-
రఘుబాబు కూతురి ఎంగేజ్మెంట్లో స్టార్ల సందడి
-
వాలెంటైన్స్ డే స్పెషల్: టాలీవుడ్ క్యూట్ కపుల్ ఫోటోలు
-
శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు..
-
హాస్య బ్రహ్మ బర్త్డే.. స్టార్ హీరోల విషెస్
-
ఈ ఎన్నికల్లో వారికే ఓటు వేద్దాం..
సాక్షి, హిమాయత్నగర్: సిటీ ఎంత అభివృద్ధి చెందుతున్నప్పటికీ.. మహిళల సమస్యలు మాత్రం పరిష్కారం కావడం లేదు. ఒకరోజు నేను శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి బంజారాహిల్స్ వస్తుండగా.. రోడ్డు పక్కన ఒక్క టాయ్లెట్ కూడా కనిపించలేదు. దీంతో నేను ఎంతో సఫరయ్యాను. నాలాగే చాలామంది మహిళలు టాయ్లెట్స్ విషయంలో చాలా సఫర్ అవుతున్నారు. బయటికి చెప్పుకోలేని బాధను అనుభవిస్తున్నారు. ఇప్పుడు ఎన్నికలు వచ్చాయి. మనకు ఒక అవకాశం వచ్చింది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మహిళలను ప్రగతిపథంలో నడిపించే వారిని గుర్తించి, షీ టాయ్లెట్స్ని ఏర్పాటు చేసే వారికి ఓటు వేద్దాం. అదే విధంగా చెత్త గార్బేజ్ విషయంలో కూడా మార్పులు రావాలి. దీంతో సిటీని మరింత ఆకర్షణీయంగా తీర్చేదిద్దే వారిని మన ఓటు ద్వారా ఎన్నుకుందాం. – నందిని రాయ్, సినీనటి చదవండి : బెస్ట్ సిటీగా మార్చుకుందాం: ఈషా రెబ్బ ఓటర్లలో రావాలి చైతన్యం.. ఓటుహక్కు అన్నది బ్రహ్మాస్త్రం. ఓటు ద్వారా మన ప్రశ్నలకు సమాధానం దొరికినా, దొరక్కపోయినా లీడర్స్కి మనం ఇచ్చే విలువ ఏంటి అంటే ఓటు వేయడం. ఓటు అనేది ఎప్పుడూ ఎంతో ముఖ్యమైనది. హైదరాబాద్లో ఉన్న వాతావరణానికి ఇంకొంచెం అభివృద్ధి జరిగితే బాగుంటుంది. మణికొండలాంటి ప్రాంతాల్లో మాటిమాటికీ బోర్లు వేయడం వల్ల కొన్ని వేల సంవత్సరాల నుంచి ఉన్న గ్రౌండ్వాటర్ని ఎక్కువగా తోడేస్తున్నాం.. అంతేకాదు.. భారీ కన్స్ట్రక్షన్స్ చేపట్టడం, ఎక్కడ చూసినా సిమెంటు రోడ్లు వేసేస్తున్నాం.. హైదరాబాద్లోని పర్యావరణాన్ని మనం ఇంకొంచెం జాగ్రత్తగా కాపాడుకోవాలి. దీనిపై ముఖ్యంగా ప్రజల్లో అవగాహన ఉండాలి.. చైతన్యం రావాలి. – అడివి శేష్ -
తారలు నెలల్లో స్లిమ్ అయిపోతారు
తగ్గడాలు పెరగడాలు సినిమాల్లో సాధారణం. బొద్దుగా కనిపించే తారలు నెలల్లో స్లిమ్ అయిపోతారు. కొన్ని సార్లు సినిమాలో పాత్రలు కోసం ఇలా చేస్తారు. కొన్నిసార్లు ఫిట్గా ఉండాలని ఫిక్స్ అయ్యే తగ్గిపోతారు. లాక్డౌన్లో కొందరు స్టార్స్ ఫిట్గా మారిపోయారు. బరువును మొత్తం దించేసుకున్నారు. బరువు తగ్గడంతో కాన్ఫిడెన్స్ మరింత పెరిగిందంటున్నారు. ఆ విశేషాలు... పెరిగి.. తగ్గారు కృతీ సనన్ నాజూకుగానే ఉంటారు. అయితే ‘మిమి’ అనే హిందీ సినిమా కోసం సుమారు 15 కిలోల బరువు పెరిగారీ బ్యూటీ. ఈ సినిమాలో గర్భిణి పాత్రలో నటించారు కృతి. అందుకోసమే 15 కిలోలు పెరిగారామె. సినిమా చిత్రీకరణ పూర్తి కాగానే తగ్గే పని మీద దృష్టి పెట్టారు. లాక్డౌన్ ఆమెకు కలిసొచ్చింది. ‘‘ఈ లాక్డౌన్లో బరువునంతా తగ్గించుకోవడం సులువు అయింది. నా ట్రైౖనర్ సహాయం వల్లే ఈజీ అయింది’’ అన్నారు కృతీ సనన్. ఫిట్ శింబు ఆ మధ్య తమిళ హీరో శింబు బరువు బాగా పెరిగారు. లాక్డౌన్లో పూర్తి శ్రద్ధ బరువు తగ్గడం మీదే పెట్టారు శింబు. లాక్డౌన్ ముందు వరకూ ఆయన సుమారు 102 కిలోల బరువు ఉన్నారు. ఇప్పుడు 71 కిలోలకు వచ్చేశారు. తగ్గడానికి ఎన్ని నెలలు పట్టిందీ అంటే.. దాదాపు ఏడాది. తగ్గే ప్రయత్నాన్ని గత నవంబర్లో మొదలుపెట్టారు. లాక్డౌన్ వల్ల దొరికిన ఖాళీ సమయంలో కఠోర శ్రమతో వర్కౌట్స్ చేశారట. రోజుకి రెండు మూడు గంటలు వ్యాయామానికి కేటాయించారు శింబు. ప్రతిరోజూ వాకింగ్, జిమ్తో పాటు టెన్నిస్, బాస్కెట్బాల్ ఆడుతూ వెయిట్లాస్ అయ్యారు. ‘‘ఏ పని చేయడానికి అయినా మనం బలంగా సంకల్పించుకోవాలి. మన సంకల్పమే ముఖ్యం’’ అంటారు శింబు. ఇంకో విశేషం ఏంటంటే.. రెండువారాలుగా హీరోయిన్ శరణ్యా మోహన్ వద్ద భరతనాట్యంలో కోచింగ్ తీసుకుంటున్నారాయన. ఓ డ్యాన్స్ బేస్డ్ సినిమాలో నటించనున్నారట. అందుకే ఈ శిక్షణ అని సమాచారం. నిజమైన ఆత్మవిశ్వాసం ఇప్పుడొచ్చింది కామెడీ పాత్రల్లో అందర్నీ ఆకట్టుకున్నారు తమిళ పొన్ను (తమిళ అమ్మాయి) విద్యుల్లేఖా రామన్. స్వతహాగా ఆమె బొద్దుగానే ఉంటారు. చేసేవి కూడా కామెడీ ప్రధానంగా సాగే పాత్రలే కాబట్టి తెర మీద మెరుపు తీగలా కనపడాల్సిన పని లేదు. అయితే ఫిట్ గా ఉండటం ముఖ్యం అనుకున్నారు. అందుకే బరువు తగ్గడం మీద శ్రద్ధ పెట్టారు. ‘‘ఇన్ని రోజులు నేను ఎలా ఉన్నా ఆత్మవిశ్వాసంతో ఉన్నాను అనుకున్నాను. కానీ అలా అనుకున్నాను.. అంతే. బరువు తగ్గిన తర్వాతే నిజమైన ఆత్మవిశ్వాసం వచ్చింది. మనసు పెట్టి చేస్తే అసంభవం అంటూ ఏదీ లేదు. అలాగే బరువు తగ్గడం వెనక పెద్ద రహస్యాలేవీ ఉండవు. శ్రద్ధగా శ్రమించడమే’’ అంటారు విద్యుల్లేఖా రామన్. దాదాపు పది కిలోలు తగ్గారామె. శరీరాన్ని గౌరవించాలి ‘‘మనందరం తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే మనం మన శరీరాన్ని గౌరవించాలి. అనారోగ్య సమస్యల వల్ల లావు అవ్వడాన్ని ఎవ్వరూ ఏం చేయలేరు. కానీ తిండి విషయంలో కంట్రోల్ లేకపోవడం సరైనది కాదు’’ అంటారు ‘చిన్నారి పెళ్లి కూతురు’ ఫేమ్ అవికా గోర్. ‘ఉయ్యాల జంపాల’ చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయం అయిన అవికా తెలుగులో పలు చిత్రాల్లో నటించారు. ఈ మధ్య కాలంలో చాలా బరువు పెరిగారామె. లాక్డౌన్లో శరీరం మీద దృష్టి పెట్టి సుమారు 13 కిలోల వరకూ తగ్గారు. ‘‘ఇష్టమొచ్చింది తినేస్తూ వ్యాయామం చేయకుండా లావయ్యాను. ఓరోజు అద్దంలో నన్ను నేను చూసుకుని నివ్వెరపోయాను. చాలా నిరాశపడ్డాను. నా కాన్ఫిడెన్స్ అంతా పోయింది. డ్యాన్స్ అంటే నాకు చాలా ఇష్టం. కానీ బరువు పెరగడంతో సరిగ్గా చేయలేకపోయాను. ఇక లాభం లేదనుకుని మళ్లీ వర్కౌట్స్ మొదలుపెట్టాను. ఇప్పుడు చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాను’’ అన్నారు అవికా. -
బిహార్లో ఒక బాలీవుడ్డే ఉంది!
