-
నా జీవితంలో అదే అతి పెద్ద విషాదం: నటుడు
బాలీవుడ్ నటుడు రణ్వీర్ షోరే హిందీ బిగ్బాస్ ఓటీటీ మూడో సీజన్లో పాల్గొన్నాడు. గతంలో పూజా భట్తో ప్రేమాయణం నడిపిన ఈయన తాజాగా బిగ్బాస్ హౌస్లో ఆనాటి సంగతులను గుర్తు చేసుకోవడంతో పాటు కెరీర్ ఎలా మొదలైందో వెల్లడించాడు.ఆరంకెల జీతం నుంచి జీరోరణ్వీర్ మాట్లాడుతూ.. 21 ఏళ్ల వయసులో కెమెరా వెనకాల నా ప్రయాణం మొదలైంది. కొన్ని షోలకు డైరెక్షన్ చేశాను, నిర్మాతగా వ్యవహరించాను. తర్వాత ఓ ఎంటర్మైంట్ ఛానల్లో వీజేగా మారాను. ఆరంకెల జీతం అందుకున్నాను. సడన్గా మేనేజ్మెంట్ మారడంతో ఉద్యోగం మానేయాల్సి వచ్చింది. మళ్లీ జీరో దగ్గరకు వచ్చాను.అప్పు తీసుకున్నాఅప్పుడు నా సోదరుల దగ్గర అప్పు తీసుకునేవాడిని. 2002లో లఢక్లో లక్ష్య షూటింగ్ చేస్తున్న సమయంలో అమ్మకు బాలేదని ఫోన్ వచ్చింది. షూటింగ్ కొనసాగుతూ ఉండటంతో అప్పటికప్పుడు వెళ్లలేకపోయాను. తర్వాత ముంబైకి వెళ్లేసరికి అమ్మ ఆరోగ్యం కుదుటపడటంతో ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేశారు. కానీ కొన్ని రోజులకే అమ్మ చనిపోయింది. అది నా జీవితంలోనే పెద్ద విషాదం. ఈ విషయాన్ని నా సోదరులకు ఫోన్లో చెప్పాల్సి రావడం మరో విషాదం.నటి వల్ల ఇబ్బందులుసరిగ్గా అదే సమయంలో ఓ నటి వల్ల అనేక ఆరోపణలు ఎదుర్కొన్నాను. నా పరిస్థితి చూసి మా అన్న అమెరికా వచ్చేయమన్నాడు. అలా అక్కడికెళ్లి తన దగ్గర అప్పు తీసుకుని ఆరు నెలలపాటు యాక్టింగ్ కోర్సు నేర్చుకున్నాను. ఇండియాకు వచ్చీరావడంతోనే అప్పటిదాకా అటకెక్కిన నా రెండు సినిమాలు (ఖోస్లా కా ఘోస్లా, ప్యార్ కి సైడ్ ఎఫెక్ట్స్) రిలీజ్కు నోచుకున్నాయి. జనాలు సైతం ఆ చిత్రాలను ఆదరించారు. నటుడినయ్యాక నా జీవితం సరైన దారికొచ్చింది అని చెప్పుకొచ్చాడు.ఐరన్ రాడ్తో..కాగా రణ్వీర్ షోరే గతంలో పూజా భట్ను ప్రేమించాడు. కానీ ఈ బంధం ఎక్కువకాలం కొనసాగలేదు. తాగొచ్చి కొట్టేవాడని పూజా ఆరోపించగా అలాంటిదేం లేదని రణ్వీర్ బుకాయించాడు. అయితే విషయం తెలిసిన పూజా సోదరుడు రాహుల్.. ఐరన్ రాడ్తో అతడిని కొట్టేందుకు ప్రయత్నించాడని అప్పట్లో వార్తలు వచ్చాయి.పర్సనల్ లైఫ్ఇకపోతే పూజ.. 2003లో మనీష్ను పెళ్లి చేసుకోగా 2014లో విడాకులు తీసుకుంది. రణ్వీర్.. 2010లో కొంకణసేన్ శర్మను పెళ్లాడగా 2011లో బాబు జన్మించాడు. 2015లో రణ్వీర్- కొంకణ విడాకులు తీసుకున్నారు. -
Bigg Boss: ఇద్దరు భార్యలతో ‘బిగ్బాస్’లోకి.. ఎవరా కంటెస్టెంట్?
బుల్లితెరపై బిగ్బాస్ షోకి ఉన్న క్రేజ్ గురించి అందరికీ తెలిసిందే. తెలుగులోనే కాదు ఏ భాషలో అయినా ఈ రియాల్టీ షోకి మంచి ఆదరణ ఉంది. అందుకే ఓటీటీలో కూడా ఈ షోని రన్ చేస్తున్నారు. ఇప్పటికే బాలీవుడ్లో రెండు సీజన్లు ఓటీటీల్లో స్ట్రీమింగ్ అయి మంచి విజయం సాధించాయి. దీంతో తాజాగా హిందీలో బిగ్బాస్ ఓటీటీ సీజన్ 3ని ప్రారంభించారు మేకర్స్. ఎప్పటి మాదిరిలో ట్రెండింగ్లో ఉన్న నటీనటులతో పాటు ఫేమస్ యూట్యూబర్స్ ఇందులో పాల్గొన్నారు. అయితే ప్రతి సీజన్లోనూ ఓ జంట ఇందులో పాల్గొంటుంది. సీజన్లో 3లో కూడా దాన్ని కొనసాగించారు. విచిత్రంగా ఓ కంటెస్టెంట్ తన ఇద్దరు భార్యలతో హౌస్లోకి ఎంట్రీ ఇచ్చి షాకిచ్చాడు. ఆ కంటెస్టెంట్ పేరు ఆర్మాన్ మాలిక్. అతనో ఫేమస్ యూట్యూబర్. మొదటి భార్య పాయల్ మాలిక్, రెండో భార్య క్రితికా మాలిక్ ఇద్దరితో కలిసి బిగ్బాస్ హౌస్లోకి అడుగు పెట్టాడు. ‘బిగ్బాస్’ హిస్టరీలోనే ఇది తొలిసారి. ఇలా ఇద్దరు భార్యలతో షోలో పాల్గొనడాన్ని బిగ్బాస్ మాజీ కంటెస్టెంట్ దేవోలినా భట్టాచార్జితో పాటు పలువురు తప్పు పట్టినా.. ఆర్మాన్ మాత్రం తనను తాను సమర్థించుకుంటున్నాడు. (చదవండి: బిగ్ బాస్ షో.. చూడడానికే అసహ్యంగా ఉందన్న మాజీ కంటెస్టెంట్!)తమ మధ్య ఎలాంటి వివాదాలు రావని.. ఒక ఫ్యామిలీగా ఎలా ఉంటామో చూపించడానికే బిగ్బాస్లోకి వచ్చానని ఆర్మాన్ చెబుతున్నాడు. అంతేకాదు అభిమానులకు తన పర్సనల్ లైఫ్ ఎలా ఉంటుంది.. నా వ్యక్తిత్వం ఎలాంటి అని తెలియజేసేందుకు ఈ షో బాగా ఉపయోగపడుతుందని చెప్పాడు. తనదైన ఆటతీరుతో అందరి మనసులు గెలుచుకొని..కప్ కొడతానని ఆర్మాన్ చెప్పుకొచ్చాడు. మరి ఇద్దరి భార్యలతో కలిసి ఆర్మాన్ ఎలా ఆడతాడు? ఎలాంటి కంటెంట్ ఇస్తాడు అనేది మున్ముందు తెలుస్తుంది. అలా ప్రేమలో పడి..ఆర్మాన్, పాయల్ది ప్రేమ వివాహం. పాయల్ ఓ బ్యాంకు ఉద్యోగిణి. ఓ సందర్భంలో బ్యాంకులోకి వెళ్లిన ఆర్మాన్..తొలి చూపులోనే ఆమెతో ప్రేమలో పడ్డాడు. ఆరో రోజుల్లోనే తన ప్రేమను వ్యక్తం చేసి పెళ్లి చేసుకున్నాడు. ఎనిమిదేళ్ల పాటు కలిసి జీవించారు. ఓ మగ బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత మళ్లీ క్రితికా మాలిక్తో ప్రేమలో పడిపోయాడు. ఆమె పాయల్కు బెస్ట్ ఫ్రెండ్. పాయల్ ద్వారనే ఆర్మాన్కి పరిచయం అయింది. కొన్నాళ్ల తర్వాత ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది. పాయల్కు తెలియకుండానే పెళ్లి చేసుకున్నారు. కొన్నాళ్ల పాటు ముగ్గురి మధ్య గొడవలు కూడా జరిగాయి. చివరకు పాయల్ అంగీకరించడంతో ముగ్గురు కలిసి ఒకే ఇంట్లో కాపురం పెట్టారు. పాయల్కి ముగ్గురు సంతానం కాగా, కృతిక ఒక పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. కొన్నాళ్ల పాటు ఈ ముగ్గురు హైదరాబాద్లోనే ఉన్నారు. ప్రస్తుతం పిల్లలతో కలిసి పంజాబ్లోని చండీగఢ్లో నివసిస్తున్నారు.తొలిసారి అనిల్ కపూర్ హిందీ బిగ్బాస్ ఓటీటీ సీజన్ 1కి కరణ్ జోహార్.. సీజన్ 2కి సల్మాన్ హోస్ట్గా వ్యవహరించారు. సీజన్ 3కి కూడా సల్మానే హోస్ట్ అని అంతా భావించారు. కానీ సీనియర్ హీరో అనిల్ కపూర్ని హోస్ట్గా పరిచయం చేసి షాకిచ్చారు. ఈ సీజన్ 3లో వడపావ్ గర్ల్ చంద్రికా దీక్షిత్, నటుడు రణ్వీర్ ష్రాయ్, శివానీ కుమారీ, బాక్సర్ నీరజ్ గోయట్, ప్రముఖ లాయర్ సనా మక్బూల్ ఖాన్, సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్ విశాల్ పాండే, లవ్ కేష్ కటారియా పాల్గొన్నారు. ప్రముఖ ఓటీటీ ‘జియో సినిమా’లో స్ట్రీమింగ్ అవుతోంది. View this post on Instagram A post shared by Kritika malik (@kritika_malik_9) -
పెళ్లికి రూ.60 లక్షలదాకా ఖర్చు.. ఏం లాభం? నాలుగేళ్లకే..
