-
హైదరాబాదీని అయిపోయా.. మోనాల్ ఆసక్తికర పోస్ట్
మోనాల్ గజ్జర్.. బిగ్బాస్ నాల్గో సీజన్లో హాట్ టాపిక్గా మారిన ఒకే ఒక్క పేరు ఇది. తొలుత అభిజిత్తో సన్నిహితంగా ఉండటం.. ఆ తర్వాత అఖిల్తో క్లోజ్గా మూవ్ కావడం, ఈమె వల్లే వారిద్దరు గొడవ పడటం..ఈ సీజన్కి హైలెట్గా నిలిచాయి. బిగ్బాస్ నాల్గో సీజన్లో ఎక్కువ ఎపిసోడ్లు కూడా ఈ ముగ్గురిపైనే ప్రసారం జరిగింది. ముఖ్యంగా హౌజ్లో అఖిల్- మోనాల్ల మధ్య రిలేషన్ వీక్షకులను బాగా ఆకట్టుకుంది. బిగ్బాస్లో పాల్గొనకముందు ఈ భామ పలు తెలుగు సినిమాల్లో నటించినప్పటికీ.. అప్పటి కంటే ఎక్కువ క్రేజ్ ఈమెకు బిగ్బాస్లో పాల్గొనడం ద్వారా వచ్చింది. ఇక హౌస్ నుంచి బయటకు వచ్చకా.. ఈ బ్యూటీ వరుస ఆఫర్లతో ఫుల్ బిజీ అయిపోయింది. ఇక తన ఫ్యాన్స్తో టచ్లోకి ఉండేందుకు సోషల్ మీడియాలోకి వచ్చిన ఈ గుజరాతీ భామ.. తరచుగా హాట్ హాట్ ఫోటోలు, వీడియోలు వదులుతూ హల్ చల్ చేస్తుంది. తాజాగా ఈ భామ ఇన్స్టాలో ఓ ఆసక్తికర పోస్ట్ పెట్టింది. వరుస ఆఫర్లు రావడంతో తన మకాంని హైదరాబాద్కి మార్చాలని భావించిందట ఈ ముద్దుగుమ్మ. ఇందుగో ఇటీవల హైదరాబాద్లో ఓ ఇంటిని కూడా కొనుగోలు చేసింది. తాజాగా తన తల్లిని తీసుకొని హైదరాబాద్లో ప్రత్యేక్షమైంది మోనాల్. దీనికి సంబంధించిన వీడియోని తన ఇన్స్టాస్టోరీలో పోస్ట్ చేస్తూ.. ‘ఇప్పుడు నాకో ఇల్లు దొరికింది. సో.. నేను కూడా అఫీషియల్గా హైదరాబాదీని అయ్యాను. జై శ్రీకృష్ణా.. గోవిందా గోవిందా’అంటూ పోస్ట్ చేసింది. చదవండి: హీరోయిన్ కాజల్ ఆస్తుల విలువ ఎంతంటే... -
అరియానా ఇంట్లో దొంగతనం! అరేయ్ చంపేస్తా.. అంటూ
బిగ్బాస్ నాల్గో సీజన్లో టామ్ అండ్ జెర్రీ ఎవరు అనగానే సోహైల్, అరియానా అని టపీమని చెప్తారు. ఎంత కొట్టుకున్నా చివరికి కలిసిపోయే వీళ్లను అభిమానులు సోషల్ మీడియాలో సోహియానా అని పిల్చుకుంటారు. బిగ్బాస్ షో తర్వాత కూడా వీళ్లిద్దరూ తరచూ కలుసుకుంటూ షోలో పాల్గొంటూ సందడి చేస్తున్నారు. తాజాగా అరియానా మీద ప్రతీకారానికి సిద్ధమయ్యాడు సోహైల్. బిగ్బాస్ హౌస్లో తనకు, అరియానాకు చిచ్చు పెట్టిన చింటు(అరియానా ఫేవరెట్ కోతి బొమ్మ)ను దొంగిలించి ఎత్తుకొచ్చేశాడు. ఈ మేరకు సోహైల్ ఓ వీడియో షేర్ చేశాడు. 'బిగ్బాస్లో నాకు శత్రువు ఉంది. వాడి మీద ప్రతీకారం తీర్చుకునే అవకాశం వచ్చింది. ఫ్రెండ్స్ మధ్య చిచ్చు పెట్టాలంటే దీన్ని తీసుకెళ్లండి. దీన్ని అమ్మేస్తున్నా. ఎవరైనా కొనేవాళ్లుంటే ముందుకు రండి' అని చెప్పుకొచ్చాడు. "మొట్టమొదటిసారి నాకు ప్రతీకారం తీర్చుకోవాలనిపిస్తోంది. నా అజాత శత్రువు.. బిగ్బాస్ జర్నీలో నాకున్న ఒకే ఒక ఎనీమీ. అతడే ఇతడు. వీడు దొరికేశాడు. ఇక వదిలేది లేదు. నన్ను ఆపొద్దు. అసలు వీడంటూ లేకపోయుంటే బిగ్బాస్లో నా జర్నీ మరింత బాగుండేది. వీడు నా చేతికి దొరికాడు, ప్రతీకారం తీర్చుకునేందుకు నాతో చేతులు కలపండి. వీడి మీద రివేంజ్ తీసుకునేందుకు చాలాకాలంగా ఎదురుచూస్తున్నా. భవిష్యత్తులో ఇంకెవరి మీదా ప్రతీకారం తీర్చుకోనని మాటిస్తున్నా.." అని చెప్పుకొచ్చాడు. తను ఎంతో ఇష్టపడే చింటును అమ్మేస్తాననడంపై అరియానా ఫైర్ అయింది. 'అరేయ్, నిన్ను చంపేస్తా.. అది అమ్మడానికి కాదు..' అంటూ వార్నింగ్ ఇచ్చింది. View this post on Instagram A post shared by 𝐒𝐘𝐄𝐃 𝐒𝐎𝐇𝐄𝐋 𝐑𝐘𝐀𝐍 (@syedsohelryan_official) చదవండి: సారీ అరియానా.. ఆలస్యమైనందుకు క్షమించు: ఆర్జీవీ -
