-
వారి నిర్లక్ష్యంతోనే నా భార్య మృతి.. రిసార్ట్, బోట్ కెప్టెన్పై ఎన్ఆర్ఐ దావా
తన భార్య మరణానికి వారి నిర్లక్ష్యమే కారణమంటూ ఓ రిసార్ట్, బోట్ కెప్టెన్పై ఒక భారతీయ-అమెరికన్ దావా వేశారు. ఫ్లోరిడాలో గత ఏడాది పారాసెయిలింగ్ చేస్తున్నప్పుడు జరిగిన ప్రమాదంలో భారత్లోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన శ్రీనివాసరావు అలపర్తి భార్య మృతి చెందారు. ఆయన కొడుకు, మేనల్లుడు తీవ్రంగా గాయపడ్డారు. అయితే ఆ ప్రమాదానికి వాటర్ ఫ్రంట్ రిసార్ట్, బోట్ కెప్టెన్ల నిర్లక్ష్యమే కారణమంటూ తాజాగా ఆయన వారిపై దావా వేశారు. శ్రీనివాసరావు అలపర్తి మన్రో కౌంటీ సర్క్యూట్ కోర్టులో బోట్ కెప్టెన్, అతని సహాయకుడు, రిసార్ట్ యాజమాన్యంపై 68 పేజీల వ్యాజ్యాన్ని దాఖలు చేసినట్లు ది వాషింగ్టన్ పోస్ట్ నివేదించింది. 2022 మే 30న శ్రీనివాసరావు, ఆయన భార్య సుప్రజ (33), వారి పదేళ్ల కొడుకు, తొమ్మిదేళ్ల మేనల్లుడు ఫ్లోరిడా కీస్లో పారాసైలింగ్కు వెళ్లారు. ఈ సమయంలో వాతావరణం ప్రతికూలంగా మారింది. కొన్ని నిమిషాల తర్వాత బోట్ కెప్టెన్ డేనియల్ కౌచ్ పారాసైల్ను బోట్కి అనుసంధానించే టౌలైన్ను కత్తిరించాడు. దీంతో సుప్రజ, ఇద్దరు పిల్లలు రెండు మైళ్ల దూరం గాలిలో తేలుతూ కాంక్రీట్ వంతెనకు తగిలారు. ఈ ప్రమాదంలో సుప్రజ మృతి చెందగా పిల్లలిద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. బోట్ సిబ్బంది వాతావరణ సూచనను గమనించి, యూఎస్ కోస్ట్ గార్డ్కు సమాచారం అందించడంలో విఫలమయ్యారని శ్రీనివాసరావు తన దావాలో ఆరోపించారు. అంతేకాకుండా సిబ్బంది తమకు లైఫ్ జాకెట్లు వంటి తగిన భద్రతా పరికరాలను అందించలేదని, నియంత్రణ కోల్పోయిన తర్వాత పారాసైల్ను సరిగ్గా కిందికి తీసుకురాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. -
గుజరాత్ టైటాన్స్ ఓనర్ ఎవరు ఆస్థి ఎన్ని లక్షల కొట్లో తెలుసా..!
-
కొత్త అవతారం లో హీరో ధనుష్ దాని కొససామేనా..!
-
యశస్విజైస్వాల్ రుతురాజ్ గైక్వాడ్.. వెల్కమ్ టు టీమ్ ఇండియా
-
హోమ్ గ్రౌండ్లో అదరగొట్టిన గుజరాత్ టైటాన్స్
-
KL రాహుల్ అవుట్.. LSG లోకి కొత్త ప్లేయర్
-
రెండేళ్ల తరువాత రోహిత్ శర్మ విధ్వంసం..
-
గెలవాల్సిన మ్యాచ్ ఓడిన ఆర్ సీబీ కి మరో దెబ్బ
-
KKR పరిస్థితి ఏంటో...పరేషాన్ అవుతున్న ఫ్యాన్స్
-
IPL 2023: కేకేఆర్ సంచలన ప్రకటన.. కెప్టెన్గా ఎవరూ ఊహించని కొత్త పేరు
ఐపీఎల్ 2023 సీజన్ ప్రారంభానికి ముందు కోల్కతా నైట్రైడర్స్ సంచలన ప్రకటన చేసింది. గాయపడిన రెగ్యులర్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ స్థానంలో కెప్టెన్గా ఎవరూ ఊహించని కొత్త వ్యక్తి పేరు తెరపైకి తెచ్చింది. కేకేఆర్ తమ తాత్కాలిక కెప్టెన్గా సీనియర్ ఆటగాడు నితీశ్ రాణా పేరును ప్రకటించింది. వెన్ను సమస్య కారణంగా అయ్యర్ 2023 సీజన్ తొలి అర్ధ భాగం మ్యాచ్లకు దూరం కానున్న నేపథ్యంలో కేకేఆర్ కెప్టెన్ ఎంపిక అనివార్యం కాగా, కేకేఆర్ యాజమాన్యం నితీశ్ రాణావైపు మొగ్గుచూపింది. Official statement. @NitishRana_27 #AmiKKR #KKR #Nitish #NitishRana pic.twitter.com/SeGP5tBoql — KolkataKnightRiders (@KKRiders) March 27, 2023 పరిమిత ఓవర్ల ఫార్మాట్లో ఢిల్లీ కెప్టెన్గా పని చేసిన అనుభవాన్ని, 2018 నుంచి కేకేఆర్తో ఉన్న అనుబంధాన్ని పరిగణలోకి తీసుకుని రాణాను ఎంపిక చేసినట్లు కేకేఆర్ యాజమాన్యం అధికారిక ప్రకటన విడుదల చేసింది. హెడ్ కోచ్ చంద్రకాంత్ పండిట్ ఆధ్వర్యంలో కేకేఆర్ బృందమంతా నితీశ్కు సహరిస్తుందని మేనేజ్మెంట్ ఆశాభావం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా నితీశ్ రాణాను ఆల్ ద బెస్ట్ చెప్పిన కేకేఆర్ యాజమాన్యం.. శ్రేయస్ అయ్యర్ త్వరగా గాయం నుంచి కోలుకోవాలని ఆకాంక్షించింది. కాగా, అయ్యర్ గాయం ప్రకటన వెలువడ్డాక కేకేఆర్ కెప్టెన్సీ రేసులో చాలా మంది పేర్లు వినిపించిన విషయం తెలిసిందే. కొందరు సునీల్ నరైన్ అంటే మరికొందరు సౌథీ, రసెల్, శార్దూల్ ఠాకూర్ పేర్లు తెరపైకి తెచ్చారు. అయితే మేనేజ్మెంట్ అనూహ్యంగా నితీశ్ పేరును కెప్టెన్గా ఓకే చేసి అందరి అంచనాలకు పటాపంచలు చేసింది. 2016లో ఐపీఎల్ అరంగేట్రం చేసిన రాణా.. ఇప్పటివరకు 91 మ్యాచ్లు ఆడి 2181 పరుగులు చేశాడు. ఇందులో 15 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 2016 నుంచి 2018 వరకు ముంబై ఇండియన్స్కు ప్రాతినిధ్యం వహించిన రాణా.. అప్పటి నుంచి వరుసగా 6 సీజన్ల పాటు (2023 కలుపుకుని) కేకేఆర్కే ఆడుతున్నాడు. గత సీజన్ వేలంలో రాణాను కేకేఆర్ 8 కోట్లకు సొంతం చేసుకుంది. -
ఫ్రాన్స్ ఫుట్బాల్ టీమ్ నూతన కెప్టెన్గా ఎంబాపె
