-
కొత్త ఫీచర్!! అచ్చం మనుషులతో మాట్లాడినట్టుగానే..
టెక్నాలజీ విస్తృతమైన నేటి రోజుల్లో ఆప్యాయంగా పలకరించేవారు కరువయ్యారు. అందరూ స్మార్ట్ఫోన్లకు హత్తుకుపోయి అన్నింటినీ వాటిలోనే వెతుక్కుంటున్నారు. ఈ క్రమంలోనే Character.AI అనే సంస్థ చాట్బాట్కు కాల్ చేసే కొత్త ఫీచర్ను ప్రవేశపెట్టింది. క్యారెక్టర్స్ అని పిలిచే ఈ ఏఐ చాట్బాట్లను అచ్చం మనుషలతో మాట్లాడినట్టుగానే ఉండేలా ప్రోగ్రామ్ చేయవచ్చు.ఈ ఫీచర్ ద్వారా యూజర్లు ఫోన్ కాల్స్ చేసి నిజమైన టెలిఫోనిక్ సంభాషణల అనుభూతిని పొందవచ్చు. ఇంగ్లిష్, స్పానిష్, జపనీస్, చైనీస్ వంటి భాషలను ఈ ఫీచర్ సపోర్ట్ చేస్తుందని ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్లాట్ఫామ్ తెలిపింది. గత నెలలో ఆర్క్ సెర్చ్ కూడా ఇలాంటి ఫీచర్నే విడుదల చేసింది.క్యారెక్టర్ కాల్స్ ఫీచర్ యూజర్లందరికీ ఉచితంగా లభిస్తుందని ఏఐ సంస్థ తన బ్లాగ్ పోస్ట్ లో ప్రకటించింది. అయితే, ఈ ఫీచర్ ప్రస్తుతం యాప్లో మాత్రమే అందుబాటులో ఉంది. భవిష్యత్తులో వెబ్లో కూడా ఈ ఫీచర్ను ప్రవేశపెట్టనున్నట్లు Character.AI పేర్కొంది. గత మార్చిలో కంపెనీ క్యారెక్టర్ వాయిస్ ఫీచర్ను ప్రవేశపెట్టింది. ఇది వన్-వే కమ్యూనికేషన్. అంటే యూజర్లు ఏఐకి మెసేజ్ చేస్తే వాయిస్ రూపంలో స్పందన వస్తుంది. టెక్ట్స్ టు స్పీచ్ (టీటీఎస్) ఏఐ మోడల్ సామర్థ్యాలను ఉపయోగించి దీన్ని రూపొందించారు.ఇప్పుడు క్యారెక్టర్ కాల్స్తో యూజర్లు టూ-వే వెర్బల్ కమ్యూనికేషన్ చేయొచ్చు. దీని ద్వారా యూజర్లు ఏఐ క్యారెక్టర్ తో చాటింగ్ చేసే హ్యాండ్ ఫ్రీ ఎక్స్పీరియన్స్ పొందవచ్చు. కాల్ స్క్రీన్ ఇంటర్ఫేజ్ కనిపిస్తుంది. స్క్రీన్ లో మ్యూట్ బటన్, ఎండ్ కాల్ ఆప్షన్ ఉంటాయి. వేగవంతమైన ప్రతిస్పందనలను జనరేట్ చేయడానికి క్యారెక్టర్ కాల్స్ ఫీచర్ తక్కువ లేటెన్సీని అందిస్తుందని కంపెనీ తెలిపింది. అంతేకాదు యూజర్లు వివిధ వాయిస్లు, పిచ్లు, యాసలు ఎంచుకోవచ్చు. -
రాజాసింగ్కు బెదిరింపు కాల్స్
అబిడ్స్(హైదరాబాద్): గోషామహల్ ఎమ్మె ల్యే రాజాసింగ్కు మరోసారి బెదిరింపు కాల్స్ వచ్చాయి. బుధవారం ఉదయం 9:19 గంటల నుంచి క్రమం తప్పకుండా తన ఫోన్కు గుర్తు తెలియనివ్యక్తులు బెదిరింపు కాల్స్ చేస్తూనే ఉన్నారని రాజాసింగ్ సోషల్ మీడియాలో ఒక వీడియోను విడుదల చేశారు. చేసిన ప్రతిసారి ఒక్కో నంబర్ నుంచి కాల్స్ వస్తున్నాయని చెప్పారు.కొన్నిసార్లు వాయిస్ మెసేజ్ కూడా చేసి బెదిరిస్తున్నారన్నారు. వచ్చిన కాల్స్లో పాలస్తీనాకు చెందిన ఒక తీవ్రవాది ఫొటో, నంబరు స్పష్టంగా కనిపించిందని రాజాసింగ్ వెల్లడించారు. బెదిరింపు కాల్స్ చేసిన వ్యక్తి తనను ఇంకో నంబరు ఉందా? అని అడిగాడని, దానికి సమాధానంగా గూగుల్లో అన్వేషించి సీఎం రేవంత్రెడ్డి నంబర్ను ఇచ్చానని తన వీడియోలో పేర్కొన్నారు. కేసీఆర్ సీఎంగా ఉన్న సమయంలో కూడా ఇలాంటి బెదిరింపు కాల్స్ చాలాసార్లు వచ్చాయని, పోలీసు ఉన్నతాధికారులు, అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఫిర్యాదు చేసినా ఒక్కరిని కూడా అరెస్ట్ చేయలేదన్నారు. ఒక ఎమ్మెల్యేకు బెదిరింపు కాల్స్ వస్తే అది ఎవరు చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారన్నది కూడా పోలీసులు తెలుసుకోలేకపోయారని ఆ శాఖపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉందని, మళ్లీ బెదిరింపు కాల్స్ వస్తున్నందున సీఎం రేవంత్రెడ్డి నంబర్ను ఇచ్చానని, ఒకవేళ ఆ వ్యక్తులు ఆ నంబరకు బెదిరింపు కాల్స్ చేస్తే ప్రభుత్వం, పోలీసులు విచారణ జరిపిస్తారేమో అనే భావంతోనే సీఎం నంబర్ ఇచ్చానంటూ రాజాసింగ్ వెల్లడించారు. -
బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్కు మళ్లీ బెదిరింపు కాల్స్
సాక్షి, హైదరాబాద్: బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్కు మళ్లీ బెదిరింపు కాల్స్ వచ్చాయి. చంపుతామని బెదిరిస్తూ పదేపదే కాల్స్ చేస్తున్నారని రాజాసింగ్ తెలిపారు. పలు నంబర్ల నుంచి ఫోన్లు వస్తున్నాయని.. పోలీసులకు ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు లేవని ఆయన మండిపడ్డారు.తనకు వచ్చిన బెదిరింపు కాల్స్ నంబర్లను కాల్ లిస్ట్ స్క్రీన్ షాట్ను రాజాసింగ్ తన ఎక్స్(ట్విట్టర్)లో పోస్ట్ చేశారు. ఈ కాల్స్ తనకు కొత్తేమీ కాదని.. వీటిపై గతంలో ఫిర్యాదు చేసిన ఎలాంటి చర్యలు తీసుకోలేదని తెలిపారు. అయినా ఒక బాధ్యత గల పౌరుడుగా పోలీసుల దృష్టికి తీసుకెళ్తున్నట్లు ఎక్స్లో పేర్కొన్నారు.మరోవైపు, బెదిరింపు కాల్స్ చేసిన వారికి రాజాసింగ్ ట్విస్ట్ ఇచ్చారు. తనకు ఎన్ని నంబర్లు ఉన్నాయని బెదిరింపు కాల్స్ చేసిన వారు అడిగారు. ఇంకో నంబర్ ఉందని చెప్పి సీఎం రేవంత్ నంబర్ ఇచ్చాని తెలిపారు. ఎమ్మెల్యేలకు బెదిరింపు కాల్స్ వచ్చాయని చెప్పినా పోలీసులు పట్టించుకోవడంలేదు. అందుకే ముఖ్యమంత్రి నంబర్ ఇచ్చాను. ఇప్పటికైనా చర్యలు తీసుకుంటారా? లేదా?. విచారణ ముందుకు సాగుతుందా? లేదా?’’ అంటూ ప్రశ్నించారు.ఇవాళ నాకు కంటిన్యూయస్గా బెదిరింపు కాల్స్ వచ్చాయి. పాలస్తీనాకు చెందిన వ్యక్తిగా తెలుస్తోంది. ధర్మం కోసం నువ్వు పనిచేస్తే చంపేస్తామని బెదిరిస్తున్నారు. నా ఫ్యామిలీని కూడా చంపేస్తామని బెదిరించారన్నారు.కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు ఇలాంటివి ఎన్నో కాల్స్ వచ్చాయి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. ఇప్పుడు సీఎంగా రేవంత్ ఉన్నాడు.. ఇప్పుడైనా వీటిపై చర్యలు తీసుకుంటారో లేదో అని సీఎం నంబర్ ఇచ్చాను. ఒక ఎమ్మెల్యేకు బెదిరింపు కాల్ వస్తే ఎలాగూ పట్టించుకోలేదు. అందుకే ముఖ్యమంత్రి నంబర్ కు బెదిరింపు కాల్ వస్తే అయినా చర్యలు తీసుకుంటారా? లేదా?. విచారణ సాగుతుందా? లేదా? అనేది చూద్దాం.. నాకు ఈ కాల్స్ రావడం ఎప్పుడు బంద్ అవుతాయో చూద్దాం’’ అంటూ రాజాసింగ్ వ్యాఖ్యానించారు. Once again, I'm receiving death threats from multiple numbers today. This isn't the first time I've been targeted with such threats. Despite previous complaints, it seems no action will be taken.Nonetheless, as a responsible citizen, I feel obligated to inform the police… pic.twitter.com/exIFElcrUx— Raja Singh (Modi Ka Parivar) (@TigerRajaSingh) May 29, 2024 -
స్పామ్ కాల్స్తో ఒళ్లు మండిపోతోందా? ఇలా చేయండి!
