రం అన్ని రాష్ట్రాలను హెచ్చరించింది. దక్షిణాదిన తెలంగాణలోనే అధికం మనదేశంలో దాదాపు 40,000 మంది రోహింగ్యాలు ఉన్నారని ఐక్యరాజ్యసమితి లెక్కలు చెబుతున్నాయి. కానీ, అనధికారికంగా ఈ సంఖ్య ఇంకా అధికంగానే ఉంటుంది. దేశంలోకి అక్రమంగా ప్రవేశించిన వీరు అధికంగా మన దేశంలోని అస్సాం, బెంగాల్, ఢిల్లీ, కశ్మీర్, దక్షిణాదిన తెలంగాణలో ఆశ్రయం పొందుతున్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిసరాల్లో కొంతమంది మాత్రమే క్యాంపుల్లో ఉంటున్నారు. వీరిని గుర్తించడం సులువే. కానీ, చాలామంది పాతబస్తీ, బాలాపూర్ తదితర ప్రాంతాల్లో చెరువులు, కుంటలు ఆక్రమించి శాశ్వత నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు. ఇలాంటివారిలో ఎవరెవరు వెళ్లారన్న విషయం గుర్తించడం చాలా కష్టం. ఇప్పటివరకు అందిన సమా చారం మేరకు నల్లగొండలో 14 మంది, హైదరాబాద్ క్యాంపుల్లో ఉంటున్న ఐదుగురి ఆచూకీ తెలియలేదు. ఈ సంఖ్య మరింత అధికంగానే ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోనూ ఓ రోహింగ్యా క్యాంపు నడుస్తోంది. అందులో కూడా ఎవరైనా మిస్సయ్యారా? అన్న విషయంలోనూ పోలీసులు ఆరా తీస్తున్నారని సమాచారం. -
‘జూమ్’ సేఫ్ కాదు
న్యూఢిల్లీ: లాక్డౌన్ సమయంలో వీడియో కాన్ఫరెన్స్ కోసం వ్యక్తులు, సంస్థలు విరివిగా ఉపయోగిస్తున్న ‘జూమ్’ప్లాట్ఫామ్ అంత సురక్షితమైనది కాదని కేంద్రం ప్రకటించింది. ప్రభుత్వ సంస్థలు అధికారిక సమావేశాల కోసం దీన్ని వినియోగించవద్దని కేంద్ర హోం శాఖ గురువారం ప్రకటించింది. దీనికి సంబంధించిన కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్(సెర్ట్–ఇన్) హెచ్చరికను సైబర్ కోఆర్డినేషన్ కేంద్రం గురువారం నిర్ధారించింది. అధికారిక సమావేశాల కోసం అధికారులు ఈ ప్లాట్ఫామ్ను వినియోగించవద్దని స్పష్టం చేసింది. అలాగే, జూమ్ను వినియోగించే ప్రైవేటు సంస్థ లు, వ్యక్తుల కోసం కొన్ని సూచనలు చేసింది. అవి.. 1. వీడియో కాన్ఫరెన్స్ ప్రారంభం కాగానే, అడ్మినిస్ట్రేటర్ ‘లాక్ మీటింగ్’ఆప్షన్ను ఆన్ చేయాలి. 2. ప్రతీ మీటింగ్కు కొత్తగా యూజర్ ఐడీని, పాస్వర్డ్ను క్రియేట్ చేసుకోవాలి. 3. అడ్మినిస్ట్రేటర్ అనుమతితోనే కొత్త సభ్యులు మీటింగ్లో పాల్గొనేలా ‘వెయిటింగ్ రూమ్’ఆప్షన్ను ఎనేబుల్ చేయాలి -
మర్కజ్ దెబ్బ!
సాక్షి, హైదరాబాద్: ఢిల్లీలోని మర్కజ్ ప్రార్థనల పర్యవసానాలు దేశం, రాష్ట్రంపై తీవ్రంగా ప్రభావం చూపిన నేపథ్యంలో వారిపై తెలంగాణ పోలీసులు కేసులు నమోదు చేశారు. మర్కజ్ ప్రార్థనల కోసం వచ్చిన విదేశీయులు పలువురు విజిటింగ్ వీసాతో దేశానికి రావడమే కాకుండా, కరోనా నేపథ్యంలో లాక్డౌన్ కొనసాగుతున్నా.. నిబంధనలు ఉల్లంఘిస్తూ.. దేశంలోని పలు రాష్ట్రాల్లో పర్యటించి స్థానికులకు కూడా వైరస్ ను వ్యాపింపజేశారు. దీంతో సోమవారమే కేసుల నమోదు ప్రారంభించిన తెలంగాణ పోలీసులు మంగళవారం రాత్రి 146 మంది విదేశీయులపై వీసా ఉల్లంఘనల కింద కేసులు నమోదు చేశారు. వీటిలో హైదరాబాద్లో 84 మంది విదేశీయులపై 10 కేసులు నమోదయ్యాయి. ఇందులో విదేశీయులకు ఆశ్రయమిచ్చిన వారిపైనా పోలీసులు కేసులు పెట్టారు. విదేశాల నుంచి రాష్రానికి వచ్చిన వారిలో ఇండోనేసియా, కిర్గిస్తాన్, మలేషియా, వియత్నాం, మయన్మార్కు చెందిన వారు ఉన్నారు. వీరందరిలో అత్యధికంగా నల్లగొండలో 36 మందిపై కేసులు నమోదయ్యాయి. ఇందులో 18 మంది మయన్మార్, వియత్నాంకు చెందిన 14 మంది ఉన్నారు. వీరికి ఆశ్రయమిచ్చిన వారిపైనా కేసులు నమోదయ్యాయి. కరీంనగర్లో పర్యటించిన 14 మంది ఇండోనేసియన్లతో పాటు, వారికి ఆశ్రయమిచ్చినవారిపైనా కేసులు పెట్టారు. కేంద్ర హోం శాఖ ఆదేశాలతో.. విదేశీయులకు కరోనా పాజిటివ్ రావడంతో కలకలం రేగింది. దీనిపై విచారణ ప్రారంభించిన కేంద్ర హోం శాఖ వారిపై కేసులు నమోదు చేయాలని ఆదేశించింది. వీరంతా విజిటింగ్ వీసాలపై భారత్కు వచ్చినట్లు గుర్తించిన హోం శాఖ.. వారంతా ఎక్కడెక్కడున్నా రో వెంటనే గుర్తించి, వారి వీసాలు పరిశీ లించాలని ఆదేశించింది. అందులో వీసా, లాక్డౌన్ నిబంధనల ఉల్లంఘనలు ఉంటే వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అన్ని రాష్ట్రాలను ఆదేశించింది. మార్చి 16న కరీంనగర్కు వచ్చిన 14 మంది సభ్యులున్న ఇండొనేసియావాసుల వల్ల కరోనా కేసులు వెలుగుచూసిన సంగతి తెలిసిందే. వాస్తవానికి మర్కజ్లో అసలేం జరుగుతోందో తెలంగాణ ప్రభుత్వమే కేంద్రానికి విన్నవించింది. -
కీచక జాబితా @ ఐటీఎస్ఎస్ఓ
సాక్షి, హైదరాబాద్: దేశంలో మహిళలు, చిన్నారులపై అఘాయిత్యాలు, లైంగిక వేధింపులు నిరోధించే చర్యల్లో భాగంగా కేంద్రం విప్లవాత్మక నిర్ణయం తీసుకుంది. అలాంటి దారుణాలకు పాల్పడే కీచక జాబితా సిద్ధం చేసి ప్రత్యేక డేటాబేస్ ద్వారా అన్ని రాష్ట్రాలు, ఏజెన్సీలకు అందుబాటులోకి తీసుకొచ్చే పనిలోపడింది. దీనికోసం క్రైమ్ అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్వర్క్ సిస్టం (సీసీటీఎన్ఎస్)కి భిన్నంగా ‘ఇన్వెస్టిగేటింగ్ ట్రాకింగ్ సిస్టం ఫర్ సెక్సువల్ అఫెన్సెస్’(ఐటీఎస్ఎస్ఓ)కు రూపమిస్తోంది. ఈ ఏడాది మార్చి నెలాఖరులోగా ఆ జాబితాలను అప్డేట్ చేసి అందజేయాలని కేంద్ర హోంశాఖ ఆదేశించింది. ఇప్పటికే కేంద్ర హోంశాఖ పరిధిలో నడిచే సీసీటీఎన్ఎస్ ద్వారా దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన పాత నేరగాళ్ల గత చరిత్రను పోలీసులు తెలుసుకుంటున్నారు. కీచక నేరస్థులు మళ్లీ నేరం చేసి దొరికినపుడు వారి గత చరిత్రను ఎఫ్ఐఆర్, చార్జిషీట్లలో పేర్కొనాలని యోచిస్తోంది. దీనికోసమే ఐటీఎస్ఎస్ఓ అందుబాటులోకి తీసుకొస్తోంది. ‘దిశ’ ఘటన నేపథ్యంలో.. ‘దిశ’ఘటన నేపథ్యంలో కేంద్రం మహిళలపై అకృత్యాలకు పాల్పడే నిందితులందరికీ ప్రత్యేక డేటాబేస్ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఐటీఎస్ఎస్ఓ పేరుతో దేశంలో అన్ని రాష్ట్రాల్లో మహిళలపై అఘాయిత్యాలు చేసిన వారి వివరాలను ఇందులో పొందుపరుస్తారు. హైదరాబాద్ శివారులో నవంబర్ 27న వెటర్నరీ డాక్టర్ దిశపై లైంగిక దాడికి పాల్పడి పాశవికంగా హత్య చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటన నేపథ్యంలో దేశవ్యాప్తంగా ప్రజల్లో తీవ్రంగా ఆగ్రహావేశాలు చెలరేగాయి. తరువాత డిసెంబర్ 6న జరిగిన పోలీస్ ఎన్కౌంటర్లలో దిశ కేసులో నిందితులు నలుగురు చనిపోయారు. నిందితులు నలుగురు వృత్తిరీత్యా లారీ డ్రైవర్లు, క్లీనర్లు కావడంతో ఇతర రాష్ట్రాల్లోనూ ఎవరైనా మహిళలపై అలాంటి ఘటనలకు పాల్పడ్డారా? అన్న అనుమానాలను సీపీ సజ్జనార్ సైతం వ్యక్తం చేశారు. గతంలో ఆడవాళ్లపై ఇలాంటి ఘటనలు జరగడం కూడా ఈ అనుమానాలకు బలం చేకూరేలా చేసింది. వారి డీఎన్ఏ శాంపిళ్లను కర్ణాటకతోపాటు, ఏపీ తదితర రాష్ట్రాలకు పంపుతామని సైబరాబాద్ పోలీసులు తెలిపిన విషయం తెలిసిందే. భవిష్యత్తులో ఐటీఎస్ఎస్ఓనే ఆధారం.. ఈ డేటాబేస్లో ఆడవారిపై అనుచితంగా ప్రవర్తించేవారు, అఘాయిత్యాలకు పాల్పడేవారు, ట్రాఫికింగ్, వ్యభిచారం, కిడ్నాపులు, ఆన్లైన్ వేధింపులకు పాల్పడేవారి జాబితాను పొందుపరుస్తారు. ఇందులో నేరగాళ్ల వేలిముద్రలు, బ్లడ్గ్రూప్, డీఎన్ఏ, పాత నేరాలు, నేర స్వభావం, నేరం చేసే విధానం తదితర విషయాలు రికార్డు చేస్తారు. దేశంలో ఎక్కడ మహిళలపై ఎలాంటి అఘాయిత్యాలు జరిగినా ఘటనాస్థలంలో దొరికిన శాంపిల్స్ను ఇకపై ఐటీఎస్ఎస్ఓకు పంపుతారు. ఒకవేళ నేరస్తుడిని ముందే గుర్తించినా అతని వేలిముద్రలను ఐటీఎస్ఎస్ఓతో