France Foot Ball Team Captain: ఫ్రాన్స్ పుట్బాల్ జట్టు నూతన కెప్టెన్గా పారిస్ సెయింట్-జర్మైన్ క్లబ్ ఫార్వర్డ్ ఆటగాడు కైలియన్ ఎంబాపె ఎంపికయ్యాడు. వ్యక్తిగత కోచ్ డిడియర్ డెష్చాంప్స్తో సంప్రదింపుల తర్వాత ఎంబపే ఫ్రెంచ్ ఫుట్బాల్ టీమ్ పగ్గాలు చేపట్టేందుకు అంగీకరించాడు. ఈ విషయాన్ని ప్రముఖ ఫ్రెంచ్ దినపత్రిక ఇవాళ (మార్చి 21) వెల్లడించింది. దశాబ్దానికి పైగా ఫ్రాన్స్ కెప్టెన్గా వ్యవహరించిన లోరిస్ 2022 వరల్డ్కప్ ఫైనల్లో అర్జెంటీనా చేతిలో ఓటమి అనంతరం కెప్టెన్సీకి రాజీనామా చేశాడు. లోరిస్ ఈ ఏడాది జనవరిలో ఫ్రాన్స్ సారధ్య బాధ్యతల నుంచి తప్పుకున్నప్పటి నుంచి ఆ స్థానం ఖాళీగా ఉండింది. తాజాగా ఎంబపే కెప్టెన్సీ చేపట్టేందుకు అంగీకరించడంతో చాలా రోజుల నెలకొన్న సందిగ్ధతకు తెరపడింది. మరోవైపు ఫ్రాన్స్ జట్టుకు వైస్ కెప్టెన్ ఎంపిక కూడా జరిగింది. సెంటర్ బ్యాక్ ప్లేయర్ రాఫేల్ వరేన్ స్థానంలో అటాకర్ ఆంటోనియో గ్రెజిమెన్ ఫ్రాన్స్ వైస్ కెప్టెన్గా నియమితుడయ్యాడు. వరల్డ్ కప్ ఓటమి నేపథ్యంలోనే రాఫేల్ వరేన్ కూడా వైస్ కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకున్నాడు. కాగా, 66 మ్యాచ్ల్లో ఫ్రాన్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన 24 ఏళ్ల ఎంబాపె.. గత వరల్డ్కప్లో అద్భుతమైన ఆటతీరుతో ఫ్రాన్స్ను ఫైనల్కు చేర్చాడు. ఫైనల్లోనే రెచ్చిపోయిన ఎంబాపె హ్యాట్రిక్ గోల్స్ సాధించినప్పటికీ ఫ్రాన్స్ గెలవలేకపోయింది. ఫ్రాన్స్ 2018 వరల్డ్కప్ సాధించడంలోనూ ఎంబాపె కీలకపాత్ర పోషించాడు. ఎంబాపె కెప్టెన్గా తొలి మ్యాచ్ను యూరో 2024 క్వాలిఫయర్స్లో నెదర్లాండ్స్ ప్రత్యర్ధిగా ఆడతాడు. -
శ్రీలంక కెప్టెన్ సంచలన నిర్ణయం
శ్రీలంక టెస్ట్ జట్టు కెప్టెన్ దిముత్ కరుణరత్నే సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఐర్లాండ్ సిరీస్ (ఏప్రిల్ 16 నుంచి 28 మధ్యలో 2 టెస్ట్లు) తర్వాత కెప్టెన్సీ నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నట్లు ఇవాళ (మార్చి 20) ప్రకటించాడు. ఇదే విషయాన్ని శ్రీలంక క్రికెట్ బోర్డు (ఎస్ఎల్సీ)కు కూడా తెలియజేసినట్లు వెల్లడించాడు. కరుణరత్నే నిర్ణయంపై ఎస్ఎల్సీ స్పందించాల్సి ఉంది. న్యూజిలాండ్ చేతిలో 0-2 తేడాతో టెస్ట్ సిరీస్ కోల్పోయిన నిమిషాల వ్యవధిలోనే కరుణరత్నే రిటైర్మెంట్ ప్రకటన చేశాడు. జట్టులో సాధారణ సభ్యుడిగా కొనసాగుతానని స్పష్టం చేసిన కరుణరత్నే.. కొత్త టెస్ట్ సైకిల్కు (వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2023-25) కొత్త కెప్టెన్ని నియమించడం మంచిదని సెలెక్టర్లకు తెలిపినట్లు పేర్కొన్నాడు. 2019లో తొలిసారి శ్రీలంక టెస్ట్ జట్టు పగ్గాలు చేపట్టిన కరుణరత్నే.. కెప్టెన్గా తొలి సిరీస్లోనే (సౌతాఫ్రికాపై) చారిత్రక సిరీస్ సాధించాడు. 26 టెస్ట్ల్లో లంక జట్టు సారధిగా వ్యవహరించిన కరుణరత్నే.. 10 విజయాలు, 7 డ్రాలు, 9 పరాజయాలను ఎదుర్కొన్నాడు. టెస్ట్ కెరీర్లో 84 మ్యాచ్లు ఆడిన కరుణరత్నే.. 39.94 సగటున డబుల్సెంచరీ, 14 సెంచరీలు, 34 హాఫ్ సెంచరీల సాయంతో 6230 పరుగులు చేశాడు. లంక తరఫున 34 వన్డేలు ఆడిన కరుణరత్నే.. 6 అర్ధశతకాల సాయంతో 767 పరుగులు చేశాడు. ఇదిలా ఉంటే, వెల్లింగ్టన్ వేదికగా న్యూజిలాండ్తో జరిగిన రెండో టెస్టులో శ్రీలంక ఇన్నింగ్స్ 58 పరుగుల తేడాతో పరాజయంపాలైంది. ఫలితంగా రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్ను కివీస్ 2-0తో క్లీన్ స్వీప్ చేసింది. ఈ మ్యాచ్తో డబ్ల్యూటీసీ 2021-23 సీజన్ ముగియగా.. పాయింట్ల పట్టికలో శ్రీలంక ఐదో స్థానంలో, న్యూజిలాండ్ ఆరో స్థానంలో నిలిచాయి. -
గుజరాత్ జెయింట్స్ కెప్టెన్గా బెత్ మూనీ
మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) టి20 క్రికెట్ టోరీ్నలో పాల్గొనే గుజరాత్ జెయింట్స్ జట్టుకు ఆస్ట్రేలియా ఓపెనర్ బెత్ మూనీ కెపె్టన్గా... భారత ఆల్రౌండర్ స్నేహ్ రాణా వైస్ కెపె్టన్గా వ్యవహరించనున్నారు. మార్చి 4 నుంచి 26 వరకు ముంబైలో తొలి డబ్ల్యూపీఎల్ జరగనుంది. 29 ఏళ్ల మూనీ ఇప్పటి వరకు 83 అంతర్జాతీయ టి20 మ్యాచ్లు ఆడి 2 సెంచరీలు, 18 అర్ధ సెంచరీల సహాయంతో 2,380 పరుగులు చేసింది. -
ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ గా వార్నర్
న్యూఢిల్లీ: ఈ ఏడాది ఐపీఎల్ టోర్నీలో పాల్గొనే ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు ఆస్ట్రేలియా ఓపెనర్ వార్నర్ కెప్టెన్ గా వ్యవహరిస్తాడు. భారత జట్టు ఆల్రౌండర్ అక్షర్ పటేల్ను వైస్ కెప్టెన్ గా నియమించారు. ఢిల్లీ జట్టుకు కెప్టెన్ గా ఉన్న రిషభ్ పంత్ కారు ప్రమాదంలో గాయపడి ఈ ఏడాది ఐపీఎల్ టోర్నీకి దూరమయ్యాడు. దాంతో పంత్ స్థానంలో వార్నర్ను సారథిగా ఎంపిక చేయాల్సి వచ్చింది. గతంలో వార్నర్ నాలుగున్నర సీజన్లు సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుకు కెప్టెన్గా వ్యవహరించాడు. వార్నర్ సారథ్యంలో 2016లో సన్రైజర్స్ జట్టు ఐపీఎల్ విజేతగా నిలిచింది. -
ఆర్సీబీ కెప్టెన్గా స్మృతి మంధాన