పొద్దున లేచింది మొదలు రాత్రి వరకూ స్పామ్ కాల్స్ బెడద ఇంతా అంతాకాదు. ఏ పనిలో ఉన్నా,ఎంత ముఖ్యమైన పనిలో ఉన్నా.. ఏదో పెద్ద పని ఉన్నట్టు మనల్ని డిస్ట్రబ్ చేస్తాయి. తీరా అది స్పామ్ అని తెలిసాక మన కొచ్చే కోపం అంతా కాదు. సెలెన్స్ అన్ నోన్ కాలర్స్, స్పామ్ కాల్ అలర్ట్.. ఇలా ఎన్ని అప్షన్స్ ఉన్నా.. ఎన్ని నంబర్లను బ్లాక్ చేసినామళ్లీ మళ్లీ వస్తూనే ఉంటాయి..దాదాపు సెల్ఫోన్ ఉన్నప్రతి వారికి ఇది అనుభవమే. ఈ నేపథ్యంలో ఇంటర్నెట్లో ఒక వీడియో తెగ షేర్ అవుతోంది. How do you deal with unwanted telephone calls? pic.twitter.com/emVHvdv02N — Science girl (@gunsnrosesgirl3) March 31, 2024 సైన్స్గర్ల్ అనే ట్విటర్ దీనికి సంబంధించిన వీడియోను ట్విటర్లో షేర్ చేసింది. ఈవీడియో నెట్టింట నవ్వులు పూయిస్తోంది. ఇప్పటికే ఇది 14 మిలియన్లకు పైగా వ్యూస్ను సొంతం చేసుకుంది. మరి మీరు కూడా ఓ లుక్కేసుకోండి! -
ఫిర్యాదు చేస్తే అంతు చూస్తాం
‘మార్గదర్శి చిట్ఫండ్స్పైనే ఫిర్యాదు చేస్తారా ... మీ సంగతి తేలుస్తాం’ ‘మార్గదర్శి చిట్ఫండ్స్ బాధితులు.. అని సంఘం పెట్టేంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది’ ‘మీ ష్యూరిటీ పత్రాలు మా దగ్గర ఉన్నాయి.. మీ ఆస్తులు వేలం వేయిస్తాం..’ ఇవీ రాజగురివింద రామోజీరావు ఆర్థిక అక్రమాల పుట్ట.. మార్గదర్శి చిట్ఫండ్స్ నుంచి చందాదారులకు కొన్ని నెలలుగా వస్తున్న బెదిరింపులు. నేరుగా చందాదారుల ఇళ్లకే వచ్చి బెదిరిస్తుండటంతో వారంతా ఆందోళన చెందుతున్నారు. మరికొందరికి రామోజీ ముఠా ఫోన్లు చేసి వేధిస్తోంది. కొందరిని తమ చిట్ఫండ్ కార్యాలయాలకు పిలిపించుకుని మరీ బెదిరిస్తోంది. మార్గదర్శి చిట్ఫండ్స్ అక్రమాల పుట్ట బద్దలు కావడంతో రామోజీరావు బెంబేలెత్తుతున్నారు. దశాబ్దాల తరబడి ఆయన, ఆయన కోడలు శైలజ వేధింపులు భరించిన చందాదారులు ప్రస్తుతం ధైర్యం చేసి ఫిర్యాదులు చేస్తుండటంతో రామోజీ ముఠా బెదిరింపుల పర్వానికి బరితెగించింది. దీంతో చందాదారుల భద్రతే లక్ష్యంగా ఫిర్యాదులు చేసేందుకు సీఐడీ ప్రత్యేక వాట్సాప్ నంబరును అందుబాటులోకి తెచ్చింది. తాజాగా కొందరు చందాదారులు ‘మార్గదర్శి చిట్ఫండ్స్ బాధితుల సంఘాన్ని’ ఏర్పాటు చేసి రిజిస్టర్ చేయించడంతో ఈ వ్యవహారం కీలక మలుపు తిరిగింది. ధైర్యంగా బాధితుల ముందడుగు.. మార్గదర్శి చిట్ఫండ్స్ కేసును విచారిస్తున్న సీఐడీ.. బాధితులు ఫిర్యాదు చేసేందుకు 94931 74065తో వాట్సాప్ నంబర్ను అందుబాటులోకి తెచ్చింది. ఈ వాట్సాప్ నంబరుకు ఇప్పటికే వేల సంఖ్యలో చందాదారులు ఫిర్యాదులు చేశారు. తమ అనుమతి లేకుండా చిట్టీలు పాడటం, చిట్ పాడుకున్న నగదు ఇవ్వకుండా రశీదు డిపాజిట్లుగా జమ చేయడం, ష్యూరిటీలు ఇచ్చినా తిరస్కరించి వేధించడం, తమ సంతకాలు ఫోర్జరీ చేయడం వంటి అక్రమాలపై బాధితులు ఆధారాలతో సహా ఫిర్యాదులు చేస్తున్నారు. వీటిని సీఐడీ ప్రత్యేక విభాగం నమోదు చేసి దర్యాప్తు చేస్తోంది. వేధింపులకు పాల్పడ్డ పలువురు మార్గదర్శి చిట్ఫండ్స్ బ్రాంచ్ మేనేజర్లు, ఇతర సిబ్బందిని సీఐడీ విచారిస్తుండటంతో రామోజీ బెంబేలెత్తుతున్నారు. ఇక రాష్ట్ర ప్రభుత్వం, సీఐడీ కార్యాచరణతో చందాదారులు ధైర్యంగా ముందుకు వస్తున్నారు. విజయవాడ కేంద్రంగా మార్గదర్శి చిట్ఫండ్స్ బాధితుల సంఘాన్ని ఏర్పాటు చేశారు. బాధితులు తమ సమస్యలను చెప్పుకునేందుకు ప్రత్యేకంగా 99481 14455 ఫోన్ నంబర్ను అందుబాటులోకి తెచ్చారు. దీంతో కేవలం మూడు రోజుల్లోనే వందల సంఖ్యలో బాధితులు ఈ సంఘాన్ని సంప్రదించి తమ గోడు వెళ్లబోసుకున్నారు. అందరి ఫిర్యాదులను నమోదు చేస్తూ అటు సీఐడీ ద్వారా, ఇటు న్యాయపరంగా చర్యలు తీసుకునేందుకు ఆ సంఘం సన్నద్ధమవుతోంది. బాధితులపై మార్గదర్శి వేధింపుల పర్వం మార్గదర్శి చిట్ఫండ్స్ ఆర్థిక అక్రమాల పుట్ట బద్దలు కావడంతో రామోజీరావు హడలిపోతున్నారు. సీఐడీ అధికారులు కేసు నమోదు చేయడం, ఏకంగా తన ఇంటికే వచ్చి మరీ విచారించడంతో ఆయన బెంబేలెత్తుతున్నారు. ఇవి చాలవన్నట్టు ఇప్పుడు బాధితులు కూడా దూకుడు పెంచడంతో ఏక్షణం ఏం జరుగుతుందోనని రామోజీ బేజారెత్తుతున్నారు. దీంతో కేసు దర్యాప్తును ప్రభావితం చేసేందుకు తన ముఠాలను ఆయన రంగంలోకి దించారు. సీఐడీ అధికారులు, బాధితుల సంఘానికి ఫిర్యాదు చేస్తున్నవారిని లక్ష్యంగా చేసుకుని వారికి ఫోన్లు చేసి రామోజీ ముఠా వేధిస్తోంది. సీఐడీకి ఫిర్యాదు చేసిన చందాదారులను మొదట లక్ష్యంగా చేసుకుంది. సీఐడీ దర్యాప్తునకు సహకరించవద్దని వారిని బెదిరిస్తోంది. ఏకంగా మార్గదర్శి చిట్ఫండ్స్ ఎండీ శైలజ కిరణ్ ఆఫీసు నుంచే చందాదారులకు ఫోన్లు చేస్తూ బెదిరింపులకు పాల్పడుతుండటం గమనార్హం. రామోజీ కోడలు శైలజ కిరణ్ పీఏ శశికళ, మార్గదర్శి బ్రాంచ్ మేనేజర్లు స్వయంగా ఫోన్లు చేసి మరీ బెదిరిస్తుండటం ఆ సంస్థ దిగజారుడుతనానికి నిదర్శనం. మార్గదర్శి చిట్ఫండ్స్ బాధితుల సంఘం అందుబాటులోకి తెచ్చిన ఫోన్ నంబరుకు కూడా ఫోన్లు చేసి బెదిరిస్తున్నారు. ‘అసలు సంఘాన్ని ఎందుకు ఏర్పాటు చేశారు.. మీ వెనుక ఎవరు ఉన్నారు.. ఎవరున్నాసరే మిమ్మల్ని కాపాడలేరు.. మీ సంగతి చూస్తాం.. అంతు తేలుస్తాం’ అంటూ హెచ్చరికలు జారీ చేస్తున్నారు. – సాక్షి, అమరావతి న్యాయపోరాటానికి బాధితులు సిద్ధం.. మార్గదర్శి చిట్ఫండ్స్ సిబ్బంది కాల్మనీ రాకెట్ గూండాల మాదిరిగా చందాదారుల ఇళ్లపై పడుతున్నారు. వారి ఇళ్లకు వెళ్లి మరీ బెదిరిస్తున్నారు. ప్రధానంగా ప్రైవేటు వ్యక్తులకే తెలియకుండా తాము ఘోస్ట్ చందాదారులుగా నమోదు చేసిన వారి ఇళ్లకు వెళ్లి దౌర్జన్యం చేస్తున్నారు. అసలు మార్గదర్శి చిట్ఫండ్స్లో తాము చందాదారులుగా చేరిన విషయమే తమకు తెలియదనివారు ఎంతగా చెబుతున్నా