Cartoonist
-
‘బుజ్జాయి’ కన్నుమూత
సాక్షి ప్రతినిధి, చెన్నై: చిట్టిపొట్టి బొమ్మలు, బాలల కథల సంపుటితో బుజ్జాయిగా బహుళ ప్రాచుర్యం పొందిన దేవులపల్లి సుబ్బరాయశాస్త్రి గురువారం రాత్రి చెన్నైలో కన్నుమూశారు. ఆంధ్రప్రదేశ్ పిఠాపురంలో ప్రముఖ రచయిత, కవి దేవులపల్లి కృష్ణశాస్త్రి, రాజహంస దంపతులకు 1931 సెప్టెంబర్ 11న ఆయన జన్మించారు. బుజ్జాయి అనే కలంపేరుతో ఫ్రీలాన్స్ కార్టూనిస్టుగా, చిన్నపిల్లల కథారచయితగా ప్రసిద్ధి చెందారు. ఆయన బొమ్మల కథల్లో ‘డుంబు’ చిన్నారులను బాగా అలరించింది. అలాగే ‘పంచతంత్ర’ ధారావాహిక కథలు ‘ది ఇలస్ట్రేటెడ్ వీక్లీ’లో 1963–68 వరకు ప్రచురితమయ్యాయి. గురజాడ అప్పారావు రచించిన కన్యాశుల్కం కథానికను బొమ్మలద్వారా పాఠకులకు పరిచయం చేశారు. భారత ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆయన పలు రచనలకు అవార్డులు అందించాయి. -
భయపడితే... చూపుడువేలైనా బెదిరిస్తుంది!
1975 జూన్ రోజులు. ఆనాటి రాజకీయ పరిణామాల నేపథ్యంలో ప్రధాని ఇందిరాగాంధీ దేశంలో అత్యవసర పరిస్థితి విధించారు. ఎమ ర్జెన్సీలో భాగంగా పత్రికా వార్తలపై సెన్సార్షిప్ మొదలైంది. వాటితో పాటే నా కార్టూన్లూ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెన్సార్ పర్యవేక్షణ క్రింద ఉంచబడ్డాయి. నేను నా తెలివి తేటలు ఉపయోగించి అరటి తొక్క మీద కాలు వేసి జారిపోయే ముతక హాస్యము, చీరల కొట్టులో మహిళామణుల బేరసారాల వెకిలి హాస్యాల కార్టూన్లు కొన్ని పట్టుకుని సరాసరి ప్రధా నిని కలిశా. ఈ సెన్సార్షిప్ నుంచి నాకు మినహా యింపు ఇవ్వమని కోరుకున్నాను. ఆవిడ చాలా ఓపిగ్గా ఈ అప్పడాల కర్ర కార్టూన్లు అన్ని పరిశీ లించి నా కార్టూన్లు బొత్తిగా నిరపాయకరమనీ, నేను కార్టూన్లను పత్రికలో నిరభ్యంతరంగా ప్రచు రించుకోవచ్చనీ అభయం ఇచ్చారు. ఢిల్లీ నుండి బొంబాయికి తిరిగి రాగానే నేను ప్రధానమంత్రి ముందు ఒలకబోసిన దొంగ వేషం కట్టిపెట్టి ఒకటీ రెండు రోజులు అప్పడాల కార్టూన్లు వంటివి వేసినా, 3వ రోజునుండి నా అసలు రంగు చూపిం చడం మొదలు పెట్టాను. మొదట కాంగ్రెస్ పార్టీ మీద దాడి చేసే కార్టూనులు, ఆ పై ఎమర్జెన్సీని తూర్పారపట్టే కార్టూనులు... ఒకదాని తరువాత మరొకటిగా నిప్పు రగిలిస్తున్నా. చండీగఢ్లో ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ సెషన్ ప్రారంభమైన రోజున టైమ్స్ మొదటి పేజీలో కాంగ్రెస్ అధ్యక్షుడు దేబ్ కాంత్ బరూవా – ఎమర్జెన్సీలను కలిపి కార్టూన్ అచ్చయింది. బరువాకు కార్టూన్ సెగ బాగా తగిలింది. వీసీ శుక్లా అప్పుడు సమాచార, ప్రసార శాఖ మంత్రిగా ఉన్నారు. బరువా, శుక్లాని తన దగ్గరికి పిలిపించుకుని నా కార్టూన్ చూపించి నానా చీవాట్లు పెట్టారు. శుక్లా సరాసరి ఢిల్లీ నుండి బొంబాయి వచ్చారు నా సంగతి కనుక్కోడానికి! కట్ చేస్తే శుక్లా బసచేసిన తాజ్ హోటల్ సూట్లో నేను ఉన్నాను. హలో, హాయ్, నమస్తే వంటి పరామర్శ ఏమీ లేదు. కనీసం నన్ను కూచో మని అన్నది కూడా లేదు. ఒకే మాట ‘ఇంకోసారి ఇటువంటి పిచ్చి గీతలు గీస్తే నిన్ను అత్తారింటికి పంపిస్తా ఏమనుకుంటున్నావో... గెటవుట్’ చూపుడు వేలు ఆడిస్తూ శుక్లా పరమక్రూరంగా! నా కాళ్ళు గజగజ వణికిపోయాయి. నాకు భయం వేసింది, దుఃఖం అనిపించింది, అవమానంగా ఉంది, కడుపు రగిలిపోతోంది. ఇంటికి తిరిగి రాగానే నా భార్య కమలని పిలిచి విషయం చెప్పాను: ‘ఈ పొలిటికల్ కార్టూనింగ్ పనంటూ చేస్తే వెన్నెముక విరుచుకుని పనిచేయాలి, లేదా అసలు ఈ పనే చేయకూడదు, ఇప్పుడు అదే దశ వచ్చింది. నేను ఇక ఈ ఉద్యోగం చేయను, రాజీనామా ఇచ్చేస్తాను’. మా ఆవిడ తెగ సంతోష పడింది. ‘ఎందుకులెద్దూ వెధవ లంపటమూ, ముప్ఫయ్ ఏళ్ళు చేశారు. ఇన్నాళ్ళకు మంచి నిర్ణయం ఒకటి తీసుకున్నారు. హమ్మయ్య!’ సాయంకాలం ఆఫీస్కు వెళ్ళి దీర్ఘకాలిక సెల వుకు దరఖాస్తు చేశాను. అక్కడి నుండి సరాసరి ఒక ట్రావెల్ ఏజన్సీకి వెళ్ళి మా దంపతులిరువురి పేరిట మారిషస్కు టిక్కెట్లు కొన్నాము. మూడు వారాల పాటు అక్కడ ఉండాలనేది మా ఆలోచన. ఆ దీవిలో ఆ సముద్ర తీరాన బేఫికర్గా జీవితాన్ని అస్వాదిం చాము. అక్కడి విదేశీయులు నా భార్య కమల చీర కట్టు గురించీ, నుదుటన దాల్చిన సిందూరం గురించీ ప్రశ్నలు అడగడమే తరువాయి ‘మా దేశం, మా ప్రాచీన సంస్కృతి, మా సంప్రదాయం’ అంటూ రొమ్ము విరుచుకుని వాళ్ళకు జవాబు ఇవ్వ డంలో గొప్ప ఆనందాన్ని పొందేవాణ్ణి. ఒకరోజు మా సాయంకాలపు వాహ్యాళి ముగించుకుని ఇసుక తీరంలోని ఒక కాటేజ్లో విశ్రాంతిగా కూర్చు న్నాము. మాకు సమీపంలో ఒక నల్లజాతీయుడు కూచుని ఉన్నాడు. మాకు మాటా మాటా కలిసింది. అతనికి లెబనాన్లో ఏదో ఎగుమతి చేసే వ్యాపారం ఉంది. ఆయన నన్ను అడిగాడు: ‘ఇంతకూ మీరేం పని చేస్తారో చెప్పనే లేదు?’ ‘నేనా? వార్తా పత్రికలో పని చేస్తా, పాత్రికే యుణ్ణి.’ ‘ఓ పత్రికా పనా! గుడ్. అది చాలా గొప్ప వృత్తి, సంపాదకీయాలు అవీ రాస్తారా మీరు?’ ‘రాస్తాను.’ ‘మరి మీరిక్కడ సెలవులో ఉంటే అక్కడ మీ పత్రికలో సంపాదకీయాలు ఎలా రాస్తారు? అది చాలా ముఖ్యమైన పని కదా?’ ‘మహాశయా! నేను వ్రాయను, నేను కార్టూన్లు గీస్తాను.’ ‘కార్టూన్లా! అంటే వ్యంగ్య చిత్రాలు! అబ్బో, అది చాలా అద్భుతమైన కళ, ఇంతకు మీరు ఏ పత్రికలో పని చేస్తారో?’ ‘టైమ్స్ ఆఫ్ ఇండియా.’ ‘నాకు తెలుసుగా ఆ పత్రిక! మీ పేరు?’ ‘లక్ష్మణ్’ ‘వావ్! యూ సెడ్ ఇటా?’ నేను అదిరి పోయాను. భారత దేశానికి అయిదు వేల మైళ్ల దూరంలోని ఒక ప్రదేశంలో, అటు ఆ దేశానికీ, ఇటు ఈ దేశానికీ చెందని ఒక వ్యక్తి నోటి నుండి నేను రోజూ వేసే కార్టూన్ శీర్షిక, అతని యాసలో! ‘మీకు ఎలా తెలుసు?’ ‘లెబనాన్లో మీ దేశపు రాయబారి ఎల్కే సింగ్ ఉంటారు. అతనికి, నాకు పరిచయం. నేను అతని వద్దకు వెళ్లినప్పుడల్లా మీ కార్టూన్లు చూపిస్తారు. చూపిస్తూ ఇలా అంటారు: ‘‘చూశావా! మా ప్రజా స్వామ్యం గొప్పతనం! మా దేశంలో అత్యవసర పరిస్థితి ఉన్నప్పటికీ, పత్రికా స్వేచ్ఛకు మాత్రం అడ్డం లేదు. అక్కడ మా కార్టూనిస్ట్ ఆర్కే లక్ష్మణ్ ఎమర్జెన్సీలో కూడా అక్కడి రాజకీయ నాయకుల డొక్క చింపుతున్నాడు. ఆ నాయకులు కూడా ప్రజా స్వామ్యాన్ని గౌరవిస్తూ ఆ కార్టూన్లని ప్రచురించ డానికి తల ఒగ్గి ఉన్నారు. అదీ మా దేశ మంటే! సారే జహా సే అచ్ఛా’. దేవుడా! బహుశా ఆ కార్టూన్లు నేను దేశం వదిలి వచ్చేముందు గీసినవి అయి ఉంటాయి. వాటి ఆధారంగా పరాయి దేశంలో మా పత్రికా స్వేచ్ఛని, మా కార్టూనిస్టుల పదును నైజాన్ని, నా దేశపు ప్రజాస్వామ్యపు స్వేచ్ఛని నిరూపించడానికి దేశం కాని దేశంలో వాటిని భద్రంగా ఉపయోగి స్తున్నారు. ఇక్కడ ఒక విదేశీయుడు వాటి ఆధా రంగా మమ్మల్ని, మా ధైర్యాన్ని గానం చేస్తున్నాడు. నేనేం చేస్తున్నాను? ఒక చూపుడు వేలు బెదిరింపు నకు వణికిపోయి ఇక్కడికి వచ్చి కూచున్నాను. లేచి నిలబడి బట్టలకంటిన ఇసుక దులుపుకొన్నాను. కమల అడిగింది: ‘ఎక్కడికి, హోటల్ రూం కా?’ ‘కాదు, సెలవు ముగిసింది, వెళ్ళి ఇక కార్టూన్లు వేయాలి.’ – ఆర్కే లక్ష్మణ్ అంతరంగ కథనం: అన్వర్ (ఇండియన్ పొలిటికల్ కార్టూన్ అంటే ప్రపంచమంతా తలతిప్పి ఆర్ కే లక్ష్మణ్ అనే సంతకం వైపు చూస్తుంది. అక్టోబర్ 24న రాశిపురం కృష్ణస్వామి లక్ష్మణ్ శతజయంతి) -
ప్రముఖ కార్టూనిస్ట్ కన్నుమూత, సీఎం సంతాపం
తిరువనంతపురం : ప్రముఖ కార్టూనిస్ట్, కేరళ కార్టూన్ అకాడమీ చైర్మన్ సీజే ఏసుదాసన్ (83) బుధవారం కన్నుమూశారు. ఇటీవల కరోనా బారిన పడి కోలుకుని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. కానీ పోస్ట్ కరోనా సంబంధిత సమస్యల కారణంగా ఆరోగ్యం మరింత క్షీణించడంతో తుది శ్వాస విడిచారని కుటుంబ సభ్యులు ప్రకటించారు. ఆయన అంత్యక్రియలు రేపు జరగ నున్నాయని, ప్రజల సందర్శనార్థం ఆయన మృతదేహాన్ని గురువారం ఉదయం కలమస్సేరి, మున్సిపల్ టౌన్ హాల్లో ఉంచుతామని తెలిపారు. ఏసుదాసన్ అకాలమరణంపై కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ సంతాపం తెలిపారు. కార్టూన్ల రంగం ప్రతిభావంతుడైన ఆర్టిస్టును కోల్పోయిందంటూ నివాళులర్పించారు. ఏసుదాసన్ తన కార్టూన్ల ద్వారా, ఒక కాలంలోని రాజకీయ పరిణామాలను ప్రతిబింబించడమే కాకుండా, ధైర్యంగా తన అభిప్రాయాలను వ్యక్తం పరిచేవారని, ఆయన పనిని పరిశీలించే ఎవరైనా కేరళ రాజకీయ చరిత్రను చూడొచ్చని సీఎం అన్నారు. అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు, వీడీ సతీసన్ కూడా తన సంతాపాన్ని వ్యక్తం చేశారు. భారతదేశ రాజకీయ చరిత్రలో ఆయన చెరగని ముద్ర వేశారన్నారు. ఇంకా సీనియర్ కార్టూనిస్టులు, పలువురు జర్నలిస్టులు కూడా ఏసుదాసన్ మృతికి సంతాపం తెలిపారు. కేరళ కార్టూన్ అకాడమీకి ఏసుదాసన్ తొలి చైర్మన్ మృతికి కొచ్చిలోని సీనియర్ జర్నలిస్ట్ యూనియన్ సంతాపం ప్రకటించింది. ఏసుదాసన్ ఎంతో సౌమ్యమైన వ్యక్తి అని, ప్రతి ఒక్కరిని గౌరవించేవారని ఢిల్లీలోని ప్రముఖ కార్టూనిస్ట్ సుధీర్నాథ్ పేర్కొన్నారు. కాగా రాజకీయ కార్టూన్లకు ప్రసిద్ధి చెందిన ఏసుదాసన్ అనేకసార్లు కేరళ ప్రభుత్వ ఉత్తమ కార్టూనిస్ట్ అవార్డును అందుకున్నారు. స్వదేశాభిమాని అవార్డు, బీఎం గఫూర్ అవార్డు, వి సాంబశివన్ మెమోరియల్ అవార్డు, పీకే మంత్రి స్మారక పురస్కారం, ఎన్ వి పైలీ అవార్డులను స్వీకరించారు. 1938లో అలప్పు జిల్లాలోని భారైకావులో జన్మించిన ఏసుదాసన్ మలయాళ మనోరమకు కార్టూనిస్ట్గా సుదీర్ఘకాలం పాటు కొనసాగారు. ఏసుదాసన్కు భార్య, ముగ్గురు కుమారులు ఉన్నారు -
సీరియస్ మీటింగ్స్ కాస్తా ఎంటర్టైన్ చేస్తున్నాయే
వార్ రూమ్ తరహాలో సీరియస్గా సాగే జూమ్ మీటింగ్స్ ఇకపై ఈ స్నాప్ కెమెరా ఆప్షన్ తో మరింత ఎంటర్ టైన్మెంట్గా మారనున్నాయి. కోవిడ్ కారణంగా ఆన్లైన్ క్లాసుల నుంచి ఆఫీస్ మీటింగ్స్ వరకు అన్నీ ఆన్లైన్లో జరుగుతున్నాయి.అయితే ఆయా టెక్ దిగ్గజాలు సరికొత్త ఫీచర్లతో ఆన్లైన్ మీటింగ్స్ ను మరింత అందంగా తీర్చిదిద్దేందుకు ప్రయత్నిస్తున్నాయి. తాజాగా వీడియో కమ్యూనికేషన్ 'జూమ్'లో స్నాప్ చాట్ కు చెందిన స్నాప్ కెమెరా ఫిల్టర్ ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. ఈ ఫీచర్ను వినియోగించి ఆన్ లైన్లో కుటుంబ సభ్యులతో,స్నేహితులతో కలిసి ఫన్ జనరేట్ చేసుకోవచ్చు. జూమ్ మీటింగ్లో ఫిల్టర్ ఫీచర్ను వినియోగించి మన ఫేస్ కంప్లీట్గా జనరిక్ ఫిక్సార్, డ్రీమ్ వర్క్స్ కార్టూన్ క్యారక్టర్ లోకి ట్రాన్స్ ఫామ్ అయ్యేలా ఎనేబుల్ చేసుకోవచ్చు. ఈ ఆప్షన్ స్నాప్ కెమెరా v1.14.0 , విండోస్ 10, మాక్ 10.13 ఓఎస్, ఇంటెల్ కోర్ ఐ 3 2.5 జీహెచ్జెడ్, ఎఎమ్డి ఎఫ్ఎక్స్ 4300 2.6 జీహెచ్జెడ్, ఇంటెల్ హెచ్డి గ్రాఫిక్స్ 4000 లేదంటే ఎన్విడియా జిఫోర్స్ 710, ఎఎమ్డి రేడియన్ హెచ్డి 6450 ఈ ఆపరేటింగ్ సిస్టమ్స్లో మాత్రమే పనిచేస్తుంది. ఈ కార్టూన్ ఫిల్టర్ కావాలనుకుంటే అఫీషియల్ వెబ్ సైట్ స్నాప్ ఐఎన్సీ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆప్షన్ ఎలా ఎనేబుల్ చేసుకోవాలి జూమ్ ఓపెన్ చేసిన తరువాత రైట్ సైడ్ కార్నర్లో వీడియో గేర్ ఐకాన్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే డ్రాప్ డౌన్ మెనూ బార్ లో వీడియో క్లిక్ చేస్తే కెమెరా ఆన్ అవుతుంది కెమెరా ఆన్ చేస్తే స్నాప్ కెమెరా ఆప్షన్ కనిపిస్తుంది. ఆ స్నాప్ కెమెరా ఆప్షన్లోకి వెళ్లితే మీకు కావాల్సినట్లు మీ ఫేస్ కార్టూన్ కేరక్టర్లోకి ట్రాన్స్ ఫార్మ్ అవుతుంది. -