చందన్ శెట్టి, నివేదిత గౌడ.. కన్నడ బిగ్బాస్ రియాలిటీ షోలో వీళ్లిద్దరూ కంటెస్టెంట్లుగా పాల్గొన్నారు. హౌస్ నుంచి బయటకు వచ్చాక భార్యాభర్తలయ్యారు. 2020 ఫిబ్రవరి 6న ఎంతో ఘనంగా పెళ్లి చేసుకున్నారు. కరోనాను సైతం లెక్క చేయకుండా సెలబ్రేషన్స్లో మునిగిపోయారు. కానీ ఏం లాభం? నాలుగేళ్లకే విడిపోయారు. ఇకపై నీకు, నాకు ఏ సంబంధమూ లేదంటూ విడాకులు తీసుకున్నారు.నో 'ఇగో'తాజాగా ఓ ఇంటర్వ్యూలో చందన్ శెట్టి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. నాకు ఎటువంటి ఇగో లేదు. కాకపోతే డబ్బు ఎక్కువగా ఖర్చు పెట్టే అలవాటు ఉండేది. అలాంటప్పుడే కరోనా నాకు గుణపాఠం నేర్పింది. డబ్బును ఎలా వాడాలో తెలిసొచ్చేలా చేసింది. అప్పటివరకు పైసా అంటే లెక్క లేకుండా పోయింది. నేను చేసిన ప్రాజెక్టులు సక్సెస్ అవుతున్న సమయంలో ఈ మహమ్మారి వచ్చింది. అలా కోవిడ్ టైంలోనే నా పెళ్లి జరిగిపోయింది. ఈ పెళ్లి వేడుకల కోసం దాదాపు రూ.50-60 లక్షలు ఖర్చు పెట్టాను. తెలిసొచ్చిందిఉన్నదంతా ఖర్చయ్యాక డబ్బు అవసరం తెలిసొచ్చింది. మళ్లీ చాలా కష్టపడ్డాను. నెమ్మదిగా ఒక్కో మెట్టు ఎక్కాను. ఎప్పుడేమవుతుందో తెలియని అయోమయంలో ఉండేవాడిని. నేను కంపోజ్ చేసిన ఏ పాట హిట్టవుతుందో? ఏది ఫ్లాప్ అవుతుందో? అని భయంభయంగా ఉండేది. ఒకటి మాత్రం నిజం.. జీవితంలో నెక్స్ట్ ఏం జరుగుతుందనేది ఎవరూ అంచనా వేయలేరు' అని చెప్పుకొచ్చాడు.చదవండి: అందరూ ఏడిపించారు.. పేరు మార్చుకోక తప్పలేదు: అడివి శేష్ -
ఈ నెలాఖరు నుంచి బిగ్బాస్ ప్రారంభం.. ఫస్ట్ కంటెస్టెంట్ ఈవిడే!
బిగ్బాస్ రియాలిటీ షోను ఇష్టపడే జనాలు చాలామందే ఉన్నారు. వీరికోసం ఏ యేటికాయేడు కొత్త సీజన్లు వస్తూనే ఉన్నాయి. ఇప్పటివరకు హిందీలో బిగ్బాస్ షో.. 17 సీజన్లు విజయవంతంగా పూర్తి చేసుకుంది. షో మొదలవగానే సంతోషపడే బిగ్బాస్ ప్రియులు ఫినాలే వచ్చేసరికి అప్పుడే అయిపోయిందా అని ఫీలవుతున్నారు. ఇలాంటివారికోసం నిర్వాహకులు ఓటీటీ సీజన్ను ప్రవేశపెట్టారు. టీవీలో కాకుండా కేవలం ఓటీటీలో మాత్రమే ఈ షో చూడవచ్చన్నమాట! ఫస్ట్ కంటెస్టెంట్ఈ బిగ్బాస్ ఓటీటీ కూడా ఇప్పటివరకు రెండు సీజన్లు పూర్తి చేసుకుంది. తాజాగా మూడో సీజన్కు రంగం సిద్ధమైంది. ఈసారి సల్మాన్ ఖాన్కు బదులుగా స్టార్ నటుడు అనిల్ కపూర్ను హోస్ట్గా తీసుకున్నారు. తాజాగా బిగ్బాస్ ఓటీటీ ప్లాట్ఫామ్ జియో సినిమా.. ఫస్ట్ కంటెస్టెంట్ ఈవిడే అంటూ ఇన్స్టాగ్రామ్లో ఓ ఫోటో షేర్ చేసింది. ఆ ఫోటోలో ఓ చిన్న స్నాక్స్ బండి దగ్గర జనం గుమిగూడి ఉన్నారు. వారికి ఓ అమ్మాయి కావల్సివని సిద్ధం చేసి ఇస్తోంది. మరికొద్ది రోజుల్లో బిగ్బాస్ ఓటీటీ 3ఈ పిక్స్ చూసిన నెటిజన్లు తను ఫేమస్ వడాపావ్ గర్ల్ చంద్రిక అని కామెంట్లు చేస్తున్నారు. చంద్రిక.. ఢిల్లీలోని వీధుల్లో వడాపావ్ అమ్ముతూ ఫేమస్ అయింది. బిగ్బాస్ షో కోసం ఈ మధ్యే ఢిల్లీ నుంచి ముంబైకి వచ్చేసింది. మరి సోషల్ మీడియాలో అందరి దృష్టిని ఆకర్షించిన ఈ అమ్మాయి షోలో క్లిక్ అవుతుందో, లేదో చూడాలి. హిందీ బిగ్బాస్ ఓటీటీ మూడో సీజన్ జూన్ 21 నుంచి ప్రారంభం కానుంది. జియో సినిమాలో ఈ వెబ్తెర బిగ్బాస్ను చూసేయండి.. View this post on Instagram A post shared by JioCinema (@officialjiocinema) చదవండి: రజనీకాంత్ సినిమాలో అనవసరంగా నటించా: హీరోయిన్ -
నా జీవితంలో ఆ 105 రోజులు మర్చిపోలేను: వరుణ్ సందేశ్
హ్యాపీడేస్, కొత్త బంగారులోకం సినిమాలతో తెలుగు ప్రేక్షకులను బాగా దగ్గరయ్యాడు వరుణ్ సందేశ్. వరుస హిట్లు పడడంతో స్టార్ హీరో అవ్వడం పక్కా అని అనుకున్నారంతా. కానీ ఆ రెండు తప్ప వరుణ్ చేసిన సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ఆడలేదు. దీంతో అవకాశాలు సైతం తగ్గిపోయాయి. ఒకనొక దశలో వరుణ్ సందేశ్ అనే హీరో ఉన్నాడనే విషయాన్ని తెలుగు ప్రేక్షకులు మర్చిపోయారు. కానీ 2019లో బిగ్బాస్ రియాల్టీ షో ద్వారా వరుణ్ మళ్లీ తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. ఈ బుల్లితెర బిగ్ రియాల్టీ షోలో భార్య వితికాతో కలిసి పాల్గొని తనదైన ఆట తీరుతో ఆకట్టుకున్నాడు. దాదాపు 105 రోజుల వరకు బిగ్బాస్ హౌస్లోనే ఉన్నాడు. తాజాగా తన బిగ్బాస్ జర్నీ గురించి చెబుతూ వరుణ్ ఎమోషనల్ అయ్యాడు.‘బిగ్బాస్ షో నా కెరీర్ పరంగా ఎంత హెల్ప్ అయిందని చెప్పలేను కానీ.. పర్సనల్గా, ఫైనాల్షియల్గా చాలా ఉపయోగపడింది. ఈ షోలో పాల్గొనకంటే ముందు జనాలకు నాపై ఓ రకమైన అభిప్రాయం ఉండేది. నాకు యాటిట్యూడ్ ఎక్కువైనని, ప్లే బాయ్ అని ఏవోవో అనుకునేవాళ్లు. కానీ బిగ్బాస్లోకి వెళ్లిన తర్వాత నేను ఎలాంటివాడినో జనాలకు అర్థమైంది. ఆ షో నుంచి బయటకు వచ్చాకా చాలా మెసేజ్లు వచ్చాయి. వాళ్లు చూపించిన ప్రేమ మరచిపోలేనిది. హ్యాపీడేస్, కొత్త బంగారులోకం తర్వాత కూడా అంత ప్రేమను నేను చూడలేదు. ప్రజలకు నేను పర్సనల్గా కనెక్ట్ అయ్యేలా చేసింది బిగ్బాస్ షోనే. నా లైఫ్లో ఆ 105 రోజుల ఎక్స్పీరియస్ మర్చిపోలేను’ అని వరుణ్ చెప్పుకొచ్చాడు. వరుణ్ నటించిన తాజా చిత్రం ‘నింద’ ఈ నెల 21న ప్రేక్షకుల ముందుకు రానుంది. -
గాల్లో ఎగిరి ఫీట్లు చేస్తున్న బిగ్బాస్ బ్యూటీ.. ఏం ఫిట్నెస్ గురు!(ఫోటోలు)
-
పిచ్చి కూతలు కూసేముందు నీ కాపురమేమైందో చూసుకో: నటి
హిందీ బిగ్బాస్ 17వ సీజన్లో బుల్లితెర జంట ఇషా మాల్వియా- సమర్థ్ జురేల్ చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. వీరిద్దరూ బిగ్బాస్ హౌస్లో అభిషేక్ (ఇషా మాల్వియా మాజీ ప్రియుడు)ను చులకనగా చేసి మాట్లాడటం.. అతడు ఆవేశంతో సమర్థ్ చెంప చెళ్లుమనిపించడం.. ఎంతగానో వైరలయ్యాయి. హౌస్లో ఒకరిపై మరొకరు అంత ప్రేమ కురిపించుకున్నారు కానీ, షో నుంచి బయటకు వచ్చాక మాత్రం ఆ ప్రేమను కంటిన్యూ చేయలేకపోయారు. కొంతకాలానికే బ్రేకప్ చెప్పుకున్నారు.నాకెప్పుడో తెలుసువీళ్ల బ్రేకప్ను ఎప్పుడో ఊహించానంటూ నటి రింకూ ధావన్ సెటైర్లు వేసింది. 'కేవలం ఆరు నెలల్లో ఇషా నెక్స్ట్ ఎవరిని డేటింగ్ చేస్తుందనే వార్తను చదవాల్సి వస్తుందని సమర్థ్కు బిగ్బాస్ హౌస్లో ఉన్నప్పుడే చెప్పాను. ఆమె నిలకడగా ఓ చోట ఉండలేదు' అని వ్యాఖ్యానించింది. తాజాగా ఈ కామెంట్స్పై నటి ఇషా మాల్వియా ఆగ్రహం వ్యక్తం చేసింది. పిచ్చి కూతలు ఆపు'రింకూ సంసారం కూడా సరిగ్గా సాగనేలేదు. నేను ఈ మాట అనకూడదు.. కానీ నా గురించి అడ్డగోలుగా మాట్లాడితే ఊరుకునేది లేదు. తనకు విడాకులయ్యాయి. ఒక్కతే 20 ఏళ్ల కుమారుడిని చూసుకుంటూ బతికేస్తోంది. నా విషయంలో ఏమైంది? బ్రేకప్ చెప్పుకున్నా, రిలేషన్లో ఉన్నా మేము బాగానే ఉన్నాం. ఆమె తన గురించి తాను చూసుకుంటే బెటర్. పక్కవాళ్ల మీద ఫోకస్ చేసి వారి గురించి పిచ్చి కూతలు కూసి హైలైట్ అవ్వాలని చూస్తే బాగోదు' అని ఇషా వార్నింగ్ ఇచ్చింది.చదవండి: కజ్రారే సాంగ్.. లైవ్లో డ్యాన్స్ మర్చిపోలేనన్న అమితాబ్.. -
కిల్లింగ్ ఔట్ఫిట్తో 'ప్రియాంక జైన్' వీడియో వైరల్
బిగ్ బాస్ రియాలిటీ షో సీజన్-7 టాప్-5లో నిలిచిన ఏకైక లేడీ కంటెస్టెంట్ ప్రియాంక జైన్. జానకీ కలగనలేదు, మౌన రాగం సీరియల్స్ ద్వారా పాపులరిటీ తెచ్చుకుంది. అలా బుల్లితెర నటిగా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ బిగ్బాస్తో మరింత ఫేమ్ తెచ్చుకుంది. బిగ్ బాస్ వల్ల తనకు మంచి పేరు కూడా వచ్చింది. తన ప్రవర్తనుకు కూడా తెలుగు ప్రేక్షకులు మంచి మార్కులే వేశారు.ప్రియాంక జైన్.. ముంబైలో పుట్టి పెరిగినప్పటికీ అచ్చం తెలుగమ్మాయిలా టాలీవుడ్ ప్రేక్షకులను బుల్లితెరపై అలరిస్తోంది. అయితే, తాజాగా తన ఇన్స్టాగ్రామ్ పేజీలో ఆమె ఒక వీడియో షేర్ చేసింది. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే ప్రియాంక ఈసారి తన అందంతో తోటి నటీమణులకు సవాల్ విసిరింది. నీటిలో తడిసిన తన గ్లామర్తో కుర్ర కారులో హీట్ పెంచింది. ఒక ఆర్టిస్ట్గా ఉన్నందున తనలోని భిన్నమైన షేడ్స్ను కూడా ప్రేక్షకులకు పరిచయం చేయాలని ఆమె తెలిపింది. ఇప్పటికే బిగ్ బాస్ నుంచి పాపులర్ అయిన అషు రెడ్డి, అరియాన వంటి స్టార్స్ సోషల్ మీడియాలో తమ అందాలతో ఫిదా చేస్తున్న విషయం తెలిసింది. ఇప్పుడు ప్రియాంక జైన్ విడుదల చేసిన వీడియో వారిని తలదన్నేలా ఉందని చెప్పవచ్చు. ఆమె ఇచ్చిన కిల్లింగ్ ఎక్స్ప్రెషన్స్కు ఆడియన్స్ ఫిదా అవుతున్నారు. ప్రియాంకలో ఇంత టాలెంట్ ఉందా అంటూ ఆశ్చర్యపోతున్నారు. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. View this post on Instagram A post shared by Priyanka M Jain (@priyankamjain___0207) -
కొత్త కారు కొన్న అమర్ దీప్, తేజస్విని.. ధర ఎంతో తెలుసా?
