-
జైలు నుంచే ‘ఉగ్ర నెట్వర్క్’
సాక్షి, హైదరాబాద్: కట్టుదిట్టమైన తీహార్ జైలులో ఉంటూ స్మార్ట్ఫోన్ ద్వారా ఉగ్రవాద నెట్వర్క్ విస్తరణకు యత్నిస్తున్న వైనం బయటపడింది. హైదరాబాద్ పాతబస్తీకి చెందిన అబ్దుల్లా బాసిత్.. తీహార్ జైల్లో ఉంటూ సీఏఏకు వ్యతి రేకంగా స్మార్ట్ఫోన్ సాయంతో మద్దతు కూడ గడుతూ ఓ గ్రూపును తయారుచేస్తున్నట్టు వెల్లడైంది. జమ్మూకశ్మీర్కు చెందిన జహన్ జెబ్ సామి, హీనా బషీర్బేగ్ దంపతులు ఇటీవల ఢిల్లీ పోలీసులకు పట్టుబడిన విషయం తెలిసిందే. ఐసిస్కు చెందిన ఖొరాసన్ మాడ్యూల్లో ఉగ్రవాదులుగా మారిన వీరిద్దరూ, బాసిత్ ఆదేశాలతో సోషల్ మీడియా ద్వారా కొందరిని ఆకర్షించి జాతి వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడేలా ప్రేరేపిస్తున్నట్టు విచారణలో తేలింది. కశ్మీర్లో ఇంటర్నెట్ సేవలు నిలిచిపోవడంతో వీరి కార్యకలాపాలకు విఘాతం ఏర్పడింది. దీంతో వీరిద్దరినీ ఢిల్లీకి రప్పించిన బాసిత్ అక్కడి ఓక్లాలోని జామియానగర్లో ఉంచాడు. సామి ప్రైవేట్ ఉద్యోగిగా, హీనా గృహిణిగా చలామణి అవుతూ ఉగ్ర కార్యకలాపాలు కొనసాగించా రు. దీనిపై సమాచారం అందుకున్న ఢిల్లీ స్పెషల్ సెల్ ఇటీవల ఇద్దరినీ అరెస్టు చేసింది. ఈ జం ట నుంచి స్వాధీనం చేసుకున్న ఫోన్ల విశ్లేషణ, విచారణలో వెలుగుచూసిన వివరాల ఆధారంగా బాసిత్ను నిందితుడిగా చేర్చి అదుపులోకి తీసుకుని విచారించారు. ఇతడి కార్యకలాపాలపై తెలంగాణ పోలీసు విభాగానికీ సమాచారం ఇచ్చారు. జైలు నుంచే స్మార్ట్ఫోన్తో.. విచారణలో జమ్మూకశ్మీర్ జంట తెలిపిన వివరాల ఆధారంగా ఢిల్లీ స్పెషల్ సెల్.. తీహార్ జైలులో ఉన్న అబ్దుల్లా బాసిత్ను కస్టడీలోకి తీసుకుని విచారించింది. దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాలకు చెం దిన యువతకు బాసిత్ సోషల్మీడియా ద్వారా వలవేస్తూ ఉగ్ర బాట పట్టేలా చేస్తున్నాడని విచారణలో వెల్లడైంది. దీంతో బాసిత్కు జైల్లో సెల్ఫోన్ ఎలా అందిందనే దానిపై ఆరా తీస్తున్నారు. హఫీజ్బాబానగర్కు చెందిన అబ్దుల్లా బాసిత్ (26) ఓ ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ (సీఎస్ఈ) రెండో సంవత్సరం వరకు చదివాడు. ఆన్లైన్ ద్వారా ఐసిస్ సా నుభూతిపరుడిగా మారాడు. 2014, ఆగస్టు లో మరికొందరితో కలిసి పశ్చిమబెంగాల్ మీదుగా బంగ్లాదేశ్ వెళ్లి ఉగ్రవాద శిక్షణ తీసు కోవాలని భావించాడు. నిఘా వర్గాలు వీరిని కోల్కతాలో పట్టుకుని సిటీకి తీసుకువచ్చి కౌన్సెలింగ్ చేసి విడిచిపెట్టాయి. అనంతరం హిమాయత్నగర్లోని ఓ సంస్థలో ఆర్నెల్ల పాటు ఇంటీరియల్ డిజైనింగ్ కోర్సులో చేరాడు. 2015, డిసెంబర్లో ఐసిస్లో చేరుతున్నానంటూ ఇంట్లో లేఖ రాసిపెట్టి మరో ఇద్దరితో కలిసి వెళ్లిపోయాడు. అదే నెల 28న సిట్ పోలీసులు నాగ్పూర్లో వీరిని అరెస్టుచేశారు. బెయిల్పై బయటికొచ్చిన బాసిత్.. ఐసిస్కు అనుబంధంగా ఏర్పడిన అబుధాబి మాడ్యూల్ కీలకంగా మారడంతో 2018 ఆగస్టులో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అరెస్టుచేసింది. అప్పటి నుంచి ఇతడు ఢిల్లీలోని తీహార్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు. జైల్లోనూ స్మార్ట్ఫోన్ వినియోగిస్తూ బాసిత్ వివిధ సోషల్మీడియా ప్లాట్ఫామ్స్ ద్వారా పలువురిని ఆకర్షిస్తున్నాడు. జమ్మూకశ్మీర్కు చెందిన భార్యభర్తలు ఈ విధంగానే అతని వలలో పడ్డారు. -
సెల్ ఫోన్ పేలి చూపు కోల్పోయిన యువతి
సాక్షి, చెన్నై: సెల్ఫోన్ ఛార్జింగ్లో పెట్టి వీడియో కాల్ మాట్లాడుతున్న సయయంలో దురదృష్టవశాత్తూ ఫోన్ పేలడంతో ఓ యువతి చూపు కోల్పోయింది. ఈ సంఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే...తిరువారూరు జిల్లా నీడామంగళం ముట్టయ్యకొత్తనార్ తందు ప్రాంతానికి చెందిన సుకుమార్ విదేశాల్లో ఉద్యోగం చేస్తున్నాడు. ఆయన కుమార్తె ఆర్తి సోమవారం తన తండ్రితో వీడియో కాల్లో మాట్లాడుతోంది. అయితే అకస్మాత్తుగా సెల్ పేలడంతో... ఆ ముక్కలు ఆర్తి కళ్ళలో గుచ్చుకున్నాయి. చెవిలోకి కూడా వెళ్లాయి. దీంతో కుటుంబీకులు ఆర్తీని వెంటనే నీడామంగళం ప్రభుత్వ ఆస్పత్రికి చికిత్సకు తరలించారు. అక్కడ వైద్యులు ఆమెకుప్రథమ చికిత్స చేసి, మెరుగైన వైద్యం కోసం తంజావూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కాగా సెల్ ఫోన్ను ఛార్జింగ్లో పెట్టి ఫోన్ మాట్లాడుతుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. కాగా సెల్ ఫోన్ ఛార్జింగ్లో ఉన్నప్పుడు ఉపయోగించడం వల్ల పలువురు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఫోన్ వాడకంపై అజాగ్రత్తగా ఉండటం వల్లే గాయపడటంతో పాటు, ప్రాణాలు కూడా పోతున్నాయి. అయినా జనాల్లో అవగాహన లేకుండా పోతోంది. ఛార్జింగ్ పెట్టిన ఫోన్ని అలాగే మాట్లాడటం, తడి చేతులతో ఛార్జింగ్ పెట్టడంతో పాటు రాత్రంతా చార్జింగ్ పెట్టిన ఫోన్లు విపరీతంగా వేడెక్కి పేలిన సందర్భాలు అనేకం ఉన్నాయి. ఫోన్లు వాడకాలపై అప్రమత్తంగా ఉండాలని సూచనలు చేసినా, పట్టించుకోకపోవడంతోనే ఇటువంటి సంఘటనలకు దారితీస్తున్నాయి. -
ఫోన్ చేయగానే దగ్గుతున్న శబ్దం..
సాక్షి, న్యూఢిల్లీ : ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్... ఇప్పుడు సెల్ ఫోన్లకు తాకిందా?. అదేంటి సెల్ ఫోన్లకు కరోనా వైరస్ అనుకుంటున్నారా?. ఈ వైరస్ గురించి, నివారణ చర్యలపై ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేయడానికి కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ఓ అడుగు ముందుకు వేసింది. మీరు ఎవరికైనా ఫోన్ చేస్తే ముందుగా ...దగ్గుతున్న శబ్దం.. ఆ తర్వాత దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, చేతులు శుభ్రం చేసుకోవడం, జన సమ్మర్థం ఉన్న ప్రాంతాల్లోకి వెళ్లకుండా ఉండటం వంటి సూచనలు వినిపిస్తున్నాయి. ఇందుకోసం 30 సెకన్ల నిడివి గల ఓ ఆడియో క్లిప్ను రూపొందించింది. (కరోనా భయం వీడి.. మానవత్వం చాటారు) మీరు ఎవరికి ఫోన్ చేసినా ముందుగా దగ్గు, ఆ తర్వాత జాగ్రత్తలు పాటించడనే సందేశాన్ని వినిపిస్తోంది. ఏ మొబైల్ వినియోగదారుడైనా ఈ సందేశం వినకుండా తప్పించుకునే వీలు లేకుండా కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ అన్ని మొబైల్ సర్వీస్ ప్రొవైడర్లకు ఆదేశాలిచ్చింది. గతంలో ఎప్పుడూ ఇలా అన్ని ఫోన్లకూ ఒకే కాలర్ ట్యూన్ వచ్చిన దాఖలాలు లేవు. దీంతో పలువురు వినియోగదారులు ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు కొందరికి ఫోన్ చేస్తే మాత్రం మాములుగానే రింగ్ సౌండ్ వినిపిస్తోందని పలువురు వినియోగదారులు చెబుతున్నారు. (కరోనా జయించాడు.. రికార్డు సాధించాడు!) రోజుకు ఓ 20 ఫోన్ కాల్స్ చేస్తే... ప్రతిసారి ఈ కాలర్ ట్యూన్ను వినాల్సిందేనా అని పలువురు వాపోతున్నారు. మరోవైపు కరోనా ట్యూన్పై సోషల్ మీడియాలో సెటైర్లు పేలుతున్నాయి. అంతేకాకుండా కరోనా సందేశం వినిపించకుండా ...ఏం చేయాలనే దానిపై సుచనలు, సలహాలు కూడా ఇస్తున్నారు కొందరు. అయితే కరోనా ట్యూన్ తమ ప్రాణానికి వచ్చిందిరా బాబు అంటూ కొంతమంది విసుక్కుంటున్నారు కూడా. కాగా దేశవ్యాప్తంగా ఇప్పటివరకూ 45 కరోనా వైరస్ కేసులు నమోదు అయ్యాయి. (వాటి కారణంగానే కోవిడ్ వ్యాప్తి!) -
ప్రాణం తీసిన సెల్ఫోన్