కార్టూనిస్టు మంజుల్కు ట్విట్టర్ నోటీసు
న్యూఢిల్లీ: భారత ఐటీ చట్టాలను ఉల్లంఘించారన్న ఆరోపణలతో ప్రముఖ కార్టూనిస్టు మంజుల్, అల్ట్ న్యూస్ వెబ్సైట్ సహ వ్యవస్థాపకుడు మహమ్మద్ జుబైర్, రిటైర్ట్ ఐఏఎస్ అధికారి సూర్యప్రతాప్ సింగ్కు ట్విట్టర్ యాజమాన్యం నోటీసు జారీ చేసింది. కొన్ని దర్యాప్తు సంస్థల ఆదేశాల మేరకు ఈ నోటీసు ఇచ్చినట్లు తెలిసింది. వారు చేసిన కొన్ని ట్వీట్లను ఖాతాల నుంచి తొలగించాలని దర్యాప్తు సంస్థలు సూచించినట్లు సమాచారం. తమకు అందిన నోటీసు స్క్రీన్షాట్లను మంజుల్, జుబైర్, సూర్యప్రతాప్ సింగ్ సోషల్మీడియాలో షేర్ చేశారు. ఈ ముగ్గురికి నోటీసు ఇవ్వాలంటూ కేంద్ర ఎలక్ట్రానిక్, ఐటీ శాఖ సూచించలేదని అధికార వర్గాలు తెలిపాయి. ఏయే ట్వీట్లపై ప్రభుత్వం అభ్యంతరాలు వ్యక్తం చేసింది... సదరు ట్వీట్లను తొలగించమని కోరిన చట్ట సంస్థలు ఏవి అనే విషయాలు తెలియరాలేదు. సదరు ట్వీట్లపై ప్రస్తుతానికి చర్యలు తీసుకోవడం లేదని తెలిపింది. ట్విట్టర్కు ఇండియాలో 1.75 కోట్ల మంది వినియోగదారులు ఉన్నారు. చదవండి: కరీనా ఖాన్.. శూర్పణక రోలే కరెక్ట్ నీకు! -
Sameera Maruvada: నవ్వు బొమ్మల అమ్మాయి
‘మీ సాల్ట్కూ సాంబార్కూ ద్రోహం చేయలేను బాబుగారూ’ అని ‘అహ నా పెళ్లంట’ సినిమాలో డైలాగ్. సమీర మరువాడ తన ఇన్స్టా పేజీకి అదే పేరు పెట్టుకుంది ‘సాల్ట్ అండ్ సాంబార్’ అని. ఫుల్గా ఫాలోయెర్స్ ఉన్నారు. ఉప్పు లేని కూర, హాస్యం లేని జీవితం చప్పగా ఉంటాయి. తన బొమ్మ నవ్వించి జీవితంలో రుచి తెస్తుందని సమీర మరువాడ నమ్ముతుంది. ఈ వైజాగ్ అమ్మాయి హైదరాబాద్ చేరి ఫ్రీలాన్సర్గా మనుగడ కోసం కృషి చేస్తోంది. తెలుగులో ఫ్రీలాన్స్ ఆర్టిస్ట్ అందునా మహిళా ఆర్టిస్ట్ స్ట్రగుల్ నవ్వినంత ఈజీ కాదు.. నవ్వులాటా కాదు. కాని సమీర విజయం వైపు అడుగులు వేస్తోంది. ఆమె పరిచయం. తెలుగులో మిడిల్ క్లాస్ జీవనాన్ని హాస్యానికి ఉపయోగించిన వారంతా సక్సెస్ అయ్యారు. కార్టూన్లలో బాపూ, ఈ కాలంలో సరసి ఇంకా చాలామంది మధ్యతరగతి జీవనాన్ని హాస్యగీతలలో కామెంట్ చేసి గుర్తింపు పొందారు. అయితే ఈ రంగంలో స్త్రీల ప్రాతినిధ్యం తక్కువ. తెలుగులో మహిళా కార్టూనిస్టులు చాలా తక్కువ. ఒక కాలంలో ‘రాగతి పండరి’ మహిళా కార్టూనిస్టుగా గుర్తింపు పొందారు. కాని ఆ తర్వాత ఆ రంగంలో కృషి చేసినవారు వేళ్ల మీద లెక్కపెట్టగలిగినంత మందే ఉన్నారు. ఇప్పుడు ఒక తెలుగు అమ్మాయి ఈ రంగంలో తన పేరు వినిపించేలా చేస్తోంది. ఆ పేరు సమీర మరువాడ. గీతలే జీవితం వైజాగ్కు చెందిన సమీరకు చిన్నప్పటి నుంచి బొమ్మలంటే ఇష్టం. ఎక్కడ బొమ్మల పోటీ పెట్టినా వెళ్లి ప్రైజ్ కొట్టుకొచ్చేది. చదువులో భాగంగా ఇంజనీరింగ్ చేసినా ఆ తర్వాత ఇంటిరియర్ డిజైనింగ్ చేసినా ఆ తర్వాత ఎం.ఏ ఇంగ్లిష్ చేసినా ఒకరి కింద పని చేసే ఉద్యోగం మీద మనసు పోలేదు. ‘నా చేతిలో గీతలున్నాయి. నేను వాటి మీద బతకాలనుకున్నాను’ అంటుందామె. వెంటనే ‘శామ్ ఇన్స్పయిర్’ పేరుతో యూ ట్యూబ్ చానల్ మొదలెట్టి దాదాపు 100కు పైగా బొమ్మలు నేర్పించే వీడియోలు చేసింది. ఈ చానల్కు 30 వేల మంది ఫాలోయెర్స్ ఉన్నారు. ఆ సమయంలోనే తన జీవితంలో, చుట్టుపక్కలవారి జీవితంలో రోజు వారీ వ్యవహారాల మీద ఆమెకు కామిక్స్ వేయాలనిపించింది. ‘అప్పటివరకూ నేను ఆ పని చేయగలనని తెలియదు. కాని మొదలెట్టేశాను’ అంటుంది సమీర. అనుకున్నదే తడవు ఇన్స్టాగ్రామ్లో ‘సాల్ట్ అండ్ సాంబార్’ అనే పేజీ మొదలెట్టింది. అందులో తన కార్టూన్లు కూడా. మధ్యతరగతి మందహాసం సమీర చేసిన మొదటిపని తన కార్టూన్లకు మధ్యతరగతిని నేపథ్యంగా తీసుకోవడం. మధ్యతరగతి, పై తరగతి పాఠకులను దృష్టిలో పెట్టుకుని ఇంగ్లిష్ అక్షరాలలో తెలుగు వ్యాఖ్యను రాయడం. తను అమ్మాయి కనుక అమ్మాయిలపై ఎటువంటి సగటు అభిప్రాయాలు ఉంటాయో వాటిమీద వ్యాఖ్యలు చేస్తూ సమీర కార్టూన్లు వేస్తుంది. అలాగే అబ్బాయిలందరూ చచ్చినట్టు ఐఐటి చేయాల్సిందేనన్నట్టు ఉండే వొత్తిడిని కూడా వెక్కిరిస్తుంది. ‘అమ్మాయికి పెళ్లి చేసి పంపడం’ తన విధ్యుక్త ధర్మంగా హైరానా పడే తల్లిదండ్రులపై సమీర పుంఖాను పుంఖాలు గా కార్టూన్లు వేసింది. బొమ్మలే బువ్వ పెట్టాలి బొమ్మల మీద ఆధారపడి జీవించడం అందరికీ సాధ్యం కాదు. అయినప్పటికీ సమీర ఫుల్టైమ్ ఫ్రీలాన్సర్ అయ్యింది. ‘నేను నా బొమ్మలను అమ్ముకోగలను అని కాన్ఫిడెంట్గా ఉన్నాను’ అంటుందామె. ఇన్స్టాలో తనకొచ్చిన పేరు వల్ల సమీర కస్టమైజ్డ్ బొమ్మలు వేసి ఇస్తుంది. బర్త్డే కార్డులు, పండగ కార్టూన్లు, మదర్స్ డే లాంటి సందర్భాలలో విషెస్ చెప్పడానికి మనం చెప్పినట్టుగా లేదా కోరిన వ్యక్తిని దృష్టిలో పెట్టుకుని కార్టూన్లు, కార్డులు తయారు చేయమంటే చేసి ఇస్తుంది. గత సంవత్సరం ‘రాఖీ’ పండగ కోసం సమీర దగ్గర చాలామంది కస్టమైజ్డ్ కార్డ్లు చేయించుకున్నారు. అలాగే 2021 సంవత్సరానికి గాను కార్టూన్ క్యాలెండర్ కూడా ఆర్డర్ వచ్చింది. ఈ క్యాలండర్ కోసం ‘పక్కింటి ఆంటీ’ని సబ్జెక్ట్ గా తీసుకుందామె. ఈ పక్కింటి ఆంటీకి వేరే పని ఉండదు. పొరుగింటి అమ్మాయి కి పెళ్లిచూపులు వెతకడమే పని. ఈ క్యాలెండర్ హిట్ అయ్యింది. ‘ఆర్టిస్టులు తమ సొంత కాళ్లపై బతకాలంటే సాయం చేసే క్రౌండ్ ఫండింగ్ వేదికలు ఉన్నాయి. ‘పాట్రియాన్స్’ క్రౌండ్ ఫండింగ్ ద్వారా నేను సపోర్ట్ పొందుతున్నాను’ అంటుంది సమీర. ఏటి కొప్పాకలో సమీర వైజాగ్కు దగ్గరగా ఉండే ఏటికొప్పాక కొయ్యబొమ్మల తయారీదార్లతో కలిసి ‘తల్లీకూతురు’ అనే కీచైన్ బొమ్మను గీసి ఇచ్చింది. ఆ బొమ్మ ఆధారంగా ఏటికొప్పాకలో తయారవుతున్న తల్లీకూతురు కీచైన్ అందరినీ ఆకట్టుకుంటోంది. సారా ఆండర్సన్, మార్లొస్డెవీ వంటి చిత్రకారుల బొమ్మలతో ఇన్స్పయిర్ అయ్యే సమీరా త్వరలో తను కూడా అంత పెద్ద రేఖా చిత్రకారిణి అవుతుందని గుర్తింపు పొందుతుందని ఆశిద్దాం. – సాక్షి ఫ్యామిలీ -