వినిపించుకోవడం లేదు. ‘సీఐడీ అధికారులు అడిగితే మీరే చందాదారులుగా చేరారని చెప్పండి.. మీకు ఇబ్బందిరాకుండా చూస్తాం.. అంతేగానీ తెలియదని చెబితే మాత్రం మీరు మాకు భారీగా బకాయిలు ఉన్నారని కోర్టులో కేసులు వేస్తాం’ అని హడలెత్తిస్తున్నారు. దాంతో తమకు తెలియకుండానే తమ పేరుతో మార్గదర్శి చిట్ఫండ్స్ సాగిస్తున్న ఆర్థిక అవకతవకలపై వారు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఇక చందాదారుల కోసం ష్యూరిటీ సంతకాలు చేసిన వారి ఇళ్లకు మార్గదర్శి చిట్ఫండ్స్ సిబ్బంది వెళ్లి వారిపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరిస్తున్నారు. ‘మీరు ఇచ్చిన ఖాళీ చెక్కులు మా వద్ద ఉన్నాయి.. వాటిపై భారీ మొత్తం రాసి బ్యాంకులో జమ చేసి బౌన్స్ అయ్యేలా చేస్తాం. తరువాత కేసు పెట్టి అరెస్ట్ చేయిస్తాం’ అని కొందరిని బెదిరించడంతో వారి కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. మరికొందరు చందాదారుల ఇళ్లకు వెళ్లి ‘మీరు భారీగా బకాయి పడ్డారు...అందుకు ప్రతిగా మీ ఇళ్లు, ఆస్తులు వేలం వేయిస్తాం’ అని వేధింపులకు దిగారు. చందాదారుల తరపున మార్గదర్శి చిట్ఫండ్స్ సిబ్బందే ఫోర్జరీ సంతకాలు చేసేసి.. తిరిగి చందాదారులపైనే ఫోర్జరీ కేసు పెడతామని బెదిరిస్తున్నారు. ఈ పరిణామాలతో మార్గదర్శి చిట్ఫండ్స్ చందాదారులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే ఏర్పాటు చేసిన మార్గదర్శి చిట్ఫండ్స్ బాధితుల సంఘం ద్వారా అటు సీఐడీని ఆశ్రయించడంతోపాటు మరోవైపు న్యాయపోరాటం చేసేందుకు ఉద్యుక్తమవుతున్నారు. ఈ నేపథ్యంలో రానున్న రోజుల్లో కీలక పరిణామాలు సంభవించే అవకాశాలు కనిపిస్తున్నాయి. -
తప్పని అవాంఛిత కాల్స్ బెడద - సర్వేలో బయటపడ్డ విషయాలు
డు నాట్ డిస్టర్బ్ (డీఎన్డీ) లిస్ట్లో రిజిస్టర్ చేసుకున్న తర్వాత కూడా చాలా మంది మొబైల్ ఫోన్ యూజర్లకు అవాంఛిత కాల్స్ బెడద తప్పడం లేదు. ఆర్థిక సేవలు, రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులు, ఇతరత్రా ఉత్పత్తుల గురించి తమకు స్పామ్ కాల్స్ వస్తూనే ఉన్నాయంటూ లోకల్సర్కిల్స్ సర్వేలో పాల్గొన్న వారిలో 90 శాతం మంది తెలిపారు. సర్వేలో అడిగిన ఏడు ప్రశ్నలకు 378 జిల్లాల నుంచి 60,000 పైచిలుకు సమాధానాలు వచ్చినట్లు లోకల్సర్కిల్స్ తెలిపింది. గతేడాది నవంబర్ 15 నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి 16 మధ్య కాలంలో దీన్ని నిర్వహించారు. అవాంఛిత కాల్స్ సంఖ్య గురించి అడిగిన ప్రశ్నకు రోజుకు తమకు 1–2 కాల్స్ వస్తూనే ఉంటాయని 90 శాతం మంది, 10కి పైగా కాల్స్ వస్తుంటాయని 3 శాతం మంది పేర్కొన్నారు. ఒక బడా లిస్టెడ్ నాన్–బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీ నుంచి అత్యధికంగా కాల్స్ ఉంటున్నాయని 40 శాతం మంది వెల్లడించారు. ఆ తర్వాత స్థానంలో ఒక పేరొందిన లిస్టెడ్ ప్రైవేట్ రంగ బ్యాంకు ఉంది. అవాంఛిత కాల్స్ను కట్టడి చేసేందుకు టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్ గత కొన్నేళ్లుగా అనేక చర్యలు తీసుకుంటున్నప్పటికీ పరిస్థితి పెద్దగా మెరుగుపడినట్లు కనిపించడం లేదని లోకల్సర్కిల్స్ వ్యవస్థాపకుడు సచిన్ తపాడియా చెప్పారు. -
20 ఉత్తుత్తి బెదిరింపు కాల్స్.. నాలుగేళ్లు నిజమైన జైలు?
అమెరికాలోని వాషింగ్టన్కు చెందిన ఒక యువకుడు ఒకేరోజు నాలుగు నేరాలకు పాల్పడి, దోషిగా నిలిచాడు. అమెరికా, కెనడాలలో 20కిపైగా బెదిరింపు కాల్స్ చేశాడు. బాంబు దాడులు, కాల్పులు, ఇతర బెదిరింపులకు పాల్పడి, ప్రభుత్వ అత్యవసర విభాగాలలో గాభరా పుట్టించాడు. అస్టన్ గార్సియా(21) అనే యువకుడు టకోమాలోని యుఎస్ డిస్ట్రిక్ట్ కోర్ట్లో తన నేరాన్ని ఒప్పుకున్నాడు. రెండు దోపిడీలు, పేలుడు పదార్థాలకు సంబంధించిన బెదిరింపులలో గార్సియా తన నేరాన్ని అంగీకరించినట్లు యుఎస్ అటార్నీ టెస్సా ఎం. గోర్మాన్ ఒక వార్తా ప్రకటనలో తెలిపారు. గార్సియాపై తొలుత 10 నేరాలు మోపారు. ఫెడరల్ ప్రాసిక్యూటర్లు మాట్లాడుతూ గార్సియా 2022, 2023లో బెదిరింపు కాల్స్ చేసే సమయంలో తన గుర్తింపును దాచేందుకు వాయిస్ ఓవర్ ఇంటర్నెట్ టెక్నాలజీని ఉపయోగించాడని చెప్పారు. దీనిని సోషల్ మీడియా ప్లాట్ఫారమ్ డిస్కార్డ్లో ప్రసారం చేస్తూ, అందరినీ వినాలని కూడా గార్సియా కోరేవాడన్నారు. గార్సియా తాను టార్గెట్ చేసుకున్న ప్రముఖుల వ్యక్తిగత సమాచారాన్ని సేకరించి.. డబ్బు, క్రెడిట్ కార్డుల సమాచారం లేదా అసభ్యకరమైన చిత్రాలను పంపించకపోతే ప్రభుత్వ అత్యవసర సిబ్బందిని వారి ఇళ్లకు పంపిస్తానని బెదిరించేవాడు. గార్సియా.. ఓహియోలోని క్లీవ్ల్యాండ్లోని ఫాక్స్ న్యూస్ స్టేషన్కు ఫోన్ చేసి, లాస్ ఏంజెల్స్కు వెళ్లే విమానాలలో బాంబు ఉన్నదంటూ వదంతులు వ్యాప్తి చేశాడు. అలాగే బిట్కాయిన్ రూపంలో భారీ మొత్తాన్ని అందించకపోతే లాస్ ఏంజిల్స్లోని విమానాశ్రయంలో బాంబు పెడతానని బెదిరించాడు. 2017లో గార్సియా ఇటువంటి బెదిరింపు కాల్ప్ చేసి, తప్పుదారి పట్టించిన నేపధ్యంలో కాన్సాస్లో ఒక పోలీసు అధికారి ఒక వ్యక్తిని కాల్చి చంపారు. కాగా బ్రెమెర్టన్కు చెందిన గార్సియాకు నాలుగేళ్ల జైలు శిక్ష విధించాలని ప్రాసిక్యూటర్లు సూచించారు. గార్సియాకు ఏప్రిల్లో శిక్ష ఖరారు కానుంది. అమెరికాలోని వాషింగ్టన్, కాలిఫోర్నియా, జార్జియా, ఇల్లినాయిస్, కెంటుకీ, మిచిగాన్, మిన్నెసోటా, న్యూజెర్సీ, ఒహియో, పెన్సిల్వేనియా, కొలరాడో, కెనడాలోని అల్బెర్టాలో గల అత్యవసర ఏజెన్సీలకు గార్సియా బెదిరింపు కాల్ చేశాడని ప్రాసిక్యూటర్లు తెలిపారు. గార్సియాను వాషింగ్టన్లోని సీటాక్లోని ఫెడరల్ డిటెన్షన్ సెంటర్లో ఉంచి విచారిస్తున్నారు. -
స్పామ్ కాల్స్ కు చెక్ పెట్టడానికి కొత్త యాప్..