పోల్చి చూస్తారు. ఒకవేళ గతంలో మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడి ఉంటే.. అవి కూడా దర్యాప్తు అధికారికి తెలుస్తాయి. ఫలితంగా దర్యాప్తు వేగంగా పూర్తవుతుంది. పాత నేరస్తుడి గత చరిత్రను చార్జిషీటుతో పాటు కలిపి న్యాయస్థానానికి సమర్పించడంతో నిందితుడికి తక్కువ సమయంలో కఠిన శిక్షలు పడేలా చూడాలన్నది కేంద్రం యోచన. ప్రస్తుతం తెలంగాణ పోలీసుల వద్ద దాదాపుగా 5 లక్షల మందికిపైగా నేరస్తుల వేలిముద్రలు, నేర చరిత్ర వివరాలున్నాయి. వీటిలో రేపిస్టులు, మహిళలను వేధించేవారి వివరాలను వేరు చేసి త్వరలోనే కేంద్రానికి పంపనున్నారు. -
హిమాచల్ గవర్నర్గా దత్తాత్రేయ
సాక్షి, న్యూఢిల్లీ: హిమాచల్ప్రదేశ్ 27వ గవర్నర్గా బండారు దత్తాత్రేయ ప్రమాణ స్వీకారం చేశారు. బుధవారం ఉదయం 10.30కి సిమ్లాలోని రాజ్భవన్లో జరిగిన ప్రమాణస్వీకార కార్యక్రమంలో ఆ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ధరమ్ చంద్ చౌదరి.. దత్తాత్రేయతో ప్రమాణం చేయించారు. అంతకుముందు హిమాచల్ప్రదేశ్ గవర్నర్గా దత్తాత్రేయను నియమిస్తూ రాష్ట్రపతి జారీ చేసిన ఉత్తర్వులను ఉన్నతాధికారి చదివి వినిపించారు. ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం ఫైలుపై సంతకం చేసి దత్తాత్రేయ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా కార్యక్రమంలో పాల్గొన్న ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జయరాం ఠాకూర్ నూతన గవర్నర్ దత్తాత్రేయకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి దత్తాత్రేయ కుటుంబసభ్యులతోపాటు, హిమాచల్ప్రదేశ్ మంత్రివర్గ సభ్యులు, తెలంగాణ రాష్ట్ర బీజేపీ నేతలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జి.కిషన్రెడ్డి, రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్, పార్టీ నేతలు చింతల రామచంద్రారెడ్డి, జితేందర్రెడ్డి, డీకే అరుణ తదితరులు కార్యక్రమంలో పాల్గొని దత్తాత్రేయకు శుభాకాంక్షలు తెలిపారు. దత్తన్నకు బీజేపీ నేతల అభినందనలు సాక్షి, హైదరాబాద్: సిమ్లాలో హిమాచల్ప్రదేశ్ గవర్నర్గా ప్రమాణస్వీకారం చేసిన దత్తాత్రేయ కు రాష్ట్ర బీజేపీ నాయకులు నల్లు ఇంద్రసేనారెడ్డి, ఇ.పెద్దిరెడ్డి, జి.వివేక్, టి.రాజేశ్వరరావు, ధర్మారా వు, సంకినేని వెంకటేశ్వరరావు, కాసం వెంకటేశ్వ ర్లు, చింతా సాంబమూర్తి, ప్రేమేందర్రెడ్డి, మనోహర్రెడ్డి తదితరులు అభినందనలు తెలిపారు. జీవితంలో కొత్త అధ్యాయం: దత్తాత్రేయ హిమాచల్ప్రదేశ్ గవర్నర్గా బాధ్యతలు చేపట్టడం తన జీవితంలో కొత్త అధ్యాయంగా భావిస్తున్నట్లు దత్తాత్రేయ పేర్కొన్నారు. గవర్నర్గా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. 35 ఏళ్లపాటు రాజకీయాల్లో ఉన్న తాను ప్రజా జీవితంలో ఎల్లప్పుడూ అంకితభావంతో పనిచేశానని, ఇప్పుడు దక్కిన ఈ రాజ్యాంగబద్ధమైన పదవి తన బాధ్యతను మరింత పెంచిందన్నారు. ఈ అవ కాశాన్ని సద్వినియోగం చేసుకుంటానని చెప్పారు. దైవభూమిగా పేరుగాంచిన హిమాచల్ప్రదేశ్ రాష్ట్రానికి గవర్నర్గా పనిచేసే అవ కాశం కల్పించిన ప్రధాని నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్షాలకు కృతజ్ఞతలు తెలిపారు. -
తెరపై మరోసారి చెన్నమనేని పౌరసత్వ వివాదం
