-
రూ. 29వేల కోట్ల వజ్రం.. ఎవరిదగ్గరుంటే వారు చనిపోతారట!
బ్రిటీష్ వారితో సహా విదేశీ ఆక్రమణదారులు భారతదేశాన్ని దోచుకోకుండా ఉండి ఉంటే.. ప్రపంచంలోనే సుసంపన్నమైన దేశంగా భారత్ ఖ్యాతి గడించేది. ఎంతోమంది విదేశీయులు భారదేశంలోని రాజుల మీద, దేవాలయాల మీద దాడి చేసి ఎన్నో విలువైన వస్తువులను దోచుకెళ్లారు. ఇలా దోచుకెళ్లిన వాటిలో ఒకటి 'హోప్ డైమండ్' అని పిలువబడే వజ్రం.నిజానికి ఖరీదైన వజ్రం అంటే కోహినూర్ వజ్రమే గుర్తొస్తుంది, హోప్ డైమండ్ అనే మరో ఖరీదైన వజ్రం కూడా ఉందని బహుశా చాలామందికి తెలియకపోవచ్చు. ఇక్కడ చిత్రం ఏమిటంటే.. ఈ వజ్రం ఎవరి దగ్గర ఉంటుందో.. వారంతా అకాల మరణం చెందుతారని ఓ నమ్మకం ఉంది. ఈ కారణంగానే దీన్ని శాపగ్రస్త వజ్రంగా పిలుస్తారు.గుంటూరులోని కొల్లూరు గనుల నుంచి ఈ వజ్రం వెలికితీసినట్లు కొంతమంది, ఇతర వజ్రాలతో పాటు ఆంధ్రప్రదేశ్లోని వజ్రకరూర్లోని కింబర్లైట్ ప్రాంతాల నుంచి తీసి ఉండొచ్చని కొందరు పరిశోధకులు చెబుతున్నారు. మొత్తం మీద ఇది ఆంధ్రప్రదేశ్లో దొరికినట్లు స్పష్టమవుతోంది.17వ శతాబ్దంలో ఈ వజ్రం బయటపడినప్పటి నుంచి చాలాసార్లు చేతులు మారినట్లు సమాచారం. మొదట్లో ఈ వజ్రాన్ని ఫ్రెంచ్ రత్నాల వ్యాపారి జీన్-బాప్టిస్ట్ టావెర్నియర్ ఓ ముడి పదార్థంగానే కొనుగోలు చేసారు. ఆ తరువాత రాజ కుటుంబాలు దాన్ని దక్కించుకున్నాయి. ఆ తరువాత ఫ్రాన్స్కు చెందిన లూయిస్ XIV, న్యూయార్క్ నగరానికి చెందిన హ్యారీ విన్స్టన్ దీన్ని సొంతం చేసుకున్నారు. ఈ తరువాత ఈ వజ్రాన్ని 1958లో వాషింగ్టన్లోని స్మిత్సోనియన్ ఇన్స్టిట్యూషన్కు విరాళంగా ఇచ్చేసారు.ఫ్రెంచ్ రత్నాల వ్యాపారి జీన్-బాప్టిస్ట్ టావెర్నియర్ దీన్ని భారతదేశంలోని ఓ హిందూ దేవాలయం నుంచి దొంగలించినట్లు ఓ కథ కూడా ప్రచారంలో ఉంది. దేవాలయంలోని వజ్రం కనుక.. ఆ ఆలయంలో పూజారులు వజ్రం పోయిందని, ఆ వజ్రం తీసుకున్న వ్యక్తులను శపించారు. ఈ కారణంగానే ఇది ఎవరి దగ్గర ఉంటే వారు అకాలమరణం చెందుతున్నారని, చివరకు స్మిత్సోనియన్ ఇన్స్టిట్యూషన్కు విరాళంగా ఇచ్చేసారు.1839లో హెన్రీ ఫిలిప్ హోప్ అనే వ్యక్తి ఈ వజ్రాన్ని మొదట సేకరించడంతో.. దానికి అతనిపేరే పెట్టారు. స్మిత్సోనియన్ ఇన్స్టిట్యూషన్ వారి ప్రకారం.. ఈ వజ్రం 16 తెల్లని వజ్రాల మధ్యలో ఓ లాకెట్టు మాదిరిగా ఉంది. చికాగో డైమండ్ కొనుగోలుదారుల ప్రకారం.. హోప్ డైమండ్ విలువ 350 మిలియన్ డాలర్ల వరకు ఉంటుందని సమాచారం. భారతీయ కరెన్సీ ప్రకారం దీని విలువ రూ. 29,19,52,67,500. -
1051 అపార్ట్మెంట్ల కోసం రూ.2000 కోట్లు: ప్రముఖ కంపెనీ కీలక నిర్ణయం
రియల్ ఎస్టేట్ రంగం రోజురోజుకి అభివృద్ధి చెందుతున్న తరుణంలో.. ప్రముఖ రియల్టీ సంస్థ 'క్రిసుమి కార్పొరేషన్' తన విస్తరణ ప్రణాళికలో భాగంగా గురుగ్రామ్లో 1,051 లగ్జరీ అపార్ట్మెంట్లను నిర్మించడానికి రూ. 2,000 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.క్రిసుమి కార్పొరేషన్ అనేది కృష్ణా గ్రూప్ అండ్ జపాన్కు చెందిన సుమిటోమో కార్పొరేషన్ మధ్య జాయింట్ వెంచర్. ఇది ఇప్పటికే సెక్టార్ 36A, గురుగ్రామ్లో పెద్ద లగ్జరీ టౌన్షిప్ 'క్రిసుమి సిటీ'ని అభివృద్ధి చేస్తోంది. ఇందులో మొదటి దశ 433 యూనిట్లతో కూడిన 'వాటర్ఫాల్ రెసిడెన్సెస్' పూర్తికాగా, రెండవ దశ 320 యూనిట్లతో కూడిన 'వాటర్ఫాల్ సూట్లు' 2028లో డెలివరీ చేయడానికి షెడ్యూల్ చేసింది.ఇవి కాకుండా.. మరో 1,051 లగ్జరీ యూనిట్లతో కూడిన తమ టౌన్షిప్లో ఫేజ్ 3, ఫేజ్ 4లో రూ. 2,000 కోట్లు పెట్టుబడి పెట్టనున్నట్లు సోమవారం క్రిసుమి ఒక ప్రకటనలో తెలిపింది. ఈ ప్రాజెక్ట్ మొత్తం 2.3 మిలియన్ చదరపు అడుగుల విస్తీర్ణంలో అభివృద్ధి చెందుతుంది. అదనంగా.. 350 కోట్ల రూపాయల పెట్టుబడితో టౌన్షిప్లో సుమారు 1,60,000 చదరపు అడుగుల నిర్మాణ విస్తీర్ణంతో 2 ఎకరాలలో అత్యాధునిక క్లబ్ను సంస్థ అభివృద్ధి చేయనుంది. దీనికి సంబంధించిన నిర్మాణ కార్యకలాపాలు గత నెలలో ప్రారంభమయ్యాయి, డిసెంబర్ 2029 నాటికి ఈ ప్రాజెక్ట్ పూర్తి చేయనున్నట్లు సమాచారం. -
ఎక్కువ మంది ఇష్టపడి కొంటున్న 7 సీటర్ కారు ఇదే!
