-
బీహార్ లో పురాతన నలంద యూనివర్సిటీని పరిశీలిస్తున్న మోదీ
-
రూ.12 కోట్ల వంతెన.. ప్రారంభానికి ముందే ఫసక్.. వీడియో వైరల్
పాట్నా: రూ.12 కోట్ల ప్రజాధనాన్ని వెచ్చించి నిర్మించిన ఓ బ్రిడ్జి ప్రారంభానికి కూడా నోచుకోకుండానే కూలిపోయింది. బీహార్లోని అరారియా జిల్లాలో బక్రా నదిపై కుర్సకాంత -సిక్తి మధ్య ప్రయాణ సౌలభ్యం కోసం ప్రభుత్వం రూ.12 కోట్లతో బ్రిడ్జిని నిర్మించింది. ప్రారంభోత్సవానికి సిద్దమైంది. అయితే అనూహ్యంగా ప్రారంభోత్సవానికి ముందే కూలిపోయింది. ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.బ్రిడ్జి కూలిపోవడంపై సిక్తి ఎమ్మెల్యే విజయ్ కుమార్ మాట్లాడుతూ.. నిర్మాణ సంస్థ యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగా బ్రిడ్జి కూలిపోయింది.విచారణ చేపట్టి సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు.బ్రిడ్జి కూలిన ఘటనలో ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగలేదని స్థానికులు చెబుతున్నారు. బ్రిడ్జ్ కూలిపోతుందనే ముందస్తు జాగ్రత్తతో స్థానికులు భయంతో పరుగులు తీశారు. దీంతో ప్రాణపాయం తప్పింది. #WATCH | Bihar | A portion of a bridge over the Bakra River has collapsed in Araria pic.twitter.com/stjDO2Xkq3— ANI (@ANI) June 18, 2024 -
‘నీట్’లో అక్రమాల ఆరోపణలు..
పట్నా: నీట్ ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారంలో బిహార్ పోలీసుల దర్యాప్తు మరింత పురోగతి సాధించింది. ఇప్పటికే ఈ కేసులో 13 మందిని అదుపులోకి తీసుకున్న బిహార్ ఆర్థిక నేరాల విభాగం(ఈఓయూ) పోలీసులు ఆరు చెక్కులను స్వాధీనం చేసుకున్నారు. ఒక్కో అభ్యర్థి నుంచి రూ.30 లక్షలు డిమాండ్ చేసిన మాఫియా ముఠా సభ్యులకు చెందాల్సినవిగా వీటిని భావిస్తున్నామని ఈఓయూ డీఐజీ మానవ్జీత్ సింగ్ ధిల్లాన్ ఆదివారం చెప్పారు. సంబంధిత బ్యాంకుల నుంచి ఆయా ఖాతాదారుల వివరాలను తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. అదేవిధంగా, పట్నాలో ప్రశ్నాపత్రాన్ని, జవాబులను అభ్యర్థులకు మాఫియా సభ్యులు వెల్లడించిన ఇంట్లో పాక్షికంగా కాల్చివేసిన ప్రశ్నాపత్రాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీనిని ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపారు. ఎన్టీఏ నుంచి రిఫరెన్స్ ప్రశ్నాపత్రం కోరామని, అది అందాక రెండింటిని సరిపోల్చుతామని డీఐజీ చెప్పారు. ఇప్పటి వరకు పోలీసులు అరెస్ట్ చేసిన వారిలో 9 మంది అభ్యర్థులతోపాటు నలుగురు ఎగ్జామినర్లున్నారు. వీరంతా బిహారీలే. అదేవిధంగా, ఈ లీకేజీ వ్యవహారంతో సంబంధమున్నట్లు అనుమానిస్తున్న బిహార్కే చెందిన మరో ఏడుగురు, యూపీ, మహారాష్ట్రలకు చెందిన ఓక్కో అభ్యర్థికి కూడా పోలీసులు నోటీసులు పంపారు. -
Bihar: గంగా నదిలో పడవ మునక.. నలుగురు గల్లంతు
పాట్నా: బిహార్ రాష్ట్రం పట్నా జిల్లాలో గంగా నదిలో పడవ మునిగిన ఘటనలో నలుగురు గల్లంతయ్యారు. బర్హ్ సబ్ డివిజన్లోని ఉమానాథ్ గంగా ఘాట్ వద్ద ఆదివారం ఉదయం 9.15 గంటల సమయంలో ఈ విషాదం చోటుచేసుకుంది. పడవలో ఒకే కుటుంబానికి చెందిన 17 మంది ఉన్నట్లు పోలీసులు తెలిపారు. నది మధ్యలో ఉండగా పడవ బోల్తా పడి మునిగిందని, 13 మందిని రక్షించి, ఒడ్డుకు చేర్చామని సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ శుభమ్ కుమార్ చెప్పారు. కనిపించకుండాపోయిన ముగ్గురు పురుషులు, ఒక మహిళ జాడ కోసం గాలింపు కొనసాగుతోందన్నారు. -
30 లక్షలకు నీట్ ప్రశ్నాపత్రం!
పట్నా: దేశవ్యాప్తంగా వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన జాతీయ అర్హత, ప్రవేశ పరీక్ష–అండర్ గ్రాడ్యుయేట్(నీట్–యూజీ)లో అక్రమాలు జరిగినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రశ్నపత్రం లీక్ అయ్యిందని, పరీక్షలో రిగ్గింగ్ జరిగిందని కొందరు అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. తమకు న్యాయం చేయాలంటూ కోర్టులను సైతం ఆశ్రయించారు. నీట్–యూజీని రద్దు చేసి, మళ్లీ నిర్వహించాలని చాలామంది డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు గ్రేసు మార్కుల వ్యవహారం తీవ్ర దుమారం సృష్టించింది. బిహార్లో నీట్ అక్రమాలపై జరగుతున్న దర్యాప్తులో సంచలనాత్మక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. నీట్ అక్రమాలకు సంబంధించి బిహార్ పోలీసులు ఇప్పటివరకు 14 మందిని అరెస్టు చేశారు. వీరిలో ప్రభుత్వ జూనియర్ ఇంజనీర్ కూడా ఉండడం గమనార్హం. రూ.30 లక్షలు ఇచ్చి నీట్ ప్రశ్నపత్రం కొనుగోలు చేశామని ప్రాథమిక విచారణలో పలువురు అభ్యర్థులు అంగీకరించినట్లు పోలీసులు చెబుతున్నారు. పకడ్బందీగా స్కెచ్ బిహార్లో పేపర్ లీక్ చేసి, అభ్యర్థులకు విక్రయించి సొమ్ము చేసుకున్న వ్యక్తులు తెలివిగా వ్యవహరించినట్లు తెలుస్తోంది. లీకేజీ వ్యవహారం బయటకు పొక్కకుండా పకడ్బందీగా వ్యవహరించారు. తమకు డబ్బులు ముట్టజెప్పిన అభ్యర్థులను తొలుత సురక్షిత స్థావరాలకు తరలించారు. వారికి అక్కడే ప్రశ్నపత్రం అప్పగించారు. జవాబులు సైతం చెప్పేశారు. తర్వాత నేరుగా పరీక్షా కేంద్రాలకు తీసుకెళ్లారు. మధ్యలో ఎవరినీ కలవనివ్వలేదు. ఇదంతా ప్రాథమిక దర్యాప్తులో బయటపడింది. నీట్ పేపర్ లీకేజీపై బిహార్ పోలీసు శాఖకు చెందిన ఆర్థిక నేరాల విభాగం(ఈఓయూ) దర్యాప్తు కొనసాగిస్తోంది. ఇప్పటికే పలువురు అభ్యర్థులను, అనుమానితులను ప్రశ్నించింది. శనివారం మరో 9 మంది అభ్యర్థులకు నోటీసులు జారీ చేసింది. సోమవారం తమ ఎదుట విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. వీరంతా బిహార్లో వేర్వేరు జిల్లాలకు చెందినవారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నుంచి అభ్యర్థుల వివరాలు తెలుసుకొని, నోటీసులు ఇచ్చామని ఈఓయూ డీఐజీ మనవ్జీత్ సింగ్ థిల్లాన్ చెప్పారు. కన్సల్టెన్సీలు, కోచింగ్ సెంటర్ల ముసుగులో.. నీట్ పరీక్షలో అవకతవకలు జరిగాయంటూ ఫిర్యాదులు రాగానే బిహార్ పోలీసులు వేగంగా స్పందించారు. ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని(సిట్) ఏర్పాటు చేశారు. అనుమానిత అభ్యర్థులు, పేపర్ లీక్ చేసిన బ్రోకర్లను అదుపులోకి తీసుకున్నారు. దర్యాప్తులో అభ్యర్థులు నోరు విప్పారు. బ్రోకర్లకు రూ.30 లక్షలకుపైగా ఇచ్చి నీట్ ప్రశ్నాపత్రం కొనుగోలు చేశామని ఒప్పుకున్నారు. బిహార్ ప్రభుత్వ జూనియర్ ఇంజనీర్ సికిందర్ కుమార్ యాదవేందు(56)ను పోలీసులు అరెస్టు చేసి, ప్రశ్నించారు. పేపర్ లీక్ ముఠాతో తాను చేతులు కలిపినట్లు అంగీకరించాడు. కొందరు అభ్యర్థుల కుటుంబ సభ్యులతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరిపానని చెప్పాడు. ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ సంస్థను నడిపిస్తున్న నితీశ్, అమిత్ ఆనంద్ అనే వ్యక్తులను తన ఆఫీసులో∙కలిశానని, వారు మే 4వ తేదీన నీట్ ప్రశ్నాపత్రం తీసుకొచ్చారని వెల్లడించారు. పట్నాలోని రామకృష్ణానగర్లో అభ్యర్థులతో సమావేశం ఏర్పాటు చేశామని, బేరసారాలు అక్కడే జరిగాయని పేర్కొన్నాడు. నితీశ్, అమిత్ ఆనంద్ అరెస్టయ్యారు. అభ్యర్థుల నుంచి రూ.30 లక్షల నుంచి రూ.32 లక్షల దాకా వసూలు చేశామని పోలీసుల విచారణలో వెల్లడించారు. బిహార్ పబ్లిక్ సరీ్వస్ కమిషన్ టీచర్ రిక్రూట్మెంట్ పరీక్ష కుంభకోణంలో నితీశ్ కుమార్ ఇప్పటికే ఒకసారి జైలుకు వెళ్లొచ్చాడు. పేపర్ లీకేజీలో ఆరితేరాడు. లీకేజీ ముఠా సభ్యులు ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీలు, కోచింగ్ సెంటర్ల ముసుగులో అభ్యర్థులను సంప్రదించి, ప్రశ్నాపత్రాలు విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. నిజానికి ఇలాంటి కన్సల్టెన్సీలు, కోచింగ్ సెంటర్లకు ప్రభుత్వ నుంచి ఎలాంటి గుర్తింపు ఉండదు. ఇదిలా ఉండగా, బిహార్లో బయటపడిన నీట్ అక్రమాలపై కేంద్ర విద్యా శాఖ గానీ, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ గానీ ఇంతవరకు స్పందించలేదు. -
Kuwait Fire వచ్చే నెలలోనే పెళ్లి... భగవంతుడా నాబిడ్డ ఎక్కడ?
కువైట్లోని మంగాఫ్ భవనంలో చెలరేగిన మంటలు మరణమృదంగాన్ని సృష్టించాయి. పొట్టచేతపట్టుకొని ఎడారి దేశం పోయిన శ్రమజీవులు 45 మంది భారతీయులు అగ్నికి ఆహూతైపోయారు. పూర్తిగా కాలిపోవడంతో గుర్తించడం కూడా కష్టంగా మారింది. ఈ నేపథ్యంలో త్వరలో పెళ్లి పీటలెక్కాల్సిన తన బిడ్డ ఏమైపోయాడో తెలియక బిహార్కు చెందిన ఒక తల్లి తల్లడిల్లి పోతోంది.ఈ అగ్నిప్రమాదం గురించి విన్నప్పటి నుండి బిహార్లోని దర్భంగా జిల్లాలోని నైనా ఘాట్ ప్రాంతానికి చెందిన మదీనా ఖాతూన్ తన కొడుకు ఆచూకీకోసం ఆందోళన పడుతోంది. వచ్చే నెలలో పెళ్లి జరగాల్సిన తన పెద్ద కొడుకు కాలూ ఖాన్ ఫోన్ కాల్స్కు స్పందించడంలేదనీ, అతని ఆచూకీ గురించి ఎలాంటి సమాచారం తెలియడం లేదని వాపోతోంది. తన కుమారుడికి అసలు ఏం జరిగిందో అర్థం కావడం లేదంటూ భయాందోళన వ్యక్తం చేసింది. శుభవార్త అందించు దేవుడా అంటూ ఖాతూన్ కన్నీరు మున్నీరవుతోంది.కాలూ ఖాన్ ప్రమాదం జరిగిన భవనంలో నివసిస్తున్నాడని, పెళ్లి కోసం జూలై 5న రావాల్సి ఉందని చెప్పింది. "కొన్నేళ్లుగా కువైట్లో నివసిస్తున్న మంగళవారం రాత్రి 11 గంటల ప్రాంతంలో నేనుఫోన్లో మాట్లాడాను. వచ్చే నెలలో తన వివాహం జరగాల్సి ఉన్నందున జూలై 5న దర్భంగా వస్తానని చెప్పాడు" అని ఆమె మీడియా ప్రతినిధులకు తెలిపింది. అతని ఫోటోలను ఎంబసీ అధికారులకు పంపామనీ, అప్డేట్ కోసం ఎదురుచూస్తున్నామని చెప్పింది."ఎలక్ట్రికల్ సర్క్యూట్" కారణంగా ఘోరమైన మంటలు సంభవించాయని కువైట్ ఫైర్ ఫోర్స్ తెలిపింది. కువైట్ మంగాఫ్ అగ్నిప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన 45 మంది భారతీయుల మృతదేహాలతో వైమానిక దళానికి చెందిన ప్రత్యేక విమానం కేరళలో ల్యాండ్ అయింది.మృతిచెందిన వారి సంఖ్య రాష్ట్రాల వారిగా కేరళ - 23 తమిళనాడు -7ఉత్తరప్రదేశ్ -3ఆంధ్రప్రదేశ్ -3ఒడిశా- 2బీహార్, వెస్ట్ బెంగాల్ పంజాబ్, మహారాష్ట్ర, కర్నాటక, జార్ఖండ్, జార్ఖండ్ రాష్ట్రాల నుంచి ఒక్కొక్కరు ఉన్నారు. రూ. 2 లక్షల పరిహారంకువైట్ అగ్నిప్రమాదంలో మరణించిన వారికి రెండు లక్షల రూపాయల ఎక్స్గ్రేషియాను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారు. -
బిహార్ జైలులో చైనీయుడి మృతి
