-
Britain general elections: సునాక్ ఎదురీత!
బ్రిటన్లో పద్నాలుగేళ్ల కన్జర్వేటివ్ పాలనకు తెరపడనుందా? భారత మూలాలున్న తొలి ప్రధానిగా చరిత్ర సృష్టించిన రిషి సునాక్ గద్దె దిగాల్సి వస్తుందా? అవుననే అంటున్నాయి ఒపీనియన్ పోల్స్. షెడ్యూల్ ప్రకారం ఏడాది చివరిదాకా ఆగితే తన ప్రభుత్వంపై ప్రజల్లో పెరుగుతున్న అసంతృప్తి తారస్థాయికి చేరి ఓటమి ఖాయమనే భావనతో రిషి అనూహ్యంగా జూలై 4న ముందస్తు ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయం తీసుకున్నారు. అయినా పెద్దగా ప్రయోజనమేమీ ఉండకపోవచ్చని సర్వేలంటున్నాయి. విపక్ష లేబర్ పార్టీ భారీ మెజారిటీతో అధికారంలోకి వస్తుందని పేర్కొంటున్నాయి. స్వయానా రిషీ కూడా ఎదురీదుతున్నారని, సొంత పార్లమెంట్ స్థానాన్ని కూడా కోల్పోవచ్చని సావంత పోల్ పేర్కొంది! అదే జరిగితే సొంత పార్లమెంటు స్థానంలో ఓడిన తొలి సిట్టింగ్ ప్రధానిగా బ్రిటన్ చరిత్రలో రిషి నిలిచిపోతారు...ముందస్తు ఎన్నికలకు వెళ్లడంతోనే కన్జర్వేటివ్ పార్టీ ఓటమి సగం ఖాయమైందన్నది రాజకీయ నిపుణుల అభిప్రాయం. బ్రిటన్లో కన్జర్వేటివ్ పార్టీది 190 ఏళ్ల చరిత్ర. ఇంత సుదీర్ఘ చరిత్రలో 1906లో వచి్చన 131 సీట్లే అత్యల్పం. ఈసారి ఆ రికార్డును అధిగమించవచ్చని సర్వేలంటున్నాయి. ‘‘సునాక్ ఉత్తర ఇంగ్లాండ్లోని కన్జర్వేటివ్ల కంచుకోటైన తన సొంత పార్లమెంటరీ స్థానాన్ని కూడా కోల్పోవచ్చు. ఆర్థిక మంత్రి జెరెమీ హంట్తో సహా పలువురు సీనియర్ మంత్రులకు ఓటమి తప్పదు’’ అని సావంత పోల్ పేర్కొంది. కన్జర్వేటివ్ పార్టీ చరిత్రలోనే అత్యంత ఘోర పరాజయం తప్పక పోవచ్చని రాజకీయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. భారత సంతతికి చెందిన వారు ఈసారి కన్జర్వేటివ్ పారీ్టకి ఓటేయకపోవచ్చనేది పోల్స్టర్ల అంచనా. లేబర్ పారీ్టకి 425కు పైగా సీట్లు...! హౌజ్ ఆఫ్ కామన్స్లో 650 సీట్లకు గాను లేబర్ పార్టీ 425కు పైగా సాధించి భారీ మెజారిటీతో అధికారంలోకి వస్తుందని సర్వేలు చెబుతున్నాయి. కన్జర్వేటివ్ పార్టీ 108 స్థానాలకు పరిమితమవుతుందని యూగవ్, కేవలం 53 స్థానాలకే పరిమితమవుతారని సావంత పోల్ పేర్కొన్నాయి. సావంత అయితే లేబర్ పార్టీకి దాని చరిత్రలోనే అత్యధికంగా 516 సీట్లు రావచ్చని అంచనా వేయడం విశేషం! కన్జర్వేటివ్లకు 72కు మించబోవని, లేబర్ పార్టీ 456 సీట్లు దాటుతుందని బెస్ట్ ఫర్ బ్రిటన్ సర్వే అంచనా వేసింది. 2019 ఎన్నికల్లో కన్జర్వేటివ్ పార్టీ 43.6 శాతం ఓట్లతో 365 సీట్లు సాధించగా లేబర్ పార్టీకి 32.1 శాతం ఓట్లతో 202 స్థానాలు దక్కాయి. ఆకట్టుకుంటున్న కైర్ స్టార్మర్ ‘లెఫ్టీ లండన్ లాయర్’గా పేరు తెచ్చుకున్న కైర్ స్టార్మర్ లేబర్ పార్టీకి నాయకత్వం వహిస్తున్నారు. 14 ఏళ్లుగా విపక్షంలో ఉంటూ కుంగిపోయిన పారీ్టలో ఆయన జోష్ నింపుతున్నారు. ఇళ్ల సంక్షోభాన్ని పరిష్కరిస్తామని, పన్ను పెంపుదల లేకుండా మెరుగైన ప్రజా సేవలను అందిస్తామనే మామీలతో ఓటర్లను ఆకర్షిస్తున్నారు. కన్జర్వేటివ్ పార్టీ ప్రధాన దాత అయిన బిలియనీర్ జాన్ కాడ్వెల్ కూడా ఈసారి లేబర్ పారీ్టకి మద్దతిస్తున్నారు. తాను లేబర్ పారీ్టకే ఓటేస్తానని బాహాటంగా చెబుతున్నారు. అందరూ అదే చేయాలని పిలుపునిస్తున్నారు.ప్రజల్లో వ్యతిరేకతకు కారణాలెన్నో... బ్రెగ్జిట్ పరిణామాల నేపథ్యంలో డేవిడ్ కామెరాన్ రాజీనామా అనంతరం చీటికీమాటికీ ప్రధానులు మారడం కన్జర్వేటివ్ పార్టీకి చేటు చేసింది. థెరిసా మే, బోరిస్ జాన్సన్, లిజ్ ట్రస్, రిషి రూపంలో ఏకంగా నలుగురు ప్రధానులు మారారు. వీరిలో 45 రోజులే కొనసాగిన ట్రస్ పారీ్టకి గట్టి నష్టాన్ని కలిగించారని, దాన్ని సునాక్ పూడ్చలేకపోయారని అంటున్నారు.→ 2022 అక్టోబర్లో రిషి ప్రధాని అవుతూనే ద్రవ్యోల్బణాన్ని సగానికి తగ్గిస్తానని, ఆర్థిక వ్యవస్థను గాడిన పెడతానని, రుణ భారాన్ని, నేషనల్ హెల్త్ సరీ్వస్ వెయిటింగ్ జాబితాను తగ్గిస్తానని, అక్రమ వలసలను అడ్డుకుంటానని హామీ ఇచ్చారు. ఇవేవీ చేయలేకపోగా సంప్రదాయ ఓటర్లనూ మెప్పించలేకపోయారని విమర్శ ఉంది.→ ఐదేళ్లలో బ్రిటన్ వాసుల జీవన ప్రమాణాలు బాగా పడిపోయాయి. వారిపై పన్ను భారమైతే గత 70 ఏళ్లలో అత్యధిక స్థాయిలో ఉంది. అక్రమ వలసలు పెరిగాయి. ప్రధానిగా సునాక్ నిర్ణయాలపై సొంత పార్టీ నేతల నుంచే విమర్శలొచ్చాయి. → వీటికి తోడు 14 ఏళ్లుగా అధికారంలో ఉండటంతో సహజంగానే ప్రభుత్వ వ్యతిరేకత తీవ్రంగా ఉంది.→ రిఫార్మ్ యూకే పార్టీ పుంజుకోవడం కూడా కన్జర్వేటివ్లను దెబ్బ తీయనుంది. ఈ పారీ్టకి 15 శాతం ఓట్ల వాటా ఉంది. ఈసారి చాలా స్థానాల్లో కన్జర్వేటివ్ ఓటు బ్యాంకుకు భారీగా గండి పెడుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. -
బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ ఇంట దీపావళి వేడుకలు (ఫోటోలు)
-
రిషి సునాక్పై తీవ్ర విమర్శలు చేసిన బ్రిటన్ ఎంపీ
లండన్: బ్రిటిష్ మాజీ కల్చర్ సెక్రెటరీ నాడైన్ డోరీస్ తన పార్లమెంటు సభ్యత్వానికి రాజీనామా చేస్తూ రాసిన లేఖలో ప్రధాని రిషి సునాక్పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. బోరిస్ జాన్సన్ ఎంపీగా రాజీనామా చేసినప్పుడే ఆమె కూడా రాజీనామా చేయాల్సి ఉంది కానీ అప్పుడు ఆమె రాజీనామా చేయనందుకు తీవ్ర విమర్శలు కూడా ఎదుర్కొన్నారు. ఎట్టకేలకు రాజీనామా చేసిన ఆమె రిషి సునాక్పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తూ భారీ లేఖను రాశారు. బ్రిటన్ మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్కు అత్యంత సన్నిహితురాలైన కన్జర్వేటివ్ పార్టీ ఎంపీ నాడైన్ డోరీస్ చాలా కాలంగా రిషి సునాక్ ప్రభుత్వంపై అసంతృప్తితో ఉన్నారు. పార్లమెంట్ సభ్యత్వానికి రాజీనామా చేస్తూ ప్రధాని జాంబీల ప్రభుత్వాన్ని నడుపుతున్నారని ఆయనకు ఎటువంటి రాజకీయ ముందుచూపు లేదన్నారు. రిషి సునాక్ తాను అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమి సాధించారో చెప్పాలని డిమాండ్ చేశారు. దేశ ప్రయోజనాల కంటే వ్యక్తిగత ప్రయోజనాలకు పెద్దపీట వేస్తూ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారన్నారు. ఆర్ధిక పరమైన కుంభకోణాలతో పాటు మరికొన్ని కుంభకోణాల కారణంగా మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్ తన పదవి నుండి తప్పుకున్నారు. మాజీ ఆర్ధిక మంత్రి, ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్ అయిన రిషి సునాక్ పార్టీ నాయకత్వ పోటీలో నామినేట్ చేయబడిన ఏకైక అభ్యర్థి కావడంతో ప్రధానిగా నియమితులయ్యారు. ఎంపీ రాసిన రాజీనామా లేఖ సంగతి అటుంచితే రిషి సునాక్ ప్రభుత్వం ప్రస్తుతానికైతే వెంటిలేటర్పైనే ఉండాలి చెప్పాలి. కొద్దీ రోజుల క్రితం ఖాళీ అయిన పార్లమెంట్ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో కన్జర్వేటివ్ పార్టీ రెండు స్థానాలను కోల్పోగా బోరిస్ జాన్సన్ రాజీనామా చేసిన చోట మాత్రం గెలిచింది. ప్రధాని రిషి సునక్ తన సాంకేతిక నాయకత్వాన్ని ఉపయోగించుకుని పార్టీ విశ్వసనీయతను కాపాడుకంటూ వస్తున్నారు. కానీ అధిక ద్రవ్యోల్బణం, ఆర్థిక స్తబ్దత, పారిశ్రామిక అస్థిరత ప్రభుత్వ ఆరోగ్య సేవల్లో జాప్యం వంటి కారణాలు వారిని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయని ఈ కారణాల వల్లనే వచ్చే ఎన్నికల్లో కన్జర్వేటివ్ పార్టీ ప్రత్యర్థి లేబర్ పార్టీ కంటే చాలా వెనుకబడి ఉన్నారని అక్కడి మీడియా వర్గాలు చెబుతున్నాయి. ఇది కూడా చదవండి: బాస్మతి బియ్యంపై కేంద్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు.. -
బ్రిటన్ ప్రధాని నివాసంపై కారుతో దాడికి యత్నం?
