-
‘ఎంసీజీ’లో మ్యాచ్ కోసం ప్రయత్నాలు
మెల్బోర్న్ : కరోనా కారణంగా ఈ ఏడాది చివర్లో ప్రతిష్టాత్మక మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (ఎంసీజీ) నుంచి భారత్–ఆ్రస్టేలియా ‘బాక్సింగ్ డే’ టెస్టు తరలిపోనుందని వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో స్థానిక ప్రభుత్వం జోక్యం చేసుకునేందుకు సిద్ధమైంది. పరిమిత సంఖ్యలో ప్రేక్షకులను అనుమతించి డిసెంబర్ 26 నుంచి 30 వరకు ‘బాక్సింగ్ డే’ టెస్టును ఎంసీజీలోనే జరిగేలా చూడాలని భావిస్తున్నట్లు మెల్బోర్న్ నగరం ఉన్న విక్టోరియా రాష్ట్ర ప్రీమియర్ డేనియల్ ఆండ్రూస్ వెల్లడించారు. మరోవైపు వచ్చే ఏడాది ఆరంభంలో జరిగే ఆ్రస్టేలియన్ ఓపెన్ గ్రాండ్స్లామ్ టెన్నిస్ టోరీ్నకి కూడా ఇదే తరహా ఏర్పాట్లు చేయాలని కూడా ప్రభుత్వం ఆలోచిస్తోంది. గత ఏడాది ‘బాక్సింగ్ డే’ టెస్టుకు 2 లక్షల మంది ప్రేక్షకులు హాజరు కాగా... ఆస్ట్రేలియన్ ఓపెన్ జరిగిన మెల్బోర్న్ పార్క్లో 8 లక్షల మంది మ్యాచ్లను వీక్షించారు. అయితే ప్రస్తుతం ఆ్రస్టేలియాలోని 70 శాతం కరోనా కేసులు విక్టోరియా రాష్ట్రంలోనే నమోదు కాగా... మరణాలు 90 శాతం ఇక్కడి నుంచే ఉన్నాయి. ‘గరిష్టంగా ఎంత మందిని టెస్టు మ్యాచ్లు అనుమతించాలనే విషయంలో చర్చిస్తున్నాం. దీనిపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. అందరి ఆరోగ్యంపై శ్రద్ధ చూపిస్తూనే సాధ్యమైనంత ఎక్కువ మందిని లోపలికి పంపేందుకు ప్రయతి్నస్తాం. దీనికి సంబంధించి క్రికెట్ ఆ్రస్టేలియాతో మాట్లాడుతున్నాం. ఒక్క క్రీడా ఈవెంట్ కారణంగా ఇప్పటి వరకు మేం చేస్తున్న శ్రమ వృథా కాకూడదనే మా ప్రయత్నం. ఒక్కసారి ఇలాంటి చోట కోవిడ్–19 వ్యాప్తి మొదలైందంటే అది ఎక్కడి వరకు సాగుతుందో చెప్పలేం’ అని డేనియల్ ఆండ్రూస్ అభిప్రాయ పడ్డారు. మెల్బోర్న్లో ‘బాక్సింగ్ డే’ టెస్టు సాధ్యంకాకపోతే టెస్టు మ్యాచ్ వేదిక అడిలైడ్కు మారే అవకాశం ఉంది. -
పట్టుబిగించిన ఆసీస్
మెల్బోర్న్: న్యూజిలాండ్తో జరుగుతున్న ‘బాక్సిం గ్ డే’ టెస్టులో ఆ్రస్టేలియా గెలుపు దిశగా పయనిస్తోంది. శనివారం ఆట ముగిసే సమయానికి ఆసీస్ తమ రెండో ఇన్నింగ్స్లో 45 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 137 పరుగులు చేసింది. 456 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. వేడ్ (15 బ్యాటిం గ్), హెడ్ (12 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. అంతకుముందు ఓవర్నైట్ స్కోరు 44/2తో మూడో రోజు ఇన్నింగ్స్ను కొనసాగించిన న్యూజిలాండ్ను ప్యాట్ కమిన్స్ (5/28) దెబ్బ తీశాడు. దాంతో కివీస్ 54.5 ఓవర్లలో 148 పరుగులకు ఆలౌటైంది. 319 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం పొందిన ఆస్ట్రేలియా ప్రత్యర్థి జట్టును ఫాలోఆన్ ఆడించకుండా రెండో ఇన్నింగ్స్ ప్రారంభించాలని నిశ్చయించుకుంది. -
రాణించిన స్మిత్, లబ్షేన్
మెల్బోర్న్: న్యూజిలాండ్తో మొదలైన ‘బాక్సింగ్ డే’ టెస్టు తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఆసీస్ తొలి ఇన్నింగ్స్లో 4 వికెట్ల నష్టానికి 257 పరుగులు చేసింది. మళ్లీ ఫామ్లోకి వచ్చిన స్టీవ్ స్మిత్ (192 బంతుల్లో 77 బ్యాటింగ్; 8 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీ చేయగా, మార్నస్ లబ్షేన్ (149 బంతుల్లో 63; 6 ఫోర్లు, 1 సిక్స్) ఈ ఏడాది తన జోరును కొనసాగించాడు. వీరిద్దరు మూడో వికెట్కు 83 పరుగులు జోడించారు. అంతకు ముందు టాస్ గెలిచిన న్యూజిలాండ్ ఫీల్డింగ్ ఎంచుకుంది. తొలి ఓవర్లోనే జో బర్న్స్ (0)ను బౌల్ట్ అవుట్ చేశాడు. ఆ తర్వాత లబ్షేన్, వార్నర్ (41) కలిసి జట్టును ఆదుకోగా, మరో బ్యాట్స్మన్ మాథ్యూ వేడ్ (38) కూడా ఫర్వాలేదనిపించాడు. రికార్డు ప్రేక్షకులు... టెస్టు మ్యాచ్ తొలి రోజు భారీ సంఖ్యలో అభిమానులు ఎంసీజీలో హాజరు కావడం విశేషం. గురువారం ఏకంగా 80, 473 మంది ప్రేక్షకులు మ్యాచ్ చూసేందుకు వచ్చారు. ‘యాషెస్’ సిరీస్ కాకుండా ఇతర జట్టు ఆడిన బాక్సింగ్ డే టెస్టులో ఇంత పెద్ద సంఖ్యలో అభిమానులు రావడం 1975 తర్వాత ఇదే తొలిసారి కావడం విశేషం. 1975లో ఆసీస్–విండీస్ మధ్య జరిగిన మ్యాచ్కు ఒకే రోజు 85, 661 మంది ప్రేక్షకులు హాజరయ్యారు. -
మైదానంలో మరోసారి రచ్చచేసిన స్మిత్
మెల్బోర్న్: ఆస్ట్రేలియా-న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగుతున్న ‘బాక్సింగ్ డే టెస్టు’తొలి రోజు చిన్నపాటి వివాదం చెలరేగింది. ఇంగ్లండ్ సీనియర్ అంపైర్ నిగెల్ లాంగ్ తీరుపై ఆసీస్ స్టార్ బ్యాట్స్మన స్టీవ్ స్మిత్ అసహనం వ్యక్తం చేస్తూ వాగ్వాదానికి దిగాడు. ఇదే క్రమంలో కామెంటరీ బాక్స్లో ఉన్న షేన్ వార్న్ సైతం అంపైర్ నిర్ణయంపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. అంతేకాకుండా అతడికి ఐసీసీ నిబంధనల పుస్తకాన్ని ఇవ్వాలని ఎద్దేవాచేశాడు. అయితే ప్రస్తుతం ఈ వివాదానికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్గా మారింది. అయితే స్మిత్ క్రీడా స్పూర్థికి విరుద్దంగా ప్రవర్తించాడని కొందరు నెటిజన్లు తప్పుపట్టారు. అంతేకాకుండా ఆసీస్ ఆటగాళ్లకు దురుసు ఎక్కువ అనే విషయం ఈ ఒక్క సంఘటన నిరూపితమైందని మరి కొంత మంది పేర్కొంటున్నారు. ‘టెస్టు క్రికెట్లో ఒక్క పరుగు కోసం అది కూడా న్యాయబద్దం కాని దాని కోసం పోట్లాడిన ఏకైక బ్యాట్స్మన్ స్మిత్’అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. అసలేం జరిగిందంటే.. టాస్ గెలిచిన కివీస్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. దీంతో ఆసీస్ పరుగుల వేట ప్రారంభించింది. అయితే ఆరంభంలేనే ఆతిథ్య జట్టుకు గట్టి షాక్ తగిలింది 61 పరుగులకే వార్నర్, బర్స్న్ వికెట్లను చేజార్చుకుంది. ఈ క్రమంలో స్మిత్, లబుషేన్లు జట్టును ఆదుకునే ప్రయత్నం చేశారు. ఇన్నింగ్స్ 26వ ఓవర్(బ్రేక్కు ముందు ఓవర్) సందర్భంగా కివీస్ బౌలర్ వాగ్నర్ వేసిని షార్ట్ పిచ్ బాల్ స్మిత్ శరీరానికి తగిలి దూరంగా వెళ్లడంతో సింగిల్ తీసే ప్రయత్నం చేశారు. అయితే బ్యాట్స్మెన్ సింగిల్ తీసే ప్రయత్నాన్ని అంపైర్ నిగేల్ లాంగ్ అడ్డుకున్నాడు. ఎందుకంటే అ బంతిని స్మిత్ ఆడాలనుకోలేదు. వదిలేద్దామనుకున్నాడు. కానీ ఆ బంతి స్మిత్ శరీరానికి తగిలి దూరంగా వెళ్లడంతో పరుగు తీసే ప్రయత్నం చేశాడు. అయితే ఐసీసీ నిబంధనల ప్రకారం బ్యాట్స్మన్ బంతిని కొట్టడానికి చేసే ప్రయత్నంలో బంతి బ్యాట్ను మిస్సై శరీరానికి తగిలిన సమయంలో తీసే