పాట్నా:బిహార్లోని ఓ జైలులో ఆత్మహత్యాయత్నం చేసిన చైనీయుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. చైనాలోని షాండాంగ్ ప్రావిన్సుకు చెందిన లీ జియాకీ సరైనా పత్రాలు లేకుండా భారత్లోకి ప్రవేశించాడు. జూన్6వ తేదీన బ్రహ్మపురలోని లక్ష్మీచౌక్ వద్ద తిరుగుతుండగా సరైన వీసా పత్రాలు లేకపోవడంతో పోలీసులు అతడిని అరెస్టు చేశారు. ఫారనర్స్ యాక్ట్ కింద లీపై కేసు నమోదు చేశారు. అరెస్టు సమయంలో లీ వద్ద చైనా మ్యాపు, మొబైల్ ఫోన్, చైనా, నేపాల్, ఇండియా కరెన్సీలు దొరికాయి. అరెస్టు తర్వాత లీని ముజఫర్పూర్ జైలుకు తరలించారు. జూన్7న జైలులో లీ ఆత్మహత్యాయత్నం చేశాడు.తన కళ్లద్దాలను పగులగొట్టి గాజుతో శరీరాన్ని గాయపరుచుకున్నాడు. తీవ్ర రక్త స్రావంతో అపస్మారకస్థిలో జైలు గదిలోని బాత్రూమ్లో పడి ఉన్నాడు. విషయం తెలుసుకున్న పోలీసులు లీని ముజఫర్పూర్లోని శ్రీ కృష్ణా మెడికల్ కాలేజీ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ లీ మంగళవారం(జూన్11) మరణించాడని పోలీసులు తెలిపారు. -
రూ. కోటి డిమాండ్ చేసిన ఎంపీపై కేసు నమోదు
బీహార్లోని పూర్ణియా లోక్సభ స్థానం నుంచి ఇటీవలే ఎన్నికైన ఎంపీ కొత్త చిక్కుల్లో పడ్డాడు. ఎన్నిక అయ్యాడో లేదో.. బెదిరింపులకు, బలవంతపు వసూళ్లకు దిగినట్లు పోలీసులు చెబుతున్నారు. అంతేకాదు.. ఇవే ఆరోపణలపై ఆయనపై పోలీసు కేసు కూడా నమోదైంది. వివరాలు ఇలా ఉన్నాయి... పూర్ణియా లోక్సభ ఎన్నికల ఫలితాలు జూన్ నాలుగున వెలువడిన విషయం మనకు తెలిసిందే. అయితే అదే రోజున ఆ నియోజకవర్గ అభ్యర్థి, రాజేశ్ రంజన్ అలియాస్ పప్పూ యాదవ్ బలవంతపు వసూళ్లు మొదలుపెట్టాడు. స్థానిక ఫర్నీచర్ వ్యాపారి ఒకరిని తన ఇంటికి పిలిపించుకుని రూ.కోటి ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేసినట్లు పోలీసులు తెలిపారు. డబ్బులివ్వకుంటే చంపేస్తానని కూడా పప్పూయాదవ్ ఆ ఫర్నీచర్ వ్యాపారిని బెదిరించినట్లు సమాచారం. వచ్చే ఐదేళ్లు ప్రశాంతంగా బతకాలంటే తనకు కోటి రూపాయలు ఇవ్వాల్సిందేనని పప్పూ యాదవ్ తనను బెదిరించారని ఆ వ్యాపారి తెలిపారు. అయితే ఆ వ్యాపారి పప్పూ యాదవ్ బెదిరింపులకు లొంగలేదు సరికదా.. ఆయనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.దీంతో పోలీసులు జూన్ 10వ పూర్నియాలోని ముఫాసిల్ పోలీస్ స్టేషన్లో పప్పు యాదవ్తో పాటు అతని స్నేహితునిపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పూర్ణియా ఎంపీ తనను గతంలోనూ డబ్బుల కోసం బెదిరించినట్లు ఆ వ్యాపారి తన ఫిర్యాదులో పేర్కొన్నారు. 2021 ఏప్రిల్ 2న పప్పూ యాదవ్ తన నుంచి రూ.10 లక్షల సొమ్ము డిమాండ్ చేశాడని, 2023లోనూ దుర్గాపూజ సందర్భంగా రూ.15 లక్షల నగదుతోపాటు రెండు సోఫా సెట్లు కావాలని కోరినట్లు ఆ వ్యాపారి తన ఫిర్యాదులో వివరించారు. కాగా ఈ వ్యవహారంపై ఎంపీ పప్పూ యాదవ్ నుంచి ఇప్పటి వరకూ ఎలాంటి స్పందన లేదు. పప్పూ యాదవ్ ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల్లో పూర్నియా నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి, విజయం సాధించారు. ఆయనకు 5.67 లక్షలకు పైగా ఓట్లు రాగా, జేడీయూ అభ్యర్థికి 5.43 లక్షల ఓట్లు వచ్చాయి. -
నితీశ్కు ప్రధాని పదవి ఆఫర్ చేసిన ఇండియా కూటమి!
పట్నా: ఎన్డీయే సంకీర్ణ కూటమి ప్రభుత్వ ఏర్పాటులో బిహార్లోని నితీష్కుమార్ జేడీ(యూ) కీలకంగా మారింది. బీజేపీ సొంతంగా మెజార్టి సీట్లు దక్కించుకోని విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇండియా కూటమి నితీష్ కుమార్కి డిప్యూటీ పీఎం పదవి ఆఫర్ చేసి.. తమకు మద్దతు ఇవ్వాలని కోరినట్లు వార్తలు వచ్చాయి. అయితే తాజాగా జేడి(యూ) నేత కేసీ త్యాగి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన శనివారం మీడియాతో మాట్లాడారు. ‘‘ జేడీ(యూ) చీఫ్ నితీష్ కుమార్కి ఇండియా కూటమి నుంచి ఏకంగా ప్రధాన మంత్రి పదవి ఆఫర్ వచ్చింది. ఇండియా కూటమికి కన్వీనర్గా అంగీకరించని వాళ్లు.. ఏకంగా నితీష్కు ప్రధానమంత్రి పదవి ఆఫర్ చేశారు. అందుకే నితీష్ వాళ్ల ఆఫర్ను తిరస్కరిచారు. తాము ఎన్డీయేతోనే ఉన్నాం. మళ్లీ ఇండియా కూటమిలోకి వెళ్లే ప్రసక్తే లేదు. మా మద్దలు ఎన్డీయే ఉంటుంది’’ అని అన్నారు. అయితే ప్రభుత్వం ఏర్పాటు చేసే మెజార్టి సొంతంగా బీజేపీ, కాంగ్రెస్ కూటమికి లేకపోవటంతో నితీష్ కుమార్పై మద్దతును కీలకంగా మారింది. ఈ క్రమంలోనే ఇండియా కూటమి ఆయన మద్దతు కోరినట్లు త్యాగి తెలిపారు. తరచూ కూటములు మారుతారనే పేరు నితీష్ కుమార్ ఉన్న విషయం తెలిసిందే. ఇండియా కూటమి ఏర్పాటులో మొదటిగా నితీష్ కుమారే కీలకంగా వ్యవహరించారు. పట్నాలో జరిగిన మొదటి సమావేశానికి సైతం అధ్యక్షత వహించారు. అయితే.. ఎన్నికల ముందు ఈ ఏడాది జనవరిలో సీఎం పదవి రాజీనామా చేసి మరీ ఎన్డీయే కూటమిలో చేరిపోయారు. ఇక.. లోక్సభ ఎన్నికల్లో నితీష్ కుమార్ జేడీ(యూ) 12 ఎంపీ స్థానాలను గెలుచుకొని ఎన్డీయే కూటమిలో మూడో స్థానంలో ఉంది. శుక్రవారం భాగస్వామ్య పార్టీలు ఎన్డీయే పక్ష నేతగా నరేంద్ర మోదీని ఎన్నుకున్న విషయం తెలిసిందే. కేంద్రంలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం కోలువుదీరనుంది. రేపు (ఆదివారం) 7.15 గంటలకు ప్రధానిగా నరేంద్ రమోదీ ముచ్చటగా మూడోసారి ప్రమాణస్వీకారం చేయనున్నారు.స్పందించిన కాంగ్రెస్తమ పార్టీ చీఫ్కు నితీశ్కుమార్కు ఇండియా కూటమి ప్రధానమంత్రి పదవి అఫర్ చేసిందని జేడీ(యూ) నేత త్యాగి వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ స్పందించింది. ‘‘ జేడీ(యూ) నేత త్యాగి చెప్పినటువంటి సమాచారం మా వద్ద లేదు’’ అని కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ అన్నారు. త్యాగి చేసిన వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. -
పెరిగిన నితీశ్ ఇమేజ్.. పాట్నాలో ‘టైగర్ జిందాహై’ పోస్టర్లు
పాట్నా: లోక్సభ ఎన్నికల్లో జేడీయూ అద్భుత ప్రదర్శన తర్వాత ఆ పార్టీ చీఫ్, బిహార్ సీఎం నితీశ్కుమార్ ఇమేజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. ఎన్డీఏ మూడో టర్ము ప్రభుత్వంలో జేడీయూ కీలకంగా మారడం ఆ పార్టీ క్యాడర్కు ఉత్సాహాన్నిస్తోంది. ఇందులో భాగంగానే బిహార్ రాజధాని పాట్నాలోని మెయిన్ సెంటర్లో ఆ పార్టీ కార్యకర్తలు టైగర్ జిందాహై అని పెద్ద హోర్డింగ్ పెట్టారు. ఈ పోస్టర్పై పులి బొమ్మతో పాటు నితీశ్కుమార్ భారీ చిత్రాన్ని ఏర్పాటు చేశారు. ఇదొక్కటే కాకుండా పట్టణంలోని పలు చోట్ల నితీశ్ను కీర్తిస్తూ పెద్ద పెద్ద పోస్టర్లు, ఫ్లెక్సీలు పెట్టారు.‘ఫలితాలకు ముందు నితీశ్ ఇమేజ్ ఫలితాల తర్వాత నితీశ్ ఇమేజ్కు చాలా వ్యత్యాసం ఉంది. బిహార్ ఓటర్లలో నితీశ్ పాపులారిటీ పెరిగింది’అని జేడీయూ నేత నీరజ్కుమార్ చెప్పారు.కాగా, మోదీ మూడో టర్ము ప్రభుత్వంలో జేడీయూ కీలక మంత్రిత్వ శాఖలను ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. దీనికి తోడు బిహార్కు ప్రత్యేక హోదా, అగ్నివీర్ స్కీమ్లో మార్పుల కోసం జేడీయూ కొత్త సంకీర్ణ ప్రభుత్వాన్ని గట్టిగా అడిగే అవకాశం ఉంది. -
ఎన్కౌంటర్లో వాంటెడ్ గ్యాంగ్స్టర్ హతం
ఉత్తరప్రదేశ్లో నోయిడా స్పెషల్ టాస్క్ ఫోర్స్, బీహర్, రతన్పురి పోలీసులు జరిపిన ఎన్కౌంటర్లో వాంటెడ్ బీహార్ గ్యాంగ్స్టర్ హతమయ్యాడు.వివరాల్లోకి వెళితే బుధవారం అర్థరాత్రి బీహార్లోని రతన్పురి పోలీస్ స్టేషన్ పరిధిలోగల ఇంచోరా గ్రామం సమీపంలోని అడవిలో ఈ ఘటన చోటుచేసుకుంది. నోయిడా స్పెషల్ టాస్క్ ఫోర్స్(ఎస్టీఎఫ్), బీహర్, రతన్పురి పోలీసులు ముగ్గురు దుండగులను ఎన్కౌంటర్ చేశారు వీరిలో బీహార్ గ్యాంగ్ స్టర్ నీలేష్ రాయ్ ఉన్నారు. రూ. రెండు లక్షల రివార్డు కలిగిన నీలేష్ ఈ ఎన్కౌంటర్లో హతమయ్యాడు. అతని సహచరులిద్దరూ పరారయ్యారు.నిందితులకు చెందిన బైక్, రెండు పిస్టల్స్, కాట్రిడ్జ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బుధవారం అర్థరాత్రి నోయిడా, బీహార్కు చెందిన ఎస్టిఎఫ్ బృందాలు రతన్పురి పోలీస్ స్టేషన్ పరిధిలోని కళ్యాణ్పూర్ పోలీస్ పోస్ట్లో నేరస్తుల సమాచారాన్ని సేకరిస్తున్నాయి. ఇంతలో బుధానా నుంచి బైక్పై వస్తున్న ముగ్గురు యువకులను పోలీసులు అడ్డుకునేందుకు ప్రయత్నించగా, వారు పోలీసులపై కాల్పులు జరిపి, ఖతౌలీ-బుదానా రహదారి వైపు వేగంగా వెళ్లిపోయారు.పోలీసు బృందం వారిని వెంబడిస్తున్న సమయంలో ఇంచుడ గ్రామం అడవిలో వారి బైక్ స్లిప్ అయ్యి కింద పడిపోయింది. ఇంతలో పోలీసులు కాల్పులు చేయగా ఇద్దరు దుండగులు తప్పించుకున్నారు. పోలీసుల తూటాలకు ఓ యువకుడు(నీలేష్ రాయ్) గాయపడ్డాడు. పోలీసులు బాధితుడిని బుధానా ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యులు అతను చనిపోయినట్లు ధృవీకరించారు.మృతుడిని బీహార్కు చెందిన కరుడుగట్టిన నేరస్తుడు నీలేష్ రాయ్గా గుర్తించామని, బరో రాంపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గధరా బెగుసరాయ్ బీహార్ నివాసి అని ఎస్పీ దేహత్ ఆదిత్య బన్సాల్ తెలిపారు. అతనిపై బీహార్ ప్రభుత్వం రూ.2 లక్షల రివార్డు ప్రకటించింది. నీలేష్పై హత్య, దోపిడీ, తదితర 16 తీవ్రమైన సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. పరారీలో ఉన్న నీలేష్ సహచరులిద్దరి కోసం పోలీసులు అడవిలో కూంబింగ్ నిర్వహిస్తున్నారు. -
మోదీ 3.0లో 3 పదవులపై నితీష్ కన్ను?
దేశంలో మరోమారు ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు కానుంది. ప్రధానిగా నరేంద్ర మోదీ మూడోసారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. లోక్సభ ఎన్నికల్లో ఎన్డీఏకు 293 సీట్లు, ఇండియా కూటమికి 234 సీట్లు వచ్చాయి. ఎన్డీఏ మిత్రపక్షం అయిన జేడీయూ బీహార్లో 12 సీట్లు గెలుచుకుంది. ఇవి ఎన్డీఏకు చాలా కీలకం.ఈ నేపధ్యంలో జేడీయే నేత, బీహార్ సీఎం నితీష్ కుమార్ బీజేపీ నుంచి మూడు మంత్రిత్వ శాఖలను డిమాండ్ చేసినట్లు సమాచారం. బీహార్కు ప్రత్యేక రాష్ట్ర హోదాతో పాటు నలుగురు ఎంపీలకు ఒక మంత్రిత్వ శాఖ అనే ఫార్ములాను ప్రధాని మోదీ ముందు ఉంచారని జేడీయూ వర్గాలు చెబుతున్నాయి. నితీష్ కుమార్ రైల్వే, వ్యవసాయం, ఆర్థిక మంత్రిత్వ శాఖలను కోరుకుంటున్నారని తెలుస్తోంది. దీనిలో రైల్వే మంత్రిత్వ శాఖపై పట్టుపడతారని అంటున్నారు.లోక్సభ ఎన్నికల్లో బీజేపీ 240 సీట్లు గెలుచుకుని, మెజారిటీకి దూరంగా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో 12 సీట్లు గెలిచిన నితీష్ కుమార్(జేడీయూ), 16 సీట్లు గెలిచిన చంద్రబాబు నాయుడు(టీడీపీ) ఎన్డీఏకు కీలకంగా మారారు. ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఈ ఇద్దరు నేతల అవసరం బీజేపీకి ఎంతైనా ఉంది. -
కొత్త ఆటకు సీఎం నితీష్ తెరలేపుతున్నారా?