వచ్చే నెలలో ముంబైలో జరిగే మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) టి20 క్రికెట్ టోర్నీలో పాల్గొనే రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్టు కెప్టెన్గా స్మృతి మంధానను నియమించారు. భారత జట్టు వైస్ కెప్టెన్ అయిన స్మృతిపై ఇటీవల జరిగిన వేలం కార్యక్రమంలో ఆర్సీబీ రూ. 3 కోట్ల 40 లక్షలు వెచ్చించి జట్టులోకి తీసుకుంది. స్మృతికి ఆర్సీబీ నాయకత్వ బాధ్యతలు అప్పగిస్తున్నట్లు పురుషుల ఐపీఎల్ టోర్నీలో ఆర్సీబీ కెప్టెన్గా ఉన్న డు ప్లెసిస్, మాజీ సారథి విరాట్ కోహ్లి ట్విటర్లో ప్రకటించడం విశేషం. -
Captain Shiva Chouhan: సియాచిన్ పై వీర వనిత
ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన సరిహద్దు రక్షణ స్థానం సియాచిన్లో మొట్టమొదటిసారిగా ఒక మహిళా ఆఫీసర్ దళాధిపతిగా నియమితురాలయ్యింది. 15 వేల అడుగున ఎత్తున దేశ రక్షణకు నిలిచిన కెప్టెన్ శివ చౌహాన్ ఈపోస్ట్ పొందడానికి ఎంతో కష్టతరమైన ట్రయినింగ్ను పూర్తి చేశారు. శివ చౌహాన్ వివరాలు. గతంలో సియాచిన్కు విధి నిర్వహణకు పంపే సైనికులతో అధికారులు ‘మీరు ముగ్గురు వెళితే ఇద్దరే తిరిగి వస్తారు’ అని హెచ్చరించి పంపేవారు. ‘ఇద్దరే తిరిగి వచ్చినా దేశం కోసంపోరాడతాం’ అని సైనికులు సమరోత్సాహంతో వెళ్లేవారు. అయితే వారి ప్రథమ శత్రువు పాకిస్తాన్ కాదు. ప్రతికూలమైన ప్రకృతే. మైనస్ 55 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత, తీవ్రమైన చలి గాలులు, హిమపాతం, కాలు జారితే ఆచూకీ తెలియని మంచులోయలు... సియాచిన్లో 35 అడుగుల ఎత్తు మేరకు కూడా మంచు పడుతుందంటే ఊహించండి. ప్రపంచంలోనే ఎత్తయిన యుద్ధస్థావరమైన సియాచిన్ అటు పాకిస్తాన్ నుంచి ఇటు చైనా నుంచి రక్షణ ΄పొందడానికి ఉపయోగపడే కీలక్రపాంతం. అక్కడ ఇన్నాళ్లు మగవారే విధులు నిర్వహించారు. మొదటిసారి ఒక మహిళా ఆఫీసర్ అడుగు పెట్టింది ఆమె పేరే శివ చౌహాన్. 1984 నుంచి దేశ విభజన సమయంలో వాస్తవాధీన రేఖకు అంచున మానవ మనుగడకు ఏమాత్రం వీలు లేని సియాచిన్ ్రపాంతాన్ని అటు పాకిస్తాన్ కాని ఇటు ఇండియాగాని పట్టించుకోలేదు. కాని 1984లో దాని మీద ఆధిపత్యం కోసం పాకిస్తాన్ ప్రయత్నిస్తున్నదని తెలుసుకున్న భారత్ సియాచిన్ అధీనం కోసం హుటాహుటిన రంగంలో దిగి ‘ఆపరేషన్ మేఘదూత్’ పేరుతో విజయవంతమైన సైనిక చర్య చేయగలిగింది. ఆ తర్వాత 1999 వరకూ ఇరు పక్షాల మధ్య చర్యలు, ప్రతిచర్యలు సాగాయి. ‘వాస్తవ మైదాన స్థానరేఖ’ను ఇరుపక్షాలు అంగీకరించి అక్కడ సైనిక స్థావరాలు నిర్మించుకున్నా మంచు ఖండం వంటి సియాచిన్ మీద భారత్ గాని, పాకిస్తాన్గాని తన స్థావరాలను తీసేయలేదు. ఇప్పటివరకూ ఇరువైపులా అక్కడ 2000 మంది సైనికులు మరణించారని అంచనా. వారిలో ఎక్కువ మంది కేవలం ప్రతికూల వాతావరణానికే మరణించారు. సైనిక కాల్పుల్లో కాదు. అడుగు పెట్టిన ఆఫీసర్ సంప్రదాయిక విధానాలతోనే నడిచే ఇండియన్ ఆర్మీ మహిళల ప్రవేశాన్ని అన్నిచోట్ల అంగీకరించరు. ఇంతవరకూ 9000 అడుగుల ఎత్తులో ఉన్న సియాచిన్ బేస్ క్యాంప్ వరకే మహిళా ఆఫీసర్లను అనుమతించింది ఆర్మీ. కాని 15000 అడుగుల నుంచి 20 వేల అడుగుల (బాణాసింగ్ బంకర్) ఎత్తు వరకూ సియాచిన్లో వివిధ స్థానాలలో ఉండే స్థావరాలకు మహిళా ఆఫీసర్లను పంపలేదు. మొదటిసారిగా శివ చౌహాన్కు ఆర్మీ సియాచిన్ హెడ్క్వార్టర్స్లోపోస్టింగ్ ఇచ్చింది. రాజస్థాన్ సాహసి శివ చౌహాన్ది రాజస్థాన్లోని ఉదయ్పూర్. 11వ ఏట తండ్రి మరణిస్తే గృహిణి అయిన తల్లి శివ చౌహాన్ను పెంచింది. ‘మా అమ్మే నాకు చిన్నప్పటి నుంచి ఆర్మీ మీద ఆసక్తి కలిగించింది’ అంటుంది శివ. ఉదయ్పూర్లో సివిల్ ఇంజనీరింగ్ పూర్తి చేసిన శివ 2020 సర్వీస్ సెలక్షన్ బోర్డ్ పరీక్షలు రాసి ఆలిండియా మొదటి ర్యాంకు సాధించింది. చెన్నైలో ట్రైనింగ్ అయ్యాక 2021లో లెఫ్టినెంట్గా ఇంజనీర్ రెజిమెంట్లో బాధ్యత తీసుకుంది. ఆ వెంటనే కెప్టెన్ హోదా ΄పొందింది. 2022 కార్గిల్ దివస్ సందర్భంగా సియాచిన్ వార్ మెమోరియల్ నుంచి కార్గిల్ వార్ మెమోరియల్ వరకు 508 కిలోమీటర్ల సైకిల్ యాత్రను శివ చౌహాన్ తన నాయకత్వంలో పూర్తి చేయడంతో ఆమె అధికారుల దృష్టిలో పడింది. దాంతో ఆమెను సియాచిన్లో టీమ్ లీడర్గాపోస్ట్ వరించింది. త్రివిధ దళాలలో చరిత్ర సృష్టిస్తున్న స్త్రీల సరసన ఇప్పుడు శివ చౌహాన్ నిలిచింది. కఠిన శిక్షణ సియాచిన్లో ఏ స్థావరంలో విధులు నిర్వహించాలన్నా సియాచిన్ హెడ్క్వార్టర్స్లోని బేటిల్ స్కూల్లో మూడు నెలల శిక్షణ పూర్తి చేయాలి. మిగిలిన మగ ఆఫీసర్లతో పాటు శివ ఈ శిక్షణను పూర్తి చేసింది. ఇందులో కఠినమైన మంచు గోడలను అధిరోహించడం, మంచులోయల్లో పడినవారిని రక్షించడం, శారీరక ఆరోగ్యం కోసం డ్రిల్ పూర్తి చేయగలగడం వంటి అనేక ట్రయినింగ్లు ఉంటాయి. ‘ఆమె శిక్షణను విజయవంతంగా పూర్తి చేసింది. మూసను బద్దలు కొట్టింది’ అని ఆర్మీ అధికారులు అన్నారు. -
Team India: 3 ఫార్మాట్లకు 3 వేర్వేరు జట్లు, కెప్టెన్లు, కోచ్లు..!