ఎన్నికల ర్యాలీకి జనం రావాలి. రావాలంటే.. బలమైన ఆకర్షణ ఏదైనా ఉండాలి. లీడర్కి సహజ ఆకర్షణ ఉంటుంది. అది కాదు. అదనపు ‘ఎట్రాక్షన్’ కావాలి. సినీ నటీమణుల గ్లామర్. బిహార్లో ఒక బాలీవుడ్డే ఉంది! రెండు, మూడు విడతల్లో వాళ్లంతా ప్రచారానికి రావచ్చు. అయితే వస్తారా?! ముంబై తార అమీషా పటేల్కు.. చేదు అనుభవం అయ్యాక కూడా! బిహార్ తొలి విడత ఎన్నికల ప్రచారంలో సోమవారం అమీషా పటేల్, లోక్ జనశక్తి పార్టీ అభ్యర్థి ప్రకాష్ చంద్ర ఎన్నికల ప్రచారానికి సినీ కథానాయికల వల్ల గ్లామర్ వస్తుంది. జనం వస్తారు. ఓట్లు కూడా పడితే పడొచ్చు. ప్రజల దృష్టి మాత్రం పడి తీరుతుంది. బాలీవుడ్ తార అమీషా పటేల్ బిహార్ ఎన్నికల్లో లోక్ జనశక్తి పార్టీ అభ్యర్థి ప్రకాష్ చంద్ర తరఫున ఔరంగాబాద్ జిల్లాలోని ఓబ్రా అసెంబ్లీ నియోజవర్గంలో ప్రచారానికి వచ్చారు. ఆయనే ఆమెను తనకు తెలిసిన వారి ద్వారా ప్రచారానికి పిలిపించుకున్నారు. అక్టోబర్ 28 న జరిగిన తొలి విడత పోలింగ్లో ఓబ్రా కూడా ఉంది. ప్రచారం అయ్యాక అమీషా ముంబై వెళ్లిపోయారు. ‘‘మేడమ్.. దౌద్నగర్ ర్యాలీ ముగిశాక మీ మీద అత్యాచారం జరగబోయిందని మీరు చెబుతున్నట్లుగా సోషల్ మీడియాలో ఆడియో క్లిప్ వైరల్ అవుతోంది. అది మీరేనా!’’ అని ప్రెస్ వాళ్లు వచ్చి అడిగారు. అమీషా ఆశ్చర్యపోయారు. ‘‘అవును. నన్ను బెదిరించారు. అత్యాచారం చేయబోయారు. దొరికి ఉంటే చంపేసేవారు కూడా. ప్రకాష్ చంద్ర ఉద్దేశపూర్వకంగా నా ఫ్లయిట్ మిస్సయ్యేలా చేశాడు. రాత్రంతా నన్నొక గ్రామంలో ఉంచాడు. నాతో అసభ్యంగా ప్రవర్తించాడు. తప్పించుకుని వచ్చేశాను’’ అని చెప్పారు. చిన్న సంగతేం కాదు. నేడో రేపో ప్రకాష్ చంద్ర మీద కేసు ఫైల్ కావచ్చు. అయితే అమీషా చెబుతున్నవన్నీ అబద్ధాలని ఆయన అంటున్నారు. ప్రత్యర్థుల దగ్గర డబ్బులు తీసుకుని ఆమె అలా చెబుతున్నారని అయన ఆరోపణ. అమీషా మాత్రం.. ‘‘కావాలంటే చూడండి, నేను ముంబై వచ్చాక కూడా నన్ను బెదిరిస్తూ టెక్స్›్ట చేశాడు’’ అని సాక్ష్యాధారాలు చూపిస్తున్నారు. ప్రియాంకా చోప్రా, శ్వేతాబసు ప్రసాద్ ఈ ఆరోపణలు, ప్రత్యారోపణలలో ప్రకాశ్ చంద్ర ఒక మాట అన్నారు. ‘‘బిహారేమీ ఎన్నికల ప్రచారానికి బాలీవుడ్ తారల కోసం ముఖం వాచిపోలేదు. మాకు సోనాక్షీ సిన్హా అంతటి వారే ఉన్నారు’’ అని! ఏమాత్రం అతకని మాట అది. అయినా.. సోనాక్షి గానీ, ఆమె తండ్రి శత్రుఘ్న సిన్హా గానీ లోక్ జనశక్తి పార్టీలో లేరు. మరో బిహార్ నటి అక్షరాసింగ్ ఇప్పటికే జనతాంత్రిక్ వికాస్ పార్టీ తరఫున ప్రచారం చేస్తున్నారు. అక్షరాసింగ్ పాట్నా అమ్మాయే. నేహాసింగ్ రాథోడ్ అని ఇంకో అమ్మాయి (23) ఉన్నా ఆమె ఏ పార్టీకీ మద్దతు ఇవ్వడం లేదు. భోజ్పురి ర్యాప్ సింగర్ తను. కేంద్రంలో ఎవరు పవర్లో ఉంటే వారిని, రాష్ట్రంలో ఎవరు అధికారంలో ఉంటే వారినీ విమర్శిస్తూ పాటలు పాడి, యూట్యూబ్లో అప్లోడ్ చేస్తుంటుంది. బిహార్లోని మిగిలిన తారామణులంతా బాలీవుడ్లో ఉన్నారు. నవంబర్ 3, 7 తేదీలలో జరిగే రెండు, మూడు విడతల పోలింగ్ ప్రచారానికైతే వాళ్లెవరూ ఇప్పటి వరకు రాలేదు. సోనాక్షీ సిన్హా , అక్షరాసింగ్ బిహార్ నుంచి వెళ్లి బాలీవుడ్లో, ఇతర చిత్ర పరిశ్రమల్లో వెలిగిన, వెలుగుతున్న నటీమణులు చాలామందే ఉన్నారు. ప్రియాంక చోప్రా అయితే ఏకంగా హాలీవుడ్కే వెళ్లారు! ప్రియాంక జార్ఖండ్ అమ్మాయి. 2000లో జార్ఖండ్ విడిపోకముందు బిహార్లోనే కదా ఉంది. సోనాక్షీ సిన్హా పట్నా నుంచి బాలీవుడ్కి వెళ్లారు. శ్వేత బసు ప్రసాద్ పుట్టింది జంషెడ్పుర్లోనే. ఆమె మన తెలుగులోనూ నటించారు. నేహాశర్మది బిహార్లోని భగల్పూర్. రామ్చరణ్ తొలి చిత్రం ‘చిరుత’లో హీరోయిన్గా నటించారు. నీతూ చంద్ర పాట్నా నుంచి వెళ్లారు. నటి, బాలీవుడ్ నిర్మాత కూడా ఆమె. హిందీతో పాటు తెలుగు సహా అన్ని దక్షిణాది భాషల్లో నీతూ నటించారు. ‘గోదావరి’లో రాజీ ఈమే. బిహార్ నుంచి బాలీవుడ్కి వెళ్లిన ‘ఝా’లు ముగ్గురు ఉన్నారు. అనురితా ఝా, కావేరీ ఝా, కోమల్ ఝా. కావేరీ, కోమల్ తెలుగులో కూడా నటించారు. కావేరిది దర్భంగా, కోమల్ది రాంచీ. అనురిత మధుబని అమ్మాయి. ఇంకొక బాలీవుడ్ నటి శాండిలీ సిన్హా మన ‘ఒరే పాండూ’ లో నటించారు. తనది ముజఫర్పుర్. నేహాసింగ్ రాథోడ్, దీపికా సింగ్ బిహార్ నుంచి మొత్తం పదికి పైగా బాలీవుడ్కి వెళ్లిన నటీమణులు వీళ్లు. ఈ సంఖ్య తక్కువేమీ కాదు. వీళ్లు కాకుండా టీవీలో దీపికాసింగ్ (దియా ఔర్ బాతీ హమ్), శృతీ ఝా (కుంకుం భాగ్య), రతన్ రాజ్పుత్ (సంతోషీ మా), ఛవీ పాండే (ఏక్ బూంద్ ఇష్క్), అలీషా సింగ్ (బూగీ ఊగీ) బిహార్ వాళ్లే. దీపిక ఢిల్లీలో ఉంటున్నా ఆమె పూర్వికులది బిహార్. శృతీ ఝా బెగుసరాయ్. ఛవీ పాండే పట్నా. అలీషా రాంచీ. బిహార్లో మిగిలిన రెండు విడతల పోలింగ్ ప్రచారానికి వీరిలో కొందరు ఏదో ఒక పార్టీ తరఫున వచ్చే అవకాశాలైతే ఉంటాయి. అయితే అమీషాకు ఎదురైన చేదు అనుభవం తర్వాత కూడా ప్రచారానికి వచ్చేందుకు ఆసక్తి చూపుతారా?! ఎంత డబ్బు ఇస్తామన్నా?! శృతీ ఝా, రతన్ రాజ్పుత్ -