సాక్షి, న్యూఢిల్లీ : టీఆర్ఎస్ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్ ద్వంద్వ పౌరసత్వ వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. ఈ అంశాన్ని వీలైనంత త్వరగా తేల్చాలంటూ కాంగ్రెస్ అభ్యర్థి ఆది శ్రీనివాస్ కేంద్ర హోం శాఖను ఆశ్రయించారు. చెన్నమనేని భారత పౌరుడు కాదంటూ కాంగ్రెస్ నేత శ్రీనివాస్ హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఈ అంశంపై మరోసారి సమీక్ష చేయాలని చేయాలని జూలై 10న హైకోర్టు తీర్పు వెలువరించింది. మూడు నెలల్లోగా ఈ అంశాన్ని తేల్చాలని కేంద్రాన్ని ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఆది శ్రీనివాస్ మరోసారి కేంద్ర హోం శాఖను ఆశ్రయించారు. ఈ అంశాన్ని వీలైనంత త్వరగా తేల్చాలని హోశాఖలో అప్పీల్ చేశారు. (చదవండి : చెన్నమనేని రమేశ్కు హైకోర్టు ఊరట) -
‘ప్రత్యేక హోదా’ను ఆర్థిక సంఘానికి నివేదించాం
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా వర్తింపచేయాలంటూ ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మే 26, 2019న కేంద్ర ప్రభుత్వానికి విన్నవించారని, దీన్ని 15వ ఆర్థిక సంఘం పరిశీలనకు పంపామని కేంద్ర హోం శాఖ వెల్లడించింది. ఇప్పటివరకు ఈ అంశం ముగిసిన అధ్యాయమని చెబుతూ వచ్చిన కేంద్రం తాజాగా ఈ అంశాన్ని 15వ ఆర్థిక సంఘానికి నివేదించామని చెప్పడం కీలకమలుపుగా భావించవచ్చు. వైఎస్సార్ కాంగ్రెస్ ఎంపీ వంగా గీతా విశ్వనాథ్ అడిగిన పలు ప్రశ్నలకు మంగళవారం కేంద్ర మంత్రి నిత్యానంద్ రాయ్ లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. ‘ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా కోసం కేంద్ర ప్రభుత్వానికి అభ్యర్థనలు వచ్చాయి. తాజాగా మే 26న ఏపీ ప్రస్తుత ముఖ్యమంత్రి నుంచి వచ్చిన అభ్యర్థనను 15వ ఆర్థిక సంఘం పరిశీలనకు పంపాం..’ అని పేర్కొన్నారు. సమాధానాన్ని కొనసాగిస్తూ.. ప్రత్యేక హోదా రాష్ట్రాలు, సాధారణ రాష్ట్రాలకు మధ్య 14వ ఆర్థిక సంఘం వ్యత్యాసం చూపలేదని, తద్వారా ప్రత్యేక హోదా అంశం ముగిసిపోయిందని పేర్కొన్నారు. అయితే నీతిఆయోగ్ సిఫారసుల మేరకు ప్రత్యేక ప్యాకేజీ అందిస్తున్నట్టు తెలిపారు. -
అల్లర్లకు టీడీపీ కుట్ర
సాక్షి, అమరావతి: అధికారాంతమున తెలుగుదేశం పార్టీ బరి తెగిస్తోంది. ఓట్ల లెక్కింపు సందర్భంగా రాష్ట్రంలో అల్లర్లు, అలజడులు రేపేందుకు పన్నాగం పన్నుతోంది. శాంతిభద్రతల సమస్యలు సృష్టించి, ఓట్ల లెక్కింపు ప్రక్రియలో అక్రమాలకు పాల్పడాలన్నదే ఆ పార్టీ లక్ష్యం. టీడీపీ కుట్రను కేంద్ర నిఘా వర్గాలు గుర్తించడంతో అసలు బండారం బట్టబయలైంది. ఈ మేరకు టీడీపీ కుతంత్రంపై కేంద్ర ఇంటలిజెన్స్ బ్యూరో(ఐబీ) కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు నివేదిక అందజేసింది. దాంతో ఓట్ల లెక్కింపు సందర్భంగా ప్రతిక్షణం అప్రమత్తంగా ఉండాలని కేంద్ర ఎన్నికల సంఘానికి కేంద్ర హోం మంత్రిత్వ శాఖ సమాచారం ఇచ్చినట్లు అత్యంత విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ఐబీ వర్గాల సమాచారం ప్రకారం.. ఓట్ల లెక్కింపు ప్రక్రియకు విఘాతం కలిగించేందుకు టీడీపీ పక్కాగా పన్నాగం పన్నింది. ఓట్ల లెక్కింపు కేంద్రాల్లోని అధికారులు, సిబ్బందితో టీడీపీ ఏజెంట్లు కుమ్మక్కయ్యేందుకు వ్యూహం పన్నారని ఐబీ గుర్తించింది. తద్వారా వీవీ ప్యాట్లోని స్లిప్పులను గల్లంతు చేయడం టీడీపీ ఏజెంట్ల అసలు ఉద్దేశం. అందుకోసం అవసరమైతే వీవీ ప్యాట్ స్లిప్పులను నమిలి మింగేయాలని కూడా టీడీపీ అధిష్టానం తమ ఏజెంట్లకు నిర్దేశించినట్లు సమాచారం. అనంతరం ఈవీఎంలోని ఓట్లకు, వీవీ ప్యాట్లలోని స్లిప్పులకు మధ్య తేడా ఉందని టీడీపీ ఏజెంట్లే లెక్కింపు కేంద్రాల్లో ఆందోళనకు దిగుతారు. అప్పటికే బయట ఉన్న టీడీపీ నేతలు, కార్యకర్తలు వెంటనే ఆందోళనలను ఉధృతం చేస్తారు. ఆ వెనువెంటనే దాడులకు దిగుతూ కౌంటింగ్ కేంద్రాల వద్ద భయోత్పాతాన్ని సృష్టిస్తారు. తద్వారా శాంతిభద్రతలకు విఘాతం కల్పించి ఏకంగా ఓట్ల లెక్కింపు ప్రక్రియను అడ్డుకోవడమే వారి లక్ష్యం. ఇక టీడీపీ కచ్చితంగా ఓడిపోతుందన్న అంచనా