-
మీకు అలాంటి కాల్స్ వస్తున్నాయా? యూజర్లకు ట్రాయ్ హెచ్చరికలు
న్యూఢిల్లీ: మోసపూరిత కాల్స్పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని టెలికం నియంత్రణ సంస్థ (ట్రాయ్) హెచ్చరించింది. ‘కొన్ని కంపెనీలు/ఏజెన్సీలు/వ్యక్తులు ట్రాయ్ నుండి కాల్ చేస్తున్నామని, అలాగే సందేశాలు పంపుతూ ప్రజలను/కస్టమర్లను మోసగిస్తున్నట్టు ట్రాయ్ దృష్టికి వచ్చింది. ట్రాయ్ నుండి కాల్ చేస్తున్నట్టు తప్పుగా చెప్పుకునే కాలర్లు నంబర్లను డిస్కనెక్ట్ చేస్తామని బెదిరిస్తారు. ఆధార్ నంబర్లను సిమ్ కార్డ్స్ పొందేందుకు ఉపయోగించారని, చట్టవిరుద్ధ కార్యకలాపాలకు అట్టి సిమ్లను ఉపయోగిస్తున్నారని కస్టమర్లను తప్పుదోవ పట్టిస్తున్నారు. మొబైల్ నంబర్ డిస్కనెక్ట్ కాకుండా ఉండాలంటే స్కైప్ వీడియో కాల్ చేయాల్సిందిగా కస్టమర్కు వారు సూచిస్తున్నారు. ట్రాయ్ ఏ వ్యక్తిగత టెలికం కస్టమర్ల మొబైల్ నంబర్ను బ్లాక్ చేయడం లేదా డిస్కనెక్ట్ చేయదు. ట్రాయ్ నుండి వచ్చినట్లు చెప్పుకునే అటువంటి కాల్ లేదా సందేశాన్ని మోసపూరితంగా పరిగణించాలి. అలాంటి కాల్స్ చట్టవిరుద్ధం’ అని ట్రాయ్ స్పష్టం చేసింది. -
బెదిరింపు ఫోన్లు వస్తున్నాయి: ఎమ్మెల్యే రాజాసింగ్
సాక్షి, హైదరాబాద్: తనకు గుర్తు తెలియని వ్యక్తుల నుంచి బెదిరింపు ఫోన్లు వస్తున్నాయని బీజేఎల్పీనేత, గోషామహల్ ఎమ్మెల్యే టి.రాజాసింగ్ తెలిపారు. ఈ ఫోన్లు 15 డిజిట్ నంబర్ నుంచి వస్తున్నాయని, తనను చంపుతామని, నరుకుతామని భయపెట్టిస్తున్నారని బుధవారం మీడియాతో వెల్లడించారు. తనకు ఫోన్ చేసి తన గురించి, తాను ఎక్కడెక్కడికి వెళుతోంది ప్రతీ కదలిక గురించి తెలియజేస్తూ బెదిరింపులకు పాల్పడుతున్నారని తెలిపారు. గోషామహల్ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారానికి ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యానాథ్ వస్తుండటంతో, తమ ఇద్దరినీ కలిపి చంపుతామని హెచ్చరించినట్లు రాజాసింగ్ చెప్పారు. బుధవారం మధ్యాహ్నం 1.59 గంటలకు +61 9664800063233 నుంచి తనకు ఫోన్ చేసి బెదిరించినట్లు తెలిపారు. దీనిపై పోలీస్ కమిషనర్కు ఫిర్యాదు చేసినట్లు రాజాసింగ్ వెల్లడించారు. ఈ బెదిరింపు ఫోన్ కాల్స్పై వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని కోరారు చదవండి: మజ్లిస్ పార్టీలో ‘చార్మినార్ అసెంబ్లీ సీటు’ చిచ్చు -
ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్పై ఇజ్రాయెల్ ఆగ్రహం
ఇజ్రాయెల్- హమాస్ మధ్య యుద్ధం మొదలై ఇప్పటికే 19 రోజులు దాటింది. ఈ దాడుల్లో మృతుల సంఖ్య ఏడువేలు దాటింది. ప్రపంచమంతా ఈ యుద్ధాన్ని గమనిస్తోంది. ఐక్యరాజ్యసమితి (యూఎన్ఓ)లో కూడా ఈ యుద్ధంపై చర్చలు జరుగుతున్నాయి. వీటినడుమ ఇజ్రాయెల్ రాయబారి గిలాడ్ ఎర్డాన్ ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. చిన్నారులు, మహిళలు, వృద్ధులపై హమాస్ సాగిస్తున్న దారుణాలపై ఆంటోనియో గుటెర్రెస్ ఉపేక్ష వహిస్తున్నట్టు కనిపిస్తున్నారని, అందుకే ఆయన ఐక్యరాజ్యసమితికి నాయకత్వం వహించడానికి తగినవారు కాదని ఎర్డాన్ ఆరోపించారు. ఆయన వెంటనే రాజీనామా చేయాలన్నారు. ఇజ్రాయెల్, యూదు ప్రజలపై దురాగతాలకు తెగబడుతున్న వారిపై సానుభూతి తెలిపేవారితో తాను మాట్లాడటంలో అర్థం లేదని అన్నారు. కాగా ఈ వ్యాఖ్యలపై స్పందించిన ఆంటోనియో గుటెర్రెస్ మాట్లాడుతూ ఇజ్రాయెల్ అంతర్జాతీయ మానవతా చట్టాలను ఉల్లంఘించిందని ఆరోపిస్తూ, హమాస్ ఎటువంటి కారణం లేకుండా దాడులు చేసి ఉండదని తెలుసుకోవడం కూడా ముఖ్యమేనని అన్నారు. పాలస్తీనా ప్రజలు 56 ఏళ్లుగా దురాక్రమణలను ఎదుర్కొంటున్నారని, అయినప్పటికీ హమాస్ దాడులను సమర్థించలేమని కూడా ఆయన అన్నారు. ఇది కూడా చదవండి: భారత్ నుంచి గాజాకు 38 టన్నుల ఆహార పదార్థాలు, వైద్య పరికరాలు! -
'మణిపూర్ సమస్యకు సర్జికల్ స్ట్రైక్ ఒక్కటే మార్గం..'