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు అమర్దీప్ చౌదరి మెగాస్టార్ లెక్క.. సీరియల్స్ ద్వారా తెలుగు ఆడియెన్స్కు బాగా చేరువైన అమర్ ఆ గుర్తింపుతో బిగ్బాస్ సీజన్ 7లోకి ఎంట్రీ ఇవ్వడం. ఆపై రన్నర్గా నిలిచాడు. ఇక సీరియల్ నటి, కన్నడ బ్యూటీ అయిన తేజస్వని గౌడను ఆమర్ ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. అలా ఇద్దరూ సినిమా ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు.బిగ్ బాస్ తర్వాత అమర్ జీవితమే మారిపోయిందని చెప్పవచ్చు. పలు సినిమా ఛాన్స్లతో పాటు సీరియల్స్తో ఫుల్ బిజీగా ఉన్నారు. ఇప్పటికే సురేఖా వాణి కూతురు సుప్రితతో అమర్ ఒక సినిమాలో నటిస్తున్నాడు. షూటింగ్ కార్యక్రమాలు కూడా వేగంగా జరుగుతున్నాయి. ఇలాంటి సమయంలో తాజాగా తన అభిమాన హీరో రవితేజతో కూడా సినిమా ఛాన్స్ దక్కించుకున్నాడు.అయితే, అమర్ దీప్, తేజస్విని తాజాగా కొత్త కారు కొన్నారు. బ్లాక్ కలర్లో ఉన్న టాటా సఫారి కారును వారు కొన్నారు. దీని ధర రూ. 25 లక్షలకు పైగానే ఉండవచ్చని తెలుస్తోంది. కారు ముందు తేజస్విని తన స్నేహితులతో సందడి చేసింది. అమర్తో కలిసి వారందరు దిగిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. View this post on Instagram A post shared by Tejaswini Gowda (@_tejaswini_gowda_official) -
ఎట్టకేలకు రైతుబిడ్డ చేతికి! తల్లికి తొలి కానుక..
బిగ్బాస్ షో పనైపోయిందనుకున్న సమయంలో ఉల్టా పుల్టా అంటూ ఏడో సీజన్పై ఆసక్తి పెంచాడు కింగ్ నాగార్జున. ఈ రియాలిటీ షోని మళ్లీ గాడిలో పెట్టే పనిని తన భుజాలపై వేసుకున్నాడు. అలా నాగ్ హోస్ట్గా వ్యవహరించిన బిగ్బాస్ తెలుగు ఏడో సీజన్ బాగానే వర్కవుట్ అయింది. ఈ సీజన్లో రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ విజేతగా నిలవగా నటుడు అమర్దీప్ చౌదరి రన్నరప్తో సరిపెట్టుకున్నాడు.ప్రైజ్మనీతో పాటువిన్నర్కు రూ.50 లక్షల ప్రైజ్మనీ ఇవ్వాలి. అయితే ఫినాలేలో ప్రిన్స్ యావర్ రూ.15 లక్షల సూట్కేసును ఎగరేసుకుపోవడంతో ప్రశాంత్కు రూ.35 లక్షలు వచ్చాయి. ఇందులో 30-40 శాతం వరకు ట్యాక్స్కే పోతుంది. ఇది కాకుండా లగ్జరీ కారు గెలుచుకున్నాడు. అయితే హౌస్లో ఉన్నప్పుడు రూ.15 లక్షల విలువైన డైమండ్ జ్యువెలరీ కూడా ఇస్తామని ప్రకటించారు. అమ్మకు తొలి కానుకషో ముగిసిన ఐదు నెలల తర్వాత ఆ నగను ప్రశాంత్కు అందించారు. అక్షయ తృతీయ రోజే జ్యువెలరీ చేతికి రావడంతో రైతుబిడ్డ సంతోషంలో మునిగిపోయాడు. 'అమ్మకు తొలి కానుక.. బిగ్బాస్ ఏడో సీజన్కు థ్యాంక్స్.. లవ్యూ నాగ్ సర్..' అంటూ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ పెట్టాడు. ఇప్పుడా పోస్ట్ వైరల్గా మారింది. View this post on Instagram A post shared by MALLA OCHINA (@pallaviprashanth_)చదవండి: బుల్లితెర నటి ఇంట సెలబ్రేషన్స్.. బాబు ఊయల ఫంక్షన్ -
40 ఏళ్లు మాత్రమే బతుకుతాను.. డాక్టర్స్ మాటలతో డిప్రెషన్: గీతూ రాయల్
బిగ్బాస్ షో ద్వారా గీతూ రాయల్ చాలా పాపులర్ అయింది. సీజన్ 6లో ఆడుగుపెట్టిన గీతూ ఊహించని విధంగా ఎలిమినేట్ అయింది. వాస్తవంగా ఆమె టిక్టాక్ వీడియోలతో వెలుగులోకి వచ్చింది. ఆ తర్వాత తనదైన స్టైల్లో పలు కొటేషన్లు చెబుతూ యూత్ను ఆకట్టుకుంది. ఆపై బిగ్ బాస్ సీజన్లకు రివ్యూలు చెప్పే స్థాయి నుంచి ఏడో సీజన్లో బిగ్బాస్ బజ్కు వ్యాఖ్యాతగా వ్యవహరించే రేంజ్కు చేరుకుని భారీగా ఫ్యాన్స్ను సంపాధించుకుంది.తాజాగా గీతూ ఒక వీడియోను షేర్ చేసింది.. సుమారుగా 5 నెలల నుంచి తను ఓ సమస్యతో బాధపడుతున్నట్లు అందుకు సంబంధించి చికిత్స తీసుకుంటున్నట్లు తెలిపింది. ఈ క్రమంలో తను పడుతున్న అనారోగ్యానికి కారణాలు చెప్పింది. నేను గత ఐదు నెలలుగా బ్యాక్టిరియల్ ఇన్ఫెక్షన్తో బాధ పడుతున్నాను. 'దీనికి కారణం నేను బ్యాంకాక్ వెళ్లిన సమయంలో అనేక రకాల బొద్దింకలు, పురుగులు వంటి ఆహారపదార్థాలు తిన్నాను. అందువల్లే నేనే అనారోగ్యానికి గురైయాను అనుకుంటున్నాను. ఈ క్రమంలో మరో సందేహం కూడా ఉంది. ఒకసారి విజయవాడకు వెళ్లాను.. అక్కడ అమ్మవారి గుడి దగ్గరకు వెళ్లి కూడా దర్శించుకోకుండా వచ్చేశాను. ఇదీ కూడా కారణం కావచ్చని అనుకుంటున్నాను. ఈ రెండు సంఘటనల తర్వాతే నేను అనారోగ్యానికి గురికావడం జరిగింది. గత ఐదు నెలలుగా అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నాను. దీంతో చాలా డిప్రెషన్కు గురి కావడం జరిగింది.మొదటగా నాకు ఒక గాయం అయింది. మందులు వాడుతున్నా కూడా అది తగ్గలేదు. ఫైనల్గా ఒక పెద్ద ఆసుపత్రికి వెళ్తే ఒక పరీక్ష ద్వారా అసలు విషయం తెలిసింది. బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వచ్చిందని వైద్యులు చెప్పారు. దీనికి రెండేళ్ల పాటు ట్రీట్మెంట్ తీసుకోవాలని వైద్యులు చెప్పారు. ప్రతివారం ఒక ఇంజెక్షన్ కూడా తీసుకోవాలి. డాక్టర్లు చెప్పిన మాటలతో బాగా డిప్రెషన్కు వెళ్లిపోయాను. ప్రస్తుతం అయితే కొంతమేరకు బాగానే ఉన్నాను.' అంటూ గీతూ చెప్పింది.అలాంటి పొరపాటు చేస్తే.. 40 ఏళ్లు మాత్రమే బతుకుతానుఈ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ సోకిన వారు సరైన ఫుడ్,నిద్ర తప్పక పాటించాలని వైద్యులు సూచించినట్లు గీతూ రాయల్ చెప్పింది. పూర్తిగా డాక్టర్స్ చెప్పిన ప్రకారం లైఫ్ స్టైల్ మార్చుకోవాల్సి ఉందని ఆమె తెలిపింది.. వైద్యుల సూచనలు పాటించకుంటే మరింత అనారోగ్యానికి గురికావడం జరుగుతుందట. ఈ క్రమంలో 40 ఏళ్లకు మించి బతకడం కష్టమని డాక్టర్స్ చెప్పినట్లు గీతూ పేర్కొంది. ఫైనల్గా తన అనారోగ్య పరిస్థితికి గల కారణాల గురించి ఒక వీడియో ద్వారా పూర్తి వివరాలు పంచుకుంది. -
కమిట్మెంట్ ఇచ్చినా ఛాన్స్లు రావడం లేదు: హిమజ
సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే బిగ్బాస్ బ్యూటీ హిమజ సినిమా ఛాన్సుల గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. సుమారు పదేళ్ల క్రితం సీరియల్లతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన హిమజ 2013లో రామ్ నటించిన శివమ్ సినిమాలో ఛాన్సు దక్కించుకుంది. ఆ తర్వాత నేను శైలజ, శతమానంభవతి, వరుడు కావలెనుతో పాటు తెలుగులో పలు సినిమాల్లో డిఫరెంట్ క్యారెక్టర్స్ చేసింది హిమజ. సినిమాల్లోనే కాకుండా బుల్లితెరపై కొంచెం ఇష్టం కొంచెం కష్టం తో పాటు మరికొన్ని సీరియల్స్లో నటించి ప్రేక్షకులకు చేరువైంది. బిగ్ బాస్ 3 సీజన్లో కంటెస్టెంట్గా మెప్పించిన హిమజ తెలుగు పరిశ్రమలో మరింత పాపులర్ అయ్యారు. ప్రస్తుతం ఆమెకు అవకాశాలు వస్తున్నప్పటికీ సెలెక్టెడ్ ప్రాజెక్ట్లు చేస్తూ కొనసాగుతుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న హిమజకు ఓ ప్రశ్న ఎదురైంది. తెలుగు అమ్మాయిలకు అవకాశాలు చాలా తక్కువ వస్తున్నాయి.. దానికి కారణం ఏంటి అనే ప్రశ్న ఎదురైంది. అందుకు హిమజ ఇలా చెప్పుకొచ్చారు. 'తెలుగు అమ్మాయిలు ఒకప్పుడు రిజర్వ్డ్గా ఉండేవారు. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇస్తేనే ఛాన్సులు వస్తాయి అనుకోవడం తప్పు.. విషయం ఏమిటంటే కమిట్మెంట్ ఇచ్చిన వాళ్లందరికీ కూడా ఆఫర్స్ రావడం లేదు. అలా అని అవకాశాలు అందుకున్న వారందరూ కమిట్మెంట్ ఇచ్చినవాళ్లు కాదు. ముంబై నుంచి వచ్చిన వాళ్లకు మాత్రం ఇక్కడ ఆఫర్స్ ఇస్తారు.. వారిలో ఏం నచ్చిందో తెలియదు. ఒక్కోసారి తెలుగు అమ్మాయిలు కూడా హీరోయిన్ అయితేనే చేస్తాను అనే వారు కూడా ఉన్నారు. అది చాలా తప్పు. ఫస్ట్ అవకాశం వస్తే తీసుకొని సద్వినియోగం చేసుకుంటే ఏదోరోజు మంచి భవిష్యత్ ఉంటుంది. నా వరకు అయితే హీరోయిన్ మాత్రమే కావాలని రాలేదు. నాకు ఏ అవకాశం వచ్చినా చేస్తాను. నాకు మొదట పనిమనిషి పాత్ర వచ్చింది చేశాను. ఆ తర్వాత మంచి అవకాశాలు వచ్చాయి. ప్రస్తుతం నేను హ్యాపీగానే ఉన్నాను. తెలుగు అమ్మాయి అయిన హిమజ సీరియల్ నటిగా కెరీర్ ప్రారంభించినప్పటికీ ఆమెను చూసిన వారు ఎవరైనా సరే హీరోయిన్ మెటీరియల్ అనాల్సిందే. కానీ ఆమెకు ఛాన్సులు అయితే దక్కాయి కానీ హీరోయిన్ను చేయలేకపోయాయి. ఈ క్రమంలో నేను శైలజ, జనతా గ్యారేజ్, వరుడు కావలెను, ధ్రువ, మహానుభావుడు, శతమానం భవతి వంటి హిట్ చిత్రాల్లో సపోర్టింగ్ రోల్స్తో మెప్పించింది. -
రెండు వారాల్లోనే ఓటీటీలోకి 'బిగ్ బాస్' బ్యూటీ సినిమా.. అధికారిక ప్రకటన
బిగ్బాస్ ఫేం దివి హీరోయిన్గా నటించిన తాజా చిత్రం ‘లంబసింగి’.‘ఎ ప్యూర్ లవ్ స్టోరీ’ అనేది ఉపశీర్షిక. నవీన్ గాంధీ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని టాలీవుడ్ డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ కురసాల నిర్మించాడు. ఈ మూవీ ద్వారా భరత్ రాజ్ హీరోగా పరిచయం అయ్యాడు. మార్చి 15న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కొంతమేరకు మెప్పించింది. ఇప్పుడు ఓటీటీలోకి విడుదల కానుంది. ఈమేరకు హాట్స్టార్ నుంచి అధికారిక ప్రకటన కూడా వెలువడింది. పోలీసు-నక్సలైట్ల పోరు నేపథ్యంలో జరిగే ఓ అందమైన ప్రేమ కథే ‘లంబసింగి’. హరిత అనే పాత్రలో హీరోయిన్ దివి ఒదిగిపోయింది. ఆమె పాత్ర ఇచ్చే ట్విస్టులు ఆకట్టుకుంటాయి. తెరపై కొత్త దివిని చూస్తారు. అంతలా మెప్పించిన లంబసింగి చిత్రం ఏప్రిల్ 2 నుంచి హాట్స్టార్లో స్ట్రీమింగ్ కానుంది. ఈమేరకు అధికారికంగా ప్రకటన కూడా వచ్చేసింది. సినిమా విడుదలైన రెండు వారాలకే ఈ చిత్రం ఓటీటీలోకి రానున్నడంతో ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు. తెలుగు రియాలిటీ షో బిగ్బాస్ ద్వారా దివికి మంచి గుర్తింపు వచ్చింది.నాలుగో సీజన్లో పాల్గొని మంచి క్రేజ్ తెచ్చుకున్న తెలుగమ్మాయి దివి. ఈ షోలో పాల్గొని బయటకొచ్చిన తర్వాత పలు సినిమాలు, సిరీసుల్లో నటిస్తూ బిజీగా ఉంది. ఇప్పటికే చిరంజీవి ఆచార్య చిత్రంలో నటించిన దివి పలు వెబ్ సిరీస్లలో కూడా నటించిన విషయం తెలిసిందే. -
'బిగ్ బాస్' నటికి 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ.. జైలుకు తరలింపు
కన్నడ నటి, బిగ్ బాస్ బ్యూటీ సోను శ్రీనివాస్ గౌడకు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీని కోర్టు విధించింది. బాలికను అక్రమంగా దత్తత తీసుకున్న కేసులో ఆమె నిందితురాలిగా ఉన్న విషయం తెలిసిందే. సోనూ గౌడకు ఏప్రిల్ 8 వరకు జ్యుడీషియల్ రిమాండ్ విధిస్తూ సీజేఎం కోర్టు న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. 8 ఏళ్ల బాలికను అక్రమంగా దత్తత తీసుకున్న కేసులో సోనూ గౌడను బాదరహళ్లి పోలీసులు అరెస్ట్ చేశారు. ఆమెను కోర్టులో హాజరుపరచగా రిమాండ్ విధించడంతో ప్రస్తుతం బెంగళూరు సెంట్రల్ జైలుకు తరలించారు. నటి ఏం చెప్పింది..? జువైనల్ జస్టిస్ యాక్ట్, హిందూ దత్తత చట్టాన్ని ఉల్లంఘించినందుకు బిగ్ బాస్ కంటెస్టెంట్ సోను శ్రీనివాస్ గౌడను పోలీసులు అరెస్ట్ చేశారు. అంతకుముందు మీడియాతో స్పందించిన సోను శ్రీనివాస్ గౌడ.. ఈ కేసులో చట్టపరమైన విచారణ జరుగుతోందని తెలిపింది. నేను ఒక అమ్మాయిని తీసుకువచ్చాను ఎందుకంటే ఆమెకు ప్రస్తుతం రక్షణ అవసరం, ఆమె కుటుంబం ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది. అందుకే నేను తెచ్చుకున్నాను. నేనే ఆమెను సురక్షితంగానే చూసుకున్నాను. ఏం జరిగింది..? గత మార్చి 2న సోను గౌడ తన సోషల్ మీడియా ఖాతాల్లో ఓ వీడియోను షేర్ చేసింది. ఆ వీడియోలో, ఆమె ఒక బాలికను తీసుకుని వచ్చింది. అది కూడా తన తల్లిదండ్రుల సమక్షంలోనే జరిగింది. రాయచూర్కు చెందిన బాలికను దత్తత తీసుకుంటున్నట్లు అందులో సోనూ పేర్కొంది. కానీ హిందూ దత్తత చట్టం ప్రకారం దత్తత తీసుకునే వ్యక్తికి, దత్తత తీసుకునే బిడ్డకు మధ్య కనీసం 25 ఏళ్ల గ్యాప్ ఉండాలి. ఆపై దత్తత తీసుకున్న వ్యక్తి తన అర్హత గురించి కేంద్ర, రాష్ట్ర అడాప్షన్ అథారిటీకి తెలియజేసిన అనంతరం వారి సమక్షంలోనే దత్తతను అంగీకరించాలి. అలాగే, సోనూ గౌడ ఆ బాలిక తల్లిదండ్రులకు వివిధ సౌకర్యాలను కల్పించినట్లు పేర్కొంది. దీంతో ఇది అమ్మకాల ప్రక్రియగా కనిపిస్తుంది. అంతేకాకుండా పిల్లల ఆత్మగౌరవాన్ని దెబ్బతీయవచ్చు. ప్రస్తుతం ఆమెది స్కూల్కు వెళ్లి చదువుకోవాల్సిన వయసు.. కానీ ఆ బాలిక విషయంలో ఇది జరగలేదు. పలువురు ఫిర్యాదు చేయడంతో సోనూ గౌడను పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు చిన్నారిని తమ కస్టడీలోకి తీసుకుని ప్రభుత్వ అనాథాశ్రమంలో ఆశ్రయం కల్పించారు. -
విరూపాక్ష సినిమా నేను చేయాల్సింది: అర్జున్