సీఎంఆర్ఎఫ్కు భారీగా ప్రముఖుల విరాళాలు
సాక్షి, హైదరాబాద్ : కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా లాక్ డౌన్ ప్రకటించిన నేపథ్యంలో పేదలకు నిత్యావసరాల సర ఫరా కోసం ప్రభుత్వం చేపట్టిన చర్యలకు పలువురు ప్రముఖులు విరాళం ప్రకటించారు. మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల సతీమణి అనుపమ వేణుగోపాల్ నాదెళ్ల సీఎం సహాయ నిధికి రూ.2 కోట్ల విరాళం ప్రకటించారు. ఈ చెక్కును అనుపమ తండ్రి, మాజీ ఐఏఎస్ కేఆర్ వేణుగోపాల్ మంగళవారం ప్రగతిభవన్లో సీఎంను కలిసి అందజేశారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు తమ ఒకరోజు వేతనం అంటే రూ.48 కోట్లను సీఎంఆర్ఎఫ్కు విరాళంగా ప్రకటించారు. ఈ చెక్కును ఉద్యోగ సంఘాల జేఏసీ నేతలు కారం రవీందర్రెడ్డి, మమత సీఎంకు అందజేశారు. సినీ హీరో నితిన్ రూ.10 లక్షలు విరాళంగా ఇచ్చారు. పంచాయతీ రాజ్ టీచర్స్ యూనియన్–టీఎస్ సభ్యులు రూ.16 కోట్ల విరాళం ప్రకటించారు. తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్రెడ్డి తన ఒక నెల వేతనం రూ. 2.50 లక్షలను ముఖ్యమంత్రి సహాయనిధి కోసం చెక్కు రూపంలో సీఎంకు అందించారు. -
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పలువురు ప్రముఖులు
-
దివికేగిన సినీ దిగ్గజాలు
-
కోడి రామకృష్ణ పార్దివదేహానికి ప్రముఖుల నివాళులు
-
జనగామ: ఓటర్లకు కళాకారులతో చైతన్యం
సాక్షి, జనగామ: ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ (ఈవీఎం), ఓటరు వెరిఫైబుల్ పేపర్ ఆడిట్ ట్రయల్ (వీవీప్యాట్) వినియోగంపై అధికారులు ఓటర్లకు విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు. మారిన ఓటింగ్ విధానంపై చైతన్యం చేస్తున్నారు. ఎవరికి ఓటేసినా ఒక్కరికే పడుతుందనే అపోహ తొలగించడంతో పాటు ఎవరికి ఓటేశామనే అంశాన్ని నిర్ధారించుకునే విధంగా ప్రింట్ కాపీని సైతం తీసుకునే అవకాశాన్ని ఎన్నికల సంఘం ఓటర్లకు కల్పించింది. తాజాగా అమలులోకి వచ్చిన ఓటింగ్ విధానాన్ని ఓటర్లకు తెలియపర్చడం కోసం విస్త్రత ప్రచార కార్యక్రమాలకు జిల్లా ఎన్నికల అధికారులు శ్రీకారం చుట్టారు. జిల్లాకేంద్రం నుంచి బూత్లెవల్ వరకు.. నూతన ఓటింగ్ పద్ధతులపై జిల్లానుంచి గ్రామీణ ప్రాంతంలోని బూత్లెవల్ వరకు విస్తృత ప్రచారం చేస్తున్నారు. జిల్లాకేంద్రంలోని పలుశాఖల అధికారులతో పాటు దివ్యాంగులకు, మహిళ సంఘాలకు, వివిధ వర్గాల ఓటర్లకు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. నియోజకవర్గ కేంద్రాలు, మండలకేంద్రాలు, పంచాయతీలు, బూత్లెవల్ వరకు ఓటేసే విధానం, ఓటు వినియోగంపై సవివరంగా తెలియజేస్తున్నారు. ముఖ్యంగా కళాశాలల్లో కొత్త విధానంపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కళాకారులతో ప్రచారం.. సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో కళాకారులతో ఓటు హక్కు వినియోగంపై చైతన్యవంతం చేస్తున్నారు. గణేష్ నేతృత్వంలోని సంజీవ, శంకర్, చిరంజీవి, కనుకరాజు, సోమయ్య బృందం జిల్లాలోని జనగామ, పాలకుర్తి, స్టేషన్ఘన్పూర్ నియోజకవర్గాల పరిధిలో కళాకారులు నూతన ఓటింగ్ విధానం, సందేహాలు, అనుమానాలపై అవగాహన కల్పిస్తున్నారు. ఇప్పటికే జనగామ మునిసిపాలిటీ పరిధిలో వార్డుల వారీగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. స్టేషన్ఘన్పూర్, పాలకుర్తి నియోజకవర్గ కేంద్రాలు, మండలకేంద్రాల్లో గ్రామాల్లో ఓటరు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. డమ్మీ ఈవీఎం, వీవీప్యాట్లను ఏర్పాటుచేసి ఓటు వేయించి చూపిస్తున్నారు. ఇటు కళాకారులతో పాటు మరోవైపు ఓటింగ్ విధానం తెలియచేస్తూ ఫ్లెక్సీలు, హోర్డింగ్లు ఏర్పాటు చేశారు. జనగామ, పాలకుర్తి, స్టేషన్ఘన్పూర్లో ముఖ్యకూడళ్ల వద్ద ఫ్లెక్సీలు, హోర్డింగ్లు ఏర్పాటు చేశారు. ఎన్నికల నాటికి మూడు నియోజకవర్గాల్లోని