ఇంఫాల్: మణిపూర్లో వలసదారుల సమస్యను పరిష్కరించాలంటే 'సర్జికల్ స్ట్రైక్ట్' చేయాల్సిందేనని నేషనల్ పీపుల్ పార్టీ నాయకుడు ఎమ్ రామేశ్వర్ సింగ్ వివాదాస్పదంగా మాట్లాడారు. అక్రమంగా వలసదారులు, ఉగ్రవాదులను అణిచివేయడానికి కఠిన చర్యలు చేపట్టాలని ఈ మేరకు స్పందించారు. ప్రస్తుతం ఎన్పీపీ బీజేపీతో కలిసి మణిపూర్లో ప్రభుత్వాన్ని ఏర్పరించింది. 'మణిపూర్కు కొంతమంది కుకీ ఉగ్రవాదులు సరిహద్దు దాటి వస్తున్నారని హోం మంత్రి చెబుతున్నారు. నేను ఎప్పటినుంచే చెబుతున్నా..ఈ అల్లర్లు బయటి నుంచి ప్రేరణకు గురువుతున్నాయని.. ఈ విషయంలో జాతీయ భద్రత కూడా రాజీపడుతోంది. దేశాన్ని రక్షించుకోవాలి ఒక్క మణిపూర్నే కాదు. ఒక్కసారి సర్జికల్ స్ట్రైక్ చేస్తే సమస్య పరిష్కారం అవుతోంది.' అని ఆయన అన్నారు. 'కుకీ ప్రజలు క్యాంపుల్లో ఉన్నారు. వారి ఆయుధాలను కూడా స్వాధీనం చేసుకున్నామని కొన్ని ఏజెన్సీలు చెబుతున్నాయి. మరి ఇదే వాస్తవం అయితే.. ఇప్పుడు ఫైరింగ్ ఎక్కడి నుంచి వస్తోంది. వారికి ఆయుధాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి.' అని రామేశ్వర్ సింగ్ అన్నారు. మయన్మార్ నుంచి వలస వచ్చిన కుకీ ప్రజల బయోమెట్రిక్లను మణిపూర్ ప్రభుత్వం గత నెలలోనే తీసుకుంది. దాదాపు 700 మంది అక్రమ వలసదారులు రాష్ట్రంలోకి చొరబడ్డారని పుకార్ల రావడంపై ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. మణిపూర్లో మే3 న అల్లర్లు ప్రారంభమయ్యాయి. కుకీ, మైతీ వర్గాల మధ్య అల్లర్లు చెలరేగాయి. ఇదీ చదవండి: నూహ్ అల్లర్లు: ప్రముఖ టీవీ ఛానల్ ఎడిటర్ అరెస్టు.. -
పాకిస్థాన్ నుంచి కాల్స్.. వాట్సాప్ యూజర్లకు ఇండియన్ ఆర్మీ హెచ్చరిక!
భారతదేశంలోని ఆర్మీ పబ్లిక్ స్కూల్స్తో సహా చాలా మంది విద్యార్థులకు పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఆపరేటివ్స్ నుంచి కాల్స్, వాట్సాప్ మెసేజ్లు వస్తున్నాయి. ఇండియన్ ఆర్మీ వర్గాలను ఉటంకిస్తూ వచ్చిన నివేదికల ప్రకారం.. కొన్ని నంబర్ల నుంచి విద్యార్థులకు వస్తున్న కాల్స్, మెసేజ్లలో వారిని సోషల్ మీడియా గ్రూపులలో చేరాలని, సున్నితమైన సమాచారాన్ని పంచుకోవాలని కోరుతున్నట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా గ్రూప్నకు చెందిన గ్యాడ్జెట్స్ నౌ కథనం పేర్కొంది. ఇలా కాల్స్ చేస్తున్నవారు తమను పాఠశాల ఉపాధ్యాయులుగా చెప్పుకొంటూ కొత్త క్లాస్ గ్రూప్లలో చేరాలని విద్యార్థులను కోరుతున్నారు. ఈ నెపంలో వారికి ఓటీపీలను పంపుతున్నారు. తాము ఉపాధ్యాయులేనని నమ్మించేందుకు విద్యార్థులకు తెలిసిన వారి పేర్లు చెబుతున్నారు. ఈ అనుమానాస్పద కాల్స్, మెసేజ్లు వాట్సాప్ ద్వారానే వస్తున్నాయి. ఇలాంటి రెండు అనుమానాస్పద నంబర్లను అధికారులు గుర్తించారు. అవి 8617321715, 9622262167. ఈ కాల్స్ గురించి విద్యార్థులు, సిబ్బందిని ఆర్మీ పబ్లిక్ స్కూళ్ల ప్రిన్సిపాళ్లు హెచ్చరించారు. ఇదీ చదవండి ➤ వాషింగ్టన్ పోస్ట్ సీటీవోగా వినీత్ ఖోస్లా విద్యార్థులు గ్రూపుల్లో చేరిన తర్వాత వారి నుంచి సున్నితమైన సమాచారాన్ని సేకరిస్తున్నారు. విద్యార్థుల తండ్రి ఉద్యోగం, ఉపాధ్యాయుల పేర్లు, వారికి సంబంధించిన సమాచారం అడుగుతున్నారు. పాఠశాలలు, కళాశాలలు దీని గురించి ఉపాధ్యాయులు, విద్యార్థులను చైతన్యపరచాలని ఆర్మీ స్కూళ్ల అధికారులు కోరుతున్నారు. ఆ రెండు నంబర్ల నుంచే కాకుండా ఇతర నంబర్ల నుంచి కూడా కాల్స్, మెసేజ్లు రావచ్చని, అనుమానాస్పద కాల్స్ పట్ల విద్యార్థుల తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని కోరారు. -
కామ్రేడ్స్ పేరుతో బెదిరించి రూ.2 కోట్లు డిమాండ్
కైకలూరు: ఓ ఆక్వా రైతును నెల రోజులుగా కామ్రేడ్స్ పేరుతో సెల్ ఫోన్ల ద్వారా బెదిరించి రూ.2 కోట్లు డిమాండ్ చేస్తున్న డ్రైవర్ల గ్యాంగ్ను ఏలూరు జిల్లా కైకలూరు టౌన్ పోలీసులు శనివారం అరెస్టు చేశారు. టౌన్ స్టేషన్లో సీఐ ఆకుల రఘు, ఎస్ఐ జ్యోతిబసు వివరాలు వెల్లడించారు. కైకలూరుకు చెందిన ఐబీకేవీ ప్రసాదరాజు (వజ్రం రాజు) ప్రముఖ ఆక్వా రైతు. నెల రోజులుగా రెండు నంబర్ల నుంచి ‘కామ్రేడ్స్ మాట్లాడుతున్నాం.. మాకు రూ.2 కోట్లు ఇవ్వకపోతే నీతో పాటు నీ కొడుకును చంపేస్తాం’ అంటూ బెదిరిస్తున్నారు. పదే పదే ఫోన్లు రావడంతో ప్రసాదరాజు ఈ నెల 18న పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టిన సీఐ ఫోన్ కాల్స్ ఆధారంగా నిందితులను కనిపెట్టారు. మండవల్లి మండలం చావలిపాడు గ్రామానికి చెందిన తోకల ఏసేబు (36), చిన్నం బారంబాసు (51), హైదరాబాదు, ఏజీ కాలనీ, ఎర్రగడ్డకు చెందిన శీలం హేమంత్కుమార్ (33), హైదరాబాదు, హిమాయత్నగర్కు చెందిన దారా మాణిక్యరావు (44)గా వారిని గుర్తించారు. వీరిలో ఏసేబు, మాణిక్యరావు కైకలూరులో ప్రసాదరాజు దగ్గర గతంలో కారు డ్రైవర్లుగా పనిచేశారు. సులువుగా డబ్బు సంపాదించాలనే ఆలోచనతో మాణిక్యరావు హైదరాబాదులోని తన స్నేహితుడు, కారు డ్రైవర్ హేమంత్కుమార్తో రెండు సిమ్ కార్డులు కొనుగోలు చేయించాడు. హైదరాబాదు శివారు రింగురోడ్డు నుంచి ఫోన్లు చేసి ప్రసాదరాజును డబ్బు కోసం బెదిరించారు. నిందితుల్లో ఏసేబు, బారంబాసు, హేమంత్కుమార్ అరెస్టు చేశారు. మాణిక్యరావును పట్టుకోవాల్సి ఉంది. -
బెదిరింపు కాల్స్ రావడంతో అజ్ఞాతంలోకి