సీరియల్స్ నుంచి సినిమాల్లోకి వచ్చినవాళ్లు చాలానే ఉన్నారు. అయితే కొందరే క్లిక్ అవుతారు. సీరియల్స్కు, సినిమాకు మధ్యలో బిగ్బాస్ ప్లాట్ఫామ్ను వాడుకున్నవాళ్లూ ఉన్నారు. ఇక్కడ క్రేజ్ తెచ్చుకున్నాక పలువురూ సినిమాల్లో బిజీ అవుతుంటే మరికొందరు మాత్రం ఇప్పటికీ హీరోగా నిలదొక్కుకునేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. నెగెటివిటీ అయితే బిగ్బాస్ 7 కంటెస్టెంట్ అర్జున్ అంబటి మరో రకం. ఇతడు నేరుగా సినిమాల్లోనే అడుగుపెట్టాడు. కానీ ఎంత కష్టపడ్డా గుర్తింపే దొరకలేదు. దీంతో బుల్లితెరను ఆశ్రయించాడు. సీరియల్స్ ద్వారా క్లిక్ అయ్యాడు. ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నాడు. ఈ క్రేజ్ను మరింత క్యాష్ చేసుకునేందుకు బిగ్బాస్ తెలుగు ఏడో సీజన్లో అడుగుపెట్టాడు. కానీ వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్గా ఎంట్రీ ఇవ్వడం అతడు చేసిన పెద్ద పొరపాటు! ఈ షో వల్ల అతడు నెగిటివిటీ మూటగట్టుకున్నాడు. ప్రస్తుతం అతడు నటించిన తెప్ప సముద్రం త్వరలో రిలీజ్ కానుంది. రెండేళ్లు తిరిగాం ఈ క్రమంలో ఓ ఇంటర్వ్యూకు హాజరైన అర్జున్ అంబటి ఆసక్తికర విషయాన్ని బయటపెట్టాడు. 'డైరెక్టర్ కార్తీక్ నా స్నేహితుడు. అతడు ఎప్పుడూ సినిమా ప్రపంచంలోనే ఉంటాడు. అతడితో నేను లూప్ అని ఓ వెబ్ ఫిలిం చేశాను. తర్వాత మేమిద్దరం ఓ సినిమా చేద్దామనుకున్నాం. నిర్మాతల కోసం రెండేళ్లు తిరిగాం. కానీ సెట్టవ్వలేదు. అప్పుడు ఓటీటీ లాంటి ప్లాట్ఫామ్స్ కూడా లేవు. ఆ ప్రాజెక్ట్కు శాసనం అని టైటిల్ పెట్టుకున్నాం. తర్వాత అదే విరూపాక్షగా రిలీజైంది. అయినా నేను సంతోషంగానే ఉన్నాను. నాతో చేసుంటే అంత పెద్ద సక్సెస్ వచ్చి ఉండేది కాదేమో!' అని చెప్పుకొచ్చాడు. చదవండి: 'ఓం భీమ్ బుష్' సినిమా కలెక్షన్స్ ఊహించలేరు.. -
8 ఏళ్ల బాలికతో వీడియోలు.. బిగ్ బాస్ బ్యూటీ అరెస్ట్
కన్నడ బిగ్బాస్ సీజన్ -1 ద్వారా గుర్తింపు తెచ్చుకున్న సోనూ శ్రీనివాస్ గౌడను పోలీసులు అరెస్ట్ చేశారు. అక్రమంగా 8 ఏళ్ల బాలికను దత్తత తీసుకున్న కేసులో ఆమె అరెస్ట్ కావడం జరిగింది. సదరు బాలికను దత్తత తీసుకున్న సమయంలో ప్రభుత్వ విధానాలను అనుసరించలేదని బైదరహళ్లిలో ఉన్న చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీస్ పరిధిలోని అధికారుల ఫిర్యాదు మేరకు పోలీసులు అరెస్ట్ చేశారు. సమాజంలో సానుభూతి, పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవడం కోసమే ఆ చిన్నారిని సోనూ శ్రీనివాస్ గౌడ దత్తత తీసుకున్నట్లు పలు ఫిర్యాదులు రావడంతో పోలీసులు చర్యలు తీసుకున్నారు. వెస్ట్ డివిజన్ డిసిపి ఎస్ గిరీష్ వివరిస్తూ.. 'ప్రభుత్వ నింబంధనలు పాటించకుండా ఒక బాలికను సోనూ దత్తత తీసుకున్నారని మహిళా, శిశు సంక్షేమ శాఖకు చెందిన ఒక అధికారి ఫిర్యాదు చేశారు. రాయచూర్కి చెందిన ఆ బాలిక వయసు 8 ఏళ్లు కాగా ఆ చిన్నారితో సోషల్ మీడియాలో రీల్స్తో పాటు.. యూట్యూబ్ కోసం పలు వీడియోలను సోనూ క్రియేట్ చేసింది. దాని ద్వారా వచ్చే డబ్బుతో ఆ చిన్నారిని పోషిస్తానని ఆమె చెప్పింది. విచారణలో దత్తతకు సంబంధించి సరైన ఆధారాలు లేకపోవడంతో మేము అరెస్టు చేశాము.' అని ఆయన తెలిపారు. బిగ్బాస్ ఫేమ్ సోనూ మాత్రం తాను ఎలాంటి తప్పు చేయలేదని చెబుతూ తనకు తెలిసిన వరకు దత్తత నియమాలను పాటించానని చెప్పింది. సుమారు 45 రోజుల క్రితం ఆ చిన్నారిని ఆమె తీసుకొచ్చింది. అర్థరాత్రి సమయంలో నిద్రపోతున్న ఆ బాలికను తన తల్లిదండ్రులతో మాట్లాడి తీసుకొని వచ్చింది. అందుకు సంబంధించిన ఒక వీడియోను తన యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ చేసింది. ఆ వివరాలను పోలీసుల వద్ద ఆమె పంచుకుంది. అయితే, దత్తత ప్రక్రియలో పారదర్శకతతో పాటు సరైన పత్రాలు ఆమె వద్ద లేవని అధికారులు తెలిపారు. రాయచూర్కు చెందిన ఆ బాలికను దత్తత తీసుకుంటున్నట్లు మార్చి 2న సోనూ ఒక వీడియో ద్వారా ప్రకటించింది. అయితే, హిందూ దత్తత చట్టం ప్రకారం, దత్తత తీసుకున్న వ్యక్తి కుటుంబ వివరాలు పారదర్శకతతో కూడి ఉండాలి. పాఠశాలకు వెళ్లి చదువుకోవాల్సిన చిన్నారి.. ఇంటి వద్దే ఉంచడం నేరం. ఆపై తనకు సంబంధం లేని బాలికతో వీడియోలు చేయడం నేరం. ఇలాంటి విషయాలే సోనూను తప్పుగా చిత్రీకరిస్తున్నాయి. ప్రస్తుతం ఆ చిన్నారిని ప్రభుత్వ అనాథ శరణాలయానికి తరలించగా.. పోలీసులు సోనూను విచారిస్తున్నారు. అనంతరం ఆమెను కోర్టులో హజరు పరచనున్నారు. సోనూ మీద నాన్బెయిలబుల్ కేసు నమోదు అయినట్లు తెలుస్తోంది. -
మెగాస్టార్ సాంగ్లో కుర్రాళ్ల మనసులు కొల్లగొట్టిన బ్యూటీ.. తొలిసారి ఇలా
గౌహర్ ఖాన్.. బాలీవుడ్లో ఆమె పేరు చాలా పాపులర్. బిగ్బాస్ సీజన్-7 విన్నర్,టీవీ స్టార్,మోడల్,హీరోయిన్ ఇలా పలు రంగాల్లో రాణించిన ఆమె కొరియోగ్రాఫర్ జైద్ దర్బార్ను 2020లో ప్రేమించి వివాహం చేసుకుంది. గతేడాది పండంటి బిడ్డకు వారు జన్మనిచ్చి జెహాన్ అనే పేరు పెట్టుకున్నారు. కానీ ఇప్పటి వరకు బాబు ఫోటోలను వారు విడుదల చేయలేదు. రంజాన్ మాసం సందర్భంగా ముస్లింలకు పరమ పవిత్రమైన నగరం మక్కా క్షేత్రంలో బాబు ఫోటోను రివీల్ చేసి వారి ఆనందాన్ని పంచుకున్నారు. మెగాస్టార్ చిరంజీవి నటించిన సూపర్ హిట్ సినిమా శంకర్ దాదా ఎంబీబీఎస్తో తెలుగు వారికి గౌహర్ ఖాన్ సుపరిచయమే. ఇందులో 'నాపేరే కాంచనమాల' అనే స్పెషల్ సాంగ్తో అభిమానులను ఓ రేంజ్లో ఆమె అలరించింది. ఈ పాటతో తెలుగు కుర్రాళ్ల మనసులు కొల్లగొట్టింది బాలీవుడ్ బ్యూటీ గౌహార్ ఖాన్. 18 ఏళ్ల వయసులో మోడల్గా కెరీర్ ఆరంభించిన గౌహర్ఖాన్ పలు అందాల పోటీల్లోనూ పాల్గొన్నారు. యాంకర్గా కెరీర్ను ఆరంభించిన ఆమె పలు సీరియల్స్లోనూ నటించారు. గేమ్, రాకెట్ సింగ్, ఫీవర్, బేగం జాన్ వంటి చిత్రాలతో పాటు తాండవ్ వెబ్ సిరీస్ ఆమెకు మంచి పేరును తెచ్చాయి. ఆమె పెళ్లి నాటికి వారి వయసు గౌహర్ ఖాన్(37), కొరియోగ్రాఫర్ జైద్ దర్బార్(25). గౌహర్ ఖాన్ కంటే జైద్ దర్బార్ 12 ఏళ్లు చిన్నవాడు కావడంతో వారి పెళ్లి గురించి పలు విమర్శలు వచ్చాయి. కానీ పెళ్లి తర్వాత వారు ఎంతో సంతోషంగా గడుపుతున్నట్లు పలు ఫోటోలతో పంచుకుంటూ వచ్చారు. గతేడాది మే నెలలో ఒక బాబుకు జన్మనిచ్చినట్లు వారు ఎంతో సంతోషంగా ఆ వార్తను పంచుకున్నారు. బాబును తొలిసారిగా పవిత్ర స్థలమైన మక్కాకు తీసుకుని రావడం చాలా సంతోషంగా ఉంది. అతనికి నిరంతర సానుకూలత, ప్రేమ, ఆశీర్వాదం ఇవ్వాలని ఫ్యాన్స్ను వారు కోరారు. View this post on Instagram A post shared by Gauahar Khan (@gauaharkhan) -
21 ఏళ్లకే పెళ్లి.. విడాకులు.. నాన్నకు ఇప్పటికీ కోపమే!