కోవిడ్తో చిత్రకారుడు గోపి కన్నుమూత
సాక్షి,హైదరాబాద్: నాలుగు దశాబ్దాలకు పైగా కాన్వాస్పై తన బొమ్మలతో తెలుగు సాహిత్య, చిత్ర సీమను హోయలు పలికించి తనదైన ముద్ర వేసుకున్న ప్రముఖ చిత్రకారుడు గోపి (లూసగాని గోపాల్గౌడ్ 69) శుక్రవారం కోవిడ్తో కన్నుమూశారు. కొంతకాలంగా మూత్రపిండాల సంబంధిత సమస్యలతో పాటు మధుమేహంతో బాధపడుతున్న ఆయన ఇటీవల కోవిడ్ బారిన పడి గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. సాయంత్రం జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో గోపి అంత్యక్రియలు జరిగాయి. ఆయనకు భార్య,ఇద్దరు కొడుకులు, ఒక కూతురు ఉన్నారు. అతి సామాన్య కుటుంబం నుంచి వచ్చి... ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా నాగర్కర్నూల్ చెందిన గోపి 1952లో జన్మించారు. అతి సామాన్య కుటుంబం నుంచి వచ్చిన ఆయన అంచలంచెలుగా ఎదిగి నాటి ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ అభినందనలను అందుకున్నారు. 1975లో జేఎన్టీయూ నుంచి ఫైన్ ఆర్ట్స్లో డిగ్రీ పూర్తి చేసి అన్ని తెలుగు వార,మాస పత్రికల్లో అనేక కథలు, నవలలకు ఆయన అద్భుతమైన బొమ్మలు గీశారు. అప్పటి ఉమ్మడి ఏపీ ప్రభుత్వంలో సమాచార, ప్రజాసంబంధాల విభాగంలో ఫ్రీలాన్స్ ఆర్టిస్టుగా 10 ఏళ్ల పాటు పనిచేశారు. పలు తెలుగు దినపత్రికలకు గోపి లోగోలను రూపొందించారు. సినీ ఆర్టిస్టుగా ఎన్నో చిత్రాలకు తన కళాత్మకతను అద్దారు. మా భూమి, రంగుల కల, దొంగల దోపిడి వంటి చిత్రాలకు పోస్టర్లు, టైటిల్స్ రూపకల్పన చేశారు. ప్రఖ్యాత చిత్రకారుడు బాపు తన తరువాత గోపితో బొమ్మలు వేయించుకోవాలని స్వయంగా చెప్పడం విశేషం. ఆయన మృతి పట్ల పలువురు చిత్రకారులు తమ ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. చదవండి: కరోనా సోకిన వారిలో ఆకస్మిక మరణాలకు కారణాలెన్నో.. -
ప్రఖ్యాత చిత్రకారుడు చంద్ర కన్నుమూత
సాక్షి, హైదరాబాద్/హన్మకొండ కల్చరల్: ప్రఖ్యాత చిత్రకారుడు, కథా రచయిత, కార్టూనిస్టు, ఇలస్ట్రేషనిస్టు చంద్ర (75) ఇక లేరు. ఆయన అసలు పేరు మైదం చంద్రశేఖర్. కరోనా బారినపడిన ఆయన చికిత్స పొందుతూ సికింద్రాబాద్ కార్ఖానాలోని ఆర్.కె. మదర్ థెరెసా రిహాబిలిటేషన్ సెంటర్లో బుధవారం అర్ధరాత్రి 1:40 గంటలకు కార్డియాక్ అరెస్టుతో కన్నుమూశారు. మూడేళ్ల క్రితం బాత్రూంలో కాలు జారిపడటంతో బ్రెయిన్ స్ట్రోక్కు గురైన ఆయన అప్పటి నుంచి మంచానికే పరిమితమయ్యారు. కొద్దిరోజుల క్రితం కరోనా సోకడం, కార్డియాక్ అరెస్టుకు గురికావడంతో ఆయన మృతిచెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయనకు భార్య విజయభార్గవి, కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఆయన అంత్యక్రియలు గురువారం మధ్యాహ్నం జరిగాయి. చిన్ననాటి నుంచే చిత్రకళపై అభిరుచి... పూర్వ వరంగల్ జిల్లా కేసముద్రం మండలం ధన్నసరి గ్రామానికి చెందిన మైదం రంగయ్య, సోమలక్ష్మి దంపతులకు 1946 ఆగస్టు 28న చంద్ర జన్మించారు. తల్లి ఎడ్లబండిలో వెళ్తున్న క్రమంలో నిండు పున్నమి రోజున జన్మించడంతో ఆయనకు చంద్రశేఖర్గా పేరు పెట్టారు. స్కూల్లో చదివే రోజుల్లో ప్రతి ఆదివారం ఖిలా వరంగల్ వెళ్లి అక్కడి శిల్పాలను చూస్తూ వాటి బొమ్మలు వేయడానికి ప్రయత్నించేవారు. వరంగల్లోని అజంజాహి మిల్లులో తొలుత పనిచేసిన ఆయన తండ్రి ఆ తర్వాత హైదరాబాద్లోని ఆప్కోలో చేరడంతో కుటుంబం హైదరాబాద్కు మారింది. హైదరాబాద్లో ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు పల్లా దుర్గయ్య ఇంట్లో వారు ఉండే సమయంలో వట్టికోట ఆళ్వార్స్వామి, దాశరథి కృష్ణమాచార్య తదితర సాహితీవేత్తలతో చంద్రకు పరిచయం ఏర్పడింది. అలాగే సుల్తాన్ బజార్లోని లైబ్రరీ చంద్ర వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దింది. డాక్టర్ వద్దనుకొని చిత్రకారుడిగా.. బాపు బొమ్మలను చూస్తూ చిత్రాలను వేయడం మొదలుపెట్టిన చంద్ర.. పీయూసీ చదివే రోజుల్లోనే సిటీ ఇన్ ద లైట్ చిత్రం వేసి ఉపాధ్యాయులను ఆశ్చర్యపర్చారు. పీయూసీ పరీక్షల్లో పాసైతే తండ్రి తనను మెడిసిన్ చదివించే అవకాశం ఉండటంతో అన్ని ప్రశ్నలకు సమాధానాలు తెలిసినా రాయకుండా వచ్చేశారు. చిత్రకారుడిగా కావాలనే కృతనిశ్చయంతో హైదరాబాద్ ఫైన్ ఆర్ట్స్ కళాశాలలో బీఏ పూర్తి చేశాక విజయభార్గవిని ప్రేమ వివాహం చేసుకున్నారు. సినీరంగంతోనూ అనుబంధం... చంద్ర పలు నాటకాల్లో నటించారు. చిల్లర దేవుళ్లు చిత్రంతోపాటు మరో బెంగాల్ చిత్రంలోనూ హీరోగా నటించే అవకాశం వచ్చినా నటించలేదు. చిల్లర దేవుళ్లు, చలిచీమలు, తరం మారింది, మంచు పల్లకి, డిటెక్టివ్ నారద తదితర 20 చిత్రాలు, 6 లఘుచిత్రాలకు కళాదర్శకుడిగా పనిచేశారు. అలాగే రచయితగా, సాహితీవేత్తగా 150 కథలు, అనేక కవితలు రాశారు. యర్రంశెట్టి సాయి, పమ్మి వీరభద్రరావులతో కలసి గొలుసు నవల కూడా రాశారు. మల్లాది, సూర్యదేవర, యండమూరి వీరేంద్రనాథ్ వంటి రచయితల నవలలు చంద్ర ముఖచిత్రాలతో ఆకట్టుకొనేవి. స్వాతి, ఆంధ్రభూమి వంటి వారపత్రికలకు ఆయన క్రమం తప్పకుండా బొమ్మలు గీసేవారు. ప్రఖ్యాత చిత్రకారుడు బాపు ప్రశంసలను అందుకున్నారు. దాశరథి కృష్ణమాచార్య, పల్లా దుర్గయ్య, కాళోజీలకు అత్యంత సన్నిహితంగా మెలిగారు. సీఎం కేసీఆర్ సంతాపం... ప్రముఖ చిత్రకారుడు, ఇల్లస్ట్రేటర్ చంద్రశేఖర్ (చంద్ర) మృతిపట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు సంతాపం వ్యక్తం చేశారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. చంద్ర మృతికి ప్రొఫెసర్ జయధీర్ తిరుమలరావు, కేంద్ర సాహిత్య అవార్డు గ్రహీత అంపశయ్య నవీన్, డాక్టర్ తిరుక్కోవలూరు శ్రీరంగస్వామి, ఆర్టిస్ట్ మల్లిక్ తదితరులు సైతం సంతాపం తెలిపారు. ముఖ చిత్రాలు..