భారతదేశంలో 7 సీటర్ కార్లు విరివిగా అందుబాటులో ఉన్నాయి. ఎన్ని కార్లు ఉన్నా.. ఈ విభాగంలో మారుతి ఎర్టిగా కారుకు ఓ ప్రత్యేకమైన డిమాండ్, ఆదరణ ఉంది. ఈ కారును గత నెలలో (మే 2024) ఏకంగా 13,893 మంది కొనుగోలు చేశారు. దీంతో ఎక్కువ అమ్మకాలు పొందిన 7 సీటర్ కారుగా ఎర్టిగా మళ్ళీ రికార్డ్ క్రియేట్ చేసింది.దేశీయ మార్కెట్లో మారుతి ఎర్టిగా ధరలు రూ. 8.69 లక్షల నుంచి రూ. 13.03 లక్షల (ఎక్స్ షోరూమ్) మధ్య ఉన్నాయి. నాలుగు వేరియంట్లలో అందుబాటులో ఉన్న ఈ కారు మొత్తం ఏఋ మోనోటోన్ కలర్ ఆప్షన్లలో లభిస్తోంది. దూర ప్రాంతాలకు ఫ్యామిలీతో కలిసి వెళ్లడానికి ఈ కారు ఉత్తమ ఎంపిక.మారుతి ఎర్టిగా 1.5 లీటర్ పెట్రోల్ ఇంజిన్ పొందుతుంది. ఇది 103 పీఎస్ పవర్ మరియు 137 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తోంది. ఇది 5 స్పీడ్ మాన్యువల్ లేదా 6 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్తో లభిస్తుంది. ఇది CNG రూపంలో కూడా లభిస్తుంది. ఇది 88 పీఎస్ పవర్, 121.5 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇది 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్తో మాత్రమే లభిస్తుంది.డిజైన్, ఫీచర్స్ పరంగా అద్భుతంగా ఉన్న ఈ కారు నాలుగు ఎయిర్బ్యాగ్లు, రియర్ పార్కింగ్ సెన్సార్లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, హిల్ హోల్డ్ అసిస్ట్, ఐసోఫిక్స్ చైల్డ్ సీట్ ఎంకరేజ్ వంటి సేఫ్టీ ఫీచర కూడా పొందుతుంది. ఈ కారు దేశీయ విఫణిలో ఇనోవా క్రిష్టా, కియా కారెన్స్, మారుతి ఎక్స్ఎల్6 వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది. -
యూట్యూబ్ కొత్త ఫీచర్.. డీప్ఫేక్ వీడియోలకు గుడ్బై
ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (AI) రాజ్యమేలుతున్న తరుణంలో దాదాపు అన్ని రంగాలు వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. అయితే కొంతమంది ఈ టెక్నాలజీని డీప్ఫేక్ వీడియోలను సృష్టించడానికి ఉపయోగించి దుర్వినియోగం చేస్తున్నారు. దీనికి సాధారణ ప్రజలు మాత్రమే కాకుండా సెలబ్రిటీలు కూడా బలైపోతున్నారు.సోషల్ మీడియాలో నెటిజన్లను ఆకర్శించడానికి కొంతమంది తప్పుడు వీడియోలను క్రియేట్ చేసి పోస్ట్ చేస్తున్నారు. ఈ వీడియోలు చూడటానికి అసలైన వీడియోల మాదిరిగానే ఉండటం వల్ల, అసలైన వీడియో ఏది? నకిలీ వీడియో ఏది, అని గుర్తించడం చాలా కష్టమైపోయింది. ఇలాంటి వాటిని పరిష్కరించడానికి యూట్యూబ్ చర్యలు తీసుకుంటోంది, ఇందులో భాగంగానే కొత్త ఫీచర్స్ పరిచయం చేస్తోంది.ఒక వ్యక్తి అనుమతి లేకుండా వారి ఫోటోలను గానీ, వారి వాయిస్ గానీ ఉపయోగించి వీడియో క్రియేట్ చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేస్తే వాటిపైన రిపోర్ట్ చేయవచ్చు. అంతే కాకూండా ఏఐను ఉపయోగించి కంటెంట్ క్రియేట్ చేసేవారు తప్పకుండా ఆ విషయాన్ని యూజర్లకు తెలియజేయాలని యూట్యూబ్ పేర్కొంది.ఏఐను ఉపయోగించి డీప్ఫేక్ వీడియోలను క్రియేట్ చేస్తే.. యూజర్ల రిపోర్ట్ మేరకు యూట్యూబ్ దాన్ని క్షుణ్ణంగా పరిశీలించి, ఆ కంటెంట్ డిలీట్ చేస్తుంది. ఈ విధంగా డీప్ఫేక్ వీడియోలను పూర్తిగా రూపుమాపే అవకాశం ఉంది. దీంతో డీప్ఫేక్ భయానికి లోనయ్యేవారు నిశ్చింతగా ఉండవచ్చు. యూజర్ల భద్రతే ప్రధానంగా భావించిన యూట్యూబ్ ఈ నిర్ణయం తీసుకుంది. -
చైనా కోరికను తిరస్కరించిన భారత్
నాలుగు సంవత్సరాల తర్వాత నేరుగా ప్యాసింజర్ విమానాలను మళ్ళీ ప్రారంభించాలని చైనా.. భారత్ను కోరింది. సరిహద్దు వివాదంలో కొనసాగుతున్న ఉద్రిక్తల కారణంగా ఇండియా.. చైనా రిక్వెస్ట్ను తిరస్కరించింది. జూన్ 2020లో హిమాలయ సరిహద్దులో జరిగిన సైనిక ఘర్షణలో సుమారు భారతీయ సైనికులు ప్రాణాలు కోల్పోయారు. అప్పటి నుంచి భారత్ - చైనా సంబంధాలు ఉద్రిక్తంగా ఉన్నాయి.చైనా - ఇండియా మధ్య నేరుగా విమానాల రాకపోకలు లేకపోవడంతో.. హాంకాంగ్, శ్రీలంక, నేపాల్, మయన్మార్ వంటి దేశాలకు వెళ్లి చైనాకు వెళ్తున్నారు. 2020లో హిమాలయ సరిహద్దులో జరిగిన సంఘటనను దృష్టిలో ఉంచుకుని భారత ప్రభుత్వం చైనా యాప్లను నిషేదించింది.సుమారు నాలుగు సంవత్సరాల తరువాత మళ్ళీ విమానయాన సర్వీసులను ప్రారంభించాలని చైనా.. భారత పౌర విమానయాన అధికారులను కోరింది. కానీ భారతీయ అధికారులు దీనిపైన స్పందించలేదు. విమానాయ సర్వీసులను ప్రారంభించడం ద్వారా రెండు దేశాలు ప్రయోజనాన్ని పొందుతాయని చైనా అధికారు చెబుతున్నారు. సరిహద్దులో శాంతి ఉంటే తప్పా చైనాతో ద్వైపాక్షిక చర్చలు ముందుకు సాగవని భారత్కు చెందిన ఒక సీనియర్ అధికారి స్పష్టం చేశారు.ఇదిలా ఉండగా.. భారతదేశంలో ఏవియేషన్ రంగంలో బలమైన వృద్ధి చెందుతోంది. పది సంవత్సరాల ముందు 5వ స్థానంలో ఉన్న ఇండియన్ ఎయిర్లైన్ మార్కెట్.. ఇప్పుడు ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద దేశీయ ఎయిర్లైన్ మార్కెట్గా అవతరించింది. -
కొండెక్కిన టమోటా ధరలు: కేజీ ఎంతంటే?
దేశంలో టమోటా ధరలు భారీగా పెరిగాయి. తమిళనాడు, కర్నాటక, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర మొదలైన దక్షిణాది రాష్ట్రాల్లో కేజీ టమోటా రూ. 90 నుంచి రూ. 100 మధ్య ఉన్నాయి. ముంబైలో ఈ ధరలు రూ. 80 నుంచి రూ. 100 మధ్య ఉన్నట్లు తెలుస్తోంది.2024 ఏప్రిల్లో వైజాగ్, విజయవాడ రాష్ట్రాల్లోని హోల్సేల్ మార్కెట్లో 15 కేజీల టమోటాల ధర రూ. 150 నుంచి రూ. 200 మధ్య ఉండేది. అయితే ఇప్పుడు ఈ ధరలు అమాంతం పెరిగాయి. దీంతో 15 కేజీల టమోటాలు ధర రూ. 1100 నుంచి రూ. 1200లకు చేసింది. ప్రస్తుతం హోల్సేల్ మార్కెట్లో కూడా కేజీ టమోటా ధర రూ. 75 నుంచి రూ. 80 వరకు ఉన్నట్లు తెలుస్తోంది.వర్షాకాలంలో కూరగాయల ధరలు సాధారణంగా పెరుగుతాయి. వర్షం వల్ల పంట ఏపుగా పెరిగినప్పటికీ.. దిగుబడి మాత్రం చాలా తగ్గుతుంది. దీంతో ధరలు అమాంతం పెరుగుతాయి. ఈ ఏడాది ఓ వైపు వర్షాలు, మరోవైపు భారీ ఎండలు కారణంగా నిత్యావసరాల ధరలకు కూడా రెక్కలొచ్చాయి.ఆలస్యమైన రుతుపవనాలు కూడా టమోటా తోటలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. సాధారణంగా జూన్ - జులై నెలల్లో టమాటో దిగుబడి ఎక్కువగా ఉంటుంది. కానీ సరైన సమయంలో వర్షాలు కురవకపోవడం.. రుతుపవనాల ఆలస్యం కారణంగా టమోటా సాగును చాలామంది రైతులు వాయిదా వేశారు. టమోటా ధరలు మాత్రమే కాకుండా బంగాళదుంపలు, ఉల్లి వంటి ఇతర కూరగాయల ధరలు పెరిగాయి. -
ప్రపంచంలోనే ఎత్తైన బ్రిడ్జిపై మొదటి రైలు.. ఆనంద్ మహీంద్రా ట్వీట్
సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్గా ఉంటూ.. ఆసక్తికరమైన విషయాలను షేర్ చేస్తూ ఉండే పారిశ్రామిక దిగ్గజం 'ఆనంద్ మహీంద్రా' (Anand Mahindra) తాజాగా ఓ ఆసక్తికరమైన వీడియో షేర్ చేస్తూ ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే వంతెనను దాటిన మొదటి రైలు అంటూ ట్వీట్ చేశారు.ఆనంద్ మహీంద్రా వీడియో షేర్ చేస్తూ.. ఇది యోగా దినోత్సవం కాబట్టి, మన మౌలిక సదుపాయాలు సాధ్యమైనంత వరకు ఆకాశం వైపు విస్తరించి ఉన్నాయని సూచించడానికి ఇది సరైన చిత్రం అని ట్వీట్ చేశారు.ఎత్తైన రైల్వే బ్రిడ్జ్భారతదేశంలో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే బిడ్జ్ నిర్మాణం పూర్తయింది. దీనిపైన రైలు బోగీల ట్రయల్ రన్ కూడా నిర్వహించారు. త్వరలోనే ఈ బిడ్జి మీద రైళ్లు పరుగులు తీయనున్నాయి. ఈ బిడ్జిని ఇప్పటికే ఇంజినీర్లు, రైల్వే అధికారులు పరీక్షించారు. ప్రపంచంలో ఎత్తైన రైల్వే బ్రిడ్జ్ జమ్మూకాశ్మీర్లోని చీనాబ్ నదిపై నిర్మించారు.చీనాబ్ నదిపై నిర్మించిన బ్రిడ్జి ఎత్తు 359 మీటర్లు, పొడవు 1315 మీటర్లు. ఈ బ్రిడ్జి ద్వారా రాంబన్ జిల్లాలోని సంగల్దాన్ నుంచి రియాసీ మధ్య రైల్వే సేవలు ప్రారంభం కానున్నాయి. ప్రపంచంలో ఇప్పటి వరకు ఇంత ఎత్తైన బ్రిడ్జి ఎక్కడా లేదు. కాబట్టి ప్రపంచంలోనే ఎత్తైన బ్రిడ్జిగా ఇది సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది.The first train to cross the world’s highest railway bridge—the Chenab Bridge in India.Since it’s Yoga Day, it’s the perfect image to signify that our infrastructure is stretching itself as far towards the skies as possible….🙂pic.twitter.com/T73OnJBGup— anand mahindra (@anandmahindra) June 21, 2024 -
ఇన్స్టాగ్రామ్ సరికొత్త ఫీచర్.. ఇదెలా పనిచేస్తుందటే?
ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఇన్స్టాగ్రామ్ యూజర్ల కోసం 'క్లోజ్ ఫ్రెండ్స్ ఆన్ లైవ్' అనే సరికొత్త ఫీచర్ తీసుకువచ్చింది. ఇప్పటి వరకు లైవ్ స్ట్రీమ్ అనేది ఫాలోవర్స్ అందరికి కనిపించేది. తాజాగా అందుబాటులోకి వచ్చిన కొత్త ఫీచర్ క్లోజ్ ఫ్రెండ్స్ జాబితాలో ఉన్నవారిని మాత్రమే అనుమతిస్తుంది.క్లోజ్ ఫ్రెండ్స్ జాబితాలో కావలసిన వాళ్ళను యాడ్ చేసుకోవచ్చు, లేదా రిమూవ్ చేయవచ్చు. యూజర్ల భద్రతకు పెద్దపీట వేయడానికి ఇన్స్టాగ్రామ్ ఈ కొత్త ఫీచర్ తీసుకువచ్చినట్లు తెలుస్తోంది. గతంలో ఇన్స్టా అకౌంట్ పబ్లిక్ అయితే ఎవ్వరైనా లైవ్ స్ట్రీమింగ్లో జాయిన్ అవ్వడానికి అవకాశం ఉండేది. ఇప్పుడు అందుబాటులోకి వచ్చిన ఈ ఫీచర్ ద్వారా.. యూజర్ లైవ్ స్ట్రీమింగ్లో ఎవరైతే ఉండాలనుకుంటారో వారిని మాత్రం క్లోజ్ ఫ్రెండ్స్ జాబితాలో యాడ్ చేసుకోవచ్చు.ఇన్స్టాగ్రామ్.. క్లోజ్ ఫ్రెండ్స్ ఆన్ లైవ్ అనే సరికొత్త ఫీచర్ యూజర్లకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. గత కొన్ని నెలలుగా, మెటా ఇన్స్టాగ్రామ్ను మరింత ప్రైవేట్ ప్లేస్గా మార్చడానికి ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగానే గత ఏడాది నవంబర్లో.. గ్రిడ్లో పోస్ట్లను సన్నిహితులకు మాత్రమే కనిపించేలా చేయడానికి వినియోగదారులను అనుమతించే ఆప్షన్ ప్రవేశపెట్టింది.🚨 NEW 🚨Go Live with your Close Friends to ask for OOTD advice or just chat in real time 🎥✨ pic.twitter.com/wDYjqw1N4f— Instagram (@instagram) June 20, 2024 -
బ్రెజిల్ను దాటేసిన భారత్.. డొమెస్టిక్ ఎయిర్లైన్ మార్కెట్లో రికార్డ్
భారతదేశంలో ఏవియేషన్ రంగంలో బలమైన వృద్ధి చెందుతోంది. పది సంవత్సరాల ముందు 5వ స్థానంలో ఉన్న ఇండియన్ ఎయిర్లైన్ మార్కెట్.. ఇప్పుడు ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద దేశీయ ఎయిర్లైన్ మార్కెట్గా అవతరించింది.పది సంవత్సరాల క్రితం భారతదేశం దాదాపు 8 మిలియన్ సీట్లతో అతి చిన్న మార్కెట్గా ఉండేది. ఆ సమయంలో ఇండోనేషియా 4వ స్థానంలో,బ్రెజిల్ 3వ స్థానంలో, అమెరికా, చైనా మొదటి రెండు స్థానాలను ఆక్రమించాయి. అయితే ఇప్పుడు భారత్ ఎయిర్లైన్ మార్కెట్ భారీగా వృద్ధి చెంది బ్రెజిల్ను వెనక్కు నెట్టి ఇండియా ఆ స్థానాన్ని సొంతం చేసుకుంది.ప్రస్తుతం ఇండోనేషియా ఐదు, బ్రెజిల్ నాలుగు, అమెరికా రెండు, చైనా మొదటి స్థానాల్లో ఉన్నాయి. కేవలం పది సంవత్సరాల్లో భారాతదేశ ఎయిర్లైన్ సీట్ల వృద్ధి రేటు మొదటి ఐదు దేశాల కంటే ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. గత 10 ఏళ్లలో దేశంలోని విమానాశ్రయాల సంఖ్య 74 నుంచి 157కి పెరిగింది.గత 10 సంవత్సరాలలో ఇండిగో మార్కెట్ వాటా రెట్టింపు అయింది. 2014లో 32 శాతం ఉన్న ఇండిగో సామర్థ్యం నేడు 62 శాతానికి చేరింది. ఇండిగో దేశీయ సామర్థ్యం వృద్ధి రేటు వార్షికంగా 13.9 శాతంగా ఉందని తెలుస్తోంది. భారతదేశంలో డొమెస్టిక్ విమానాల సంఖ్యను మరింత పెంచాల్సిన అవసరం ఉంది. ఇదే జరిగితే రాబోయే రోజుల్లో భారత్ ఈ రంగంలో మరింత వృద్ధి చెందుతుంది. -
నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
శుక్రవారం ఉదయం లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్ సూచీలు ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి నష్టాల్లో ముగిసింది. సెన్సెక్స్ 384.83 పాయింట్ల నష్టంతో 77094.10 వద్ద, నిఫ్టీ 109.5 పాయింట్ల నష్టంతో 23457.94 వద్ద ముగిసింది. సెన్సెక్స్, నిఫ్టీ రెండూ కూడా నష్టాల్లో ముగిశాయి.టాప్ గెయినర్స్ జాబితాలో భారతీ ఎయిర్టెల్, ఎల్టీఐ మైండ్ట్రీ, హిందాల్కో, ఇన్ఫోసిస్, అదానీ పోర్ట్స్ మొదలైన కంపెనీలు చేరాయి. అల్ట్రాటెక్ సిమెంట్, అదానీ ఎంటర్ప్రైజెస్, భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్, టాటా మోటార్స్, టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్కం పెనీలు నష్టాల్లో ముగిశాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
గెలిస్తే గ్రాడ్యుయేట్లకు గ్రీన్ కార్డ్.. ట్రంప్ హామీ
భారతదేశంలో మాత్రమే కాకుండా.. చాలా దేశాల్లోని విద్యార్థులు అమెరికాలో గ్రాడ్యుయేట్ చేయాలని ఉవ్విల్లూరుతూ ఉంటారు. అలాంటి వారు గ్రీన్ కార్డు పొందాలని కూడా ఎదురు చూస్తూ ఉంటారు. ఈ తరుణంలో అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇమ్మిగ్రేషన్ వ్యవస్థపై కీలక వ్యాఖ్యలు చేశారు.జరగబోయే ఎన్నికల్లో తాను గెలిస్తే.. అమెరికాలోని కాలేజీల్లో చదువుకుని గ్రాడ్యుయేట్ లేదా డిప్లొమాతో పాటే వారికి గ్రీన్ కార్డు ఇవ్వాలని అనుకుంటున్నట్లు ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. అధికారిలోకి వచ్చిన మొదటి రోజే ఇది అమలయ్యేలా చర్యలు తీసుకుంటానని అన్నారు. జూనియర్ కాలేజీలో చదివే విద్యార్థులకు కూడా గ్రీన్ కార్డు ఇవ్వనున్నట్లు ప్రకటించారు.కరోనా సమయంలో దీన్ని అమలు చేయలేకపోయామని, ఇప్పుడు కూడా అమెరికా, చైనా నుంచి వస్తున్న విద్యార్థులు వీసా సమస్యల కారణంగా మన దేశంలో ఉండలేకపోతున్నారని అన్నారు. అమెరికాలో చదువుకుని వారు సొంత దేశాలకు వెళ్లిపోతున్నారని పేర్కొన్నారు.గతంలో అమెరికాలోని విదేశీయలను వెళ్లగొట్టిన ట్రంప్ ఇప్పుడు రూటు మార్చారు. రెండోసారి అధ్యక్ష పీఠం దక్కించుకునేందుకు ఎన్నికల బరిలో డిగ్గనున్నట్లు సమాచారం. సాధారణంగా వలస విధానం మీద తీవ్రంగా విరుచుకుపడే ట్రంప్.. ఈ సారి మాత్రం దీనికి భిన్నంగా వ్యాఖ్యానించారు. గ్రాడ్యుయేట్ పూర్తి చేసిన వారికి.. తాను ఎన్నికల్లో గెలిస్తే గ్రీన్ కార్డు ఇవ్వనున్నట్లు హామీ ఇచ్చారు.అమెరికాలోకి అక్రమంగా చొరబడే వారి వల్ల సమస్యలు తలెత్తుతున్నాయని.. లీగల్గా అమెరికాలోకి వస్తే తమకు ఎలాంటి ఇబ్బంది లేదని ట్రంప్ గతంలోని చాలా సందర్భాల్లో పేర్కొన్నారు. అక్రమ వలసదారుల వల్లే నిరుద్యోగం, నేరాలు, దోపీడీ వంటివి పెరుగుతున్నాయని ట్రంప్ అన్నారు. -