మొదట్లో బిగ్బాస్ షోలో కేవలం సెలబ్రిటీలే ఎక్కువగా కనిపించేవారు. సీరియల్, సినిమా, మోడలింగ్కు చెందినవారినే ఎక్కువగా తీసుకువచ్చేవారు. ఇప్పుడు సోషల్ మీడియాలో పాపులారిటీ తెచ్చుకున్న జనాలకు సైతం బిగ్బాస్ ఆఫర్ ఇస్తున్నారు. అలా సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్ నోరా ముస్కాన్ మలయాళ బిగ్బాస్ ఆరో సీజన్లో అడుగుపెట్టింది. తాజాగా ఆమె హౌస్లో తన కష్టాలను ఏకరువు పెట్టింది. వేరేవేరే పేర్లతో.. 'నా అసలు పేరు సైబాల్ సదత్. పొన్నుస్ అనే నిక్నేమ్తో సోషల్ మీడియా అకౌంట్ ఓపెన్ చేశాను. కానీ అదేం పేరని మా ఫ్రెండ్ ఏడిపించడటంతో నోరాగా మార్చుకున్నాను. నా అసలు పేరు వాడితే ఎక్కడ మా పేరెంట్స్కు తెలిసి పెద్ద గొడవ అవుతుందోననే ఇలా పేరు మార్చుకున్నాను. నాకు 21 ఏళ్ల వయసులోనే పెళ్లయింది. కానీ మా బంధం వర్కవుట్ కాకపోవడంతో విడాకులు అడిగాను. నేను విడాకులు తీసుకోవడం నా తల్లిదండ్రులకు అస్సలు ఇష్టం లేదు. నా భర్త కూడా విడాకుల ప్రక్రియ మరింత ఆలస్యం కావాలనే చూశాడు. విడాకులు తీసుకుంటే తప్పా? ఎందుకని అందరూ డివోర్స్ను పెద్ద తప్పులా చూస్తారు? ఇద్దరు మనుషులు కలిసుండలేనప్పుడు ఆ బంధాన్ని తెంచుకోవాలనుకోవడంలో తప్పేముందో అర్థం కాదు. పైగా ఇక్కడ కూడా తప్పంతా అమ్మాయిదే అన్నట్లు మాట్లాడతారు. ఇక నాకు ఎప్పుడైతే విడాకులు మంజూరయ్యాయో అప్పుడే నేను స్వతంత్రంగా, నా కాళ్లపై నేను నిలబడాలనుకున్నాను. అలా సోషల్ మీడియాను ఉపయోగించి ఇన్ఫ్లూయెన్సర్గా ఎదిగాను. దాని ద్వారా వచ్చిన డబ్బుతో ఓ ఇల్లు కూడా కొన్నాను. మా నాన్న పట్టించుకోవట్లే కానీ మా నాన్నకు ఇదంతా ఇష్టం లేదు. ఇలా సోషల్ మీడియా ద్వారా డబ్బులు సంపాదించడం తనకు ఏమాత్రం నచ్చలేదు. ఇప్పటివరకు నా ఇంటివైపే రాలేదు. ఈ మూడేళ్లలో మా నాన్నను కలిసిందే లేదు. ఏదేమైనా నేను వాళ్లను నిందించడం లేదు. వాళ్ల ఆలోచనా విధానం వేరు. కానీ ఎవరూ నా ప్రయాణాన్ని ఆపలేరు' అని చెప్తూ ఎమోషనలైంది సైబాల్. చదవండి: చాలా సింపుల్గా స్టూడియోలో కూతురి పెళ్లి చేసిన వెంకటేశ్.. ఫోటోలు వైరల్ -
డైరెక్టర్ సూర్యకిరణ్ మృతిపై సుజిత ఎమోషనల్
టాలీవుడ్ రచయిత, దర్శకుడు సూర్య కిరణ్ (48) మార్చి 11న కన్నుమూశారు. పచ్చ కామెర్ల కారణంగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. చెన్నైలో ఆయన అంత్యక్రియలు జరిగిన విషయం తెలిసిందే. ఆయన మృతి పట్ల ఇండస్ట్రీ కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఇప్పటికే సూర్యకిరణ్ గురించి ఆయన సన్నిహితులు పలు విషయాలను పంచుకుని బాధపడ్డారు కూడా. తాజాగా ఆయన సోదరి సుజిత రియాక్ట్ అయ్యారు. సూర్య కిరణ్కు సోదరి సుజిత అంటే చాలా ఇష్టం.. ఇదే విషయాన్ని ఆయన పలుమార్లు చెప్పిన విషయం తెలిసిందే. అదే విధంగా అన్నయ్య పట్ల సుజిత కూడా అమితమైన ప్రేమను చూపించేవారు. అలాంటిది నేడు సూర్యకిరణ్ లేడన్న నిజాన్ని తట్టుకోలేక ఆమె కన్నీళ్లు పెట్టుకున్నారు. 'ఆయన నా అన్నయ్య మాత్రమే కాదు.. నా హీరో, నాకు తండ్రి కూడా.. ఇండస్ట్రీలో నీ టాలెంట్కు, నీ మాటలకు నేను ఎప్పుడూ అభిమానినే. మరో జన్మంటూ ఉంటే.. అప్పుడైనా నీ కలలన్నీ సాకారం కావాలని దేవుడిని ప్రార్థిస్తున్నాను.' అంటూ సుజిత ఎమోషనల్ అయ్యారు. పసివాడి ప్రాణం సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్గా నటించిన సుజిత తర్వాత సినిమాలు, సీరియల్స్లోనూ నటించి పెద్ద నటిగా ఎదిగారు. చిన్నప్పుడు వారు తండ్రిని కోల్పోవడంతో ఒక నాన్నలా తమ కుటుంబాన్ని సూర్యకిరణ్ పోషించారని గతంలో సుజిత చెప్పారు. ప్రస్తుతం ఆమె పలు సీరియల్స్లో నటిస్తూ హైదరాబాద్లోనే సెటిల్ అయ్యారు. తమ మధ్య 8 ఏళ్లు గ్యాప్ ఉండటంతో ఎంతో ప్రేమగా అన్నయ్య చూసుకునేవారని ఆమె పేర్కొన్నారు. View this post on Instagram A post shared by Sujithar (@sujithadhanush) -
నేను ప్రేమించిన వాడు రోడ్డున పడ్డాడు: హీరోయిన్
పెరగడం, విరగడం ఈ రెండూ చిత్ర పరిశ్రమలో సహజం. ఉన్నత స్థాయికి ఎదగడం, పాతాళంలోకి తొక్కివేయడం అనేవి చాలా జరుగుతుంటాయి. అలా నటిగా తొలి చిత్రంతో వెలిగిపోయిన హీరోయిన్ కిరణ్ రాథోడ్ గుర్తుందా? ఆమె ఇప్పుడు జీవితంలో చాలా కోల్పోయి మళ్లీ నిలబడే ప్రయత్నం చేస్తున్నారు. జెమిని చిత్రంతో కథానాయకిగా పరిచయం అయిన నటి కిరణ్. ఆ చిత్రం విజయంతో ఈమె పేరు మారుమ్రోగింది. అవకాశాలు వరుస కట్టాయి. అలా కమలహాసన్, అజిత్, విజయకాంత్, ప్రశాంత్ వంటి స్టార్ హీరోలతో జత కట్టారు. ఆ తరువాత సినిమాల్లో కనిపించలేదు. చాలా కాలం తరువాత క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఒకటి రెండు చిత్రాల్లో నటించారు. ఐటమ్ సాంగ్స్లోనూ నటించారు. ఈమె గురించి చాలా వదంతులు దొర్లాయి. కాగా ఇటీవల ఒక టీవీ చానల్లో పాల్గొన్న కిరణ్ తన నట జీవితం, వ్యక్తిగతం గురించి తెలుపుతూ కథానాయకిగా అవకాశాలు తగ్గుముఖం పట్టడంతో తన ప్రియుడు చెప్పిన మాటలు విని సినిమాలకు దూరం అయ్యానని చెప్పారు. అయితే అదే తాను చెసిన పెద్ద తప్పు అని ఆ తరువాత తెలుసుకున్నానన్నారు. దీంతో మళ్లీ నటించడానికి సిద్ధం కాగా కొందరు తనను తప్పుగా వాడుకునే ప్రయత్నం చేశారని చెప్పారు. అడ్జెస్ట్మెంట్ కావాలని అన్నారని బహిరంగంగానే చెప్పారు. అలాంటి సమయంలో తన ప్రేమికుడు వదిలేశాడని చెప్పారు. అందుకు కారణం తమ మధ్య చిన్న సమస్యలేనని చెప్పారు. ఒకసారి అతను తనను కొట్టారని, దాన్ని తాను సహించలేకపోయానని తెలిపారు. ఆ తరువాత అతనికి ఫోన్ చేసి రమ్మని పిలిచి కోపంతో కసి తీరా గట్టిగా కొట్టానని చెప్పారు. అప్పుడు అతడు చిరిగిన బట్టలతో రోడ్డున పడ్డాడని చెప్పారు. ఈ కారణంగానో ఏమో కొందరు తనను తప్పుగా ఉపయోగించుకోవాలని చూశారని, మరి కొందరు రాత్రి వేళల్లో ఫోన్ చేసేవాళ్లని చెప్పారు. వారంతా తప్పుడు వాళ్లని తాను అర్థం చేసుకున్నానన్నారు. తనకు మంచి స్నేహితులు లేరని కిరణ్ చెప్పారు. ఇలాంటి పలు కారణాల వల్ల తాను సినిమా అవకాశాలను కోల్పోయానని చెప్పారు. అలాగే తనకు పెళ్లి అయ్యిందని, పిల్లలు పుట్టారని పుకార్లు పుట్టించారని, తాను పెళ్లే చేసుకోలేదని స్పష్టం చేశారు. తెలుగు బిగ్ బాస్ సీజన్ 7లో ఆమె కంటెస్టెంట్గా ఉన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం సౌత్ ఇండియా నుంచి పలు సినిమాల్లో నటించాలనే ఆసక్తితో చాన్సుల కోసం ఆమె ఎదురు చూస్తున్నారు. -
సూర్యకిరణ్ ఈ ఒక్క తప్పు చేయడం వల్లే మరణించారు: సీనియర్ నటి
టాలీవుడ్ రచయిత, దర్శకుడు సూర్య కిరణ్ (48) మార్చి 11న కన్నుమూశారు. పచ్చ కామెర్ల కారణంగా ఆసుపత్రిలో చికిత్స పొందుతు ఆయన మరణించారు. నేడు చెన్నైలో ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి. టాలీవుడ్ ప్రేక్షకులకు ఎంతగానో దగ్గరయిన సూర్యకిరణ్ మరణించడంతో ఆయన సన్నిహితులు షాక్కు గురయ్యారు. బిగ్బాస్ తెలుగు నాలుగో సీజన్లో కంటెస్టెంట్గా కొనసాగిన విషయం తెలిసిందే. అదే సీజన్లో కంటెస్టెంట్గా ఉన్న సీనియర్ నటి కరాటే కళ్యాణి ఆయన మృతి పట్ల పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. హీరోయిన్ కళ్యాణిని ప్రేమ పెళ్లి చేసుకున్న సూర్యకిరణ్ పలు మనస్పర్దలు రావడంతో విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. ఈ విషయంలో ఆయన చాలా వరకు కుంగిపోయాడని కరాటే కళ్యాణి తెలిపారు. 'భార్యతో విడిపోయిన తర్వాత ఇక తనకు జీవితంలో ఏమీ మిగలలేదని ఆయన అనుకునే వాడు.. ఈ క్రమంలో ఎక్కువగా మద్యానికి బానిస అయ్యాడు. దీంతో ఆయన లివర్ బాగా దెబ్బతింది. ఈ క్రమంలో ఆయనకు పచ్చ కామెర్లు రావడంతో దానిని ఆయన గుర్తించలేకపోయాడు. ఆపై ప్రతి రోజూ మద్యం సేవించడంతో ఆ సమస్య ఎక్కువ అయింది. చికిత్స కోసం ఆసుపత్రిలో చేరినా ఉపయోగం లేకుండా పోయింది. సూర్య కిరణ్ నుంచి భార్య విడిపోయిన తర్వాత ఆమె మళ్లీ ఎప్పటికైనా తిరిగి వస్తుందని ఆశించాడు. అది ఎప్పటికీ జరగదేమో అనే ఆలోచనలతో రాత్రంతా మద్యం,సిగరెట్స్ తాగుతూ గడిపేవాడు. జాండిస్ ఉన్న సమయంలో ఎక్కువగా మద్యం తీసుకోవడం వలనే సూర్యకిరణ్ మరణించారని కరాటే కళ్యాణి తెలిపారు. (మాజీ సతీమణి కళ్యాణితో సూర్యకిరణ్) టాలీవుడ్లో సత్యం, ధన 51, రాజుభాయ్ వంటి చిత్రాలతో ప్రేక్షకులను మెప్పించిన సూర్యకిరణ్ 'మాస్టర్ సురేష్' పేరుతో 200లకు పైగా చిత్రాల్లో బాలనటుడిగా, సహాయ నటుడిగా నటించాడు. సూర్యకిరణ్ టి.ఎస్.మణి, రాధాలకు చెన్నైలో జన్మించారు. వీరి స్వస్థలం కేరళలోని తిరువనంతపురం. ఆయన సోదరి సుజిత కూడా బుల్లితెరతో పాటు పలు సినిమాల్లో నటిగా రాణిస్తున్నారు. -
బిగ్బాస్ విన్నర్ ఓవరాక్షన్.. యూట్యూబర్ను దారుణంగా కొడుతూ..