ఉన్న నియోజకవర్గాల లెక్కింపు కేంద్రాల వద్దకు వైఎస్సార్సీపీ ఏజెంట్లను అనుమతించకూడదని టీడీపీ ఎత్తుగడ వేస్తోంది. అందుకోసం కొందరు రిటర్నింగ్ అధికారులతో టీడీపీ కుమ్మక్కైంది. వైఎస్సార్సీపీ ఏజెంట్లు లేకుండా చేసి ఓట్ల లెక్కింపు ప్రక్రియను తమకు అనుకూలంగా మార్చుకోవాలని ప్రయత్నిస్తున్నారు. టీడీపీ ఓడిపోతుందని స్పష్టమవుతున్న నియోజకవర్గాల కౌంటింగ్ కేంద్రాల వద్ద మరింతగా బరి తెగించాలని టీడీపీ ఎత్తుగడ వేస్తోంది. ఆ కేంద్రాల వద్ద శాంతిభద్రతల సమస్యను సృష్టించేందుకు ఎంతకైనా తెగించాలని తమ శ్రేణులకు టీడీపీ నాయకత్వం ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. ఆయా నియోజకవర్గాల ఎన్నికల ఫలితాలను ప్రకటించకుండా అడ్డుకోవాలన్నది టీడీపీ కుతంత్రం. అందుకోసం పెద్దఎత్తున దాడులకు తెగబడేందుకు టీడీపీ సంఘ విద్రోహ శక్తులను ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద ముందస్తుగానే మోహరిస్తోందని ఐబీ నివేదించింది. సున్నిత నియోజకవర్గాలివీ... టీడీపీ అల్లర్లు, అలజడులు సృష్టించే అవకాశాలున్న నియోజకవర్గాల జాబితాను కేంద్ర ఎన్నికల సంఘానికి ఐబీ నివేదించింది. ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. అల్లర్లకు ఆస్కారం ఉన్న నియోజకవర్గాలు ఇవీ... అనంతపురం: తాడిపత్రి, రాప్తాడు, ఉరవకొండ, పెనుకొండ, హిందూపూర్ కర్నూలు: ఆళ్లగడ్డ, బనగానపల్లె, ఆదోని, డోన్, పత్తికొండ వైఎస్సార్: జమ్మలమడుగు, మైదుకూరు, రైల్వే కోడూరు, కమలాపురం, కడప చిత్తూరు: తంబళ్లపల్లె, పలమనేరు, చంద్రగిరి, శ్రీకాళహస్తి, తిరుపతి నెల్లూరు: నెల్లూరు టౌన్, నెల్లూరు రూరల్, ఆత్మకూరు, కొవ్వూరు, ప్రకాశం: చీరాల, అద్దంకి, కొండేపి, కనిగిరి గుంటూరు: పెదకూరపాడు, సత్తెనపల్లి, మంగళగిరి, ప్రత్తిపాడు, చిలకలూరిపేట కృష్ణా: మైలవరం, విజయవాడ సెంట్రల్, విజయవాడ తూర్పు, గన్నవరం, గుడివాడ పశ్చిమ గోదావరి: దెందులూరు, ఏలూరు, తణుకు, ఆచంట తూర్పు గోదావరి: కొత్తపేట, రామచంద్రాపురం, కాకినాడ రూరల్, అమలాపురం విశాఖపట్నం: భీమిలి, గాజువాక, పెందుర్తి విజయనగరం: బొబ్బిలి, చీపురుపల్లి శ్రీకాకుళం: నరసన్నపేట, ఆమదాలవలస అప్రమత్తంగా ఉండండి కేంద్ర నిఘా వర్గాల హెచ్చరికలపై కేంద్ర ఎన్నికల సంఘం స్పందించింది. ఓట్ల లెక్కింపు ప్రక్రియ సందర్భంగా అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ఎన్నికల అధికారిని ఆదేశించింది. ఈవీఎంలలో ఓట్ల లెక్కింపును మొదట పూర్తి చేయాలని స్పష్టం చేసింది. అనంతరం ఈవీఎంలను సురక్షితంగా మళ్లీ భద్రపర్చాలని సూచించింది. ఆ తరువాతే వీవీ ప్యాట్ల స్లిప్పుల లెక్కింపు ప్రక్రియ చేపట్టాలని స్పష్టం చేసింది. ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద పటిష్టమైన భద్రతా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర పోలీసు యంత్రాంగాన్ని ఆదేశించింది. అసాంఘిక, అనధికార వ్యక్తులు ఎవరూ లెక్కింపు కేంద్రాల పరిసర ప్రాంతాల్లో ఉండకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని నిర్దేశించింది. ఓట్ల లెక్కింపు సందర్భంగా టీడీపీ అరాచకాలు సృష్టించేందుకు కుట్ర పన్నిందన్న నిఘా వర్గాల సమాచారం అధికార వర్గాలను ఆందోళన పరుస్తోంది. -
విభజన చట్టం అమలుపై కేంద్రం సమీక్ష