కుత్బుల్లాపూర్/బచ్చన్నపేట/అల్వాల్: బెదిరింపు కాల్స్ వచ్చింనందునే తాను అజ్ఞాతంలోకి వెళ్లానని రియల్టర్ ముక్కెర తిరుపతిరెడ్డి తెలిపారు. భూమి వ్యవహారంలో ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు తనను కిడ్నాప్ చేసి చంపాలని యత్నించారని, ఎనిమిది సార్లు బెదిరింపు కాల్స్ వచ్చాయని చెప్పారు. ఆరురోజుల క్రితం అదృశ్యమైన ఆయన.. నాటకీయ పరిణామాల మధ్య పేట్బ షీరాబాద్ సమీపంలోని మేడ్చల్ డీసీపీ కార్యాలయంలో మంగళవారం ప్రత్యక్షమయ్యారు. తనకు ఎదురైన సమస్యలను మేడ్చల్ డీసీపీ సందీప్ గోనె, పేట్బషీ రాబాద్ ఏసీపీ రామలింగరాజులకు వివరించారు. అనంతరం డీసీపీ కార్యాలయ ఆవరణలో మీడియాతో మాట్లాడుతూ.. పోలీసులకు ఫిర్యాదు చేసినా ఎమ్మెల్యే ఒత్తిడితో తనకు సాయంచేయడానికి ముందుకురాలేదని చెప్పారు. కేసు రిజిస్టర్ చేయకుండా అల్వాల్ ఎస్హెచ్ఓ గంగాధర్ సమయం వృథా చేశారని ఆరోపించారు. అందుకే అజ్ఞాతంలోకి వెళ్లానని, అయినా మైనంపల్లి అనుచరులు తనను చంపాలని నార్కట్పల్లి వరకు వెంబడించారని, వారి కంటపడకుండా ఆటోలో తప్పించుకున్నానని చెప్పారు. ఆపై విజయవాడ వెళ్లి స్నేహితుల సహాయంతో కొద్దిరోజులు అక్కడున్నానని, ఆపై వైజాగ్ వెళ్లి తలదాచుకున్నానని వివరించారు. హైకోర్టు అడ్వొకేట్ సలహామేరకు డీసీపీ కార్యాలయానికి వచ్చానన్నారు. మైనంపల్లి హను మంతరావుతో తన కుటుంబానికి ప్రాణ హాని ఉందన్నారు. తన భూమిని లాక్కునేందుకు మైనంపల్లి ప్రయత్నిస్తున్నారని, సదరు భూమి తనది కాదని నిరూపిస్తే ఆయనకే గిఫ్ట్గా ఇస్తానని చెప్పారు. అంతా ఫేక్.. తిరుపతిరెడ్డి చెప్పిందంతా ఫేక్ అని సైబరాబాద్ పోలీసులు తెలిపారు. ‘ఎమ్మెల్యే మైనంపల్లి కాల్ చేశారు, కిడ్నాప్నకు యత్నించారు’ అంటూ తిరుపతిరెడ్డి చేసిన ఆరోపణలపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. తిరుపతిరెడ్డి సీడీఆర్లో ఎటువంటి కాల్స్ లేవని గుర్తించారు. ల్యాండ్ కేసులో తిరుపతిరెడ్డిపైనే ఓ మహిళ ఫిర్యాదు చేసిందని, ఈ కేసులో దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు వెల్లడించారు. అయితే... కిడ్నాప్ పేరుతో స్టేషన్ ఎదుట ఆందోళన నిర్వహించిన తిరుపతిరెడ్డి కుటుంబ సభ్యులు, మద్దతుదారులపై కేసుల నమోదు చేసే అంశాన్ని పరిశీలిస్తున్నామని అల్వాల్ సీఐ ఉపేందర్ వెల్లడించారు. -
స్పాం కాల్స్తో విసుగొస్తోందా? ఇదిగో వాట్సాప్ కొత్త ఫీచర్
వాట్సాప్ యూజర్లకు మరో తీపికబురు అందించారు.మార్క్ జుకర్బర్గ్ . ఇటీవలి కాలంలో పలు అప్డేట్స్, కొత్త ఫీచర్లతో వాట్సాప్ యూజర్లను ఆకట్టుకుంటున్న సంస్థ తాజాగా వాట్సాప్లో సైలెన్స్ అన్నోన్ కాలర్స్ అనే కొత్త గోప్యతా ఫీచర్ను ప్రకటించింది. ఇటీవలి తెలియని నంబర్ల నుండి వచ్చిన కాల్స్పై పెరుగుతున్న ఆందోళనల నేపథ్యంలో కేటుగాళ్లకు చెక్ చెప్పేలా ఈ కొత్త ఫీచర్ను తీసుకొచ్చారు. (సుందర్ పిచాయ్: 32 ఎకరాల్లో లగ్జరీ భవనం, ఖరీదెంతో తెలుసా?) మెటా ఫౌండర్, సీఈవో మార్క్ జుకర్బర్గ్ ప్రకటన ప్రకారం వినియోగదారులకు ఇన్కమింగ్ కాల్లపై ఎక్కువ నియంత్రణ ఇవ్వడం, స్పామ్, స్కామ్స్ బారిన పడకుండా సెక్యూరిటీ అందించడమే ఈ ఫీచర్ లక్ష్యం . సైలెన్స్ అన్నోన్ కాలర్స్తో, వాట్సాప్ యూజర్లు గుర్తు తెలియని వ్యక్తులనుంచి అవాంఛిత కాల్లను ఆటోమేటిక్గా స్క్రీన్ అవుట్ చేయవచ్చని వాట్సాప్ పేర్కొంది. దీంతో మోసాలు బాగా తగ్గుతాయని వెల్లడించింది. (50 ఏళ్ల అనుబంధం: నందన్ నీలేకని కీలక నిర్ణయం) WhatsApp announced silence unknown callers feature and privacy checkup! The ability to mute calls from unknown contacts and a privacy checkup feature are now available to everyone!https://t.co/bdbAXkVGOU pic.twitter.com/NtdTB8B9Aa — WABetaInfo (@WABetaInfo) June 20, 2023 ఎలా పని చేస్తుంది సెటింగ్స్లోని ప్రైవసీ ఆప్షన్ సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. దీంతో అన్నోన్ నంబర్లనుంచి వచ్చే కాల్స్ ఫోన్లో రింగ్ అవ్వవు. కానీ కాల్ లిస్ట్లో కనిపిస్తాయి. ఫలితంగా ఏదైనా ముఖ్యమైన కాల్స్ విషయంలో వినియోగ దారులు తర్వాత రివ్యూ చేసుకోవచ్చన్నమాట. దీనికి ముందు ప్రైవసీ చెకప్ అనే ఫీచర్ను వాట్సాప్ లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. -
ఇబ్బంది పెట్టే కాల్స్కు చెక్.. టెలికాం సంస్థలకు ట్రాయ్ కీలక ఆదేశాలు!
అవాంఛిత ఫోన్ కాల్స్, ఎస్ఎంఎస్ల నుంచి యూజర్లకు ఉపశమనం కలిగేలా టెలికాం సంస్థలకు టెలికాం నియంత్రణాధికార సంస్థ (ట్రాయ్) కీలక ఆదేశాలు జారీ చేసింది. ఆయా సంస్థలు తమ ఉత్పత్తుల ప్రచారం కోసం ఫోన్ కాల్స్, మెసేజ్లు యూజర్లకు పంపాలంటే వారి అనుమతి తీసుకోవాలి. ఇందుకోసం 2 నెలల్లోపు ఓ యూనిఫైడ్ డిజిటల్ వేదికను అభివృద్ధి చేయాలని సూచించింది. ముందుగా అడ్వైర్టెజ్మెంట్ మొబైల్ ఫోన్ కాల్స్ అందుకోవడానికి సబ్స్క్రైబర్లు తమ సంసిద్ధతను తెలియజేయాల్సి ఉంటుంది. సంస్థలు కస్టమర్లను సంప్రదించి వారి అంగీకారం మేరకు వాణిజ్య ప్రకటనలు పంపడం ఆరంభిస్తాయంటూ ఓ ప్రకటనలో ట్రాయ్ వివరించింది. ప్రస్తుతం సంస్థలు ప్రమోషనల్ కాల్స్,మెసేజెస్ పంపుతున్నామని, అందుకు వినియోగదారుల అనుమతి కోరేలా ఎలాంటి వ్యవస్థ లేదు. అందుకే 2 నెలల్లో యూనిఫైడ్ డిజిటల్ వ్యవస్థను అభివృద్ధి చేయాలని టెలికాం సంస్థలకు స్పష్టం చేసింది. సమ్మతి కోరుతూ పంపే సందేశాలు ‘127’తో మొదలయ్యేలా కామన్ షార్ట్ కోడ్ను వినియోగించాలని ఆయా సంస్థలను ట్రాయ్ ఆదేశించింది. చదవండి👉 సూపర్, మైండ్ బ్లోయింగ్.. ఉక్కిరి బిక్కిరి అవుతున్న టిమ్ కుక్! -
చిర్రెత్తిస్తున్న స్పామ్ కాల్స్