అవసరాల కోసం ఉపయోగపడే సెల్ఫోన్ ఇప్పుడు ఒకరి ప్రాణాలు కోల్పోవడానికి కారణమైంది. ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం సర్వాయి పంచాయతీ పరిధిలోని కొత్తూరులో ఈ ఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన పాగే శంకరయ్య, కావిరి నారాయణ ఇళ్లు పక్కపక్కనే ఉన్నాయి. నారాయణ అన్న సమ్మయ్య పిల్లలైన నగేష్, మధుకర్.. నారాయణ ఇంట్లోనే ఉంటున్నారు. శివరాత్రి కావడంతో శుక్రవారం పాఠశాలకు సెలవు ఇవ్వగా.. నగేష్ సెల్ఫోన్లో మధుకర్, శంకరయ్య కుమార్తె, మరో విద్యార్థిని కలసి సినిమా పాటల వీడియోలు చూస్తున్నారు. ఇదే క్రమంలో శంకరయ్య ఇంటికి రాగానే పిల్లలు వెళ్లిపోయారు. అయితే, తన కుమార్తె, మరో విద్యార్థిని శంకరయ్య మందలించి వదిలేశాడు. ఆ తర్వాత నారాయణ ఇంటికి వెళ్లిన శంకరయ్య.. నగేష్ను కర్రతో కొడుతుండగా.. అడ్డొచ్చిన మధుకర్ తలపై కూడా బలంగా కొట్టాడు. దీంతో అతని తల బాగా వాయగా.. వాంతులు అయ్యాయి. మధుకర్ను వెంటనే ఏటూరునాగారం ఆస్పత్రికి.. ఆపై వరంగల్, హైదరాబాద్కు తరలించారు. అంతలోగానే మెదడులో రక్తం గడ్డ కట్టడంతో మధుకర్ కోమాలోకి వెళ్లినట్లు వైద్యులు చెప్పారని కుటుంబ సభ్యులు తెలిపారు. కాగా, నిందితుడు పరారీలో ఉన్నాడని ఏటూరునాగారం సీఐ నాగబాబు, ఎస్సై సురేష్ తెలిపారు. – ఏటూరునాగారం/కన్నాయిగూడెం -
‘నెట్టే’ట మునక
సాక్షి, హైదరాబాద్: దేశంలోని ప్రధాన మెట్రో నగరాల్లో ప్రజలు ‘నెట్’లోకంలో మునిగితేలుతున్నారు. గంటలకొద్దీ డిజిటల్ ప్రపంచంలో విహరిస్తూ ఇంటర్నెట్కు బానిసలుగా మారుతున్నారు. ఆధునిక సాంకేతికతను అవసరానికి మించి వాడుతూ శారీరక, మానసిక సమస్యలను కొనితెచ్చుకుంటున్నారు. స్మార్ట్ ఫోన్, ల్యాప్టాప్, టీవీ, సోషల్ మీడియా... ఇలా డిజిటల్ మాధ్యమాలతో రోజుకు ఏడు గం టల చొప్పున ఏడాదికి సరాసరిన 1,800 గంటలపాటు కుస్తీ పడుతున్నట్లు తాజా అధ్యయనంలో వెల్లడైంది. డిజిటల్ మార్కెటీర్ అనే సంస్థ ఇటీవల హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, ముంబై, కోల్కతా, ఢిల్లీ తదితర మెట్రో నగరాల్లో ఆన్లైన్ మాధ్యమం ద్వారా సుమారు 50 వేల మంది అభిప్రాయాలు సేకరించి అధ్యయన వివరాలు ప్రకటించింది. చేతిలో నిరంతరం స్మార్ట్ఫోన్తో దర్శనమిచ్చే యువత... ఖాళీ సమయాల్లో డిజిటల్ మాధ్యమాలతో కుస్తీ పడుతోంది. ప్రతి ముగ్గురిలో ఒకరు ప్రతి ఐదు నిమిషాలకు ఓసారి సెల్ఫోన్ టచ్ చేస్తూ అప్డేట్స్ చూసుకుంటున్నట్లు అధ్యయనం తెలి పింది. ప్రతి ఐదుగురిలో ముగ్గురు సెల్ఫోన్ తమ జీవితంలో విడదీయరాని భాగంగా మారిందని అభిప్రాయపడినట్లు పేర్కొంది. టీనేజర్లలో 50% మంది డిజిటల్ ఎడిక్షన్కు గురవుతున్నట్లు స్పష్టం చేసింది. సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే డిజిటల్ అడిక్షన్తో పలు శారీరక, మానసిక సమస్యలతో బాధపడాల్సి వస్తుందని హెచ్చరించింది. డిజిటల్ వర్రీ.. క్షణం తీరికలేకుండా స్మార్ట్ఫోన్తో గంటలతరబడి కాలక్షేపం చేస్తున్న మెట్రో నగరవాసులకు కొత్త చిక్కులొచ్చాయి. నిరంతరాయంగా వాట్సాప్లో చాటింగ్, ఫేస్బుక్, ట్విట్టర్ వంటి వాటిలో అప్డేట్స్ కోసం రెప్పవాల్చకుండా స్మార్ట్ఫోన్ వైపు దృష్టిసారిస్తుండడంతో మెడ, వెన్నునొప్పులతో సతమతమవుతున్నట్లు తేలింది. ప్రధానంగా స్మార్ట్ఫోన్ను చేతిలో పట్టుకొని సరిగా కూర్చోకుండా చాటింగ్ చేయడం, అధిక సమయం చాటింగ్లోనే గడిపేస్తుండటంతో వెన్నెముక డిస్క్ లు ఒత్తిడికి గురై పలువురు వెన్నునొప్పులతో బాధపడుతున్నట్లు పేర్కొంది. చాటింగ్ సమయం లో భుజం, తల, మెడ కండరాలు అధికంగా ఒత్తిడికి గురై బిగుసుకుపోవడంతోనే ఇవి తలెత్తుతున్నాయని, ఛాతీ కండరాలూ పలుమార్లు బిగుసుకుపోతున్నట్లు వైద్యులను ఉటంకిస్తూ పేర్కొంది. చిన్నారులూ బాధితులే.... అధిక గంటలు కంప్యూటర్లు, ల్యాప్టాప్లు, ట్యాబ్లెట్లలో గేమ్స్ ఆడే చిన్నారులు సైతం మెడ, వెన్నునొప్పులతో సతమతమవుతున్నట్లు సర్వేలో తేలింది. ప్రధానంగా సెల్ఫోన్లు, ట్యాబ్లెట్స్లో గేమ్స్ ఆడే సమయంలో సోఫాలు, మంచాలు, కుర్చీల్లో సరిగా కూర్చోకపోవడం వల్ల శారీరక కదలికలు లేక జీవనక్రియల్లో సమతౌల్యం దెబ్బతిని అనారోగ్యం పాలవుతున్నారని వెల్లడించింది అనర్థాలివే: మెడ నొప్పులు, వెన్నెముక డిస్క్లు ఒత్తిడికి గురై నొప్పులతో సతమతమవడం, నరాలు బిగుసుకుపోవడం, చేతివేళ్లకు తరచూ తిమ్మిర్లు రావడం, స్పర్శకోల్పోవడం, జీవన క్రియలు మందగించ డం, వెన్నునొప్పులు, నిద్రలేమి, తుంటికండరాలు పట్టేయడం. శ్రుతి మించితే వైద్యులను సంప్రదించాల్సిందే. చిన్నారులకు స్మార్ట్ఫోన్ వినియోగం దురలవాటు గా మారితే తప్పకుండా సైకియాట్రిస్ట్లను సంప్రదించాలని నిపుణులు సూచిస్తున్నారు. చిన్నారుల్లో గతంలో ఎన్నడూ లేనివిధంగా ఫోన్ హాబీ ఇటీవలి కాలంలో 5 రెట్లు పెరిగిందని సైకాలజిస్టులు చెబు తున్నారు. పిల్లలకు ఫోన్లను సరదా కోసం ఇస్తున్న తల్లిదండ్రులు... అది వారికి దురలవాటుగా మారి నప్పుడే కళ్లు తెరుస్తున్నారని చెబుతున్నారు. చాలా మంది మాట్లాడటం కంటే ఫోన్ చాటింగ్కే ప్రాధాన్యతనిస్తున్నట్లు సైకాలజిస్టులు చెబుతున్నారు. ఫోన్ హాబీ శ్రుతి మించి దురలవాటుగా మారితే చిన్నారుల మెదడు కణాలూ దెబ్బతినే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. శారీరక వ్యాయామం, ఆటల ద్వారా చిన్నారుల్లో మానసిక, శారీరక ఆరోగ్యం పెరుగుతుందని సూచిస్తున్నారు. ఆటలకు దూరమై ఫోన్లు, ట్యాబ్లెట్లతో కుస్తీపట్టే చిన్నారులు తీవ్ర ఆవేశకావేశాలకు గురవడంతోపాటు వారిలో క్రమంగా హింసా ప్రవృత్తి పెరుగుతోందని స్పష్టం చేస్తున్నారు. ఇలా చేస్తే నొప్పుల నుంచి ఉపశమనం ►స్మార్ట్ఫోన్లు వినియోగించే సమయంలో తరచూ బ్రేక్ తీసుకోవాలి. శరీర కదలికలు ఉండేలా చూసుకోవాలి. ►మెడను వంచకుండా స్మార్ట్ఫోన్ తెరను చూడాలి. ►నొప్పులు అధికమైతే న్యూరోసర్జన్లు, ఫిజియోథెరపిస్టులను సంప్రదించాలి. -
సెల్లో 'సెల్లు'కు చెల్లు
భువనేశ్వర్: రాష్ట్ర వ్యాప్తంగా జైళ్లలో (సెల్) మొబైల్ (సెల్ఫోన్) వినియోగానికి శాశ్వతంగా తెరదించేలా జైళ్ల శాఖ యంత్రాంగం కృషి చేస్తోంది. కారాగారంలో ఉంటూ నేర సంబంధిత లావాదేవీల్ని ఖైదీలు యథేచ్ఛగా కొనసాగిస్తున్న సంఘటనలు తరచూ వెలుగు చూస్తున్నాయి. ఈ వ్యవహారాలు మొబైల్ ఫోన్లలో నిర్వహిస్తున్నట్లు తేలింది. జైళ్లలో మొబైల్ ఫోన్ల అక్రమ వినియోగానికి తెరదించడం పరిష్కారంగా రాష్ట్ర కారాగార శాఖ నిర్ణయించింది. ఈ నిర్ణయంతో ముందుకు సాగుతున్నట్లు కారాగారాల శాఖ డైరెక్టర్ జనరల్ సంతోష్ ఉపాధ్యాయ తెలిపారు. మొబైల్ ఫోన్లను కారాగారాల్లో నివారించేందుకు లొకేటర్లు ఏర్పాటు చేస్తారు. ఈ వ్యవస్థ ఆధ్వర్యంలో జైళ్లలో మొబైల్ ఫోన్ల చొరబాటు నివారణ సాధ్యమవుతుందని ఆయన తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరంలో 91 జైళ్లలో మొబైల్ లొకేటర్ల వ్యవస్థను ప్రవేశ పెడతామని తెలిపారు. 2019›– 20 ఆర్థిక సంవత్సరంలో 300 మొబైల్ ఫోన్ లొకేటర్లు కొనుగోలు చేస్తారు. తొలి విడత కింద రూ. 75 లక్షలు వెచ్చించి మొబైల్ లొకేటర్లు ఏర్పాటు చేస్తారు. నేరాల నియంత్రణలో భారీ సంస్కరణ రాష్ట్రంలో నేరాల నియంత్రణలో మొబైల్ లొకేటర్ల ఏర్పాటు భారీ సంస్కరణగా జైళ్ల శాఖ డీజీ పేర్కొన్నారు. యావజ్జీవ కారాగారవాసం చేస్తున్న ఖైదీలు తమ అనుచరులతో బయటి ప్రపంచంలో నేర కార్యకలాపాల్ని యథేచ్ఛగా కొనసాగిస్తున్న నేర చరిత లావాదేవీలకు ఈ వ్యవస్థ తెర దించుతుందని అభిప్రాయ పడ్డారు. ఈ వ్యవస్థ అమలును పురస్కరించుకుని జైలు సిబ్బంది, అధికారుల మొబైల్ ఫోన్లను కూడా జైళ్ల ప్రాంగణాలకు అనుమతించరు. నిబంధనల ఉల్లంఘనకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని కారాగారాల శాఖ డైరెక్టర్ జనరల్ సంతోష్ ఉపాధ్యాయ్ హెచ్చరించారు. అధికారులు, సిబ్బంది మొబైల్ ఫోన్లను ప్రధాన ప్రవేశ ద్వారం ఆవరణలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మొబైల్ ఫోన్ కౌంటర్లో జమ చేయాల్సి ఉంటుందని ఆయన వివరించారు. -
ఫోన్లో మాట్లాడుతూ..