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చ ట్టంలోని నిబంధనల అమలుపై కేంద్రహోంశాఖ సమీక్షించింది. శుక్రవారం ఢిల్లీలో కేంద్ర హోంశాఖ ప్రత్యేక కార్యదర్శి సత్పాల్ చౌహాన్ అధ్యక్షతన జరిగి న సమావేశంలో వివిధ కేంద్ర శాఖల కార్యదర్శులు, ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ఉన్నతాధికారులు పాలొ ్గన్నారు. తెలంగాణ నుంచి ఆర్థిక శాఖ ముఖ్య కార్య దర్శి కె.రామకృష్ణారావు, తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్(ఎఫ్ఏసీ) వేదాంతంగిరి హాజరయ్యారు. ఏపీ నుంచి ఆర్అండ్బీ శాఖ ముఖ్య కార్యదర్శి నీరబ్కుమార్ప్రసాద్, పురపాలన శాఖ ముఖ్య కార్య దర్శి ఆర్.కరికాల వళవన్, పరిశ్రమల శాఖ కార్యదర్శి సాల్మన్ ఆరోఖ్యరాజ్, పునర్ వ్యవస్థీకరణ వ్యవహారా ల ముఖ్య కార్యదర్శి ఎల్.ప్రేమ్చంద్రారెడ్డి, ఆంధ్ర ప్రదేశ్భవన్ రెసిడెంట్ కమిషనర్ ప్రవీణ్ ప్రకాశ్ పాల్గొన్నారు. పునర్ వ్యవస్థీకరణ చట్టం పరిధిలో ఏపీ, తెలంగాణ కేంద్రం అమలు చేయాల్సిన అంశా లపై రెండు రాష్ట్రాల ప్రతినిధులు సుదీర్ఘంగా చర్చిం చారు. చట్టంలో 13వ షెడ్యూల్లో పొందుపరిచిన మౌలిక వసతుల నిబంధనల అమలుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. తెలంగాణ ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి కె.రామకృష్ణారావు తమ రాష్ట్రానికి సంబంధించి ఆరు అంశాలను హోంశాఖ దృష్టికి తీసుకొచ్చారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఏర్పాటు చేయతలపెట్టిన గిరిజన యూనివ ర్సిటీకి నిధుల విడుదల ప్రక్రియను వేగవంతం చేయాలని కోరారు. అలాగే ఉద్యానవన విశ్వవిద్యాల య స్థాపన ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు. ఖమ్మం జిల్లా బయ్యారంలో స్టీల్ ప్లాంట్ నిర్మాణంపై త్వరితగతిన నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణలోని వెనకబడిన ప్రాంతాలను అనుసం ధానిస్తూ రహదారుల నిర్మాణం చేపట్టాలని నివేదించారు. ఆంధ్రప్రదేశ్ నుంచి చర్చించిన అంశాలు పునర్ వ్యవస్థీకరణ చట్టంలోని షెడ్యూల్ 13లో పొందుపరిచిన అంశాల్లో జాతీయస్థాయి సంస్థల సత్వర నిర్మాణానికి వేగవంతంగా నిధులు విడుదల చేయాలని, కాకినాడ పెట్రో కెమికల్ కాంప్లెక్స్ నిర్మాణానికి కేంద్రం చొరవ చూపాలని, విశాఖప ట్నం–చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ స్థాపన అంశంలో పురోగతి లేదని ఏపీ ప్రభుత్వ ప్రతినిధులు నివేదిం చారు. తిరుపతి విమానాశ్రయ ఆధునీకరణ పనులు, విజయవాడ విమానాశ్రయ విస్తరణ పనులు వేగవం తంగా సాగడం లేదని కేంద్ర హోంశాఖ దృష్టికి తీసుకొచ్చారు. -
నగరంపై ఎన్ఐఏ నిఘా
సాక్షి, హైదరాబాద్: పాకిస్తాన్పై భారత వాయుసేన సర్జికల్ దాడుల నేపథ్యంలో కేంద్ర హోంశాఖ దేశవ్యాప్తంగా హైఅలర్ట్ ప్రకటించింది. ఇందులో భాగంగా కీలక, సున్నిత ప్రాంతమైన తెలంగాణలోనూ పోలీసులు అప్రమత్తమయ్యారు. ఇప్పటికే హైదరాబాద్లో పోలీసులు సున్నిత, సమస్యాత్మక ప్రాంతాల్లో నిఘాను పెంచారు. మంగళవారం పలు ప్రాంతాల్లో కార్డన్సెర్చ్ నిర్వహించిన పోలీసులు.. బుధవారం మాత్రం కేవలం తనిఖీలకే పరిమితమయ్యారు. ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ) హెచ్చరికల నేపథ్యంలో అప్రమత్తంగా ఉన్నామంటున్న పోలీసులు.. తాజా సమాచారాన్ని ఎప్పటికప్పుడు కేంద్రానికి నివేదిస్తున్నారు. ముఖ్యంగా రాజధాని హైదరాబాద్లోని 3 కమిషనరేట్లతోపాటు.. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మరో 6 కమిషనరేట్లలోనూ ఎప్పటికపుడు నివేదికలు డీజీపీ కార్యాలయానికి, ఐబీకి అందజేస్తున్నారు. అనుమానితుల కోసమే..: కేంద్ర నిఘా వర్గాలు తెలంగాణలోనూ హైఅలర్ట్ ప్రకటించిన నేపథ్యంలో.. నేషనల్ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ (ఎన్ఐఏ) అధికారులు నగరంలో సంచరిస్తున్నారు. హైదరాబాద్లో మరీ ముఖ్యంగా పాతబస్తీ, పరిసర ప్రాంతాల్లో, సున్నితమైన, సమస్యాత్మక ప్రాంతాల్లో వీరి నిఘా పెరిగింది. స్లీపర్ సెల్స్పై పూర్తి సమాచారం లేకున్నా.. నగరంలోని కొందరు ఉగ్రమూకలకు ఆర్థికసాయం చేస్తున్నారన్న విషయం వెలుగుచూడటంతో