సాక్షి, అమరావతి: అర్జంట్ పనిలో ఉన్నపుడు అదేపనిగా ఫోన్ మోగుతూ ఉంటుంది. అంత పనిలోనూ ఫోన్ ఎత్తితే.. తక్కువ వడ్డీతో లోన్ ఇస్తామనో, తక్కువ రేటుకే ఇంటి స్థలం అంటూనో.. అవతలి నుంచి గొంతు వినిపిస్తుంది. ఆ మాట వినగానే ఫోన్ వినియోగదారుడికి చిర్రెత్తుకొస్తుంది. ఈ స్పామ్ కాల్ సమస్య ప్రపంచ వ్యాప్తంగా చాలా వేధిస్తోంది. యూజర్లను కాల్స్తో పాటు మెసేజ్లు, ఈ–మెయిళ్లతో కూడా చికాకు పెడుతున్నారు. మన దేశంలో ఎక్కువ మందికి రోజులో మూడు అంతకంటే ఎక్కువ స్పామ్ కాల్స్ వస్తున్నట్టు లోకల్ సర్వే నివేదిక చెబుతోంది. ఇలాంటి కాల్స్ను 40 శాతం మంది బ్లాక్/డిస్కనెక్ట్ చేస్తున్నట్టు పేర్కొంది. కేవలం 2 శాతం మంది మాత్రమే స్పామ్ కాల్స్లో మాట్లాడుతున్నట్టు వివరించింది. ఈ స్పామ్ కాలర్లను నియంత్రించడానికి భారత ప్రభుత్వం పదేపదే కొత్త నిబంధనలను ప్రవేశపెడుతూనే ఉంది. 2007లో డునాట్డిస్టర్బ్ (డీఎన్డీ) సదుపాయా న్ని తీసుకొచ్చింది. స్పామ్ కాల్స్ను అరికట్టడానికి టెలికాం కమర్షియల్ కమ్యూనికేషన్ కస్టమర్స్ ప్రిఫరెన్స్ రెగ్యులేషన్ (టీసీసీసీపీఆర్) ఫ్రేమ్వర్క్ను 2010లో ట్రాయ్ ప్రవేశపెట్టింది. వీటిని యాక్టివేషన్ చేసుకున్నప్పటికీ 95 శాతం మంది తిరిగి స్పామ్కాల్స్ను ఎదుర్కొన్నట్టు సర్వే గుర్తించింది. స్పామ్బాట్లో రెండో స్థానం.. లండన్కు చెందిన స్పామ్, సైబర్ బెదిరింపులను ట్రాక్ చేసే సంస్థ ‘స్పామ్హాస్ ప్రాజెక్ట్’ నివేదిక ప్రకారం చైనా తర్వాత భారత దేశంలోనే అత్యధికంగా స్పామ్బాట్లను వినియోగిస్తున్నా రు. ఒకేసారి ఎక్కువ సంఖ్యలో స్పామ్ కాల్స్, మెసేజ్లను పంపేందుకు స్వయం ప్రతిపత్తి కలిగిన కంప్యూటర్ ప్రోగ్రామ్ స్పామ్బాట్ను వినియోగిస్తారు. ఈ ఏడాది మార్చి నెలాఖరుకు భారత్లో దాదాపు 9.39 లక్షల స్పామ్బాట్లు చురుగ్గా ఉన్నట్టు అంచనా. వీటిని ప్రధానంగా ఫిషింగ్, క్లిక్–ఫ్రాడ్, డీడీఓఎస్ కోసం ఉపయోగిస్తున్నట్టు గుర్తించారు. రష్యాలో అధికంగా స్పామ్ ఈ–మెయిళ్లు స్పామ్, ఫిషింగ్ తాజా నివేదిక ప్రకారం 2022లో రష్యా (29.8 శాతం), చైనా (14శాతం), అమెరికా (10.7 శాతం) స్పామ్ ఈ–మెయిళ్లలో తొలి మూడు స్థానాల్లో నిలిచాయి. అత్యధికంగా స్పెయిన్లో 8.8 శాతం, తర్వాత రష్యాలో 7.3 శాతం హానికరమైన ఈ–మెయిళ్లను బ్లాక్ చేశారు. భార త్లో స్పామ్ మెయిళ్ల వాటా 1.8 శాతంగా ఉంటే.. బ్లాక్ చేసిన ఈ–మెయిళ్లు 1.6 శాతంగా ఉంది. ప్రపంచ వ్యాప్తంగా ఇదే సమస్య.. స్పామ్కాల్ సమస్య ప్రపంచ వ్యాప్తంగా ప్రబలంగా మారింది. అర్జెంటీనాలో ఫోన్ కాల్స్లో అత్యధికంగా 52 శాతం స్పామ్కాల్స్ నమోదవుతున్నట్టు గుర్తి ంచారు. భారత్లో ఆ వాటా 12.7 శాతంగా ఉంది. ఇక ఐర్లాండ్, హంగేరీ, థాయ్లాండ్ దేశాలు స్పామ్ కాల్ ముప్పు చాలా తక్కువగా ఉంది. ఈ దేశాల్లో 10 శాతం లోపే స్పామ్ కాల్స్ నమోదవుతున్నాయి. -
అవాంఛిత కాల్స్పై టెల్కోలతో ట్రాయ్ భేటీ
న్యూఢిల్లీ: అవాంఛిత కాల్స్, మెసేజీలను కట్టడి చేసే దిశగా టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్ మరింతగా దృష్టి పెడుతోంది. ఇందుకోసం ’వ్యాపారపరమైన అవాంఛిత కమ్యూనికేషన్ (యూసీసీ) డిటెక్ట్’ విధానాన్ని అభివృద్ధి చేయడం, అమలు చేయడానికి సంబంధించి మార్చి 27న టెల్కోలతో సమావేశం కానుంది. (ఇదీ చదవండి: హిండెన్బర్గ్ లేటెస్ట్ రిపోర్ట్: భారత సంతతి ఎగ్జిక్యూటివ్ అమృత ఆహూజా పాత్ర ఏంటి?) డిస్ట్రిబ్యూటెడ్ లెడ్జర్ టెక్నాలజీ (డీఎల్టీ) ప్లాట్ఫాంపై అవాంఛిత సందేశాలను టెల్కోలు గుర్తించడం, వాటిని పంపే సంస్థలపై కఠిన చర్యలు తీసుకోవడం, కృత్రిమ మేథ ఆధారిత యాంటీ–ఫిషింగ్ సిస్టమ్ను వినియోగించడం తదితర అంశాలపై ఇందులో చర్చించనున్నారు. సాంకేతిక సొల్యూషన్స్, నియంత్రణ, ఆదేశాలు, నిశిత పర్యవేక్షణ వంటి బహుముఖ వ్యూహాలతో అవాంఛిత కాల్స్, మెసేజీల సమస్యను పరిష్కరించే దిశగా టెల్కోలతో సమావేశం ఉండనున్నట్లు ట్రాయ్ పేర్కొంది. (మండే వేసవిలో ప్రయాణికులకు గుడ్ న్యూస్: రైల్వే కీలక నిర్ణయం) -
డీజీపీకి ఎమ్మెల్యే రాజాసింగ్ లేఖ
సాక్షి, హైదరాబాద్: డీజీపీ అంజనీకుమార్కి గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ లేఖ రాశారు. పలు ఫోన్ నంబర్ల నుంచి బెదిరింపు కాల్స్ వస్తున్నాయంటూ లేఖలో పేర్కొన్నారు. ఇప్పటి వరకు ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదని రాజాసింగ్ ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, ఎమ్మెల్యే రాజాసింగ్ తనకు పాకిస్తాన్ నుంచి చంపేస్తామంటూ బెదిరింపు కాల్స్ వచ్చినట్లు ట్విట్టర్ ద్వారా రాష్ట్ర డీజీపీకి ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. వాట్సాప్ ద్వారా పాకిస్థాన్ నుంచి ఓ వ్యక్తి ఫోన్ చేసి తన ఆచూకీ, కుటుంబ వివరాలు చెబుతూ... హైదరాబాద్లో ఉన్న యాక్టివ్ స్లీపర్ సెల్ ద్వారా చంపేస్తామని బెదిరించినట్లు రాజాసింగ్ తెలిపారు. ప్లస్ 923105017464 నెంబర్ ద్వారా బెదిరింపు కాల్స్ వచ్చినట్లు రాజాసింగ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తరచూ ఇలాంటి బెదిరింపు కాల్స్ వస్తున్నాయని ఆయన తన ట్విట్టర్లో పేర్కొన్నారు. చదవండి: 11 గంటలు .. 14 ప్రశ్నలు.. కవిత సమాధానాలు పూర్తిగా వీడియో రికార్డింగ్ -
పెద్ద తలనొప్పిగా మారిన స్పామ్ కాల్స్
-
ఢిల్లీలో రేపు అత్యవసర కరోనా సమీక్ష సమావేశం
న్యూఢిల్లీ: పలు దేశాల్లో కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ గురువారం అత్యవసర సమీక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఢిల్లీ ప్రభుత్వం కరోనా పరిస్థితిపై గట్టి నిఘా ఉంచాలని, ఏదైనా అనుకోని పరిస్థితి ఎదురైతే తగిన చర్యలు తీసుకునేలా సంసిద్ధం కావాలని అరవింద్ కేజ్రీవాల్ ఆరోగ్య శాఖను ఆదేశించినట్లు పేర్కొన్నారు. ఇదిలా ఉండగా జపాన్, దక్షిణ కొరియా, బ్రెజిల్, యూఎస్లలో కోవిడ్-19 కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కొత్త వేరియంట్లను ట్రాక్ చేసేలా తగిన చర్యలను తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం మంగళవారం అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను కోరిన సంగతి తెలిసిందే. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య కార్యదర్శి రాజేష భూషణ్ రాష్ట్రాలకు కేంద్ర పాలితన ప్రాంతాలకు కరోనా విషయమై అప్రమత్తంగా ఉండాలంటూ లేఖ రాశారు. ఆ లేఖలో దేశంలో కరోనాకి సంబంధించిన కొత్త వేరియంట్ని గుర్తించగలిగేలా అవసరమైన ప్రజారోగ్య చర్యలను చేపట్టడం ద్వారా సులభంగా బయటపడేలా మార్గం సుగమం అవుతుందని చెప్పారు. (చదవండి: మొబైల్ ఫోన్ కోసం కన్నతల్లినే దారుణంగా కొట్టిన కసాయి కొడుకు) -
ఇబ్బంది పెట్టే కాల్స్, సందేశాలకు చెక్!