ఆర్బీఐ కీలక ప్రకటన.. ప్రముఖ బ్యాంక్ లైసెన్స్ రద్దు
మహారాష్ట్రలోని సిటీ కో-ఆపరేటివ్ బ్యాంక్ తగిన మూలధనం మరియు సంపాదన అవకాశాలు లేని కారణంగా రిజర్వ్ బ్యాంక్ బుధవారం లైసెన్స్ను రద్దు చేసింది. మహారాష్ట్ర సహకార సంఘాల కమిషనర్ అండ్ రిజిస్ట్రార్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీస్ను కూడా బ్యాంకును మూసివేయడానికి & లిక్విడేటర్ను నియమించడానికి ఆర్డర్ జారీ చేయాలని కోరినట్లు ఆర్బీఐ తెలిపింది.ఆర్బీఐ ప్రకారం.. సిటీ కో-ఆపరేటివ్ బ్యాంక్ ఇకపైన ఎలాంటి బ్యాంకింగ్ సేవలను అందించిందని తెలుస్తోంది. ఆర్బీఐ ఆదేశాలు 2024 జూన్ 19 నుంచే అమలులోకి వచ్చాయి. దీంతో ఆ బ్యాంకులో డబ్బు డిపాజిట్ చేసిన వారు కొంత ఆందోళన చెందుతున్నారు.బ్యాంకులో డబ్బు దాచుకున్న ఖాతాదారులు నష్టపోకుండా ఉండటానికి డిపాజిటరీ ఇన్సూరెన్స్, క్రెడిట్ గ్యారెంటీ కార్పొరేషన్ (DICGC) ద్వారా రూ. 5 లక్షల వరకు బీమా రక్షణ ఉంటుంది. ఇది బ్యాంకులో డబ్బు డిపాజిట్ చేసుకున్న ప్రతి ఒక్కరికి వర్తిస్తుంది.బ్యాంకు దివాళా తీసినప్పుడు, ప్రకృతి వైపరీత్యాలు, అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు డిపాజిటర్లు నష్టపోకుండా రూ. 5 లక్షల వరకు ఇన్సూరెన్స్ లభిస్తుంది. కాబట్టి ఖాతాదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. బ్యాంకు సమర్పించిన డేటా ప్రకారం, డిపాజిటర్లలో 87 శాతం మంది డీఐసీజీసీ నుంచి తమ డిపాజిట్ల పూర్తి మొత్తాన్ని స్వీకరించడానికి అర్హులని ఆర్బీఐ తెలిపింది. -
లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గురువారం ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి లాభాల్లో ముగిసాయి. సెన్సెక్స్ 172.75 పాయింట్ల లాభంతో 77510.34 పాయింట్ల వద్ద, నిఫ్టీ 51.20 పాయింట్ల లాభంతో 23567.20 పాయింట్ల లాభంతో ముగిసాయి. నేడు సెన్సెక్స్, నిఫ్టీ రెండూ స్వల్ప లాభాలతోనే ముగిసాయి.టాప్ గెయినర్స్ జాబితాలో ప్రధానంగా హిండాల్కో ఇండస్ట్రీస్, గ్రాసిమ్ ఇండస్ట్రీస్, భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (BPCL), జేఎస్డబ్ల్యు స్టీల్, అదానీ పోర్ట్స్ వంటివి ఉన్నాయి. హీరోమోటోకార్ప్, సన్ ఫార్మా, మహీంద్రా అండ్ మహీంద్రా, నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ (NTPC), విప్రో కంపెనీలు నష్టాలను చవి చూశాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
తగ్గనున్న ట్యాక్స్!.. మోదీ 3.0 బడ్జెట్ ప్లాన్ ఇదేనా?
ఇటీవల కేంద్రంలో కొలువుతీరిన కొత్త ప్రభుత్వం 2024-25 బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. ఇప్పుడు ప్రజలందరి ద్రుష్టి త్వరలో ప్రవేశపెట్టనున్న బడ్జెట్ మీదనే ఉన్నాయి. గతంలో ఎన్నికల దగ్గరపడుతున్న వేళ పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టలేదు. కాబట్టి త్వరలో నిర్మల సీతారామన్ పూర్తిస్థాయి బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు.2024-25 బడ్జెట్ పేద ప్రజలకు, వేతన జీవులకు ఊరట కల్పించనున్నట్లు నిపుణులు భావిస్తున్నారు. సంవత్సరానికి రూ. 15 లక్షల నుంచి రూ. 17 లక్షల మధ్య సంపాదించే వ్యక్తులకు ఆదాయ పన్ను రేట్లను తగ్గించనున్నట్లు సమాచారం. మధ్య తరగతి ప్రజలకు ఊరట కలిగించడానికి కేంద్రం ఈ నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని భావిస్తున్నారు.కొత్త పన్ను విధానంలో.. రూ. 3 లక్షల వరకు ఎలాంటి ట్యాక్స్ ఉండదని తెలుస్తోంది. రూ.3 లక్షల నుంచి రూ.6 లక్షల వరకు 5 శాతం పన్ను ఉంటుందని సమాచారం. అయితే ఈ పన్ను మినహాయింపు రూ. 5 లక్షల వరకు ఉంటే బాగుంటుందని. 2024-25 ఆర్ధిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ వచ్చే నెలలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్నారు.రాబోయే బడ్జెట్ మోదీ 3.0 ప్రభుత్వ ఆర్థిక ఎజెండాను వివరిస్తుంది. సంకీర్ణ ప్రభుత్వ కట్టుబాట్లకు తగిన విధంగా వనరులను పొందుతూనే సీతారామన్ ద్రవ్యోల్బణం పెరగకుండా వృద్ధిని ప్రేరేపించాల్సిన అవసరం ఉంది. ఈ ఎజెండా భారతదేశాన్ని 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా నిలబెట్టడం, 2047 నాటికి దేశాన్ని 'అభివృద్ధి చెందిన భారతదేశం'గా మార్చడం లక్ష్యంగా పెట్టుకున్నారు.వ్యవసాయ సవాళ్లను పరిష్కరించడం, ఉద్యోగాల కల్పన, మూలధన వ్యయాలను నిలబెట్టుకోవడం, ఆర్థిక ఏకీకరణను కొనసాగించడానికి ఆదాయ వృద్ధిని పెంచడం రాబోయే బడ్జెట్లో కీలక అంశాలుగా ఉన్నాయి. మొత్తం మీద ఓ వైపు ప్రజలకు అనుకూలమైన విధి విధానాలను రూపొందించడమే కాకుండా.. 2047 నాటికి వికసిత భారత్ లక్ష్యంగా అడుగులు వేయనున్నారు.నిర్మల సీతారామన్ రికార్డ్జూన్ 20న ఆర్థిక మంత్రి పరిశ్రమ వాటాదారులతో ప్రీ-బడ్జెట్ సంప్రదింపులు జరుపుతారు. ఇది మోదీ 3.0 కింద మొదటి కేంద్ర బడ్జెట్ అవుతుంది. అయితే నిర్మలా సీతారామన్ ఇందులో చరిత్ర సృష్టించడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ విషయంలో మొరార్జీ దేశాయ్ రికార్డును అధిగమించి ఆరు పూర్తి బడ్జెట్లు, ఒక తాత్కాలిక బడ్జెట్తో కూడిన ఏడు.. వరుస బడ్జెట్ ప్రజెంటేషన్లను సీతారామన్ ప్రవేశపెట్టారు. -