లోక్సభ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. ఎన్డీఏ కూటమికి 292 సీట్లు రాగా, ఇండియా కూటమికి 243 సీట్లు వచ్చాయి. సంపూర్ణ మెజారిటీ సంఖ్యను ఒంటరిగా టచ్ చేయడంలో బీజేపీ విజయవంతం కాలేదు. టీడీపీ, జేడీయూ తదితర పార్టీల సాయంతో మోదీ ప్రభుత్వం మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా అడుగులు వేసింది.లోక్సభ ఎన్నికల ఫలితాల వెల్లడి అనంతరం ఇప్పుడు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే సమయం వచ్చింది. మూడోసారి మోదీ ప్రభుత్వం ఏర్పాటుకానుంది. ఈరోజు (బుధవారం) జరిగే ఎన్డీఏ సమావేశంలో ప్రభుత్వ ఏర్పాటుపై చర్చలు జరగనున్నాయి. మరోవైపు ఇండియా కూటమి కూడా ఈరోజు(బుధవారం) భేటీ కానుంది.ఢిల్లీలో జరిగే ఎన్డీఏ సమావేశానికి బీహార్ సీఎం నితీశ్ కుమార్, తేజస్వీ యాదవ్లు పట్నా నుంచి బయలుదేరి వెళ్లారు. వీరిద్దరూ ఒకే విమానంలో ఢిల్లీకి వెళ్లడం చర్చనీయాంశంగా మారింది. వీరిద్దరూ ఫ్లైట్లో కూర్చున్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. లోక్సభ ఎన్నికల్లో జేడీయూ 12 సీట్లు గెలుచుకోగా, ఆర్జేడీ నాలుగు స్థానాల్లో విజయం సాధించింది. నితీష్, తేజస్వి కలసి వెళుతుండటం చూసిన రాజకీయ విశ్లేషకులు నితీష్ కొత్త ఆటకు తెరలేపుతున్నారా? అనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. -
బీహార్ లో NDA కూటమికి షాక్
-
ఫలితాల పండుగకు క్వింటాళ్లలో లడ్డూల ఆర్డర్లు
2024 లోక్సభ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ వెలువడగానే దేశంలోని రాజకీయాలు తారాస్థాయికి చేరాయి. ఎన్డీఏ శిబిరంలో ఉత్సాహం వెల్లివిరుస్తోంది. మరోవైపు ఎగ్జిట్ పోల్స్ను తిరస్కరించే పనిలో మహాకూటమి నేతలు బిజీగా ఉన్నారు. అయితే యూపీలోని బీజేపీ శ్రేణుల ఉత్సాహం మిన్నంటుతోంది. యూపీ రాజధాని పట్నాలో బీజేపీ కార్యకర్తలు లెక్కకుమించిన సంఖ్యలో లడ్డూలను ఆర్డర్ చేస్తున్నారు. మంగళవారం ఫలితాలు వెల్లడయ్యాక లడ్డూలు పంచుతూ సంబరాలు చేసుకునేందుకు వారు ప్లాన్ చేశారు.పట్నాలో రాజస్థానీ నెయ్యి లడ్డూలతో పాటు మానేర్ లడ్డూలకు ఒక్కసారిగా డిమాండ్ పెరిగింది. లోక్సభ ఎన్నికల ప్రచారంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. మానేర్ లడ్డూ గురించి ప్రస్తావించారు. ఈ నేపధ్యంలో ఈ లడ్డూలకు బీజేపీ నేతలు, కార్యకర్తలలో విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. స్వచ్ఛమైన నెయ్యితో చేసిన రాజస్థానీ లడ్డూలు కిలో రూ.620కు విక్రయిస్తున్నారు. పట్నాకు చెందిన బీజేపీ నేతలు, కార్యకర్తలు ఒక మిఠాయి దుకాణంలో క్వింటాల్ లడ్డూలకు ఆర్డర్ ఇచ్చారు.ఈ లడ్డూలు జూన్ 4న ఉదయం 9 నుండి 10 గంటల మధ్య బీజేపీ కార్యాలయానికి చేరుకోనున్నాయి. ఇందుకోసం బీజేపీ కార్యకర్తలు ముందుగానే సదరు దుకాణదారునికి డబ్బులు కూడా చెల్లించారు. స్వచ్ఛమైన నెయ్యి తో చేసిన క్వింటాల్ లడ్డూ ధర రూ. 62 వేలు అని దుకాణదారు తెలిపారు. -
ప్రధాని మోదీతో సీఎం నితీష్ భేటీ.. బీహార్లో ఏం జరగనుంది?
దేశంలో లోక్సభ ఎన్నికల తంతు పూర్తయ్యింది. ఇక ఓట్ల లెక్కింపు, ఫలితాల వెల్లడి మాత్రమే మిగిలివుంది. ఈ నేపధ్యంలో దేశంలో పలు ఆసక్తిక రాజకీయ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా బీహార్ సీఎం నితీష్ కుమార్ ప్రధాని మోదీని కలుసుకున్నారు. ఇది చర్చనీయాంశంగా మారింది.ఓట్ల లెక్కింపునకు ఒకరోజు ముందు జరిగిన ఈ భేటీలో బీహార్ రాజకీయాలతో పాటు ఇతర ప్రాంతాల రాజకీయ అంశాలపై ఇరువురి మధ్య చర్చ జరిగినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. సీఎం నితీష్ కుమార్ ప్రధాని నరేంద్ర మోదీని ఢిల్లీలోని ఆయన నివాసంలో కలుసుకున్నారు. సాయంత్రం 4 గంటలకు హోంమంత్రి అమిత్షాతో నితీష్ కుమార్ సమావేశం కానున్నారు.ప్రధానితో సీఎం నితీశ్ కుమార్ భేటీ వెనుక అనేక అంశాలు ఉండవచ్చని విశ్లేషకులు అంటున్నారు. బీహార్ సహా దేశవ్యాప్తంగా ఎన్డీఏ సీట్లను అంచనా వేయడం, నూతన ప్రభుత్వం ఏర్పాటయ్యాక క్యాబినెట్లో జేడీయూ పాత్ర ఎలా ఉండనుంది? భవిష్యత్తులో రెండు ప్రభుత్వాలు కలిసి ఎలా పని చేయాలి? అనే అంశాలపై వీరిమధ్య చర్చ జరిగినట్లు సమాచారం.హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయిన తర్వాత సీఎం నితీశ్ కుమార్ ఢిల్లీ నుంచి పాట్నాకు తిరిగి వెళ్లనున్నారు. సీఎం నితీశ్ కుమార్ ఢిల్లీ పర్యటనలో ఆయన వెంట జేడీయూ రాజ్యసభ ఎంపీ సంజయ్ ఝా కూడా ఉన్నారు. రేపు (శనివారం) లోక్సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు జరగనుంది. అనంతరం ఫలితాలు వెలువడనున్నాయి. -
జేడీయూ నేతపై దాడి.. వీడియో తీసి ఆన్లైన్లో అప్లోడ్