బ్రిటన్ ప్రధాన మంత్రి అధికారిక నివాసం వద్ద ఓ వ్యక్తి కారుతో దాడికి యత్నించాడు. ఈ పరిణామం అందర్నీ షాక్ కి గురి చేసింది. వెంటనే అక్కడి భద్రతా సిబ్బంది అప్రమత్తమయ్యారు. ఆ వ్యక్తిని వెంటనే అదుపులోకి తీసుకున్నారు. గురువారం సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకోగా.. ఆ సమయంలో సునాక్ తన కార్యాలయంలో ఉన్నట్లు తెలుస్తోంది. లండన్ లోని ప్రధాని అధికారిక నివాసం 10 డౌనింగ్ స్ట్రీట్ గేటును ఓ వ్యక్తి కారుతో ఢీకొట్టాడు. బ్రిటన్ కాలమానం ప్రకారం గురువారం సాయంత్రం నాలుగున్నర గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. నివాసం గేటును కారు ఢీకొన్న వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది.. ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. కాస్త వయసున్న ఆ వ్యక్తిని సంకెళ్లతో బంధించి తీసుకెళ్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలోనూ వైరల్ అయ్యాయి. సాధారణంగా బ్రిటన్ ప్రధాని నివాసం 10 డౌనింగ్ స్ట్రీట్ వద్ద ఎప్పుడూ గట్టి సెక్యూరిటీ ఉంటుంది. రక్షణ వ్యవస్థలో భాగంగా బలమైన ఇనుప గేట్లు ఉంటాయి. దేశ పార్లమెంటుకు ఇది దగ్గరి మార్గం. ఇక్కడి ఎంట్రెన్స్ వద్ద గతంలోనే లోనే భారీ గేట్లను ఏర్పాటు చేశారు. 1991లో ఐరిష్ రిపబ్లిక్ ఆర్మీ లండన్లో బాంబు దాడులకు పాల్పడిన దృష్ట్యా ఇక్కడ భద్రతను పెంచారు. కాగా తాజా ఘటన వెనుక నిందితుడి ఉద్దేశం ఏంటన్నది తెలియాల్సి ఉంది. ఇదిలా ఉంటే.. గురువారం సాయంత్రం బ్రిటన్ ప్రధాని నివాసం వద్ద జరిగింది ఉగ్ర దాడి కాకపోవచ్చునని పోలీసులు భావిస్తున్నారు. క్రిమినల్ డ్యామేజ్, డేంజరస్ డ్రైవింగ్ ఆరోపణలపై అతడిని అరెస్టు చేసినట్టు వారు చెప్పారు. ఇదిలా ఉంటే.. అమెరికాలో అధ్యక్ష భవనం వైట్ హౌస్ వద్ద 19 ఏళ్ళ సాయివర్షిత్ కందుల ఓ అద్దె ట్రక్కుతో హల్ చల్ చేసిన సంగతి తెలిసిందే. ఇది జరిగిన మూడు రోజులకే బ్రిటన్ ప్రధాని నివాసం వద్ద అదే తరహా ఘటన చోటు చేసుకోవడగం గమనార్హం. ఇదీ చదవండి: అడ్డొస్తే ఎవరినైనా లేపేస్తా: సాయివర్షిత్ -
బ్రిటన్ ప్రజలకు క్షమాపణలు చెప్పిన రిషి సునాక్
లండన్: బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ ప్రజలకు క్షమాపణలు చెప్పారు. తాను చేసింది తప్పే అని ఒప్పుకున్నారు. కారులో ప్రయాణిస్తూ సీటు బెల్టు ధరించనందుకు తీవ్ర విమర్శలు రావడంతో ఆయన ఈమేరకు స్పందించారు. రిషి అధికార ప్రధినిధి జేమీ డేవిస్ ఈ విషయాన్ని వెల్లడించారు. ఓ ప్రచార కార్యక్రమం కోసం వీడియో చిత్రీకరిస్తుండగా రిషి సునాక్ కారులో వెనకాల కూర్చొని మాట్లాడారు. ఈ సమయంలో ఆయన సీటు బెల్టు ధరించలేదు. దీంతో నెటిజన్ల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి. ప్రధాని అయి ఉండి రూల్స్ పాటించకపోవడంపై నెటిజన్లు మండిపడ్డారు. దీంతో రిషి తన తప్పు ఒప్పుకుని క్షమాపణలు చెప్పారు. గతంలో కరోనా ఆంక్షల సమయంలో కూడా రిషి నిబంధనలు అతిక్రమించారు. పోలీసులు అందుకు జరిమానా కూడా విధించారు. అప్పుడు కూడా ప్రజల ఆగ్రహానికి గురై విమర్శలు ఎదుర్కొన్నారు. ఇప్పుడు మరోమారు ఇరకాటంలో పడ్డారు. దీన్నే అవకాశంగా తీసుకున్న ప్రతిపక్ష లేబర్ పార్టీ రిషిపై విమర్శలతో విరుచుకుపడింది. గతంలో ఓసారి ఆయన కాంటాక్ట్ లెస్ డెబిట్ కార్డును ఉపయోగించేందుకు ఇబ్బంది పడిన విషయాన్ని గుర్తు చేసింది. 'రిషి సునాక్కు సీటు బెల్టు పెట్టుకోవడం రాదు. డెబిట్ కార్డు ఉపయోగించడం రాదు. రైలు సేవలు, దేశ ఆర్థిక వ్యవస్థ గురించి కూడా తెలియదు' అని లేబర్ పార్టీ ఎద్దేవా చేసింది. చదవండి: బాప్రే!..పాత సామాన్లు అమ్ముకున్న ఎలాన్ మస్క్, ఏ వస్తువు ఎంత ధర పలికిందంటే -
షాకింగ్.. రిషి సునాక్పై బూతులతో రెచ్చిపోయిన నటి.. ఎందుకంటే?
లండన్: బ్రిటన్ ప్రధాని రిషి సునాక్పై బూతులతో రెచ్చిపోయింది ప్రముఖ నటి, షీ-హల్క్ వెబ్ సిరీస్ స్టార్ జమీలా జామిల్. ఆయన ప్రభుత్వం ప్రజలను అణగదొక్కాలని చూస్తోందని మండిపడింది. రిషి సునాక్ సంపన్న వర్గానికి చెందిన వాడని, మితవాది అని, అదృష్టం కొద్ది ప్రధాని అయ్యారని ధ్వజమెత్తింది. ఇంగ్లీష్ భాషలో బూతు పదంతో తీవ్ర విమర్శలు చేసింది. ఈమేరకు తన ఇన్స్టాగ్రాంలో పోస్టు చేసింది. ఎందుకీ విమర్శలు..? బ్రిటన్లో ప్రజలు నిరసనలు, ఆందోళనలు చేపట్టకుండా కొత్త చట్టాన్ని తీసుకురావాలని రిషి సునాక్ ప్రభుత్వం భావిస్తోంది. దీంతో ప్రజలకు స్వేచ్ఛ లేకుండా చేయాలని రిషి సునాక్ చూస్తున్నారని జమీలా జామిల్ మండపడింది. ఇది నాయకత్వం కాదు నియంతృత్వం అని ధ్వజమెత్తింది. ప్రజలు ఉద్యోగాలు లేక ఆర్థిక సాయం అందక నిరసనలు వ్యక్తం చేస్తుంటే బిలియనీర్ రిషి సునాక్ వాళ్ల నోళ్లు మూయించాలని చూస్తున్నారని, దీన్ని తాము ఎంత మాత్రమూ సహించబోమని జమీలా హెచ్చరించింది. బ్రిటన్ వలసదారులపై రిషి సునాక్ విమర్శలు చేయడాన్ని కూడా తప్పుబట్టింది. బ్రిటన్ కోసం పనిచేస్తున్న వారిపై నిందలు మోపొద్దని హితవు పలికింది. చదవండి: రెస్టారెంట్లో కాల్పుల కలకలం.. ర్యాపర్ సహా 10 మందికి గాయాలు -
FIFA World Cup 2022: ఖతర్ను పొగుడుతూ ట్వీట్.. రిషి సునాక్పై విమర్శలు!