హిందీ బిగ్బాస్ విన్నర్ ఎల్విష్ యాదవ్ ఓ యూట్యూబర్పై దాడి చేశాడు. తన మనుషులను వెంటేసుకుని షాపింగ్మాల్కు వెళ్లి సాగర్ ఠాకూర్ అలియాస్ మాక్స్టర్న్ను చితకబాదాడు. మొదటగా తనను కలిసేందుకు వచ్చాడేమోననుకుని పలకరించడానికి ముందుకు వెళ్లాడు సదరు యూట్యూబర్. కానీ అతడు దగ్గరకు వెళ్లగానే ఎల్విష్.. తన చెంప చెళ్లుమనిపించాడు. కాలితో తన్నాడు. 10 మందితో కలిసి దాడి అతడు తిరిగి దాడి చేద్దామనుకునేలోపు ఎల్విష్ మనుషులు సాగర్ను చితకాబాదారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ ఘటనపై బాధితుడి ఫిర్యాదు మేరకు గురుగ్రామ్ పోలీసులు ఎల్విష్ యాదవ్పై కేసు నమోదు చేశారు. 'ఎల్విష్ నన్ను కలవాలనుకుంటున్నాడని తెలిసినప్పుడు ఏదో మాట్లాడతాడనుకున్నాను. కానీ 10 మందిని వెంటేసుకుని వచ్చి నాపై దాడి చేశాడు. బూతులు మాట్లాడుతూ.. వారు తాగి ఉన్నారు. బూతులు మాట్లాడుతూ కొట్టారు. ఎల్విష్ నా వెన్నెముక విరగ్గొట్టాలని చూశాడు. మార్చి 8న ఈ ఘటన జరిగింది. అతడు వెళ్లిపోతూ నన్ను చంపేస్తానని బెదిరించాడు' అంటూ మరో వీడియో రిలీజ్ చేశాడు యూట్యూబర్. కాగా సాగర్ ఠాకూర్.. గతంలో ఎల్విష్పై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశాడని, ఆ కోపంతోనే ఇలా దాడి చేశాడని తెలుస్తోంది. అటు ఎల్విష్.. పామువిషంతో రేవ్ పార్టీ చేసుకున్నాడంటూ గతేడాది చివర్లో అతడిపై కేసు కూడా నమోదైంది. ఇంతలోనే మరోసారి చీప్గా ప్రవర్తిస్తూ కేసులో ఇరుక్కున్నాడు. Full-Kalesh b/w You tuber Elvish Yadav and Real Maxtern yesterday night (With Audio) pic.twitter.com/s8DMjB1qOV — Ghar Ke Kalesh (@gharkekalesh) March 8, 2024 Real Maxtern Reply after this Kalesh Incident:pic.twitter.com/7ubeQZMvSV https://t.co/fjhAGtWCE5 — Ghar Ke Kalesh (@gharkekalesh) March 8, 2024 చదవండి: చెఫ్ అవతారంలో మన గ్లోబల్ స్టార్.. ఉపాసన వీడియో వైరల్! -
షణ్ముక్.. ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడా..?
యూట్యూబర్, బిగ్బాస్ ఫేమ్ షణ్ముక్ జస్వంత్ ఈ మధ్య గంజాయి కేసులో దొరికిపోయిన తర్వాత రోజూ పలు కథనాలు వస్తూనే ఉన్నాయి. వాస్తవంగా షణ్ముక్ అన్నయ్య సంపత్పై ఓ యువతి ఫిర్యాదు చేసి పోలీసులతో పాటుగా వారి ఫ్లాట్కు వెళ్లింది. ఆ సమయంలో షన్ను గంజాయి సేవిస్తూ ఉన్నాడని పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ సందర్భంలో తీసిన వీడియో ఒకటి వైరల్ అవుతుంది. అక్కడ తన సోదరుడి ప్రియురాలిపై షన్ను ఫైర్ అయ్యాడు. నేనే డిప్రెషన్లో ఉన్నానంటూనే.. ఆత్మహత్య చేసుకోవాలనుకున్నానని వ్యాఖ్యలు చేశాడు. దీనిని బట్టి చూస్తే అతను ఏదో మానసిక ఒత్తిడిలో ఉన్నట్లు తెలుస్తోంది. డిప్రెషన్లోనే షణ్ముక్ గంజాయి సేవిస్తున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మాదక ద్రవ్యాలకు ఎలా అడిక్ట్ అవుతున్నారు..? మాదక ద్రవ్యాల సరఫరా మన చుట్టూ ఒక చెయిన్లా సాగుతుంది. రద్దీగా ఉండే ప్రాంతాల్లో ఉండే కిళ్లీ దుకాణాలు, కాఫీ షాపుల ద్వారా కూడా వీటి సరఫరా సాగుతూనే ఉంటుంది. సెలబ్రిటీలను హైక్లాస్ పార్టీలకు పిలిచి ఉచితంగా మద్యం సరఫరా చేస్తామని చెబుతూ మొదలైన ఈ వ్యవహారం క్రమంగా వారిని డార్క్ వెబ్కు కనెక్ట్ చేస్తుంది. ఆ తర్వాత డెలివెరీ బాయ్స్ ద్వారా నేరుగా వారి ఇంటికే సరఫరా చేసే వరకూ కథ చేరుతుంది. ఇదే విషయాన్ని గతంలో పోలీసు శాఖ వారు వివిధ సందర్భాల్లో చెప్పారు. ఎలాంటి వారు బానిసలుగా మారుతున్నారు..? ఆర్థిక సమస్యలు, ప్రేమ విఫలం, ఒత్తిడి, మోసాలు, విరక్తి.. ఇలా కారణం ఏదైనా కావొచ్చు.. తాత్కాలిక సమస్యల్ని ఎదుర్కోలేక చాలా మంది క్షణికావేశంలో నిండు నూరేళ్ల జీవితాన్ని మధ్యలోనే త్యజిస్తున్నారు. స్టార్ హోదా.. డబ్బు.. అభిమానులు.. గొప్ప పేరు ఉన్న సినీ నటులు కూడా ఆత్మహత్య చేసుకుని వార్తల్లో నిలుస్తున్నారు. నాటి సిల్క్స్మిత నుంచి బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ వరకూ ఇలా ఆత్మహత్యలకు పాల్పడిన తారలెందరో ఉన్నారు. తాజాగా పోలీసుల ముందు షణ్ముక్ కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేశాడు. గంజాయి లాంటివి తీసుకునేటప్పుడు స్కిజోపెర్నియాలాంటి తీవ్రమైన మానసిక సమస్యలు కనిపించడంతో పాటు వారి మూడ్లో మార్పులు, మానసిక ఒత్తిడి, ఆందోళన కలుగుతాయి. మత్తు పదార్థాలను ఇంజెక్షన్లు ద్వారా తీసుకోవడం వల్ల హెచ్ ఐ వి లాంటి వి వచ్చే ముప్పు కూడా ఉందని వైద్యులు చెబుతున్న మాట. డిప్రెషన్లో ఉన్నానని షణ్ముఖ్ ఎందుకు అన్నారు షణ్ముక్ ఇంటికి వెళ్లిన సమయంలో అతను ఇలాంటి మాటే అన్నాడు.. తను పూర్తిగా డిప్రెషన్లో ఉన్నట్లు చెప్పాడు. కొంత సమయం పాటు తన అన్నయ్య ప్రియురాలిపై ఫైర్ అయ్యాడు. వాస్తంగా షణ్ముక్ తన కెరియర్ను చాలా కష్టపడి బిల్డ్ చేసుకున్నాడు. ఒక సాధారణ యూట్యూబర్గా ప్రారంభమైన తన జీవితం.. బిగ్ బాస్ వరకు తీసుకోచ్చింది. ఆయన తీసిన షార్ట్ ఫిలింస్కు బాగా చదువుకున్న యువకులే ఎక్కువగా అడిక్ట్ అయ్యారు.. వాటిలో కంటెంట్ కూడా మధ్యతరగతి వర్గాలకు బాగా కనెక్ట్ అయ్యేలా ఉంటుంది. అంతలా యూత్ను ఆకర్షించిన షన్ను ఇప్పుడు డిప్రెషన్కు చేరుకునే స్థాయికి ఎందకు చేరుకున్నాడో తెలియదు. కానీ షన్ను వ్యక్తిగత జీవితంలో ప్రేమించిన అమ్మాయి దూరం కావడం వల్లే ఎక్కువగా డిప్రెషన్లోకి వెళ్లాడని కొందరు చెబుతున్న మాట. మరికొందరేమో బిగ్ బాస్ నుంచి వచ్చాక భారీగా ఆఫర్లు వస్తాయని అనుకుంటే కెరియర్ పరంగా మునపటి కంటే మరింత డౌన్ కావడమని చెబుతున్నారు. ఈ రెండు కారణాలతోనే షన్ను తీవ్ర నిరాశకు గురి కావడం జరిగిందని చెబుతున్నారు. డ్రగ్స్కు బానిసై పడి లేచిన కెరటాన్ని గుర్తు చేసుకోండి అమెరికా వెటరన్ స్విమ్మర్ ఆంటోనీ ఇర్విన్ ఎంతో మందికి స్పూర్తి.. 2004లో సిడ్నీ ఒలింపిక్స్లో 19 ఏళ్లకే బంగారు పతకాన్ని సొంతం చేసుకున్నాడు. ఇంకేముంది విపరీతమైన క్రేజ్ తన సొంతమైంది. లగ్జరీ జీవితానికి అలవాటు పడ్డాడు. మత్తు పదార్థాలకు బానిసగా మారి ఎప్పుడూ వివాదాలకు కేంద్ర బిందువుగా నిలిచేవాడు. ఇష్టరీతిన బైక్ రైడింగ్ చేస్తూ పట్టుబడటం, అధికారులు హెచ్చరించి వదిలిపెడితే.. మళ్లీ తనకు నచ్చినట్లుగా జీవితాన్ని లీడ్ చేశాడు. చివరకు వింత వ్యాధి(టోరెట్ సిండ్రోమ్)తో నిత్యం అవస్థపడేవాడు. దీంతో జీవితంపై విరక్తి చెందిన ఇర్విన్.. ఆత్మహత్యాయత్నం చేసినా ప్రాణాలతో బయటపడ్డాడు. భగవంతుడు తనకు పునర్జన్మ ప్రసాదించాడని మళ్లీ స్విమ్మర్గా అవతారమెత్తాడు. 2016 రియో ఓలింపిక్స్లో పాల్గొని రెండు స్వర్ణాలు కైవసం చేసుకుని లేటు వయసులో స్వర్ణం కొల్లగొట్టిన అమెరికన్ స్విమ్మర్గా రికార్డులకెక్కాడు. డ్రగ్స్కు ఫుల్స్టాప్ పెట్టి ప్రస్తుతం కూడా రేసులో ఉన్నాడు. మాదక ద్రవ్యాలు తీసుకునే వారిని నేరస్థుల్లా చూడటం మానేసి, వారిని డీఅడిక్ట్ చేసేందుకు సహకారం అందించాల్సిన అవసరముంది. దీనికి తల్లి తండ్రులు, డాక్టర్లు, సమాజం, మీడియా కూడా సహకారం అందించాలని పలువురు విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. మానసిక ఒత్తిడి తట్టుకోలేని వారే ఎక్కువగా ఇలాంటి వాటికి అడిక్ట్ అవుతారని పలువురు వైద్యులు తెలిపారు. -