చెన్నై, టీ.నగర్: సెల్ఫోన్లో మాట్లాడుతూ ఆదివారం ఓ యువతి మూడో అంతస్తు నుంచి కిందపడి మృతిచెందింది. చెన్నై ట్రిప్లికేన్ కెనాల్ రోడ్డుకు చెందిన 17 ఏళ్ల యువతి ప్రైవేటు ప్రింటింగ్ ప్రెస్లో పనిచేస్తోంది. ఈ నెల 25న రాత్రి ఇంటి మూడో అంతస్తులో తన స్నేహితురాలితో సెల్ఫోన్లో మాట్లాడుతూ కింద పడిపోయింది. తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్చారు. అన్నాస్క్వేర్ పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఇలావుండగా చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి ఆమె మృతిచెందింది. -
స్నాచర్లను పట్టుకుంటే గ్యాంగ్ దొరికింది
సాక్షి, సిటీబ్యూరో: సైఫాబాద్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న ఓ సెల్ఫోన్ స్నాచింగ్ కేసులో నిందితులను అదుపులోకి తీసుకున్న సెంట్రల్ జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు వారి నుంచి ఓ బైక్ స్వాధీనం చేసుకున్నారు. దీనిపై ఆరా తీయగా అది పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోరీకి గురైనట్లు తేలింది. దీంతో లోతుగా విచారించిన అధికారులు 11 మంది సభ్యులతో కూడిన వాహనచోరీలు, చైన్ స్నాచింగ్ల ముఠాను పట్టుకున్నారు. ఈ గ్యాంగ్లీడర్ ఆదేశాల మేరకు సభ్యులు వేర్వేరు ప్రాంతాల్లో చోరీలకు పాల్పడినట్లు నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్ తెలిపారు. టాస్క్ఫోర్స్ డీసీపీ రాధాకిషన్రావుతో కలిసి సోమవారం తన కార్యాలయంలో వివరాలు వెల్లడించారు. బజార్ఘాట్ ప్రాంతానికి చెందిన అబ్దుల్ వాహెద్ అలియాస్ అఫ్రోజ్ అలియాస్ అఫ్రోజ్ ఖాన్ ఎనిమిదితో తరగతితో చదువుకు స్వస్థి చెప్పాడు. ఆపై కొన్నాళ్ల పాటు ఆటోడ్రైవర్గా పని చేసిన ఇతను చివరకు బైక్ మెకానిక్గా మారాడు. దురలవాట్లకు బానిసైన అతను ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టెక్కేందుకు వాహనచోరీలకు పాల్పడాలని నిర్ణయించుకున్నాడు. ఈ నేపథ్యంలో ఆసిఫ్నగర్కు చెందిన మహ్మద్ అల్తాఫ్, జిర్రాకు చెందిన సయ్యద్ జమీల్, రాజేంద్రనగర్కు చెందిన అమీర్, మోతీదర్వాజ ప్రాంతానికి చెందిన మరో మైనర్తో కలిసి ముఠా ఏర్పాటు చేశాడు. వృత్తిరీత్యా మెకానిక్ అయిన వాహెద్కు వాహనాల తాళాలు పగులకొట్టడం, అసలు తాళం చెవి లేకుండా స్టార్ట్ చేయడంపై పట్టుంది. దీనిపై తన గ్యాంగ్ సభ్యులకు అవగాహన కల్పించిన అతను వాహన చోరీలకు పురిగొల్పాడు. మహ్మద్ అల్తాఫ్ ద్వారా వహీద్కు కుమ్మర్వాడికి చెందిన ఎలక్ట్రీషియన్ హర్షవర్ధన్తో పరిచయం ఏర్పడింది. అతడినీ ఈ ‘రంగం’లోకి దింపిన వాహెద్ చోరీలకు ప్రోత్సహించాడు. దీంతో ఇతగాడు తన స్నేహితులైన అభిషేక్, ఉదయ్కిరణ్, అభిలాష్, మల్లేష్లతో ముఠా కట్టాడు. వీరు వాహనచోరీలతో పాటు స్నాచింగ్స్లకు పాల్పడేవారు. ఈ చోరీ సొత్తును తీసుకునే వాహెద్ దానిని జిర్రాలో వెల్డింగ్ దుకాణం నిర్వహించే సయ్యద్ జమీల్తో పాటు ఆసిఫ్నగర్కు చెందిన సేల్స్మెన్ షేక్ జమీర్లకు విక్రయించేవాడు. అలా వచ్చిన సొమ్మును అందరూ పంచుకునే వారు. రిసీవర్గా ఉన్న సయ్యద్ జమీల్ ఈ గ్యాంగ్స్తో కలిసి కొన్ని నేరాలు కూడా చేశాడు. దాదాపు నాలుగు నెలలపాటు ఈ ముఠాలు హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండలతో పాటు సంగారెడ్డి జిల్లాలోనూ పంజా విసిరాయి. వీరు ప్రధానంగా పార్కింగ్ ప్లేసులు, మాల్స్, ఇళ్ల వద్ద నిలిపి ఉంచిన వాహనాలనే ఎత్తుకెళ్లేవారు. సాయికిరణ్, మల్లేష్లు కొన్నాళ్ల క్రితం పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ పార్కింగ్ ఏరియా నుంచి బైక్ చోరీ చేశాడు. గత నెల 17న దానిపై వెళ్లిన హర్షవర్థన్, ఉదయ్ కిరణ్, అభిషేక్ సైఫాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ సెల్ఫోన్ స్నాచింగ్కు పాల్పడ్డారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. మధ్య మండల టాస్క్ఫోర్స్ ఇన్స్పెక్టర్ మహ్మద్ అబ్దుల్ జావేద్ నేతృత్వంలో ఎస్సైలు టి.శ్రీధర్, కె.శ్రీనివాసులు, మహ్మద్ షానవాజ్ షఫీలతో కూడిన బృందం ఘటనాస్థలిలోని సీసీ కెమెరాల ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు చేపట్టింది. ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకుని స్నాచింగ్కు ఉపయోగించిన వాహనాన్ని స్వా«ధీనం చేసుకున్నారు. ఇది తమ బంధువుకు చెందినదని నిందితులు చెప్పడంతో వాహనం పత్రాల కోసం ఆరా తీశారు. వారి వద్ద అవి లేకపోవడంతో వాహనంతో పాటు ఇంజిన్, చాసిస్ నంబర్ ఆధారంగా సదరు బైక్ కొన్నాళ్ల క్రితం పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోరీకి గురైనట్లు గుర్తించారు. దీంతో నిందితులను విచారించగా మొత్తం ముఠాల వ్యవహారం వెలుగులోకి వచ్చింది. మైనర్తో పాటు చోరులు, రిసీవర్లను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారి నుంచి ఆటో, బుల్లెట్, కేటీఎంలతో సహా 28 వాహనాలు, ఐదు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠాలు సిటీలో మూడు, సైబరాబాద్లో 22, రాచకొండలో 5, సంగారెడ్డిలో 3 నేరాలు చేసినట్లు గుర్తించారు. తదుపరి చర్యల నిమిత్తం నిందితులను వారు నేరం చేసిన ప్రాంతాల వారీగా స్థానిక పోలీసులకు అప్పగించారు. హర్షవర్ధన్, ఉదయ్కిరణ్, అభిషేక్, జమీర్లను సైఫాబాద్, అమీర్ఖాన్, అల్తాఫ్, సమీల్లను ఎస్సార్నగర్, అబ్దుల్ వాహెద్తో పాటు మైనర్ను మీర్చౌక్, సాయికిరణ్, మల్లేష్లను పేట్ బషీరాబాద్ పోలీసు స్టేషన్లకు అప్పగించినట్లు తెలిపారు. -
సెల్ఫోన్ పేలి బాలిక మృతి
కజకిస్తాన్ : సేల్ఫోన్ పేలి 14ఏళ్ల బాలిక మృతి చెందింది. రాత్రంతా ఫోన్కు చార్జింగ్ పెట్టి ఉండటంతో బ్యాటరీ హీట్ అయ్యి పేలింది. ఈ ఘటన కజకిస్తాన్లో మంగళవారం చోటు చేసుకుంది. వివరాలు.. కజకిస్తాన్లోని బాస్టోబల్ అనే గ్రామానికి చెందిన అలువా అసెట్కిజీ అబ్జల్బెక్(14) రాత్రి పడుకునే ముందు ఫోన్లో పాటలు విని.. ఆ తర్వాత ఫోన్కి చార్జీంగ్ పెట్టి తల దగ్గర పెట్టుకుని పడుకుంది. దీంతో రాత్రి సమయంలో ఫోన్ పేలడంతో బాలిక తలకు బలంగా గాయాలై చనిపోయింది. అయితే ఆ సమయంలో ఫోన్ చార్జీంగ్ పెట్టడంతో బ్యాటరీ వేడెక్కడంతో ఫోన్ పేలి బాలిక మరణించినట్లు ఫొరేన్సిక్ అధికారులు వెల్లడించారు. -
సెల్ఫోన్ దొంగల అరెస్టు
బంజారాహిల్స్: గంజాయికి అలవాటు పడి సెల్ఫోన్ చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు యువకులను జూబ్లీహిల్స్ క్రైమ్ పోలీసులు గురువారం అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించార. జూబ్లీహిల్స్ పోలీస్స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బంజారాహిల్స్ ఏసీపీ కే.ఎస్.రావు, ఇన్స్పెక్టర్ కె.బాలకృష్ణారెడ్డి, వివరాలు వెల్లడించారు. శ్రీకాకులం జిల్లా, జగన్నాథపుర గ్రామానికి చెందిన పెద్దింటి యాదగిరి సెంట్రింగ్ వర్కర్గా పనిచేస్తూ మూసాపేట యాదవ బస్తీలో తన స్నేహితుడు మహ్మద్ జజ్బార్ అహ్మద్తో కలిసి అద్దెకు ఉంటున్నాడు. ఇద్దరు కొంతకాలంగా గంజాయికి అలవాటు పడ్డారు. గంజాయి కొనుగోలు చేసేందుకు డబ్బులు లేకపోవడంతో సెల్ఫోన్ల చోరీకి పాల్పడుతున్నారు. గత నెల 26న బోరబండకు చెందిన సతీష్ అనే డ్రైవర్, జూబ్లీహిల్స్ రోడ్డునెంబర్ 36లో నడిచి వెళుతుండగా బైక్పై వచ్చిన వీరు సెల్ఫోన్ లాక్కుని పరారయ్యారు. బాధితుడి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన క్రైమ్ పోలీసులు సీసీ పుటేజీ ఆధారంగా నిందితులను పట్టుకున్నారు. -
బోయింగ్కు ‘సెల్ఫోన్’ గండం
సెల్ఫోన్ కారణంగా విమానాలు ప్రమాదానికి గురయ్యే అవకాశముందని అమెరికాకు చెందిన ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్(ఎఫ్ఏఏ) తెలిపింది. సెల్ఫోన్ సిగ్నళ్ల కారణంగా బోయింగ్ కంపెనీకి చెందిన కొన్ని విమానాల్లోని కాప్పిట్లో ఉండే డిస్ప్లే బోర్డులు పనిచేయడం ఆగిపోతున్నాయని వెల్లడించింది. ఈ విషయమై కొందరు పైలట్లు ఇప్పటికే తమ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారని పేర్కొంది. ఈ మేరకు ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ తాజాగా ఓ నివేదికను సమర్పించింది. 2013 వరకూ విమానాల్లో ఎలక్ట్రానిక్ ఉపకరణాలు వాడటంపై అమెరికాలో నిషేధం ఉండేది. అయితే ఆ తర్వాతికాలంలో దాన్ని తొలగించారు. ప్రస్తుతం విమానాల్లో సెల్ఫోన్లను ‘ఎయిర్ప్లేన్ మోడ్’లో ఉంచి తీసుకెళ్లేందుకు ఎయిర్లైన్స్ అనుమతిస్తున్నాయి. ఈ సందర్భంగా ప్రయాణికులకు ఉచిత వైఫై సౌకర్యాన్ని కల్పిస్తున్నాయి. ముఖ్యంగా ఈ రెండు రకాలకు.. తాజాగా ఈ సెల్ఫోన్ల వైఫై సంకేతాలు, భూమిపై ఉండే రాడార్ల కారణంగా బోయింగ్ కంపెనీకి చెందిన 737, 777 క్లాస్ విమానాల్లోని కాప్పిట్ డిస్ప్లే యూనిట్లో సమస్య తలెత్తుతోంది. విమానం వెళుతున్న వేగం, ఎత్తు, వెళ్లాల్సిన దిశ తదితర అంశాలు ఈ డిస్ప్లే యూనిట్లో కనిపిస్తాయి. పైలట్లు సురక్షితంగా విమానాన్ని నడిపేందుకు ఈ వ్యవస్థ మార్గదర్శనం చేస్తుంది. కానీ సెల్ఫోన్ సిగ్నళ్ల కారణంగా ఈ డిస్ప్లే యూనిట్లు పనిచేయకుండా పోతున్నాయని, తద్వారా విమాన ప్రమాదాలు చోటుచేసుకునే అవకాశముందని ఎఫ్ఏఏ తెలిపింది. తాము గాల్లో ఉండగానే డిస్ప్లే యూనిట్లు మూగబోయినట్లు బోయింగ్ ఎన్జీ 737 పైలట్లు దాదాపు 12 సార్లు ఫిర్యాదు చేసిన విషయాన్ని ప్రస్తావించింది. తప్పు సరిచేస్తామన్న హనీవెల్ ప్రస్తుతం అమెరికాలో 1,300కుపైగా విమానాలు తిరుగుతుండగా, వీటిలో బోయింగ్ 737, 777 క్లాస్ విమానాలకు ఈ ముప్పుందని ఎఫ్ఏఏ చెప్పింది. ప్రముఖ ఏరోస్పేస్ కంపెనీ హనీవెల్ ఇంటర్నేషనల్ ఈ డిస్ప్లే యూనిట్లను తయారుచేసినట్లు వెల్లడించింది. ఈ డిస్ప్లే యూనిట్లను 2019, నవంబర్లోగా మార్చాలని ఎఫ్ఏఏ ఆదేశించింది. కాగా, ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్(ఎఫ్ఏఏ) నివేదికను హనీవెల్ సంస్థ ఖండించింది. సెల్ఫోన్లలోని సిగ్నల్స్, ఇతర రేడియో సంకేతాలు తమ డిస్ప్లే యూనిట్లను ప్రభావితం చేయలేవని స్పష్టం చేసింది. తాజాగా ఎఫ్ఏఏ ఆదేశాల నేపథ్యంలో బోయింగ్ విమానాల్లోని తమ డిస్ప్లే యూనిట్లను మారుస్తున్నామని హనీవెల్ సంస్థ తెలిపింది. ఈ విషయమై తమ ఇంజనీరింగ్ నిపుణులు దృష్టి సారిస్తారని కూడా తెలిపింది. -
మొగల్తూరులో అశ్లీల వీడియోల కలకలం
-