Anil Kumble: టీ20 వరల్డ్కప్-2022 సెమీఫైనల్లో టీమిండియా ఓటమి అనంతరం భారత మాజీ కెప్టెన్, కోచ్ అనిల్ కుంబ్లే ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. భవిష్యత్తులో టీమిండియా సక్సెస్ సాధించేందుకు తోడ్పడే కీలక ప్రతిపాదనతో ముందుకొచ్చాడు. ఇంగ్లండ్, ఆస్ట్రేలియా ఫాలో అవుతున్న.. '3 ఫార్మాట్లకు 3 వేర్వేరు జట్లు' అనే ఫార్ములాను టీమిండియా కూడా ఫాలో అవ్వాలని సూచించాడు. 2021లో ఆసీస్.. తాజాగా ముగిసిన వరల్డ్కప్ (2022)లో ఇంగ్లండ్ సక్సెస్ మంత్ర ఇదేనని పేర్కొన్నాడు. టెస్ట్ల్లో , పరిమిత ఓవర్ల క్రికెట్లో వేర్వేరు కోచ్లు, వేర్వేరు కెప్టెన్లతో ఇంగ్లండ్ జట్టు అద్భుత ఫలితాలు సాధిస్తున్న నేపథ్యంలో జరుగుతున్న చర్చపై కుంబ్లే తన అభిప్రాయాన్ని ఈమేరకు వెల్లడించాడు. మూడు ఫార్మాట్లకు ముగ్గురు కెప్టెన్లు, ముగ్గురు కోచ్లు ఉండాలని కచ్చితంగా చెప్పలేను కానీ, జట్టు మాత్రం డిఫరెంట్గా (ఆయా ఫార్మాట్లలో స్పెషలిస్ట్లతో కూడిన జట్టు) ఉంటే తప్పక సత్ఫలితాలు వస్తాయని కాన్ఫిడెంట్గా చెప్పాడు. ముఖ్యంగా టీ20లకు ప్రత్యేక జట్టు చాలా అవసరమని, ఈ ఫార్మాట్లో హార్డ్ హిట్టర్లు, ఆల్రౌండర్లు, టీ20 స్పెషలిస్ట్ల పాత్ర చాలా కీలకమని, 2021 వరల్డ్కప్లో ఆస్ట్రేలియా, తాజాగా ముగిసిన వరల్డ్కప్లో ఇంగ్లండ్ ఈ ఫార్ములా అమలు చేసే విజయాలు సాధించాయని అభిప్రాయపడ్డాడు. ఇంగ్లండ్ జట్టులో లివింగ్స్టోన్, ఆసీస్ టీమ్లో స్టొయినిస్ లాంటి ఆటగాళ్లు 6, 7 స్థానాల్లో బ్యాటింగ్ చేస్తున్నారంటే, ఆయా జట్ల కూర్పు ఎలా ఉందో ఇట్టే అర్ధమవుతుందని ఉదహరించాడు. కుంబ్లే చేసిన ఈ ప్రతిపాదనకు ఆసీస్ మాజీ ఆల్రౌండర్ టామ్ మూడీ కూడా మద్దతు పలికాడు. అన్ని జట్లు ఈ విషయం గురించి సీరియస్గా ఆలోచించాలని సూచించాడు. కాగా, విశ్వవిజేత ఇంగ్లండ్ జట్టుకు టెస్ట్ల్లో, పరిమిత ఓవర్ల ఫార్మాట్లో వేర్వేరు కోచ్లు, కెప్టెన్లు, జట్లు ఉన్న విషయం తెలిసిందే. ఆ జట్టుకు టెస్ట్ల్లో బ్రెండన్ మెక్కల్లమ్ కోచ్గా, బెన్ స్టోక్స్ కెప్టెన్గా వ్యవహరిస్తుండగా.. పరిమిత ఓవర్ల ఫార్మాట్లో మాథ్యూ మాట్ కోచ్గా, జోస్ బట్లర్ కెప్టెన్గా ఉన్నాడు. టీ20ల్లో మాజీ ఛాంపియన్ అయిన ఆసీస్కు టెస్ట్ల్లో, లిమిటెడ్ ఓవర్స్ ఫార్మాట్లో వేర్వేరు కోచ్లు లేనప్పటికీ.. కెప్టెన్లు (కమిన్స్, ఫించ్), జట్టు పూర్తిగా వేరుగా ఉంది. టీమిండియా విషయానికొస్తే.. మన జట్టు మూడు ఫార్మాట్లలో ఒకే కెప్టెన్ (రోహిత్ శర్మ), ఒకే కోచ్ (ద్రవిడ్), ఇంచుమించు ఒకే జట్టు కలిగి ఉంది. అప్పుడప్పుడు అంతగా ప్రాధాన్యత లేని సిరీస్లకు రెస్ట్ పేరుతో కెప్టెన్కు, కోచ్కు రెస్ట్ ఇస్తుంది. ఆ సమయంలో కోచ్గా ఎన్సీఏ డైరెక్టర్ వీవీఎస్ లక్ష్మణ్ కోచ్గా వ్యవహరిస్తుంటాడు. కెప్టెన్ల మాట చెప్పనక్కర్లేదు. రోహిత్ గైర్హాజరీలో ఒక్కో సిరీస్కు ఒక్కో ఆటగాడు కెప్టెన్గా పని చేశాడు. గత ఏడాది కాలంలో భారత్ ఏకంగా ఏడుగురు కెప్టెన్లను మార్చింది. చదవండి: ఐపీఎల్ 2023కు ముగ్గురు ఆసీస్ స్టార్లు డుమ్మా.. దేశ విధులే ముఖ్యమంటూ..! -
3 వారాలకే ఓటీటీకి కెప్టెన్ చిత్రం.. స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే..