నేను అలాంటి చిత్రాల్లో నటించలేదు.. కిరణ్ రాథోడ్ ఆవేదన
హిందీలో 'యాది' సినిమాతో ప్రయాణం మొదలుపెట్టింది కిరణ్ రాథోడ్. ఆ మరుసటి ఏడాది నువ్వులేక నేను లేనుతో తెలుగులో, జెమిని సినిమాతో తమిళంలో రంగప్రవేశం చేసింది. కాగా ఈమెకు రజనీకాంత్ బాబా సినిమాలో అవకాశం వచ్చింది. కానీ అప్పటికే జెమిని మూవీకి సంతకం చేయడంతో దీన్ని వదులుకోక తప్పలేదు. ఇప్పటికీ దీని గురించి బాధపడుతూ ఉంటుంది కిరణ్. ఈమె బాలీవుడ్ నటి రవీనా టండన్ కజిన్ కూడా! తమిళంలో కమల్ హాసన్, అజిత్ కుమార్, విక్రమ్ సహా ప్రముఖ హీరోలతో నటించిన కిరణ్.. సినిమా ఛాన్సులు పీక్లో ఉన్నప్పుడే ఆమె ఇండస్ట్రీకి దూరమయ్యారు. చాలా కాలం తర్వాత తెలుగు బిగ్బాస్-7లో కనిపించిన కిరణ్ మొదటి వారంలోనే ఎలిమినేట్ అయ్యారు. తాజాగా ఒక యూట్యుబ్ ఛానల్ కోసం ఆమెను నటి షకీల ఇంటర్వ్యూ చేశారు. ఈ క్రమంలో ఆమె పలు విషయాలను పంచుకున్నారు. (ఇదీ చదవండి: వంద కోట్ల స్టార్ హీరో పుట్టినరోజు.. తెరపైకి పాత ఫోటోలు.. ఎవరో గుర్తుపట్టారా?) చాలా ఏళ్లుగా తనపై వస్తున్న రూమర్స్ గురించి కిరణ్ ఇలా చెప్పారు. 'నేను ఇప్పటి వరకు ఎలాంటి అశ్లీల చిత్రాల్లో నటించ లేదు. కానీ మీడియా నాపై ఎందుకు అలాంటి వార్తలను ప్రచారం చేసిందో తెలియదని కిరణ్ రాథోడ్ ఆవేదన వ్యక్తం చేసింది.' తమిళ్లో జెమిని సినిమా తర్వాత ఓవర్నైట్ స్టార్ అయిన కిరణ్ తర్వాత చాలా సినిమాల్లో నటించినా కూడా పెద్దగా హిట్ కొట్టలేకపోయింది. వాడి వల్లే సినిమా ఛాన్సులు తగ్గాయి గతంలో నేనొకరిని ప్రేమించాను. అతడితో నాలుగేళ్లపాటు రిలేషన్లో ఉన్నాను. కానీ అతడు సరైనవాడు కాదని ఆలస్యంగా తెలుసుకున్నాను. అతడిని పెళ్లి చేసుకుని ఉండుంటే కచ్చితంగా నన్ను చంపేసేవాడే! అలాంటివాడి కోసం ఆఫర్లు వదిలేసుకున్నాను. తర్వాత ప్రేమించినవాడు కూడా మంచోడు కాదు. తనతోనూ బ్రేకప్ అయింది. ప్రస్తుతం నేను ఒంటరిగానే ఉంటున్నాను. నేను తీసుకున్న తప్పుడు నిర్ణయం వల్ల నా జీవితం నాశనమైంది. ఇప్పుడు నేను నటించాలనుకుంటున్నాను. కానీ నాకు ఎవరూ ఆఫర్లు ఇవ్వడం లేదు. ఏవరైనా ఆఫర్లు ఇస్తే తప్పకుండా మళ్లీ నటిస్తాను. అని చెప్పుకొచ్చింది కిరణ్ రాథోడ్. సినిమా ఆఫర్లు ఇచ్చి రాత్రికి ఫోన్ చేస్తారు ప్రేమించిన వాడు దూరం అయ్యాడు.. చేతిలో సినిమాలు లేవు. అలాంటి సమయంలో కొందరు సినిమా ఛాన్స్ ఉందని కాల్ చేస్తారు. మీకు మంచి పాత్ర ఉందని కూడా ఆఫర్ చేశారు. ఎవరైతే ఆఫర్లు ఇస్తామని చెప్పారో మాట్లాడిన అదే రోజు రాత్రి మళ్లీ ఫోన్ చేస్తారు. తనతో గడపాలంటూ ఫ్లాట్కు రమ్మంటారు. అలా ప్రతిరోజూ చాలామంది రాత్రి అయితే కాల్స్ చేస్తూ ఉంటారు. అలాంటి సమయంలో నాకు అర్థం అయింది. ఈ సినిమా ఇండస్ట్రీలో నాకు ఎవరూ స్నేహితులు లేరు.. ఎవరూ సాయం చేయరు. అని తన పాత రోజులను గుర్తు చేసుకుంది. యాప్లో గ్లామర్ ఫోటోలు, వీడియోలు సినిమా అవకాశాలు లేకపోవడంతో అదే సమయంలోనే నేనొక యాప్ని ప్రారంభించాను. అందులో నా గ్లామరస్ ఫోటోలు, వీడియోలు రికార్డ్ చేశాను. అది చూసి నిర్మాతలు, దర్శకులు ఆఫర్లు ఇస్తారనుకున్నాను. కానీ వారితో పాటు మరికొందరు డబ్బులిస్తామంటూ కమిట్మెంట్ అడిగారు. ప్రత్యేకంగా ఇక్కడ ఒకరి పేరు చెప్పనవసరం లేదు.. ఆ సమయంలో ఇలా చాలా మంది కాల్ చేశారు. తర్వాత దానిని ఆపేశాను. ఇప్పుడు నేను నా ఇన్స్టాగ్రామ్ పేజీలో ఆకర్షణీయమైన ఫోటోలు, వీడియోలను పోస్ట్ చేస్తున్నాను. కానీ ఎలాంటి ఆఫర్లు రాలేదు.. ఇప్పుడు కూడా కొన్ని తప్పుడు కాల్స్ వస్తూనే ఉన్నాయని ఆమె చెప్పుకొచ్చింది. నేను శృంగార నటిని కాదు ఇలాంటి ఫోటోలు పోస్ట్ చేసేది నేనొక్కదాన్నే కాదు. చాలా మంది నటీమణులు చేస్తారు. కానీ నేను పోస్ట్ చేస్తే మాత్రం మీడియా మొత్తం నన్ను టార్గెట్ చేస్తుంది. ఎందుకో తెలియదు, నేను ఎలాంటి శృంగార చిత్రాల్లో నటించలేదు, వీడియోలు చేయలేదు. నాకిష్టమైన బట్టలు వేసుకుని వీడియోలు పోస్ట్ చేస్తాను. కానీ కొందరు మాత్రం కమిట్మెంట్ కోసం ఇతరులను ఆహ్వానిస్తున్నారా..? అంటూ కామెంట్లు చేస్తారు. ఇంటర్నెట్లో వస్తున్న వ్యాఖ్యలు తనను బాధిస్తున్నాయని నటి కిరణ్ ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో కిరణ్పై ఆరోపణలు సినిమా ఛాన్సులు తగ్గిన తర్వాత కిరణ్ పేరుతో ఒక యాప్ను ప్రారంభించి అభిమానులతో వ్యాపారం చేస్తోందని ఆమెపై రూమర్స్ వచ్చాయి. ఆ యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలంటే రూ.49 ఖర్చు చేయాలి. ఆ యాప్ ద్వారా వెయ్యి రూపాయలు చెల్లిస్తే కిరణ్ తన రెండు గ్లామరస్ ఫొటోలను పంపుతుంది. అదేవిధంగా ఆమెతో 5 నిమిషాలు మాట్లాడాలంటే రూ.10 వేలు చెల్లించాల్సిందేనట. వీడియో కాల్లో 15 నిమిషాలు మాట్లాడాలంటే రూ.15 వేలు, 25 నిమిషాలు మాట్లాడాలంటే రూ.25 వేలు చెల్లించాల్సిందే అంటూ అప్పట్లో వార్తలు వచ్చాయి.. వాటి గురించి తొలిసారి కిరణ్ రియాక్ట్ అయ్యారు. View this post on Instagram A post shared by KEIRA RATHORE (@kiran_rathore_official) -
మూడు వందలకు పైగా పెళ్లి సంబంధాలు.. అన్నీ రిజెక్ట్ చేశా: నటి
కన్నడ బుల్లితెర నటి వైష్ణవి గౌడ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటుంది. తరచూ తన ఫోటోలను షేర్ చేస్తూ ఫ్యాన్స్కు టచ్లో ఉంటుంది. వైష్ణవి గౌడకు ఇప్పటి వరకు 300 వరకు పెళ్లి సంబంధాలు వచ్చినట్లు ఆమె చెప్పి అందరినీ షాక్కు గురిచేసింది. జీ కన్నడ ఛానెల్లో ప్రసారమయ్యే సీతారాం సీరియల్లో మెరిసిన వైష్ణవికి ఎన్ని పెళ్లి ప్రపోజల్స్ వచ్చాయో తెలుసా? అంటూ కన్నడ సోషల్ మీడియాలో ఒక వార్త ట్రెండ్ అవుతుంది. కన్నడ బిగ్ బాస్ నందు ఈ సీజన్లో పాల్గొన్న వైష్ణవి ఎలిమినేట్ అవుతున్న సమయంలో.. మీకు ఎన్ని లవ్ ప్రపోజల్స్, పెళ్లి సంబంధాలు వచ్చాయని హీరో కిచ్చా సుదీప్ అడుగుతాడు. అందుకు సమాధానంగా వైష్ణవి కూడా కొంత సమయం ఆలోచించి దాదాపు 200 నుంచి 300 ప్రపోజల్స్ వచ్చాయని చెప్పింది. ఇది విన్న సుదీప్, 'అయ్యో.. వీటిలో ఒక్క ప్రపోజల్ కూడా మీకు కనెక్ట్ కాలేదా..? అని అడిగాడు. లేదని చెప్పేసిన ఈ బ్యూటీ ఇక నుంచి భవిష్యత్లో ఎలాంటి ప్రపోజల్స్ చూడాలని అనిపించలేదని తెలిపింది. 'నేను ఎప్పుడూ నా మనసుకు నచ్చిన పనే చేస్తాను.. కాబట్టి నా మనస్సు ఇప్పట్లో ఏ ప్రపోజల్ను చూడడానికి ప్రేరేపించలేదు. ఒకరిని ప్రేమించడం అంటే వాళ్ల మొహం చూడడం అనవసరం. ప్రేమ అంటూ చూడకుండానే మొదలు అవుతుంది. అని ఆమె చెప్పుకొచ్చింది. ఒకరి మొఖాన్ని చూడకుండా ప్రేమలో ఎలా పడుతావు అంటూ సుదీప్ షాక్ అయ్యాడు. ఇప్పుడు కన్నడ ఇండస్ట్రీలో ఈ బ్యూటీ టాపిక్ వైరల్ అవుతుంది.