మరణశయ్యపై భర్తకు మాట...తోడుగా కోడలు : 67 ఏళ్ల వయసులో
అబ్బ! వంటలు భలే ఉన్నాయండి..అంటూ అతిథులు లొట్టలేసుకుంటూ తింటూ ఉంటే కష్టపడి వండిన వారి ఆనందాన్ని మాటల్లో వర్ణించలేం. కేరళలోని అలప్పూలో నివసించే మహిళ ఫిలోకు కూడా అంతే. పెళ్లిళ్లు, పేరంటాలు, పార్టీలు అంటే చాలు కష్టపడి వెజ్.. నాన్ వెజ్ పచ్చళ్లు తయారు చేసి ఇచ్చేసేది. ఆమె పికెల్స్కు విదేశాల్లో కూడా ఫ్యాన్స్ ఉన్నారంటే ఆమె చేతి మహిమను అర్థం చేసుకోవచ్చు. మధ్యలో ఆటంకాలొచ్చినా.. చివరికి భర్తకిచ్చిన మాట నెరవేర్చాలనే ఉద్దేశంతో వ్యాపారవేత్తగా మారిపోయింది. బెటర్ ఇండియా అందించిన వివరాల ప్రకారం స్టోరీ ఏంటంటే..ఫిలో ఇంటర్ అయిపోయిన వెంటనే ఒక ఇంటికి భార్యగా వెళ్లిపోయింది. చిన్నప్పటినుంచి వంటలు చేయడం ఆసక్తి. ఇక పచ్చళ్లలో ఆమె చేయని ప్రయోగం లేదని చెప్పవచ్చు. అలాగే ఏదైనా చేయాలనే గాఢమైన కోరిక ఉండేది. ఆ కోరికతోనే 2015లో భర్త, కోడలు టిన్సీ సాయంతో ఊరగాయ వ్యాపారాన్ని మొదలు పెట్టింది. కానీ మొదట్లో పెద్దగా విజయంసాధించలేదు. మళ్లీ తిరిగి కోడలి సహకారంతో ఫిలో 60 ఏళ్ల వయసులో వ్యాపారవేత్తగా అవతరించింది. అత్తాకోడళ్లు ద్వయం విజయవంతంగా వ్యాపారాన్ని నడిపించారు. View this post on Instagram A post shared by മുഹമ്മ ക്കാരൻ (@muhammakkar)కేవలం ఫేస్బుక్ పేజీతో చిన్న స్థాయిలోనే వ్యాపారాన్ని ప్రారంభించారు. చికెన్, స్వీట్ లైమ్, బీఫ్ వంటి రెండు మూడు రకాల ఊరగాయలను విక్రయించేవారు. కేవలం నోటి మాట ద్వారానే అయినా వ్యాపారం బాగానే సాగింది. మళ్లీ అనుకోకుండా భర్త థామస్ అనారోగ్యం కారణంగా వ్యాపారాన్ని నిలిపివేయాల్సి వచ్చింది. కేన్సర్తో బాధపడుతూ మూడు నెలలు ఆయన ఆసుపత్రికి పరిమితమయ్యారు. ఆ తరువాత కూడా చికిత్స కోసం తరచుగా వెల్లూరుకు వెళ్లాల్సి వచ్చేది. దీంతో వ్యాపారం ముందుకు సాగలేదు. ఇదంతా గమనించిన థామస్ తన భార్యకు ఒకటే మాట చెప్పారు. ‘ఫిలో.. నీలో చాలా టాలెంట్ ఉంది. నీ పచ్చళ్లు అందరికీ నచ్చుతాయి. ఆ సామర్థ్యం నీ దగ్గర ఉంది. వ్యాపారాన్ని కొనసాగించు. ఏదో ఒకరోజు కచ్చితంగా నువ్వు గొప్పదానివి అవుతావు. నామాట విను’’ అంటూ తన కోరికను వెల్లడించారు.ఆ మాటలే వేదమంత్రాలయ్యాయి. ఈ సారి పకడ్బందీగా రంగంలోకి దిగారు అత్తాకోడళ్లు. 2018లో కొత్త అవతార్లో లోగో, ప్యాకేజింగ్ మార్చేసి, ‘ఫిలోస్ పికిల్స్’ స్టార్ట్ చేశారు. దీనికి తోడు ముఖ్యమైన FSSAI (ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా) ఫుడ్ లైసెన్స్ తెచ్చుకున్నారు. 10వేల రూపాయల పెట్టుబడితో మళ్లీ పచ్చళ్ల తయారీ మొదలు పెట్టారు. స్థానిక సూపర్ మార్కెట్లకు అందించే వారు. ఇది ప్రచారానికి బాగా ఉపయోగపడింది. ఫుడ్ బ్లాగర్ మృణాల్ దాస్ వెంగలాట్ 2019లో వారి ఉత్పత్తుల గురించి ఒక వీడియోను పోస్ట్ చేసారు. ఇది మంచి ఆర్డర్లను తెచ్చిపెట్టింది. దీంతో ఒక ఇన్స్టా పేజీని కూడా స్టార్ట్ చేశారు. ఇక అప్పట్నించి విదేశాలకు సైతం రుచికరమైన పచ్చళ్లను సరఫరా చేస్తూ వ్యాపారంలో రాణిస్తున్నారు. రొయ్యల ఊరగాయ, చేపలు, మాంసం ఊరగాయలు, చెమ్మీన్ చమ్మంతి పొడి (ఎండిన రొయ్యల పొడి) బెస్ట్ సెల్లర్స్గా నిలిచాయి. మామిడి, నిమ్మకాయ. సీజన్ల వారీగా, అనేక కూరగాయల ఊరగాయలను కూడా తయారు చేస్తారు. చాలా శ్రద్ధగా ప్రేమతో పచ్చళ్లు తయారు చేస్తాం అంటారు ఫిలో. ‘‘జీవితం అంతా బాధ్యతలతోనే గడిచిపోయింది. 60 ఏళ్లు దాటాక విసుగు, అలసట వస్తుంది..దీంతో ఈ వయసులో ఏం చేస్తాంలే అనుకుంటాం. కానీ ఈ ధోరణి మారాలి. మన నైపుణ్యంపై దృష్టి పెట్టాలి. అలా నేను ఫిలోస్ ప్రారంభించాక, ఒత్తిడి, ఆందోళన మాటుమాయమైంది. కొత్త ఉత్సాహం వచ్చింది. గౌరవం, ప్రేమ లభిస్తోంది’’ అంటారామె ఆ స్వర్గంనుంచి తన భర్త కేజే థామస్ తనను, తన విజయాన్ని చూస్తూ ఉంటాడనే ఆశతో. -
ఆర్బీఐ కీలక నిర్ణయం: మరో బ్యాంక్ లైసెన్స్ రద్దు
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గత కొన్ని రోజులుగా నియమాలను అతిక్రమించిన బ్యాంకులపై విరుచుకుపడుతోంది. ఇందులో భాగంగానే కొన్ని బ్యాంకులకు భారీ జరిమానాలు విధించడం మాత్రమే కాకుండా.. లైసెన్సులు కూడా క్యాన్సిల్ చేస్తోంది.ఇటీవల ఉత్తరప్రదేశ్లోని ఘాజీపూర్లోని పూర్వాంచల్ సహకార బ్యాంకు లైసెన్సును ఆర్బీఐ రద్దు చేసింది. ఈ బ్యాంకు వద్ద తగినంత మూలధనం లేకవడంతో రిజర్వ్ బ్యాంక్ ఈ నిర్ణయం తీసుకుంది. బ్యాంక్ను మూసివేసి లిక్విడేటర్ను నియమించాలని ఉత్తర్ప్రదేశ్లోని కోఆపరేటివ్ కమిషనర్, రిజిస్ట్రార్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీస్ను ఆర్బీఐ ఆదేశించినట్లు సమాచారం.ఉత్తరప్రదేశ్లోని ఘాజీపూర్లోని పూర్వాంచల్ సహకార బ్యాంకు లైసెన్సును ఆర్బీఐ రద్దు చేయడంతో.. లిక్విడేషన్ కింద్ ప్రతి డిపాజిటర్ తన డిపాజిట్ మొత్తాన్ని.. డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారెంటీ కార్పొరేషన్ (DICGC) నుంచి మాత్రమే రూ. 5 లక్షల వరకు పొందేందుకు అర్హులు.పూర్వాంచల్ కో-ఆపరేటివ్ బ్యాంక్ సమర్పించిన డేటా ప్రకారం.. దాదాపు 99.51 శాతం మంది డిపాజిటర్లు డిఐసిజిసి నుంచి తమ డిపాజిట్ల పూర్తి మొత్తాన్ని స్వీకరించడానికి అర్హులు అని ఆర్బీఐ తెలిపింది. సహకార బ్యాంకు ప్రస్తుత ఆర్థిక స్థితితో ప్రస్తుత డిపాజిటర్లకు పూర్తిగా చెల్లించలేదని ఆర్బీఐ తెలిపింది. -
ఎంట్రీలు పడుతున్నాయ్.. బీ రెడీ!