తమిళ హీరో ఆర్య హీరోగా ఇటీవల తెరకెక్కిన చిత్రం ‘కెప్టెన్’. శక్తి సౌందన్ రాజన్ దర్శకత్వంలో సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రం సెప్టెంబర్ 8న తమిళ్, తెలుగు భాషల్లో విడుదలైంది. దాదాపు 30 కోట్ల బడ్జెట్తో నిర్మాత టి. కిషోర్ తో కలిసి ఆర్య కూడా నిర్మించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద యావరేజ్ టాక్ తెచ్చుకుంది. ఇక కలెక్షన్స్ పరంగా నిర్మాతలకు ఈ మూవీ భారీ నష్టాలను మిగిల్చిందని సినీ విశ్లేషకులు అంటున్నారు. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ చిత్రం ఓటీటీకి రిలీజ్కు సిద్ధమైంది. చదవంండి: కొడుకు చంద్రహాస్పై ట్రోల్స్.. నటుడు ప్రభాకర్ షాకింగ్ రియాక్షన్ విడుదలైన మూడు వారాలకే కెప్టెన్ ఓటీటీకి రావడం గమనార్హం. ప్రముఖ ఓటీటీ సంస్థ జీ స్టూడియోస్ ఈ మూవీ ఓటీటీ రైట్స్ను సొంతం చేసుకుంది. సెప్టెంబర్ 30 నుంచి ‘జీ5’లో కెప్టెన్ మూవీ తెలుగు, తమిళ భాషల్లో అందుబాటులోకి రానుంది. తాజా ఇదే విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. కాగా తెలుగులో శ్రేష్ట్ మూవీస్ సమర్పించిన ఈ చిత్రానికి ఇమ్మాన్ సంగీతం అందిస్తున్నాడు. ఇందులో ఆర్యకు జోడిగా ఐశ్వర్య లక్ష్మి నటించగా... సీనియర్ నటి సిమ్రాన్ మహిళా ఆర్మీ అధికారినిగా స్పెషల్ రోల్ పోషించింది. చదవండి: ‘సీతారామం’ చూసిన ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్.. హీరోయిన్ గురించి ఏమన్నదంటే.. #Captain OTT RELEASE September 30 @ZEE5India pic.twitter.com/lnHBo9cSQZ — OTTGURU (@OTTGURU1) September 21, 2022 -
‘కెప్టెన్’ మూవీ రివ్యూ
టైటిల్ : కెప్టెన్ నటీనటులు : ఆర్య, ఐశ్యర్య లక్ష్మీ, సిమ్రాన్, హరీశ్ ఉత్తమన్, కావ్యశెట్టి తదితరులు నిర్మాణ సంస్థ: ది షో పీపుల్, థింక్ స్టూడియోస్, ఎస్ఎన్ఎస్ ప్రొడక్షన్స్ తెలుగులో విడుదల: శ్రేష్ఠ్ మూవీస్ దర్శకత్వం: శక్తి సౌందర్ రాజన్ సంగీతం : డి ఇమాన్ సినిమాటోగ్రఫీ: ఎస్ యువ విడుదల తేది: సెప్టెంబర్8,2022 కథేంటంటే.. భారత్లోని ఈశాన్య అటవీ ప్రాంంతంలో, సెక్టార్ 42కి చెందిన అటవీ ప్రాంతంలో కొన్నేళ్లుగా పౌర, సైనిక కార్యకలాపాలు లేవు. ఆ ప్రదేశానికి వెళ్లిన వారు ప్రాణాలతో తిరిగి రావడం లేదు. వారికి వారే షూట్ చేసుకొని చనిపోతున్నారు. దీంతో ఈ మిస్టరీని తెలుసుకోవడానికి భారత ఆర్మీకి చెందిన కెప్టెన్ విజయ్ కుమార్(ఆర్య) బ్యాచ్ని రంగంతోకి దించుతుంది. కెప్టెన్ విజయ్కి ఏ ఆపరేషన్ అయినా విజయవంతంగా పూర్తి చేస్తాడనే పేరుంది. తన టీమ్తో కలిసి స్పెషల్ ఆపరేషన్స్ చేపడుతుంటాడు. అందుకే ఈ డేంజరస్ ఆపరేషన్ని కెప్టెన్ విజయ్కి అప్పగిస్తుంది ప్రభుత్వం. విజయ్ తన బృందంతో కలిసి సెక్టార్ 42 ప్రదేశానికి వెళ్తాడు. అక్కడ మినటార్స్(వింత జీవులు) ఉన్నాయని, వాటివల్లే అక్కడికి వెళ్లిన వాళ్లు ప్రాణాలతో తిగిరి రావడంలేదని విజయ్ గుర్తిస్తాడు. మరి విజయ్ తన ప్రాణాలను పణంగా పెట్టి వాటిని ఎలా ఎదుర్కొన్నాడు? అసలు ఆ వింత జీవులు ఏంటి? సైనికులు తమకు తాము షూట్ చేసుకునేలా మినటార్స్ ఏం చేస్తున్నాయి? సైంటిస్ట్ కీర్తి(సిమ్రాన్) చేసే పరిశోధన ఏంటి? చివరకు కెప్టెన్ విజయ్ మినటార్స్ని అంతం చేశాడా? లేదా? అనేదే మిగతా కథ. ఎలా ఉందంటే.. ‘కెప్టెన్’ ట్రైలర్ విడుదలైనప్పటి నుంచి సినిమాపై అసక్తి పెరిగింది. వింత జీవులతో ఇండియన్ ఆర్మీ ఫైట్ చేయడం అనే కొత్త పాయింట్తో సినిమా తెరకెక్కడంతో అందరికి దృష్టి ‘కెప్టెన్’పై పడింది. అయితే కాన్సెప్ట్ కొత్తగా ఉన్నా.. దానికి తగ్గ కథ, కథనం లేకపోవడం సినిమాకు పెద్ద మైనస్. దర్శకుడు శక్తి సౌందర్ రాజన్ హాలీవుడ్ చిత్రాలను చూసి కథను రాసుకున్నట్లు తెలుస్తోంది. మ్యాన్ వర్సస్ క్రియేచర్ జానర్లో ఈ సినిమా సాగుతుంది. అందులో అయినా ఏదైనా కొత్తదనం ఉందా అంటే అదీ లేదు. సెక్టార్ 42లో వింత జీవులు ఉంటాయి వాటితో కెప్టెన్ విజయ్ యుద్దం చేయాలి అనేది ఫస్టాఫ్ పాయింట్ అయితే.. ఎలా చేశాడనేది సెకండాఫ్. దీనికి కథను అల్లడానికి ఫస్టాఫ్లో అసవరమైన సీన్స్ అన్ని బలవంతంగా చొప్పించాడు దర్శకుడు. ఆ సీన్స్ కూడా ఆకట్టుకున్నట్లు ఉంటుందా అంటే అదీ లేదు. ఇక సినిమాలో లాజిక్ లేని సన్నివేశాలు చాలా ఉంటాయి. సెక్టార్ 42కి వెళ్లిన సైనికులు మరణిస్తారని చూపించిన దర్శకుడు.. వారిని తీసుకురావడానికి వెళ్లిన సైనికులకు ఏమి కాలేదన్నట్టు సన్నివేశాలు రూపొందించడం.. గన్తో షూట్ చేసే మినటార్స్ మరణించడం లేదని తెలిసినా.. మళ్లీ మళ్లీ సైనికులు గన్స్ పట్టుకొనే ఆ ప్రదేశానికి వెళ్లడం.. సైంటిస్ట్ కీర్తికి కెప్టెన్ జవాన్ సైన్స్ గురించి చెప్పడం.. ఆమె ఆశ్యర్యంగా చూడడం..