లండన్: ఖతర్ వేదికగా జరుగుతున్న ఫిఫా ప్రపంచకప్లో మ్యాచ్లు తుది అంకానికి చేరుకుంటున్నాయి. ఏమాత్రం అంచనాలు లేని జట్టు బలమైన జట్లను ఓడించాయి. ఇదిలా ఉంటే..ఫిఫా ప్రపంచకప్పై బ్రిటన్ ప్రధానమంత్రి రిషి సునాక్ చేసిన ఓ ట్వీట్ విమర్శలకు దారి తీసింది. 16వ రౌండ్లో సెనెగల్తో ఇంగ్లాండ్ మ్యాచ్కు ముందు ఫిఫా ప్రపంచకప్ను నిర్వహిస్తున్న ఖతర్ను పొగుడుతూ ట్వీట్ చేశారు రిషి సునాక్. ‘ఇప్పటివరకు అద్భుతమైన ప్రపంచకప్ను నిర్వహించినందుకు ఖతార్కు హ్యాట్సాఫ్. గ్రూప్ దశలు ఆల్ టైమ్ గ్రేట్స్లో ఒకటిగా గుర్తుండిపోతాయి. కమాన్ ఇంగ్లాండ్.. మన కలను సజీవంగా కొనసాగించండి.’ అంటూ ట్విట్టర్ వేదికగా ఖతార్పై ప్రశంసలు కురింపించారు. ఆయన ట్వీట్కు మిశ్రమ స్పందనలు వచ్చాయి. ‘నిజంగానా? ఆల్ టైమ్ గ్రేట్స్? మీరు ఏం చూస్తున్నారో మాకైతే అర్థం కావటం లేదు.’ అంటూ ఓ నెటిజన్ రాసుకొచ్చారు. మరోవైపు.. కొందరు ఇంగ్లాండ్, సెనెగల్ మధ్య థ్రిల్లింగ్ మ్యాచ్ జరిగినట్లు పేర్కొన్నారు. ‘ఎస్ రిషి సునాక్, ఖతర్ అద్భుతమైన కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. కొంత మందికి మాత్రం సమస్యగా ఉన్నా.. చూడదగ్గ ఈవెంట్.’ అంటూ మరొకరు రాసుకొచ్చారు. మరోవైపు.. ఇంగ్లాండ్ గత మ్యాచ్లో విజయం సాధించటంపై ప్రశంసలు కురింపించారు. తాము గతంలో ఎన్నడూ ఇంగ్లాండ్ ఆటను ఈ విధంగా చూడలేదని పేర్కొన్నారు. సెనెగల్పై విజయం సాధించిన ఇంగ్లాండ్.. డిసెంబర్ 11 డిఫెండింగ్ ఛాంపియన్స్ ఫ్రాన్స్తో క్వార్టర్ ఫైనల్లో తలపడనుంది. Hats off to Qatar for hosting an incredible World Cup so far. The group stages will be remembered as one of the all-time greats. Come on @England keep the dream alive 🦁🦁🦁#FIFAWorldCup #ENGSEN pic.twitter.com/YyLv9Y2VjZ — Rishi Sunak (@RishiSunak) December 4, 2022 ఇదీ చదవండి: FIFA World Cup 2022: మరో సంచలనం.. బెల్జియంను ఖంగుతినిపించిన మొరాకో -
Bali G20 Summit: జీ 20 సదస్సుకు సర్వం సిద్ధం
న్యూఢిల్లీ/బాలి: ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన జీ 20 కూటమి దేశాల సదస్సుకు హాజరవడానికి ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం ఇండొనేసియా బయల్దేరి వెళుతున్నారు. ఇండొనేసియాలోని బాలిలో 15, 16 తేదీల్లో జరిగే 17వ జీ 20 శిఖరాగ్రంలో మూడు ముఖ్యమైన సెషన్స్లో పాల్గొంటారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, బ్రిటన్ ప్రధాని రిషి సునాక్, ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్, జర్మనీ ఛాన్సలర్ ఒలఫ్ స్కొల్జ్, చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్లు కూడా హాజరవనున్నారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ రావడం లేదు. అధ్యక్ష బాధ్యతలు భారత్కు 20 దేశాల కూటమి అయిన జీ 20 18వ సదస్సుకు 2023లో భారత్ అధ్యక్షత వహించనుంది. బాలి సదస్సులో ఇండొనేసియా నుంచి సారథ్య బాధ్యతలను భారత్ అందుకోనుంది. సునాక్తో ప్రత్యేకంగా భేటీ! జీ 20 సదస్సుకు హాజరయ్యే దేశాధినేతలతో మోదీ ప్రత్యేకంగా భేటీ అయి ద్వైపాక్షిక అంశాలపై చర్చలు జరిపే అవకాశాలున్నాయి. దీంతో అందరి దృష్టి భారత సంతతికి చెందిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్తో మోదీ భేటీపై ఆసక్తి నెలకొంది. అయితే వీరిద్దరి మధ్య భేటీ ఉంటుందో లేదో ఇరుపక్షాలు కూడా స్పష్టం చేయలేదు. -
రిషి సునాక్ను బ్రిటన్ ప్రధానిగా చేయడం వెనుక..
‘మనము నేర్చు కోవాల్సిన పాఠం’ అంటూ అక్టోబర్ 31వ తేదీన కరణ్ థాపర్ వ్యాసంలోని అంశాలు అసంబద్ధంగా, తర్క విరుద్ధంగా ఉన్నాయి. బ్రిటన్ దేశ ప్రధాన మంత్రిగా హిందూ భక్తుడైన రిషి సునాక్ ఎన్నిక కావడానికీ, బ్రిటన్ నుంచి మనము పాఠం నేర్చుకోవడానికీ సంబంధం ఏమిటో అర్థం కావడం లేదు. రిషి సునాక్ను ఎన్ను కోవడానికి ముందు లిజ్ ట్రస్ అనే మహిళను కన్జర్వేటివ్ పార్టీ ఎన్నుకున్నది కదా. దేశాన్ని ఆర్థిక సంక్షోభం నుండి గట్టె క్కించడానికి బ్రిటన్ దేశానికి, ముఖ్యంగా కన్జర్వేటివ్ పార్టీ ప్రభుత్వానికి రిషి సునాక్ లాంటి ఆర్థిక వ్యవహారాల నిపుణుడి అవసరం వచ్చింది. కన్జర్వేటివ్ పార్టీ రిషి సునాక్ను ఎన్నికల ముందు ప్రధాని అభ్యర్థిగా నిలబెట్టి, ఎన్నికలలో గెలిచి ఉంటే – అప్పుడు భారతీయులు బ్రిటన్ ప్రజల నుంచి ఆదర్శాన్ని అందిపుచ్చుకోవాల్సి ఉండేది. 190 సంవత్సరాలు భారతదేశాన్ని పీల్చి పిప్పి చేసింది బ్రిటన్. ఇప్పటికీ 14 దేశాలపై తన రాజరికపు ముద్రను కొనసాగిస్తూనే ఉన్నది. తమను దోచుకున్న దేశాన్ని బ్రిటిషర్స్ శత్రువులుగా భావిస్తారు. వ్యాసకర్త చెప్పిన దానికి విరుద్ధంగా ఆ దేశం నుండి చాలా విషయాలను స్వయం ప్రకటిత మేధావులైన కొందరు భారతీయులు నేర్చుకోవాలి. ఇక రిషి సునాక్ బ్రిటన్ ప్రధానిగా ఎన్నికైన సందర్భాన్ని నేపథ్యంగా కేంద్ర ప్రభుత్వాన్ని నడిపే భారతీయ జనతా పార్టీ హిందూ మతానికి చెందినదనీ, ఆ పార్టీ ముస్లింలకు వ్యతిరేకమని చెప్పడానికీ వ్యాసకర్త సంఖ్యాపరమైన విశ్లేషణలు చక్కగా చేశారు. ఈ దేశంలో సంఖ్యాపరంగా ముస్లింలు 14.3 శాతం ఉన్నది నిజమే. పార్లమెంట్లో వారి స్థానాలు కూడా తక్కువనేది వాస్తవమే. సివిల్ సర్వెంట్లుగా, సైనికులుగా ఆ మతం వారి సంఖ్య దేశంలోని ఇతర మతాల వారితో పోలిస్తే తక్కువే. ఇందుకు భారతీయ జనతా పార్టీ కారణం కాదే! హిందువులు మెజారిటీగా ఉన్న భారతదేశంలో ముస్లిం వర్గం నుండి నలుగురు రాష్ట్రపతులుగా ఎన్నిక చేయబడ్డారు. మరి ముస్లింలు మెజా రిటీగా ఉండే పాకిస్తాన్, బంగ్లాదేశ్లలో మైనార్టీ వర్గాలైన హిందువులు, బౌద్ధులు, జైనులు, సిక్కులు, పార్సీలు, క్రైస్తవుల పరిస్థితి ఏమిటి? 20 కోట్ల మంది ముస్లింల నుండి ఒక ప్రధాని ఆశించడానికి వీలు లేదా? అని ఒక మంచి ప్రశ్న వేశారు వ్యాసకర్త. కాంగ్రెస్ అధ్యక్షురాలిగా, క్రైస్తవ మతానికి చెందిన సోనియా గాంధీ 2004 నుండి 2014 వరకు ఈ దేశంపై సర్వాధికారాలను అనుభవించిన విషయం అందరికీ తెలిసిందే. జమ్మూ కశ్మీర్ రాష్ట్రంలో 28 శాతం హిందువులు ఉంటారు. ఆ రాష్ట్రం భారతదేశంలో విలీనమైనప్పటి నుండి ఇప్పటివరకు ఒక్క హిందువూ సీఎం కాలేదనే విషయం వ్యాసకర్తకు తెలియదా? ముస్లింలను చెద పురుగులుగా, బాబర్ వారసులుగా అవహేళన చేస్తూ, మానసికంగా వేధిస్తున్నారనే విషయం వాస్తవమేనా? కశ్మీర్ లోయనుండి 3 లక్షల మంది హిందువులను తరిమికొట్టింది ఎవరు? ఇక చివరిగా రిషి సునాక్ను బ్రిటన్ ప్రధానిగా చేయడం వెనుక ఆ దేశ అవసరం ఉంది. ఈ విషయంలో ఆయన భారతీయ మూలాల శ్రేష్ఠత గానీ, రంగు గానీ, జాతి గానీ కన్జర్వేటివ్ పార్టీ ఎంపీలకు కనబడ లేదనే విషయం మనం అర్థం చేసుకోవాలి. అందుకే మనం రిషీ సునాక్ ఎంపిక చూసి గర్వపడాల్సింది ఏమీలేదు. బ్రిటిష్వారి ఔదా ర్యమూ అంతకన్నా ఏమీలేదు. - ఉల్లి బాలరంగయ్య రాజకీయ, సామాజిక విశ్లేషకులు -