అన్ని గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నారు. కళాకారుల అవగాహన కార్యక్రమాలకు ఓటర్లు ఆసక్తి చూపుతున్నారు. పోలింగ్లోకి ఓటరు ఎలా వెళ్లాలి, ఓటు హక్కును ఎలా వినియోగించుకోవాలనే అంశాలపై చైతన్యవంతం చేస్తున్నారు. సుద్దాల అశోక్తేజతో ఓటు విలువపై అవగాహన.. ఓటుహక్కు వినియోగంపై ప్రముఖ సినీగేయ రచయిత సుద్దాల అశోక్తేజతో ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రతిఒక్కరూ ఓటు వినియోగించుకోవాలని కోరుతూ అశోక్తేజతో ప్రచారం చేయిస్తున్నారు. విలువైన ఓటును దుర్వినియోగం చేయొద్దని కోరుతున్నారు. ఓటింగ్ శాతం పెరిగేలా ఓటు వినియోగంపై ప్రచారం సాగిస్తున్నారు. -
విదేశీయులను పెళ్లాడిన సెలబ్రెటీలు
సెలబ్రెటీల జీవితాల్లో ప్రతీ అంశం ఆసక్తికరమే. అందుకే వారి వ్యక్తిగత జీవిత విశేషాల పై కూడా అభిమానులు ఆసక్తికనబరుస్తుంటారు. ముఖ్యంగా వారి ప్రేమ పెళ్లి లాంటి విషయాల కు సంబంధించిన వార్తలు సోషల్ మీడియాతో పాటు మీడియాలోనూ ప్రముఖం వినిపిస్తుంటాయి. ఇటీవల హాలీవుడ్లో సత్తా చాటుతున్న బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా హాలీవుడ్ గాయకుడు జాన్ నికోస్తో ప్రేమాయణం కొనసాగిస్తున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. ప్రైవేట్ ఫంక్షన్స్లోనూ వీరిద్దరూ చెట్టాపట్టాలేసుకు కనిపించటంతో ఆ వార్తలకు మరింత బలం చేకూరుతుంది. దీంతో గతంలో ఇలా విదేశీయులతో ప్రేమ పెళ్లిల్లు చేసుకున్న తారల జీవితాలకు సంబంధించిన చర్చ మొదలైంది. ఈ జాబితాలో దేశీయ తారలు చాలా మందే ఉన్నారు. ఇటీవల కాలంలో మన సెలబ్రెటీ నటీనటులు చాలా మంది విదేశీయులను పెళ్లి చేసుకున్నారు. ఈ ఏడాది శ్రియా, ఆండ్రీ కోశ్చివ్ను వివాహం చేసుకోవడం, ఇలియానా, ఆస్ట్రేలియన్ ఫొటోగ్రాఫర్తో ఆండ్రూ నీబోన్తో ప్రేమాయణం సాగించటం తెలిసిందే. అయితే ఇప్పుడు ఎక్కడ చూసినా.. ప్రియాంక, నిక్ జోనాస్లకు సంబంధించిన వార్తలే వినిపిస్తున్నాయి. వీరి కుటుంబ కార్యక్రమాలకు కూడా ఇద్దరు కలిసి హాజరవుతున్నారు. గతంలో.. ప్రీతిజింటా లాస్ ఏంజిల్స్లోని ఆర్థిక విశ్లేషకుడు జీన్ గుడ్నఫ్తో కొంతకాలం పాటు డేటింగ్ చేసి 2016లో వివాహం చేసుకున్నారు. బుల్లితెర నటి ఆష్కా గొరాడియా అమెరికన్ బ్రెంట్ గ్లోబేతో హిందూ, క్రైస్తవ సంప్రదాయాల్లో గతేడాది డిసెంబర్లో వివాహం జరిగింది. లాస్ వెగాస్లో వీరు మొదటిసారిగా కలుసుకున్నారు. టీవీ నటి అయిన సుచిత్ర పిళ్లై డెన్మార్క్కు చెందిన లార్స్ జెల్సన్ అనే ఇంజనీర్ను పెళ్లి చేసుకున్నారు. వీరు మొదటి సారిగా ముంబైలో జరిగిన ఓ వేడుకలో కలిశారు. అరుణోదయ్ సింగ్ అనే నటుడు కెనడాకు చెందిన లీ ఎల్టన్ను వివాహం చేసుకున్నారు. వీరిద్దరు గోవాలో మొదటిసారిగా కలుసుకున్నారు. లక్కీ అలీ అనే గాయకుడి మూడో భార్య ఎలిజబెత్ హాలమ్. ఈమె మాజీ మిస్ గ్రేట్ బ్రిటన్. వీరికి 2010లో వివాహం జరిగింది. వివాహానంతరం ఈమె పేరును అయేషా అలీగా మార్చుకున్నారు. బాలీవుడ్ స్టార్ శశి కపూర్ బ్రిటీష్ నటి జెన్నిఫర్ కెండల్ను 1958లో వివాహమాడారు. సల్మాన్ ఖాన్, రొమేనియన్ మోడల్ లూలియా వాంటూర్కు మధ్య ఏదో నడుస్తుందన్న వార్త బాలీవుడ్లో ఇప్పటికీ హాట్ టాపికే. -
సెలబ్రిటీల కల్యాణాలతో సందడే సందడి
సాక్షి, తిరుమల: మూడు ముళ్లు.. ఏడడుగులు.. వివాహం ప్రతి ఒక్కరి జీవితంలో కీలక ఘట్టం.. యువతీ యువకులకు అందమైన కల.. మధురమైన జ్ఞాపకం. ఇంతటి గొప్ప వివాహ వేడుకను నిత్య కల్యాణ చక్రవర్తి శ్రీవేంకటేశ్వరస్వామి సన్నిధిలో చేసుకుని తమ జీవితాల్లో వెలుగులు నింపుకోవాలని అందరూ తపిస్తుంటారు. సప్తగిరీశుడి సన్నిధిలో ఏడాది పొడవునా వివాహబంధంతో కొత్తజంటలు ఒక్కటవుతుంటాయి. సెలబ్రెటీలు సైతం ఈ దివ్యక్షేత్రంలో పెళ్లి చేసుకునేందుకు మొగ్గుచూపుతారు. నాటి మేటి నటి జమున నుంచి రంభ వరకు సెలబ్రిటీ లెందరెందరో ఇక్కడ వివాహం చేసుకున్నారు. తిరుమలలో పెళ్లి చేసుకున్న కొందరు సెలబ్రిటీల వేడుకను మరోసారి మనం తిలకిద్దాం.. జమున–రమణరావు నాలుగు దశాబ్దాల కిందట అలనాటి నటి జమున,రమణరావు వివాహం తిరుమలలో జరిగింది. శ్రీవారి ఆలయానికి పడమర దిశలోని ఆల్ ఇండియా ఆర్యవైశ్య సమాజ సత్రంలో వైభవంగా వేడుక సాగింది. అప్పట్లో చెన్నై, హైదరాబాద్, బెంగళూరు నుంచి పదుల సంఖ్యలో సినీ తారలు విచ్చేశారు. వారిని చూసేందుకు ఏపీ, తమిళనాడు నుంచి కూడా అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. కొండ మీద జరిగిన జమున పెళ్లి వేడుకను నేటికీ స్థానికులు చర్చించుకుంటూ ఉంటారు. బాలకృష్ణ–వసుంధర మాజీ ముఖ్యమంత్రి, ఆంధ్రుల అభిమాన నటుడు, దివంగత ఎన్టీ రామారావు కుమారుడు హీరో బాలకృష్ణ, వసుంధర వివాహం తిరుమలలో జరిగింది. రెండున్నర దశాబ్దాల కిందట పడమర మాడ వీధిలోని కర్ణాటక సత్రంలో వారి పెళ్లి జరిగింది. ఇదే సందర్భంలోనే బాలకృష్ణ సోదరుడు రామకృష్ణ, జయశ్రీ వివాహం జరిగింది. అప్పటికే హీరోగా రాణిస్తున్న బాలకృష్ణ వివాహ మహోత్సవానికి సినీనటులు, రాజకీయ నేతలు విచ్చేసి ఆశీర్వదించారు. రాష్ట్ర వ్యాప్తంగా అభిమానులు తరలివచ్చారు. ఘట్టమనేని రమేష్ సూపర్స్టార్ ఘట్టమనేని కృష్ణ్ణ పెద్ద కుమారుడు, హీరో రమేష్బాబు వివాహం జూన్ 18,1998లో ఇక్కడి కర్ణాటక సత్రాల్లో జరిగింది. కృష్ణ పెద్దకుమార్తె మంజుల,సంజయ్ స్వరూప్ల వివాహం కూడా ఇక్కడి శ్రీశృంగేరి శంకర మఠం లో జరిగింది. సినీ పరిశ్రమలోని పెద్ద లంతా హాజరయ్యారు. శ్రీకాంత్–ఊహ పదిహేనేళ్లకు ముందు ఇక్కడి ఎస్ఎంసీ కల్యాణ మండపంలో శ్రీకాంత్, ఊహ కల్యాణం జరి గింది. అప్పటికే ఇద్దరూ కూడా సినీస్టార్లుగా చిత్ర పరిశ్రమలో ఉ న్నారు. వివాహ మహోత్సవానికి పెద్ద సంఖ్యలో ప్రముఖులు, నటులు విచ్చేసి ఆశీర్వదించారు. మీనా–విద్యాసాగర్ నటి మీనా–సాఫ్ట్వేర్ ఇంజినీర్ కె.విద్యాసాగర్ వివాహం 2009, జూలై 12న తిరుమలలో జరిగింది. బాలనటిగా, 1990లో సీతా రామయ్య గారి మనుమరాలు’ చిత్రంతో హీరోయిన్గా, 2009లో ‘వెంగమాంబ’ వంటి ఎన్నెన్నో విభిన్న పాత్రలతో మెప్పించిన మీనా పెళ్లివేడుక ఇక్కడి ఆల్ ఇండియా ఆర్యవైశ్య సమాజ సత్రంలో జరిగింది. నటులు సంఘవి, రాగిణి, కృష్ణ వేణి, దర్శకుడు చేరన్, నిర్మాతలు వి.దొరస్వామి రాజు, టి.శివ, పలువురు నటులు, ప్రము ఖులు హాజరయ్యారు. మహేశ్వరి–జయకృష్ణ గులాబి చిత్రం ఫేమ్ మహేశ్వరికి సాఫ్ట్వేర్ ఇంజినీర్ జయకృష్ణ్ణతో 2008, సెప్టెంబర్18న ఇక్కడి ఉడ్సైడ్ హోటల్లోని ఆర్యవైశ్య సత్రంలో పెళ్లి జరిగింది. మహేశ్వరి శ్రీదేవికి బంధువు కావడంతో బోనీ కపూర్ కుటుంబ సభ్యులు విచ్చేశారు. నటి మీనా, విజయకుమార్, మంజులతోపాటు వారి కుమార్తె శ్రీదేవి, మరికొందరు నటులు వేడుకల్లో పాల్గొన్నారు. రంభ–ఇంద్రకుమార్ నటి రంభ, కెనడాకు చెందిన ఎన్ఆర్ఐ ఇంద్రకుమార్ వివాహం తిరుమల కర్ణాటక సత్రాల్లో జరిగింది. ఏప్రిల్ 8, 2010లో జరిగిన ఈ వివాహానికి దర్శకులు రాఘవేంద్రరావు, ఆర్కే సెల్వమణి, హీరోయిన్ రోజాతోపాటు అనేక మంది నటీనటులు హాజరయ్యారు. కల్యాణోత్సవ సేవలో నిత్యం 900 జంటలు తిరుమల క్షేత్రం నిత్య కల్యాణం, పచ్చతోరణంగా భాసిల్లుతోంది. శ్రీవేంకటేశ్వరుడు నిత్య కల్యాణ చక్రవర్తి. ఆలయంలో లోక కల్యాణార్థం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీవేంకటేశ్వరస్వామి కల్యాణం నిత్యం జరుగుతుంది. కొత్తగా వివాహం చేసుకున్న జంటలు స్వామి దర్శనానికి వచ్చి శ్రీవారికి కల్యాణోత్సవం జరిపించే సంప్రదాయం క్రమంగా పెరుగుతోంది. ఆలయంలో ఐదు శతాబ్దాల కిందట కల్యాణోత్సవం ప్రారంభమైంది. ప్రస్తుతం రోజుకు 800 నుంచి 900 జంటల వరకు ఈ కల్యా ణోత్సవంలో పాల్గొని భక్తి శ్రద్ధలతో మొక్కులు చెల్లిస్తున్నారు. ఏడాది పొడవునా వివాహాలే .. తిరుమల క్షేత్రంలో నిత్యం పెళ్లి మంత్రాలు వినిపిస్తాయి. భాజా భజంత్రీలు మోగుతూనే ఉంటాయి. నవ వధూవరులు సరికొత్త ఆశలతో ఒక్కటవుతూ ఉంటారు. శుభ లగ్నాలతో పనిలేకుండా కూడా రోజూ పెళ్లి వేడుకలు సాగుతుండడం ఇక్కడి ప్రత్యేకత. ఏడాదిలో సుమారు పది వేలకు పైగా పెళ్లిళ్లు జరుగుతుంటాయి. -
ఎమ్మెల్యే కుమారుడి వివాహానికి హాజరైన ప్రముఖులు
పటాన్చెరు: పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి ద్వితీయ పుత్రుడు విక్రమ్రెడ్డి వివాహా మహోత్సవం ఘనంగా జరిగింది. పార్టీలకు అతీతంగా అన్ని వర్గాల వారు ఈ పెళ్లికి హాజరయ్యారు. విక్రమ్రెడ్డి, పల్లవిల వివాహాం ఘనంగా జరిగింది. పటాన్చెరు శివారులోని జిఎంఆర్ కన్వెన్షన్ సెంటర్లో వైభవోపేతంగా వివాహం నిర్వహించారు. ఈ వివాహా మహోత్సవానికి రాష్ట్ర శాసనసభ స్పీకర్ మధుసూధనాచారి, ఉప ముఖ్య మంత్రి మహ్మూద్ అలీ, ఆర్అండ్బీ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు, మంత్రి హరిష్రావు డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్రెడ్డి, జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్, ఎమ్మెల్సీ వి.