ఇలా చాలా సన్నివేశాల్లో లాజిక్ మిస్సవుతుంది. అదే సమయంలో హీరో మాత్రం ఎందుకు స్పృహ కోల్పోవడం లేదనడానికి మాత్రం సరైన కారణం చెప్పాడు. వీఎఫ్ఎక్స్ అంతగా ఆకట్టుకోలేదు. కథకు కీలకమైన క్రీచర్ని కూడా సరిగా చూపించలేకపోయారు. మినటార్స్తో వచ్చే ఫైట్ సీన్స్ కూడా అంతగా ఆకట్టుకోలేకపోతాయి. హాలీవుడ్ లో ఈ తరహా సినిమాలు చాలానే వచ్చాయి. ఆ చిత్రాలను చూడని ప్రేక్షకులకు ‘కెప్టెన్’ కాస్త కొత్తగా కనిపిస్తాడు. ఎవరెలా చేశారంటే.. కెప్టెన్ విజయ్ కుమార్ పాత్రకు ఆర్య న్యాయం చేశాడు. ఉన్నంతలో యాక్షన్స్ సీన్స్ని కూడా అదరగొట్టేశాడు. అతని టీమ్లోని సభ్యులు కూడా చక్కటి నటనను కనబరిచారు. ఐశ్వర్య లక్ష్మి రెండు సీన్స్, ఓ పాటలో కనిపిస్తుంది అంతే. ఆమె పాత్రకు పెద్దగా ప్రాధాన్యత ఉండదు. సైంటిస్ట్ కీర్తిగా సిమ్రాన్ పర్వాలేదనిపించింది. అయితే ఆమె పాత్రను మరింత బలంగా తీర్చిదిద్దాల్సింది. మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. ఇక టెక్నికల్ విషయానికొస్తే.. ఎస్ యువ సినిమాటోగ్రఫీ బాగుంది. ఇమాన్ నేపథ్య సంగీతం ఆట్టుకునేలా ఉంటుంది. విజువల్ ఎఫెక్ట్స్ అంతగా ఆకట్టుకోలేకపోతాయి. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగినట్లుగా ఉన్నాయి. -
హీరో ఆర్య 'కెప్టెన్' మూవీ స్టిల్స్
-
నితిన్ నాకు మంచి స్నేహితుడు: ఆర్య
‘‘ప్రేక్షకుల అభిరుచులు మారాయి. కొత్తదనం ఉంటేనే థియేటర్స్కు వస్తునారు. ఓటీటీ, శాటిలైట్ రైట్స్లతో నిర్మాతలకు కాస్త డబ్బులు వస్తునప్పటికీ, ఓ సినిమా థియేటర్స్లో విడుదలై హిట్ సాధించినప్పుడు లభించేదే నిజమైన సక్సెస్ అని నా ఫీలింగ్’’ అనారు హీరో ఆర్య. ‘టెడ్డీ’ సినిమా తర్వాత హీరో ఆర్య, దర్శకుడు శక్తి సౌందర్ రాజన్ కాంబినేషన్ లో రూపొందిన తాజా చిత్రం ‘కెప్టెన్ ’. ఆర్య నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 8న తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్ కానుంది. శ్రేష్ఠ్ మూవీస్ ద్వారా సుధాకర్ రెడ్డి ఈ సినిమాను తెలుగు ప్రేక్షకులకు అందిస్తునారు. ఈ సందర్భంగా మంగళవారం విలేకర్ల సమావేశంలో ఆర్య చెప్పిన విశేషాలు... ► ‘టెడ్డీ’ తర్వాత శక్తి సౌందర్ రాజన్ నాకు ‘కెప్టెన్ ’ కథ చెప్పారు. మరో దర్శకుడు అయితే ‘కెప్టెన్ ’కు నో చెప్పేవాడినేమో. కానీ శక్తి సౌందర్ రాజన్ తో నాకు పని చేసిన అనుభవం ఉంది. ఆయనకు సీజీ (కంప్యూటర్ గ్రాఫిక్స్)పై ఎంత పట్టు ఉందో నాకు అవగాహన ఉంది. అందుకే ‘కెప్టెన్ ’ సినిమాకు ఓకే చెప్పాను. ఈ సినిమా కోసం దాదాపు ఏడాది పాటు ప్రీ ప్రొడక్షన్ వర్క్ చేశాం. ► ఈ సినిమాలో ఆర్మీ ఆఫీసర్ కెప్టెన్ విజయ్ కుమార్ పాత్ర చేశాను. ఓ వింత జీవితో పోరాటం చేయడమే ‘కెప్టె’ కథ. విజయ్ కుమార్, అతని బృందం ఈ వింత జీవితో ఎందుకు పోరాటం చేయాల్సి వచ్చింది? ఈ వింత జీవి వల్ల మానవాళికి ఎటువంటి ప్రమాదం పొంచి ఉంది? అనే అంశాల సమాహారమే ఈ సినిమా కథాంశం. ఈ సినిమాలో ఆర్మీ బ్యాక్డ్రాప్ ఉంది కాబట్టి ప్రతి అంశాని చాలా జాగ్రత్తగా డీల్ చేశాం. మాకు తెలియకుండా ఏదైనా పొరపాటు జరిగితే అది ఆర్మీ వారిని తక్కువ చేసినట్లుగా ఉండకూడదనుకుని సెట్లో ఓ రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్ను నియమించుకునాం. ► ఈ సినిమాలోని క్లైమాక్స్ సనివేశాల చిత్రీకరణ నాకు చాలెంజింగ్గా అనిపించింది. భూమికి వంద అడుగుల ఎత్తులో, నీటిలో 20 అడుగుల లోతులో కొని సనివేశాలను చిత్రీకరించాం. ట్రైలర్, టీజర్స్లో కనిపించినట్లుగా వింత జీవి నా ముందు ఉండదు. ఉందని ఊహించుకుని యాక్ట్ చేయాలి. ఇది చాలా కష్టంగా అనిపించింది. ఇక వింత జీవి అనేది గ్రాఫిక్స్ వర్క్ మాత్రమే. ► ‘టెడ్డీ’, ‘సారపట్టై’.. ఇప్పుడు ‘కెప్టెన్ ’...ఇలా వరుసగా ప్రయోగాత్మక సినిమాలు చేస్తునాను అంటే కమర్షియల్ సినిమాలకు దూరంగా ఉంటానని కాదు. సాధారణంగా నేను ఎక్కువ రిస్క్ తీసుకుంటుంటాను. రిస్కీ స్క్రిప్ట్స్ ఉన దర్శకులు వేరే హీరోలు ఎవరూ చేయకపోతే నా దగ్గరకు వస్తారు. నేనైతే ప్రొడ్యూస్ కూడా చేస్తానని నాతో చాన్ ్స కూడా తీసుకుంటుంటారు. ‘కెప్టెన్ ’ సినిమాకు సీక్వెల్ తీసే స్కోప్ ఉంది. అయితే ఈ సినిమా విజయంపై మాత్రమే అది ఆధారపడి ఉంది. ► నితిన్ నాకు మంచి స్నేహితుడు. కమల్హాసన్ గారి ‘విక్రమ్’ సినిమా శ్రేష్ఠ్ మూవీస్ ద్వారానే విడుదలై మంచి విజయం సాధించింది. ఈ లిస్ట్లో ఇప్పుడు ‘కెప్టెన్ ’ సినిమా కూడా చేరుతుందనే నమ్మకం ఉంది. మంచి కథ కుదిరితే తెలుగులో స్ట్రయిట్ సినిమా చేస్తాను. అలాగే కథ నచ్చితే నా భార్య సాయేషాతో కలిసి సినిమా చేసేందుకు సిద్ధంగా ఉనాను. -
ఈ వారం ఓటీటీ, థియేటర్లో సందడి చేసే చిత్రాలివే