గతవారం వరకు వరుసగా అన్ని ఐటీఆర్ ఫారాలను గురించి తెలుసుకున్నాం. ఎన్ని ఫారాలు ఉన్నాయి, ఎవరు ఏ ఫారం వేయాలి మొదలైన విషయాలు తెలుసుకున్నాం. ఇక గడువుల విషయం చూస్తే వేతన జీవులు, ట్యాక్స్ ఆడిట్ వర్తించని వారికి గడువు తేదీ 31 జూలై 2024. ఇతరులకు గడువు తేదీ 30–09–2024. ఈ కాలమ్ను ప్రతివారం చదివి అనుసరించే వారికి వచ్చే నెలాఖరు గడువు. ఇప్పుడిప్పుడే అన్ని కార్యాలయాల్లో అధికారులు వారి వారి విధులు నిర్వహించడాన్ని పూర్తి చేస్తున్నారు.అంటే డిస్బర్సింగ్ అధికార్లు, డిడక్టింగ్ అధికార్లు, పన్ను రికవరీ చేయడం, ఆ పన్ను మొత్తాల్ని గవర్నమెంట్ ఖాతాకి చెల్లించడం, ఆ తర్వాత ఫారాలు 16 అలాగే 16 అ తయారు చేసి జారీ చేయడం, టీడీఎస్ రిటర్నులు ఆదాయపు పన్ను శాఖ వారికి దాఖలు చేయడం మొదలైనవి జరుగుతున్నాయి. ఈ అధికార్ల జాబితాలో మీ యాజమాన్యం, బ్యాంకులు, పన్ను రికవరీ చేసే ఇతర అధికార్లు ఉన్నారు. ఆలస్యం కావచ్చు. ఏవో ఇబ్బందులు ఏర్పడవచ్చు.వీటిని ఆధారంగా చేసుకుని డిపార్టుమెంటు వారు తమ సైటులో మీ వివరాలను పొందుపరుస్తారు. వీటినే ఫారం 26 అ, అఐ అంటారు. వీటిలో పద్దులు పడకపోతే, మీరు రిటర్నులు వేయలేరు. అంటే సమాచారం పూర్తిగా లభ్యమవదు. సాధారణంగా ఈ ఫారాల్లోని సమాచారం సంపూర్ణమైనది, సమగ్రమైనది, సరైనది, కచ్చితమైనది, నమ్మతగ్గది. అయితే, తప్పులు సహజం. మీరు, ముందు ఈ రెండింటిలోని ప్రతి అంశాన్ని క్షుణ్నంగా చెక్ చేయండి.మీకు సంబంధించినది కాకపోతే విభేదించండి. అభ్యంతరాలను తెలియజేయండి. అలా జరిగిన వెంటనే డిపార్టుమెంటు వారు సంబంధిత అధికార్లతో సంప్రదింపులు జరిపి, సరిదిద్దుతారు. ఒకవేళ ఏదైనా కారణం వల్ల మీకు రెస్పాన్స్ రాకపోతే, గడువు తేదీలోపల రిటర్ను వేయటం మాత్రం మానేయకండి. ఆ తర్వాతైనా సర్దుబాట్లు జరగవచ్చు. మిస్మ్యాచ్కు మరొక కారణం.. డబుల్ ఎంట్రీ. అంటే ఒక వ్యవహారం రెండు సార్లు నమోదు కావడం. మీరు ఒకదాన్నే పరిగణనలోకి తీసుకోండి.మరీ చిత్రమైన విషయం ఒకటుంది. ఈ మధ్య ఒక కుటుంబంలో ముగ్గురు సభ్యులు వారి ఉమ్మడి ఆస్తిని అమ్మగా ఆ విక్రయాల గురించి ముగ్గురి అఐ లలోనూ ఎంట్రీలు కనబడ్డాయి. ఆస్తి అమ్మకం విలువ రు. 4 కోట్లు. ముగ్గురి ‘సమాచారం’లోనూ రూ. 4 కోట్లు అని పడింది. కానీ, జరిగింది ఒకే లావాదేవీ. దాని విలువ రూ. 4 కోట్లు. ఏ స్థాయిలో ఈ తప్పు జరిగిందో కాని రికార్డుల్లో ఎంట్రీలు మూడింతలు పడ్డాయి. ఇటువంటివి జరిగే అవకాశం ఉంది.అలాగే జాయింటుగా ఉన్న బ్యాంకు అకౌంట్లోకి వచ్చే బ్యాంకు వడ్డీ, దాని మీద వడ్డీ, ఇటువంటి విషయాల్లో తగిన జాగ్రత్త వహించండి. ఎంట్రీల్లోని తప్పులను మీకు అనుకూలంగా మల్చుకోకండి. ఒక సమాచారం ఏదేని అఐ లో పడకపోయినా, దాన్ని ఆసరాగా తీసుకుని ఆ ఆదాయం లేదా వ్యవహారాన్ని పరిగణనలోకి తీసుకోకుండా మర్చిపోకండి. ఈ సంవత్సరం ఫైలింగ్ మొదలెట్టవచ్చు. రెడీ అవ్వండి. – కె.సీహెచ్. ఎ.వి.ఎస్.ఎన్ మూర్తి, కె.వి.ఎన్ లావణ్య, ట్యాక్సేషన్ నిపుణులు -
వెరై‘టీ’.. చాయ్ జీపీ‘టీ’..
వారిరువురూ అన్నదమ్మలు.. ఒకరు చదువు కోసం..మరొకరు ఉపాధి కోసం నగరానికి వచ్చారు.. అందరిలా కాకుండా తమ కాళ్లపై తాము నిలబడాలనుకున్నారు.. అనుకున్నదే తడవుగా తమ వద్ద ఉన్న కొద్ది మొత్తంతో ఓ టీ దుకాణాన్ని పెట్టారు.. అదే చాయ్ జీపీటీ..అంతటితో ఆగకుండా.. తమ స్టాల్లో లభ్యమయ్యే ఫ్లేవర్తో టీ పౌడర్ను మార్కెట్లోకి విడుదల చేయాలనుకుంటున్నారు.. అసలీ ఆలోచన ఎలా వచ్చింది? దీని వెనుక కథేంటి? తులుసుకుందాం..!శ్రీనగర్కాలనీ: సరికొత్త ఆలోచనతో ఓ ఇద్దరు అన్నదమ్ములు నగరంలోని యువతకు ఆదర్శంగా నిలుస్తున్నారు.. జిహ్వకో రుచి.. పుర్రెకో ఆలోచన అన్నట్లు.. వెరైటీగా ఆలోచించారు. అందరిలా ఉద్యోగాలు కాకుండా.. వ్యాపారంలో రాణించాలని భావించారు.. తమ వ్యాపారాన్ని విస్తరించడానికి మార్కెట్లో ఓ కొత్త టీ ప్రొడక్ట్ను లాంచ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. త్వరలోనే తెలుగు టీ రుచులను వినియోగదారులకు పరిచయం చేస్తామని ధీమాగా చెబుతున్నారు. టెక్నాలజీ రంగంలో దూసుకుపోతున్న చాట్ జీపీటీ నేడు ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటోంది. ప్రస్తుతం జనాల బుర్రల్లో తిరుగుతున్న పేరునే తమ కంపెనీ పేరుగా మలుచుకున్నారు.. ఓ టెక్నాలజీ పేరైన చాట్ జీపీటీని తలపిస్తూ చాయ్ జీపీటీతో ఓ చాయ్ దుకాణాన్ని నగరంలోని మధురానగర్లో గత సంవత్సరం ప్రారంభించారు ఈ ఇద్దరు అన్నదమ్ములు రోహిత్, కిరణ్ దుమ్ము. శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఈ ఇద్దరూ చదువు నిమిత్తం నగరానికి వచ్చారు. రోహిత్ విప్రో కంపెనీలో సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. కిరణ్ డిగ్రీ చదువుతున్నాడు. ఉద్యోగాలు కాకుండా తమ సొంత కాళ్ళపై నిలబడాలన్న తపనలో చాయ్ జీపీటీ పేరిట చాయ్ స్టోర్ని ప్రారంభించారు. చాయ్లో ఏఐని తీసుకొని ఏఐ(అడ్రక్–ఇలాచి), జీపీటీని( జెన్యూన్లీ ప్యూర్ టీ)గా మలిచారీ అన్నదమ్ములు. ఆయుర్వేద మూలికలతో.. తెలుగు టీలలో ఎక్కువగా ఇలాచి, అడ్రక్లను ఆయుర్వేద మూలికగా ఆరోగ్యానికి ఉపయోగిస్తారు. మనం రోజువారీ విధానంతో పాటు చలికాలంలో ఎక్కువగా అల్లం, యాలుకల టీని తీసుకుంటాం. నిజానికి వీటిలో చాలా ఔషధగుణాలున్నాయి. వీటిని టీలో తీసుకుంటే ఆరోగ్యంతో పాటు ఉల్లాసంగా, ఉత్సాహంగా అనిపిస్తుంది. అందుకే టీలలో వీటికి అధిక ప్రాధాన్యతను ఇస్తూ మన తెలుగుదనాన్ని ఉట్టిపడేలా టీని తయారుచేస్తున్నాం. మార్కెట్లో ఉండే వాటికంటే భిన్నంగా మా టీ ఉత్పత్తి ఉండేలా సన్నాహాలు చేస్తున్నాం. మన రుచిని మిస్ అవ్వకుండా టీ పౌడర్లో కలపి చాయ్ జీపీటీ ప్రాడెక్ట్ చిన్న ప్యాకెట్లతో పాటు పెద్ద ప్యాకెట్లలో మార్కెట్లోకి తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు. త్వరలో