పరుగే కౌంట్ అవుతుందని.. ఇదే విషయాన్ని స్మిత్కు అంపైర్ చెప్పే ప్రయత్నం చేశాడు. ఇలా అంతకుముందు ఓవర్లో కూడా జరగడంతో స్మిత్ అసహనం వ్యక్తం చేస్తూ వాగ్వాదానికి దిగాడు. అయితే అంపైర్ సర్ది చెప్పే ప్రయత్నం చేసినప్పటికీ స్మిత్ వినిపించుకోకుండా వెళ్లిపోయాడు. అయితే కామెంటరీ బాక్స్లో ఉన్న షేన్ వార్న్ అంపైర్ తీరును తప్పుపట్టారు. అంపైర్ది చెత్త నిర్ణయం అంటూ మండిపడ్డాడు. షార్ట్ పిచ్ బంతికి బ్యాట్స్మన్ శరీరంలో ఎక్కడ తగిలినా పరుగు తీయవచ్చనే నిబందన ఉందని పేర్కొన్నాడు. ‘నాకు తెలిసి అంపైర్కు ఐసీసీ నిబంధనల బుక్ అవసరం ఉందునుకుంటున్నా. బ్రేక్ సమయంలో ఎవరైనా ఇవ్వండి’అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. ఇక ఈ వివాదంపై ఐసీసీ ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి. You make the call - should this be a dead ball? #AUSvNZ pic.twitter.com/CMp4Q9AHvW — #7Cricket (@7Cricket) December 26, 2019 Poor sportsmanship. But we’ve come to expect that from you Steve. Terrible example for kids. You are an embarrassment to the game. #NZvAUS #BoxingDayTest #MCG #stevesmith pic.twitter.com/xi0VqVjUF1 — Davidthompson420695000 (@Davidthompson42) December 26, 2019 -
నేడు ‘బాక్సింగ్ డే’ టెస్టుల షురూ
మెల్బోర్న్: ఆ్రస్టేలియా టాపార్డర్ బ్యాట్స్మన్ లబ్ షేన్ ను అరుదైన సెంచరీ చాన్స్ ఊరిస్తోంది. అతను గత మూడు టెస్టుల్లోనూ శతకం సాధించాడు. ఇప్పుడు ఇక్కడా శతక్కొడితే... వరుసగా నాలుగు టెస్టుల్లో సెంచరీలు చేసిన ఆరో ఆ్రస్టేలియన్గా నిలుస్తాడు. ఈ జాబితాలో బ్రాడ్మన్ మూడుసార్లు ఈ ఘనతకెక్కాడు. తర్వాత ఫింగ్లెటన్, హార్వీ, హేడెన్, స్మిత్ వరుసగా నాలుగు టెస్టుల్లో సెంచరీలు చేశారు. మరోవైపు తొలి టెస్టు పరాజయంతో సిరీస్లో వెనుకబడిన న్యూజిలాండ్ ‘బాక్సింగ్ డే’ టెస్టులో ప్రతాపం చూపాలని గట్టి పట్టుదలతో ఉంది. అయితే కివీస్కు మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (ఎంసీజీ) ఎప్పుడూ కలిసి రాలేదు. ఇక్కడ మూడు మ్యాచ్లాడిన న్యూజిలాండ్ రెండు ఓడి, ఒకదాంట్లో ‘డ్రా’ చేసుకుంది. కానీ ఈసారి ఆ రికార్డును మార్చేపనిలో ఉంటామని న్యూజిలాండ్ కెపె్టన్ విలియమ్సన్ అన్నాడు. ఆతిథ్య జట్టేమో ఈ మ్యాచ్ కూడా గెలిచి... మరోటి మిగిలుండగానే మూడు టెస్టుల సిరీస్ను 2–0తో కైవసం చేసుకోవాలని ఆశిస్తోంది. మెల్బోర్న్లాంటి బౌన్సీ వికెట్ పిచ్లపై ఐదుగురు బౌలర్లను బరిలోకి దించాలని యోచిస్తోంది. హాజెల్వుడ్ స్థానంలో ప్యాటిన్సన్ తుది జట్టులోకి వచ్చాడు. కమిన్స్, స్టార్క్, లయన్లతో ఐదో బౌలర్గా మైకెల్ నెసెర్ను తీసుకునే అవకాశముందని కోచ్ లాంగర్ చెప్పాడు. సెంచూరియన్: గాయాలతో సతమతమవుతున్న ఇంగ్లండ్... ఆతిథ్య దక్షిణాఫ్రికాతో తొలిటెస్టుకు సిద్ధమైంది. ఇరు జట్ల మధ్య గురువారం నుంచి ‘బాక్సింగ్ డే’ పోరు జరగనుంది. పేస్ బౌలర్లు స్టువర్ట్ బ్రాడ్, జోఫ్రా ఆర్చర్, క్రిస్ వోక్స్, స్పిన్నర్ జాక్ లీచ్... ఇలా కీలక ఆటగాళ్లు ‘ఫ్లూ జ్వరాలతో బాధపడుతున్నారు. తన తండ్రి అనారోగ్యం కారణంగా స్టార్ ఆల్రౌండర్ బెన్ స్టోక్స్ కూడా ఆడేది అనుమానంగా మారింది. ఇది ఇంగ్లిష్ జట్టు కూర్పునకు పెను సమస్యగా మారింది. అయితే అందుబాటులో ఉన్న ఆటగాళ్లు సత్తాచాటేందుకు సిద్ధంగా ఉన్నారని కెపె్టన్ జో రూట్ తమ జట్టులో స్థైర్యాన్ని పెంచే ప్రకటన చేశాడు. రూట్, డుప్లెసిస్ మరోవైపు సొంతగడ్డపై బలంగా కనబడుతున్న దక్షిణాఫ్రికా జట్టు మొదటి రోజు నుంచే ‘దెబ్బ’తిన్న ఇంగ్లండ్పై పైచేయి సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ టెస్టుతో తమ బ్యాట్స్మన్ రస్సీ వాన్డెర్ డస్సెన్ అంతర్జాతీయ టెస్టుల్లో అరంగేట్రం చేస్తాడని దక్షిణాఫ్రికా కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ తెలిపాడు. అలాగే ఆల్రౌండర్ డ్వేన్ ప్రిటోరియస్ కూడా అరంగేట్రం చేసే అవకాశముందని చెప్పాడు. ఐసీసీ టెస్టు ఛాంపియన్ షిప్ లో భాగమైన ఈ సిరీస్లో ఇరు జట్లు నాలుగు టెస్టు మ్యాచ్ల్లో తలపడతాయి. ప్రస్తుతం ఇంగ్లండ్ 56 పాయింట్లతో ఆరో స్థానంలో ఉండగా... దక్షిణాఫ్రికా ఇంకా ఖాతానే తెరువకపోవడంతో అట్టడుగున 9వ స్థానంలో ఉంది. -
నేను నోరు జారడం పొరపాటే: కెర్రీ ఓకీఫ్
మెల్బోర్న్: భారత దేశవాళీ క్రికెట్ను ఉద్దేశించిన కించపరిచే వ్యాఖ్యలు చేసిన ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్, వ్యాఖ్యాత కెర్రీ ఓకీఫ్ తనను క్షమించాలంటూ బహిరంగ లేఖ రాశాడు. తాను ఉద్దేశపూర్వకంగా ఆ వ్యాఖ్యలు చేయలేదన్న ఓకీఫ్.. నోరు జారడం పొరపాటేనని అంగీకరించాడు. బాక్సింగ్ డే టెస్టు మొదటి రోజు అరంగేట్రం ఆటగాడు మయాంక్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో అతడు రంజీల్లో రైల్వే క్యాంటీన్ జట్టుపై త్రిశతకం చేశాడని ఎగతాళి చేశాడు. రంజీ క్రికెట్ స్థాయిని తక్కువ చేశాడు. దీంతో పెద్ద ఎత్తున అతడిపై విమర్శలు చెలరేగాయి. దీనిపై వివరణ ఇచ్చుకున్న ఓకీఫ్.. భారత క్రికెటర్లతో పాటు అభిమానులకు క్షమాపణలు తెలియజేశాడు. ‘భారత్, ఆస్ట్రేలియా మూడో టెస్టు సందర్భంగా నేను చేసిన వ్యాఖ్యల స్పందనకు కుంగిపోయా. నా మాటల్లో ఉద్దేశాన్ని వ్యతిరేకంగా ప్రతిబింబించారు. నా అసలు ఉద్దేశం వేరు. తీవ్రంగా సాగుతున్న వ్యాఖ్యానాన్ని సరదాగా మార్చాలని అనుకున్నా. ఈ క్రమంలో నోరు జారి రైల్వే క్యాంటీన్ పదాల్ని వాడాను. అంతే తప్ప భారత క్రికెట్ను అగౌరవ పరచలేదు. ఒక పాఠశాల విద్యార్థిగా నేను పర్యటించిన భారత్..ఇప్పుడు అద్భుతమైన క్రికెట్ దేశంగా ఎదిగింది. సిరీస్కు ముందు ఆటగాళ్లపై ఎంతో పరిశోధన చేస్తా. రవీంద్ర జడేజా, చతేశ్వర్ పుజారాను అవమానించలేదు. నాపై నేనే జోక్ వేసుకున్నా’ అని ఓకీఫ్ పేర్కొన్నాడు. -
విరాట్ కోహ్లి ‘హ్యాట్రిక్’ రికార్డు
మెల్బోర్న్: అంతర్జాతీయ మ్యాచ్ల్లో రికార్డులపై రికార్డు కొల్లగొడుతూ దూసుకుపోతున్న క్రికెటర్ టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి. అటు కెప్టెన్గా, ఇటు బ్యాట్స్మన్గా తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాందించుకుని క్రికెట్లో అతనే ఒక పెద్ద సూపర్స్టార్ అనేంతగా కితాబులు అందుకుంటున్నాడు. ఈ క్రమంలోనే మరో అరుదైన ఫీట్ను కోహ్లి నెలకొల్పాడు. ఈ ఏడాది అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా కోహ్లి రికార్డు సాధించాడు. 2018 అంతర్జాతీయ క్రికెట్లో కోహ్లి 2,653 పరుగులతో ఎవ్వరికీ అందనంత ఎత్తులో నిలిచాడు. సుమారు 70 సగటుతో కోహ్లి ఈ ఘనత సాధించాడు. ఇందులో అత్యధిక స్కోరు 160. ఫలితంగా వరుసగా మూడో ఏడాది కూడా అత్యధిక అంతర్జాతీయ పరుగులు సాధించిన ఆటగాడిగా కోహ్లి నిలిచాడు. 2016లో 2,595 పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచిన కోహ్లి.. 2017లో 2,818 పరుగులతో అగ్రస్థానంలో నిలిచాడు. ఈ ఏడాది కూడా అదే జోరును కొనసాగించిన కోహ్లి ‘హ్యాట్రిక్’ పరుగుల రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఆసీస్తో టెస్టు సిరీస్లో భాగంగా మూడో టెస్టులో భారత్ విజయం సాధించి ఈ ఏడాదిని ఘనంగా ముగించిన సంగతి తెలిసిందే. దాంతో విదేశాల్లో అత్యధిక విజయాలు సాధించిన భారత కెప్టెన్ల జాబితాలో సౌరవ్ గంగూలీతో కలిసి కోహ్లి సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచాడు. ఇది కోహ్లికి 11వ విదేశీ టెస్టు విజయం. మెల్బోర్న్లో మువ్వన్నెలు -
కోహ్లి.. నీ సమాధానంతో ఆ కామెంటేటర్ దిమ్మతిరిగింది!
మెల్బోర్న్ : భారత ఫస్ట్ క్లాస్ క్రికెట్ను ఎగతాళి చేస్తూ మాట్లాడిన ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు, కామెంటేటర్ కెరీ ఓ కీఫ్కు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చాడని సోషల్ మీడియాలో అభిమానులు కామెంట్ చేస్తున్నారు. అరంగేట్ర ఆటగాడు మయాంక్ అగర్వాల్ను ఉద్దేశిస్తూ కెరీ ఓ కీఫ్ జాతి వివక్ష వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. మూడో టెస్టు తొలి రోజు ఆట సందర్భంగా ‘జలంధర్ రైల్వే క్యాంటీన్ నౌకర్ల’ బౌలింగ్లో మయాంక్ రంజీ ట్రిపుల్ సెంచరీ చేసి ఉంటాడని ఓ కీఫ్ కామెంట్ చేశాడు. అయితే ఈ టెస్ట్ విజయానంతరం కోహ్లి మాట్లాడుతూ.. ‘మా ఫస్ట్క్లాస్ క్రికెట్ అద్భుతం. దానివల్లే మేం ఈ విజయం సాధించాం. ఈ గెలుపు క్రెడిట్ కచ్చితంగా భారత ఫస్ట్ క్లాస్ క్రికెట్ విధానందే. అక్కడ మా బౌలర్లకు ఎదురైన సవాళ్లు విదేశాల్లో రాణించేలా చేశాయి’ అని ఫస్ట్ క్రికెట్ విధానాన్ని కోహ్లి కొనియాడాడు. అయితే ఓ కీఫ్ జాతి వివక్ష వ్యాఖ్యలను ఉద్దేశించే కోహ్లి పరోక్షంగా ఈ వ్యాఖ్యలు చేశాడని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. ఇక ఈ మ్యాచ్లో బంతితో చెరేగి మ్యాన్ఆప్దిమ్యాచ్గా నిలిచిన భారత పేసర్ జస్ప్రీత్ బుమ్రా సైతం భారత ఫస్ట్క్లాస్ క్రికెట్ను కొనియాడాడు. రంజీ క్రికెట్లో చాలా బంతులు వేయడం వల్లే ఆ అనుభవం ఇక్కడ ఉపయోగపడిందని చెప్పుకొచ్చాడు. ఇక ఓ కీఫ్ తన వ్యాఖ్యలపై క్షమాపణలు చెప్పినా.. నాలుగో రోజు ఆటలో భారత్ ఆటగాళ్లపై మళ్లీ మాట తూలాడు. ఒక రకమైన వ్యంగ్య శైలితో మాట్లాడుతూ ‘అసలు మీ పిల్లలకు చతేశ్వర్ జడేజా వంటి పేర్లు ఎలా పెడతారు’ అంటూ ఇద్దరు భారత క్రికెటర్ల పేర్లను మిళితం చేశాడు. దీంతో ఓ కీఫ్ తీరుపై భారత అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. Isa: "What do you put this success down to?" Kohl: "Our first class cricket is amazing..." What an answer by Kohli to Kerry 😂😂😂#AUSvIND — Mitul (@Eme2ul) December 30, 2018 Isa Guha : What do you put this success down to? Virat Kohli : Our first class cricket is amazing. Giving it back to Kerry O’Keeffe and a bunch of dumb commentators right after the victory 😂😂😂#AUSvIND — Prajakta Bhawsar (@ViratsFangirl18) December 30, 2018 India's captain, Virat Kohli, and Man of the Match Jasprit Bumrah both credited the first-class structure in India following their win over Australia at the Melbourne Cricket Ground.#AUSvIND — Just Cricket 🏏 (@BatBallStumps) December 30, 2018 -
అందుకే ఓడాం : ఆసీస్ కెప్టెన్
మెల్బోర్న్ : భారత్తో జరిగిన మూడో టెస్ట్లో ఓటమికి బ్యాట్స్మెన్ అనుభవరాహిత్యమే కారణమని ఆస్ట్రేలియా కెప్టెన్ టిమ్ పైన్ అభిప్రాయపడ్డాడు. మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ.. ‘ఈ ఓటమి కొంచెం నిరాశను కలిగించింది. పెర్త్ విజయం పునరావృతం అవుతుందని భావించాను. కానీ బ్యాటింగ్ లైనప్ అనుభవరాహిత్యం మా కొంపముంచింది. ప్రపంచ దిగ్గజ పేస్ అటాక్ ఉన్న జట్టుతో ఆడుతున్నాం. కానీ మా జట్టులో టాప్-6 బ్యాట్స్మెన్ అనుభవం లేనివారే. మా తప్పిదాలను తెలుసుకొని ముందుకు సాగుతాం. మా ఆటగాళ్లు వారి శక్తి మేరకు కష్టపడ్డారు. సిడ్నీ టెస్ట్ మాకో పెద్ద చాలెంజ్. ఈ మ్యాచ్లో తప్పక విజయం సాధించి.. సిరీస్ను కాపాడుకుంటాం. మా బ్యాటింగ్ ఆర్డర్పై మరోసారి సమాలోచనలు జరుపుతాం. సిడ్నీలో పరిస్థితులు భిన్నంగా ఉంటాయి. ఈ మ్యాచ్లో భారత్దే పూర్తి క్రెడిట్. వారు అద్భుతంగా ఆడారు. ప్యాట్ కమిన్స్ ఇన్నింగ్స్ అద్భుతం. అతనో నాణ్యమైన ఆటగాడు. ఈ సిరీస్ అసాంతం అతను అద్భుత ప్రదర్శన కనబరుస్తున్నాడు. అతనిలా రాణించే ఆటగాళ్లు కావాలి. ఒక్క విషయంలో తప్ప ఈ ఏడాది బాగానే గడిచింది. వచ్చే ఏడాది ప్రపంచ స్థాయి ఆటగాళ్లు జట్టులోకి రాబోతున్నారు. ఇది ఆసీస్ జట్టుకు కలిసొచ్చే అంశం.’ అని పైన్ చెప్పుకొచ్చాడు. మూడో టెస్ట్లో భారత్ 137 పరుగుల తేడాతో విజయం సాధించి నాలుగు టెస్ట్ల సిరీస్లో 2-1తో ఆధిక్యం సాధించిన విషయం తెలిసిందే. ఆధిపత్యాన్ని చలాయిస్తాం: కోహ్లి ఈ విజయానంతరం కోహ్లి మాట్లాడుతూ.. ‘సిరీస్లో మా ఆధిపత్యాన్ని ఇక్కడితో ఆపదల్చుకోలేదు. ఈ విజయం మాలో ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. కాబట్టి.. రెట్టించిన ఉత్సాహంతో సిడ్నీ టెస్టులో ఆడతాం. సిరీస్లో గెలిచిన రెండు టెస్టుల్లోనూ భారత్ జట్టు అన్ని విభాగాల్లో సమష్టిగా రాణించింది. అయితే.. ఆస్ట్రేలియా గడ్డపై మా పని ఇంకా ముగియలేదు. ఆఖరి టెస్టులో విజయం సాధించాలి. ఆ మ్యాచ్లో గెలిచేందుకు ఏ అవకాశం లభించినా.. చేజార్చుకోం. కచ్చితంగా ఆస్ట్రేలియాపై ఆధిపత్యం చెలాయిస్తాం’ అని విరాట్ కోహ్లి ధీమా వ్యక్తం చేశాడు. చివరి టెస్ట్ జనవరి 3 నుంచి సిడ్నీ వేదికగా జరగనుంది. ఈ మ్యాచ్ను భారత్ కాపాడుకుంటే సిరీస్ భారత్ వశం కానుంది. -
బాక్సింగ్ డే టెస్ట్ : విజయం ముంగిట భారత్
మెల్బోర్న్ : ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్ట్లో భారత్ విజయానికి 5 వికెట్ల దూరంలో ఉంది. కోహ్లిసేన సెకండ్ ఇన్నింగ్స్ను 106/8 వద్ద డిక్లేర్డ్ చేయడంతో 399 పరుగుల భారీ లక్ష్య ఛేదనకు దిగిన ఆతిథ్య జట్టు అదే తడబాటును కొనసాగించింది. నాలుగో రోజు ఆట టీ విరామ సమయానికి ఆసీస్ 5 వికెట్లు కోల్పోయి 138 పరుగులు చేసింది. అరోన్ ఫించ్ (3), మార్కస్ హర్రీస్ (13) మరోసారి విఫలం కాగా.. ఉస్మాన్ ఖాజా (33), షాన్ మార్ష్(44)లు ఇన్నింగ్స్ను నిలబెట్టే ప్రయత్నం చేశారు. కానీ షమీ, బుమ్రాలు వీరిని ఔట్ చేసి దెబ్బకొట్టారు. ప్రస్తుతం క్రీజులో ట్రావిస్ హెడ్ (29), టిమ్ పైన్(1)లు పోరాడుతున్నారు. భారత బౌలర్ల దాటికి తొలి ఇన్నింగ్స్లో 151 పరుగులకే కుప్పకూలిన ఆసీస్.. రెండో ఇన్నింగ్స్లో కూడా ఆ దిశగానే పయనిస్తోంది. బుమ్రా, జడేజాలు రెండేసి వికెట్లు తీయగా.. షమీ ఒక వికెట్ తీశాడు. భారత్ తొలి ఇన్నింగ్స్ 443/7 డిక్లేర్డ్, రెండో ఇన్నింగ్స్ 106/8 డిక్లేర్డ్ ఆసీస్ తొలి ఇన్నింగ్స్ 151 ఆలౌట్, రెండో ఇన్నింగ్స్ 138/5 (టీ విరామ సమయానికి) -
బాక్సింగ్ డే టెస్ట్ : విజయం దిశగా భారత్
మెల్బోర్న్ : ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్ట్లో భారత్ విజయం దిశగా దూసుకెళ్తుంది. 54/5 ఓవర్ నైట్ స్కోర్తో నాల్గో రోజు ఆటను ప్రారంభించిన కోహ్లిసేన మరో 52 పరుగుల జోడించి 106/8 వద్ద డిక్లేర్డ్ చేసింది. ఓవర్నైట్ బ్యాట్స్మెన్ మయాంక్ అగర్వాల్ (42), రిషభ్ పంత్లు ఆరో వికెట్కు 39 పరుగులు జోడించగా.. రవీంద్ర జడేజా (5) పరుగులు చేశాడు. దీంతో ఆసీస్కు 399 పరుగుల భారీ లక్ష్యం నమోదైంది. అనంతరం సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆతిథ్య జట్టు ఆదిలోనే ఓపెనర్లు అరోన్ ఫించ్ (3), మార్కస్ హర్రీస్ (13)ల వికెట్లు కోల్పోయింది. ఫించ్ను జడేజా ఔట్ చేయగా.. హర్రీస్ను బుమ్రా పెవిలియన్కు చేర్చాడు. ప్రస్తుతం క్రీజులో ఉస్మాన్ ఖాజా (26), షాన్ మార్ష్(2)లు ఆడుతున్నారు. పిచ్ పూర్తిగా బౌలింగ్కు సహకరిస్తున్న నేపథ్యంలో భారత్ విజయం లాంఛనం కానుంది. భారత్ తొలి ఇన్నింగ్స్ 443/7 డిక్లేర్డ్, రెండో ఇన్నింగ్స్ 106/8 డిక్లేర్డ్ ఆసీస్ తొలి ఇన్నింగ్స్ 151 ఆలౌట్, రెండో ఇన్నింగ్స్ 44/2 -
‘వీసాలు చూపించండి.. అతనో పనికిరాని వ్యక్తి’
ఆసీస్ క్రికెటర్లకే కాదు ఆ దేశానికి చెందిన క్రికెట్ అభిమానులకు కూడా నోటి దురుసు ఎక్కువేనని మరోసారి రుజువైంది. భారత్- ఆస్ట్రేలియాల మధ్య జరుగుతున్న మూడో టెస్టులో భాగంగా టీమిండియా పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఆతిథ్య జట్టు పతనాన్నిశాసించి.. టెస్టుల్లో అరంగేట్రం చేసిన ఏడాదిలోపే అత్యధిక వికెట్లు పడగొట్టిన తొలి భారత బౌలర్గా సరికొత్త రికార్డు సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్లో ఉన్న భారత అభిమానులు, ఆటగాళ్లు సంబరాలు చేసుకోవడాన్ని ఓర్చుకోలేని ఆస్ట్రేలియా అభిమానులు జాత్యహంకారంతో రెచ్చిపోయారు. ‘ మీ వీసాలు చూపించండి.. మీ కెప్టెన్ ఓ పనికిరాని వ్యక్తి’ అంటూ టీజ్ చేశారు. బాక్సింగ్ డే టెస్టు మొదలైన నాటి నుంచి వీరు ఇలాగే ప్రవర్తిసున్న నేపథ్యంలో... వారి మాటలను రికార్డు చేసిన ‘ఈఎస్పీన్క్రిక్ఇన్ఫో’ ... ఈ విషయమై క్రికెట్ ఆస్ట్రేలియా(సీఏ)కు ఫిర్యాదు చేసింది. వీటిని రుజువు చేసేందుకు ఇందుకు సంబంధించిన వీడియోను కూడా జత చేసింది.(పంత్పై నోరుపారేసుకున్న టిమ్ పైన్) ఈ విషయంపై స్పందించిన సీఏ అధికార ప్రతినిధి మాట్లాడుతూ.. ‘ క్రికెట్ ఆస్ట్రేలియా జాత్యహంకార చర్యలను, వ్యాఖ్యలను ఎంతమాత్రం సహించదు. ఇతర దేశాలకు చెందిన ఆటగాళ్లు, అభిమానులు, సిబ్బంది ఇలా ఎవరినైనా సరే ఇలాంటి పిచ్చి చేష్టలతో బాధపెడితే సహించబోము. ఈ విషయం గురించి బాధితులు అక్కడున్న భద్రతా సిబ్బందికి ఫిర్యాదు చేయవచ్చు. విక్టోరియా పోలీసులు ఎంసీజీ వద్ద సెక్యూరిటీ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. అనుచితంగా ప్రవర్తించిన వారిని పోలీసులు బయటికి పంపించి వేశారు కూడా’ అని సమాధానమిచ్చారు. ఇలాంటి చర్యలు శ్రుతిమించితే వాళ్లు భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో అభిమానులపై సీఏ చర్యలు తీసుకోవడం బాగుంది... కానీ కవ్వింపు చర్యలతో భారత క్రికెటర్ల ఏకాగ్రతను దెబ్బతీసే వారి ఆటగాళ్లను మాత్రం అదుపు చేయలేదు ఎందుకో అంటూ టీమిండియా అభిమానులు వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. -
పంత్పై నోరుపారేసుకున్న టిమ్ పైన్
మెల్బోర్న్ : గిల్లి కజ్జాలు పెట్టుకోవడంలో ఆస్ట్రేలియా ఆటగాళ్లను మించినవారు లేరనడంలో అతిశయోక్తి లేదేమో! భారత్తో సిరీస్కు ముందు తాము మారిపోయామని సుద్దపూస మాటలు చెప్పిన ఆసీస్ ఆటగాళ్లు.. ఆచరణలో మాత్రం దాన్ని చూపించడం లేదు. తొలి టెస్ట్ నుంచే మాటలతో రెచ్చగొడుతూ.. కవ్వింపు చర్యలకు పాల్పుడుతూ వచ్చిన ఆటగాళ్లు.. తాజాగా మూడో టెస్ట్లో కూడా అదే తరహా ప్రవర్తనను కనబర్చారు. ముఖ్యంగా ఆ జట్టు కెప్టెన్ టిమ్ పైన్కు అడ్డూ అదుపు లేకుండా పోతుంది. నోటికెంత వస్తే అంత మాట్లాడుతూ భారత ఆటగాళ్ల సహనాన్ని పరీక్షిస్తున్నాడు. రెండో రోజు ఆటలో రోహిత్ సిక్స్ కొడితే.. ముంబైజట్టుకు మారిపోతానని కవ్వించిన పైన్.. మూడో రోజు ఆటలో వికెట్ కీపర్ పంత్ను టార్గెట్ చేస్తూ నోరుపారేసుకున్నాడు. భారత్ రెండో ఇన్నింగ్స్ సందర్భంగా బ్యాటింగ్ చేస్తున్న పంత్ను వ్యక్తిగతంగా దూషిస్తూ రెచ్చగొట్టాడు. ఆసీస్తో జరిగే వన్డే జట్టులో చోటు కోల్పోయిన విషయాన్ని గుర్తు చేస్తూ కవ్వింపు చర్యలకు పాల్పడ్డాడు. ‘పంత్.. ధోని వచ్చేశాడు కదా..ఏం చేస్తావ్.. బీబీఎల్లో హరికేన్స్ జట్టు తరఫున ఆడుతావా?’ అంటూ స్లెడ్జింగ్కు పాల్పడ్డాడు. దీన్ని ఏమాత్రం పట్టించుకోని పంత్ తనపని తాను చేసుకుంటూ పోయాడు. పైన్ వ్యాఖ్యలు స్టంప్స్ మైక్లో స్పష్టంగా రికార్డయ్యాయి. ఇక తొలిటెస్ట్లో కమిన్స్కు దీటుగా పంత్ స్లెడ్జింగ్కు పాల్పడిన విషయం తెలిసిందే. అయితే ఆసీస్ ఆటగాళ్లు ఎంత రెచ్చగొడుతున్నా.. భారత ఆటగాళ్లు సహనం ప్రదర్శించడం వల్ల వివాదాస్పదం కావడం లేదు కానీ.. వారికి దీటుగా స్పందిస్తే మైదానంలో పెద్ద గొడవలే జరుగుతాయని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. ఈ తరహా చేష్టలతోనే బాల్ ట్యాంపరింగ్ వివాదంలో చిక్కుకొని చేతులు కాల్చుకున్నా.. ఆసీస్ ఆటగాళ్లకు బుద్ది రావడం లేదని మండిపడుతున్నారు. Tim Paine doing some recruiting for the @HurricanesBBL out in the middle of the 'G... 😂 #AUSvIND pic.twitter.com/6btRZA3KI7 — cricket.com.au (@cricketcomau) December 28, 2018 -
కోహ్లి నిర్ణయం తప్పిదమేనా?
మెల్బోర్న్ : ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్ట్లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి తీసుకున్న నిర్ణయం భారత్కు ప్రతికూలంగా మారినట్లు కనిపిస్తోంది. తొలి ఇన్నింగ్స్లో అద్భుత బ్యాటింగ్తో 443/7 పరుగులకు డిక్లేర్ చేసిన భారత్.. ఆతిథ్య జట్టును 151 పరుగులకే కుప్పకూల్చింది. తద్వార 292 పరుగుల భారీ ఆధిక్యాన్ని సొంతం చేసుకుంది. ఆసీస్ను ఫాలోఆన్ ఆడించే అవకాశం ఉన్నా..భారత్ అనూహ్యంగా రెండో ఇన్నింగ్స్ను ప్రారంభించి చేతులు కాల్చుకుంది. వరుసగా వికెట్లు కోల్పోతూ ఆసీస్ ఆటగాళ్లకు మ్యాచ్పై ఆశలు రేకిత్తించింది. హనుమ విహారి(13) వికెట్ అనంతరం వరుసగా.. పుజారా (0), కోహ్లి (0), రహానే(1), రోహిత్ (5)ల వికెట్లు కోల్పోయింది. తొలి ఇన్నింగ్స్లో సెంచరీతో చెలరేగిన పుజారా, హాఫ్ సెంచరీ సాధించిన కోహ్లిలు డకౌట్ కావడం గమనార్హం. ఇక మూడో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 5 వికెట్లు కోల్పోయి 54 పరుగులు చేసింది. క్రీజులో మయాంక్ అగర్వాల్ (28), రిషభ్ పంత్ (6)లున్నారు. మూడో రోజు ఆటలో మొత్తం 15 వికెట్లు పడటం చూస్తే పిచ్ బౌలింగ్కు ఎంత అనుకూలించిందో స్పష్టంగా అర్థం అవుతోంది. అయినా కోహ్లి రెండో ఇన్నింగ్స్ను ప్రారంభించడం తప్పిదమేనని, ఆసీస్ను ఫాలోఆన్ ఆడనిస్తే ఒత్తిడిలో త్వరగా వికెట్లు కోల్పోయేవారని, అప్పుడు భారత్ ఇన్నింగ్స్ తేడాతో గెలిచే అవకాశం ఉండేదని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికైనా పోయిందేమి లేదని, కానీ ఆసీస్ ఆటగాళ్లకు పోరాడే శక్తినిచ్చినట్లైందని వాపోతున్నారు. -
151 రన్స్కు ఆస్ట్రేలియా ఆల్ అవుట్
-
బాక్సింగ్ డే టెస్ట్ : 151 ఆసీస్ ప్యాకప్
మెల్బోర్న్ : భారత్తో జరుగుతున్నమూడో టెస్ట్లో ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ 151 పరుగులకే ముగిసింది. టీమిండియా పేసర్ జస్ప్రీత్ బుమ్రా దాటికి ఆతిథ్య బ్యాట్స్మెన్ పెవిలియన్ క్యూ కట్టారు. దీంతో భారత్కు 292 పరుగుల ఆధిక్యం లభించింది. 8/0 ఓవర్నైట్ స్కోర్తో మూడో రోజు ఆటను ప్రారంభించిన ఆసీస్.. ఆదిలోనే ఓపెనర్లు ఆరోన్ ఫించ్(8), హ్యారిస్(22) వికెట్లను కోల్పోయింది. ఫించ్ ఔట్ చేసి ఇషాంత్ శర్మ భారత్కు శుభారంభాన్ని అందించగా.. బుమ్రా హ్యారిస్ను పెవిలియన్కు పంపించాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన ఉస్మాన్ ఖాజా (21), షాన్ మార్ష్ (19), ట్రావిస్ హెడ్(20), మిచెల్ మార్ష్ (9), టిమ్ పెయిన్ (22), కమిన్స్ (17), నాథన్ లయన్(0), హజల్వుడ్ (0)లు భారత బౌలర్ల దాటికి ఏ మాత్రం నిలదొక్కుకోలేకపోయారు. బుమ్రా 6 వికెట్లు పడగొట్టగా.. జడేజా రెండు, షమీ, ఇషాంత్లు ఒక వికెట్ తీశారు. ఆసీస్ను ఫాలోఆన్ ఆడించే అవకాశం ఉన్నా భారత్ రెండో ఇన్నింగ్స్ ఆడటానికే మొగ్గు చూపింది. -
39 ఏళ్ల రికార్డు బ్రేక్ చేసిన బుమ్రా
మెల్బోర్న్ : టీమిండియా పేసర్ జస్ప్రీత్ బుమ్రా 39 ఏళ్ల నాటి రికార్డును అధిగమించి చరిత్ర సృష్టించాడు. ఈ ఏడాదే అంతర్జాతీయ టెస్ట్ల్లో అరంగేట్రం చేసిన ఈ భారత స్పీడ్స్టార్.. తన పేరిట సరికొత్త రికార్డును లిఖించుకున్నాడు. ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్ట్లో బుమ్రా బంతితో ఆతిథ్య జట్టు పతనాన్నిశాసించాడు. మార్కస్ హ్యారీస్, షాన్ మార్ష్, ట్రావిస్ హెడ్, టీమ్ పైన్, లయన్, హజల్వుడ్లను పెవిలియన్కు చేర్చాడు. తద్వారా టెస్టు ఫార్మాట్లో అరంగేట్ర ఏడాదిలో అత్యధిక వికెట్లు పడగొట్టిన తొలి భారత బౌలర్గా రికార్డుకెక్కాడు. ఇప్పటి వరకు ఈ రికార్డు లెఫ్టార్మ్ స్పిన్నర్ దిలీప్ దోషి పేరిట ఉండగా.. తాజాగా బుమ్రా అధిగమించాడు. 1979లో టెస్ట్ల్లో అరంగేట్రం చేసిన దిలీప్ దోషి ఆ ఏడాది 40 వికెట్లు పడగొట్టి ఈ ఫీట్ను సాధించాడు. మళ్లీ 39 ఏళ్ల తర్వాత బుమ్రా ఈ రికార్డును బ్రేక్ చేసి దిలీప్ను వెనక్కు నెట్టేసాడు. దిలీప్ తర్వాత 37 వికెట్లతో(1996) వెంకటేశ్ ప్రసాద్, నరేంద్ర హిర్వాణీ 36(1988), శ్రీశాంత్ 35(2006)లున్నారు. ఇక ఈ ఏడాది దక్షిణాఫ్రికా పర్యటనతో టెస్ట్ల్లో అరంగేట్రం చేసిన బుమ్రా 9 టెస్ట్ల్లో మొత్తం 45 వికెట్లు పడగొట్టాడు. నా ఫేవరెట్ బౌలర్ : క్లార్క్ మూడో టెస్ట్లో బుమ్రా వేసిన వైవిధ్యమైన బంతులకు ఆసీస్ మాజీ కెప్టెన్ మైకెల్ క్లార్క్ ఫిదా అయ్యాడు. సోనీ స్పోర్ట్స్ చర్చా కార్యక్రమంలో మాట్లాడుతూ బుమ్రా ప్రదర్శనను కొనియాడాడు. ‘ అంతర్జాతీయ క్రికెట్లో ప్రస్తుతం బుమ్రా నా ఫేవరెట్ బౌలర్. భారత జట్టు విజయానికి కృషి చేసే బౌలర్. కెప్టెన్ కోహ్లి వ్యూహాలకు సరిపోయే బౌలర్. కొత్త, పాత బంతి అనే విషయాన్ని పట్టించుకోని స్పీడ్స్టార్. కేవలం అతనికి భారత విజయంలో కీలకం కావడమే కావాలి. ప్రస్తుత ఐసీసీ ర్యాంకుల్లో బుమ్రా అగ్రస్థానంలో లేకపోవచ్చు. కానీ మరికొద్ది రోజుల్లోనే బుమ్రా మూడు ఫార్మాట్లలో అగ్రస్థానం సొంతం చేసుకుంటాడు.’ అని క్లార్క్ జోస్యం చెప్పాడు. -
బాక్సింగ్ డే టెస్ట్ : కష్టాల్లో ఆసీస్
మెల్బోర్న్ : భారత్తో జరుగుతున్న మూడో టెస్ట్లో ఆస్ట్రేలియా 102 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. 8/0 ఓవర్నైట్ స్కోర్తో మూడో రోజు ఆటను ప్రారంభించిన ఆసీస్.. ఆదిలోనే ఓపెనర్లు ఆరోన్ ఫించ్(8), హ్యారిస్(22) వికెట్లను కోల్పోయింది. ఫించ్ను ఔట్ చేసి ఇషాంత్ శర్మ భారత్కు శుభారంభాన్ని అందించగా.. బుమ్రా హ్యారిస్ను పెవిలియన్కు చేర్చాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన ఉస్మాన్ ఖాజా (21), షాన్ మార్ష్ (19), ట్రావిస్ హెడ్(20), మిచెల్ మార్ష్ (9)లు భారత బౌలర్ల ముందు తేలిపోయారు. బుమ్రా మూడు వికెట్లు పడగొట్టగా.. జడేజా రెండు, ఇషాంత్ ఒక వికెట్ తీశారు. ప్రస్తుతం క్రీజులో టీమ్ పెయిన్ (2), ప్యాట్కమిన్స్(0) లున్నారు. 243 లోపు ఆతిథ్య జట్టు ప్యాకప్ అయితే ఫాలోఆన్ ప్రమాదంలో పడుతోంది. ఇక భారత్ తన తొలి ఇన్నింగ్స్ను 443/7 డిక్లేర్డ్ చేసిన విషయం తెలిసిందే. -
భారత్ స్కోరు 443/7.. ఇన్నింగ్స్ డిక్లేర్
-
భారత్ స్కోరు 443/7.. ఇన్నింగ్స్ డిక్లేర్
మెల్బోర్న్ : బాక్సింగ్ డే టెస్టు మొదటి ఇన్నింగ్స్ను భారత్ డిక్లేర్ చేసింది. గురువారం రెండో రోజు ఆటలో భాగంగా ఏడు వికెట్ల నష్టానికి 443 పరుగులు చేసిన అనంతరం భారత్ తన తొలి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. అటు తర్వాత బ్యాటింగ్కు దిగిన ఆస్ట్రేలియా ఆట ముగిసే సమయానికి వికెట్లేమీ కోల్పోకుండా 8 పరుగులు చేసింది. మార్కస్ హారిస్ (5 బ్యాటింగ్), ఆరోన్ ఫించ్ (3 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. అంతకుముందు 215/2 ఓవర్నైట్ స్కోరుతో రెండోరోజు ఆట ప్రారంభించిన భారత్ ధాటిగా ఆడింది. ఓవర్నైట్ ఆటగాళ్లు కోహ్లి, పుజారాలు బాధ్యతాయుతంగా బ్యాటింగ్ చేయడంతో భారత స్కోరు బోర్డు పరుగులు తీసింది. కాగా, ఈ జోడి 170 పరుగులు భాగస్వామ్యం నెలకొల్పిన తర్వాత కోహ్లి (82; 204 బంతుల్లో 9 ఫోర్లు) మూడో వికెట్గా పెవిలియన్ చేరాడు. ఆపై మరో ఆరు పరుగుల వ్యవధిలో శతకం సాధించిన పుజారా(106; 319 బంతుల్లో 10 ఫోర్లు) నాల్గో వికెట్గా ఔటయ్యాడు. ఇది పుజారాకు టెస్టుల్లో 17వ సెంచరీ కాగా, ఆసీస్పై నాల్గోది. ఆ తరుణంలో అజింక్యా రహానే(34), రోహిత్ శర్మ(63 నాటౌట్)ల జోడి నిలకడగా ఆడింది. దాంతో భారత్ స్కోరు మూడొందల మార్కును అవలీలగా చేరింది. ఇక రోహిత్ శర్మ-రిషబ్ పంత్(39)లు జంట కూడా మరో కీలక భాగస్వామ్యాన్ని నమోదు చేయడంతో భారత్ నాల్గొందల మార్కును దాటింది. స్కోరును పెంచే క్రమ్లో రిషభ్ పంత్ ఔటైన స్వల్ప వ్యవధిలో రవీంద్ర జడేజా సైతం ఔట్ కావడంతో భారత్ ఇన్నింగ్స్ను డిక్లేర్ చేసింది. తొలి రోజు ఆటలో ఓపెనర్ మయాంక్ అగర్వాల్ (76) హాఫ్ సెంచరీ చేసిన సంగతి తెలిసిందే. ఆసీస్ బౌలర్లలో కమిన్స్ మూడు వికెట్లు సాధించగా, మిచెల్ స్టార్క్కు రెండు వికెట్లు లభించాయి. హజల్వుడ్, లయన్లకు తలో వికెట్ దక్కింది. -
మయాంక్ని కించపరిచిన ఆస్ట్రేలియా కామెంటేటర్
మెల్బోర్న్ : భారత్- ఆస్ట్రేలియా మూడో టెస్టు సందర్భంగా ఆసీస్ కామెంటేటర్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. తొలి టెస్టు మ్యాచ్ ఆడుతున్న కర్ణాటక ప్లేయర్ మయాంక్ అగర్వాల్పై కామెంటేటర్ ఓ.కీఫ్ అనుచిత వ్యాఖ్యలు చేయడంతో పాటు... భారత ఫస్ట్క్లాస్ క్రికెట్ను అవమానించాడు. ఫస్ట్క్లాస్ క్రికెట్లో మయాంక్ 304 పరుగులు సాధించి అజేయ ట్రిపుల్ సెంచరీ చేసిన సంగతి తెలిసిందే. 2017-18లో మహారాష్ట్రతో జరిగిన మ్యాచ్లో అతడు ఈ ఫీట్ సాధించాడు. ప్రస్తుతం ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్టు ద్వారా అరంగేట్రం చేసిన మయాంక్ ఓపెనర్గా బరిలోకి దిగి 76 పరుగులు చేసి ఔరా అనిపించాడు. అయితే మ్యాచ్ జరుగుతున్న సమయంలో.. మయాంక్ సాధించిన ట్రిపుల్ సెంచరీ పెద్ద విషమేమీకాదనీ ఓ.కీఫ్ వ్యాఖ్యానించాడు. ఏ క్యాంటీన్ జట్టుపైనో లేదా వెయిటర్స్ టీమ్పైనో అతడు 304 పరగులు చేసి ఉండొచ్చని అన్నాడు. దీంతో ట్విటర్ వేదికగా ఓ.కీఫ్ను క్రికెట్ అభిమానులు ట్రోల్ చేస్తున్నారు. ‘వెటకారపు, వెకిలి నవ్వుల కోసం మరో దేశాన్ని కించపరుస్తారా’ అంటూ మండిపడుతున్నారు. జాతి వివక్ష వ్యాఖ్యలు మానుకోండని హితవు పలుకుతున్నారు. ఇదిలా ఉండగా.. 2013లో జార్ఖండ్ తరపున ఫస్ట్క్లాస్ క్రికెట్లోకి అడుగుపెట్టిన మయాంక్.. 46 ఫస్ట్క్లాస్, 75 లిస్ట్-ఏ మ్యాచ్ల్లో పాల్గొన్నాడు. దాదాపు 50 సగటుతో రాణించాడు. కాగా, 1971-1977 మధ్య కాలంలో ఆస్ట్రేలియాకు ప్రాతినిథ్యం వహించిన కీఫ్ లెగ్ స్పిన్నర్. 24 టెస్టులు ఆడిన అతను 53 వికెట్లు తీశాడు. అనంతరం క్రికెట్ కామెంటేటర్గా మారి... విలక్షణమైన వ్యాఖ్యాతగా గుర్తింపు పొందాడు. It might just be me, but it's pretty uncool to ridicule the FC comp of another country while using dubious stereotypes for a cheap laugh... — Melinda Farrell (@melindafarrell) December 26, 2018 Kerry o'keefe, Lord snooty!! Sounds like still living in colonial era #BoxingDayTest #INDvsAUS — Dilipsinh Abda (@dilipsinhabda) December 26, 2018 -
బాక్సింగ్ డే టెస్ట్ : రాణించిన భారత బ్యాట్స్మెన్
మెల్బోర్న్ : ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్టులో భారత్ నిలకడగా ఆడుతోంది. మ్యాచ్ తొలి రోజు బుధవారం ఆట ముగిసే సమయానికి భారత్ 2 వికెట్ల నష్టానికి 215 పరుగులు చేసింది. చతేశ్వర పుజారా( 200 బంతుల్లో 68 బ్యాటింగ్: 6 ఫోర్లు), విరాట్ కోహ్లి (107 బంతుల్లో 47 బ్యాటింగ్; 6 ఫోర్లు) క్రీజ్లో ఉన్నారు. వీరిద్దరు ఇప్పటికే మూడో వికెట్కు అభేద్యంగా 92 పరుగులు జోడించారు. అంతకు మందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ వ్యూహాత్మకంగా మయాంక్ అగర్వాల్, హనుమ విహారీలను ఓపెనర్లుగా బరిలోకి దింపింది. అరంగేట్రంలో అర్థసెంచరీ.. ఈ మ్యాచ్తో అంతర్జాతీయ టెస్టుల్లో అరంగేట్రం చేసిన మయాంక్ అగర్వాల్ అర్ధశతకంతో ఔరా అనిపించాడు. జట్టు స్కోర్ 40 వద్ద హనుమ విహారీ (8) తొలి వికెట్గా వెనుదిరిగాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన పుజారాతో మయాంక్ ఆచితూచి ఆడాడు. ఈ క్రమంలో 95 బంతుల్లో ఆరు ఫోర్లతో కెరీర్లో తొలి హాఫ్సెంచరీ నమోదు చేశాడు. తద్వార అరంగేట్ర టెస్ట్లో హాఫ్ సెంచరీ చేసిన ఏడో భారత బ్యాట్స్మన్గా మయాంక్ గుర్తింపు పొందాడు. పెర్త్ టెస్ట్ పరాజయంతో జట్టులో సమూల మార్పులు చేసిన టీమ్ మేనేజ్మెంట్.. ఉన్నపళంగా ఈ కర్ణాటక బ్యాట్స్మన్ను రప్పించి తుది జట్టులో అవకాశం కల్పించింది. ఈ అవకాశాన్ని మయాంక్ చక్కగా సద్వినియోగం చేసుకుని తనపై టీమ్ మేనేజ్మెంట్ పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు. ఆచితూచి ఆడుతూ సెంచరీ దిశగా దూసుకెళ్లిన మయాంక్(161 బంతుల్లో 76: 8 ఫోర్లు, 1 సిక్స్)ను ప్యాట్ కమిన్స్ పెవిలియన్ చేర్చాడు. దీంతో రెండో వికెట్కు నమోదైన 83 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. పుజారా హాఫ్ సెంచరీ.. మయాంక్ వికెట్ అనంతరం క్రీజులోకి వచ్చిన కెప్టెన్ కోహ్లితో కలిసి పుజారా ఇన్నింగ్స్ను ముందుకు నడిపించాడు. ప్రారంభంలో దాటిగా ఆడిన కోహ్లి.. అనంతరం నెమ్మదించాడు. ఈ ఇద్దరు ఆచితూచి ఆడుతూ మరో వికెట్ పోకుండా జాగ్రత్త పడ్డారు. ఈ క్రమంలో 152 బంతుల్లో 4 ఫోర్లతో పుజారా హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. కోహ్లి కూడా హాఫ్ సెంచరీ చేరువగా వచ్చినప్పటికి తొలి రోజు ఆట ముగిసింది. -
బాక్సింగ్ డే టెస్ట్ : రెండో వికెట్ కోల్పోయిన భారత్
మెల్బోర్న్ : ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్ట్లో భారత్ రెండో వికెట్ కోల్పోయింది. అరంగేట్ర ఆటగాడు, ఓపెనర్ మయాంక్ అగర్వాల్ 76 (161బంతులు 8ఫోర్లు 1సిక్స్) ప్యాట్ కమిన్స్ బౌలింగ్లో కీపర్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో రెండో వికెట్కు నమోదైన 83 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. మయాంక్ వికెట్ అనంతరం అంపైర్లు టీబ్రేక్ ఇవ్వడంతో ఆ సమయానికి భారత్ రెండు వికెట్లు కోల్పోయి 123 పరుగులు చేసింది. క్రీజులో పుజారా 33(102 బంతులు, 2 ఫోర్లు) ఉన్నాడు. మయాంక్ అరంగేట్ర మ్యాచ్లోనే హాఫ్ సెంచరీ సాధించి కెప్టెన్ విరాట్ కోహ్లి, కోచ్ రవిశాస్త్రిల నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు. -
బాక్సింగ్ డే టెస్ట్ : అరంగేట్రంలో అదరగొట్టాడు!
మెల్బోర్న్ : ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్ట్లో టీమిండియా ఓపెనర్ మయాంక్ అగర్వాల్ అర్ధశతకంతో ఔరా అనిపించాడు. ఈ మ్యాచ్తోనే అంతర్జాతీయ టెస్ట్ల్లో అరంగేట్రం చేసిన అగర్వాల్.. 95 బంతుల్లో ఆరు ఫోర్లతో కెరీర్లో తొలి హాఫ్సెంచరీ నమోదు చేశాడు. తద్వార అరంగేట్ర టెస్టుల్లో అర్థసెంచరీ నమోదు చేసిన ఏడో భారత ఓపెనర్గా మయాంక్ గుర్తింపు పొందాడు. మయాంక్ కన్నా ముందు ధావన్, పృథ్వీషా, గవాస్కర్, ఇబ్రహిం, అరుణ్, హుస్సెన్లు ఈ ఘనతను సాధించారు. పెర్త్ టెస్ట్ పరాజయంతో జట్టులో సమూల మార్పులు చేసిన టీమ్ మేనేజ్మెంట్.. ఉన్నపళంగా ఈ కర్ణాటక బ్యాట్స్మన్ను రప్పించి తుది జట్టులో అవకాశం కల్పించిన విషయం తెలిసిందే. ఈ అవకాశాన్ని మయాంక్ చక్కగా సద్వినియోగం చేసుకుని తనపై టీమ్ మేనేజ్మెంట్ పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు. అంతకముందు టాస్ గెలిచిన భారత్ బ్యాటింగ్ ఎంచుకుంది. రెగ్యులర్ ఓపెనర్లు కేఎల్ రాహుల్, మురళి విజయ్లపై వేటు వేసిన టీమ్ మేనేజ్మెంట్.. ప్రయోగాత్మకంగా హనుమ విహరీ-మయాంక్లతో ఇన్నింగ్స్ను ఆరంభించింది. విహారీ(8) విఫలమైనప్పటికీ.. మయాంక్, పుజారాలు నిలకడగా ఆడుతున్నారు. -
నేటి నుంచే... బాక్సింగ్ 'ఢీ' టెస్టు
మూడు విదేశీ సిరీస్ విజయాలే లక్ష్యంగా 2018ని ప్రారంభించింది టీమిండియా. ఆటగాళ్ల గాయాలు, తుది జట్టు ఎంపికలో పొరపాట్లు, బ్యాటింగ్ వైఫల్యాలతో దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్లలో ఒక్కో గెలుపుతో సరిపెట్టుకుని వెనుదిరిగింది. ఇవే లోపాలు వెంటాడుతుండగా ఇప్పుడు ఏడాది ఆఖరులో... మూడో సిరీస్ మధ్యలో నిలిచింది. దీనిని కూడా కోల్పోకుండా ఉండాలంటే... ఒక్క గెలుపు సరిపోయే స్థితిలో కొంత మెరుగ్గానే ఉంది. మరి... కోహ్లి సేన ఏం చేస్తుందో? మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (ఎంసీజీ) అంటేనే తెలియని ఆకర్షణ. క్రిస్మస్ను ఆనందంగా జరుపుకొని వేలాదిగా హాజరయ్యే ప్రేక్షకుల మధ్య బాక్సింగ్ డే టెస్టు ప్రారంభమై దానిని రెట్టింపు చేస్తుంది. ఆ హంగామాకు ఈసారి పోటాపోటీ సిరీస్ తోడై అభిమానులకు మరింత మజా ఇవ్వనుంది. మరి... ఫలితాన్ని 1–1 నుంచి 2–1కి మార్చే జట్టేదో? పెర్త్లో పరాజయం పాలైన టీమిండియా పైచేయికి ప్రయత్నిస్తుందా? తమ చరిత్రలోనే చేదైన అనుభవాలు మిగిల్చిన 2018కి... సొంతగడ్డపై వరుసగా రెండో విజయంతో కంగారూలు వీడ్కోలు పలుకుతారా? చూద్దాం... ఎవరి పంతం నెగ్గుతుందో? మెల్బోర్న్: అనుకున్నట్లే పెర్త్ టెస్టు ఓటమి టీమిండియాలో భారీ మార్పుచేర్పులకు దారితీసింది. బుధవారం నుంచి మెల్బోర్న్లో జరుగనున్న మూడో టెస్టుకు రెగ్యులర్ ఓపెనర్లు మురళీ విజయ్, కేఎల్ రాహుల్ ఇద్దరిపై ఒకేసారి వేటుపడేలా చేసింది. కొంత సంచలనమైనా మెల్బోర్న్లో కోహ్లి సేన సాహసానికి దిగక తప్పని పరిస్థితి కల్పించింది. ఈ ప్రకంపనల నేపథ్యంలో కర్ణాటక పరుగుల యంత్రం మయాంక్ అగర్వాల్ అరంగేట్రం ఖాయమైంది. ఆంధ్ర బ్యాట్స్మన్ హనుమ విహారిపై ఇన్నింగ్స్ ఆరంభించే పెద్ద బాధ్యత పడింది. ఫిట్టా, అన్ఫిట్టా అనే ఊహాగానాలకు తెరదించుతూ రోహిత్ శర్మ, రవీంద్ర జడేజాలకు తుది 11 మందిలో చోటు దక్కింది. ఇదే సమయంలో ఆస్ట్రేలియా... బ్యాట్స్ మన్ హ్యాండ్స్కోంబ్ స్థానంలో పేస్ బౌలింగ్ ఆల్ రౌండర్ మిషెల్ మార్ష్ను తీసుకుంది. ఆటతో, మాటతో ఇప్పటికే వేడెక్కిన సిరీస్ను... ‘బాక్సింగ్ డే’ సమరం ఇంకెంత రసవత్తరం చేస్తుందో చూడాలి. మయాంకొచ్చాడు... వారిద్దరూ ఔట్ లెక్కకు మిక్కిలి అవకాశాలతో పాటు అంతే స్థాయిలో వైఫల్యాలను మూటగట్టుకున్న విజయ్, రాహుల్లను ఇంకెంతమాత్రం భరించలేని టీమిండియా... కొత్త కుర్రాళ్లైనా, కఠిన పరిస్థితులు ఎదురవనున్నా ఏమాత్రం సంకోచించకుండా మయాంక్, విహారిలను ఓపెనర్లుగా దించేందుకే సిద్ధమైంది. బ్యాటింగ్ను మరింత బలోపేతం చేసేందుకు రోహిత్ శర్మను ఆరో స్థానంలో పంపనుంది. ఫిట్నెస్పై విపరీత చర్చ జరిగినప్పటికీ స్పెషలిస్ట్ స్పిన్నర్గా జడేజానే ఎంచుకుంది. పక్కటెముకల నొప్పి నుంచి ఇంకా కోలుకోని ఆఫ్ స్పిన్నర్ అశ్విన్, ఫిట్నెస్పై అనుమానాలతో పేస్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యాలకు అవకాశం దక్కలేదు. కూర్పు రీత్యా బ్యాటింగ్ భారాన్ని కెప్టెన్ కోహ్లి, పుజారా, రహానే త్రయమే మోయాలి. వీరిలో ఏ ఇద్దరు నిలిచినా భారీ స్కోరు ఖాయం. కొద్దిసేపు నిలవగలిగితే రోహిత్, వికెట్ కీపర్ రిషభ్ పంత్ నుంచి మంచి ఇన్నింగ్స్లు ఆశించవచ్చు. పేసర్లు ఇషాంత్, షమీ, బుమ్రా చక్కగా రాణిస్తున్నారు. అయితే, ప్రత్యర్థి టాపార్డర్లానే లోయరార్డర్ను కూడా వీరు పడగొట్టాలి. చకచకా ఓవర్లు వేసే జడేజా... పరిస్థితులకు తగ్గట్లు వికెట్లు సైతం తీస్తే జట్టుకు మేలు చేకూరుతుంది. హనుమా... గట్టెక్కించుమా? కెరీర్లో మూడో టెస్టు ఆడబోతున్న ఆంధ్ర బ్యాట్స్మన్ హనుమ విహారి... మెల్బోర్న్లో ఓపెనింగ్కు దిగబోతూ ప్రస్తుతం కీలకమైన ఘట్టం ముందున్నాడు. రంజీల్లోనూ ఇన్నింగ్స్ ప్రారంభించని అతడు ఇప్పుడు ఏకంగా టీమిండియా ఓపెనర్గా దిగుతున్నాడు. రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్లో ఆసీస్ ప్రధాన పేసర్ స్టార్క్ పదునైన బంతులను దీటుగా ఎదుర్కొన్న తీరే బహుశా విహారికి ఈ అవకాశం దక్కేలా చేసింది. టెక్నిక్, దృక్పథం రెండూ ఉన్న అతడు మంచి ఇన్నింగ్స్తో ఈ సవాల్ను అధిగమించగలిగితే జట్టు మేనేజ్మెంట్ నెత్తిన పాలుపోసినవాడవుతాడు. తద్వారా, టెస్టు జట్టులో కీలక సభ్యుడిగానూ ఎదుగుతాడు. అటు నిత్యం ఊగిసలాటలో ఉండే ఆరో స్థానం కంటే, ఓపెనర్గా నిలదొక్కుకుంటే వ్యక్తిగతంగానూ అతడి కెరీర్కు మేలు చేకూరుతుంది. దీనిని అందిపుచ్చుకుని విహారి విజయవంతమవ్వాలని ఆశిద్దాం. ఆసీస్... వ్యూహాత్మకంగా బ్యాటింగ్లో ఇబ్బంది పడుతున్నప్పటికీ ఆతిథ్య జట్టు స్పెషలిస్ట్ బ్యాట్స్మన్ హ్యాండ్స్కోంబ్ను తప్పించి మిషెల్ మార్ష్ ఆడిస్తోంది. పిచ్ పేసర్లకు అనుకూలించవచ్చన్న అంచనానే దీనికి కారణమై ఉండొచ్చు. మిషెల్ బ్యాటింగ్లోనూ నమ్మదగినవాడే. ధాటిగా పరుగులు రాబట్టే ఓపెనర్ అరోన్ ఫించ్, వన్డౌన్ బ్యాట్స్మన్ ఉస్మాన్ ఖాజా, షాన్ మార్‡్షలను త్వరగా వెనక్కుపంపాలి. పేసర్లు స్టార్క్, హాజల్వుడ్, కమిన్స్ల పదునైన బంతులను కాచుకోవడం భారత ఓపెనర్లకు కఠిన పరీక్ష. పిచ్ ఎలా ఉన్నా, వికెట్లు తీస్తున్న నాథన్ లయన్... రెండు జట్ల మధ్య తేడా తానేనని చాటుకున్నాడు. ఇతడి లయను దెబ్బతీస్తే కోహ్లి సేన పని సులువవుతుంది. ►2 ఆస్ట్రేలియా గడ్డపై టీమిండియా ఇప్పటివరకు ఆరు టెస్టుల్లో నెగ్గగా... అందులో రెండు (1977, 1981) మెల్బోర్న్లోనే వచ్చాయి. ఓవరాల్గా భారత్ మెల్బోర్న్లో 12 టెస్టులు ఆడి రెండింటిలో గెలిచి, రెండింటిని ‘డ్రా’ చేసుకొని ఎనిమిదింటిలో ఓడిపోయింది. పిచ్, వాతావరణం గతేడాది యాషెస్ టెస్టు నిస్సారమైన ‘డ్రా’గా ముగియడంతో మెల్బోర్న్ పిచ్ను ఐసీసీ నాసిరకం అని తేల్చింది. తర్వాత షెఫీల్డ్ షీల్డ్ మ్యాచ్లూ ఇదే విధంగా సాగాయి. ఇప్పుడు మాత్రం పచ్చికతో పిచ్ జీవం ఉన్నట్లు కనిపిస్తోంది. నాలుగు రోజులు చక్కటి ఎండ కాయనుంది. ఈ ప్రభావం పిచ్పైనా పడే అవకాశం ఉంది. టాస్ గెలిచిన జట్టు మొదట బౌలింగ్కే మొగ్గుచూపొచ్చు. తుది జట్లు భారత్: మయాంక్ అగర్వాల్, విహారి, పుజారా, కోహ్లి (కెప్టెన్), రహానే, రోహిత్, పంత్, జడేజా, షమీ, ఇషాంత్, బుమ్రా. ఆస్ట్రేలియా: ఫించ్, హారిస్, ఖాజా, షాన్ మార్ష్, హెడ్, మిషెల్ మార్ష్, పైన్ (కెప్టెన్), స్టార్క్, కమిన్స్, లయన్, హాజల్వుడ్. ఉదయం గం. 5.00 నుంచి సోనీ సిక్స్, సోనీ టెన్–3లో ప్రత్యక్ష ప్రసారం బ్యాట్స్మెన్... బాధ్యతగా ఆడండి అద్భుతంగా రాణిస్తున్న మా బౌలర్లకు సమష్టి ప్రదర్శనతో బ్యాట్స్మెన్ అండగా నిలవాలి. మేం మెరుగైన స్కోరు చేయకుంటే బౌలర్లు ఏమీ చేయలేరు. నాథన్ లయన్ను ఎదుర్కొనేందుకు మా వద్ద ప్రణాళికలున్నాయి. మైదానంలో జరిగిన దానికి (పైన్తో వాగ్వాదం) బయట ఏమనుకుంటున్నారో నాకు అనవసరం. నేను ఇలాంటి వాడిని అని బ్యానర్ కట్టుకుని తిరుగుతూ బయటి ప్రపంచానికి చెప్పాల్సిన పనిలేదు. మిగతా వారు ఏమనుకుంటున్నారో తెలుసుకోవడం నా పని కూడా కాదు. ఎందుకంటే... ఎవరి అభిప్రాయాలు వారికుంటాయి. – భారత కెప్టెన్ విరాట్ కోహ్లి