మొగల్తూరులో అశ్లీల వీడియోల కలకలం
సాక్షి, మొగల్తూరు: పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరులో అశ్లీల చిత్రాలు తీవ్ర అలజడి రేపుతున్నాయి. మొగల్తూరులోని ఓ సెల్ఫోన్ రిపేర్ సెంటర్ నిర్వాహకుడు... తన దగ్గరకు ఫోన్స్ రిపేర్స్ కోసం వచ్చే అమ్మాయిలను ట్రాప్ చేసి.. వారితో ఏకాంతంగా గడిపిన వీడియోలు వెలుగులోకి రావడం స్థానికంగా కలకలం రేపుతోంది. ఈ ఘటనలో సదరు కామాంధుడితోపాటు అతని వద్ద పనిచేస్తున్న మరో వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. మొగల్తూరు మండల పరిధిలోని ఓ గ్రామంలో నిందితుడు సెల్ఫోన్ రిపేర్ సెంటర్ నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో అతని వద్దకు వచ్చే మహిళలు, యువతులకు మాయామాటలు చెప్పి ట్రాప్ చేసేవాడు. వారితో చనువు పెంచుకొని.. ఏకాంతంగా గడిపిన సమయంలో రహస్యంగా వీడియోలు తీశాడు. అయితే.. అతని వద్ద ఫోన్ రిపేర్ పనులు నేర్చుకోవడానికి వచ్చిన ఓ యువకుడు.. యజమాని ఫోన్లోని అశ్లీల చిత్రాలను చూసి షాక్ అయ్యాడు. అశ్లీల వీడియోలను తన ఫోన్లోకి ఫార్వర్డ్ చేసుకున్నాడు. అలా ఆ విజువల్స్.. తన స్నేహితులకు ఫార్వర్డ్ చేశాడు. సోషల్ మీడియా గ్రూపుల్లో షేర్ అయిన ఆ విజువల్స్ చివరికి బాధితుల ఫోన్లకు చేరటంతో వారు దిగ్భ్రాంతికి గురయ్యారు. దీంతో బాధితురాలు ఒకరు పోలీసులను ఆశ్రయించటంతో.. నిందితులు ఇద్దరిని అదుపులోకి తీసుకుని ఫోన్లను సీజ్ చేశారు. పెద్దసంఖ్యలో యువతులు, మహిళలను నిందితుడు వంచించాడని, ఆ కామాంధుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు పోలీసులను కోరుతున్నారు. -
సెల్ఫోన్ చిచ్చు.. భార్య అదృశ్యం
హొసూరు: సెల్ఫోన్లో మాట్లాడద్దని భర్త మందలించడంతో భార్య ఇల్లు విడిచి వెళ్లిపోయింది. ఈ సంఘటన బాగలూరు పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకొంది. వివరాల మేరకు.. బెంగళూరు హొసరోడ్డు ప్రాంతానికి చెందిన ప్రేమ్రాజ్ భార్య శిల్ప (23). వీరు హొసూరు సమీపంలోని బాగలూరులో నివాసముంటున్నారు. నాలుగేళ్ల క్రితం పెళ్లి జరిగింది. శిల్ప వేరొకరితో సెల్ఫోన్లో మాట్లాడుతూ ఉందని భర్త గొడవపడేవాడు. ఇదే విషయమై ప్రేమ్రాజ్ ఇటీవల నిలదీశాడు. దీంతో భార్యభర్తల మధ్య స్వల్ప ఘర్షణ జరిగింది. శిల్ప ఏప్రిల్ 26వ తేదీ బంధువుల ఇంటికెళ్లి వస్తానని వెళ్లింది కానీ మళ్లీ ఇంటికి తిరిగి రాలేదు. చుట్టుప్రక్కల, బంధువుల ఇళ్లలో గాలించినా జాడ తెలియకపోవడంతో ప్రేమ్రాజ్ బాగలూరు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ జరుపుతున్నారు. -
సెల్ఫోన్ చోరీకి యత్నం
విశాఖపట్నం, బుచ్చెయ్యపేట(చోడవరం): మండలంలో విజయరామరాజుపేట గ్రామం వద్ద సెల్ ఫోన్ లాక్కొని బైక్పై ఊడాయిం చేందుకు యత్నించిన యువకుడిని బాధితుడే పట్టుకుని బుచ్చెయ్యపేట పోలీసులకు అప్పగించాడు. పి భీమవ రం గ్రామానికి చెందిన అనిమిరెడ్డి నూకరాజు అనే యువకుడు మంగళవా రం ఉదయం సైకిల్పై చోడవరం వెళ్లి సాయంత్రం తిరుగు ప్రయాణమయ్యా డు. విజయరామరాజుపేట గ్రామం వద్ద పల్సర్ బైక్పై వచ్చిన ముగ్గురు యువకులు రావికమతం ఎంత దూరం ఉంటుందని నూకరాజుతో మాటలు కలుపుతూ అతని చేతిలో సెల్ఫోన్ లాక్కొని ఉడాయించడానికి ప్రయత్నిం చారు. దీంతో వెంటనే తేరుకున్న నూకరాజు ద్విచక్ర వాహనంపై వెనక కూర్చు న్న మూడో వ్యక్తి చొక్కా కాలర్ పట్టుకుని గట్టిగా లాగడంతో ద్విచక్ర వాహనంతో పాటు ముగ్గురూ కింద పడిపోయారు. వెంటనే అక్కడికి సమీపంలో ఉన్నవారు రావడంతో ద్విచక్ర వాహ నాన్ని వదిలి ఇద్దరు పారిపోయారు. నూకరాజు మాత్రం కాలర్ పట్టుకున్న వ్యక్తిని వదలక పోవడంతో స్థానికులు అతనిని పట్టుకున్నారు. బుచ్చెయ్యపేట పోలీసులకు సమాచారం అందించడంతో ఏఎస్ఐ పాండు వచ్చి బైక్ను,సెల్ ఫోన్ దొంగతనం చేయబోయిన వ్యక్తిని స్టేషన్కు తరలించారు. పట్టుబడిన వ్యక్తి మాడుగులకు చెందిన మేకల దావిద్ కాగా, పారిపోయిన ఇద్దరు రాము,కుమార్లుగా పోలీసులు గుర్తించారు. -
టార్గెట్ సెల్ఫోన్స్!
ఒకప్పుడు స్నాచింగ్ అంటే మెడలోని గొలుసులు, చేతిలోని బ్యాగ్స్ తస్కరించడం మాత్రమే చేసేవారు. ఇక జేబు దొంగలైతే టార్గెట్ చేసిన వ్యక్తి జేబులో ఉన్న పర్సును చాకచక్యంగా మరో కంటికి తెలియకుండా దొంగిలించేవారు. అయితే ఇటీవలి కాలంలో స్నాచర్లు, పిక్పాకెటర్లు సెల్ఫోన్లనే టార్గెట్ చేస్తున్నారు. చదువుకున్న యువత, జల్సాలకు అలవాటు పడిన వారు ‘జాయ్ స్నాచర్లు’గా మారి పోలీసులకు సవాల్ విసురుతున్నారు. ఇటీవల వరుసగా నమోదవుతున్న ఈ తరహా కేసులు ప్రస్తుతం సిటీ పోలీసులకు ఓ పెద్ద ఛాలెంజ్గా మారాయి. సాక్షి, సిటీబ్యూరో: స్నాచింగ్.... ఎంపిక చేసుకున్న బాధితుడు/బాధితురాలి మెడలోని గొలుసులు, చేతిలోని బ్యాగ్స్ తస్కరించడం పిక్పాకెటింగ్... టార్గెట్ చేసిన వ్యక్తి జేబులో ఉన్న పర్సును చాకచక్యంగా మరో వ్యక్తికి తెలియకుండా దొంగిలించడం ఇప్పటి వరకు ఈ తరహా నేరాలపైనే ఆధారపడేవారు. అయితే ఇటీవలి కాలంలో స్నాచర్లు, పిక్పాకెటర్లు సెల్ఫోన్లనే టార్గెట్ చేసుకుంటున్నారు. చదువుకున్న యువత, జల్సాలకు అలవాటుపడిన వారు సైతం ‘జాయ్ స్నాచర్లు’గా మారి పోలీసులకు సవాల్ విసురుతున్నారు. ఇటీవల వరుసగా నమోదవుతున్న కేసుల నేపథ్యంలో ప్రస్తుతం సిటీ పోలీసులకు ‘సెల్ఫోన్’ ఓ పెద్ద ఛాలెంజ్గా మారింది. గణాంకాల ప్రకారం నగరంలో ఏటా దాదాపు 50 వేలకు పైగా సెల్ఫోన్లు చోరీకి గురవుతున్నాయి.దీనికితోడు అనేక ఛోటామోటా ముఠాలు సెల్ఫోన్ పిక్పాకెటింగ్, స్నాచింగ్ను వ్యవస్థీకృతంగా చేస్తున్నాయి. బస్సు ప్రయాణికులు, పాదచారులను లక్ష్యంగా చేసుకుని సెల్ఫోన్ చోరీలకు పాల్పడుతున్నారు. పర్సులు, గొలుసుల నుంచి సెల్ఫోన్ల వైపు... నగరంలోని పిక్పాకెటింగ్ గ్యాంగ్లు గతంలో కేవలం పర్సులను మాత్రమే టార్గెట్ చేసేవి. అయితే ప్లాస్టిక్ కరెన్సీగా పిలిచే క్రెడిట్, డెబిట్ కార్డుల వినియోగం పెరగడంతో పర్సులతో ‘గిట్టుబాటు’ కావట్లేదు. ఐదేళ్ల క్రితం వరకు చైన్ స్నాచింగ్ ముఠాలు వరుపెట్టి పంజా విసిరాయి. అయితే ప్రజల్లో పెరిగిన చైతన్యం, పోలీసుల చర్యలతో ఈ వ్యవస్థీకృత ముఠాలకు చెక్ పడింది. మిగిలిన స్నాచర్లకు మెడల్లో బంగారం దొరకడం గగనంగా మారిపోవడంతో వారి దృష్టీ సెల్ఫోన్లపై పడింది. అందుకే ఇటీవల కాలంలో పిక్పాకెటర్లు పర్సులను, స్నాచర్లు గొలుసుల్ని వదిలేసి సెల్ఫోన్లపై పడ్డారు. కొందరు ముఠాలు కట్టి వ్యవస్థీకృతంగా సెల్ఫోన్ చోరీలకు పాల్పడుతున్నట్లు పోలీసులు పేర్కొంటున్నారు. ఈ ముఠాలు పరిధులను సైతం ఏర్పాటు చేసుకుంటున్నాయి. నిషా జోరు..సరదా కోసం.. ఇటీవల కాలంలో ‘జాయ్ సెల్ఫోన్ స్నాచర్లు’ పెరిగిపోతుండటం నగర పోలీసులకు కొత్త సవాళ్లను విసురుతోంది. ఈ నేరాలు చేసే వారిలో అత్యధికులకు వాస్తవానికి ఆ అవసరం ఉండదు. ఇలాంటి స్నాచర్ల కుటుంబాలు సైతం స్థిరపడినవో, విద్యాధికులతో కూడినవో ఉంటున్నాయి. అయితే మద్యం మత్తులోనో, గంజాయికి బానిసలుగా మారడంతోనో వీరు గతి తప్పుతున్నారు. తేలిగ్గా డబ్బు సంపాదించడం కోసం ‘తాత్కాలిక స్నాచర్లుగా’ మారిపోయి అప్పుడప్పుడు నేరాలు చేస్తున్నారు. ఇలాంటి వారిలోనూ కొందరు ఈజీ మనీకి అలవాటుపడి వరుసపెట్టి నేరాలు కొనసాగిస్తున్నారు. వ్యవస్థీకృతం కాని, నేరం చేయాల్సి అవసరం లేని వారిలో సరదా కోసం చేస్తున్న వారి సంఖ్యా ఇటీవల పెరుగుతోందని పోలీసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వీరు సరదా కోసం సెల్ఫోన్లు లాక్కుపోతూ స్నాచింగ్, దోపిడీ కేసుల్లో నిందితులుగా మారుతున్నారని పోలీసులు చెబుతున్నారు. ప్రధానంగా దక్షిణ మండలంతో పాటు అంతరాష్ట్ర, జిల్లా బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు ఉన్న చోట్ల ఈ చోరీలు ఎక్కువగా జరుగుతున్నట్లు తెలిపారు. ఇలాంటి కేసుల్ని సీసీ కెమెరాల ఆధారంగా కొలిక్కి తెస్తున్న పోలీసులునేరగాళ్లను కట్టడి చేయడానికి సన్నాహాలు ప్రారంభించారు. ఐఎంఈఐ నంబర్ మార్చేసి... ప్రతి మొబైల్ ఫోన్కు ఇంటర్నేషనల్ మొబైల్ ఎక్యుప్మెంట్ ఐడెంటిఫికేషన్గా పిలిచే (ఐఎంఈఐ) నంబర్ ఉంటుంది. మనిషి వేలిముద్రల మాదిరిగా ప్రపంచంలోని ఏ రెండు సెల్ఫోన్లకూ ఒకే నెంబర్ ఉండదు. సదరు సెల్ఫోన్ను ఏ వ్యక్తి వినియోగిస్తున్నది తెలుసుకోవడానికి ఇది ఉపకరిస్తుంది. జాతీయ భద్రత నేపథ్యంలో ఇది ఎంతో కీలకం. ఐఎంఈఐ నంబర్ ట్యాంపర్ చేసేందుకు ఉపకరించే గ్యాడ్జెట్ విపణిలో లభిస్తున్నాయి. చోరీ ఫోన్లకు దొంగల నుంచి తక్కువ ధరకు కొనుగోలు చేసే వ్యక్తులు ఈ గ్యాడ్జెట్స్ను వినియోగించి దానికి ఉన్న నంబర్కు బదులు మరో ఐఎంఈఐ నంబర్ కేటాయిస్తారు. మరోపక్క పనికి రాని పాత ఫోన్లను రూ.వందల్లో కొనుగోలు చేస్తూ వాటి మదర్ బోర్డ్పై ఉన్న ఐఎంఈఐ నెంబర్ స్ట్రిప్ను ట్యాంపరింగ్ ద్వారా సేకరించి చోరీ చేసిన వాటికి వేసే వారు. తద్వారా సాంకేతికంగా చోరీ ఫోన్లను పట్టుకోవడం సాధ్యం కాదు. గతంలో కేవలం ఈ విధానం ద్వారా మాత్రమే దొంగ ఫోన్లను ‘దొర’ఫొన్లుగా మార్చేసేవారు. సరిహద్దులు దాటిస్తూ... తాజాగా చోరీ సెల్ఫోన్లను కొనుగోలు చేస్తున్న ఇటీవల కాలంలో ఈ చోరీ సెల్ఫోన్లను కొనుగోలు చేసే మారు వ్యాపారుల పంథా పూర్తిగా మారిపోయినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ కారణంగానే తస్కరణకు గురవుతున్న సెల్ఫోన్లలో గరిష్టంగా 30 నుంచి 40 శాతం కూడా రికవరీ కావట్లేదని భావిస్తున్నారు. నగరంలోని అనేక ప్రాంతాల్లో ఈ తరహా వ్యాపారాలు ప్రారంభించిన చోరీ మాల్ వ్యాపారస్థులు సిండికేట్స్గా చైనా మార్గాన్ని ఎంచుకున్నట్లు కొన్ని ఆధారాలు సేకరించారు. గడిచిన కొన్నేళ్లుగా చైనా నుంచి వివిధ రకాలైన వస్తువులను దిగుమతి చేసుకోవడం సాధారణంగా మారిపోయింది. ఇలా వచ్చిన మాల్లో కొంత అనేక కారణాల నేపథ్యంలో రిటర్న్ చేస్తుంటారు. వీటితో కలిపి చోరీ సెల్ఫోన్లను చైనాకు పంపుతున్నట్లు అనుమానిస్తున్నారు. పక్కా ప్రొఫెషనల్ చోరుల నుంచి కొన్న ఖరీదైన హై–ఎండ్ ఫోన్లను మాత్రమే ఇలా పంపేస్తున్నట్లు నిర్థారిస్తున్నారు. ఈ కారణంగానే ఇటీవల కాలంలో చోరీకి గురైన హై–ఎండ్ సెల్ఫోన్లను రికవరీ చేయడం అసాధ్యంగా మారినట్లు తెలిపారు. ఈ వ్యవహారాలపై దృష్టి పెట్టిన పోలీసులు బాధ్యుల కోసం లోతుగా ఆరా తీస్తున్నారు. -
వాచ్వుమన్ ఫోన్ పోయిందని విద్యార్థినులపై..