అన్ని పర్మిషన్స్ తీసుకొని వినియోగదారుల ముందుకొస్తామని, అయితే తమకు ఇన్వెస్టర్స్ తోడైతే మరింత తోడ్పాటు అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. చదువు, ఉద్యోగం కోసం ఓ మారుమూల ప్రాంతం నుంచి నగరానికి వచి్చ.. సరికొత్త ఆలోచనతో చాయ్ జీపీటీ ప్రాడక్ట్ను మార్కెట్లో తీసుకురావాలన్న ఆలోచన చేసిన ఈ ఇద్దరి అన్నదమ్ముల కృషి యువతకు ఆదర్శనంగా నిలుస్తుంది. తెలుగురుచికి తగ్గట్టుగా.. నేను డిగ్రీ చదువుతున్నాను. అన్నయ్య రోహిత్ బాటలో నడవాలన్నది నా ఆకాంక్ష. ఇప్పుడిప్పుడే స్టోర్ బాగా నడుస్తోంది. అల్లం, యాలుకలు మన ఆయుర్వేద ఔషధ మూలికలకు మన దైనందిన జీవితంలో ప్రత్యేకస్థానం ఉంది. వీటిని చాయ్ జీపీటీలో కలిపి మన తెలుగురుచికి తగ్గట్టుగా అసలు సిసలైన టీని అందించాలన్నది మా లక్ష్యం. అన్నయ్యతో కలిసి సాధిస్తాం. – కిరణ్, డిగ్రీ విద్యార్థి, చాయ్ జీపీటీ నిర్వాహకుడు మరింత మందికి ఉపాధి..ఉపాధిలో మనకున్న ప్రతిభతో అక్కడ రాణిస్తాం. కానీ వ్యాపారంలో మన ఆలోచనలు, సృజనాత్మకతను జోడించి మరికొంతమందికి ఉపాధిని అందిస్తాం. అందుకే ఉద్యోగం కన్నా వ్యాపారమే చేయాలన్న ఆలోచన ఎప్పటి నుంచో ఉంది. మా దగ్గర ఉన్న పెట్టుబడితో టీ స్టోర్ని ఏర్పాటుచేశాం. కానీ మా లక్ష్యం మన తెలుగుదనం ఉట్టిపడేలా చాయ్ జీపీటీ టీ పౌడర్ బ్రాండ్ని మార్కెట్లోకి తీసుకొచ్చి మన సత్తాచాటడమే. దానికి అనుగుణంగా అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం. – రోహిత్, సాఫ్ట్వేర్ ఉద్యోగి. చాయ్ జీపీటీ నిర్వాహకుడు -
టీసీఎస్కు షాక్!.. రూ.1600 కోట్ల జరిమానా
తమ వ్యాపార రహస్యాలను 'టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్' (TCS) బయట పెట్టించిందని 'కంప్యూటర్ సైన్సెస్ కార్పొరేషన్' డల్లాస్లోని నార్త్ డిస్ట్రిక్ టెక్సాస్లోని యునైటెడ్ స్టేట్స్ డిస్ట్రిక్ కోర్ట్లో కేసు వేసింది. ఈ కేసు విచారణ చేపట్టిన తరువాత వాణిజ్య రహస్యాలను దుర్వినియోగం చేసినందుకు టీసీఎస్ పూర్తి బాధ్యత వహిస్తుందని అమెరికా కోర్టు తీర్పునిచ్చింది. ఈ కారణంగా కంపెనీకి 194 మిలియన్ డాలర్ల (భారతీయ కరెన్సీ ప్రకారం సుమారు రూ. 1600 కోట్లు) జరిమానా విధించింది.ఈ విషయాన్ని టీసీఎస్ స్టాక్ ఎక్స్ఛేంజీ ఫైలింగ్లో తెలిపింది. ఈ మేరకు జూన్ 14న కోర్టు ఉత్తర్వులను అందుకున్నట్లు వెల్లడించింది. ఈ కేసులో టీసీఎస్ కూడా తన వాదనలను బలంగా వినిపించింది. జిల్లా కోర్టులు మళ్ళీ ఈ విషయాన్ని పునఃపరిశీలన చేయనున్నట్లు సమాచారం. కంపెనీకి అమెరికా కోర్టు భారీ జరిమానా విధించినప్పటికీ.. తమ ఆర్థిక కార్యకలాపాలు సజావుగా సాగుతున్నాయని టీసీఎస్ పేర్కొంది.ఆన్బోర్డింగ్ ఆలస్యంఇదిలా ఉండగా గత రెండేళ్ల కాలంలో ఐటీ కంపెనీలు సుమారు 10,000 కంటే ఎక్కువ మంది ఫ్రెషర్లకు ఇంకా ఉద్యోగాలు ఇవ్వలేదని ఎన్ఐటీఈఎస్ వెల్లడించింది. ఈ జాబితాలో టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో మొదలైన కంపెనీలు ఉన్నాయి. కంపెనీలు ఉద్యోగాలు ఆఫర్ చేసి.. ఉద్యోగంలో చేర్చుకోవడంలో చాలా ఆలస్యం చూపిస్తున్నట్లు తమకు ఫిర్యాదులు వచ్చాయని.. ఐటీ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు హర్ప్రీత్ సింగ్ సలూజా తెలిపారు. -
హైదరాబాద్కు ఢోకా లేదు కానీ..
సాక్షి, హైదరాబాద్: ఎన్నికలు పూర్తయ్యాయి. కేంద్రం, రాష్ట్రంలో కొత్త ప్రభుత్వాలు కొలువుతీరాయి. ఇక, రియల్టీ పరుగులే తరువాయి. కాకపోతే, హైదరాబాద్ మార్కెట్ పరిస్థితులు వేరు. రాజకీయ స్థిరత్వం అనేది వినియోగదారులు, పెట్టుబడిదారులకు కీలకం. ఇలాంటి సమయంలో ప్రభుత్వాలు విశ్వాసాన్ని చూరగొనాలంటే వేగవంతంగా విధానపరమైన నిర్ణయాలతో పాటు వాటిని కార్యరూపంలోకి తీసుకురావాలి. అప్పుడే మార్కెట్లో సానుకూల వాతావరణం ఏర్పడి, క్రయవిక్రయాలు పెరుగుతాయి.మౌలిక సదుపాయాల అభివృద్ధిపై నిరంతరం దృష్టి పెడుతూనే పెట్టుబడిదారులకు మరింత సానుకూల వాతావరణాన్ని ప్రభుత్వం కల్పించాలని స్థిరాస్తి సంఘాలు సూచిస్తున్నాయి. పారిశ్రామిక పాలసీ, రీజినల్ రింగ్ రోడ్డు, మూసీ సుందరీకరణ, ఫార్మా క్లస్టర్లు, సెమీ కండక్టర్ల పాలసీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీ వంటి ఏదైనా ఎప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకొని వాటి అమలుకు చర్యలు చేపట్టాలి. ఈ విషయాన్ని ప్రజలకు చేరవేసి ఒక సానుకూల వాతావరణాన్ని రాష్ట్రంలో తీసుకురావాలి. ఆరోగ్యం, పర్యాటక రంగాలకు ప్రాధాన్యం ఇస్తూ ప్రోత్సహించాలి. ప్రభుత్వం దార్శనికతతో ప్రణాళికలు రూపొందిస్తే ఎన్నెన్నో అద్బుతాలు సృష్టించవచ్చు. ఇవన్నీ రియల్టీ రంగానికి ఇంధనంగా ఉపయోగపడతాయి.హైదరాబాద్లోని భౌగోళిక వాతావరణం, వనరులు, మౌలిక సదుపాయాలు, దేశ, విదేశీ సంస్థల కార్యాలయాలు.. ఇలా ఎన్నెన్నో అనుకూల పరిస్థితులు హైదరాబాద్కు ఉన్నాయి. ఇతర నగరాలతో పోలిస్తే ఇప్పటికీ హైదరాబాద్లో గృహాల ధరలు, అద్దెలు, భూముల రేట్లు అందుబాటులోనే ఉన్నాయి. కాస్మోపాలిటన్ కల్చర్, తక్కువ జీవన వ్యయం వంటివి నగరానికి అదనపు అంశాలు. దీంతో పెట్టుబడులు వస్తూనే ఉంటాయి. ఏమాత్రం అలసత్వం ఉండదు. దీంతో భవిష్యత్తులో హైదరాబాద్ రియల్టీ మార్కెట్కు ఢోకా ఉండదు.మార్కెట్లోకి మూడోతరం..జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ వంటి ఖరీదైన ప్రాంతాల్లోని నివాసితుల రెండు, మూడోతరం వారసులు కూడా సిటీకి వస్తున్నారు. వీరికి ఆయా ప్రాంతాల్లో లగ్జరీ ఇండిపెండెంట్ హౌస్లు దొరకడం కష్టం. దీంతో హైరైజ్, అల్ట్రాలగ్జరీ అపార్ట్మెంట్ల వైపు మొగ్గుచూపక తప్పని పరిస్థితి. అలాగే విదేశాల్లో స్థిరపడిపోయిన ప్రవాసులు తిరిగి స్థానిక ప్రాంతాలకు వచ్చేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో మార్కెట్లోకి కొత్తతరం కస్టమర్లు వస్తున్నారు. వీరికి విదేశాల్లో తరహా ఆధునిక వసతులు, విస్తీర్ణమైన అపార్ట్మెంట్లు కావాలి. అందుకే చాలామంది గ్రేడ్–ఏ డెవలపర్లు అల్ట్రా లగ్జరీ అపార్ట్మెంట్లను నిర్మిస్తున్నారు.