COP27: వేదికను వీడిన రిషి సునాక్.. అంతా షాక్
షెర్మ్–ఎల్–షేక్: ప్రపంచ పర్యావరణ సదస్సు కాప్-27 కు హాజరుకాబోనని ప్రకటించి.. ఆవెంటనే యూటర్న్తీసుకుని ప్రపంచాన్ని నివ్వెరపోయేలా చేశాడు బ్రిటన్ కొత్త ప్రధాని రిషి సునాక్. ఆదివారం రాత్రే సదస్సుకు చేరుకున్న ఆయన.. పర్యావరణ మార్పులు, అభివృద్ధి చెందుతున్న దేశాలకు అందించబోయే సాయం, భావితరాల సంక్షేమం గురించి కూడా ప్రసంగించారు. అయితే ఓ కీలక సమావేశం జరుగుతున్న సమయంలో హడావిడిగా అక్కడి నుంచి నిష్క్రమించడం అందరినీ షాక్కు గురి చేసింది. కాప్27 సదస్సులో సోమవారం ఓ నాటకీయ పరిణామం జరిగింది. సదస్సు కొనసాగుతున్న సమయంలోనే ఆయన ఆ హాల్ నుంచి హడావిడిగా బయటకు వెళ్లిపోయారు బ్రిటన్ ప్రధాని రిషి సునాక్. దీంతో ఏం జరుగుతుందో అర్థంకాక గందరగోళానికి గురయ్యారు అక్కడ ఉన్నవాళ్లంతా. COP27 సదస్సులో భాగంగా.. ఫారెస్ట్స్ పార్ట్నర్షిప్ ప్రారంభం అయిన కాసేపటికే ఓ సహాయకుడు వచ్చి బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ నిమిషంపాటు చెవిలో ఏదో చెప్పాడు. అయినా సునాక్ అలాగే స్టేజ్ మీద కూర్చుని ఉండిపోయారు. ఈ లోపే మరో వ్యక్తి వచ్చి ఆయనతో ఏదో చెప్పగా.. హడావిడిగా సునాక్ అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ విషయాన్ని యూకేకు చెందిన ఓ వెబ్సైట్ నిర్వాహకుడు లియో హిక్మ్యాన్ తెలిపారు. UK prime minister @RishiSunak has just been rushed out of the room by his aides during the middle of the launch for forests partnership at #COP27 pic.twitter.com/OQy9TYkqpX — Leo Hickman (@LeoHickman) November 7, 2022 సహాయకులు ఏం చెప్పారు? ఆయన ఎందుకు అక్కడి నుంచి వెళ్లిపోయారు? ఆయనింకా అక్కడే ఉన్నారా? బ్రిటన్కు వెళ్లారా? దానిపై డౌనింగ్ స్ట్రీట్ ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు. ఐరాస నిర్వహించే పర్యావరణ మార్పుల సదస్సును ‘కాన్ఫరెన్స్ ఆఫ్ ది పార్టీస్’(COP27)గా వ్యవహరిస్తుంటారు. ఈజిప్ట్లో రిసార్టుల వనంగా పేరున్న షెర్మ్–ఎల్–షేక్లో ఈ సదస్సు ఆదివారం నుంచి మొదలైంది. ఇదిలాఉంటే.. 42 ఏళ్ల రిషి సునాక్కు ప్రధాని హోదాలో ఇదే తొలి అధికారిక పర్యటన కావడం గమనార్హం. ఇదీ చదవండి: రిషి సునాక్పై విమర్శల పర్వం! -
Rishi Sunak: రిషి సునాక్.. ఇది తగునా?
లండన్: బ్రిటన్ ప్రధాన మంత్రి రిషి సునాక్ తీరుపై కన్జర్వేటివ్ పార్టీ సీనియర్లలో అసంతృప్తి పెల్లుబిక్కుతోంది. వివాదాల్లో నిలిచిన వ్యక్తులను కేబినెట్లోకి తీసుకోవడం.. పైగా వాళ్లను వెనకేసుకొస్తుండడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నిన్నగాక మొన్న సువెల్లా బ్రేవర్మన్ను తిరిగి మంత్రిగా నియమించడంపై విమర్శలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. ఆ వేడి చల్లారకముందే తప్పు చేసిన మరో మంత్రిని వెనకేసుకు రావడం ద్వారా ఆయన మరోసారి విమర్శలపాలవుతున్నారు. సండేటైమ్స్ కథనం ప్రకారం.. మంత్రి గేవిన్ విలియమ్సన్.. మాజీ పార్టీ విప్, వెంటీ మోర్టన్కు ఫోన్ ద్వారా అసభ్యమైన సందేశాలు పంపారు. ఈ విషయాన్ని మరో మంత్రి ఒలీవర్ డౌడెన్ తాజాగా మీడియాకు వెల్లడించారు. వర్ణించలేని రీతిలో గేవిన్, ఆమెను తిట్టినట్లు తెలుస్తోంది. క్వీన్ ఎలిజబెత్ అంత్యక్రియల సమయంలో ఆహ్వానం అందకపోవడంపై రగిలిపోతూ వెంటీకి అలా మెసేజ్లు చేశాడట. అయితే.. ఈ వ్యవహారాన్ని ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే సునాక్ దృష్టికి తీసుకెళ్లారు పార్టీ మాజీ చైర్మన్ సర్ జేక్ బెర్రీ. ఫోన్ సంభాషణలను మీడియాకు చూపిస్తున్న డౌడెన్ మరోవైపు కన్జర్వేటివ్ పార్టీ గవర్నింగ్ బాడీకి ఆమె ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. గేవిన్-వెంటీ మధ్య వైరం సంగతి రిషి సునాక్కు ముందు నుంచే తెలుసని, అయినప్పటికీ గేవిన్ను సునాక్ వెనుకేసుకొస్తున్నారని డౌడెన్ ఆరోపించారు. ఇక తీవ్ర విమర్శల నేపథ్యంలో బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ స్పందించారు. గేవిన్ చర్యలు సరికాదని, ఆమోదయోగ్యం ఎంతమాత్రం కాదని అన్నారు. అలాగే ఈ వ్యవహారంలో ఎవరికీ వెనుకేసుకు రావాల్సిన అవసరం తనకు లేదన్నారు. ఫిర్యాదు నేపథ్యంలో.. ఈ ఘటనపై దర్యాప్తు జరుగుతుందని ఆయన చెప్పారు. అంతకు ముందు సువెల్లా బ్రేవర్మన్ నియామకాన్ని ఆయన సమర్థించుకున్న సంగతి తెలిసిందే!. ఇదీ చదవండి: మూలాలపై రిషి సునాక్ ఆసక్తికర వ్యాఖ్యలు -
హిందూ ప్రధానిగా గర్విస్తున్నా
లండన్: బ్రిటన్ మొట్టమొదటి హిందూ ప్రధాని అయినందుకు గర్వపడుతున్నానని భారత సంతతికి చెందిన రిషి సునాక్ అన్నారు. ప్రధాని పగ్గాలు చేపట్టిన తర్వాత తొలిసారిగా ఒక ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన మనసులో భావాల్ని పంచుకున్నారు. ప్రధానిగా తాను ఎన్నికవడం బ్రిటన్లో భిన్నత్వానికి నిలువెత్తు నిదర్శనమని వ్యాఖ్యానించారు.యూకేకి 42 ఏళ్ల వయసులోనే ప్రధాని అయిన రిషి సునాక్ ఏదైనా ముఖ్య కార్యక్రమం చేయడానికి ముందు గోమాతకి పూజ చేస్తారు. దీపావళి పండుగని ఘనంగా జరుపుకుంటారు. ‘‘ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు డౌనింగ్ స్ట్రీట్లో దీపావళి పండుగకి దివ్వెలు వెలిగించాను. అలా చెయ్యగలగడం మన దేశం ఎంత అద్భుతమైనదో చాటి చెప్పింది. అదే సమయంలో అదో పెద్ద విషయం కాదన్న అంశాన్ని కూడా చెప్పింది.’ అని సునాక్ అన్నారు. ప్రధాని ఎన్నిక సమయంలో బోరిస్ జాన్సన్ ప్రధాని కావడానికి వీలుగా తాను పోటీ నుంచి తప్పుకుంటానని జరిగిన ప్రచారాన్ని తోసిపుచ్చారు. ‘‘పార్లమెంటులో నా సహచర ఎంపీల నుంచి నాకు గట్టి మద్దతు ఉంది. దేశం ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయి ఉన్న సమయంలో ప్రధానిగా నేనే సరైన వ్యక్తినని గట్టిగా నమ్మాను. రేసు నుంచి తప్పుకోవాలన్న ఆలోచన నాకు ఎప్పుడూ రాలేదు’’ అని సునాక్ స్పష్టం చేశారు. -
పీఎంగా రిషి సునాక్ బిగ్ ‘యూ-టర్న్’.. ఆ నిర్ణయంలో మార్పు