భూపాల్రెడ్డి, శంభీపూర్రాజు, ఎమ్మెల్యేలు చింత ప్రభాకర్, మదన్రెడ్డి,మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి తదితరులు పాల్గొన్నారు. పటాన్చెరు నియోజకవర్గంలోని సర్పంచ్లు, ఎంపీటీసీలు, వివిధ శాఖల అధికారులు, ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి, అతని సోదరుడు మధుసూధన్రెడ్డిల స్నేహితులు, అభిమానులు, బంధుగణం ఈ పెళ్లికి హాజరయ్యారు. వివాహ మహోత్సవం సందర్భంగా పట్టణమంతటా సందడి కనిపించింది. వీఐపీల రాక పోకలు ఔటర్ మీదుగా సాగినా పట్టణంలో కన్వెన్షన్ సెంటర్ వైపు వచ్చిపోయే వాహనాలతో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఎంపీపీలు శ్రీశైలం యాదవ్, రవీందర్రెడ్డి, యాదగిరియాదవ్లు కూడ పాల్గొని వీఐపీలను ఆహ్వానించడంలో బిజీగా కనిపించారు. మోదీ రాకతో మరింత మంది రాష్ట్ర స్థాయి నాయకులు మంత్రులు వీఐపీలు రాలేకపోయారని భావిస్తున్నారు. పట్టణంలో అన్ని కూడళ్ల వద్ద ప్రజలు ఎమ్మెల్యే తనయుడి వివాహం ఏర్పాట్లు కొత్తగా నిర్మించిన జిఎంఆర్ కన్వెన్షన్ చేయడంపై పలువురు వివాహ ఏర్పాట్ల గురించి చర్చించుకున్నారు.ఎమ్మెల్యే ఏర్పాటు చేసిన గొప్ప విందు భోజనాలపై కూడా చర్చ జరిగింది. -
ట్విట్టర్ ఆక్రోశం
పారిస్: ఫ్రాన్స్ రాజధాని పారిస్లో జరిగిన ఉగ్రదాడి ప్రపంచాన్ని వణికిస్తోంది. ఆ నగరంలో పలు చోట్ల సంభవించిన దాడుల్లో ఇప్పటికే 150 మంది ప్రాణాలు కోల్పోయారు. బాధితుల ఆర్తనాదాలు, క్షతగాత్రుల హాహాకారాలతో పారిస్ నగరం చివురుటాకులా వణికింది. ఈ దాడిని ప్రపంచదేశాల నాయకులు ముక్తం కంఠంతో ఖండించారు. కలిసికట్టుగా ఉగ్రవాదాన్ని రూపుమాపాలని ఆకాంక్షించారు. ఈ నేపథ్యంలో టాలీవుడ్, బాలీవుడ్ నటులు, గాయకులు, వివిధ రంగాల ప్రముఖులు ట్విట్టర్ లో స్పందించారు. ఉగ్రవాద చర్యను తీవ్రంగా ఖండించిన పలువురు సెలబ్రిటీలు మృతులకు తీవ్ర సంతాపాన్ని ప్రకటించారు. పారిస్లో తమ బంధువులు, సన్నిహితుల క్షేమం కోసం ఆరా తీశామన్నారు. శాంతి సందేశాలను, ఫొటోలను షేర్ చేశారు. బాలీవుడ్ నటీ నటులు, అనుపమ్ ఖేర్, హృతిక్ రోషన్, ప్రియాంకా చోప్రా, కేటీ పెర్రీ, నమ్రత్ కౌర్, అక్షయ్ కుమార్, అలియాభట్, తాప్సీ, క్రిస్ రాక్, నీల్ నితిన్ ముఖేష్ , ప్రాచీ దేశాయ్ తదితరులు ట్విట్టర్ లో తమ సందేశాలను పోస్ట్ చేశారు. ప్రే ఫర్ పారిస్ అంటూ ట్వీట్ చేశారు. Pray for Paris. pic.twitter.com/9scg3W27nD — Chris Rock (@chrisrock) November 14, 2015 Shocking,Appalling and disgusting!!!!! Yes this massacre is truly an attack on ALL humanity! Really praying for some peace in this world! — Alia Bhatt (@aliaa08) November 14, 2015 -
ఏమాయ చేస్తున్నావే.. సమంత
సిటీలో ఆకసమంత.. అందం: సమంత.. అందం, అభినయం ఆమె సొంతం. సకె్సస్ రేట్లో సమంత సూపర్హిట్. వెండితెరపై ఫుల్ మార్కులు కొట్టేసిన ఈ పుత్తడిబొమ్మ.. ఇప్పుడు ట్రెండ్ ఫాలో కావట్లేదు. ట్రెండ్ సెట్ చేస్తోంది. ఏదైనా ఈవెంట్కి హైదరాబాద్ వస్తే చాలు.. డిఫరెంట్ లుక్కుతో అదరగొడుతోంది. ఓసారి శారీ గౌన్లో నయగారాలు కురిపిస్తే.. ఇంకోసారి షరారాలో మెరిసిపోయింది, మరోసారి లెహంగా హంగులతో ఆకట్టుకుంది. ఇలా ఒక్కో ఈవెంట్కి ఒక్కో స్టైల్తో సెలబ్రిటీలు అందరిలోనూ సెంటరాఫ్ అట్రాక్షన్గా నిలుస్తున్న ఈ బబ్లీ గాళ్ ఇప్పుడు టాక్ ఆఫ్ ది ఫ్యాషన్. బాలీవుడ్ తారలు ఎంతమంది సిటీ ఈవెంట్లలో మెరిసినా, వాళ్లలో ఎవరికీ రానంత ఫ్యాషన్ ఇమేజ్ సమంత సొంతం చేసుకుంది. స్టైలిస్ట్ ఇంటర్వ్యూ: అత్తారింటికి దారేది, రామయ్యా వస్తావయ్యా, అల్లుడుశ్రీను... ఇలా సమంతతో రెగ్యులర్గా వర్క్ చేస్తున్న స్టైలిస్ట్ కోన నీరజ.. సాక్షి సిటీప్లస్ తరఫున జర్నలిస్ట్గా అవతారమెత్తి.. సమంతను ఇంటర్వ్యూ చేశారు. టాప్ స్టైలిస్ట్ ప్రశ్నలకు.. స్టైల్ క్వీన్ స్పందించిన తీరిది. హైదరాబాద్లోని మేజర్ ఈవెంట్స్లో.. నీ స్టైల్తో టాక్ ఆఫ్ ది సిటీ అవుతున్నావ్. ఏంటీ కథ? ఎటువంటి డ్రెస్ అయినా మన ఆత్మవిశ్వాసం పెంచేలా ఉండాలి. వేసుకున్న డ్రెస్ చూసి మనిషిని చదివేయొచ్చు. అందుకే కాన్ఫిడెంట్గా డ్రెసప్ అవ్వాలనే మెసేజ్ నా ద్వారా అమ్మాయిలకి వెళ్లాలనుకుంటున్నా. డ్రెస్సింగ్లో ప్రయోగాలు చేయడం ఇష్టమా? అవును. సినిమాల్లో.. సమంత ఈ క్యారెక్టర్ చేయలేదు.. అని అంటే, ఎలాగైనా అలాంటి క్యారెక్టర్ చేసి నిరూపించుకోవాలని అనిపిస్తుంది. అలాగే బయటికి వేసుకునే డ్రెస్లో కూడా