కొందరు ఎన్నారైలు ఇప్పటికే స్థానికంగా ఉన్న స్థిరాస్తులను విక్రయించి, లగ్జరీ ప్రాపర్టీలకు అప్గ్రేడ్ అవుతున్నారు. అలాగే ఇన్నాళ్లు భార్యా, భర్తలిద్దరి సంపాదనతో ఇళ్లు కొనుగోలు చేసిన కస్టమర్లు.. ఇప్పుడు వారి పిల్లల సంపాదన కూడా తోడైంది. గత 3–4 ఏళ్లుగా ఈ మూడోతరం సంపాదనతో నగరంలో ప్రాపర్టీలు కొనుగోలు చేసే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఇప్పటికే పక్క రాష్ట్రంలో భూముల ధరలు ఆకాశంలో ఉన్నాయి. ఇలాంటి తరుణంలో కొత్తగా స్థలాలు కొనే వారి కంటే ఉన్న భూమిని విక్రయించి, వచ్చిన సొమ్ముతో నగరంలో ప్రాపర్టీ కొనేందుకే ఆసక్తి చూపిస్తారని దీంతో ప్రాపర్టీలకు మరింత డిమాండ్ ఉంటుందని నిపుణులు విశ్లేíÙస్తున్నారు. -
భారత్లోనే అతిపెద్ద డీల్!.. నెలకు రూ.40.81 లక్షల రెంట్
భారతదేశంలో రియల్ ఎస్టేట్ రంగంలో వేగంగా అభివృద్ధి చెందుతోంది. నగరాల్లో భూములు, భవనాల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. సంపాదించిన డబ్బులో సగం రెంట్ కట్టుకోవడానికే సరిపోతోందని కొందరు భాదపడుతున్నారు. ఈ తరుణంలో గ్లోబల్ ట్రేడింగ్ కంపెనీ ఐఎంసీ ట్రేడింగ్ అనుబంధ సంస్థ ఐఎంసీ సెక్యూరిటీస్ ప్రైవేట్ లిమిటెడ్ ఓ భారీ డీల్ కుదుర్చుకుంది.ఐఎంసీ సెక్యూరిటీస్ ప్రైవేట్ లిమిటెడ్ ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్లోని ఒక ఆఫీస్ కాంప్లెక్స్ లీజుకు తీసుకుంది. ఇందులో కంపెనీ ఒక్కో చదరపు అడుగుకు రూ. 700 చొప్పున లీజుకు తీసుకుంది. ఈ భవనం మేకర్ మ్యాక్సిటీ 4 నార్త్ అవెన్యూ భవనంలోని 4వ అంతస్తులో ఉంది. లీజు వ్యవధి జూన్ 16న ప్రారంభమవుతుంది. దీనికి సంబంధించిన లావేదేవీలు జూన్ 5న పూర్తయ్యాయి.కంపెనీ రూ.40.81 లక్షల నెలవారీ అద్దెతో 5 నెలల పాటు స్థలాన్ని లీజుకు తీసుకుంది. ముంబైలో అద్దె రేట్లు ప్రాంతాన్ని బట్టి చదరపు అడుగులకు రూ. 100 నుంచి రూ. 500 మధ్య ఉంటాయి. అయితే బాంద్రా కుర్లా కాంప్లెక్స్ (BKC) అనేది ముంబై వ్యాపార కేంద్రాలకు చాలా ముఖ్యమైనది కావడంతో ఇక్కడ ధరలు భారీగా ఉంటాయి. ఇప్పటి వరకు చదరపు అడుగు అద్దె రూ. 700 చెల్లిస్తున్న కంపెనీల జాబితాలో ఐఎంసీ సెక్యూరిటీస్ మొదటి సంస్థ. బాంద్రా కుర్లా కాంప్లెక్స్లో ఇదే అతిపెద్ద డీల్ అని తెలుస్తోంది.గతంలో కూడా ఐఎంసీ సెక్యూరిటీస్ సంస్థ 2022 ఏప్రిల్లో బాంద్రా కుర్లా కాంప్లెక్స్లో ఒక చదరపు అడుగును రూ. 421 చొప్పున లీజుకు తీసుకుంది. అంతకు ముందు 2021 ఏప్రిల్లో చదరపు అడుగు రూ. 405 ధరతో లీజుకు తీసుకుంది. ముంబైలో 2023-24 ఆర్థిక సంవత్సరం మొదటి అర్ధభాగంలో చదరపు అడుగు అద్దె రూ. 130 నుంచి రూ. 136 మధ్య ఉండేది. -
ఏటీఎం నుంచి డబ్బులు డ్రా చేస్తున్నారా? లిమిట్ దాటితే బాదుడే!
క్యాష్ విత్డ్రాపై కస్టమర్లు చెల్లించే ఇంటర్ఛేంజ్ ఫీజును పెంచాలని కోరుతూ భారత ఏటీఎం ఆపరేటర్లు.. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ), నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ)లను సంప్రదించారు. ఇప్పటికే ఉన్న ఛార్జీలకు మరో రెండు రూపాయలు పెంచాలని కోరింది.వ్యాపారం కోసం మరిన్ని నిధులను పొందటానికి కాన్ఫెడరేషన్ ఆఫ్ ఏటీఎం ఇండస్ట్రీ (CATMI) ఇంటర్చేంజ్ ఫీజును ఒక్కో లావాదేవీకి గరిష్టంగా రూ. 23కి పెంచాలని పేర్కొంది. రెండు సంవత్సరాల క్రితం ఇంటర్చేంజ్ రేటును చివరిసారిగా పెంచినట్లు ఏజీఎస్ ట్రాన్సాక్ట్ టెక్నాలజీస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ స్టాన్లీ జాన్సన్ వెల్లడించారు.2021లో ఏటీఎం లావాదేవీలపై ఇంటర్చేంజ్ ఫీజు రూ.15 నుంచి రూ.17కి పెంచారు. ప్రస్తుతం ఈ ఫీజు రూ. 21గా ఉంది. ఏటీఎం ఆపరేటర్ల కోరిక మేరకు ఆర్బీఐ మరో రెండు రూపాయలు పెంచడానికి గ్రీన్ సిగ్నెల్ ఇస్తే.. అది రూ. 23లకు చేరుతుంది.ఏటీఎం చార్జెస్ అనేవి లిమిట్ దాటితే వర్తిస్తాయి. సాధారణంగా ఒక వ్యక్తి ఏటీఎం నుంచి నెలకు ఐదు సార్లు విత్డ్రా చేసుకోవచ్చు. బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, కోల్కతా, ముంబై, న్యూఢిల్లీ వంటి ఆరు ప్రధాన నగరాల్లో బ్యాంకులు తమ సేవింగ్స్ ఖాతాదారులకు నెలకు కనీసం ఐదు ఉచిత లావాదేవీలను అందిస్తున్నాయి. ఈ లిమిట్ దాటిన తరువాత ఈ చార్జెస్ వర్తిస్తాయి. -
ప్రపంచంలోనే నంబర్ వన్ యూట్యూబ్ ఛానల్ ఇదే..!
-
యాపిల్ లో ఉద్యోగం కావాలా..?
-
యాపిల్ సరికొత్త రికార్డ్.. మైక్రోసాఫ్ట్ను వెనక్కు నెట్టి..
ప్రపంచంలో అత్యంత విలువైన కంపెనీగా యాపిల్ రికార్డ్ క్రియేట్ చేసింది. ఇప్పటి వరకు మొదటి స్థానంలో ఉన్న మైక్రోసాఫ్ట్ సంస్థను అధిగ మించిన ఆ స్థానాన్ని దక్కించుకుంది. కొన్ని వారాలకు ముందు ఎన్విడియా షేర్స్ పెరగడంతో యాపిల్ రెండో స్థానాన్ని కూడా కోల్పోయి మూడో స్థానంలో చేరింది. ఇప్పుడు ఒకేసారి అగ్రస్థానాన్ని దక్కించుకుంది.ప్రపంచ వ్యాప్తంగా యాపిల్ అమ్మకాలు పెరడం, యాపిల్ ఇంటెలిజెన్స్ అనే కొత్త ఏఐ ప్లాట్ఫామ్ను ఆవిష్కరించడం వంటివి కంపెనీ షేర్లను భారీగా పెంచాయి. సంస్థ షేర్ ధర నాలుగు శాతం పెరిగి 215.04 డాలర్లకు చేరింది. దీంతో కంపెనీ మార్కెట్ విలువ 3.29 ట్రిలియన్ డాలర్లకు చేరింది.యాపిల్ కంపెనీ షేర్స్ పెరిగిన సమయంలో.. మైక్రోసాఫ్ట్ షేర్స్ తగ్గుముఖం పట్టాయి. షేర్ వాల్యూ తగ్గడంతో మైక్రోసాఫ్ట్ మార్కెట్ క్యాప్ 3.24 ట్రిలియన్ డాలర్లకు చేరింది. దీంతో ఇది మొదటి స్థానాన్ని కోల్పోయింది. యాపిల్ షేర్ పెరగటానికి డబ్ల్యుడబ్ల్యుడీసీ 2024 ప్రధాన కారణమని తెలుస్తోంది.