న్యూఢిల్లీ: ఇబ్బంది పెట్టే కాల్స్, ఎస్ఎంఎస్లను గుర్తించేందుకు పలు టెక్నాలజీపై పనిచేస్తున్నట్టు టెలికం రంగ నియంత్రణ సంస్థ ‘ట్రాయ్’ ప్రకటించింది. ఆర్థిక మోసాల నివారణకు ఇతర నియంత్రణ సంస్థలతో కలసి సంయుక్త కార్యాచరణ ప్రణాళికను రూపొందిస్తున్నట్టు తెలిపింది. ‘‘అనుచిత వాణిజ్య సంప్రదింపులు లేదా ఇబ్బంది పెట్టే సంప్రదింపులు అన్నవి ప్రజలను ఎక్కువగా అసౌకర్యానికి గురిచేస్తున్నాయి. వారి గోప్యతకు భంగం కలిగిస్తున్నాయి. నమోదు కాని టెలీ మార్కెటర్ల (యూటీఎం)కు వ్యతిరేకంగా అధిక ఫిర్యాదులు వస్తున్నాయి. పలు అనుచిత సందేశాలు కూడా పెరిగాయి. వీటితో పాటు ఇబ్బంది పెట్టే కాల్స్ను కూడా ఒకే రీతిలో చూడడమే కాకుండా, పరిష్కారం కనుగొనాల్సి ఉంది’’అని ట్రాయ్ పేర్కొంది. అనుమతి లేని వాణిజ్య సంప్రదింపులకు చెక్ పెట్టేందుకు పలు భాగస్వామ్య సంస్థలో కలసి చర్యలు తీసుకోనున్నట్టు ట్రాయ్ తెలిపింది. -
వీహెచ్పీ నేత బాలస్వామికి బెదిరింపు కాల్స్.. ఈస్ట్జోన్ డీసీపీకి ఫిర్యాదు
సుల్తాన్బజార్: విశ్వహిందూ పరిషత్ (వీహెచ్పీ) నేత బాలస్వామికి ఆదివారం బెదిరింపు కాల్స్ రావడంతో ఆయన ఈస్ట్జోన్ డీసీపీకి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా బాలస్వామి మా ట్లాడుతూ బజరంగ్దళ్ నిరసన కార్యక్రమాలను నిలిపి వేయాలని విశ్వహిందూ పరిషత్ ప్రచార ప్రముఖ్ అయిన తనకు ఆదివారం అర్ధరాత్రి బెదిరింపు కాల్స్ వచ్చాయని తెలిపారు. ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ, మంత్రి కేటీఆర్లకు వ్యతిరేకంగా స్టేట్మెంట్లు ఇవ్వడంతో పాటు డీసీపీలను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేయడాన్ని వారు సవాలు చేస్తున్నారన్నారు. రకరకాల పేర్లతో ఫోన్లు చేసి భయభ్రాంతులకు గురిచేసే ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. బజరంగ్దళ్ ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించ తలపెట్టిన నిరసన కార్యక్రమాలను వెంటనే రద్దుచేయాలని, లేదంటే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చ రించినట్లు బాలస్వామి వెల్లడించారు. వీహెచ్పీ విడుదల చేసిన ప్రెస్నోట్ను కొందరు మార్పిడి చేసి వైరల్ చేశారన్నారు. అందులో వివాదాస్పద వ్యాఖ్యలు జోడించారని ఆరోపించారు. తమ ఫిర్యాదుపై డీసీపీ సానుకూలంగా స్పందించారని చెప్పారు. -
తస్మాత్ జాగ్రత్త.. కాల్ చేసి ]401]తో కలిపి డయల్ చేయాలని చెబుతున్నారా..
సాక్షి, హైదరాబాద్: సైబర్ నేరగాళ్లు ఎప్పటికప్పుడు కొత్త ఎత్తులు వేస్తున్నారు. బాధితులకు తెలియకుండా వారితోనే కాల్ డైవర్షన్ యాక్టివేట్ చేయిస్తున్నారు. ఆపై వారి వాట్సాప్ను తమ అధీనంలోకి తీసుకుని డబ్బు కోరుతూ పలువురికి సందేశాలు పంపుతున్నారు. నగరానికి చెందిన ఓలా గ్రాడ్యుయేట్ బుధవారం సిటీ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. ఏసీపీ కేవీఎం ప్రసాద్ కథనం ప్రకారం వివరాలు.. నగరానికి చెందిన బాధితురాలికి మంగళవారం 96––––––44 నుంచి ఫోన్ వచ్చింది. జియో సర్వీస్ సెక్షన్ నుంచి మాట్లాడుతున్నామంటూ పరిచయం చేసుకున్న అవతలి వ్యక్తి సర్వీస్లో ఇబ్బందిపై కాల్ సెంటర్కు ఫిర్యాదు చేశారా? అని అడిగాడు. తాను అలాంటి ఫిర్యాదులేమీ చేయలేదని బాధితురాలు చెప్పింది. తమ రికార్డుల్లో ఫిర్యాదు నమోదై ఉందని చెప్పిన కేటుగాడు అది క్లోజ్ కావాలంటే తాను చెప్పినట్లు చేయాలన్నాడు. ]401] తర్వాత 709–––––57 నంబర్ జోడించి రింగ్ చేయాలని చెప్పాడు. అతడి మాటలు నిజమే అని నమ్మిన ఆమె అలానే చేశారు. దీంతో నేరుగా ప్రమేయం లేకుండా తెలియకుండానే ఆమె ఫోన్లో కాల్ డైవర్షన్ యాక్టివేట్ అయింది. ఆమెకు రావాల్సిన కాల్స్ అన్నీ కేటుగాడు సూచించిన 709–––––57 నంబర్కు వెళ్తున్నాయి. అంతటితో ఆగని అతగాడు ఆమె వాట్సాప్ను తన అధీనంలోకి తీసుకోవాలని భావించాడు. దీనికోసం తన ఫోన్లో వాట్సాప్ ఇన్స్టాల్ చేసుకున్నాడు. ఈ యాప్ యాక్టివేట్ కావాలంటే అందులో వినియోగదారుడి ఫోన్ నంబర్ పొందుపరచాలి. ఆపై దానికి ఎస్సెమ్మెస్ లేదా కాల్ రూపంలో వచ్చే ఆరు అంకెల యాక్టివేషన్ కోడ్ పొందుపరచాలి. చదవండి: రి‘కార్డ్’ స్థాయిలో క్రెడిట్!.. జాగ్రత్తగా ఉండకపోతే జేబుకు చిల్లే కేటుగాడు తన ఫోన్లోని వాట్సాప్లో బాధితురాలి నంబర్ పొందుపరిచి, కాల్ రూపంలో యాక్టివేషన్ కోడ్ వచ్చే ఆప్షన్ ఎంచుకున్నాడు. దీంతో బాధితురాలి ఫోన్కు రావాల్సిన ఈ కాల్ డైవర్షన్ కారణంగా కేటుగాడు పొందుపరిచిన 709–––––57 నంబర్కు వచ్చింది. దీని ద్వారా ఆ యాప్ యాక్టివేట్ చేసుకోవడంతో బాధితురాలి వాట్సాప్ అతడి అధీనంలోకి వెళ్లిపోయింది. ఆపై అసలు కథ మొదలెట్టిన సైబర్ నేరగాడు ఆమె వాట్సాప్ కాంటాక్ట్స్ లిస్ట్లో ఉన్న అందరికీ సందేశాలు పంపాడు. అత్యవసరంగా రూ.10 వేలు ఫోన్ పే లేదా గూగుల్ పే ద్వారా బదిలీ చేయాలని వాటిలో సూచించాడు. ఆ మొత్తాన్ని 709–––––57 నంబర్కు పంపాలని కోరాడు. వారి ద్వారా విషయం తెలుసుకున్న బాధితురాలు బుధవారం సైబర్ క్రైమ్ ఠాణాలో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. నేరగాళ్లు వాడిన ఫోన్ నెంబర్ల ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆ ఫోన్ కాల్స్ నమ్మవద్దు అపరిచిత వ్యక్తుల నుంచి వచ్చే ఫోన్ కాల్స్ నమ్మవద్దు. సరిచూసుకోకుండా ఆ ఫోన్లు చేసిన వాళ్లు చెప్పినట్లు చేస్తే ఆర్థికంగా నష్టపోవడంతో పాటు వ్యక్తిగత డేటాను కోల్పోవాల్సి వస్తుంది. ]401]తో ఏ నంబర్ కలిపి డయల్ చేస్తామో ఆ నంబర్కు కాల్ డైవర్షన్ యాక్టివేట్ అయిపోతుంది. దీన్ని గమనించిన వాళ్లు డీ యాక్టివేట్ చేసుకోవాలంటే ఫోన్లోని కాల్ సెట్టింగ్స్లోకి వెళ్లాలి. ఈ–బైక్స్ తయారీ సంస్థ అథర్ ఎనర్జీ లిమిటెడ్ పేరుతో నగరవాసికి కాల్ చేసిన సైబర్ నేరగాళ్లు డీలర్షిప్ అంటూ ఎర వేశారు. అతడు సరి చూసుకోకుండా నమ్మేయడంతో రూ.12 లక్షలు కాజేశారు. దీనిని దృష్టిలో పెట్టుకుని అపరిచితులు చేసే ఫోన్ కాల్స్ వలలో పడకుండా ఉండాలి. – కేవీఎం ప్రసాద్, సిటీ సైబర్ క్రైమ్ ఏసీపీ