ఎన్ఐఏ రంగంలోకి దిగినట్లు సమాచారం. స్థానిక పోలీసులతో సమన్వయం చేసుకుంటూనే వారి పనివారు చేసుకెళ్తున్నారు. నగరంలో ఉగ్రసానుభూతిపరులు, అనుమానాస్పద వ్యక్తుల కదలికలపై ఎన్ఐఏ నిఘా వేసినట్లు సమాచారం. మరోవైపు స్థానిక ఇంటెలిజెన్స్, టాస్క్ఫోర్స్, ఆక్టోపస్ పోలీసులు కూడా ఎప్పటికప్పుడు డీజీపీ కార్యాలయంతో అనుసంధానమై పనిచేస్తున్నారు. తనిఖీ చేశాకే అనుమతి నగరంలోని పలు ప్రభుత్వరంగ సంస్థల కార్యాలయాల వద్ద భద్రతను పెంచారు. పౌర, సైనిక విమానాశ్రయాల వద్ద భద్రత రెట్టింపు చేశారు. ఆయా సంస్థల్లో పనిచేసే ఉద్యోగులతో సహా ప్రతి ఒక్కరిని పూర్తిగా తనిఖీ చేసిన తర్వాతే లోపలకు అనుమతిస్తున్నారు. రైల్వేస్టేషన్లు, బస్స్టేషన్లు, జనసమ్మర్ధ ప్రాంతాల్లోనూ తనిఖీలు కొనసాగుతున్నాయి. బాంబు స్క్వాడ్లను అందుబాటులో ఉంచారు. మంగళవారం రాత్రి పాతబస్తీలోని కొన్ని ప్రాంతాల్లో పోలీసులు కార్డన్సెర్చ్ నిర్వహించారు. అనుమానాస్పద వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. ఇక నగరంతోపాటు ఉత్తర తెలంగాణలోని పలు సమస్యాత్మక ప్రాంతాల్లో వాహన తనిఖీలు, రాత్రిపూట గస్తీని ముమ్మురం చేశారు. గురువారం కూడా కార్డన్ సెర్చ్లు, వాహన తనిఖీలు కొనసాగే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు. -
మత ఘర్షణల్లో 1,605 మంది మృతి
నోయిడా: భారత్లో 2004 నుంచి 2017 వరకు జరిగిన 10,399 మత ఘర్షణల్లో ఏకంగా 1,605 మంది ప్రాణాలు కోల్పోయారు. 30,723 మంది గాయాలపాలయ్యారు. సమాచార హక్కు చట్టం కింద నోయిడాకు చెందిన ఐటీ ఉద్యోగి, ఆర్టీఐ కార్యకర్త అమిత్ గుప్తా అభ్యర్థించిన మేరకు కేంద్ర హోంశాఖ ఈ వివరాలు వెల్లడించింది. ఒక్క 2008లోనే అత్యధికంగా 943 మతసంబంద కేసులు నమోదయ్యాయని, ఆ ఏడాదిలోనే అధికంగా 167 మంది చనిపోయారని కేంద్రం పేర్కొంది. అత్యంత తక్కువ మత కేసులు 2011లో నమోదయ్యాయి. ఆ ఏడాదిలో 91 మంది మరణించారని, 1,899 మంది గాయపడ్డారని తెలిపింది. 2017లో 822 కేసులు నమోదవగా, ఆ ఏడాది ఘర్షణల్లో 111 మంది చనిపోయారు. -
అనుమతి తీసుకున్నాకే పౌరులపై నిఘా
న్యూఢిల్లీ: కేంద్ర హోంశాఖ కార్యదర్శి లేదా రాష్ట్ర హోంశాఖ కార్యదర్శి నుంచి అనుమతి తీసుకున్నాకే పౌరుల కంప్యూటర్లపై నిఘా పెట్టాల్సి ఉంటుందని కేంద్ర హోంశాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ఈ విషయంలో ఏ విచారణ సంస్థకూ సంపూర్ణ అధికారాలు అప్పగించలేదన్నారు. 2009లో తెచ్చిన నిబంధనల మేరకే ఈ నిఘా కొనసాగుతోందనీ, వీటిలో చిన్నమార్పు కూడా చేయలేదన్నారు. పౌరుల కంప్యూటర్లలోని సమాచారంపై నిఘాతో పాటు డీక్రిప్ట్ చేసే అధికారాన్ని 10 ప్రభుత్వ సంస్థలకు అప్పగించడంపై వివాదం రాజుకున్న నేపథ్యంలో ఆయన ఈ మేరకు స్పందించారు. -
ఒకే చోట.. నేరస్తుల డేటా
సాక్షి, హైదరాబాద్: క్రైమ్ అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్వర్క్ సిస్టమ్ (సీసీటీఎన్ఎస్)లో ఇక కేంద్ర దర్యాప్తు బృందాలు కూడా భాగం కానున్నాయి. దీంతో కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ), జాతీయ దర్యాప్తు బృందం (ఎన్ఐఏ)తోపాటు రాష్ట్రాల్లో కేసులు నమోదు చేసే అధికారం ఉన్న ఎన్ఫోర్స్మెంట్ విభాగాలు తమ వద్ద ఉన్న నేరస్తుల సమాచారాన్ని సీసీటీఎన్ఎస్లో పొందుపర్చనున్నాయి. ఈ మేరకు కేంద్ర హోంశాఖ నిర్ణయం తీసుకుంది. ఇక దేశవ్యాప్తంగా ఎక్కడ.. ఎవరు.. ఏ నేరం చేసినా.. వాటి వివరాలు, ఎఫ్ఐఆర్లు, చార్జిషీట్లు అన్నీ సీసీటీఎన్ఎస్లో అందుబాటులో ఉండనున్నాయి. నేర సమాచారాన్ని ఒకే వ్యవస్థ కింద మార్పిడి చేసుకునేలా సీసీటీఎన్ఎస్ వేదికను ఈ–గవర్నెన్స్ ద్వారా 2009లో కేంద్రం రూపొందించింది. ఇప్పటివరకు సీసీటీఎన్ఎస్లో