పట్నా: జనతా దళ్యునైటెడ్ (జేడీయూ) నేత రాజ్దీప్ అలియాస్ రాజ్ యాదవ్పై శనివారం భాగల్పూర్లో గుర్తు తెలియని దుండగులు దారుణంగా దాడి చేశారు. పర్బాతీ చౌక్ వద్ద ఉన్న మార్కెట్లోకి రాజ్యాదవ్ను లాక్కెళ్లి దుండగులు కర్రలు, రాడ్లతో విక్షణారహితంగా దాడి చేశారు. తీవ్రంగా దాడి చేసిన అనంతరం తమ కాళ్లు పట్టుకొని క్షమాపణలు కోరాలని దుండగులు రాజ్యాదవ్ను బలవంతపెట్టారు.VIDEO | Bihar: A local JD(U) leader Raja Yadav was thrashed by miscreants over an alleged land dispute matter in Bhagalpur on Saturday. CCTV visuals of the incident. (Full video available on PTI Videos - https://t.co/dv5TRARJn4) pic.twitter.com/lQftoVCXov— Press Trust of India (@PTI_News) June 2, 2024 ఈ ఘటనను రికార్డు చేసిన దుండగులు ఆ వీడియోను సోషల్ మీడియాలో అప్లోడ్ చేవారు. దీంతో దాడికి సంబంధించిన ఈ వీడియో వైరల్గా మారింది. తీవ్ర గాయాల పాలైన రాజ్యాదవ్ను స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. దుండగుల్లో ఒకడైన చందర్ యాదవ్ అనే నిందితున్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
‘ముందు ఓటు.. తర్వాతే తల్లి అంత్యక్రియలు’
దేశంలో లోక్సభ ఎన్నికల తుది విడత పోలింగ్ నేడు(శనివారం) జరుగుతోంది. దీనిలో భాగంగా బీహార్లోని జెహనాబాద్ లోక్సభ నియోజకవర్గానికి కూడా పోలింగ్ కొనసాగుతోంది. అయితే ఈ నియోజక వర్గంలో ఒక విచ్రిత ఉదంతం వెలుగు చూసింది. ఇది అందరినీ ఆశ్చర్యానికి గురిచేయడమే కాకుండా ఓటర్లకు ఆదర్శంగా నిలుస్తోంది.జెహనాబాద్లోని బూత్ నంబర్ 151 పరిధిలోని దేవ్ కులీ గ్రామానికి చెందిన మిథిలేష్ యాదవ్, మనోజ్ యాదవ్ల తల్లి వృద్ధాప్య సమస్యలతో మృతి చెందింది. అయితే కుటుంబ సభ్యులు ఓటు వేసి, వచ్చాకనే ఆ మహిళకు దహన సంస్కారాలు చేయాలని నిర్ణయించుకున్నారు.ఈ సందర్భంగా మృతురాలి కుమారుడు మనోజ్యాదవ్ మాట్లాడుతూ ఐదేళ్లకోసారి ఓటింగ్ వస్తుందని, ఇవి ఎంతో ముఖ్యమైనవని, అందుకే తామంతా ముందుగా ఓటువేయాలనుకున్నామని తెలిపారు. ఓటింగ్ పూర్తయ్యాకనే తల్లికి దహన సంస్కారాలు చేస్తామన్నారు.మృతురాలి కుటుంబానికి చెందిన ఉషాదేవి మాట్లాడుతూ ఓటింగ్ అనేది తప్పనిసరి అని, అందుకే ముందుగా ఓటు వేయబోతున్నామని తెలిపారు. వారంతా క్యూలో నిలుచుని, తమ వంతు వచ్చాక ఓటువేశారు. ఆ తర్వాత తల్లి మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు. -
బిహార్ లో కీలక పోరు
-
మండుతున్న ఎండలు.. తట్టుకోలేక సొమ్మసిల్లిన విద్యార్థులు
పాట్నా: ఉత్తర భారత్లో ఎండలు మండిపోతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో ఎన్నడూ లేనంతంగా ఉష్ణోగ్రతలు 50 డిగ్రీలను దాటేసింది. తీవ్ర ఎండ, వాడగాలులతో జనం అల్లాడుతున్నారు. అయితే మండే ఎండల్లోనూ కొన్ని చోట్ల స్కూళ్లు తెరుచుకున్నాయి. తాజాగా బిహార్లో పాఠశాలలకు వచ్చిన విద్యార్థులు ఎండ వేడిని తట్టుకోలేక సొమ్మసిల్లిపోయారు.బిహార్లో వేసవిసెలవులు ముగియడంతో బుధవారం నుంచి పాఠశాలలు తెరుచుకున్నాయి. ప్రస్తుతం బిహార్లో ఉష్ణోగ్రతలు 47 డిగ్రీలు ఉంది. ఇంత ఎండలోనూ విద్యార్ధులు స్కూళ్లకు వచ్చారు. అయితే ఎండ వేడిని తట్టుకోలేక.. పలు ప్రాంతాల్లోని స్కూళ్లలో విద్యార్థులు సొమ్మసిల్లిపోయారు. షేక్పురా జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలో 16 మంది బాలికలు స్పృహతప్పి పడిపోయారు. టీచర్లు వారికి సపర్యలు చేశారు. సమయానికి ఆంబులెన్స్లు రాకపోవడంతో.. ఆటోలు, బైక్లపై ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పిల్లలందరూ డీ హైడ్రేట్ అయ్యారని.. ప్రస్తుతానికి క్షేమంగానే ఉన్నారని వైద్యులు పేర్కొన్నారు.ఇదొక పాఠశాలలోనే కాదు బెగుసరాయ్, జాముయి జిల్లాల్లో పదుల సంఖ్యలో విద్యార్ధులు స్పృహతప్పి పడిపోయారు. వారిని అసుపత్రికి తరలించారు.కాగా, ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్నప్పటికీ బీహార్లో స్కూళ్లను తెరువడంపై విమర్శలు వెల్లువెత్తాయి. గ్రామస్తులు స్కూళ్లకు వెళ్లి టీచర్లతో ఘర్షణపడ్డారు. అలాగే రహదారిని దిగ్బంధించి నిరసన వ్యక్తం చేశారు. సీఎం నితీశ్ కుమార్ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు మండిపడ్డాయి. ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నప్పటికీ స్కూళ్లను తెరువడంపై ప్రభుత్వాన్ని ప్రశ్నించాయి.మరోవైపు బీహార్లో ప్రభుత్వం, ప్రజాస్వామ్యం లేదని, బ్యూరోక్రసీ మాత్రమే ఉందని ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ విమర్శించారు. ఉష్ణోగ్రతలు 47 డిగ్రీలకు పైగా ఉన్నాయని, అత్యవసర చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. -
ఎండకు సొమ్మసిల్లిన 50 మంది విద్యార్థినులు.. ఆస్పత్రికి తరలింపు
ఉత్తరాదిన ఎండలు దంచికొడుతున్నాయి. తాజాగా బీహార్లోని షేక్పురా జిల్లాలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో ఎండ వేడిమికి తాళలేక 50 మందికి పైగా విద్యార్థినులు సొమ్మసిల్లి పడిపోయారు. వీరి ఆరోగ్యం ఒక్కసారిగా క్షీణించడంతో పాఠశాలలో కలకలం చెలరేగింది.అపస్మారక స్థితిలో ఉన్న చిన్నారులను ఆస్పత్రికి తరలించేందుకు ప్రభుత్వ ఆరోగ్య శాఖను సంప్రదించారు. ఎంతసేపటికి అంబులెన్స్ రాకపోవడంతో ఆ విద్యార్థినులందరినీ పాఠశాల సిబ్బంది ప్రైవేట్ వాహనాల్లో ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ సందర్భంగా వైద్యారోగ్యశాఖ నిర్లక్ష్యాన్ని నిరసిస్థూ స్థానికులు రోడ్డుపై ధర్నాకుదిగారు.బీహార్లోని పలు జిల్లాల్లో 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇంతటి ఎండ వేడిమిలోనూ రాష్ట్రంలోని పాఠశాలలు పనిచేస్తున్నాయి. బుధవారం ఉదయం మండుటెండల కారణంగా అరియారి బ్లాక్లోని మన్కౌల్ మిడిల్ స్కూల్లో విద్యార్థినులు అకస్మాత్తుగా స్పృహతప్పి పడిపోయారు.ఈ ఘటనపై పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సురేష్ ప్రసాద్ మాట్లాడుతూ.. ప్రార్థనల అనంతరం పదుల సంఖ్యలో చిన్నారులు స్పృహతప్పి పడిపోయారని తెలిపారు. దీంతో పిల్లలందరినీ ప్రైవేట్ వాహనంలో ప్రభుత్వ ఆస్పత్రికి తరలించామన్నారు. ఈ చిన్నారులంతా డీహైడ్రేషన్ బారిన పడ్డారని వైద్యుడు సత్యేంద్ర కుమార్ తెలిపారు. పిల్లలకు చికిత్స అందిస్తున్నామన్నారు. -