లండన్: బ్రిటన్ రాజకీయ చరిత్రను తిరగరాస్తూ భారత సంతతి వ్యక్తి రిషి సునాక్ ప్రధాని పదవి చేపట్టిన విషయం తెలిసిందే. దేశాన్ని ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కించేందుకు కఠిన నిర్ణయాలు తప్పవంటూ తన మార్క్ను చూపిస్తున్నారు. అయితే, ప్రధాని పీఠంపై కూర్చున్న మొట్టమొదటి సారి బిగ్ యూటర్న్ తీసుకుని తన నిర్ణయాన్ని మార్చుకున్నారు. దేశీయ బాధ్యతల నేపథ్యంలో ఐక్యరాజ్య సమితి క్లైమేట్ సమ్మిట్కు వెళ్లకూడదని ముందుగా నిర్ణయించుకున్న రిషి సునాక్.. తాజాగా ఆ నిర్ణయాన్ని మార్చుకుని వెళ్లాలని నిశ్చయించుకున్నారు. తాను పర్యావరణ సదస్సుకు హాజరవుతున్నట్లు ట్వీట్ చేశారు. ‘పర్యావరణ మార్పులపై చర్యలు తీసుకోకుండా బంగారు భవిష్యత్తు లేదు. పునరుత్పాదక ఇంధనాలపై పెట్టుబడులు పెట్టకుంటే విద్యుత్తు సంక్షోభం దిశగా అడుగులు వేస్తున్నట్లే. అందుకే.. వచ్చే వారం జరగనున్న కాప్27 క్లేమేట్ సదస్సుకు హాజరవబోతున్నా. సురక్షితమైన, స్థిరమైన భవిష్యత్తును నిర్మించే గ్లాస్గో వారసత్వాన్ని కొనసాగించాలనుకుంటున్నా.’ అని ట్వీట్ చేశారు రిషి సునాక్. ఈజిప్ట్లోని షర్మ్ ఎల్-షేక్ రెడ్ సీ రిసార్ట్లో జరిగే సమావేశానికి హాజరు కాకూడదని సునాక్ తీసుకున్న నిర్ణయం పర్యావరణ ప్రచారకుల ఆగ్రహానికి కారణమైంది. ఈ కారణంగానే ఆయన తన నిర్ణయాన్ని మార్చుకున్నట్లు తెలుస్తోంది. రిషి సునాక్ ట్వీట్ చేయకముందే యూ-టర్న్పై హింట్ ఇచ్చారు ఆయన అధికార ప్రతినిధి. నిర్ణయంపై పునఃసమీక్షిస్తున్నట్లు చెప్పారు. దానికన్నా ముందు మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్ హాజరుకాబోతున్నట్లు ప్రకటించారు. గత ఏడాది కాప్ 26 సమావేశానికి ఆయన ప్రధాని హోదాలో హాజరయ్యారు. There is no long-term prosperity without action on climate change. There is no energy security without investing in renewables. That is why I will attend @COP27P next week: to deliver on Glasgow's legacy of building a secure and sustainable future. — Rishi Sunak (@RishiSunak) November 2, 2022 ఇదీ చదవండి: ఈ నిర్ణయం ఘోర తప్పిదం...రిషి సునాక్పై విమర్శలు! -
రిషి సునాక్ ఫిట్నెస్ సీక్రెట్, డైట్ ప్లాన్ ఏంటో తెలుసా?
లండన్: బ్రిటన్ ప్రధానమంత్రిగా రిషి సునాక్ కొద్ది రోజుల క్రితం బాధ్యతలు చేపట్టారు. 42 ఏళ్ల వయసున్న రిషి సునాక్.. 200 ఏళ్ల బ్రిటన్ చరిత్రలోనే అత్యంత పిన్న వయస్కుడైన ప్రధానిగా నిలిచారు. ఏ వేదికపై చూసినా ఎంతో ఫిట్గా, ఉత్సాహంగా కనిపిస్తారు. ఇంతకి ఆయన ఫిట్నెస్ సీక్రెట్, డైట్ ప్లాన్ ఏంటి అనేది చాలా మంది తెలుసుకోవాలనుకుంటున్న ప్రశ్న. ఆయన దిన చర్య, డైట్ ప్లాన్, ఫిట్నెస్ కోసం ఏం చేస్తారనేది ఆయనే వెల్లడించారు. ఆరోగ్యకరమైన జీవితాన్ని సాధించేందుకు రిషి సునాక్ దిన చర్య ఎందరికో ఆదర్శవంతంగా ఉంటుంది. గత ఏడాది ‘ద ట్వంటీ మినట్ వీసీ పోడ్కాస్ట్ విత్ హ్యారీ స్టెబ్బింగ్స్’ కార్యక్రమం వేదికగా తన దినచర్య, ఆహార అలవాట్ల వంటి అంశాలను బహిర్గతం చేశారు రిషి సునాక్. తాను ఉదయం 6-7గంటలకు నిద్ర లేస్తానని, అది తాను చేయబోయే జిమ్ను బట్టి సమయం ఆధారపడి ఉంటుందని తెలిపారు. ‘శరీరాన్ని ఫిట్గా ఉంచుకునేందుకు ఒక సెషన్ పెలోటన్, ఒక సెషన్ ట్రెడ్మిల్ వర్కౌట్ చేస్తా. అలాగే హెచ్ఐఐటీ క్లాస్ నిర్వహిస్తాను. అమెరికన్ ఫిట్నెస్ ట్రైనర్ కాడీ రగ్స్బైని అనుసరిస్తాను. ఆయనే నాకు చాలా కాలంగా ఫేవరెట్. నేను అడపా దడపా ఉపవాసం చేస్తాను. కొన్ని రోజులు అసలు బ్రేక్ఫాస్ట్ చేయకుండానే ఉంటాను. ఉపవాసం రోజుల్లో గ్రీకు పెరుగు, బ్లూబెర్రీలను తీసుకుంటాను. ఆపై అల్పాహారంలో బన్, చాక్లెట్ వంటివి తీసుకుంటాను. వారాంతాలు శని, ఆదివారాల్లో ఇంట్లోనే వండిన వాటిని అల్పాహారంగా తీసుకుంటాము. అమెరికన్ స్టైల్లో పాన్కేక్స్ తయారు చేస్తాము.’ అని తెలిపారు రిషి సునాక్. ఇదీ చదవండి: రిషి సునాక్ ఆప్యాయ పలకరింపు వీడియో.. ఇంతకీ ఆ ‘విజయ్ మామా’ ఎవరు? -
Rishi Sunak: విజయ్ మామా..హాయ్!
వైరల్: బ్రిటన్ చరిత్రను తిరగరాస్తూ.. చిన్నవయసులోనే ఆ దేశ ప్రధానిగా ఎన్నికయ్యారు రిషి సునాక్. ఆయన పీఎంగా ఎన్నిక కావడం పట్ల కన్జర్వేటివ్ పార్టీలో.. ఆ దేశంలో ఆయన అభిమానులు ఇంకా సంబురాలు చేసుకుంటూనే ఉన్నారు. మరోవైపు భారత మూలాలు ఉన్న వ్యక్తి కావడంతో ఇక్కడి నెటిజన్స్ కూడా ఊరుకోవడం లేదు. ఈ గ్యాప్లో సెలబ్రిటీ చెఫ్ సంజయ్ రైనా షేర్ చేసిన ఓ వీడియో ట్విటర్లో తెగ వైరల్ అవుతోంది. వీడియోలో ముందుగా సంజయ్.. ‘మామా, మీకు ఒకరు హలో చెప్తారు’ అని అంటాడు. ఆ వెంటనే కెమెరా రిషి సునాక్ వైపు మళ్లుతుంది. అప్పుడు రిషి సునాక్ ‘విజయ్ మామా..హాయ్. నేను రిషి. మీరు ఎలా ఉన్నారు..? మీరు యూకే వచ్చినప్పుడు నన్ను కలుస్తారని అనుకుంటున్నా. ఇక్కడికి వచ్చినప్పుడు 10 డౌనింగ్ స్ట్రీట్కి తీసుకురామని మీ మేనల్లుడిని(రైనాను చూపిస్తూ..) అడగండి.. జాగ్రత్త’ అంటూ చెప్తారు. వీడియో షేర్ చేసిన సంజయ్ ‘వీసా ఆన్ అరైవల్ పక్కా’ అంటూ క్యాప్షన్ ఇచ్చారు. పాతదే అనిపిస్తున్న ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్లు ‘విజయ్ మామా’ ఎవరు..? అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇక సంజయ్ చేసిన ఈ వీడియో.. యూకే వీసా సమస్యలను ఉద్దేశించి సెటైరిక్గా చేసి ఉంటారనే కోణంలోనూ చర్చ నడుస్తోంది. ఇక ఆ విజయ్ మామా.. విజయ్ మాల్యా అయ్యి ఉండొచ్చనే అనుమానం ఒక నెటిజన్ వ్యక్తం చేయగా.. గుడ్ వన్ అంటూ నవ్వులు చిందించాడు సంజయ్ రైనా. Visa on arrival ab pakka 😊😊#RishiSunak pic.twitter.com/imSIhuEgKB — Sanjay Raina (@sanjayraina) October 27, 2022 -
బ్రిటన్ ప్రధానిగా రిషి.. యూకేలో ప్రవాసీయుల ఖుషీ