వ్యంగ్య చిత్రాలకు పెట్టింది పేరు చంద్ర అనేక దినపత్రికలు, వారపత్రికలు, మాసపత్రికలలో వ్యంగ్య చిత్రాలు, కథలకు బొమ్మలు వేసేవారు. ప్రముఖుల రేఖా చిత్రాలు గీసి ప్రత్యేకత చాటుకున్నారు. నవలలు, పుస్తకాలకు ఆయన వేసిన ముఖ చిత్రాలు ప్రధాన ఆకర్షణగా ఉండేవి. 1970 నుంచి 2010 వరకు చంద్ర వేసిన ముఖచిత్రాలతో కొన్ని వేల పుస్తకాలు వెలు వడ్డాయి. మనుషుల మానసిక ప్రపంచాన్ని, స్త్రీ పురుషుల్లోని ఆంగిక సౌందర్యాన్ని ఎంతో కళాత్మకంగా చిత్రించిన ప్రత్యేక శైలి ఆయనది. ప్రపంచంలో విప్లవాల దశ కొనసాగిన సమయాన తన కళను ఆయుధంగా చేయాలనుకొని విరసం కార్యక్రమాలలో పాల్గొన్నారు. ఎమర్జెన్సీ కాలంలో జైలు శిక్ష కూడా అనుభవించారు. -
సాక్షి కార్టూన్ 04-12-2020
-
‘టామ్ అండ్ జెర్రీ’ దర్శకుడి కన్నుమూత
ప్రేగ్: చిన్నా, పెద్ద అనే తేడా లేకుండా అందరినీ దశాబ్దాలుగా అలరిస్తున్న కార్టూన్ సీరియల్ టామ్ అండ్ జెర్రీ దర్శకుడు, ఆస్కార్ అవార్డు గ్రహీత జీన్ డీచ్ మరణించారు. 95 ఏళ్ల వయసున్న ఆయన చెక్ రిపబ్లిక్ రాజధాని ప్రేగ్ నగరంలోని తన అపార్టుమెంట్లో గురువారం రాత్రి హఠాత్తుగా కన్నుమూశారు. ఆయన పూర్తిపేరు యూజీన్ మెరిల్ డీచ్. టామ్ అండ్ జెర్రీ 13 ఎపిసోడ్లకు ఆయన దర్శకత్వం వహించారు. పొపెయి అనే సీరయల్ సైతం రూపొందించారు. జీన్ డీజ్ మొదట ఉత్తర అమెరికా వైమానిక దశంలో పనిచేశారు. అనంతరం పైలెట్ ట్రైనింగ్ పూర్తిచేశారు. తర్వాత ఆరోగ్యపరమైన సమస్యలతో సైన్యం నుంచి బయటకు వచ్చారు. 1959లో ప్రేగ్కు చేరుకున్నారు. చిత్రకళలో గట్టి పట్టున్న ఆయన కార్టూన్లు గీయడంపై దృష్టి పెట్టారు. డీచ్ దర్శకత్వం వహించిన మన్రో అనే చిత్రం 1960లో బెస్టు యానిమేటెడ్ షార్టుఫిలింగా ఆస్కార్ అవార్డు గెలుచుకుంది. జీన్ డీచ్కు భార్య, ముగ్గురు కుమారులు ఉన్నారు. వారంతా కార్టూనిస్టులే. -
మహ్మద్ ప్రవక్తపై కార్టూన్ పోటీలు!
అమ్స్టర్డామ్ : ఇస్లాం దైవ ప్రవక్త మహమ్మద్పై వ్యంగ్య కార్టూన్ చిత్రాల పోటీని నిర్వహిస్తున్నట్టు నెదర్లాండ్ ప్రజా ప్రతినిధి గ్రీట్ విల్డర్స్ శనివారం ట్విటర్లో ప్రకటించారు. ఔత్సాహికులు తమ కార్టూన్ చిత్రాలను పంపాల్సిందిగా ఆయన కోరారు. నెదర్లాండ్లో అతిపెద్ద ప్రతిపక్ష పార్టీకి చెందిన గ్రీట్ విల్డర్స్ ఇస్లాం వ్యతిరేకులుగా పేరుగాంచారు. హింస, ఇస్లామిక్ ఫత్వాల మీద భావ ప్రకటనా స్వేచ్ఛది ఎప్పుడూ పైచేయి కావాలని విల్డర్స్ పేర్కొన్నారు. విల్డర్స్ ఈ పోటీని గతేడాది ఆగస్టులోనే నిర్వహించాలనుకున్నారు. కానీ, ఆయనను హత్య చేయడానికి ప్రయత్నిస్తున్న ఓ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేయడంతో తన ప్రయత్నాన్ని మానుకున్నారు. అంతేకాక, కార్టూన్ పోటీలను రద్దు చేయాలంటూ పాకిస్తాన్లోని ఇస్లామిక్ పార్టీ తెహ్రీక్ ఎ లబ్బైక్ పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శన నిర్వహించింది. ప్రపంచంలోని ఇస్లామిక్ దేశాలన్నీ కూడా నెదర్లాండ్తో తమ దౌత్య సంబంధాలను తెంచుకోవాలని డిమాండ్ చేసింది. ఈ నేపథ్యంలో విల్డర్స్ గతేడాది పోటీలను రద్దు చేసి ఇప్పుడు నిర్వహిస్తున్నారు. మహ్మద్ ప్రవక్త వ్యంగ్య చిత్రాలను చాలా మంది ముస్లింలు అభ్యంతరకరంగా భావిస్తారు. గతంలో చూస్తే 2005లో ఓ పత్రికలో మహ్మద్ ప్రవక్తపై వ్యంగ్య కార్టూన్ చిత్రాన్ని ప్రచురించినందుకు గాను కార్టూనిస్టు లేదా ఆ పత్రిక ఎడిటర్ను చంపాలని తీవ్ర ప్రయత్నాలు జరిగాయి. తర్వాత పదేళ్లకు ప్యారిస్లో ఇద్దరు ముస్లిం గన్మెన్లు మహ్మద్ ప్రవక్తపై వ్యంగ్య చిత్రాలను ప్రచురించినందుకు చార్లీ హెబ్డో పత్రిక కార్యాలయంలో 12 మందిని కాల్చి చంపారు. -
కార్టూనిస్ట్, ఫుడ్ బ్లాగర్ ఆత్మహత్య
మంగళూరు: ప్రముఖ కార్టూనిస్ట్, ప్రముఖ పాపులర్ ఫుడ్ బ్లాగర్ నిఖిల్ పాయ్ (29) విషం తీసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ‘ది త్రి హంగ్రీ మెన్’ అనే ఫుడ్ బ్లాగ్తో పాపులర్ అయిన నిఖిల్ ఆత్మహత్య ఫుడ్ లవర్స్ను, వ్యాపార వర్గాలను విస్మయపర్చింది. వ్యక్తిగత కారణాల రీత్యా ఆయన ఆత్మహత్యకు పాల్పడి వుంటారని భావిస్తున్నారు. తల్లితో గొడవ పడిన నిఖిల్ బయటకు వెళ్లారు. ఆయన తిరిగి ఇంటికి రాకపోవడంతో ఆయన కుటుంబం మిస్సింగ్ కేసు నమోదు చేశారు. మంగుళూరు మలెమార్నగరంలోని ఆయన నివాసంలో మృతదేహాన్నిఆదివారం కనుగొన్నారు. నిఖిల్ ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ మొదలు పెట్టారు. కాగా, ముగ్గురు స్నేహితులతో కలిసి ‘ది త్రీ హంగ్రీ మెన్’ అనే ఫుడ్ బ్లాగ్ను 29మే 2009లో ప్రారంభించారు నిఖిల్. దీంతోపాటు తండ్రి మరణానంతరం కుటుంబ వ్యాపారాలను కూడా నిఖిల్ చూసుకుంటున్నారు. యూట్యూబ్లో కార్టూన్ కళపై ఆయన వీడియోలు పాపులర్ అయ్యాయి. అలాగే వివిధ ప్రదేశాల్లో దొరికే విలక్షణ ఆహార పదార్థాలు, వంటకాలపై ఆయన నిర్వహించే రివ్యూలు బహుళ ప్రజాదరణ పొందాయి. నిఖిల్కు భార్య, తల్లి , సోదరి ఉన్నారు. త్వరలో ‘ది త్రీ హంగ్రీ మెన్’ పదేళ్ల వార్షికోత్సవం నిర్వహించుకోనున్న తరుణంలో ఈ విషాదం చోటు చేసుకుంది. -
ఈయన ప్రాణాన్ని గీసి, బొమ్మను పోస్తాడు!