ఎన్డీఏకి చుక్కలు చూపిస్తున్న ‘పవర్ స్టార్’
కొంత కాలం క్రితం వరకు బీహార్లోని కరకాట్ లోక్సభ నియోజకవర్గం ఎవరి దృష్టినీ ఆకర్షించలేదు. ప్రస్తుతం ఇక్కడ నుంచి ఎన్డీఏ తరపున సీనియర్ నేత ఉపేంద్ర కుష్వాహా పోటీలో ఉన్నారు. కూటమి ఒప్పందంలో భాగంగా కుష్వాహాకు చెందిన రాష్ట్రీయ లోక్ మోర్చాకు ఒక సీటు లభించింది. ఆయనకు ప్రత్యర్థిగా సీపీఐ(ఎంఎల్)కు చెందిన రాజారామ్ సింగ్ రంగంలోకి దిగారు. అయితే ఇప్పుడు భోజ్పురి పవర్ స్టార్గా పేరొందిన నటుడు పవన్ సింగ్ స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగి, ఎన్డీఏకు చుక్కలు చూపిస్తున్నారు.వివరాల్లోకి వెళితే బీజేపీ గతంలో పవన్సింగ్కు అసన్సోల్ లోక్సభ టిక్కెట్ కేటాయించింది. అయితే తనకు అసన్సోల్ వద్దని, తాను కరకాట్ నుంచి పోటీ చేయాలనుకుంటున్నట్లు బీజేపీకి స్పష్టం చేశారు. కానీ అప్పటికే బీజేపీ ఆ సీటు టిక్కెట్ను ఉపేంద్ర కుష్వాహాకు కేటాయించింది. దీంతో భోజ్పురి పవర్ స్టార్ పవన్ సింగ్ బీజేపీపై దండెత్తి, కరకాట్ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగారు. ఇది ఎన్డీఏకు పెద్ద సవాల్గా మారింది.16 లక్షలకు పైగా ఓటర్లు ఉన్న కరకాట్ ప్రాంతం వరి సాగుకు ప్రసిద్ధిచెందింది. ఇక్కడ 400 రైస్ మిల్లులు ఉన్నాయి. పవన్ సింగ్ రాకతో కరకాట్ రాజకీయ వాతావరణం వేడెక్కిందని స్థానిక రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. కరకాట్ 2009లో ఉనికిలోకి వచ్చింది. ఇక్కడి మొదటి ఎంపీ జేడీయూకి చెందిన మహాబలి సింగ్. 2014లో ఎన్డీఎ భాగస్వామ్య ఆర్ఎల్ఎస్పీ అధ్యక్షుడు ఉపేంద్ర కుష్వాహ విజయం సాధించారు. 2019లో మహాకూటమి నుంచి పోటీ చేసిన ఉపేంద్ర కుష్వాహాను జేడీయూకు చెందిన మహాబలి సింగ్ ఓడించారు.పవన్ సింగ్ రాజ్పుత్ వర్గానికి చెందినవాడు కావడమే అతనికున్న బలం. ఇది కుష్వాహా వర్గపు ఆధిపత్య సీటు అయినప్పటికీ, ఇక్కడ కుష్వాహా, రాజ్పుత్, యాదవ వర్గాలకు చెందిన ఓటర్లు అధిక సంఖ్యలో ఉన్నారు. మరోవైపు ఇక్కడ లక్షన్నర మంది ముస్లిం ఓటర్లు కూడా ఉన్నారు. -
ఫలితాల తర్వాత నితీష్ ఏదైనా చేయొచ్చు: తేజస్వి
పాట్నా: లోక్సభ ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత బిహార్ సీఎం మరోసారి కూటమి మారడానికి రెడీ అవుతారని రాష్ట్రీయ జనతాదళ్(ఆర్జేడీ) నేత తేజస్వి యాదవ్ వ్యాఖ్యానించారు. ఈ విషయమై మంగళవారం(మే28)న తేజస్వి మీడియాతో మాట్లాడారు. జూన్ 4 తర్వాత సీఎం నితీష్ తన పార్టీని కాపాడుకోవడానికి ఎంత పెద్ద నిర్ణయమైనా తీసుకోవచ్చని చెప్పారు.కాగా గడిచిన పదేళ్లలో నితీష్ ఐదుసార్లు వేర్వేరు పార్టీలో పొత్తులు పెట్టుకుని అధికారంలో కొనసాగారు. అయితే ఇటీవల ఓ ఎన్నికల ప్రచార సభలో నితీష్ మాట్లాడుతూ ఇక మీదట తాను బీజేపీతో తప్ప మరే పార్టీతో పొత్తు పెట్టుకోనని హామీ ఇచ్చారు. తాను ప్లేటు ఫిరాయించడం ఇదే చివరిసారన్నారు. కాగా గడిచిన పదేళ్లలో నితీష్ ఐదుసార్లు బీజేపీ, ఆర్జేడీలతో పొత్తులు మార్చారు. -
Lok sabha elections 2024: మోదీని ఈడీ అడిగినా దేవుడు పంపాడని చెప్తారేమో
బక్తియార్పూర్/పాలీగంజ్/జగదీశ్పూర్(బిహార్): తాను సామాన్య వ్యక్తినికాదని, దేవుడు పంపించాడని ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వ్యంగ్యాస్త్రాలు విసిరారు. సోమవారం బిహార్లో బక్తియార్పూర్, పాలీగంజ్, జగదీశ్పూర్ల్లో ఆయన ప్రచార ర్యాలీల్లో మాట్లాడారు. ‘‘ఎన్నికల ఫలితాలొచ్చాక బీజేపీ హయాంలో జరిగిన అవినీతిపై మోదీని ఈడీ ప్రశ్నించొచ్చు. అప్పుడాయన ‘నాకేమీ తెలీదు. దేవుడు పంపిస్తే వచ్చా. ఆయన చెప్పినట్లే చేశా’’ అని చెబుతారేమో’’ అంటూ ఎద్దేవా చేశారు. బిలియనీర్లకు సేవ చేయడానికే దేవుడు ఆయన్ను పంపాడా అంటూ మండిపడ్డారు. పాలీగంజ్లో రాహుల్, ఆర్జేడీ చీఫ్ లాలు ప్రసాద్ యాదవ్ కుమార్తె, పాటలీపుత్ర అభ్యర్థి మీసా భారతి సహా డజనుకు పైగా నేతలు కార్యకర్తలకు అభివాదం చేస్తుండగా వేదిక ఒక్కసారిగా కుంగింది. దాంతో రాహుల్ కాస్త పక్కకు నడవగా అక్కడా కుంగింది. వారంతా కింద పడబోయి తమాయించుకున్నారు.మోదీవి కూలదోసే కుట్రలు: ప్రియాంకసిమ్లా: హిమాచల్ప్రదేశ్లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలదోసేందుకు మోదీ ప్రయత్నిస్తున్నారని ప్రియాంకా గాంధీ వద్రా ఆరోపించారు. కాంగ్రా సమీపంలోని చంబాలో ఆమె కాంగ్రెస్ ఎన్నికల ప్రచార సభలో ప్రసంగించారు. -
లోక్సభ పోరు.. ఫైనల్ పంచ్ ఎవరిదో!