రాయికల్(జగిత్యాల): సుమారు రెండువందల సంవత్సరాల పాటు మనదేశాన్ని బ్రిటిష్ వారు పరిపాలించారు. ప్రస్తుతం భారత సంతతికి చెందిన రిషి సునాక్ బ్రిటన్ ప్రధానమంత్రిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దీపావళి పర్వదినాన ఆయన ఎన్నికవడంపై యూకేలో స్థిరపడిన ప్రవాస భారతీయులు పండుగను ఘనంగా జరుపుకున్నారు. రిషి ఎన్నికపై ప్రవాసీయులు ‘సాక్షి’తో తమ మనోభావాలు పంచుకున్నారు. వారి మాటల్లోనే.. ఆర్థిక విధానాలతోనే ప్రజాదరణ మాది హైదరాబాద్. నేను ఉద్యోగ రీత్య బ్రిటన్లో పనిచేస్తున్నా. భారత సంతతికి చెందిన రిషి సునాక్ బ్రిటన్ ప్ర ధానిగా పీఠం అధిరోహించడం ఆనందంగా ఉంది. యూకేలో కరోనా మహమ్మారి సమయంలో రిషి రూపొందించిన ఆర్థిక సంస్కరణలతో ప్రజల్లో ఆదరణ పెరిగింది. ప్రతి ఒక్కరూ ఆయన ఆర్థిక విధానాలతో యూకేలో పూర్వ వైభవం తీసుకువస్తారనే ఆశతో ఎన్నుకున్నారు. – సిక్క చంద్రశేఖర్, ఎన్ఆర్ఐ, లండన్ సమర్థవంతంగా పాలిస్తారు మాది నల్గొండ జిల్లా కేతుపల్లి మండలం తుంగతుర్తి గ్రామం. భారత సంతతికి చెందిన రిషి యూకే ప్రధానిగా బాధ్యతలు చేపట్టడంతో ఆనందంగా ఉంది. ఆయన అనేక సమస్యలు, సవాళ్లు ఎదుర్కొంటూ ముందుకు సాగుతారనే నమ్మకం ఉంది. ప్రస్తుతం బ్రిటన్లో ఆర్థిక మాంధ్యం నుంచి ముందుకు నడిపిస్తారనే నమ్మకంతో ప్రజలు, కన్జర్వేటివ్ పార్టీలో నెలకొన్న అనిశ్చితిని సరిదిద్దగల శక్తి రిషికి ఉందనే నమ్మకం ఉంది. – సతీశ్రెడ్డి, లండన్ ప్రతిపక్షాలను సమన్వయం చేస్తారు మాది మహబూబాబాద్ జిల్లా కంబంపల్లి. యూకే ప్రధానిగా రిషి సునాక్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారి ప్రతిపక్షంలోని సభ్యులకు కేబినేట్లో మంత్రి పదవి ఇచ్చారు. దీనిద్వారా ఆయన రాజకీయ చాతుర్యం యూకేలోని అన్ని పార్టీలకు తెలిసింది. పడిపోతున్న ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టే సత్తా రిషి సునాక్కు ఉంది. ఇండియా, యూకే సంబంధాలు మెరుగుపడే అవకాశం ఉంది. – సతీశ్కుమార్, నార్తర్న్ ఐర్లాండ్ మంచి ఆర్థిక నిపుణుడు మాది హైదరాబాద్. బ్రిటన్ ప్రధాని రిషి యూకేలో మాజీ ఆర్థికమంత్రిగా పనిచేశారు. యూకేలో ఆర్థిక సంక్షోభం గురించి పూర్తి అవగాహన కలిగిన వ్యక్తి. చిన్నవయసులోనే ప్రధాని కావడం, క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న యూకేకు పూర్వ వైభవం తెస్తారనే నమ్మకం ప్రజలు, నాయకుల్లో ఉంది. – దూసరి అశోక్గౌడ్, ఎన్ఆర్ఐ, బీఆర్ఎస్ యూకే ప్రెసిడెంట్ గర్వంగా ఉంది నాది కరీంనగర్ జిల్లా కేంద్రం. మొన్నటివరకు లండన్లో ఉద్యోగం చేశా. బ్రిటన్ ప్రధానిగా భారత సంతతికి చెందిన రిషి సునాక్ బాధ్యతలు స్వీకరించడం గర్వంగా ఉంది. ముఖ్యంగా భారత్, బ్రిటన్ల మధ్య అనేక సంబంధాలు మెరుగుపడే అవకాశం ఉంది. యూకేలో భారతీయులకు ఒక భరోసా నెలకొల్పింది. ఆర్థిక వ్యవస్థ మళ్లీ మెరుగుపడుతుందని ఆశిస్తున్నాం. – కూర్మాచలం అనిల్, తెలంగాణ రాష్ట్ర చలన చిత్రాభివృద్ధి సంస్థ చైర్మన్ -
బ్రిటన్ ప్రధాని రిషి సునాక్కు మోదీ ఫోన్
న్యూఢిల్లీ/ లండన్: ప్రపంచంలో రెండు గొప్ప ప్రజాస్వామ్య దేశాలైన భారత్, బ్రిటన్ కలిసి పనిచేయాలని, ఇరు దేశాల నడుమ రక్షణ, ఆర్థికపరమైన భాగస్వామ్యం మరింత బలోపేతం కావాలని బ్రిటన్ నూతన ప్రధానమంత్రి రిషి సునాక్ ఆకాంక్షించారు. రెండు దేశాలు కలిసికట్టుగా సాధించబోయే ఘనత కోసం తాను ఉత్సుకతతో ఎదురు చూస్తున్నానని చెప్పారు. బ్రిటన్ ప్రధానిగా ఎన్నికైన తనను అభినందించినందుకు గాను ఆయన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ట్విట్టర్లో కృతజ్ఞతలు తెలియజేశారు. మోదీ గురువారం ఫోన్లో రిషి సునాక్తో మాట్లాడి, అభినందించారు. ‘‘సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేసుకోవడానికి మేమిద్దరం కలిసి పనిచేస్తాం. సమగ్ర, సమతుల్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం(ఎఫ్టీఏ) కుదుర్చుకోవాలని అంగీకారానికి వచ్చాం’’ అని మోదీ ట్వీట్ చేశారు. దీనిపై రిషి సునాక్ ట్విట్టర్లో స్పందించారు. కొత్త పాత్రలో తన ప్రయాణం ఇప్పుడే మొదలైందని, బ్రిటన్–భారత్ కలిసి పనిచేయాలని పేర్కొన్నారు. బ్రిటన్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రిషి సునాక్తో మోదీ మాట్లాడడం ఇదే మొదటిసారి. Glad to speak to @RishiSunak today. Congratulated him on assuming charge as UK PM. We will work together to further strengthen our Comprehensive Strategic Partnership. We also agreed on the importance of early conclusion of a comprehensive and balanced FTA. — Narendra Modi (@narendramodi) October 27, 2022 Thank you Prime Minister @NarendraModi for your kind words as I get started in my new role. The UK and India share so much. I'm excited about what our two great democracies can achieve as we deepen our security, defence and economic partnership in the months & years ahead. pic.twitter.com/Ly60ezbDPg — Rishi Sunak (@RishiSunak) October 27, 2022 ఇదీ చదవండి: Rishi Sunak: తొలిరోజే విమర్శల జడివాన.. బ్రేవర్మన్ నియామకంపై వ్యతిరేకత -
పాలించడమెలాగోచూపిస్తా
లండన్: ఆర్థిక, రాజకీయ సంక్షోభాలతో సతమతమవుతున్న బ్రిటన్కు స్థిరత్వం, ప్రజలకు విశ్వాసం కలిగించడమే తమ ప్రభుత్వ అజెండాలో ప్రధానాంశమని నూతన ప్రధాని రిషి సునాక్ ప్రకటించారు. తాజా మాజీ ప్రధాని లిజ్ ట్రస్ చేసిన ఆర్థిక తప్పిదాలను సరిచేసేందుకే కన్జర్వేటివ్ ఎంపీలు తనను సారథిగా ఎన్నుకున్నారని అభిప్రాయపడ్డారు. ‘‘మార్పు కోసం ట్రస్ చేసిన ప్రయత్నాన్ని అభినందిస్తున్నా. ఆమె ఉద్దేశాలు మంచివే. కాకపోతే తీసుకున్న నిర్ణయాల్లో, వాటి అమల్లోనే తప్పిదాలు దొర్లాయి’’ అన్నారు. మంగళవారం ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం అధికార నివాసం 10, డౌనింగ్ స్ట్రీట్ నుంచి జాతినుద్దేశించి ఆయన తొలి ప్రసంగం చేశారు. దేశం చరిత్రలోనే అతి పెద్ద ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న మాట వాస్తవమేనని అంగీకరించారు. అయితే, ‘‘తొలుత కరోనా, తర్వాత రష్యా–ఉక్రెయిన్ యుద్ధం మన పాలిట పెను సమస్యలుగా మారాయి. పరిస్థితిని దీటుగా ఎదుర్కొంటాం. కరోనా, దానివల్ల తలెత్తిన ఆర్థిక సమస్యలను ఆర్థిక మంత్రిగా ఎంత సమర్థంగా నిభాయించుకొచ్చానో అందరికీ తెలుసు. ప్రజలను, వ్యాపార వాణిజ్యాలను పరిరక్షించేందుకు అన్ని చర్యలూ తీసుకున్నా. అదే స్ఫూర్తితో ఇప్పుడూ సమస్యలను అధిగమిస్తాం. సమస్యను చూసి వెనకడుగు వేసే ప్రసక్తే లేదు. పూర్తి జవాబుదారీతనం, సమగ్రత, పక్కా ప్రొఫెషనలిజంతో కూడిన పాలన ఎలా ఉంటుందో చూపిస్తా. మాటలతో కాకుండా చేతల్లో దేశాన్ని ఐక్యం చేసి చూపిస్తా’’ అని చెప్పారు. ‘‘మనం చెల్లించలేనంత భారీ అప్పులను ముందు తరాలపై రుద్దే ప్రసక్తే లేదు. సమస్యను వీలైనంత త్వరగా పరిష్కరిస్తా’’ అని స్పష్టం చేశారు. అదే సమయంలో పౌరుల సంక్షేమం పట్ల సహానుభూతితో వ్యవహరిస్తామన్నారు. ‘‘మేం పూర్తి స్పష్టతతో రంగంలోకి దిగాం. ఈ క్షణం నుంచే మా పని మొదలైంది. దేశ సంక్షేమం కోసం అహోరాత్రాలూ కష్టపడతాను’’ అని ప్రకటించారు. ‘‘మనమంతా కలిసి పని చేస్తే అద్భుతాలు చేసి చూపించొచ్చు’’ అంటూ ఆత్మవిశ్వాసం వెలిబుచ్చారు. అందరి ఆకాంక్షలకు అనుగుణంగానే తన పాలన ఉంటుందని ఆశాభావం వెలిబుచ్చారు. ఆ క్రమంలో తాను పలు కఠిన నిర్ణయాలు తీసుకోబోతున్నట్టు స్పష్టమైన సంకేతాలిచ్చారు. ఎన్నికలకు వెళ్లాలని డిమాండ్ చేస్తున్న విపక్షాలపై రిషి విమర్శలు ఎక్కుపెట్టారు. భార్య అక్షత, కుమార్తెలు కృష్ణ, అనౌష్కలతో కలిసి మాట్లాడతారని అంతా భావించగా రిషి ఒంటరిగానే దాదాపు 6 నిమిషాల పాటు మాట్లాడారు. బ్రిటన్ చరిత్రలో ఓ కొత్త ప్రధాని చేసిన అతి సుదీర్ఘ తొలి ప్రసంగాల్లో ఇదొకటని చెబుతున్నారు. బోరిస్ జాన్సన్ మాత్రం 2019లో బాధ్యతలు చేపట్టాక ఏకంగా 11 నిమిషాల 13 సెకన్లు మాట్లాడారు! తాజా మాజీ ప్రధాని ట్రస్ తన తొలి ప్రసంగాన్ని 4 నిమిషాల్లో ముగించారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