నేను ప్రయోగాలు చేయడాన్ని ఇష్టపడతా. అంతే తప్ప వార్డ్రోబ్లో నుంచి ఏదో ఒకటిలే అనుకుని తీసేసి వేసుకుని వెళ్లిపోవాలని అనుకోను. ఒక ఈవెంట్లో పార్టిసిపేట్ చేయడానికి స్టైల్ పరంగా ప్లానింగ్ ఎలా? ఏముంది? అప్పటిదాకా ట్రై చేయని లుక్ గురించి నీతో.. సారీ (నవ్వులు) నా స్టైలిస్ట్ నీరజతో డిస్కస్ చేయడం, ఒక షేప్ అనుకోవడం.. దాని ప్రకారం ఫాలో అయిపోవడం.. అంతే! ఈ వెరైటీ లుక్స్ గురించి కామెంట్స్... చాలామంది బావుందంటున్నారు. కొంత మంది ‘ఎక్కువ కష్టపడుతోంది’ అంటూ వ్యంగ్యంగా కామెంట్ చేస్తున్నారు. పర్లేదు. ఏదైనా సరే గుడ్, బ్యాడ్ రెండూ ఉంటాయి. సిటీ ఈవెంట్లకు అంత శ్ర ద్ధగా తయారవ్వడం అవసరమా? ముంబైలో జరిగే ఈవెంట్స్లో బాలీవుడ్ తారలు సినిమాలకు దీటుగా మెరుస్తారు. ఇక్కడెందుకు మనవాళ్లు అలా కనపడరా.. అని చాలాసార్లు అనుకునేదాన్ని. లాస్ట్ ఇయర్ ఫిల్మ్ఫేర్ ఫంక్షన్ కోసం పూర్తి శ్రద్ధ పెట్టి స్పెషల్లుక్తో అటెండయ్యాను. దానికి నేషనల్ స్థాయిలో వెబ్సైట్ల నుంచి వచ్చిన పొగడ్తలు న న్ను ఇన్స్పైర్ చేశాయి. అప్పటి నుంచి ప్రతి ఈవెంట్కి డిఫరెంట్గా డ్రెసప్ అవుతున్నా. ఫ్యాషన్పై ఇంట్రెస్ట్ చిన్నప్పటి నుంచీ ఉందా? బాగా. కాలేజ్ డేస్లో ఎన్నో బ్రాండ్స్ కొనాలనుకున్నా. పొజిషన్ లేక ఊరుకున్నా.. అప్పట్లో హాలీవుడ్ హీరోయిన్ ఆడ్రీ హెప్బర్న్ లుక్స్ ఇష్టపడేదాన్ని. నీకంటూ నప్పనివి ఏమైనా ఉన్నాయనుకుంటున్నావా? ఊ... హెవీ జ్యూవెలరీ నప్పదు. అలాగే అతిగా ఎక్స్పోజ్ చేసే దుస్తులు సరిపడవు. నాది బేసిగ్గా సాఫ్ట్లుక్. అందుకే అలాంటి స్టైల్సే మ్యాచ్ అవుతాయి. ఇంకా... నీ డ్రెస్సింగ్ ద్వారా ఇంకేం చెప్పాలని? స్టైలిస్ట్వి.. జర్నలిస్ట్గా బాగానే సెట్టయిపోయావే (నవ్వులు). స్టైల్ అంటే ఒళ్లు చూపడం కాదు. మన లుక్ మనమేంటో చెబుతుంది. మన పర్సనాలిటీని రిఫ్లెక్ట్ చేస్తుంది. అది అమ్మాయిలు గుర్తుంచుకోవాలి. సెలబ్రిటీగా నీ స్టైల్స్ అమ్మాయిల మీద ఇంపాక్ట్ చూపిస్తాయంటావా? తప్పకుండా. సినిమాలలో పాత్ర పరంగా ఏవి, ఎలా ధరించినా అది వేరే. అయితే బయట మాత్రం మా డ్రెస్సింగ్ స్టైల్స్ యూత్ని ఇన్స్పైర్ చేస్తాయని నేననుకుంటున్నా. సిల్వర్ స్క్రీన్పై సోయగాలతో మతిపోగొట్టే సమంత.. ఇక్కడి ఈవెంట్లలో ఫాలో అవుతున్న డ్రెస్సింగ్ స్టైల్ ఇప్పుడు సిటీలో హాట్ టాపిక్. మొన్నటి ఫిల్మ్ఫేర్ నుంచి తాజా ఫిల్మ్ఫేర్ వరకు.. పాల్గొన్న ప్రైవేట్ ఫంక్షన్లన్నీ సమంత ఫ్యాషన్ పరేడ్కు వేదికల్లా మారాయి. సిటీ ఈవెంట్ అంటే కాస్త ఇంపుగా, సొంపుగా ఉన్న డ్రెస్సయితే చాల్లే అనుకునే తారలకు భిన్నంగా.. ఈ తారక తళుక్కుమంటోంది. లక్షలు విలువ చేసే బ్రాండెడ్, డిజైనర్ దుస్తులతో ప్రత్యక్షమవుతోంది. డిజైనర్ ఎగ్జిబిషన్లు, ఆడియో ఫంక్షన్లు, తదితర కార్యక్రమాల్లో సమంత లుక్ని పింక్విల్లా వంటి టాప్క్లాస్ ఫ్యాషన్ వెబ్సైట్లు పొగిడాయి. వెండి తెరపై కిర్రాకు పుట్టిస్తున్న సమంత ఏదైనా ఈవెంట్కు వెళ్తే మాత్రం పక్కాగా ప్లాన్ చేసుకుంటుంది. యాక్టింగ్లో నేటితరం మేటిగా నిలిచిన ఈ బ్యూటీ.. ఆహార్యంలోనూ తనకు తానే సాటి అని నిరూపించుకుంటుంది. మన డ్రెసప్ను బట్టి మనమేంటో తెలుస్తుందంటూ.. ఫ్యాషన్ వేరింగ్పై కాస్త స్పెషల్ కేర్ పెట్టాలని డిసైడైంది. ఎప్పుడైతే ఆమె మైండ్లో అలా ఫిక్సయిందో.. ప్రతి ఈవెంట్లోనూ ఆమెకే టాప్చైర్ దక్కుతోంది. -
పంచామృతం: అన్నీ ఉన్నా... కష్టపడి పైకొచ్చారు
ఎంత కష్టమైనా పడి సక్సెస్ను సాధించాలని తపన ఉండటం మానవ సహజనైజం. అయితే సేఫ్జోన్లో ఉన్నప్పుడు కష్టపడానికి మనసు ఒప్పుకోకపోవచ్చు, శరీరం సహకరించకపోవచ్చు. సక్సెస్ సాధిస్తే పేరొస్తుంది, తద్వారా డబ్బు వస్తుంది. మరి అలాంటి డబ్బు చేతిలో ఉండగా కూడా కష్టపడే తత్వం కొంతమందికే ఉంటుంది. దుర్భరమైన పరిస్థితుల్లో కష్టపడి డబ్బు సంపాదించి ఎదగడం ఒక విధమైన సక్సెస్ అయితే.. అన్నీ అమరినా కూడా వ్యక్తిగతంగా కష్టపడి ఎదగడం మరో విధమైన విజయగాధ అవుతుంది. అలాంటి వారిలో కొంతమంది సెలబ్రిటీలు వీళ్లు. కరణ్ జోహార్: ఈ బాలీవుడ్ దర్శకుడి నేపథ్యం గురించి చెప్పేటప్పుడు ‘బార్న్ విత్ ఏ సిల్వర్ స్పూన్’ అనే ఇంగ్లిష్ ఇడియంను కచ్చితంగా ఉపయోగింవచ్చు. ఈ డెరైక్టర్ సినిమాల్లో కథాంశాలు ఎంత రిచ్గా ఉంటాయో... కనిపించే పాత్రల్లో ఎంత కార్పొరేట్ లుక్ ఉంటుందో.. ఇతడి నేపథ్యం కూడా అదే స్థాయిలో ఉంటుంది. తండ్రి యశ్ జోహర్ బాలీవుడ్లో ఒక ప్రఖ్యాత నిర్మాత. ఆయన