మోమిన్పేట: వాచ్ఉమన్ ఫోన్ పోయిందని కేజీబీవీ ప్రత్యేకాధికారి విద్యార్థినులను మిట్ట మధ్యాహ్నం ఎండలో బండలపై కూర్చోబెట్టింది. ఎండకు కాళ్లు కాలడంతో కదిలిన విద్యార్థినులను కర్రతో కొట్టింది. కాళ్లకు బొబ్బలు రావడంతో విద్యార్థినులు ఆస్పత్రికి వెళ్లారు. ఈ సంఘటన మోమిన్పేటలోని కస్తూర్బాగాంధీ పాఠశాలలో ఆదివారం సోమవారం వెలుగుచూసింది. విద్యార్థినుల కథనం ప్రకారం.. మండల కేంద్రంలోని చంద్రా యన్పల్లిలో ఉన్న కస్తూర్బాగాంధీ పాఠశాలలో దాదాపు 160 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. శనివారం రాత్రి నైట్ వాచ్ఉమన్ నర్సమ్మ ఫోన్ పోయింది. ఈ విషయం ఆదివారం ఉద యం ఆమె ప్రత్యేకాధికారి(స్పెషల్ ఆఫీసర్) శైలజకు తెలిపింది. దీంతో ఎస్ఓ విద్యార్థినులను పిలిచి ఫోన్ తీసుకొన్నవారు మర్యాదగా అప్పగించండి.. లేదంటే అందరికి మధ్యాహ్నం భోజనం బంద్ అంటూ బెదిరించింది. విద్యార్థులు స్పందించకపోవడంతో మధ్యాహ్నం 12 గంటల నుంచి 2 గంటల వరకు ఎండలో పాఠశాల ఆవరణలో బం డలు వేసిన ప్రదేశంలో వారిని కూర్చోబెట్టింది. ఎండకు తాళ లేక విద్యార్థినులు అంద రూ రూ.10 చొప్పున పోగేసి ఫోను కొనిస్తామని వేడుకున్నా ప్రత్యేకాధికారి వినిపించుకోలేదు. ఎండ వేడిమికి విద్యార్థులు కదలడంతో వారిని కర్రతో దండించింది. ఈ విషయం ఎవరికైనా తెలిస్తే పరిస్థితి మరోలా ఉంటుందని ఎస్ఓ వారిని బెదిరించింది. కాళ్లకు బొబ్బలు రావడంతో ప్రత్యేకాధి కారి విద్యా ర్థులను సోమ వారం మండల కేంద్రం లోని ప్రభు త్వ ఆసుపత్రికి తీసుకెళ్లి అనంతరం మధ్యాహ్నం నగరంలోని తన ఇంటికి వెళ్లిపోయింది. పాఠశాల ప్రత్యేకాధికారి శైలజ భర్త మధుసూదన్ సైతం తరచూ రాత్రి వేళలో పాఠశాలలోనే బస చేస్తాడని విద్యార్థినులు ఆందోళన వ్యక్తం చేశారు. శనివారం రాత్రి సైతం మధుసూదన్ వచ్చాడని చెప్పారు. నిబంధనలకు విరుద్ధంగా రాత్రి సమయంలో పురుషులు హాస్టల్కు రాకూడదని, ఎస్ఓ భర్త తన ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని విద్యార్థినుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు. అయితే, నైట్ వాచ్ఉమన్ నర్సమ్మ నిత్యం రాత్రి పాఠశాలకు కల్లు తీసుకొచ్చి తాగుతుందని విద్యార్థినులు ఆరోపించారు.రాత్రి సమయంలో బయటకు వెళ్లా ల్సి వచ్చినా.. ఆమె స్పందించేది కాదని చెప్పారు. వివరాలు సేకరించిన అధికారులు పాఠశాలలో జరిగిన సంఘటనపై పలువురు అధికారులు సోమవారం వివరాలు సేకరించారు. జిల్లా బాలికల, పిల్లల అభివృద్ధి అధికారి వసుం ధర, ఎంపీడీఓ శైలజారెడ్డి, ఎంఈఓ శంకర్ పాఠశాలను సందర్శించి జరిగిన సంఘటనను విద్యార్థినులతో మాట్లాడి తెలుసుకొన్నారు. చిన్న విషయానికే కఠినంగా శిక్షించే ప్రత్యేకాధికారి తమకు వద్దని విద్యార్థులంతా అధికారులకు తెలిపారు. ప్రత్యేకారిని వెంటనే ఇక్కడి నుంచి బదిలీ చేయా లని కోరారు. ఘటనపై పూర్తి నివేదికను ఉన్నతాధికారులకు పంపిస్తామని చెప్పారు. అయితే, ప్రత్యేకాధికారి శైలజను ‘సాక్షి’ ఫోన్లో సంప్రదించే యత్నం చేయగా ఫోన్ స్విఛాఫ్ వచ్చింది. ప్రత్యేకాధికారి సస్పెన్షన్ సోమవారం సాయంత్రం జిల్లా విద్యాధికారి రేణుకాదేవి పాఠశాలను సందర్శించి విద్యార్థులతో మాట్లాడి వివరాలు సేకరించారు. ఈ సందర్భంగా విద్యార్థినులు తమ ఇబ్బందులను డీఈఓతో వెల్లబోసుకున్నారు. ప్రతి చిన్న విషయానికి ప్రత్యేకాధికారి శైలజ ఇబ్బందులకు గురిచేస్తున్నారని తెలిపారు. ఆమెను వెంటనే ఇక్కడి నుంచి బదిలీ చేయాలని కోరారు. వివరాలు సేకరించిన డీఈఓ ప్రత్యేకాధికారిని సస్పెండ్ చేస్తున్నట్లు వెల్లడించారు. -
కిక్కులో స్నాచింగ్స్
సాక్షి, సిటీబ్యూరో: బతుకుతెరువు కోసం నగరానికి వసల వచ్చిన వారి కుటుంబాలు కష్టపడి పని చేసుకుంటున్నాయి. వీరి ముగ్గురు సంతానం కూడా సోఫా రిపేరింగ్ చేస్తూ బతుకుతున్నారు. వీరిలో ఒకరు గత ఏడాది ఓ స్నేహితుడితో కలిసి నేరం చేశాడు. వారం రోజుల క్రితం ముగ్గురూ కలిసి మద్యం తాగినప్పుడు కిక్కులో ఒకతను ఆ విషయం చెప్పాడు. వెంటనే రంగంలోకి దిగిన ముగ్గురు కేవలం గంట వ్యవధిలో రెండు ఠాణాల పరిధిలో నాలుగు సెల్ఫోన్లు స్నాచింగ్స్ చేశారు. ఈ ముఠా కదలికల్ని సీసీ కెమెరాల ద్వారా గుర్తించిన నార్త్జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నట్లు డీసీపీ పి.రాధాకిషన్రావు ఆదివారం వెల్లడించారు. విజయవాడ నుంచి వలసవచ్చి.. ఆంధ్రప్రదేశ్ విజయవాడకు చెందిన మూడు కుటుంబాలు దాదాపు 15 క్రితం నగరానికి వలసవచ్చాయి. తుకారాంగేట్ పరి«ధిలోని అంబేడ్కర్ నగర్లో స్థిరపడిన ఈ కుటుంబాల్లో ఇద్దరు అన్నదమ్ములు. చిన్న చిన్న పనులు చేసుకుంటూ జీవించే వీరికి జక్కుల వంశీ, జక్కుల జాన్, పూజారీ ఏసోబ్ అనే కుమారులు ఉన్నారు. వీరు కూడా నగరంలోని పలు కాలనీల్లో సంచరిస్తూ సోఫాలు రిపేర్ చేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఏసోబుకు తుకారాంగేట్ టీచర్స్ కాలనీకి చెందిన టమాటో సంజయ్ సింగ్తో పరిచయం ఏర్పడింది. దీంతో గతేడాది మైనర్గా ఉండగానే అతడితో కలిసి సికింద్రాబాద్ గవర్నమెంట్ రైల్వే పోలీసుస్టేషన్ పరిధిలో ఓ సెల్ఫోన్ స్నాచింగ్ చేసి పోలీసులకు చిక్కి జువైనల్ హోమ్కు వెళ్లాడు. గురువారం నార్త్జోన్ టాస్క్ఫోర్స్ పట్టుకున్న నలుగురు సెల్ఫోన్ స్నాచర్స్ గ్యాంగ్లో సంజయ్ కూడా ఉండటం గమనార్హం. మద్యం మత్తులో నిర్ణయం... సమీప బంధువులు, స్నేహితులు అయిన వంశీ, జాన్, ఏసోబు గత కొంతకాలంగా కల్లు, మద్యానికి అలవాటు పడ్డారు. దీంతో సోమవారం ఈ ముగ్గురూ కలిసి తుకారాంగేట్ ప్రాంతంలో పార్టీ చేసుకున్నారు. మద్యం మత్తు తలకెక్కిన తర్వాత సెల్ఫోన్ స్నాచింగ్స్ చేస్తే తేలిగ్గా డబ్బు సంపాదించవచ్చని, అది మన ఖర్చులకు సరిపోతుందని ఏసోబు సలహా ఇచ్చాడు. దీనికి మిగిలిన ఇద్దరూ అంగీకరించడంతో అర్దరాత్రి ముగ్గురూ కలిసి బయటకు వచ్చారు. జాన్కు చెందిన ద్విచక్ర వాహనంపై తుకారాంగేట్ నుంచి బయలుదేరిన ఈ త్రయం ట్రిపుల్ రైడింగ్ చేస్తూ మహంకాళి, గోపాలపురం ఠాణాల పరిధుల్లో చెక్కర్లు కొట్టారు. ఒంటరిగా నడిచి వెళ్తున్న వారిని గుర్తించి వారి సెల్ఫోన్లను దొంగిలించి పారిపోవడం మొదలెట్టారు. వంశీ వాహనం నడుపుతుండగా అతడి వెనుక జాన్, తర్వాత ఏసోబు కూర్చున్నారు. ఫోన్లు స్నాచ్ చేసే ఏసోబు వాటిని జాన్కు ఇచ్చేవాడు. గంటలో నాలుగు చోట్ల పంజా.. ఈ పంథాలో స్వైరవిహారం చేసిన ఈ గ్యాంగ్ కేవలం గంట వ్యవధిలో నాలుగు చోట్ల పంజా విసిరి సెల్ఫోన్ స్నాచింగ్స్కు పాల్పడింది. ఈ ఉదంతాలకు సంబంధించి ఆయా ఠాణాల్లో కేసులు సైతం నమోదయ్యాయి. వీటి దర్యాప్తు కోసం రంగంలోకి దిగిన నార్త్జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు నేరాలు చోటు చేసుకున్న ప్రాంతాల్లోని సీసీ కెమెరాలపై దృష్టి పెట్టారు. ఇన్స్పెక్టర్ కె.నాగేశ్వర్రావు నేతృత్వంలో ఎస్ఐలు కె.శ్రీకాంత్, బి.పరమేశ్వర్, కేఎస్. రవి, జి.రాజశేఖర్రెడ్డితో కూడిన బృందం మొత్తం దాదాపు 250 కెమెరాల్లో రికార్డయిన ఫీడ్ను అధ్యయనం చేసి నిందితులను గుర్తించింది. ఆదివారం ముగ్గురిని పట్టుకున్న టాస్క్ఫోర్స్ టీమ్ వారి నుంచి సెల్ఫోన్లు, ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకుంది. తదుపరి చర్యల నిమిత్తం నిందితులను మహంకాళి పోలీసులకు అప్పగిం చినట్లు డీసీపీ రాధాకిషన్రావు తెలిపారు. -