Rishi Sunak: పక్కా హిందూ
‘‘నేను హిందువుని అని చెప్పుకోవడానికి గర్వపడతాను’’ అని బ్రిటన్ ప్రధానమంత్రి రిషి సునాక్ పలు సందర్భాల్లో బాహాటంగానే ప్రకటించారు. ఎంత ఎదిగినా తన మూలాలను ఆయన ఎన్నడూ మరచిపోలేదు. రిషి బ్రిటన్లో పుట్టి పెరిగినప్పటికీ చిన్నప్పట్నుంచి భారత సంస్కృతి సంప్రదాయలను వంటపట్టించుకున్నారు. తరచూ దేవాలయాలను దర్శిస్తూ ఉంటారు. సోమవారం ఉపవాసం చేస్తారు. గోమాంసం ముట్టరు. యూకే రాజకీయాల్లో హిందువునని చెప్పుకునే రిషి పైకి ఎదిగారు. అదే ఆయన ప్రత్యేకత. హిందువులకు అత్యంత పవిత్రమైన భగవద్గీతపైన అపారమైన నమ్మకం. 2015లో మొదటిసారి పార్లమెంటుకు ఎన్నికైనప్పుడు భగవద్గీత మీద ప్రమాణం చేశారు. జాన్సన్ హయాంలో ఆర్థిక మంత్రిగా బాధ్యతలు స్వీకరించేటప్పుడు కూడా గీతపైనే ప్రమాణం చేశారు .ప్రధానిగా లిజ్ ట్రస్తో పోటీ పడే సమయంలో ప్రచారంలోనూ శ్రీకృష్ణ జయంతి రోజున గోపూజ చేస్తున్న ఫొటోలు, వీడియోలతో ఆయన ట్వీట్లు చేశారు.రిషి ఇంగ్లీషుతో పాటు హిందీ, పంజాబీ భాషలు అనర్గళంగా మాట్లాడగలరు. సునాక్కు భారత్ పాస్పోర్టు కూడా ఉంది. బెంగుళూరుకు చెందిన బ్రాహ్మణ కుటుంబమైన ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి కుమార్తె అక్షతను పెళ్లి చేసుకున్న సునాక్ ఇంట్లో కూడా భారతీయ సంప్రదాయాలనే పాటిస్తారు. వారి ఇద్దరి ఆడపిల్లలు అనౌష్క, కృష్ణని కూడా భారతీయతనే నేర్పిస్తున్నారు. కుటుంబానికి అత్యంత విలువ ఇస్తారు. తన అత్తమామలు ఎప్పటికీ గర్వకారణమని చెప్పుకుంటారు. వారిని కలవడానికి తరచూ బెంగుళూరు వచ్చి వెళుతుంటారు. ప్రతీ ఏటా దీపావళిని ఘనంగా జరుపుకునే సునాక్ ప్రధానిగా దీపావళి రోజే ప్రమాణం చేయడం విశేషం. ఒక హిందువును ప్రధానిగా అంగీకరించడం ద్వారా బహుళ విశ్వాసాలు, వైవిధ్యాలను అంగీకరించగలిగే సహనం యూకే ప్రజలకు బాగా ఉందని అర్థమవుతోంది. కుటుంబ నేపథ్యం ఇదీ రిషి సునాక్ తాత రామదాస్ సునాక్ అవిభాజ్య భారత్లో పంజాబ్ రాష్ట్రంలోని గుజ్రనవాలాకు చెందినవారు. 1935 సంవత్సరంలోనే రామదాస్ తూర్పు ఆఫ్రికాలోని నైరోబియాకి వలస వెళ్లిపోయారు. నాన్నమ్మ రాణి సునాక్ ఓ రెండేళ్లు ఢిల్లీలో ఉండి తర్వాత భర్త దగ్గరకి వెళ్లారు. రామదాస్ దంపతులకి ముగ్గురు కుమారులు, ముగ్గురు కుమార్తెలు. రిషి సునాక్ తండ్రి యశ్వీర్ 1949లో కెన్యాలో జన్మించారు. 1960లో ఆఫ్రికాలో భారతీయులపై జరిగే దాడులకు భయపడి యశ్వీర్ యువకుడిగా ఉన్నప్పుడే ఆ కుటుంబం బ్రిటన్కు మకాం మార్చి అక్కడే స్థిరపడింది. పంజాబ్ నుంచి టాంజానియా వచ్చి స్థిరపడిన కుటుంబానికి చెందిన ఉషా బెర్రీని యశ్వీర్ వివాహం చేసుకున్నారు. ఆ దంపతుల మొదటి సంతానమే రిషి సునాక్. రిషి తాత ముత్తాతలు ఉంటే గుజ్రనవాలా ప్రస్తుతం పాకిస్తాన్లో ఉండడంతో ఆ దేశం కూడా రిషి మా వాడే అని అంటోంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
Rishi Sunak: సార్.. కోహినూర్!
బ్రిటన్ ప్రధాని పీఠంపై చిన్న వయసులో.. అదీ తొలి శ్వేతజాతీయేతరుడిగా రిషి సునాక్ పగ్గాలు అందుకున్నారు. భారత మూలాలు ఉన్న వ్యక్తి, పైగా మన దేశపు అల్లుడు కావడంతో ఇక్కడి నుంచి కూడా హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ క్రమంలో.. మీమ్స్ వడ్డన మామూలుగా ఉండడం లేదు. రెండు రోజులుగా కొనసాగుతూనే ఉంది. ప్రముఖ భారత క్రికెటర్ అశిష్ నెహ్రా.. రిషి సునాక్ కవలలు అంటూ మొదలైన మీమ్స్ ఫెస్టివల్.. ఇవాళ అధికారికంగా ఆయన ప్రధానిగా నియామకం అయిన తర్వాత కూడా కొనసాగుతూనే ఉంది. ఇక ఆయనకు భారతీయులు ట్విటర్ ద్వారా చేసిన తొలి విజ్ఞప్తి.. కోహినూర్ వజ్రాన్ని ఎలాగైనా భారత్కు పంపించాలని. అలాగే.. వలసవాదులను వలసరాజ్యంగా మార్చేసి.. పాలించబోతున్నారంటూ మరో సెటైర్ పేలుస్తున్నారు. ఇక యూకే ప్రధాని అధికారిక భవనం 10 డౌనింగ్ స్ట్రీట్ డోర్లకు దండలు, ఆ బయట చెప్పులు విడిచేసి ఉండడం, కాపలాగా వాచ్మెన్ ఉండడం.. ఇలా దేశీ టచ్ను మీమ్స్కు జత చేసి హిలేరియస్ ఫన్ను పుట్టిస్తున్నారు. మరోవైపు రిషి సునాక్ ప్రధాని అయ్యాడు కాబట్టి.. ఇడ్లీ, వడ, చట్నీ, కాఫీ.. మెనూలో చేరతాయని జోకులు పేలుస్తున్నారు. ఇక పాక్కు బర్నల్ పంపాల్సిన అవసరం ఉందంటూ మరొకరు ట్వీట్ చేశారు. ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి, ఆయన భార్య సుధామూర్తి గనుక అల్లుడి ఇంటికి వెళ్తే.. 10 డౌనింగ్ స్ట్రీట్ కాస్త తీన్ మూర్తి భవనం(రిషి సునాక్ భార్య అక్షతా మూర్తితో కలిపి) అవుతుందని జోకులు పేలుస్తున్నారు. Meanwhile in UK :) pic.twitter.com/nnOuU2b0FQ — Switty (@Switty2020) October 25, 2022 If NRN and Sudha move into Dus Number, perhaps it can be called Teen Murti Bhavan — Abhishek Singhvi (@DrAMSinghvi) October 24, 2022 Our first mission is to bring back our ' Kohinoor '. let's goo #Sunak #Kohinoor pic.twitter.com/UvEwXp6cjt — Teju (@tejasflyingmac) October 24, 2022 As #RishiSunak is about become UK PM ,India to send trucks full of Burnol to Pakistan pic.twitter.com/GSm3qbI3O3 — 𝒮𝒽𝒶𝒾𝓁𝑒𝓈𝒽_𝐼𝒩𝒟 भारत🇮🇳 (@Shailesh__IND) October 24, 2022 Meanwhile in UK 😀 pic.twitter.com/JxYC7Qz14k — Porinju Veliyath (@porinju) October 25, 2022 Congratulations Rishi Sunak! The new PM of Britain pic.twitter.com/JWhLJVTwMA — Syed Zain Raza (@SydZainRaza) October 25, 2022 -
అప్పుడు అమెరికాకు ఒబామా.. ఇప్పుడు బ్రిటన్కు సునాక్..!
లండన్: బ్రిటన్ రాజకీయ చరిత్రను తిరగరాస్తూ.. మొట్టమొదటి భారత సంతతి, హిందూ ప్రధాని పీఠం అధిరోహించారు రిషి సునాక్. ఈ సందర్భంగా.. ఆయనపై ప్రపంచ నేతలతో పాటు బ్రిటన్ వాసులు సైతం ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇది తమకు ‘ఒబామా మూమెంట్’ అని అక్కడి హిందూ దేవాలయ కమిటీ హర్షం వ్యక్తం చేసింది. బ్రిటన్ రాజధాని లండన్కు 110 కిలోమీటర్ల దూరంలోని సౌతాంప్టన్లో వేదిక్ సొసైటీ హిందూ దేవాలయం ఉంది. దీనిని రిషి తాత రామ్దాస్ సునాక్ 1971లో నిర్మించారు. ఆ తర్వాత ఆయన తండ్రి యాష్ సునాక్.. 1980 నుంచి ట్రస్టీగా కొనసాగారు. ఇప్పటికీ రిషి కుటుంబం ఆ ఆలయంతో అనుబంధం కొనసాగిస్తోంది. హాంప్షైర్ నగర్లోని ఆలయాన్ని రిషి సునాక్.. తరుచుగా సందర్శిస్తుంటారు. ఈ జులైలో కూడా అక్కడకు వెళ్లారు. ప్రతి ఏడాది అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తుంటారు. ‘ఇది గర్వించదగ్గ క్షణం. రిషి సునాక్ విజయంతో ఈ గుడి ఆవరణలో సందడి నెలకొంది. ఇక్కడున్న సుమారు 300 మంది ఆయనతో దిగిన చిత్రాలను చూపించి, ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇది బ్రిటన్కు బరాక్ ఒబామా మూమెంట్. మొదటిసారి శ్వేత జాతియేతర వ్యక్తి ప్రధాని అయ్యారు. ఆయన ప్రధాని అవబోతున్నారనే వార్త వినగానే వెంటనే ప్రత్యేక పూజలు నిర్వహించాం’ అని ఆలయ కమిటీ నేత సంజయ్ చందరాణా పేర్కొన్నారు. బ్రిటన్కు రిషి సునాక్ ప్రధానికావటం అనేది దేశాన్ని ఏకం చేయటమేనన్నారు. బరాక్ ఒబామా 2009లో అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. అగ్రదేశపు అత్యున్నత స్థానంలో కూర్చొన్న తొలి ఆఫ్రికన్ అమెరికన్గా ఆయన ఖ్యాతి గడించారు. బరాక్ ఒబామా పాలనా కాలాన్ని సూచిస్తూ రిషి సునాక్పై ప్రశంసలు కురిపించారు ఆలయ కమిటీ నేత సంజయ్ చందరాణా. ఇదీ చదవండి: రిషి సునాక్ ప్రసంగం: ఐదు ప్రధానాంశాలు -
రిషి సునాక్ ప్రసంగం: ఐదు ప్రధానాంశాలు
లండన్: భారత మూలాలు కలిగిన రిషి సునాక్.. బ్రిటన్ కొత్త ప్రధాన మంత్రిగా నియమితులయ్యారు. ఈ సందర్భంగా జాతిని ఉద్దేశించి తొలిసారి ప్రసంగించిన ఆయన తన లక్ష్యాలను స్పష్టం చేశారు. మాటలతో కాదు చేతలతో తానేంటో చూపిస్తానని ప్రకటించారు. లిజ్ ట్రస్ హయాంలో జరిగిన తప్పులను సరిచేస్తానని పేర్కొన్నారు. ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కాలంటే కఠిన నిర్ణయాలు తప్పవని వెల్లడించారు. రిషి సునాక్ ప్రసంగంలోని 5 ప్రధానాంశాలు ఇవి... 1. బ్రిటన్ ప్రస్తుతం తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. కరోనా కారణంగా తలెత్తిన విపరిణామాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. మరోవైపు ఉక్రెయిన్పై రష్యా దండయాత్రతో ప్రపంచవ్యాప్తంగా ఇంధన మార్కెట్లు, సరఫరా వ్యవస్థ బలహీనపడింది. 2. బ్రిటన్ను అభివృద్ధి పథంలో నడపాలని లిజ్ ట్రస్ కోరుకున్నారు. గొప్ప లక్ష్యంతో అవిశ్రాంతంగా పనిచేసిన ఆమెను మెచ్చుకోవాల్సిందే. కానీ లిజ్ ట్రస్ హయాంలో కొన్ని తప్పులు జరిగాయి. 3. నేను నా పార్టీ నాయకుడిగా ఎన్నుకోబడ్డాను. గత ప్రభుత్వ హయాంలో జరిగిన తప్పులను సరిదిద్దే పని తక్షణమే ప్రారంభమవుతుంది. 4. ఆర్థిక స్థిరత్వం, ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవడమే ప్రధాన ఎజెండాగా పనిచేస్తాం. కోవిడ్ సంక్షోభ సమయంలో ప్రజలను ఆదుకునేందుకు, ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు నేను చేసిన ప్రయత్నాలను మీరంతా చూశారు. 5. మాటలతో కాదు నా పనితీరుతో మన దేశాన్ని ఏకం చేయడానికి ప్రయత్నిస్తాను. ప్రజల నమ్మకాన్ని సంపాదించడానికి ప్రతిరోజు కష్టపడతాను. (క్లిక్ చేయండి: అదో భయంకరమైన యుద్ధం: రిషి సునాక్) -
అదో భయంకరమైన యుద్ధం: రిషి సునాక్
బ్రిటన్ కొత్త ప్రధాని రిషి సునాక్.. ఉక్రెయిన్ యుద్ధ పరిణామంపై స్పందించారు. లండన్ వెస్ట్మినిస్టర్లోని అధికారిక భవనం 10 డౌనింగ్ స్ట్రీట్ వద్ద తన తొలి ప్రసంగంలోనే ఆయన ఈ కీలక అంశంపై మాట్లాడారు. ఉక్రెయిన్పై రష్యా దురాక్రమణకు ముగింపు దిశగా సాయం చేస్తామని రిషి సునాక్ 10 Downing Street వద్ద తొలి ప్రసంగంలో ప్రకటించారు. ఇదొక భయంకరమైన యుద్ధం. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మీద పెను ప్రభావం చూపెట్టింది. అంతర్జాతీయంగా అన్ని మార్కెట్లపైనా ప్రభావం చూపెడుతోంది. దాని ముగింపును విజయవంతంగా చూడాలి అని ప్రధాని రిషి సునాక్ తెలిపారు. అంతకు ముందు ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీ, కొత్త ప్రధాని రిషి సునాక్కు శుభాకాంక్షలు తెలియజేశారు. ఉక్రెయిన్తో సైన్యసహకారాలు కొనసాగిస్తున్న యూకేతో బంధం మరింత బలపడేందుకు యత్నిస్తామని జెలెన్స్కీ ప్రకటించారు. ఇక తన ప్రభుత్వం ముందు ఆర్థికంగా పెను సవాళ్లే ఉన్నాయన్న యూకే ప్రధాని రిషి సునాక్.. వాటిని ఎలాగైనా అధిగమించి తీరతామని ప్రకటించారు. ఆర్థికంగా బ్రిటన్ బలహీనంగా ఉందని.. కానీ, రాబోయే తరాల మీద అప్పుల ప్రభావం లేకుండా చూస్తామని ప్రకటించారు. అలాగే మాజీ ప్రధాని లిజ్ ట్రస్ గొప్ప వ్యక్తి అని, ఆమె పాలనలో కొన్ని పొరపాట్లు చోటు చేసుకున్నాయని, వాటిని సరిదిద్దేందుకే తనకు బాధ్యత అప్పజెప్పారని డౌనింగ్ స్ట్రీట్ బయట వ్యాఖ్యానించారు. -
Rishi Sunak: బ్రిటన్ కొత్త ప్రధానిగా రిషి సునాక్
యూకే అధికారిక పార్టీ కన్జర్వేటివ్ తరపున ప్రధానిగా రిషి సునాక్ నియమితులయ్యారు. భారత కాలమానం ప్రకారం.. మంగళవారం మధ్యాహ్నాం బ్రిటన్ రాజు కింగ్ చార్లెస్ 3తో భేటీ అనంతరం.. 10 డౌనింగ్ స్ట్రీట్ వద్ద రిషి సునాక్ ప్రసంగించారు. అంతకు ముందు లిజ్ ట్రస్.. కింగ్ ఛార్లెస్ను కలిసి ప్రధాని పదవికి(ఆపద్ధర్మ) తన రాజీనామాను సమర్పించారు. ప్రధానిగా తనకు మద్దతు ఉందని, కాబట్టి ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలని రిషి సునాక్, కింగ్ ఛార్లెస్-3ని కోరారు. దీంతో ప్రభుత్వం ఏర్పాటు చేయాలని రిషిని కింగ్ ఛార్లెస్ ఆహ్వానించారు. దీంతో రిషి సునాక్ను బ్రిటన్ ప్రధానిగా నియమిస్తున్నట్లు కింగ్ ఛార్లెస్ తెలిపారు. ప్రధానిగా ట్రస్ తన వంతు ప్రయత్నం చేశారు. ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడేసేందుకు ప్రయత్నిస్తా. బ్రిటన్ ప్రజలు నాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టకుంటా. సంక్షోభం నుంచి బయటపడేందుకు కొన్ని కఠిన నిర్ణయాలు తప్పవు. మనం అద్భుతాలు సాధించగలం అంటూ బ్రిటన్ కొత్త ప్రధాని రిషి మీడియా ద్వారా జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. -
చరిత్ర సృష్టించిన రిషి సునాక్ (ఫొటోలు)