టాలీవుడ్లో ప్రస్తుతం చిన్న సినిమాల హవా నడుస్తోంది. గతవారం కోబ్రా మినహా అన్ని చిన్న చిత్రాలే విడుదలయ్యాయి. వాటిలో ఒకటి రెండు చిత్రాలు మంచి టాక్ని సంపాదించుకోగా..మరికొన్ని బాక్సాఫీస్ వద్ద దారుణంగా బోల్తాపడ్డాయి. ఇక ఈ వారం కూడా పలు చిన్న చిత్రాలు అటు థియేటర్స్లో ఇటు ఓటీటీలో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాయి. వాటిపై ఓ లుక్కేద్దాం. కెప్టెన్ తమిళ హీరో ఆర్య హీరోగా తాజాగా తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ చిత్రం కెప్టెన్. శక్తి సౌందన్ రాజన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా సెప్టెంబర్ 8న ప్రేక్షకులు ముందుకు రాబోతోంది. తెలుగులో శ్రేష్ట్ మూవీస్ సమర్ఫిస్తున్న ఈ చిత్రానికి ఇమ్మాన్ సంగీతం అందిస్తున్నాడు. ఇందులో ఆర్యకు జోడిగా ఐశ్వర్య లక్ష్మి నటించింది. బ్రహ్మాస్త్రం రణ్బీర్ కపూర్, ఆలియా భట్ జంటగా ఆయాన్ ముఖర్జీ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘బ్రహ్మాస్త్ర’. స్టార్ స్టూడియోస్, ధర్మ ప్రొడక్షన్స్, ప్రైమ్ ఫోకస్, స్టార్లైట్ పిక్చర్స్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 9న విడుదలవుతోంది. దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి దక్షిణాదిలో ఈసినిమాని సమర్పిస్తున్నారు. తెలుగులో ‘బ్రహ్మాస్త్రం’ పేరుతో విడుదలవుతోంది. ఒకే ఒక జీవితం శ్రీ కార్తీక్ దర్శకుడిగా పరిచయం అవుతూ, శర్వానంద్, రీతూ వర్మ జంటగా నటించిన చిత్రం ‘ఒకే ఒక జీవితం’ (తమిళంలో ‘కణం’). అక్కినేని అమల, ‘వెన్నెల’ కిశోర్, ప్రియదర్శి కీలక పాత్రలు పోషించారు. ఎస్ఆర్ ప్రకాశ్బాబు, ఎస్ఆర్ ప్రభు నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 9న రిలీజ్ కానుంది. శ్రీరంగాపురం వినాయక్ దేశాయ్, పాయల్ ముఖర్జీ, వైష్ణవీ సింగ్, చిందనూరు నాగరాజు, సత్యప్రకాశ్ ముఖ్య తారాగణంగా తెరకెక్కిన చిత్రం ‘శ్రీరంగాపురం’.ఎమ్ఎస్. వాసు దర్శకత్వంలో చిందనూరు నాగరాజు నిర్మించిన ఈ సినిమా సెస్టెంబర్ 9న విడుదల కానుంది. కొత్తకొత్తగా అజయ్, వీర్తి వఘాని హీరో హీరోయిన్లుగా హనుమాన్ వాసంశెట్టి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘కొత్త కొత్తగా’. బిజి గోవిందరాజు సమర్పణలో మురళీధర్ రెడ్డి ముక్కర నిర్మించిన ఈ చిత్రం ఈ శుక్రవారం(సెప్టెంబర్9) విడుదల కానుంది. ఓటీటీలో విడుదలయ్యే సినిమాలు డిస్నీ+హాట్స్టార్ థోర్ లవ్ అండ్ థండ్(తెలుగు), సెప్టెంబర్ 8 గ్రోయింగ్ అప్(వెబ్ సిరీస్) సెప్టెంబర్ 8 హైడోస్.. సెప్టెంబర్ 8 పినాచో.. సెప్టెంబర్ 8 కార్స్ ఆన్ ది రోడ్(హాలీవుడ్).. సెప్టెబర్ 8 వెడ్డింగ్ సీజన్(హాలీవుడ్) సెప్టెంబర్ 8 నెట్ఫ్లిక్స్ వన్స్ అపాన్ ఏ స్మాల్ టౌన్(సిరీస్), సెప్టెంబర్ 5 రిక్ అండ్ మార్టీ:సీజన్-6: ఎపిసోడ్-1(వెబ్ సిరీస్).. సెప్టెంబర్ 5 అన్టోల్డ్: ది రేస్ ఆఫ్ సెంచరీ(హాలీవుడ్) సెప్టెంబర్6 ఇండియన్ ప్రేడేటర్: ది డైరీ ఆఫ్ ఏ సీరియల్ కిల్లర్(డాక్యమెంటరీ) సెప్టెంబర్ 7 చెప్స్ టేబుల్: పిజ్జా ఏ క్వైట్ ప్లేస్(డాక్యుమెంటరీ) సెప్టెంబర్ 7 ది అంత్రాక్స్ అటాక్స్(హాలీవుడ్) సెప్టెంబర్ 8 ఏక్ విలన్ రిటర్న్స్ (బాలీవుడ్) సెప్టెంబర్ 9 కోబ్రా కాయ్: సీజన్-5(వెబ్ సిరీస్) సెప్టెంబర్ 9 మోర్టల్ కాంబ్యాట్(హాలీవుడ్) సెప్టెంబర్ 11 అమెజాన్ ప్రైమ్ స్టూడియో 666.. సెప్టెంబర్ 5 హీ ఈజ్ సైకోమెట్రిక్- సెప్టెంబర్ 7 రిప్లై 1994- సెప్టెంబర్ 7 ప్రిజన్ ప్లే బుక్- సెప్టెంబర్ 7 ఎలీన్(Aline)-సెప్టెంబర్ 9 (వీటితో పాటు మరికొన్ని వెబ్ సిరీస్, టాక్ షోలు ఈ వారంలో స్ట్రీమింగ్ కానున్నాయి) ఆహా డ్యాన్స్ ఐకాన్(రియాల్టీ షో) సెప్టెంబర్ 11 జీ5 పాపన్(మూవీ) సెప్టెంబర్ 7 ఎంఎక్స్ ప్లేయర్ యునికి యారీ(బాలీవుడ్), సెప్టెంబర్ 9 -
ఏలియన్తో హీరో ఆర్య పోరాటం.. ఆసక్తిగా ‘కెప్టెన్’ ట్రైలర్
తమిళ హీరో ఆర్య హీరోగా తాజాగా తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ చిత్రం కెప్టెన్. శక్తి సౌందన్ రాజన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా సెప్టెంబర్ 8న ప్రేక్షకులు ముందుకు రాబోతోంది, ప్రస్తుతం పోస్ట్ ప్రోడక్షన్ పనులతో పాటు ప్రమోషన్స్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. ఇక మూవీ ప్రమోషన్స్ జోరు పెంచిన మూవీ టీం తాజాగా మూవీ ట్రైలర్ను సోషల్ మీడియా వేదికగా రిలీజ్ చేశారు. ఇండియన్ ఆర్మీ, ఏలియన్లతో చేసే పోరాటం నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా ట్రైలర్ను ఆసక్తిగా మలిచారు. చదవండి: నెపోటిజంపై నోరు విప్పిన నాగ చైతన్య.. ఏమన్నాడంటే ఆర్మీ అధికారులు ఓ గ్రహాంతరవాసితో తలపడే యాక్షన్ సీన్స్ ఉత్కంఠ రేపుతున్నాయి. ఇక ట్రైలర్లోని యాక్షన్ సీన్స్, ఆర్మీ ఆఫీసర్ల అధికారిగా నటి సిమ్రాన్ ఇచ్చే సూచనలు, గ్రహాంతవాసులను ఎదుర్కొనేందుకు ఆర్య వేసే ఎత్తుగడలను వివరిస్తూ సాగిన ఈ ట్రైలర్ సినిమాపై మరింత హైప్ క్రియేట్ చేస్తోంది. కాగా తెలుగులో శ్రేష్ట్ మూవీస్ సమర్ఫిస్తున్న ఈ చిత్రానికి ఇమ్మాన్ సంగీతం అందిస్తున్నాడు. ఇందులో ఆర్యకు జోడిగా ఐశ్వర్య లక్ష్మి నటించింది. -