శంకర్ గీతకు కంట్రోల్ ఉండదు. కంట్రోల్ తప్పడం కాదది.. కంట్రోల్లో పెట్టడం! అది కార్టూనింగ్. వంకరగా అతడు ఒక్క గీత గీశాడంటే.. ఎవరు ఏమిటో చక్కగా దిగిపోద్ది. అది క్యారికేచరింగ్. పైనున్నాయన బొమ్మను చేసి ప్రాణం పోస్తే.. ఈయన ప్రాణాన్ని గీసి, బొమ్మను పోస్తాడు. అదొక తాండవం. శంకర తాండవం. భుజానికో గుడ్డ సంచీ తగిలించుకుని అందులో తన ఆశల గీతలను దాచుకుని ఎన్ని మెట్లెక్కాడో తెలియదు కానీ, హృదయాన్ని ముంచెత్తుతోన్న రంగురంగుల స్వప్నాలను ఎక్కడైనా ఒలకబోసుకుందామని ఎన్నిసార్లో ప్రయత్నించారు పామర్తి శంకర్. ఆ తపనతోనే వృత్తిరీత్యా కార్టూనిస్టు, ప్రవృత్తిరీత్యా క్యారికేచరిస్ట్ అయిన శంకర్ అనతి కాలంలోనే అంతర్జాతీయ గుర్తింపుని తెచ్చుకోగలిగారు. అలా రెండు దశాబ్దాల పాటు తను వేసిన ప్రతి పెన్సిల్ గీతా, ప్రతి సిరాచుక్కనీ ఒకచోటకు చేర్చి హైదరాబాద్లోని రవీంద్రభారతి ఆర్ట్ గ్యాలరీలో ‘ది ఇంక్డ్ ఇమేజ్’ పేరుతో ప్రదర్శనకు ఉంచారు శంకర్. నల్లజాతి సూరీడు నెల్సన్ మండేలాను తలచుకున్నప్పుడల్లా జాతి వివక్షకు వ్యతిరేకపోరాట చిహ్నంగా అంతర్జాతీయ బహుమతి గెలుచుకున్న శంకర్ గీసిన మండేలా బిగిపిడికిలి గుర్తురావాల్సిందే ఎవ్వరికైనా. ఎంఎస్ సుబ్బులక్ష్మి గానామృతం రుచిమరిగిన కోయిలమ్మ సహా సుబ్బులక్ష్మి బొమ్మ శంకర్ క్యారికేచర్ దాహార్తికో మచ్చుతునక. ప్రాణాలన్నీ ఉగ్గదీసుకుని షెహనాయ్లోకి ఊదుతున్నట్టున్న బిస్మిల్లాఖాన్ షెహనాయ్ మన చెవుల్లో రింగుమంటూంటుంది. కారల్ మార్క్స్ గడ్డం, ఎంఎఫ్ హుస్సేన్ ఆర్టు, కేసీఆర్ సిగలో తురిమిన తెలంగాణ, పాటల జలపాతాల్లా తోచే గోరటి వెంకన్న కళ్లు, అరుంధతీరాయ్ సిగలో పుష్పంగా మారిన సాహిత్యం, పీవీనరసింహారావు మూతి ముడుపు, రజనీకాంత్ స్టైలూ, మైకేల్ జాక్సన్ వొంటి విరుపూ ఇలా చెప్పుకుంటూ పోతే శంకర్ క్యారికేచర్ల ప్రత్యేకతలు శంకర్లోని రాజకీయ, సామాజిక, ఆర్థికావగాహనని సాక్షాత్కరిస్తాయి. ‘‘ఈనెల 21న ముగియనున్న ఈ ఎగ్జిబిషన్ ఏ ఒక్క కార్టూనిస్టుని తయారుచేసినా నాకదే సంతృప్తి’’ అంటోన్న శంకర్ సాక్షి ఫ్యామిలీతో పంచుకున్న కొన్ని అనుభూతులు. మీ మదిలో మెదిలిన తొలి పెన్సిల్ గీత? నిజం చెప్పాలంటే మట్టిబొమ్మలతో నా ప్రయాణం మొదలైంది. స్కూల్ డేస్లోనే రంగులతో స్నేహం ఏర్పడింది. చిన్నప్పుడే సైన్బోర్డు ఆర్టిస్టుగా చేరాను. ఆ తరువాత స్కూల్లో పిల్లలకు డ్రాయింగ్ నేర్పే టీచర్ వృత్తిలోకి మారాను. మూడు పీరియడ్స్ మినహా మిగిలిన సమయమంతా లైబ్రరీలో గడిపేవాడిని. ప్రకాష్ షెట్టీ, అజిత్ నారాయణ్ క్యారికేచర్లు చూసేవాడిని. ఏదో వెలితి నన్ను వెంటాడుతూ ఉండేది. నాక్కావాల్సింది ఇది కాదు అన్న భావన నాలో అశాంతిని రేపేది. అప్పటికే నల్లగొండ గోడలపై వెలిసే ఆర్టిస్ట్ మోహన్ ఉద్యమపొలికేకల పోస్టర్లు నన్ను అమితంగా ఆకర్షించేవి. ఆదివారం వచ్చిందంటే హైదరాబాద్కి ప్రయాణమయ్యేవాడిని. ఆర్ట్ ఎగ్జిబిషన్స్, సండేమార్కెట్లో పుస్తకాలు కొనుక్కోవడం, ఎంఏడి (మాడ్) కార్టూన్ మాగజైన్స్ చూడటం, మోర్ట్ డ్రక్కర్ క్యారికేచర్స్, సెర్జో ఆర్గాన్స్, డాన్ మార్టిన్, పాల్కోకర్ లాంటి ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన కార్టూనిస్టులను చూస్తూండేవాడిని. ఆ స్ఫూర్తితోనే వారపత్రికల్లో అప్పుడప్పుడూ సోషల్ కార్టూన్స్ని పంపేవాణ్ణి. అలా అలా డైలీ పాకెట్ కార్టూన్కి ఫిదా అయిపోయాను. పత్రికారంగంలోకి ఎలా వచ్చారు? అమెచ్యూర్ ఆర్టిస్ట్ అసోసియేషన్లో కార్యకర్తగా ఉన్నప్పుడు పూర్వపు ఆంధ్రజ్యోతిలో తిరుపతి, వైజాగ్, హైదరాబాద్, విజయవాడ కార్టూనిస్ట్ కాంపిటీషన్స్లో నేను సెలక్ట్ అయ్యాను. అయితే ఇంటి దగ్గర్నుంచి చేస్తానన్నాను. కానీ పొలిటికల్ కార్టూన్లు ఇంటినుంచి వేయడం కుదరదన్నారు. మీ రంగుల కల రాజధానికెలా చేరింది? అయితే సీజనల్గా కాదు పూర్తికాలం కార్టూనిస్టుగా ఉండాలన్న తపన, జిజ్ఞాస ఎలాగైనా హైదరాబాద్కి వెళ్లిపోవాలన్న కోర్కెకు బలంచేకూర్చింది. అదే నాన్నకి చెప్పాను. మహా మహా ఆర్టిస్టులే రోడ్ల మీద క్రీస్తు బొమ్మలూ, ఆంజనేయస్వామి బొమ్మలూ వేసుకుని అడుక్కుతింటూంటే హైదరాబాద్ వెళ్లి నువ్వేం చేస్తావురా? నువ్వింకా హైదరాబాద్కి వెళ్లదల్చుకుంటే నా శవంపై నుంచి దాటి వెళ్లు అన్న నాన్న కరెంటు నర్సయ్య మాటలకు కట్టుబడి, నల్లగొండ మట్టిపై మమకారాన్ని వదులుకోలేక చాలా ఏళ్లు నన్ను కనిపెంచిన ఆ నల్లనిరాళ్లలో ఉండిపోయా ను. ఉద్యోగంలో తృప్తిలేదు. కార్టూన్ల దాహం తీరలేదు. ఇక లాభంలేదనుకుని ఒకానొక రోజు భుజానికి గుడ్డసంచీ తగిలించుకుని, దాని నిండా నేను గీసిన కార్టూన్లు నింపుకుని ఆర్టిస్టు మోహన్గారిని వెతుక్కుంటూ హైదరాబాద్ చేరాను. నా గీతను ఇష్టపడిన మోహన్గారు నన్ను అక్కున చేర్చుకున్నారు. క్యారికేచర్లలోకి ఎలా అడుగుపెట్టారు? తెలుగు మహాసభల కోసం ప్రత్యేక సంచిక వేస్తూ మోహన్గారు నాకోసం ప్రత్యేకించి శంకర భాష్యం పేరుతో ఒక పేజీని కేటాయించారు. భానుమతి, బాల్థాకరే, రాజేంద్రప్రసాద్, ధర్మవరపు సుబ్రహ్మణ్యంల క్యారికేచర్లు అందులో పబ్లిష్ అవడం నా జ్ఞాపకాల్లో ఎప్పుడూ మెదిలే తొలి అనుభవం. చెదిరిన జుట్టుతో అత్యంత సహజంగా వేసిన బాలగోపాల్ క్యారికేచర్, రైతు భుజంపై చేయివేసిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి క్యారికేచర్, ఎంఎఫ్ హుస్సేన్, విన్నీ మండేలా, రావు బాల సరస్వతి, కిషోర్ కుమార్, ఆరుద్రల క్యారికేచర్లు నాకు బాగా గుర్తింపు తెచ్చిపెట్టాయి. ∙కార్టూనిస్టుగా తొలి అనుభూతి? ఉద్యోగం కోసం కార్టూన్లతోనే మూడు పేజీల బయోడేటా తయారుచేసుకుని నా కార్టూన్లన్నింటినీ సంచిలో