పౌర పోలీసులు
సాక్షి, సిటీబ్యూరో: ‘ప్రతి పోలీసు యూనిఫాంలో ఉన్న పౌరుడు... ప్రతి పౌరుడు యూనిఫాంలో లేని పోలీసు’... ఈ అంతర్జాతీయ నానుడిని నిజం చేశారు ఆ ముగ్గురు. బుధవారం రాత్రి తార్నాక ప్రాంతంలో తమ కళ్ల ఎదుట జరిగిన సెల్ఫోన్ స్నాచింగ్పై తక్షణం స్పందించి బైక్పై పారిపోతున్న స్నాచర్లను వెంటాడి పట్టుకున్నారు. వీరి స్ఫూర్తిని గుర్తించిన సిటీ పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ గురువారం వారిని సన్మానించారు. బషీర్బాగ్లోని కమిషనరేట్లో ఈస్ట్, నార్త్ జోన్స్ డీసీపీలు ఎం.రమేష్, కల్మేశ్వర్ సింగెనవర్ సమక్షంలో జరిగిన కార్యక్రమంలో ముగ్గురు యువకులకూ జ్ఞాపికలు అందజేశారు. వరుస స్నాచింగ్లతో హడలెత్తిస్తూ.. నగరానికి చెందిన ఇద్దరు మైనర్లు గతంలోనూ కొన్ని నేరాలు చేశారు. తాజాగా బైక్పై తిరుగుతూ రెండు కమిషనరేట్ల పరిధిలో ఆరు చోట్ల పంజా విసిరారు. రాచకొండలోని మల్కాజ్గిరిలో బ్యాగ్, నగరంలోని లాలాగూడ, నల్లకుంట, ఉస్మానియా వర్శిటీ పరిధుల్లో సెల్ఫోన్లు లాక్కుపోయారు. ఓయూ పరిసరాల్లో మూడు సెల్ఫోన్లు ఎత్తుకుపోయారు. నల్లకుంటలో సెల్ఫోన్ పోగొట్టుకున్న బాధితుడు తక్షణం స్పందించి ‘100’కు సమాచారం అందించడంతో అప్రమత్తమైన పోలీసులు వారి కోసం గాలింపు చేపట్టారు. వెంటాడి పట్టుకుని... తార్నాక ప్రాంతంలో ఓ వ్యక్తిని వీరు టార్గెట్గా చేసుకున్నారు. అందులో ఒకరు వాహనాన్ని స్టార్ చేసే ఉంచి సిద్ధంగా ఉండగా, మరొకరు సదరు వ్యక్తి వద్దకు వెళ్లి తన తల్లితో మాట్లాడాలంటూ ఫోన్ అడిగి తీసుకున్నాడు. అదే అదనుగా భావించి ఫోన్తో సహా తన ‘సహచరుడి’తో కలిసి వాహనంపై మెట్టుగూడ వైపు ఉడాయించారు. దీనిని గుర్తించిన బాధితుడు కేకలు వేయడంతో సమీపంలో ఉన్న యువకులు ధీరజ్కుమార్, శ్రీకాంత్, బీవీ ప్రమోద్ అప్రమత్తమై బైక్పై వారిని వెంబడించారు. 80 నుంచి 90 కిమీ వేగంతో దూసుకుపోతున్న వారు కొద్దిసేపటికి మెట్టుగూడ ప్రాంతంలో కనుమరుగయ్యారు. ఆటోలో నక్కి ఉండగా... ఈ స్నాచర్లు తమ వాహనానికి ఉన్న సైలెన్సర్ను పీకేశారు. రాత్రి వేళ విపరీతమైన శబ్ధంతో దూసుకుపోతున్న ఆ వాహనాన్ని గమనించిన పోలీసులు అప్రమత్తమయ్యారు. అప్పటికే స్నాచర్లు దాక్కున్న ప్రదేశానికి చేరుకున్న ముగ్గురు యువకులూ వారి కోసం గాలించగా, ఓ గల్లీ వద్ద ఆగి ఉన్న బైక్ను గుర్తించారు. ఆ సమీపంలోనే ఆటోలో నక్కిన ఇద్దరినీ పట్టుకున్నారు. వీరి ద్వారా సమాచారం అందుకున్న లాలాగూడ పోలీసులు తక్షణం ఘటనాస్థలికి చేరుకుని అదుపులోకి తీసుకుని ఠాణాకు తరలించారు. స్నాచర్లను పట్టుకోవడంలో కీలకంగా వ్యవహరించిన ముగ్గురూ రామాంతపూర్లోని వివిధ ప్రాంతాలకు చెందిన వారు. ధీరజ్ విద్యార్థి కాగా... మిగిలిన ఇద్దరూ ప్రైవేట్ ఉద్యోగులు. అయ్యో పాపం అనిపించింది.. తార్నాకలో నేరం జరిగిందని తెలిసిన వెంటనే అప్రమత్తమై స్నాచర్లను వెంటాడాం. మెట్టుగూడలోని స్కైల్యాబ్ హోటల్ వద్ద ఆటోలో దాక్కున్న ఇద్దరినీ పట్టుకున్నాం. తొలుత వారు తమ వద్ద ఉన్న ఓ బేసిక్ ఫోన్కు ఇచ్చి తమ వద్ద ఇంకా ఏమీ లేవన్నారు. దాంతో పాటు వారి స్థితి చూడగానే అయ్యో పాపం అనిపించింది. ఆ తర్వాత వారి బైక్ను వెతికితే మిగిలిన ఫోన్లు, బ్యాగ్ బయటపడ్డాయి. అప్పుడే వీరి నిజస్వరూపం తెలిసింది. ఫ్రెండ్లీ పోలీసింగ్ కాన్సెప్ట్తో ముందుకు వెళ్తున్న పోలీసుల పని తీరూ మాకు పూర్తిగా అవగతమైంది. పారిపోతున్న నేరగాళ్లను పట్టుకోవడం మా బాధ్యతగా భావించాం. ఇలా ప్రతి ఒక్కరూ ముందుకు రావాల్సిన అవసరం ఉంది. – ధీరజ్, శ్రీకాంత్, ప్రమోద్ అందరికీ ఆదర్శం తమ కళ్ల ఎదుట జరిగిన నేరంపై ఈ యువకులు స్పందించిన తీరు అభినందనీయం. ఇదే స్ఫూర్తిని మరికొందరు ఆదర్శంగా తీసుకోవాలి. పోలీసు–ప్రజల మధ్య సంబంధాలకు ఇదో మంచి ఉదాహరణ. ప్రజలు తమకు సహకరిస్తూ ఉంటే కేసులు కొలిక్కి తీసుకురావడమే కాదు... నేరాల నిరోధానికి ఆస్కారం ఏర్పడుతుంది. మీ కళ్ల ముందు ఎలాంటి నేరం జరిగినా, మీ వాళ్లలోవిపరీతమైన మార్పులు గమనించినా తక్షణం స్పందించండి. నేరుగా లేదా 100 ద్వారా పోలీసులకు సమాచారం ఇవ్వండి. నిందితుల నుంచి ఐదు సెల్ఫోన్లు, బ్యాగ్ స్వాధీనం చేసుకున్నాం.– అంజనీకుమార్, కొత్వాల్ -
దారికాచి దాదాగిరి
బంజారాహిల్స్: బంజారాహిల్స్ రోడ్ నెంబర్–2లోని ఇందిరానగర్లో ఆదివారం అర్ధరాత్రి మద్యం మత్తులో ఉన్న 15 మంది యువకులు దారికాచి అటు వెళుతున్న వారిని అడ్డగిస్తూ సెల్ఫోన్లు, నగదు దోచుకుంటూ బీభత్సానికి పాల్పడ్డారు. ఇదేమిటని అడిగిన వారిని చితకబాదారు. తప్పించుకొని ఇళ్లల్లోకి పారిపోయినా కత్తులు, కర్రలు, రాడ్లతో వెంటపడ్డారు. ఇళ్ల ముందు బీరు బాటిళ్లను పగులగొట్టి భయబ్రాంతులకు గురి చేశారు. ఈ ఘటన బంజారాహిల్స్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు, బాధితుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.. రోడ్ నెంబర్–2లోని ఇందిరానగర్లో నివసించే కృష్ణ అనే యువకుడు ఆదివారం రాత్రి విధులు ముగించుకొని బైక్పై ఇంటికి వెళ్తుండగా రిచ్మండ్ స్కూల్ దాటి ముందు గల్లీలోకి వెళ్లగానే అప్పటికే అక్కడ మాటు వేసిన మహేష్ అలియాస్ మయి, సుతార్ మహేష్, నవీన్, తేజశివ, సురేష్, మల్లి, రాకేష్ తదితరులు అతడిని అడ్డగించారు. అప్పటికే వారు కొందరిని అడ్డుకుని బలవంతంగా వారి జేబులో ఉన్న నగదు లాక్కుని సమీపంలోని మైదానంలోకి వెళ్లి బీర్లు తాగారు. మళ్లీ బీర్లు, గంజాయి తాగడానికి డబ్బులు అవసరం కావడంతో అటుగా వస్తున్న కృష్ణను అడ్డగించారు. వారి నుంచి తప్పించుకున్న కృష్ణ తన తమ్ముడు సాయి ఇంట్లోకి వెళ్లగా మందుబాబులు అతడిని వెంబడించి ఇంటికి వద్దకు వెళ్లి బీరు బాటిళ్లు పగులగొడుతూ కత్తులు, కర్రలతో అరగంటపాటు వీరంగా సృష్టించారు. ఈ ఘటనలో నిషాంత్, సాయి అనే యువకులకు గాయాలయ్యాయి. అడ్డువచ్చిన వారిని పగిలిన బీర్ బాటిల్తో పొడుస్తామంటూ బెదిరించారు. బాధితులు సమాచారంఅందించడంతో పోలీసులు అక్కడికి చేరుకునేలోగా నిందితులు పరారయ్యారు. నిషాంత్, సాయి తదితరులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మహేష్, నవీన్, తేజశివ, సుతార్ మహేష్, సురేష్, రాకేష్, మల్లి తదితరులతో పాటు 15 మంది తమపై దాడికి పాల్పడినట్లు బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. నోవా కాలేజీలో బీటెక్ చదువుతున్న నిందితుడు మహేష్ అలియాస్ మయిని అదుపులోకి తీసుకున్నారు. కత్తి, బీరు బాటిళ్లతో దాడి చేసిన నవీ, సుతార్ మహేష్ కోసం గాలింపు చేపట్టారు. నిందితుల కోసం ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసిన బంజారాహిల్స్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
జీవితాలతో ‘సెల్’గాటం..!