జింబాబ్వేతో వన్డే సిరీస్.. టీమిండియా కెప్టెన్గా కేఎల్ రాహుల్
ముంబై: జింబాబ్వేలో పర్యటించనున్న భారత వన్డే జట్టు నాయకత్వంలో మార్పు చోటు చేసుకుంది. ఈ సిరీస్కు ఇప్పటికే శిఖర్ ధావన్ను కెప్టెన్గా నియమించగా... ఇప్పుడు అతని స్థానంలో కేఎల్ రాహుల్ను సారథిగా ఎంపిక చేశారు. జులై 30న ప్రకటించిన 15 మంది సభ్యుల జట్టుకు ధావన్ను కెప్టెన్గా ఎంపిక చేశారు. కోవిడ్నుంచి పూర్తిగా కోలుకోకపోవడంతో రాహుల్ను ఈ సిరీస్ను ఎంపిక చేయలేదు. అయితే ఇప్పుడు రాహుల్ ఆరోగ్య పరిస్థితిని వైద్య బృందం పర్యవేక్షించిందని, అన్నీ చక్కబడటంతో అతడిని జట్టులోకి తీసుకున్నామన్న బీసీసీఐ...కెప్టెన్గానూ నియమించింది. దాంతో శిఖర్ ధావన్ వైస్ కెప్టెన్సీకి మారాడు. రాహుల్ను జట్టులోకి తీసుకున్నా, ఎవరినీ తప్పించకుండా 16 మందితో టీమ్ను బోర్డు ప్రకటించింది. భారత్, జింబాబ్వే మధ్య ఈ నెల 18, 20, 22 తేదీల్లో హరారేలో 3 వన్డేలు జరుగుతాయి. జట్టు వివరాల: కేఎల్ రాహుల్ (కెప్టెన్), శిఖర్ ధావన్ (వైస్ కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్, శుబ్మన్ గిల్, దీపక్ హుడా, రాహుల్ త్రిపాఠి, ఇషాన్ కిషన్, సంజు సామ్సన్, వాషింగ్టన్ సుందర్, శార్దుల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, అవేశ్ ఖాన్, ప్రసిధ్ కృష్ణ, దీపక్ చహర్, మొహమ్మద్ సిరాజ్. చదవండి: ముంబై జట్టుకు గుడ్బై చెప్పనున్న అర్జున్ టెండూల్కర్! -
IPL 2022: ‘ప్రపంచకప్ అందుకోవడమే లక్ష్యం’
అహ్మదాబాద్: ముంబై ఇండియన్స్ తరఫున హార్దిక్ పాండ్యా నాలుగుసార్లు ఐపీఎల్ గెలిచిన జట్టులో భాగంగా ఉన్నాడు. ఇప్పుడు ఐదోసారి ట్రోఫీని అందుకున్న అతనికి ఇది మరింత ప్రత్యేకం. గుజరాత్ టైటాన్స్ కెప్టెన్గా జట్టుకు టైటిల్ అందించిన హార్దిక్ పాండ్యా నాయకుడిగా మరో మెట్టెక్కాడు. కెప్టెన్ కావడం తన బాధ్యతను పెంచిందని, నాయకత్వాన్ని ప్రతీ క్షణం ఆస్వాదించానని అతను వ్యాఖ్యానించాడు. ‘అదనపు బాధ్యత తీసుకునేందుకు నేనెప్పుడూ వెనకడుగు వేయలేదు. ఎప్పుడు అవకాశం లభించినా మిగతా వారిలో స్ఫూర్తి నింపేలా జట్టును ముందుండి నడిపించాలని భావించేవాడిని. నా జట్టు సహచరుల నుంచి ఎలాంటి ప్రదర్శన ఆశిస్తున్నానో వారికంటే ముందు నేను చేసి చూపించాలి. అలా చేస్తేనే దాని ప్రభావం ఉంటుంది. ఐపీఎల్లో నేను అలాగే చేశానని నమ్ముతున్నా’ అని పాండ్యా అన్నాడు. కెప్టెన్గా తొలి ప్రయత్నంలోనే సాధించిన ఐపీఎల్ ట్రోఫీకి తన దృష్టిలో ఎప్పుడూ ప్రత్యేక స్థానం ఉంటుందని అతను చెప్పాడు. ‘గతంలో నాలుగుసార్లు ఐపీఎల్ టైటిల్ గెలిచిన జట్టులో ఉన్నాను. అవి ఎప్పటికీ గుర్తుండిపోతాయి. అయితే ఈసారి నా కెప్టెన్సీలో టైటిల్ గెలిచాం కాబట్టి సహజంగానే ఇది మరింతగా ఇష్టం. ఈ గెలుపు రాబోయే రోజుల్లో ఎందరికో ప్రేరణగా నిలుస్తుంది. ఫైనల్కు వెళ్లిన ఐదుసార్లూ కప్ను అందుకోగలిగిన నేను చాలా అదృష్టవంతుడిని. ఈ రోజు నాది. పైగా లక్షకు పైగా అభిమానులు మాకు అండగా నిలిచారు. మా కష్టానికి దక్కిన ప్రతిఫలమిది’ అని ఈ ఆల్రౌండర్ విశ్లేషించాడు. టి20లు బ్యాటర్ల ఆట మాత్రమే అని చాలా మంది అనుకుంటారని, అయితే ఈ ఫార్మాట్లో బౌలర్లే మ్యాచ్ గెలిపించగలరని హార్దిక్ అభిప్రాయపడ్డాడు. బ్యాటింగ్లో తగినంత స్కోరు లేని సమయంలోనూ మంచి బౌలర్లు ఉంటే మ్యాచ్ను మలుపు తిప్పగలరని అతను అన్నాడు. హార్దిక్ పాండ్యా తన తదుపరి లక్ష్యం ప్రపంచకప్ గెలుచుకోవడమే అని ప్రకటించాడు. టీమిండియా తరఫున మూడు ఐసీసీ టోర్నీలలో భాగంగా ఉన్నా... ఒక్కసారి కూడా అతనికి విజయానందం దక్కలేదు. ‘ఎవరికైనా భారత జట్టు తరఫున ఆడటమనేది ఒక కల. నేను ఇప్పటికే ఎన్నో మ్యాచ్లలో ప్రాతినిధ్యం వహించి మనోళ్ల అభిమానాన్ని చూరగలిగాను. ఇక టీమిండియా సభ్యుడిగా వరల్డ్కప్ గెలుపులో భాగం కావడమనేదే నా లక్ష్యం. అందుకోసం నేను చేయగలిగిందంతా చేస్తాను. నేను ఏ రకంగా జట్టుకు ఉపయోగపడినా చాలు’ అని హార్దిక్ స్పష్టం చేశాడు. ఐపీఎల్ వేదికలకు నజరానా ఈ ఐపీఎల్ సీజన్లో జరిగిన 74 మ్యాచ్లను సమర్థంగా నిర్వహించడంతో పాటు చక్కటి పిచ్లను రూపొందించిన ఆరు వేదికలకు బీసీసీఐ నగదు ప్రోత్సాహకాన్ని ప్రకటించింది. ముంబైలోని వాంఖెడే, బ్రబోర్న్, డీవై పాటిల్ స్టేడియాలతో పాటు పుణేలోని ఎంసీఏ మైదానంలో లీగ్ దశ మ్యాచ్లు జరగగా... కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్, అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియాలు ప్లే ఆఫ్స్కు ఆతిథ్యం ఇచ్చాయి. లీగ్ మ్యాచ్లు జరిగిన స్టేడియాలు ఒక్కో దానికి రూ.25 లక్షలు, ప్లే ఆఫ్స్ నిర్వహించిన మైదానాలకు ఒక్కోదానికి రూ. 12.5 లక్షల చొప్పున బహుమతిని బోర్డు ప్రకటించింది.