పెట్టుకుని మళ్లీ కార్టూనిస్ట్ ఉద్యోగ వేటలో పడ్డాను. వార్తాపత్రికలో రామచంద్రమూర్తిగారికి నా కార్టూన్లిచ్చి వచ్చాను. నల్లకుంటలో బస్కోసం ఎదురుచూస్తుంటే అనుకోకుండా పాన్డబ్బా ముందు వేళ్లాడదీసిన నా కార్టూన్... ఒకటి కాదు వరసగా పది పేపర్లు. ఆశ్చర్యపోయాను. నా కార్టూన్ ఫ్రంట్ పేజ్లో. ఆనందానికి అవధుల్లేవు. అలా మొదలై ఇప్పుడు ప్రముఖ దినపత్రిక ‘సాక్షి’లో కార్టూనిస్టు స్థాయికి చేరాను. ఓసారి రాజకీయవేత్తలందరితో వేసిన ఓ క్యారికేచర్ తెల్లారి ఫ్రంట్ పేజ్ బ్యానర్గా మార్చిన సాక్షి ఎడిటర్ మురళిగారిని ఆశ్చర్యంగా అడిగాను సర్ ఇది లోపలి పేజీ కోసం వేసిందని. ‘‘అది బ్యానర్లో ఉండాల్సిన క్యారికేచర్లే మాకు తెలుసు’’ అని మురళిగారు అన్న మాట వృత్తిపరంగా నాకెంతో సంతృప్తినిచ్చిన మరో సందర్భం. అత్తలూరి అరుణ, ప్రిన్సిపల్ కరస్పాండెంట్, సాక్షి -
కార్టూనిస్ట్ శంకర్ "ది ఇంక్డ్ ఇమేజ్"
-
సాక్షి’ కార్టూనిస్ట్ శంకర్కు అంతర్జాతీయ అవార్డు
సాక్షి, హైదరాబాద్: ‘సాక్షి’కార్టూనిస్ట్ పామర్తి శంకర్ను మరో అంతర్జాతీయ పురస్కారం వరించింది. ‘ఎండ్ ఆఫ్ టెర్రరిజం’ పేరిట ఇరాన్లో జరిగిన కార్టూన్ల పోటీలో ద్వితీయ బహుమతి లభించింది. ఈ పోటీలో 65 దేశాలకు చెందిన వ్యంగ్య చిత్రకారులు పాల్గొన్నారు. మన దేశం నుంచి 18 మంది తమ ఎంట్రీలను పంపారు. మయన్మార్లో రోహింగ్యాలపై జరిగిన దాడిని ఉద్దేశించి ఆయన గీసిన ఆంగ్సాన్ సూకీ క్యారికేచర్ పురస్కారం గెలుచుకుంది. బహుమతిగా 1,500 డాలర్ల ప్రైజ్మనీతోపాటు జ్ఞాపిక, సర్టిఫికేట్, పబ్లిష్డే ఆల్బంను అందజేస్తారు. ఇప్పటికే ప్రతిష్టాత్మక వరల్డ్ ప్రెస్ కార్టూన్ గ్రాండ్ ప్రీ అవార్డు(2015)తోపాటు పలు అంతర్జాతీయ పురస్కారాలను శంకర్ అందుకున్నారు -
స్వాతి, షబ్బీర్లపై కేసుల్ని ఎత్తివేయాలి
హైదరాబాద్: కఠువా, ఉన్నావ్ ఘటనలకు నిరససగా కార్టూన్ వేసిన సీనియర్ జర్నలిస్ట్ స్వాతి వడ్లమూడిపై కేసు నమోదుచేయడాన్ని ఖండిస్తున్నట్లు ‘ఫోరం ఫర్ పొలిటికల్ కార్టూనిస్ట్స్’ సభ్యులు తెలిపారు. సమాజంలో జరిగే దారుణాలను వెలుగులోకి తీసుకొచ్చేవారిపై కేసులు బనాయించడం భావప్రకటనా స్వేచ్ఛపై దాడిచేయడమేనని విమర్శించారు. ప్రస్తుతం ఈ రకమైన ప్రమాదకర ధోరణి దేశమంతా కొనసాగుతోందన్నారు. కఠువా, ఉన్నావ్ ఘటనలపై స్వాతి తన ఫేస్బుక్లో పోస్ట్చేసిన ఓ కార్టూన్పై హిందూ సంఘటన్ అనే సంస్థ సైదాబాద్ పోలీసులకు ఫిర్యాదుచేసిన సంగతి తెలిసిందే. స్వాతితో పాటు టైమ్స్ నౌ జర్నలిస్ట్ షబ్బీర్ అహ్మద్లపై నమోదైన కేసుల్ని వెంటనే ఎత్తివేయాలని నర్సిం, శంకర్, మృత్యుంజయ, సుభానీ తదితర కార్టూనిస్టులు డిమాండ్ చేశారు. -
శ్రీదేవి సైకత శిల్పంతో నివాళి!
-
కథగా..కల్పనగా తరలిపోయిన తారకు నివాళి!
సాక్షి, ముంబై: అభిమాన అందాల నటి శ్రీదేవి ఇకలేరన్న (ఫిబ్రవరి 24) పిడుగులాంటి వార్తతో యావత్తు సినీ జగత్తు తీవ్ర దిగ్భ్రాంతికి లోనైంది. దీంతో ప్రపంచవ్యాప్తంగా సోషల్ మీడియాలో ఆమె అభిమానులు తీరని విషాదంలో మునిగిపోయారు. సినీ ప్రపంచంలో ధృవతారలా వెలిగిన మెగాస్టార్ శ్రీదేవి హఠాన్మరణంపై పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ప్రగాఢ సంతాపాన్ని వెలిబుచ్చారు. వీరితోపాటు వివిధ రంగాలకు చెందిన కళాకారులు, కార్టూనిస్టులు, ఇతర ప్రముఖులు కూడా ఆమె మరణం పట్ల అంతులేని ఆవేదన ప్రకటిస్తున్నారు. ముఖ్యంగా ప్రముఖ సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్ ఒడిషాలోని పూరీ బీచ్లో ఆర్ఐపీ శ్రీదేవి అంటూ సైకత శిల్పంతో ప్రత్యేక నివాళులర్పించారు ప్రఖ్యాత సంపాదకీయ కార్టూనిస్ట్ సతీష్ ఆచార్య కూడా భావోద్వేగాన్ని తన ఆర్ట్ ద్వారా ప్రకటించారు. దేవుని ఒడిలో శ్రీదేవి నిద్రపోతున్నట్టుగా ఒక స్కెచ్ను వేశారు. 'రా రె రారామ్, ఓ రా రీ రమ్' (సద్మా, తెలుగులో వసంతకోకిల మూవీలోని పాట) రూపొందించిన కార్టూన్ ఆమె అభిమానుల్లో కంట నీరు పెట్టిస్తోంది. కాగా సమీప బంధువు వివాహ వేడుక కోసం దుబాయ్ వెళ్లిని శ్రీదేవి తీవ్రమైన గుండెపోటుతో తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. తాజా సమాచారం ప్రకారం సోమవారం ముంబై జుహూలోని పవన్ హన్స్ శ్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్టు తెలుస్తోంది. మరోవైపు రిలయన్స్ క్యాపిటల్ అధినేత అనిల్ అంబానీకి చెందిన ప్రత్యేక విమానంలో శ్రీదేవి భౌతికకాయం ముంబైలోని ఆమె నివాసానికి చేరనుంది. Tribute to one of the brightest star of Indian cinema #Sridevi . My SandArt at Puri beach in Odisha with message "We will miss you" . #RIPSridevi pic.twitter.com/NuMYnKWnO7 — Sudarsan Pattnaik (@sudarsansand) February 25, 2018 Chandni! @mail_today cartoon #Sridevi #Chandni pic.twitter.com/I6ZrPDQ06n — Satish Acharya (@satishacharya) February 26, 2018 Tribute to one of the brightest star of Indian cinema #Sridevi . My SandArt at Puri beach in Odisha with message "We will miss you" . #RIPSridevi pic.twitter.com/NuMYnKWnO7 — Sudarsan Pattnaik (@sudarsansand) February 25, 2018 -
‘సాక్షి’ కార్టూనిస్ట్ శంకర్కు ప్రత్యేక ఆహ్వానం