ప్రస్తుతం ప్రపంచమంతా సెల్ మయం. చిన్నారుల నుంచి పెద్దల వరకు అందరి చేతుల్లోనూ ఆండ్రాయిడ్ ఫోన్లే దర్శనమిస్తున్నాయి. ఇప్పుడు ఇవి భవిష్యత్ను నిర్దేశిస్తున్నాయి. సెల్ ఫోన్ను అవసరం మేరకు వినియోగించేవారు పనులు పూర్తిచేసుకుంటున్నారు. సెల్నే ప్రపంచంగా భావించేవారు భవిష్యత్ను అంధకారం చేసుకుంటున్నారు. సెల్ గేమ్లలో మునిగిపోయి జీవితాలను చిత్తు చేసుకుంటున్నారు. కొన్నిసార్లు ప్రాణాలను తీసుకుంటున్నారు. సెల్లో వచ్చే ఆటలకు అధికమంది పిల్లలు, యువత బానిసలవుతున్నారని, ఆరోగ్యాలు పాడుచేసుకుంటున్నారని మానసిక నిపుణులు చెబుతున్నారు. తల్లిదండ్రులు మేలుకోకుంటే పిల్లల భవిష్యత్ ప్రశ్నార్థకమని హెచ్చరిస్తున్నారు. విజయనగరం మున్సిపాలిటీ : బ్లూ వెల్ చాలెంజ్ గేమ్. ఇది ఒక ఆన్లైన్ వీడియో గేమ్. 50 రోజుల పాటు సాగే బ్లూవెల్ గేమ్లో చివరి టాస్క్ ఆత్మహత్య చేసుకోవడం. ఈ గేమ్లో లీనమై ఏడాదిన్నర కిందట మహారాష్ట్రలో ఒకరు, పశ్చిమబెంగాల్లో మరొక పాఠశాల విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నారు. దీనిపై ప్రభుత్వం స్పందించి ఆ ఆటను ఇండియాలో నిషేధించింది. అయితే... ఇది జరిగిన కొద్దినెలల వ్యవధిలోనే మరికొన్ని ఆన్లైన్ వీడియో గేమ్లు విద్యార్థులు, యువత జీవితాలతో ఆటాలాడుకుంటున్నాయి. తాజాగా పబ్జీ ఉరఫ్ ‘ప్లేయర్ అనోస్ బ్యాటిల్ గ్రౌండ్’.. దేశంలో ప్రస్తుతం యువతను ప్రత్యేకించి స్కూల్ విద్యార్థులను ఆ లోకంలో ముంచేస్తున్న ప్రమాదకర ఆన్లైన్ మొబైల్ గేమ్ ఇది. ఆత్మహత్యలవైపు ప్రేరేపించిన బ్లూవేల్, పోకెమాల స్థాయిలో కాకున్నా పబ్జీ విద్యార్థులను హింస, నేరప్రవత్తి స్వభావంవైపు పురిగొల్పుతోంది. పాఠశాలలను ఎగ్గొట్టి మరీ గంటల తరబడి వారు ఈ ఆటలో మునిగితేలేలా బానిసలుగా మార్చుతోంది. యువతలో వివిధ శారీరక, మానసిక అనారోగ్యాలకు కారణమవుతుండడంతో మానసిక వైద్యులు ఆందోళన చెందుతున్నారు. విద్యార్థులు... యువత భవిష్యత్తే టార్కెట్... ఇది దక్షిణ కొరియాకు చెందిన ఓ వీడియో గేమింగ్ కంపెనీ తీసుకొచ్చిన ఆన్లైన్ మల్టీప్లేయర్ గేమింగ్ యాప్. ఈ యాప్ను డౌన్ లోడ్ చేసుకొని గేమ్లో ప్రవేశించగానే ఒక ఐడీ వస్తుంది. ఇది ఎక్కువగా ఒక జట్టుగా ఆడే గేమ్. ఎంత మందితో ఈ గేమ్ ఆడాలి అనేది ముందే దీన్ని ఆడేవారు నిర్ణయించుకుంటారు. ఈ గేమ్ ఆడేవారు ప్రత్యేక సైనిక వేషధారుల్లా మారిపోతారు. అలాగే, ఇది గ్రూప్ వాయిస్ గేమ్. అంటే ఈ గేమ్ ఆడేవారంతా ఎప్పటికప్పుడు మాట్లాడుకునే వెసులుబాటు ఈ యాప్లో ఉంది. ఈ గేమ్లో గరిష్టంగా వంద మంది ఉంటారు. దీన్ని ఆడేవారు ఏర్పాటు చేసుకున్న జట్టు తప్ప మిగిలిన వారంతా శత్రువుల కిందే లెక్క. దీంతో ఈ గేమ్ ఒక యుద్ధక్షేత్రాన్ని తలపిస్తుంది. పోటీదారులదరినీ చంపుకుంటూ పోవడమే ఈ ఆట ప్రధాన లక్ష్యం. యుద్ధంలో ఉపయోగించే తుపాకులు, బాంబులతోపాటు శత్రువులకు చిక్కకుండా దాక్కునేందుకు బంకర్లు, గాయపడితే వైద్యం పొందేందుకు మెడికల్ కిట్ వంటివి ఇందులో ఉంటాయి. ఒక్క సారి ఆటగాడు చనిపోతే గేమ్ అయిపోనట్లే లెక్క. అందుకే యుద్ధంలో ఎలాగైనా గెలవాలనే కసితో ఈ ఆటలో చనిపోయిన ప్రతిసారీ తిరిగి గేమ్లో ప్రవేశించాలనుకుంటారు. వైరల్గా మారుతున్న వీడియో గేమ్స్.. మానవాభివృద్ధికి దోహదపడే సాంకేతిక పరిజ్ఞానం.. అదే స్థాయిలో మానవమనుగడకు ముప్పుగా పరిణమిస్తోంది. వయస్సు, లింగ బేధాలు లేకుండా ఆన్లైన్ ఆటల్లో నిమగ్నమయ్యేవారి భవిష్యత్ను అంధకారంలోకి నెట్టేస్తున్నాయి. గతంలో ఈ తరహా గేమ్స్ కేవలం ధనిక వర్గాలకే పరిమితం కాగా... ప్రస్తుతం అందరివద్ద హస్త భూషణంగా మారిన ఆండ్రాయిడ్ ఫోన్లతో ఈ సంస్కృతి మరింత పెరిగింది. ఒకసారి ఆడితే చాలు మనకు తెలియకుండానే బానిసలైపోతారు. ఇంట్లో ఖాళీగా ఉండే అండ్రాయిడ్ ఫోన్లలో వింత వింత వీడియో గేమ్స్ను డౌన్లోడ్ చేస్తున్న చిన్నారులు వాటిలో పూర్తిగా నిమగ్నమైపోతున్నారు. చివరికి ఆహారం తీసుకునేందుకు విముఖత చూపే స్థాయికి చిన్నారులు దిగజారిపోతున్నారు. తాజాగా ఇంటర్నెట్ను అనుసంధానం చేస్తూ అందుబాటులోకి వచ్చిన ఆన్లైన్ వీడియో గేమ్లు మరింత ప్రమాదకారిగా మారాయన్నది మానిసిక నిపుణుల వాదన. ఒక్కసారి అలవాటు పడితే రోజుల తరబడి అదే ధ్యాసలో ఉండిపోతున్నారు పిల్లలు. దీనికి సెల్ కంపెనీలు ప్రకటిస్తున్న ఇంటర్నెట్ ఆఫర్లు మరింత ఆజ్యం పోస్తున్నట్లవుతోంది. తక్కువ మొత్తానికే రోజుల తరబడి ఇంటర్నెట్ వాడుకునే అవకాశం కల్పించడంతో తల్లిదండ్రులు అంతగా పట్టించుకోవడం లేదు. దీంతో ఇదే అదునుగా ఇంట్లో చిన్నారులు నెట్కు అనుసంధానమై గేమ్స్ భూతంలో చిక్కుకుంటున్నారు. ఇలా రెండవ తరగతి చదువుతున్న విద్యార్థి ఇంటర్మీడియట్ విద్యనభ్యసిస్తున్న విద్యార్థుల వరకు ఈ తరహా ఉచ్చులో చిక్కుకునే వారిలో ఉంటున్నారు. మేలుకుంటేనే మంచిది చిన్నారులు, విద్యార్థులు సెల్గేమ్లలో మునిగిపోకుండా చూసుకోవడంలో తల్లిదండ్రుల పాత్రే కీలకమని సైకాలజిస్టులు పేర్కొంటున్నారు. భారతదేశ సంస్కృతి, సంప్రదాయాల ప్రకారం ఆడే చాలా రకాల క్రీడలు అడేందుకు ఉన్నా... పాశ్చాత్య సంస్కృతిలో అందుబాటులోకి వచ్చిన వీడియేగేమ్ల వల్ల కలిగే అనర్థాలను వివరించాలి. కేవలం తమ పిల్లల విద్యాభివృద్ధిపైనే కాకుండా వారి అభిరుచులు, అలవాట్లపై దృష్టి సారించి అవుట్ క్రీడల్లో ప్రోత్సహించాలి. తద్వారా వారిలో మానసిక ఉల్లాసం పెరిగి చదువులో ఏకాగ్రత పెరుగుతోంది. ప్రతిరోజు వ్యాయామం చేయించడం, శారీరక అలసట ఉండే క్రీడల్లో ప్రోత్సహించాలని చెబుతున్నారు. భారతీయ క్రీడల్లో ప్రోత్సహించాలి ప్రస్తుతం తల్లిదండ్రులు కేవలం చదువు, ఉద్యోగంపైనే దృష్టి సారిస్తున్నారు. తమ పిల్లలు బాగా చదువుతున్నారా..? లేదా..? అన్నదే కాకుండా వారి అలవాట్లను పరిశీలించాలి. ప్రధానంగా వీడియే గేమ్లు ఆడే చిన్నారుల్లో మార్పు తీసుకురావాలి. పిల్లలు ఇంట్లోనే ఉంటూ ఆడుకుంటారు కదా అని చూసీచూడనట్లు వదిలేస్తున్నారు. ఒక్కసారి ఈ గేమ్ ఆడేందుకు అలవాటుపడితే వారిని అంత వేగంగా బాహ్య ప్రపంచంలోకి తీసుకురాలేం. ఇంట్లో ఉన్నది కొద్ది సమయమే అయినా మన సంస్కృతికి సంబంధిత క్రీడల్లో ప్రోత్సహించాలి. – ఎం.మురళీధరరావు, ప్రభుత్వ ఉపాధ్యాయుడు మానసిక సమస్యలు ఉత్పన్నం పూర్తిగా మెదుడుకు సంబంధించి వీడియో గేమ్స్ను ఆడటం వల్ల చిన్నారులు తీవ్ర ఒత్తిడికి గురవుతుంటారు. ఫలితంగా మానసికంగా బలహీనంగా మారుతారు. చిన్న వయస్సులోనే దృష్టిలోపం వస్తుంది. తలనొప్పి వంటి వ్యాధులు అనుబంధ క్రమంలో వ్యాప్తి చెందుతాయి. మానసిక సమస్యలు కొనితెచ్చుకోవడం ద్వారా చదువులో వెనుకబడతారు. ఇటువంటి పరిస్థితుల్లో ఉన్న వారికి కౌన్సెలింగ్ ఇప్పించి వారి అలవాట్లను మారేలా చేయాలి. లేకపోతే బ్లూ వెల్గేమ్ తరహా పరిస్థితులు ఉత్పన్నమవుతాయి. ఈ విషయంలో తల్లిదండ్రులు జాగ్రత్తగా వ్యవహరించాలి. – ఎన్.సూర్యనారాయణ, సైకాలజిస్టు, విజయనగరం వీడియో గేమ్స్తో కలిగే దుష్ఫరిణామాలు... చిన్నతనంలో కదలకుండా ఒకే చోట కూర్చుని ఆడే వీడియో గేమ్స్ వల్ల కండరాల అభివృద్ధి తగ్గిపోతుంది. నరాల వ్యవస్థ దెబ్బతింటుంది. నెక్పెయిన్, అర్థరైటిస్, వీక్నెస్ వంటి రోగాలు వ్యాప్తి చెందుతాయి. కణజాలం పునరుత్పత్తి తగ్గిపోతుంది. ఉత్సాహం తగ్గిపోయి.. నిరుత్సాహం ఆవహిస్తుంది. నిద్ర పట్టకపోవడం వంటి సమస్యలు తలెత్తడంతో పాటు నిద్రలో ఇవే ఆలోచనలు వెంటాడుతుంటాయి. జ్ఞాపకశక్తిని కోల్పోతారు. ఏకాగ్రత దెబ్బతింటుంది. చివరికి ఏం చేస్తున్నారో తెలియని అయోమయ స్థితికి చేరుకుంటారు. పక్కన కూర్చున్న వారిని సైతం పట్టించుకోరు. దీంతో మానవ సంబంధాలు దెబ్బతింటాయి. ఆత్మవిశ్వాసం సన్నగిల్లుతుంది. కోపం, ఉద్రేకం అధికమవుతాయి. -
‘స్మార్ట్’గా చేద్దాం