బిహార్లో లోక్సభ ఎన్నికలు తుది అంకానికి చేరుకున్నాయి. 40 సీట్లకు గాను ఆరు విడతల్లో 32 చోట్ల ఎన్నికలు ముగిశాయి. చివరిదైన ఏడో దశలో 8 లోక్సభ స్థానాల్లో పోలింగ్కు రంగం సిద్ధమైంది. వీటిలో బీజేపీ 5 సిట్టింగ్ స్థానాలు. 2 జేడీ(యూ), 1 రాష్ట్రీయ లోక్ మోర్చా చేతిలో ఉన్నాయి. ఎన్డీఏకు ఈసారి రెబల్స్తో పాటు ఇండియా కూటమి నుంచి గట్టి సవాల్ ఎదురవుతోంది. ఈ నేపథ్యంలో కీలక స్థానాలపై ఫోకస్... నలంద... జేడీయూ కంచుకోట అలనాటి విఖ్యాత నలంద విశ్వవిద్యాలయ చరిత్రకు సాక్ష్యంగా నిలిచే నియోజకవర్గం. సారవంతమైన గంగా పరీవాహక ప్రాంతంలో ఉంటుంది. ఇది జేడీయూ కంచుకోట. బీజేపీ ఇక్కడ ఖాతాయే తెరవలేదు. గత ఎన్నికల్లో కౌసలేంద్ర కుమార్ జేడీ(యూ) నుంచి హ్యాట్రిక్ విజయం నమోదు చేశారు. ఈసారీ ఆయనే బరిలో ఉన్నారు. ఇండియా కూటమి తరఫున సీపీఐ (ఎంఎల్) నుంచి సందీప్ సౌరవ్ పోటీ చేస్తున్నారు. కమ్యూనిస్టులు గతంలో ఇక్కడ మూడుసార్లు గెలిచారు.ఆరా... రైట్ వర్సెస్ లెఫ్ట్ మొదట్లో దీని పేరు షాబాద్. 1977లో ఆరాగా మారింది. ఆర్కే సింగ్ 2014లో తొలిసారి ఇక్కడ కాషాయ జెండా ఎగరేశారు. 2019లోనూ నెగ్గిన ఆయన ఈసారి హ్యాట్రిక్ కోసం ఉవి్వళ్లూరుతున్నారు. ఇండియా కూటమి తరఫున సీపీఎం (ఎంఎల్) అభ్యర్థి సుధామా ప్రసాద్ బరిలో ఉన్నారు. గత ఎన్నికల్లో సీపీఐ (ఎంఎల్)కు ఇక్కడ 4 లక్షల పైగా ఓట్లొచ్చాయి! రైట్, లెఫ్ట్ పారీ్టల వార్ ఇక్కడ ఉత్కంఠ రేపుతోంది.పట్నా సాహిబ్... రవిశంకర్కు సవాల్ సిక్కుల మత గురువు గురు గోవింద్సింగ్ జన్మస్థలం. 2008లో ఏర్పాటైంది. 2009, 2014ల్లో బాలీవుడ్ షాట్గన్ శత్రుఘ్న సిన్హా బీజేపీ తరఫున గెలిచారు. 2019లో ఎన్నికల ముందు శత్రుఘ్న బీజేపీకి గుడ్బై చెప్పి కాంగ్రెస్ అభ్యరి్థగా బరిలో దిగారు. దాంతో 20 ఏళ్లుగా రాజ్యసభకు ప్రాతినిధ్య వహిస్తున్న సీనియర్ నేత రవిశంకర్ ప్రసాద్ను బీజేపీ బరిలో దించింది. శత్రుఘ్నను ఆయన 2.8 లక్షల పైగా ఓట్ల మెజారిటీతో ఓడించారు. ఈసారి కూడా బీజేపీ నుంచి ఆయనే బరిలో ఉన్నారు. ఇండియా కూటమి నుంచి కాంగ్రెస్ తరఫున లోక్సభ మాజీ స్పీకర్ మీరాకుమార్ తనయుడు అన్షుల్ అవిజిత్ పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్, ఆర్జేడీలకు మంచి ఓటు బ్యాంకు ఉండటంతో బీజేపీ గట్టి పోటీ ఎదుర్కొంటోంది. పాటలీపుత్ర... లాలుకు ప్రతిష్టాత్మకం గత రెండు ఎన్నికల్లోనూ ఆర్జేడీ వ్యవస్థాపకుడు లాలూ ప్రసాద్ యాదవ్ కుమార్తె మీసా భారతిని బీజేపీ నేత రామ్ కృపాల్ యాదవ్ ఓడించారు. 2009లో లాలు కూడా ఇక్కడ ఓటమి చవిచూశారు. లాలుకు ఒకప్పటి నమ్మినబంటు రాంకృపాల్ బీజేపీ అభ్యరి్థగా ఉన్నారు. బీజేపీ తరఫున రెండుసార్లు వరుసగా గెలిచిన ఆయన 2004లో ఇక్కడ ఆర్జేడీ అభ్యరి్థగా బీజేపీని ఓడించడం విశేషం. ఆర్జేడీ నుంచి మీసా భారతి మళ్లీ పోటీ చేస్తున్నారు. కుమార్తెను ఎలాగైనా లోక్సభకు పంపాలని కలలుగంటున్న లాలుకు ఈ ఎన్నిక ప్రతిష్టాత్మకంగా మారింది. కాంగ్రెస్ దన్ను ఆర్జేడీకి కలిసొచ్చే అంశం. కరాకట్.. బీజేపీకి పవన్ గండం ఇక్కడ కుష్వాహా (కోయెరి) సామాజికవర్గానిదే ఆధిపత్యం. గత మూడు ఎన్నికల్లోనూ ఆ వర్గం నేతలే గెలుస్తున్నారు. కుషా్వహాలు, రాజ్పుత్లు, యాదవులు ఇక్కడ రెండేసి లక్షల చొప్పున ఉంటారు. గతేడాది బీజేపీలో చేరిన భోజ్పురి స్టార్ పవన్ సింగ్ ఇప్పుడు పారీ్టకి కొరకరాని కొయ్యగా మారారు. ఇక్కడ టికెట్ ఆశించి భంగపడి ఇండిపెండెంట్గా బరిలో దిగారు. ఇండియా కూటమి తరఫున సీపీఐ (ఎంఎల్) నుంచి రాజారాం సింగ్ కుషా్వహా బరిలో ఉన్నారు. ఎన్డీయే నుంచి రా్రïÙ్టయ లోక్ మోర్చా వ్యవస్థాపకుడు ఉపేంద్ర కుష్వాహా పోటీ చేస్తున్నారు. పవన్ సింగ్ నామినేషన్కు జనం భారీగా వచ్చారు. త్రిముఖ పోటీలో ఎన్డీఏ ఎదురీదుతోంది.జహానాబాద్... జేడీయూ వర్సెస్ ఆర్జేడీ ‘రెడ్ కారిడార్’లో అత్యంత సున్నితమైన నక్సల్స్ ప్రభావిత నియోజకవర్గం. కమ్యూనిస్టులకు కంచుకోట. 1998 నుంచీ ఆర్జేడీ, జేడీయూ మధ్య చేతులు మారుతోంది. 2014లో రా్రïÙ్టయ లోక్ సమతా పార్టీ నెగ్గింది. 2019లో జేడీ(యూ) నేత చందేశ్వర్ ప్రసాద్ కేవలం 1,751 ఓట్ల తేడాతో ఆర్జేడీ అభ్యర్థి సురేంద్ర ప్రసాద్ యాదవ్ను ఓడించారు. ఈసారి కూడా వారిద్దరే బరిలో ఉన్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్