రాష్ట్రాల పోలీస్ శాఖలు మాత్రమే స్టేక్ హోల్డర్లుగా ఉంటూ వచ్చాయి. తాజాగా ప్రత్యేక దర్యాప్తు సంస్థలను కూడా సీసీటీఎన్ఎస్లో డేటా అప్లోడ్ చేసేలా ఆదేశిస్తూ కేంద్ర హోంశాఖ నిర్ణయం తీసుకోవడంతో నేరస్తుల సమాచారం మొత్తం ఒకే చోట లభించనుంది. సమస్తం.. సీసీటీఎన్ఎస్లోకి.. సీబీఐ, ఎన్ఐఏ, ఎన్ఫోర్స్మెంట్ విభాగాలు కేసులు, నేరస్తుల సమస్త సమాచారాన్ని సీసీటీఎన్ఎస్లోకి అప్లోడ్ చేయనున్నాయి. అలాగే రాష్ట్రాల్లోని ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్, ఫారెస్ట్ విభాగం, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ లాంటి ప్రత్యేక యూనిట్లు సైతం కేసుల వివరాలను సీసీటీఎన్ఎస్ డ్యాష్బోర్డులో పొందుపర్చాల్సి ఉంటుంది. సీసీటీఎన్ఎస్ ద్వారా మొత్తం 18 రకాల నివేదికలను అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇందులో ఎఫ్ఐఆర్, కేసు డైరీ, చార్జిషీట్, కోర్టు తీర్పులు, కోర్టు కొట్టివేత కేసులు, నిందితుల హిస్టరీ షీట్స్తో తదితర వివరాలు ఉంటాయి. దీని ద్వారా ఎక్కడ నేరం జరిగినా సంబంధిత ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితుడి వివరాలు డేటా బేస్లో క్షణాల్లో దొరికిపోతాయి. అదే విధంగా ఆర్థిక నేరాలు, సైబర్ నేరాలకు సంబంధించిన వివరాలు సైతం డేటా బేస్లో నిక్షిప్తం చేస్తున్నారు. ఇప్పటివరకు సీసీటీఎన్ఎస్ ప్రాజెక్టు అమలులో తెలంగాణ రెండో స్థానంలో కొనసాగుతూ వస్తోంది. రాష్ట్రంలోని అన్ని పోలీస్స్టేషన్లలో అత్యాధునిక కంప్యూటర్ల ద్వారా ఎఫ్ఐఆర్, కేసుల వివరాలను ఎప్పటికప్పుడు అప్లోడ్ చేస్తూ కేంద్ర హోంశాఖ ద్వారా తెలంగాణ పలు అవార్డులు సైతం సొంతం చేసుకుంది. -
ఎనిమీ భూముల వేలం?
సాక్షి, హైదరాబాద్ : యుద్ధ సమయంలో దేశం విడిచి వెళ్లి శత్రు దేశాల్లో స్థిరపడినవారి భూముల (ఎనిమీ ప్రాపర్టీస్)ను వేలం వేయాలని కేంద్ర ప్రభు త్వం నిర్ణయించింది. ఇందుకోసం ఈ నెలాఖరుకల్లా సమగ్ర నివేదిక అందజేయాలని కోరుతూ గత నెల లో రాష్ట్రానికి లేఖ రాసింది. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి రజనీ సిబల్ పేరిట రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషికి రాసిన లేఖలో ఎనిమీ భూములు ఎక్కడెక్కడ ఉన్నాయి.. ఆ భూముల స్థితిగతులేంటి? ఆక్రమణలున్నా యా? అసలు మొత్తం భూములెన్ని? ఖాళీగా ఉన్న భూములెన్ని? వాటి విలువ ఎంత? వంటి వివరాలతో జిల్లా స్థాయిలో ఏర్పాటు చేసిన వాల్యుయేషన్ కమిటీలతో నిర్ధారణ చేయించాలని కోరినట్టు సమాచారం. కేంద్రం లెక్కల ప్రకారం హైదరాబాద్, రంగారెడ్డి, ఖమ్మం జిల్లాల్లో ఈ భూములు 490 ఎకరాల వరకు ఉన్నాయి. ఇందులో ఇప్పటికే 100 ఎకరాలను మెట్రో రైలుకు కేటాయించారు. కొన్ని భూములు కబ్జా అయ్యాయి. 2017 మార్చి 14న అమల్లోకి వచ్చిన ఎనిమీ ప్రాపర్టీస్ యాక్ట్– 1968(సవరణ) చట్టం ప్రకారం ఎనిమీ భూములపై సర్వాధికారాలు కేంద్రానికి సంక్రమించాయి. దీంతో మియాపూర్ భూము ల్లో ఖాళీగా ఉన్న 100 ఎకరాలను సీఆర్పీఎఫ్కు కూడా కేటాయించింది. మొత్తం మీద ఈ నెలాఖరు కల్లా ఎనిమీ భూముల వివరాలతో నివేదిక పంపా లని కేంద్రం ఆదేశించడంతో రాష్ట్ర యంత్రాంగం ఆ నివేదిక తయారీలో నిమగ్నం కావడం గమనార్హం. రూ.5 వేల కోట్లపై మాటే ఎనిమీ భూములకు బహిరంగ మార్కెట్ విలువ రూ.5 వేల కోట్లకు పైనే ఉంటుందని అంచనా. ఆ భూములను వేలం వేస్తే వచ్చే ఆదాయంలో రాష్ట్రా నికి కూడా వాటా ఉంటుంది. కస్టోడియన్ హోదాలో వివిధ రాష్ట్రాల్లో ఉన్న ఎనిమీ భూముల్లో రాష్ట్రానికి కూడా వాటా దఖలు పడుతుంది. అయితే, వీటిని వేలం వేస్తారా? కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలకు కేటాయిస్తారా అన్నది తేలాల్సి ఉంది.