వేసవి ప్రారంభం కానేలేదు. అప్పుడే తాగునీటికి అడ్డంకులు ఏర్పడుతున్నాయి. జిల్లాలో మిషన్ భగీరథ ద్వారా తాగునీటి సరఫరా నిలిచిపోనుంది. ఇందుకు కారణం సింగూరు ప్రాజెక్టులో జలాలు అడుగంటడమే. వర్షాభావ పరిస్థితులతో సింగూరులో నీటి మట్టం పూర్తిగా తగ్గిపోయింది. వేసవి నాటికి ప్రాజెక్టు పూర్తిగా ఎండిపోయే అవకాశం ఉంది. ఫలితంగా మిషన్ భగీరథ ద్వారా మెదక్, నర్సాపూర్ నియోజకవర్గాల్లో తాగునీటి సరఫరా నిలిచిపోనుంది. నర్సాపూర్ నియోజకవర్గానికి నేటి నుంచి నీటి సరఫరా నిలిపివేయనున్నారు. ప్రస్తుతం మెదక్ నియోజకవర్గంలో రోజు తప్పించి రోజు సరఫరా చేస్తున్నారు. మార్చి మొదటి వారంలో ఇక్కడ కూడా సరఫరా నిలిచిపోనుంది. సాక్షి, మెదక్: ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు వీలుంది. అలాగే మాతాశిశు మరణాలను తగ్గించడమే దీని ప్రధాన లక్ష్యమని అధికారులు చెబుతున్నారు. మహిళా, శిశు సంక్షేమశాఖ (ఐసీడీఎస్) ప్రత్యేకంగా కామన్ అప్లికేషన్ సిస్టం (సీఏఎస్)ను ప్రవేశపెట్టింది. ఈ యాప్ ద్వారా లబ్ధిదారుల వివరాలను ఆన్లైన్లో నమోదు చేయనున్నారు. అంగన్వాడీ కార్యకర్తలకు పని భారంతో పాటు రికార్డుల నిర్వహణ తప్పనుంది.ప్రస్తుతం అంగన్వాడీ కేంద్రాల్లో కార్యకర్తలు రిజిస్టర్లో గర్భిణులు, బాలింతలు, చిన్నారుల వివరాలను నమోదు చేస్తున్నారు. ఇందుకుగాను మొత్తం 14 రకాల రికార్డులు రాయాల్సి ఉంది. దీంతో వారికి పని భారంతో పాటు రిజిస్టర్ల మోత ఉంటుంది. ప్రస్తుతం ప్రభుత్వం స్మార్ట్ ఫోన్లు అందించనుండటంతో ఇకపై వారికి ఈ బాధలు తప్పనున్నాయి. దీంతో పాటు గర్భిణులకు సంబంధించిన ఇమ్యూనైజేషన్, ప్రసవం తేదీలను మూడు రోజుల ముందుగానే సంక్షిప్త సమాచారం ద్వారా తెలియడంతో వారు గర్భిణులను సరైన సమయంలో ఆసుపత్రులకు పంపించే అవకాశం ఉంటుంది. స్మార్ట్ఫోన్లు అందించిన సూపర్వైజర్లు, అంగన్వాడీ టీచర్లకు నాలుగు విడతల్లో శిక్షణ ఇవ్వనున్నారు. మొదటి విడతలో కుటుంబ నిర్వహణ అనే అంశంపై శిక్షణ ఉంటుంది. ఇందులో ఒక కుటుంబానికి సంబంధించిన వివరాలను స్మార్ట్ఫోన్లో ఎలా అనుసంధానం చేయడం తదితర వివరాలను నమోదు చేయడం జరుగుతుంది. రెండోవిడతలో గృహ సందర్శన అనే అంశంపై శిక్షణ నిర్వహిస్తారు. మూడో విడతలో భాగంగా ఆహార పదార్థాలకు సంబంధించి శిక్షణనిస్తారు. చివరగా నాలుగో విడతలో అంగన్వాడీ కేంద్రం నిర్వహణ అంశంపై శిక్షణ కార్యక్రమాలను నిర్వహించనున్నారు. ఈ శిక్షణ కార్యక్రమాలన్ని అంగన్వాడీ టీచర్లు, సూపర్వైజర్లకు స్మార్ట్ఫోన్లు అందించిన అనంతరం నిర్వహించడానికి ప్రణాళిక రూపొందించారు. ప్రత్యేక యాప్ ద్వారా... పంపిణీ చేసిన స్మార్ట్ ఫోన్లను సొంతంగా వినియోగించకుండా ప్రత్యేక యాప్ ద్వారా ట్రాక్ చేయడం జరుగుతుందని సంబంధిత అధికారులు చెబుతున్నారు. వీరికి స్మార్ట్ఫోన్తో పాటు పవర్ బ్యాంక్, ప్రతిపాదించిన నెట్వర్క్ సిమ్కార్డుతో పాటు ఇంటర్నెట్ సౌకర్యం కల్పించనున్నారు. సంబంధిత బిల్లులను ప్రభుత్వమే చెల్లించనుంది. అయితే ఇప్పటి వరకు రికార్డులు రాయడంలోనే అంగన్వాడీ టీచర్లు పూర్తిస్థాయిలో నిమగ్నం కావడంతో పిల్లలకు చదువు చెప్పలేకపోతున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. అలాగే గర్భిణులు, బాలింతలకు కోడిగుడ్లు, పాలు, భోజనం వంటి పౌష్టికాహారం అందించడంలో సైతం కొంత నిర్లక్ష్యం వహిస్తున్నారన్న విమర్శలు లేకపోలేదు. అయితే ఇవి సక్రమంగా అందుతున్నాయా ? లేదా ? సరుకులు అందుబాటులో ఉన్నాయా ? లేదా ? అనే వివరాలను ఆన్లైన్లో పొందుపర్చడం ద్వారా ఉన్నతాధికారులకు క్షణాల్లో తెలుసుకునే వీలుంది. అయితే కొందరు అంగన్వాడీ టీచర్లు ఈ విషయమై తమకు పని భారం పెరిగే అవకాశం ఉంటుందన్నారు. స్మార్ట్ఫోన్లలో పొందుపర్చిన వివరాలు ఒక్కోసారి డిలీట్ అయ్యే పరిస్థితులు ఉంటాయని... దీంతో తాము రిజిష్టర్లలో కూడా నమోదు చేసుకోవాల్సి ఉంటుందంటున్నారు. పారదర్శకత పెరుగుతుంది అంగన్వాడీ టీచర్లు, సూపర్వైజర్లకు స్మార్ట్ ఫోన్లు ఇవ్వడం వల్ల జవాబుదారీతనం పెరుగుతుంది. వీటిలో వివరాలు నమోదుకు సంబంధించి నాలుగు దశల్లో ఆయా సెక్టార్లలో శిక్షణ కార్యక్రమాలు నిర్వహించబడతాయి. పోషన్ అభియాన్ కింద స్మార్ట్ఫోన్, పవర్ బ్యాంక్, ఇంటర్నెట్ సౌకర్యం కల్పించడంతో అంగన్వాడీ టీచర్లకు పని భారం తగ్గుతుంది. అలాగే పనిలో పారదర్శకత పెరుగుతుంది. దీంతో అంగన్వాడీ కేంద్రానికి సంబంధించిన వివరాలు, చిన్నారులు, బాలింతలు, గర్భిణులు తదితర వివరాలను ఎప్పటికప్పుడు నమోదు చేసే అవకాశం ఉంటుంది. –జ్యోతిపద్మ, జిల్లా మహిళా, శిశు సంక్షేమ శాఖ అధికారిణి -
రుయాలో సెల్ఫోన్ల దొంగోడు
చిత్తూరు ,తిరుపతి క్రైం : రుయాస్పత్రిలో సెల్ఫోన్లను చోరీ చేస్తున్న ఓ దొంగోడిని బ్లూకోల్ట్ సిబ్బంది పట్టుకున్న సంఘటన మంగళవారం చోటు చేసుకుంది. పేషెంట్ల గదుల్లో సెల్ఫోన్లు చార్జింగ్ పెట్టిన సమయంలో చోరీకి పాల్పడుతున్నాడని, ఇదే రోజు రెండు సెల్ఫోన్లు చోరీకి గురయ్యాయని రుయాలో విధి నిర్వహణలో ఉన్న కానిస్టేబుల్ నాగార్జునకు సెక్యూరిటీ సిబ్బంది తెలియజేశారు. దీంతో ఆస్పత్రి పరిసరాల్లో ఓ అనుమానితుడు పోలీసులను చూసి పారిపోతుండగా వెంటాడి అదుపులోకి తీసుకున్నారు. ఇతగాడే సెల్ఫోన్లు చోరీ చేస్తున్నట్టు తేలింది. అతని నుంచి 2 సెల్ఫోన్లు, చార్జర్లు, ఓ కత్తిని స్వాధీనం చేసుకున్నారు.నిందితుడు కాణిపాకంరోడ్డులోని తంగవేల్తోపునకు చెందిన పురుషోత్తం అని ప్రాథమిక విచారణలో తేలింది. నాగార్జునను ఎస్పీ అన్బురాజన్ రివార్డుతో అభినందించారు. -
ఆన్లైన్ మోసం
పశ్చిమగోదావరి, గోపాలపురం: ఆన్లైన్ మోసానికి మరో యువకుడు బలయ్యాడు. ఆన్లైన్లో సెల్ఫోన్ బుక్చేస్తే బెల్టు, ఏటీఎం కార్డులు పెట్టుకునే పర్సు పంపడంతో లబోదిబోమంటున్నాడు. గోపాలపురం మండలం నందిగూడెం గ్రామానికి చెందిన చిన్న వెంకటేశ్ అనే యువకుడికి ఎస్ఎస్ టెలీ డీల్ కంపెనీ నుంచి ఫోన్ వచ్చింది. మీ ఫోన్ నంబర్కు ఆఫర్ తగిలిందని రూ.12 వేల విలువైన సెల్ఫోన్ రూ.4,050 చెల్లిస్తే సొంతమవుతుందని నమ్మబలికారు. దీనిని నమ్మిన వెంకటేశ్ ఆర్డర్ చేయగా గ్రామంలోని పోస్టాఫీసుకు పార్సిల్ వచ్చింది. సెల్ఫోన్ తీసుకున్న తర్వాత పోస్టాఫీసులో నగదు చెల్లించాలనడంతో వెంకటేశ్ పార్సిల్ తీసుకుని రూ.4,050 చెల్లించాడు. పార్సిల్ తెరిచి చూడగా బెల్టు, ఏటీఎం కార్డులు పెట్టుకునే పర్సు ఉన్నాయి. వెంటనే వెంకటేశ్ తనకు ఫోన్ వచ్చిన నంబర్కు కాల్చేయగా స్విచ్ఛాఫ్ వచ్చింది. దీంతో మోసపోయానని గ్రహించిన తాను పోలీసులకు ఫిర్యాదు చేస్తానని చెప్పాడు. ఇటీవల ఆన్లైన్ మోసాలు పెరిగాయని, మహిళలతో ఫోన్కాల్స్ చేయించి అమాయకులను బుట్టలో వేసుకుంటున్నారని, అప్రమత్తంగా ఉండాలని పోలీస్స్టేషన్ హౌస్ అధికారి జి.శ్రీనివాసరాజు తెలిపారు. -
సెల్ఫోన్ గేమ్స్తో ట్రాఫిక్ పోలీసుల కాలక్షేపం
టీ.నగర్: ట్రాఫిక్ను క్రమబద్ధీకరించకుండా పోలీసులు సెల్ఫోల్లో ఆటలాడుతున్నట్లు హైకోర్టు న్యాయమూర్తి మంగళవారం ఆవేదన వ్యక్తం చేశారు. హైకోర్టు న్యాయమూర్తి ఎన్.ఆనంద వెంకటేష్ మంగళవారం కేసులపై విచారణ జరుపుతూ వచ్చారు. ఆ సమయంలో ప్రభుత్వం తరఫున సెషన్స్ న్యాయవాది మహ్మద్ రియాజ్ హాజరయ్యారు. ఆయనతో న్యాయమూర్తి ఆనంద వెంకటేష్ మాట్లాడుతూ మంగళవారం ఉదయం హైకోర్టుకు వచ్చే దారి సిగ్నల్స్ వద్ద ట్రాఫిక్ పోలీసులను గమనించానని, వీరంతా ట్రాఫిక్ నియంత్రించకుండా సెల్ఫోన్లు చూడడంలోనే నిమగ్నమైనట్లు తెలిపారు. ఒక సిగ్నల్లో తన కారుతోపాటు అనేక కార్లు నిలిచిపోయాయని, అక్కడ గ్రీన్ లైట్ వెళగగానే ఒక మహిళ రోడ్డుకు అడ్డంగా పరుగెత్తిందని, దీన్ని గమనించకుండా పోలీసు సెల్ఫోన్ చూడడంలో నిమగ్నమైనట్లు తెలిపారు. అందుకు న్యాయవాది ఏ సిగ్నల్ అనేది చెబితే సంబంధిత అధికారులకు తెలుపుతానన్నారు. పోలీసుపై చర్యలకు తాను చెప్పడం లేదని న్యాయమూర్తి బదులిస్తూ ఇకనైనా పోలీసులు క్రమశిక్షణతో విధులు నిర్వహించాలని అన్నారు. ఈ వివరాలను రాష్ట్ర డీజీపీ, నగర పోలీసు కమిషనర్కు తెలపాలని, వీటిపై ఏ చర్యలు తీసుకున్నారో వచ్చే 30వ తేదీన తనకు తెలియజేయాలని న్యాయవాదికి ఉత్తర్వులిచ్చారు.