అడుగు జాడల్లోనే నడకమొదలు పెట్టి తన సృజనాత్మక శైలితో దర్శకుడిగా అటుపై నిర్మాతగా సక్సెస్ను సాధించాడు కరణ్ జోహార్. మణిరత్నం: ఈ సృజనాత్మక సినీ మేధావి కూడా ఆర్థికంగా ఒక ఉన్నత స్థాయి కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తే. మణిరత్నం తండ్రి రత్నం అయ్యర్ ఒక సినీ నిర్మాత. మద్రాస్లో థియేటర్లు కూడా ఉన్నాయి వీళ్ల కుటుంబానికి. అయితే అలాంటి సినీ నేపథ్యాన్ని తన కెరీర్కు బేస్ చేసుకోవాలని మణి అనుకోలేదు. మొదట జమ్నాలాల్ బజాజ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్లో ఎంబీఏపూర్తి చేశాడు. ఆ తర్వాత కుటుంబ నేపథ్యానికి దూరంగా వెళ్లి కన్నడలో సినిమాలు తీయడం ద్వారా వెలుగులోకి వచ్చాడు. ఏక్తాకపూర్: ఒకవేళ ఏక్తా కపూర్ గనుక బాలీవుడ్పై తన మార్కును చూపలేకపోయుంటే ఈ పాటికి అక్కడ జితేంద్ర ఉనికి కూడా ఒక గతంగానే మారిపోయేదేమో! అలనాటి ఆ లెజెండరీ హీరోకి ఏక్తాతో పుత్రికోత్సాహం లభిస్తోంది. సినీ నేపథ్యం నుంచినే వచ్చినప్పటికీ తనకంటూ ఒక ప్రత్యేకతను సంపాదించుకొంది ఏక్తా. బాలాజీ టెలిఫిలిమ్స్తో సీరియల్ ప్రొడ్యూసర్గా మారి వైవిధ్యమైన రీతిలో పేరు, డబ్బును సంపాదించింది. అటు నుంచి ‘డర్టీపిక్చర్’లాంటి సినిమాల ద్వారా నిర్మాతగా జాతీయ స్థాయిలో స్టార్ అయ్యింది. విశాల్: తెలుగు వాడే అయిన ఈ తమిళ హీరో విశాల్ తండ్రి కూడా సినీ నిర్మాత, వ్యాపారవేత్త. అయితే కుటుంబ నేపథ్యాన్ని పూర్తిగా పక్కనపెట్టి హీరో అర్జున్ వద్ద అసిస్టెంట్ దర్శకుడిగా చేరిపోయాడు. అదే సమయంలో విశాల్ నేపథ్యాన్ని చూసిగాక అతడి రూపాన్ని చూసి ’ప్రేమ చదరంగం’ సినిమాలో నటించే అవకాశం లభించింది. అప్పటికీ కొంత ఆత్మనూన్యతాభావంతోనే ఆ సినిమాలో నటించాడట. అయితే ఆ సినిమా తమిళంలో హిట్ కావడంతో విశాల్ దశ తిరిగింది. నిర్మాత అయిన తండ్రి పేరుతో అవసరం లేకుండా విశాల్ పేరే ఒక బ్రాండ్ అయ్యింది. అజయ్ జడేజా ఈ తరం దాదాపుగా మరిచిపోయిన క్రికెటర్ జడేజా. ఇండియన్ నేషనల్ క్రికె ట్ టీమ్కు కొన్ని మ్యాచ్లలో కెప్టెన్గా కూడా వ్యవహరించిన జడేజా కెరీర్ అనేక వివాదాల పాలై అంతమైంది. నవానగర్ రాజవంశానికి చెందిన జడేజా క్రికెట్ నైపుణ్యంతో జాతీయ జట్టులో స్థానం సంపాదించుకొని తన ఆట తీరుతో అందరినీ తన అభిమానులుగా మార్చుకొన్నాడు. వైస్కెప్టెన్, కెప్టెన్ స్థాయికి ఎదిగాడు. తన తరంలో ప్రపంచంలోని ప్రముఖ పేరున్న క్రికెటర్గా నిలిచాడు. -
టీవీక్షణం: అసలు సిసలు ఆటగాడు!
సెలెబ్రిటీలు పాల్గొనే ఏ కార్యక్రమం అయినా ఆసక్తికరంగానే ఉంటుంది. ఇక వాళ్లు సినిమాల్లో మాదిరి స్టంట్స్ చేస్తూ, సాహసాన్ని ప్రదర్శిస్తుంటే చూడటం మరీ మజాగా ఉంటుంది. ‘ఖత్రోంకే ఖిలాడీ’ సక్సెస్ కావడానికి కారణం అదే. ఈ ప్రోగ్రామ్ ఐదో సిరీస్ ఇటీవలే పూర్తయ్యింది. ప్రముఖ మోడల్, నటుడు రజనీష్ దుగ్గల్ విజేతగా నిలిచాడు. 2003లో మిస్టర్ ఇండియా టైటిల్ను గెలుచుకున్న రజనీష్... రేమండ్, కిట్క్యాట్, మాంటెకార్లో, వేగనార్, యమహా, వీడియోకాన్, క్లినిక్ ఆల్క్లియర్ లాంటి ఉత్పత్తులకు మోడల్గా చేసి, ‘1920’ చిత్రంతో నటుడిగానూ పరిచయమయ్యాడు. ఇప్పుడీ షోలో విజేత కావడంతో మరింత ఫేమస్ అయిపోయాడు. ఇందులో గెలిచినందుకుగాను ఒక కారు, పాతిక లక్షల రూపాయలను గెలుచుకున్నాడు రజనీష్. గురుమీత్ చౌదరి, సల్మాన్ లాంటి బలమైన పోటీదారులను వెనక్కి నెట్టి గెలుపొందాలంటే చాలా స్టామినా ఉండాలి. అది ఉంది కాబట్టే రజనీష్ విజయం సాధించాడు. అసలు సిసలు అటగాడిగా నిరూపించుకుటన్నాడు! -
ఐస్... వెంటనే ఐసైపోదు...
మందులో ఐసేసుకోవాలి. మనమైతే.. ఫ్రిజ్లోని ఐస్ ముక్కలు తీసుకుంటాం.. వేసుకుంటాం.. మనమైతే ఇలా చేస్తాం.. కానీ పాశ్చాత్య దేశాల్లో సెలబ్రిటీలు వంటివారు ఇలాంటి వాటిని ఇష్టపడటం లేదట.. ఐస్ ముక్కల్లోనూ లగ్జరీ చూస్తున్నారట.. ఇలాంటోళ్ల కోసమే అమెరికాలోని కాలిఫోర్నియాకు చెందిన గ్లేస్ లగ్జరీ ఐస్ కంపెనీ ఈ ఐసు క్యూబ్స్ను తయారుచేసింది. వీటి గొప్పతనమేమిటంటే.. ఇవి కచ్చితంగా చతురస్రాకారంలో ఉంటాయి. షేప్లో ఇసుమంతైనా తేడా రాదు. ఐస్ ముక్క వేసిన వెంటనే.. అది డ్రింక్ను త్వరితగతిన చల్లగా చేయడంతోపాటు దాదాపు 40 నిమిషాలపాటు కరగకుండా ఉంటుంది. అంతేకాదు.. పారదర్శకంగా ఎటువంటి రుచి లేకుండా ఉంటాయి. అంటే.. మీ మందు తాలూకు టేస్ట్ను దెబ్బతీయవన్నమాట. అన్నీ బాగున్నాయి.. రేటెంత అని అడుగుతున్నారా? 50 ఐస్ ముక్కల బ్యాగు ధర రూ.20 వేలు!