సాక్షి, హైదరాబాద్: ఇరాన్లో జరుగుతున్న అంతర్జాతీయ కార్టూన్ క్యారికేచర్ పోటీల్లో ‘సాక్షి’ కార్టూనిస్ట్ పామర్తి శంకర్ న్యాయ నిర్ణేతగా వ్యవహరించనున్నారు. మొత్తం 64 దేశాల కార్టూనిస్టులు పాల్గొంటున్న 11వ టెహ్రాన్ అంతర్జాతీయ ద్వైవార్షిక కార్టూన్ పోటీల్లో శంకర్తోపాటు గ్రీస్, పోర్చుగల్కు చెందిన ఇద్దరు కార్టూనిస్టులను అంతర్జాతీయ జ్యూరీకి ఎంపిక చేశారు. నిర్వాహకుల ఆహ్వానం మేరకు శంకర్ మంగళవారం ఇరాన్ రాజధాని టెహ్రాన్ బయలుదేరారు. ఈ నెల 15న అవార్డుల ప్రదానం జరగనుంది. ఆ తర్వాత జరిగే వర్క్షాప్లోనూ ఆయన పాల్గొంటారు. గతంలోనూ శంకర్ పలు అంతర్జాతీయ కార్టూన్ పోటీల్లో న్యాయ నిర్ణేతగా వ్యవహరించారు. -
కార్టూనిస్ట్ బాలా ఎఫ్ఐఆర్పై స్టే
మదురై: కార్టూనిస్ట్ బాలాపై దాఖలైన ఎఫ్ఐఆర్ ఆధారంగా తదుపరి చర్యలు తీసుకోకుండా మద్రాస్ హైకోర్టు స్టే విధించింది. తనపై విచారణను రద్దుచేయాలని కోరుతూ బాలా వేసిన పిటిషన్పై కోర్టు బుధవారం ఈ మేరకు మధ్యంతర ఆదేశాలిస్తూ దీనికి కౌంటర్ దాఖలుచేయాలని ప్రభుత్వాన్ని కోరింది. కోర్టు అనుమతి లేకుండా విచారణ జరిపే అధికారం పోలీసులకు లేదని బాలా తన పిటిషన్లో పేర్కొన్నారు. తానేం క్రిమినల్ నేరానికి పాల్పడినట్లు ఎఫ్ఐఆర్లో లేదని గుర్తుచేశారు. సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పులకు విరుద్ధంగా తాజా ఎఫ్ఐఆర్ ఉందని ఆరోపించారు. -
భావప్రకటనా స్వేచ్ఛకు గొడ్డలిపెట్టు
సాక్షి, హైదరాబాద్ : ప్రభుత్వ వైఫల్యాలను తన కుంచె ద్వారా ఎత్తిచూపిన కార్టూనిస్టు బాలాను తమిళనాడు సర్కార్ అరెస్టు చేయడాన్ని ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్(ఐజేయూ) తీవ్రంగా ఖండించింది. ఇది భావవ్యక్తీకరణ స్వేచ్ఛకు గొడ్డలిపెట్టని ఐజేయూ అధ్యక్షుడు ఎస్.ఎన్.సిన్హా, సెక్రటరీ జనరల్ దేవులపల్లి అమర్, కార్యదర్శి వై.నరేందర్రెడ్డి ఒక సంయుక్త ప్రకటనలో పేర్కొన్నారు. వడ్డీ వ్యాపారి బెదిరింపులు తాళలేక ఒక వ్యక్తి, భార్య, ఇద్దరు పిల్లలపై కిరోసిన్ పోసి తరునెల్వేలి కలెక్టరేట్ వద్ద నిప్పు అంటించుకుని ఆత్మహత్యలకు పాల్పడ్డారు. దీనిపై తమిళనాడు సీఎం, తిరునెల్వేలి కలెక్టర్, ఇతర పోలీసులపై బాలా వేసిన వ్యంగ్య కార్టూన్ ఫేస్బుక్లో వైరల్ అయింది. వైఫల్యాల్ని సరిదిద్దుకోవాల్సిన ప్రభుత్వం అందుకు విరుద్ధంగా కలెక్టర్ ఫిర్యాదు మేరకు బాలాపై కేసు పెట్టి జైలుపాలు చేయడం భావవ్యక్తీకరణ స్వేచ్ఛను హరించడమే అవుతుందని పేర్కొన్నారు. -
కార్టూనిస్ట్ బాలకు బెయిల్ మంజూరు
తిరువొత్తియూరు: తమిళనాడు సీఎం పళనిస్వామితో పాటు తిరునల్వేలి జిల్లా కలెక్టర్, పోలీస్ కమిషనర్లపై వ్యంగ్య చిత్రం గీసిన కేసులో అరెస్టయిన కార్టూనిస్టు జి.బాల అలియాస్ బాలక్రిష్ణన్(36) సోమవారం బెయిల్పై విడుదలయ్యారు. తిరునల్వేలి జిల్లాకు చెందిన ఇసక్కిముత్తు వడ్డీ వ్యాపారుల వేధింపులు భరించలేక జిల్లా కలెక్టరేట్లో కుటుంబంతో సహా నిప్పు అంటించుకుని ఆత్మాహతి చేసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి వ్యంగ్య కార్టూన్ గీయడంతో జిల్లా కలెక్టర్ పోలీసు కమిషనర్కు ఫిర్యాదు చేశారు. దీంతో బాలను అరెస్టుచేసి చెన్నైలో కోర్టులో హాజరుపరిచారు. ఈ కేసును విచారించిన జ్యుడీషియల్ మేజిస్ట్రేట్.. బాలకు బెయిల్ జారీచేస్తూ నవంబర్ 9న కోర్టుకు హాజరు కావాలని నిబంధన విధించారు. కాగా, బాల గీసిన వ్యంగ్య కార్టూన్లను సామాజిక మాధ్యమాల్లో 25 లక్షల మంది చూసినట్టు తెలిసింది. -
ప్రభుత్వ అసమర్థతను ఎత్తి చూపటం ఆపను
సాక్షి, చెన్నై : తమిళనాడు ప్రభుత్వ విధానాలను ఎండగడుతూ వ్యంగ్య కార్టూన్ వేసి అరెస్టయిన కార్టూనిస్ట్ బాలక్రిష్ణన్(36)కు ఊరట లభించింది. తిరువనేలి జిల్లా కోర్టు సోమవారం మధ్యాహ్నం ఆయనకు బెయిల్ మంజూరు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. దీంతో బయటకు వచ్చిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘నేనేం ఘోర హత్యలు చేయలేదు. కాబట్టి, సిగ్గుపడాల్సిన అవసరం లేదు. కేసులతో నన్నేం చేయలేరు. ప్రభుత్వ అసమర్థతను ఎండగట్టడం నేను ఆపను. నా పోరాటం కొనసాగుతూనే ఉంటుంది’’ అని కోర్టు వెలుపల బాల ప్రకటించారు. తిరునల్వేలి కలెక్టర్ కార్యాలయం ఎదుట ఓ కుటుంబం సజీవంగా కాల్చుకుని ఆత్మహత్య చేసుకోగా.. వడ్డీ వ్యాపారుల ఆగడాలను అడ్డుకోవటంలో ప్రభుత్వం, అధికారులు ఘోరంగా విఫలమవుతున్నారన్న విమర్శలు వినిపించాయి. ఈ నేపథ్యంలోనే ప్రముఖ కార్టూనిస్ట్, లయన్స్ మీడియా వెబ్ సైట్ నిర్వాహకుడు అయిన బాల వ్యంగ్య కార్టూన్ వేసి ప్రభుత్వ ఆగ్రహానికి గురయ్యారు. కలెక్టర్ ఫిర్యాదుతో ఆదివారం క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఆయన్ని అరెస్ట్ చేయగా.. దేశ వ్యాప్తంగా పాత్రికేయులు ఆయనకు మద్దతు ప్రకటించారు. -
కార్టూనిస్టు బాల అరెస్టు
-
కార్టూనిస్టు బాల అరెస్టు
సాక్షి, చెన్నై: తమిళనాడు సీఎం, తిరునల్వేలి కలెక్టర్, ఎస్పీలపై వ్యంగ్య కార్టూన్ వేసిన జి.బాల అలియాస్ బాలక్రిష్ణన్ను పోలీసులు అరెస్టుచేశారు. తిరునల్వేలి కలెక్టర్ చేసిన ఫిర్యాదు మేరకు క్రైమ్ బ్రాంచి పోలీసులు ఆదివారం అదుపులోకి తీసుకున్నారు. వడ్డీ వ్యాపారుల వేధింపులకు తాళలేక గత నెల 23న ఇసక్కి ముత్తు అనే వ్యక్తి తన ఇద్దరు పిల్లలు, భార్యతో కలిసి తిరునల్వేలి కలెక్టరేట్లో నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో ‘లయన్స్ మీడియా’ వెబ్సైట్ను నడుపుతున్న బాల ఓ వ్యంగ్య కార్టూన్ వేశారు. అందులో అగ్నికి ఆహుతువున్న వ్యక్తి దగ్గర సీఎం పళనిస్వామి, తిరునల్వేలి జిల్లా కలెక్టర్ సందీప్, పోలీసు కమిషనర్లు నగ్నంగా ఉన్నట్లు వేశారు. ఈ కార్టూన్ సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. కాగా, బాల అరెస్టును కార్టూనిస్టు, పాత్రికేయ సంఘాలు తీవ్రంగా ఖండించాయి. బాలను బలంతంగా లాక్కెళ్లిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాయి.