-
భారత్లో బోయింగ్ గ్లోబల్ సపోర్ట్ సెంటర్
న్యూఢిల్లీ: అమెరికాకు చెందిన విమానాల తయారీ దిగ్గజం బోయింగ్ భారత్లో తమ కార్యకలాపాలను మరింతగా విస్తరిస్తోంది. కొత్తగా గ్లోబల్ సపోర్ట్ సెంటర్ (జీఎస్సీ) ఏర్పాటు చేసినట్లు ప్రకటించింది. అలాగే లాజిస్టిక్స్ సెంటర్ను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించింది. తమ ఎయిర్లైన్ కస్టమర్లు, పౌర విమానయాన నియంత్రణ సంస్థలు, ఇతరత్రా పరిశ్రమ వర్గాలకు నిర్వహణపరమైన సామర్థ్యాలు.. భద్రతా ప్రమాణాలను మెరుగుపర్చుకోవడానికి అవసరమైన సేవలను జీఎస్సీ అందిస్తుంది. జీఎస్సీ, లాజిస్టిక్స్ కేంద్రంపై ఎంత వెచ్చిస్తున్నదీ మాత్రం సంస్థ వెల్లడించలేదు. దేశీ విమానయాన సంస్థలు 150 పైచిలుకు బోయింగ్ విమానాలను నడుపుతున్నాయి. తమ రిపేర్ డెవలప్మెంట్ అండ్ సస్టెయిన్మెంట్ హబ్ ప్రోగ్రాం ద్వారా బోయింగ్ ప్రస్తుతం స్థానిక కస్టమర్లకు వివిధ సర్వీసులను అందిస్తోంది. దేశీయంగా విమాన ప్రయాణాలు అసాధారణంగా పెరుగుతున్న నేపథ్యంలో భారత మార్కెట్లో వినూత్న అవిష్కరణలను ప్రవేశపెట్టేందుకు, ఏవియేషన్ వ్యవస్థను ఆధునీకరించేందుకు తాము కట్టుబడి ఉన్నామని బోయింగ్ ఇండియా ప్రెసిడెంట్ సలిల్ గుప్తే తెలిపారు. -
ఎయిరిండియా విస్తరణ ప్లాన్స్, చర్చనీయాంశంగా టాటా భారీ డీల్
సాక్షి, ముంబై: టాటా గ్రూప్ యాజమాన్యంలోని ఎయిరిండియా తన కార్యకలాపాలతో పాటు విమానాలను కూడా విస్తరిస్తోంది. తాజాగా అమెరికాకు చెందిన విమానాల తయారీదారు సంస్థ ఎయిర్బస్తో భారీ డీల్ కుదుర్చుకున్నట్లు సమాచారం. వచ్చేవారం ఈ రెండు సంస్థల మధ్య ఒప్పందాన్ని కుదుర్చుకోనుంది. దాదాపు 250 విమానాల కోసం ఎయిర్బస్తో ఒప్పందం ఖరారైందని త్వరలోనే ప్రకటన వెలువడే అవకాశం ఉందని పీటీఐ నివేదించింది. అలాగే ఇప్పటికే సుమారు 200 విమానాల కోసం బోయింగ్తో ఎయిర్లైన్ ఒప్పందం కుదుర్చుకున్నట్లు మీడియా నివేదికల ద్వారా తెలుస్తోంది. వచ్చేవారమే దీనిపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని అంచనా. కొత్త విమానాల కోసం ఎయిర్లైన్ చారిత్రాత్మక ఆర్డర్ను ఖరారు చేయనున్నట్టు ఎయిరిండియా చీఫ్ క్యాప్ బెల్ విల్సన్ ఇటీవల (జనవరి 27న) వ్యాఖ్యానించారు. దీంతో కొనుగోలు వార్తలకు బలం చేకూరుతోంది. అయితే ఒప్పందానికి సంబంధించి పూర్తి వివరాలు వెల్లడి కాన కాని నేపథ్యంలోఎయిరిండియా అధికారిక ప్రకటన కోసం వెయిట్ చేయాల్సిందే. కాగా ప్రభుత్వ యాజమాన్యంలోని ఎయిరిండియా 16 సంవత్సరాల క్రితం కొత్త విమానాలను కొనుగోలు చేసింది. అప్పటి నుంచి 2005 వరకు ఒక్క విమానం కూడా కొనుగోలు చేయలేదు. చివరిసారిగా 111 విమానాల కోసం బోయింగ్ తో 68, ఎయిర్ బస్ తో 43 విమానాల కోసం 10.8బిలియన్ డాలర్ల భారీ డీల్ ను కదుర్చుకుంది ఎయిరిండియా. -
Layoffs: ఏవియేషన్ దిగ్గజం ఉద్యోగాల కోత; టీసీఎస్లో ఆ ఉద్యోగులకు ఎఫెక్ట్
న్యూఢిల్లీ: దిగ్గజ సంస్థలు సమా పలు కంపెనీలో ఉద్యోగాల కోత కొనసాగుతోంది. తాజాగా ఏవియేషన్ దిగ్గజం బోయింగ్ కూడా వేలాది ఉద్యోగులకు ఉద్వాసన పలకనుంది. ఈ ఏడాది ఫైనాన్స్, హెచ్ఆర్ వర్టికల్స్లో 2,000 ఉద్యోగాలను తొలగించనుంది. వీరిలో ఎక్కువగా టీసీఎస్ అవుట్ సోర్స్ ద్యోగులు ప్రభావితం కానున్నారని తాజా నివేదికల ద్వారా తెలుస్తోంది. మొత్తం 5,800 కంపెనీల నుండి ఫైనాన్స్లో దాదాపు 1,500, హెచ్ఆర్లో 400 ఉద్యోగులను తొలగించనుంది. ఫైనాన్స్ , హెచ్ఆర్ సపోర్ట్ సేవలను తగ్గించిన నేపథ్యంలో ఉద్యోగులను తొలగిస్తున్నట్టు బోయింగ్లో కమ్యూనికేషన్స్ సీనియర్ డైరెక్టర్ మైక్ ఫ్రైడ్మాన్ ఉటంకిస్తూ సీటెల్ టైమ్స్ నివేదించింది. అయితే కంపెనీ వాటిలో మూడింట ఒక వంతు ఉద్యోగాలను బెంగళూరులోని టీసీఎస్కి అవుట్సోర్స్ చేసిందని మీడియా నివేదించింది. ఇండియాలో బోయింగ్లో ఇప్పుడుదాదాపు 3,500 మంది డైరెక్ట్ ఎంప్లాయీస్ ఉన్నారు. అలాగే టీసీఎస్ సహా ఇతర సంస్థలకు సంబంధించి మరో 7వేల మంది ఉద్యోగులున్నారు. కాగా రానున్న కాలంలో వ్యయాలను తగ్గించుకునే క్రమంలో మరింత మందిని తొలగించాలని బోయింగ్ భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే 2022 ఏడాదిలో ఉద్యోగుల వార్షిక పనితీరు సమీక్షలను సిద్ధం చేయడానికి మేనేజర్లను కోరింది. అంచనాలను అందుకోవడంలో విఫలమైన సిబ్బందిలో 10 శాతం మందిని వర్గీకరించాలని కోరింది. -
ఎయిర్ ఇండియా మరో భారీ కొనుగోళ్లు..200 బోయింగ్ విమానాలకు ఆర్డర్?
ప్రముఖ దేశీయ ఏవియేషన్ దిగ్గజం ఎయిర్ ఇండియా..అమెరికా విమానాల తయారీ సంస్థ బోయింగ్ నుంచి 200 విమానాలు కొనుగోలు చేసేలా ఆర్డర్ పెట్టినట్లు సమాచారం. వాటిలో బోయింగ్ 737 మాక్స్ జెట్ విమానాలు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఇరు సంస్థల మధ్య కొనుగోలు చర్చలు జరుగుతుండగా..త్వరలో వాటికి ముగింపు పలకునున్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. అయితే ఎయిర్ ఇండియాతో విమానాల కొనుగోలు ఒప్పందంపై బోయింగ్ అధికార ప్రతినిధి నిరాకరించారు. టాటా సన్స్ ఎయిరిండియా ప్రతినిధులు స్పందించలేదు. కాగా, అంతర్జాతీయ రూట్లలో బోయింగ్ 787 డ్రీమ్ లైనర్ జెట్ విమానాలు, ఎయిర్ బస్ ఎస్ఈ ఏ350 విమానాల కొనుగోలుపై ఎయిర్ ఇండియా దృష్టి సారించింది. బోయింగ్ 777 విమానాలను లీజ్కు తీసుకునే యోచనలో ఉన్నట్లు సమాచారం. -
రతన్ టాటా మరో సంచలనం..500 విమానాల కోసం భారీ ఆర్డరు!
ఎయిరిండియాను ప్రపంచ స్థాయి ఎయిర్లైన్గా తీర్చిదిద్దేందుకు మాతృ సంస్థ టాటా గ్రూప్ కీలక నిర్ణయం తీసుకుంది. ఎయిర్బస్, బోయింగ్ ఈ రెండు సంస్థల నుంచి పదివేల బిలియన్ల డాలర్ల విలువైన 500 ప్యాసింజర్ విమానాలు కొనుగోలు చేసేందుకు ఆర్డర్ పెట్టినట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. వాటి విలువ సుమారు రూ.80వేల కోట్లు ఉండనుందని అంచనా. ఆర్డర్ ఇచ్చిన వాటిలో 400 నారో బాడీ జెట్లు, 100 లేదా అంతకంటే ఎక్కువ వైడ్ బాడీ ఎయిర్ క్రాఫ్ట్లు ఉండగా.. డజన్ల కొద్దీ ఎయిర్బస్ ఏ350లు, బోయింగ్ 787లు, బోయింగ్ 777లు ఉన్నాయి. అదే జరిగితే బిలియన్ డాలర్ల విమానాల కొనుగోలుతో 10 ఏళ్ల క్రితం అమెరికన్ ఎయిర్ లైన్ కొనుగోళ్లను టాటా అధిగమిస్తుందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. దశాబ్ధం క్రితం అమెరికన్ ఎయిర్లైన్స్ 460 ఎయిర్బస్, బోయింగ్ జెట్ల ఆర్డర్ పెట్టింది. నారో బాడీ ఎయిర్ క్రాఫ్ట్, వైడ్ బాడీ విమానాల మధ్య వ్యత్యాసం ట్యూబ్ షేప్లో విమానంలోని ప్యాసింజర్లకు కూర్చునే(మెయిన్ బాడీ), వెడల్పు పెద్దగా ఉండి..రో’ (అడ్డం)లో ఎక్కువ సీట్లు ఉంటే వైడ్ బాడీ ఎయిర్ క్రాఫ్ట్ అంటారు. ఉదాహారణకు ఈ వైడ్ బాడీ విమానం రౌండ్గా 5 నుంచి 6 మీటర్లు ఉండి..అడ్డంగా 9 సీట్లు ఉంటే ప్రతి మూడు సీట్ల మధ్య నడించేందుకు కాళీ ప్రదేశం ఉంటుంది. అలా 9 సీట్ల మధ్యలో ప్రయాణికులు నడించేందుకు రెండు దార్లు ఉంటాయి. ప్రతి మూడు ఈ విమానంలో 10..10 సీట్ల మధ్య ఖాళీగా ఉంటుంది. అదే నారో బాడీ ఎయిర్ క్రాఫ్ట్ బాడీ రౌండ్గా 3 నుంచి 4 మీటర్లు ఉండి.. అడ్డంగా 3 నుంచి 6 సీట్లు ఉంటాయి. ప్రతి మూడు సీట్ల మధ్య నడించేందుకు ఒక్క దారి మాత్రమే ఉంటుంది. -
బోయింగ్కు ఆజాద్ ఎన్ఏఎస్ విడిభాగాలు
హైదరాబాద్: విమానాల తయారీ దిగ్గజం బోయింగ్కు తొలి విడిభాగాల కన్సైన్మెంట్ను అందించినట్లు ఆజాద్ ఇంజినీరింగ్ తెలిపింది. జాతీయ ఏరోస్పేస్ ప్రమాణాలకు (ఎన్ఏఎస్) అనుగుణంగా వీటిని ఉత్పత్తి చేసినట్లు వివరించింది. వివిధ బోయింగ్ విమానాలకు అవసరమైన కీలక ఏరోస్పేస్ భాగాలు వీటిలో ఉన్నట్లు సంస్థ వ్యవస్థాపకుడు రాకేష్ చాప్దర్ తెలిపారు. ప్రతిష్టాత్మక ఆత్మనిర్భర భారత్ నినాదంలో భాగంగా హైదరాబాద్లో అదనంగా మరో యూనిట్ను ప్రారంభిస్తున్నట్లు వివరించారు. ఏరోస్పేస్, రక్షణ తదితర రంగాలకు అవసరమైన ఉత్పత్తులను ఆజాద్ ఇంజినీరింగ్ తయారు చేస్తోంది. -
మిధానితో బోయింగ్ జట్టు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఏరోస్పేస్ రంగంలో వినియోగించే పరికరాలకు అవసరమైన ముడి వస్తువులను దేశీయంగానే అభివృద్ధి చేసే అంశంపై మిశ్ర ధాతు నిగమ్ (మిధాని)తో కలిసి పనిచేసే అవకాశాలు పరిశీలిస్తున్నట్లు బోయింగ్ ఇండియా వెల్లడించింది. ఏరోస్పేస్, రక్షణ రంగంలో భారత్ స్వయం సమృద్ధి సాధించేందుకు ప్రత్యేకమైన మెటీరియల్స్, మిశ్రమ లోహాల లభ్యత కీలకమని పేర్కొంది. భారత్లోని తమ సరఫరా వ్యవస్థలో ప్రభుత్వ రంగ సంస్థలు ముఖ్య పాత్ర పోషిస్తున్నాయని బోయింగ్ ఇండియా ప్రెసిడెంట్ సలిల్ గుప్తే తెలిపారు. అధునాతన టెక్నాలజీ ఉత్పత్తులను దేశీయంగానే తయారు చేసే సామర్థ్యాలను పెంచుకునేందుకు బహుళ జాతి సంస్థలతో కలిసి పనిచేయాలన్న తమ లక్ష్యానికి అనుగుణంగా ఈ భాగస్వామ్యం ఉండగలదని మిధాని సీఎండీ సంజయ్ కుమార్ ఝా తెలిపారు. చదవండి: ఆ కారు క్రేజ్ వేరబ్బా, రెండేళ్లు వెయిటింగ్.. అయినా అదే కావాలంటున్న కస్టమర్లు! -
రాకేశ్ఝున్ఝున్వాలా.. ఆకాశ.. మ్యాక్స్ 737
న్యూఢిల్లీ: మార్కెట్ బిగ్బుల్ రాకేశ్ ఝున్ఝున్వాల నుంచి వస్తోన్న ఆకాశ ఎయిర్లైన్స్ కొత్త విమానాలను కొనుగోలు చేస్తోంది. అందులో భాగంగా తాజాగా ఆకాశ ఎయిర్ ఖాతాలో బోయింగ్ 737 మ్యాక్స్ వచ్చి చేరింది. 2021 నవంబర్లో ఆకాశ ఎయిర్, బోయింగ్ మధ్య ఒక ఒప్పందం కుదిరింది. దీని ప్రకారం బోయింగ్ నుంచి మ్యాక్స్ రకం 72 విమానాలను ఆకాశ కొనుగోలు చేయనుంది. తొలి విమానం గురువారం డెలివరీ అందుకున్నట్టు కంపెనీ ప్రకటించింది. 2023 మార్చి నాటికి 18 విమానాలు సంస్థకు చేరనున్నాయి. మిగిలినవి తదుపరి నాలుగేళ్లలో అడుగుపెడతాయి. చదవండి: విమాన చార్జీలను 15% పెంచాలి -
రాకేష్ ఝున్ఝున్వాలా టార్గెట్ ఇదే: 'ఆకాశ'..ఫస్ట్ లుక్!
సామాజిక, ఆర్థిక నేపథ్యంతో సంబంధం లేకుండా అతి తక్కువ ధరకే విమాన ప్రయాణ సౌకర్యం కల్పించేందుకు స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్ రాకేష్ ఝున్ఝున్ వాలా ఆకాశ ఎయిర్ పేరుతో విమాన సంస్థను ప్రారంభించారు. తాజాగా ఆ సంస్థకు చెందిన విమానాల ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రాకేష్ ఝున్ఝున్ వాలాకు చెందిన ఆకాశ ఎయిర్ విమాన సేవలు ఈ ఏడాది జులై నుంచి అందుబాటులోకి రానున్నాయి. అయితే ఇప్పుటి వరకు ఆకాశ ఎయిర్ విమానాలు ఎలా ఉండబోతున్నాయి. వాటి కోడ్ ఏంటనే విషయాలో వెలుగులోకి రాలేదు. ఈ నేపథ్యంలో ఆకాశ ఎయిర్ తన సంస్థకు చెందిన విమాన రూపు రేఖల్ని ప్రజలకు పరిచయం చేసింది. విమానం ఆకారం, కలర్స్తో పాటు కోడ్లను వివరిస్తూ కొన్ని ఫోటోల్ని ట్వీట్ చేసింది. విమానాలకు కోడ్ ఏంటీ! దేశాన్ని బట్టి ఆయా సంస్థలకు చెందిన విమానాలకు కొన్ని కోడ్లు ఉంటాయి. ఉదాహరణకు..ఎయిర్లైన్కు 'క్యూపీ', ఇండిగో కోడ్ '6ఈ',గో ఫస్ట్ 'జీ8',ఎయిర్ ఇండియాకు 'ఏఐ' అని ఉంది. ఆకాశ ఎయిర్ సైతం తమ విమానాల కోడ్ ఏంటనేదీ రివిల్ చేసింది. కాంట్ కీప్ క్లైమ్! సే టూ హాయ్ అంటూ ఆకాశ ఎయిర్ విమానం కోడ్ 'క్యూపీ- పీఐఈ'! ట్వీట్లో పేర్కొంది. Coming soon to Your Sky! ✈️#AvGeek pic.twitter.com/nPpR3FMpvg — Akasa Air (@AkasaAir) May 23, 2022 ఆకాశ ఎయిర్ సీఈవో వినయ్ దుబే తాము ముందుగా ప్రకటించిన సమయానికే ఆకాశ ఎయిర్ విమాన సర్వీసులు ప్రారంభం అవుతాయి. జున్ 2022కంటే ముందుగా ఫస్ట్ ఎయిర్ క్రాప్ట్ డెలివరీ అవుతుంది. జులై 2022 నాటికి ఆకాశ ఎయిర్ కమర్షియల్ ఆపరేషన్ను ప్రారంభింస్తామని ఆకాశ ఎయిర్ సీఈవో వినయ్ దుబే తెలిపారు. బోయింగ్తో ఒప్పందం రాకేష్ ఝున్ఝున్ వాలా ఆకాశ ఎయిర్ విమానాల్ని తయారు చేసేందుకు అమెరికాకు చెందిన విమానాల తయారీ సంస్థ బోయింగ్తో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఝున్ఝున్ వాలా గతేడాది నవంబర్ 26,2021న బోయింగ్ సంస్థతో 72 మ్యాక్స్ విమానాల్ని కొనుగోలు చేశారు. వీటితో పాటు 72బోయింగ్ 737మ్యాక్స్ ఎయిర్ క్రాప్ట్లు కూడా ఉన్నాయి. ఆ సంస్థ మొత్తం విమానాల్ని తయారు చేసి ఆకాశ ఎయిర్కు అప్పగించనుంది. ఇందులో భాగంగా బోయింగ్ కంపెనీ తొలి ఎయిర్ క్రాప్ట్ ను ఏ ఏడాది జున్ నాటికి ఆకాశ ఎయిర్కు అందించనుంది. Can’t keep calm! Say hi to our QP-pie! 😍#AvGeek pic.twitter.com/sT8YkxcDCV — Akasa Air (@AkasaAir) May 23, 2022 సాధ్యమేనా! కాంపిటీషన్, ఫ్లైట్ల నిర్వహణతో పాటు పెరిగిపోతున్న ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్, కరోనా కారణంగా ప్రపంచ దేశాల్లో విమానాల రాకపోకలపై ఆంక్షలు విధించడంతో పాటు ఇతర కారణాల వల్ల గడిచిన 10ఏళ్లలో పెద్ద సంఖ్యలో ఆయా విమాన సంస్థలు తమ సర్వీసుల్ని పూర్తిగా రద్దు చేశాయి. పదుల సంఖ్యలో విమానాలు ప్రభుత్వం ఆధీనంలో సేవలందిస్తున్న ఎయిర్ ఇండియా సైతం నష్టాలకు తట్టుకోలేక టాటా కంపెనీకి అమ్మేసింది. రతన్ టాటా ఎయిర్ ఇండియా కొనుగోలు చేయడంతో కష్టాల నుంచి గట్టెక్కితే మిగిలిన సంస్థలు అప్పుల ఊబిలో కూరుకుపోయి.. కార్యకాలాపాల్ని నిలిపివేశాయి. వాటిలో వాయిదూత్ ఎయిర్ లైన్స్, సహార ఎయిర్ లైన్స్, ఎండీఎల్ ఆర్ ఎయిర్లైన్స్, డక్కన్ ఎయిర్ వేస్ లిమిటెడ్, దర్బంగా ఏవియేషన్, దమానియా ఎయిర్ వేస్, గుజరాత్ ఎయిర్ వేస్, ఎయిర్ కోస్టా, ఎయిర్ కార్నివాల్, జెట్ ఎయిర్ వేస్, ఎయిర్ మంత్రా, కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్లు ఉన్నాయి. సుమారు రూ.66వేల కోట్లు ఈ క్రమంలో రాకేష్ ఝున్ఝున్వాలా 'ఆకాశ ఎయిర్' బ్రాండ్ కింద ఎస్ఎన్వీ ఏవియేషన్ ప్రైవేటు లిమిటెడ్ సంస్థను ఏర్పాటు చేశారు. నవంబర్ 16న ఆ కంపెనీ 72 బోయింగ్ 737 మ్యాక్స్ విమానాల్ని ఆర్డర్ చేసింది. ఈ ఒప్పందం విలువ దాదాపు 9 బిలియన్ డాలర్లు(సుమారు రూ. 66 వేల కోట్లు) గా ఉంది. అయితే ఇండస్ట్రీలో నిలదొక్కుకొని అప్పుల్లో కూరుకుపోవడంతో పెద్ద సంఖ్యలో ఏవియేషన్ సంస్థలు సర్వీసుల్ని నిలిపివేస్తే..ఇప్పుడు ఆకాశ ఎయిర్తో కొత్త విమాన సర్వీసుల్ని ప్రారంభించడం కత్తి మీద సామేనని మార్కెట్ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. చదవండి👉రాకేష్ ఝున్ఝున్వాలా టార్గెట్ అదే, రూ.66వేల కోట్లతో..! -
చైనా విమాన ప్రమాదంలో సంచలన విషయాలు.. పైలెట్లు కావాలనే అలా...
బీజింగ్: చైనా ఈస్ట్రన్ ఎయిర్లైన్స్ విమాన ప్రమాద ఘటనలో సంచలన విషయాలు బయటపడుతున్నాయి. విమానాన్ని పైలట్లే ఉద్దేశపూర్వకంగా కూల్చేసి ఉండొచ్చని దర్యాప్తు అధికారులు అంచనా వేస్తున్నారు. బ్లాక్బాక్స్ డేటా విశ్లేషణలో ఈ విషయం తెలిసింది. విమానం ఎత్తు ఒక్కసారిగా తగ్గడాన్ని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ గుర్తించి.. వెంటనే పైలట్లను సంప్రదించేందుకు పలుమార్లు ప్రయత్నించింది. కానీ, పైలట్ల నుంచి ఎలాంటి సమాధానం రాలేదని అధికారులు తెలిపారు. దీనిని బట్టి కాక్పిట్లో ఉన్న సిబ్బందే కావాలని విమానం ఎత్తును ఒక్కసారిగా కిందకు దించి కూల్చేసి ఉంటారని అంచనాకు వచ్చినట్టు తెలుస్తోంది. దీనిపై బోయింగ్ గానీ, చైనా అధికారుల నుంచి గానీ ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. బోయింగ్ 737 మార్చి 21న గుయాంగ్జీ ప్రాంతంలో కుప్పకూలింది. 123 మంది ప్రయాణికులు, 9 మంది సిబ్బందిలో ఏ ఒక్కరూ ప్రాణాలతో బయటపడలేదు. చదవండి👇 మీరొస్తానంటే.. నేనొద్దంటా! చైనాలో ఘోర విమాన ప్రమాదం.. మొత్తం 132 మంది మృతి! -
బోయింగ్, ఎయిర్బస్లతో టాటా కీలక చర్చలు.. కారణం ఇదే
సుమారు డెబ్భై ఏళ్ల తర్వాత ఎయిరిండియాను సొంతం చేసుకుంది టాటా. ప్రస్తుతం ఏవియేషన్ సెక్టార్లో ఉన్న పరిస్థితులకు తగ్గట్టుగా ఆధునీకరణ పనులు చేపడుతోంది.ఈ మేరకు ఈ రంగంలో దిగ్గజ కంపెనీలైన ఎయిర్బస్, బోయింగ్ సంస్థలతో టాటా గ్రూపు చర్చలు జరుపుతోంది. ప్రభుత్వం నుంచి ఎయిరిండియాను టాటా ఇటీవల దక్కించుకుంది. ఈ క్రమంలో చిన్నా పెద్దా అంతా కలిసి 150 విమానాలు ఎయిరిండియాకు ఉన్నాయి. అయితే ఇందులో చాలా వరకు విమానాలు పాతవై పోయాయి. వీటి మెయింటనెన్స్ అండ్ మోడిఫికేషన్కి రూ. 7,500 వరకు ఖర్చు వస్తుందనే అంచనాలు ఉన్నాయి. దీంతో ఈ పనిని పరిమితంగా చేపట్టి.. ఇప్పటి ట్రెండ్కి తగ్గట్టుగా కొత్త విమానాల కొనుగోలకు టాటా ఆసక్తి చూపుతుందంటూ బ్లూబెర్గ్ కథనం ప్రచురించింది. ప్రపంచ వ్యాప్తంగా విమానాల తయారీలో బోయింగ్, ఎయిర్బస్ సంస్థలు ప్రసిద్ధి చెందాయి. ముఖ్యంగా బోయింగ్ సంస్థ భారీ విమానాలకు పర్యాయపదంగా ఉంది. దీంతో కొత్త విమానల తయారీ, తమ అవసరాలు తదితర అంశాలపై టాటా ప్రతినిధులు ఈ రెండు కంపెనీలతో చర్చలు చేపడుతున్నారు. ఇవి సఫలమైతే టాటా నుంచి అధికారిక సమాచారం వచ్చే అవకాశం ఉంది. -
Rakesh Jhunjhunwala: ఇక ‘ఆకాశ’మే హద్దుగా..
Rakesh Jhunjhunwala Akasa Air Ties Up With Boeing: భారత బిలియనీర్, స్టాక్ మార్కెట్ నిపుణుడు రాకేష్ ఝున్ఝున్వాలా స్టార్టప్ ఎయిర్లైన్ ‘ఆకాశ ఎయిర్’ నుంచి మరో అడుగు ముందుకు పడింది. కిందటి నెలలో సివిల్ ఏవియేషన్ నుంచి అనుమతులు పొందిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు ఆకాశ నుంచి బోయింగ్కు రూ.75,000 కోట్ల ఆర్డరు వెళ్లిందని సమాచారం. అతిత్వరలోనే 70 నుంచి 80 దాకా 737 మ్యాక్స్ విమానాలకు సంబంధించిన ఒప్పందాన్ని ఈ కంపెనీ కుదుర్చుకోనుందని వార్తాసంస్థ బ్లూమ్బర్గ్ పేర్కొంది. ఈనెల 14న మొదలయ్యే ‘దుబాయ్ ఎయిర్షో’లో అమెరికాకు(చికాగో) చెందిన బోయింగ్తో కుదుర్చుకునే ఒప్పందం గురించి ఆకాశ ప్రకటించే అవకాశం ఉందని ఆ వార్తా సంస్థ చెబుతోంది. అయితే ఆకాశ మాత్రం ఈ ఒప్పందంపై ఎలాంటి ప్రకటన వెలువరించలేదు. ప్రస్తుత ధరల ప్రకారం.. ఈ ఒప్పంద విలువ 10 బిలియన్ డాలర్ల (రూ.75,000 కోట్ల) వరకు ఉండొచ్చని అంచనా. తక్కువ ధరతో సామాన్యుడికి విమాన ప్రయాణం అందించాలన్న బిగ్బుల్(ఝున్ఝున్వాలా) ప్రయత్నం ఏమేర సక్సెస్ అవుతుందో చూడాలి మరి. అయితే ఒక వేళ బోయింగ్ ఈ ఆర్డరును పొందితే కనుక భారత్లో ఎయిర్బస్ సంస్థకు ఉన్న ఆధిపత్యాన్ని గండి పడినట్లే అవుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. వచ్చే ఏడాది వేసవికల్లా కార్యకలాపాలను మొదలుపెట్టాలని ఆకాశ ఎయిర్ ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. చదవండి: చేతిలో చిల్లిగవ్వ లేదు.. ఇంగ్లీష్ రాదు.. కానీ బిలియనీర్ అయ్యాడు -
భయపెట్టే బోయింగ్కి మళ్లీ అనుమతులు! ప్రజలేమంటున్నారు?
అతి పెద్ద విమానాలకు మరో పేరుగా స్థిరపడిన బోయింగ్ విమనాలు మళ్లీ భారత గగనతలంలో ప్రయాణానికి రెడీ అయ్యాయి. రెండున్నరేళ్ల నిషేధం తర్వాత బోయింగ్ ఫ్లైట్లను నడిపేందుకు విమానయాన సంస్థలకు డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అనుమతులు ఇచ్చింది. ప్రమాదాల జరగడం వల్లే జంబో విమానాల తయారీకి బోయింగ్ సంస్థ పెట్టింది పేరు. ప్రపంచ వ్యాప్తంగా ఈ సంస్థకు చెందిన విమానాలు ఏవియేషన్ సెక్టార్లో రాజ్యమేళాయి. అయితే బోయింగ్ 737 మ్యాక్స్ విమానంతో కథ అడ్డం తిగిరింది. యూరప్, అమెరికా, ఏషియా అని తేడా లేకుండా బోయింగ్ 737 మ్యాక్స్ విమానాలు ప్రమాదాల బారిన పడ్డాయి. దీంతో వరుసగా ఒక్కో దేశం ఈ విమానలను కమర్షియల్ సెక్టార్ నుంచి తొలగించాయి. భారత్ సైతం 2019 మార్చిలో బోయింగ్ విమానాలను రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. ఎప్పటి నుంచి రెండున్నరేళ్ల నిషేధం తర్వాత ఇటీవల బోయింగ్ 737 మ్యాక్స్ విమానాలు నడుపుకునేందుకు అనుమతులు ఇచ్చింది. దీంతో స్పైస్ జెట్ సంస్థ సెప్టెంబరు చివరి వారం నుంచి బోయింగ్ విమానాలు నడిపేందుకు రెడీ అవుతోంది. మరోవైపు దుబాయ్ ఇండియా మధ్య సర్వీసులు అందిస్తున్న సంస్థలు సైతం బోయింగ్ను ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతున్నాయి. ఈ విమానాలపై ఉన్న నిషేధాన్ని ఇప్పటికే అమెరికా, యూరప్ దేశాలు ఎత్తేయగా తాజగా ఆ జాబితాలో ఇండియా చేరింది. చైనా ఇప్పటికీ నిషేధాన్ని కొసాగిస్తోంది. పారదర్శకత ఏదీ బోయింగ్ విమానాల కమర్షియల్ ఆపరేషన్స్కి డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్స్ అనుమతులు ఇవ్వడంపై ప్రయాణికుల నుంచి మిశ్రమ స్పందన లభిస్తోంది. అనుమతులు ఇవ్వడం, రద్దు చేయడం అనేది డీజీసీఏ సొంత వ్యవహారం కాదంటున్నారు. ఏ కారణాల చేత అనుమతులు రద్దు చేశారు ? విమానంలో ఏ లోపాలను గుర్తించారు ? వాటిని ఆ సంస్థ సవరించిందా లేదా ? అనే వివరాలు ప్రజల ముందు ఉంచకుండా ప్రయాణాలకు అనుమతి ఇవ్వడం సరికాదంటున్నారు. ఈ విషయంలో ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహారించాలని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు బోయింగ్ విమానాలు తిరిగి అందుబాటులోకి రావడాన్ని కొందరు స్వాగతిస్తున్నారు. చదవండి: బంపర్ టూ బంపర్ ఇన్సురెన్స్ తప్పనిసరి..మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు -
ఫాంగ్ స్టాక్స్ దన్ను- మూడో రోజూ రికార్డ్స్
వరుసగా మూడో రోజు మంగళవారం యూఎస్ స్టాక్ మార్కెట్లు రికార్డులను నెలకొల్పాయి. ఎస్అండ్పీ 13 పాయింట్లు(0.4 శాతం) పుంజుకుని 3,444 వద్ద నిలవగా.. నాస్డాక్ 87 పాయింట్లు(0.76 శాతం) ఎగసి 11,466 వద్ద ముగిసింది. ఇవి చరిత్రాత్మక గరిష్టాలుకాగా.. డోజోన్స్ మాత్రం 60 పాయింట్లు(0.2 శాతం) క్షీణించి 28,249 వద్ద స్థిరపడింది. ఫాంగ్ స్టాక్స్ మరోసారి లాభపడటంతో నాస్డాక్ 2020లో 38వ సారి సరికొత్త రికార్డును సాధించింది. ఆక్స్ఫర్డ్ యూనివర్శిటీ సహకారంతో బ్రిటిష్ దిగ్గజం ఆస్ట్రాజెనెకా రూపొందిస్తున్న వ్యాక్సిన్ క్లినికల్ పరీక్షలు ప్రారంభంకావడంతో సెంటిమెంటు బలపడినట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. గురువారం జాక్సన్హోల్ వద్ద ఫెడరల్ రిజర్వ్ చైర్మన్ జెరోమ్ పావెల్ చేయనున్న ప్రసంగంపై ఇన్వెస్టర్లు తాజాగా దృష్టిపెట్టినట్లు తెలియజేశారు. యాపిల్ డీలా షేర్ల విభజన తదుపరి డోజోన్స్లో యాపిల్ ఇంక్ వెయిటేజీ నీరసించగా.. ఇండెక్స్లో చేపట్టిన ఇతర మార్పులు ప్రభావం చూపినట్లు నిపుణులు తెలియజేశారు. డోజోన్స్లో ఎక్సాన్ మొబిల్ స్థానే సేల్స్ఫోర్స్.కామ్కు చోటు లభిస్తుండగా.. హనీవెల్ ఇంటర్నేషనల్ రాకతో రేథియాన్ టెక్నాలజీస్ చోటు కోల్పోనుంది. ఈ బాటలో ఫైజర్ ఇంక్ను తోసిరాజని యామ్జెన్ ఇంక్ డోజోన్స్కు ప్రాతినిధ్యం వహించనున్నట్లు పేర్కొన్నారు. బోయింగ్ ఇంక్ 2 శాతం, యాపిల్ 1 శాతం చొప్పున క్షీణించడంతో డోజోన్స్ వెనకడుగు వేసింది. అయితే ఫేస్బుక్, అమెజాన్, గూగుల్, మైక్రోసాఫ్ట్ 3-1 శాతం మధ్య లాభపడటంతో ఎస్అండ్పీ, నాస్డాక్ రికార్డులు కొనసాగినట్లు నిపుణులు పేర్కొన్నారు. బెస్ట్ బయ్ వీక్ ప్రభుత్వం పేరోల్ ప్యాకేజీని పొడిగించకుంటే అక్టోబర్లో 19,000 మంది ఉద్యోగులకు ఉద్వాసన పలకనున్నట్లు ప్రకటించడంతో అమెరికన్ ఎయిర్లైన్స్ కౌంటర్ 2.2 శాతం డీలా పడింది. ఎలక్ట్రానిక్స్ చైన్ బెస్ట్ బయ్ అంచనాలను మించిన ఫలితాలు ప్రకటించినప్పటికీ వర్క్ ఫ్రమ్ హోమ్ కారణంగా క్యూ3లో అమ్మకాలు క్షీణించవచ్చని అంచనా వేసింది. దీంతో ఈ షేరు 4 శాతం పతనమైంది. ఇక క్యూ2లో పటిష్ట ఫలితాలు సాధించడంతో మెడ్ట్రానిక్స్ షేరు 2.5 శాతం ఎగసింది. -
వ్యాక్సిన్ హోప్- రెండో రోజూ రికార్డ్స్
వరుసగా రెండో రోజు సోమవారం యూఎస్ స్టాక్ మార్కెట్లు రికార్డులను నెలకొల్పాయి. ఎస్అండ్పీ 34 పాయింట్లు(1 శాతం) పుంజుకుని 3,431 వద్ద నిలవగా.. నాస్డాక్ 68 పాయింట్లు(0.6 శాతం) ఎగసి 11,380 వద్ద ముగిసింది. ఇవి చరిత్రాత్మక గరిష్టాలుకాగా.. ఎస్అండ్పీ తొలిసారి 3,400 మార్క్ను అధిగమించింది. ఇక డోజోన్స్ 378 పాయింట్లు(1.4 శాతం) జంప్చేసి 28,308 వద్ద స్థిరపడింది. తద్వారా ఆరు నెలల తదుపరి తిరిగి 28,000 పాయింట్ల మైలురాయిని అధిగమించింది. వెరసి ఫిబ్రవరి 12న సాధించిన చరిత్రాత్మక గరిష్టానికి 4.2 శాతం దూరంలో నిలిచింది. గత వారం 2.7 శాతం లాభపడటం ద్వారా నాస్డాక్ 2020లో 36వ సారి సరికొత్త రికార్డును సాధించిన విషయం విదితమే. ఆక్స్ఫర్డ్ యూనివర్శిటీ సహకారంతో బ్రిటిష్ దిగ్గజం ఆస్ట్రాజెనెకా రూపొందిస్తున్న వ్యాక్సిన్కు వాషింగ్టన్ ప్రభుత్వం త్వరితగతిన అనుమతివ్వనున్న వార్తలు సెంటిమెంటుకు బలాన్నిచ్చినట్లు నిపుణులు పేర్కొన్నారు. నవంబర్లో ప్రారంభంకానున్న అధ్యక్ష ఎన్నికలలోపే కోవిడ్-19 చికిత్సకు వినియోగించగల వ్యాక్సిన్కు గ్రీన్సిగ్నల్ ఇచ్చే వీలున్నట్లు తెలియజేశారు. ఇక మరోపక్క ప్లాస్మా చికిత్సను యూఎస్ఎఫ్డీఏ తాజాగా అనుమతించడాన్ని ఈ సందర్భంగా ప్రస్తావిస్తున్నారు. యాపిల్ భళా వ్యాక్సిన్ అనుమతులపై అంచనాలతో బ్రిటిష్ ఫార్మా దిగ్గజం ఆస్ట్రాజెనెకా షేరు 2 శాతం ఎగసింది. దీంతో ఎయిర్లైన్స్, క్రూయిజర్ కంపెనీల కౌంటర్లకు ఒక్కసారిగా డిమాండ్ పెరిగింది. వెరసి యునైటెడ్, డెల్టా ఎయిర్లైన్స్ 9 శాతం చొప్పున దూసుకెళ్లగా.. కార్నివాల్, నార్వేజియన్ క్రూయిజ్ లైన్, రాయల్ కరిబియన్ 10-5 శాతం మధ్య జంప్చేశాయి. ఈ బాటలో బోయింగ్ 6.5 శాతం జంప్చేసింది. ఇక ఫాంగ్ స్టాక్స్లో ఫేస్బుక్, యాపిల్, అమెజాన్, అల్ఫాబెట్ 1.6-0.6 శాతం మధ్య లాభపడ్డాయి. ప్రధానంగా ఐఫోన్ల దిగ్గజం యాపిల్ తొలిసారి 503 డాలర్ల వద్ద ముగిసింది. ఇతర కౌంటర్లలో ఎలక్ట్రిక్ కార్ల దిగ్గజం టెస్లా ఇంక్ షేరు 2 శాతం క్షీణించింది. ఆసియా లాభాల్లో యూఎస్ ఇండెక్సుల ప్రోత్సాహంతో ప్రస్తుతం ఆసియా మార్కెట్లలోనూ సానుకూల ధోరణి నెలకొంది. జపాన్, సింగపూర్, కొరియా, తైవాన్, ఇండోనేసియా, థాయ్లాండ్ 1.8-0.5 శాతం మధ్య జంప్ చేశాయి. ఇతర మార్కెట్లలో థాయ్లాండ్, చైనా 0.5-0.2 శాతం చొప్పున డీలాపడ్డాయి. -
కుప్పకూలిన యూఎస్ మార్కెట్లు
పాలసీ సమీక్షలో భాగంగా అమెరికా కేంద్ర బ్యాంకు.. ఫెడరల్ రిజర్వ్ ఈ ఏడాది దేశ జీడీపీ 6.5 శాతం క్షీణించవచ్చని అంచనా వేసింది. నిరుద్యోగ రేటు 9.3 శాతానికి పెరిగే వీలున్నట్లు పేర్కొంది. దీంతో ఒక్కసారిగా సెంటిమెంటుకు షాక్ తగిలింది. వెరసి గురువారం యూఎస్ మార్కెట్లలో అమ్మకాలు ఊపందుకున్నాయి. డోజోన్స్ 1862 పాయింట్లు(7 శాతం) కుప్పకూలి 25,128 వద్ద నిలవగా.. ఎస్అండ్పీ 188 పాయింట్లు(6 శాతం) పడిపోయి 3,002 వద్ద ముగిసింది. నాస్డాక్ సైతం 528 పాయింట్లు(5.3 శాతం) క్షీణించి 9,493 వద్ద స్థిరపడింది. తద్వారా మార్కెట్లు ఏప్రిల్ 16 తదుపరి ఒకే రోజులో అత్యధిక నష్టాలు చవిచూశాయి. కాగా.. యూరోపియన్ మార్కెట్లు సైతం గురువారం 4.5 శాతం స్థాయిలో పతనంకావడం గమనార్హం! మరోసారి లాక్డవున్ ఇప్పటికే 20 లక్షల మందికిపైగా సోకిన కరోనా వైరస్ మరోసారి విజృంభించవచ్చన్న అంచనాలు ఇటీవల తలెత్తుతున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. ఫలితంగా మరోసారి లాక్డవున్ విధించవలసిన పరిస్థితులు ఏర్పడవచ్చని కొంతమంది ఆర్థికవేత్తలు భావిస్తున్నట్లు తెలియజేశారు. దీనికితోడు అమెరికా జీడీపీ తీవ్ర మాంద్య పరిస్థితులను ఎదుర్కోనున్న అంచనాలు ఇన్వెస్టర్లలో ఆందోళనలకు కారణమైనట్లు వివరించారు. కోవిడ్-19 కారణంగా సెప్టెంబర్కల్లా మరణాల సంఖ్య 2 లక్షలను దాటవచ్చన్న అంచనాలు సైతం సెంటిమెంటును దెబ్బతీసినట్లు పేర్కొన్నారు. బోయింగ్ పతనం వైమానిక రంగ దిగ్గజం బోయింగ్ ఇంక్ షేరు దాదాపు 17 శాతం కుప్పకూలగా.. క్రూయిజర్, ఎయిర్లైన్ కంపెనీల కౌంటర్లలో గురువారం మళ్లీ అమ్మకాలు ఊపందుకున్నాయి. రాయల్ కరిబ్బియన్, ఎస్పీ కామెయిర్ 14 శాతం చొప్పున పతనంకాగా.. నార్వేజియన్ క్రూయిజ్ లైన్ 16.5 శాతం పడిపోయింది. ఇతర బ్లూచిప్స్లో డోఇంక్, ఐబీఎం, గోల్డ్మన్ శాక్స్, కేటర్పిల్లర్, ఎక్సాన్ మొబిల్, జేపీ మోర్గాన్, సిస్కో, ఫైజర్, వాల్ట్డిస్నీ, అమెరికన్ ఎక్స్ప్రెస్, నైక్, ఇంటెల్, కోక కోలా, మెర్క్, మైక్రోసాఫ్ట్, యాపిల్, జాన్సన్ అండ్ జాన్సన్ తదితరాలు 10-5 శాతం మధ్య పతనమయ్యాయంటే అమ్మకాల తీవ్రతను అర్ధం చేసుకోవచ్చు. -
12 వేల మందిని తొలగించనున్న బోయింగ్
సాక్షి, న్యూఢిల్లీ : ప్రముఖ విమానాల తయారీ సంస్థ బోయింగ్ భారీ స్థాయిలో ఉద్యోగులపై వేటు వేయనుంది. కరోనా వైరస్, లాక్డౌన్ కారణంగా విమానయాన రంగం కుదేలైంది. ఈ నేపథ్యంలో బోయింగ్ సుమారు 12వేల మందిని తొలగించేందుకు నిర్ణయించింది. రాబోయే కొద్ది నెలల్లో అనేక వేల ఉద్యోగాలను తొలగించనున్నామని బోయింగ్ ప్రతినిధి బుధవారం తెలిపారు. అయితే ఎంతమంది అనేది స్పష్టంగా పేర్కొనలేదు. కోవిడ్-19 మహమ్మారి వైమానిక పరిశ్రమను ఘోరంగా దెబ్బతీసిందని, దీంతో రాబోయే కొన్నేళ్లలో వాణిజ్య జెట్ల తయారీని బాగా తగ్గించనున్నామని బోయింగ్ సీఈవో డేవిడ్ కాల్హౌన్ ఉద్యోగులకు అందించిన సమాచారంలో తెలిపారు. 6770 అమెరికా ఉద్యోగులను ఈ వారంలో తొలగిస్తామనీ, మరో 5,520 మంది స్వచ్ఛందంగా సంస్థను వీడడానికి అంగీకరించారని వెల్లడించారు. తమ ఉద్యోగుల్లో 10 శాతం తగ్గించుకుంటామని డేవిడ్ చెప్పారు. అంతర్జాతీయంగా కూడా ఉద్యోగ కోతలు ఉంటాయన్నారు. (విమానం ఎక్కుతానని ఎప్పుడూ అనుకోలేదు) మరోవైపు ఏడాది క్రితం ఇదే సమయంతో పోలిస్తే విమాన ప్రయాణీకుల సంఖ్య 89 శాతం తగ్గిందని ట్రాన్స్పోర్టేషన్ సెక్యూరిటీ అడ్మినిస్ట్రేషన్ మంగళవారం వెల్లడించింది. కాగా లాక్డౌన్ కఠిన ఆంక్షల కారణంగా ప్రపంచవ్యాప్తంగా విమాన ప్రయాణాలు స్థంబించిపోయాయి. ప్రస్తుతం కాస్త పుంజుకున్నప్పటికీ, అమెరికాలో విమానయాన రంగ ఆదాయం ఏప్రిల్ మధ్య కాలంలో 96 శాతం పడిపోయింది. -
రాష్ట్రంలో ‘బోయింగ్’ కార్యకలాపాల విస్తరణ
సాక్షి, హైదరాబాద్: విమానాల తయారీ సంస్థ ‘బోయింగ్ ఇంటర్నేషనల్’భవిష్యత్తులో రాష్ట్రంలో తమ కార్యకలాపాలను విస్తరించే యోచనలో ఉన్నట్లు సూత్రప్రాయంగా వెల్లడించింది. ఆ సంస్థ అధ్యక్షుడు మైఖేల్ ఆర్థర్, బోయింగ్ ఇండియా అధ్యక్షుడు సలిల్ గుప్తే, ఎండీ సురేంద్ర అహుజా, డైరెక్టర్ అశ్వినీ భార్గవ తదితరులు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్తో సోమవారం హైదరాబాద్లో భేటీ అయ్యారు. రాష్ట్ర పారిశ్రామిక విధానం టీఎస్–ఐపాస్ ప్రత్యేకతలతో పాటు, ఏరోస్పేస్ రంగం అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై బోయింగ్ ఇంటర్నేషనల్ బృందంతో కేటీఆర్ చర్చించారు. గత ఐదేళ్లలో ఏరోస్పేస్, డిఫెన్స్ రంగంలో రాష్ట్రానికి భారీ పెట్టుబడులు వచ్చినట్లు వెల్లడించారు. బోయింగ్ సంస్థకు చెందిన టెక్నాలజీ, ఇంజనీరింగ్ డివిజన్లను రాష్ట్రంలో ఏర్పాటు చేయాల్సిందిగా కోరారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఐటీ సంస్థలు గూగుల్, మైక్రోసాఫ్ట్, ఫేస్బుక్, అమెజాన్, సేల్స్ ఫోర్స్ హైదరాబాద్లో తమ కార్యాలయాలను ఏర్పాటు చేసిన విషయాన్ని ప్రస్తావించారు. ఏరోస్పేస్ రంగానికి చెందిన ప్రముఖ సంస్థల భాగస్వామ్యంతో హైదరాబాద్లో ప్రపంచ స్థాయి ప్రమాణాలతో కూడిన ఏరోస్పేస్ యూనివర్సిటీని ఏర్పాటు చేసే యోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉందని, ఇందులో బోయింగ్ సంస్థ కీలకంగా వ్యవహరించాలని కేటీఆర్ కోరారు. సమావేశంలో ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ పాల్గొన్నారు. -
బోయింగ్ సీఈవో డెనిస్కు ఉద్వాసన
న్యూయార్క్: మ్యాక్స్ ఎయిర్క్రాఫ్ట్ల వివాదం కారణంగా ప్రతిష్ట మసకబారడంతో .. విమానాల తయారీ దిగ్గజం బోయింగ్ దిద్దుబాటు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా డెనిస్ ములెన్బర్గ్ను చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈవో) పదవి నుంచి తప్పించింది. ప్రస్తుతం బోర్డ్ చైర్మన్గా వ్యవహరిస్తున్న డేవిడ్ కాలోన్కు సీఈవో, ప్రెసిడెంట్ బాధ్యతలు అప్పగించింది. నియంత్రణ సంస్థలు, కస్టమర్లు, ఇతర వర్గాలతో సంబంధాలను మెరుగుపర్చుకునేందుకు, వారి విశ్వాసం చూరగొనేందుకు ఈ మార్పులు అవసరమని బోయింగ్ పేర్కొంది. పూర్తి పారదర్శకంగా పనిచేసేందుకు కట్టుబడి ఉన్నామని ఒక ప్రకటనలో తెలిపింది. దీని ప్రకారం డెనిస్ ములెన్బర్గ్ తక్షణమే పదవి నుంచి తప్పుకోనున్నారు. వచ్చే ఏడాది జనవరి 13న కాలొన్ కొత్త బాధ్యతలు చేపడతారని బోయింగ్ తెలిపింది. ఈలోగా చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ గ్రెగ్ స్మిత్.. తాత్కాలిక సీఈవోగా వ్యవహరిస్తారని వివరించింది. 737 మ్యాక్స్ రకానికి చెందిన రెండు విమానాలు కుప్పకూలడంతో ఈ విమానాలను పూర్తిగా పక్కన పెట్టాల్సి వచ్చిన సంగతి తెలిసిందే. -
నేలకు దిగిన బోయింగ్ ఆశలు!
కేప్ కెనవెరాల్: అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్ఎస్)లోకి ప్రవేశించాలన్న లక్ష్యంతో నింగిలోకి దూసుకెళ్లిన బోయింగ్ కంపెనీ స్టార్లైనర్ క్రూ క్యాప్సూ్యల్ డమ్మీ అంతరిక్ష నౌక ఆదివారం న్యూమెక్సికోలోని ఎడారిలో సురక్షితంగా ల్యాండైంది. అయితే అంతరిక్ష కేంద్రంలోకి వెళ్లకుండానే వెనుదిరిగి రావడంతో వచ్చే ఏడాది వ్యోమగాములతో చేయాల్సిన ప్రయోగంపై నీలినీడలు కమ్ముకున్నాయి. కిందకు దిగే క్రమంలో మూడు పారాచ్యూట్లు తెరుచుకోవడంతోపాటు ఎయిర్బ్యాగులు కూడా సరిగా పనిచేయడం వల్ల సురక్షితంగా ల్యాండ్ అయ్యింది. వారం రోజులకు పైగా అంతరిక్ష కేంద్రంలో ఉండాల్సిన నౌక.. కేవలం ప్రయోగించిన రెండు రోజులకే వెనుదిరగాల్సి వచ్చింది. సురక్షిత ల్యాండింగ్ కావడం కొంతమేర సానుకూల అంశం. నాసా భాగస్వామ్యంతో నిర్మించిన స్టార్లైనర్ క్యాప్సూ్యల్ డమ్మీ అంతరిక్ష నౌకను మానవరహితంగా ఫ్లోరిడాలోని కేప్ కెనవెరాల్ స్పేస్ సెంటర్ నుంచి శుక్రవారం ప్రయోగించారు. అట్లాస్–5 రాకెట్తో నింగిలోకి ఎగిరిన స్టార్లైనర్ 15 నిమిషాలకు దాని నుంచి వేరుపడింది. అయితే ఆ తర్వాత కొన్ని నిమిషాలకు తమ అంతరిక్ష నౌక నిర్దేశిత కక్ష్య నుంచి దారి తప్పిందంటూ బోయింగ్ ట్వీట్ చేసింది. దాన్ని సరైన కక్ష్యలోకి తెచ్చే ప్రయత్నాల్లో తాము నిమగ్నమైనట్లు తెలిపింది. వచ్చే ఏడాది వ్యోమగాములను స్టార్లైనర్ ద్వారా అంతరిక్ష యాత్రకు పంపాలని సంకల్పించిన క్రమంలో తాజా వైఫల్యం తీవ్ర ఆందోళన కలిగించే అంశం కానుంది. వచ్చే ఏడాది స్టార్లైనర్ కాప్సూ్యల్లో ముగ్గురు వ్యోమగాములను పంపేందుకు బోయింగ్ సన్నాహాలు చేస్తోంది. -
వచ్చే 20 ఏళ్లలో 2,400 కొత్త విమానాలు అవసరం
న్యూఢిల్లీ: పెరుగుతున్న విమాన ప్రయాణికుల రద్దీ దృష్యా వచ్చే 20 ఏళ్లలో భారత్కు 2,400 నూతన ఎయిర్క్రాఫ్ట్స్ అవసరం ఉందని గ్లోబల్ ఏరోస్పేస్ దిగ్గజం బోయింగ్ అంచనా వేసింది. వీటిలో 85–90 శాతం వరకు నారో–బాడీ ఎయిర్క్రాఫ్ట్స్ (737 సైజ్, సింగిల్–ఏసిల్ విమానాలు) వినియోగం ఉండనుందని సంస్థ మార్కెటింగ్ డిప్యూటీ వైస్ ప్రెసిడెంట్ డారెన్ హల్ట్స్ అన్నారు. వ్యాపార అభివృద్ధి, మారుతున్న మార్కెట్ పరిస్థితులు, ఆర్థిక వృద్ధి ఆధారంగా ఈ అంచనాను వెల్లడించినట్లు చెప్పారు. ఇక ప్రస్తుత భారత విమానయానంలో 600 ఎయిర్క్రాఫ్ట్స్ ఉన్నాయి. -
వాయుసేన అమ్ములపొదిలో అపాచీ యుద్ద హెలికాప్టర్లు
-
వాయుసేన అమ్ములపొదిలో అపాచీ యుద్ద హెలికాప్టర్లు
న్యూఢిల్లీ: భారత వాయుసేన ఆధునీకరణ దిశగా పెద్ద ముందడుగు పడింది. వాయుసేన అమ్ములపొదిలోకి తాజాగా ఎనిమిది అత్యాధునిక యుద్ధ హెలికాప్టర్లు వచ్చి చేరాయి. అమెరికాలో తయారైన అపాచీ ఏహెచ్-64ఈ (ఐ) హెలికాప్టర్లు మంగళవారం భారత్ చేరాయి. పఠాన్కోట్ ఎయిర్బేస్లో వీటిని వాయుసేన స్వాధీనం చేసుకుంది. వాయుసేనకు చెందిన125 హెలికాప్టర్ యూనిట్ ’గ్లాడియేటర్స్’ ఈ అత్యాధునిక హెలికాప్టర్లు వినియోగించనున్నారు. వాయుసేన అమ్ములపొదిలోకి ఈ హెలికాప్టర్లు చేరిన సందర్భంగా వాటిని ఐఏఎఫ్ చీఫ్ బీఎస్ ధనోవా, ఎయిర్ మార్షల్ ఆర్ నంబియార్ పరిశీలించారు. అమెరికా నుంచి ఈ యుద్ధ హెలికాప్టర్లను భారత్ దిగుమతి చేసుకొంది. వీటిని కొనుగోలు చేసేందుకు 2015లోనే భారత్ అమెరికా రక్షణ సంస్థ బోయింగ్తో 1.1 బిలియన్ డాలర్ల ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ప్రకారం 2022నాటికి భారత వాయుసేనలోకి మొత్తం 22 అపాచీయుద్ధ హెలికాప్టర్లు వచ్చి చేరనున్నాయి. మొత్తం నాలుగు దశల్లో వీటిని బోయింగ్ భారత్కు అప్పగించనుంది. ప్రస్తుతం భారత వాయుసేన సోవియట్ నాటి ఎంఐ-25, ఎంఐ 35 హెలికాప్టర్లను వినియోగిస్తోంది. వీటి స్థానంలో అపాచీ హెలికాప్టర్లను వాయుసేన ఇకనుంచి వినియోగించనుంది. పాకిస్థాన్ సరిహద్దులకు కొద్ది దూరంలోనే ఉన్న పఠాన్ కోట్ ఎయిర్బేస్లో ఈ యుద్ధ హెలికాప్టర్లలోని నాలుగింటిని వాయుసేన మోహరించనుంది. -
‘ఎయిర్ట్రాఫిక్’పై ఏఏఐ, బోయింగ్ జట్టు
న్యూఢిల్లీ: భారత్లో విమానాల నిర్వహణ వ్యవస్థను ఆధునీకరించేందుకు ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఏఏఐ)తో కలిసి పదేళ్ల కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయనున్నట్లు బోయింగ్ తెలియజేసింది. ఈ రోడ్మ్యాప్ను రూపొందించేందుకు తాము సాంకేతిక సహకారం అందించేలా ఒప్పందం కుదుర్చుకున్నట్లు ప్రకటించింది. ఈ కార్యాచరణ ప్రణాళిక 18 నెలల్లో సిద్ధం కావచ్చని, అమెరికా ట్రేడ్ అండ్ డెవలప్మెంట్ ఏజెన్సీ(యూఎస్టీడీఏ) నిధులతో దీన్ని చేపట్టనున్నామని సంస్థ తెలిపింది. దేశవ్యాప్తంగా ప్రస్తుతం ఏఏఐ నేతృత్వంలో 125 విమానాశ్రయాలను కొనసాగుతున్నాయి. అంతర్జాతీయంగా, స్థానికంగా ఉన్న అత్యుత్తమ ప్రమాణాలకు లోబడి జాతీయ ఎయిర్స్పేస్ వ్యవస్థను ఆధునీకరించడానికి ఈ రోడ్మ్యాప్ మార్గదర్శకత్వం వహిస్తుంది. ఎయిర్స్పేస్ సామర్థ్యాన్ని గరిష్ట స్థాయిలో వినియోగించుకునేలా, కమ్యూనికేషన్స్ను పెంచడం, నిఘా, విమానాల రద్దీ నియంత్రణలోనూ ఈ రోడ్మ్యాప్ ఉపకరిస్తుందని బోయింగ్ పేర్కొంది. ఈ విషయంలో డీజీసీఏతోనూ కలసి పనిచేస్తామని ప్రకటించింది. ఆధునిక టెక్నాలజీలు, అంతర్జాతీయ విధానాలను అమలు చేయడం ద్వారా భారత్ తన గగనతల సామర్థ్యాన్ని గణనీయంగా పెంచుకోగలదని ఏఏఐ చైర్మన్ గురుప్రసాద్ మొహపాత్రా పేర్కొన్నారు. -
బోయింగ్కి చైనా షాక్