అప్పుడు మొదలైన కథ ఇప్పటికీ నడుస్తుంది: సోహేల్
సోహేల్... బిగ్బాస్ షోతో ఎనలేని క్రేజ్ సంపాదిచుకున్నాడు. అప్పటిదాకా సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో నటించిన సోహైల్కు తెలుగు బిగ్బాస్-4 సీజన్ ఒక్కసారిగా గుర్తింపునిచ్చింది.హౌజ్లో ‘కథ వేరే ఉంటది’ అంటూ తనదైన మేనరిజమ్తో ఎంతో మంది అభిమానులను సంపాదించుకన్నాడు ఈ సింగరేణి ముద్దు బిడ్డ. వంద రోజుల పాటు హౌస్లో సందడి చేసిన సోహేల్ ఈ సీజన్లో స్పెషల్ అట్రాక్షన్గా నిలిచాడు. దీంతో ఒక్కసారిగా అతడికి ఫ్యాన్ ఫాలోయింగ్ వీపరితంగా పెరిగిపోయింది. సీజన్ విన్నర్ కన్నా అత్యధిక పాపులారిటీని సంపాదించుకున్నాడు. ఇక సీజన్ ఫినాలే రోజు తనకు వచ్చిన డబ్బుల్లో కొంత పేదల కోసం ఖర్చుపెడతానని ప్రకటించిన సోహేల్కు నాగార్జున నుంచి 10 లక్షల ఆఫర్ వచ్చిన సంగతి తెలిసిందే. వీటితో పాటు 'సోహీ హెల్పింగ్ హ్యాండ్స్' అనే ఛారిటీ ద్వారా ఇప్పటివరకు తాను చేసిన సేవా కార్యక్రమాలు, దానికి అయిన మొత్తం ఖర్చు వివరాలను వెల్లడించాడు. 'నాలుగు ఆపరేషన్లు సక్సెస్ అయ్యాయి. చాలామందికి నిత్యావసరాలు అందించాం. సోహీ హెల్పింగ్ హ్యాండ్స్, సోహెలియన్స్ మద్దతుతో ఇదంతా చేశాం. అలా ఇప్పటివరకు 14 లక్షల 70వేల 250 రూపాయలు జమ అయ్యాయి. వీటితో పాటు నాగార్జున సర్ ఇచ్చిన పది లక్షలు కలిపి ఎంతో మంది అనాథలకు, నిరుపేదలకు సహాయం చేశాం. అప్పుడు మొదలైన కథ ఇప్పటికీ నడుస్తుంది. ఇంక ఇలానే ఇది కొనసాగుతూనే ఉంటుంది' అని పేర్కొన్నాడు. భవిష్యత్తులో తన సినిమాలకు వచ్చే రెమ్యునరేషన్లో కొంత వీటికి ఖర్చుపెడతానని తెలిపాడు. అంతేకాకుండా త్వరలోనే 100మంది జూనియర్ ఆర్టిస్టులకు నిత్యావసరాలు పంపిణీ చేస్తామని వివరించాడు. ఎవరికి తోచినంత వారు పక్కన వాళ్లకి సహాయం చేస్తే ఆ కిక్కే వేరు అంటూ తన స్టైల్లో పేర్కొన్నాడు. ఇక ప్రస్తుతం శ్రీనివాస్ వింజనంపతి డైరెక్షన్లో సోహేల్ ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ‘జార్జ్ రెడ్డి’, ‘ప్రెషర్ కుక్కర్’ చిత్రాల నిర్మాత అప్పిరెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. View this post on Instagram A post shared by 𝐒𝐘𝐄𝐃 𝐒𝐎𝐇𝐄𝐋 𝐑𝐘𝐀𝐍 (@syedsohelryan_official) చదవండి : ఆట సందీప్కు వాయిస్ మెసేజ్ పంపిన మెగాస్టార్ చిరంజీవి సీరియల్స్ కంటే ముందు ‘వంటలక్క’ రియల్ ప్రొఫెషన్ ఇదే! -
Divi Vadthya: టాప్ యాంకర్లను వెనక్కు నెట్టిన దివి!
'దివి నుంచి దిగివచ్చావా ఆపిల్ బ్యూటీ.. నిను చూసి కనిపెట్టాడా న్యూటన్ గ్రావిటీ...' ఈ పాట వినగానే బుల్లితెర అభిమానులకు, అందులోనూ బిగ్బాస్ ప్రేమికులకు టపీమని గుర్తొచ్చే పేరు దివి వైద్య. అందచందాలతోనే కాదు, సూటిగా సుత్తి లేకుండా ఏదైనా ముఖం మీదే మాట్లాడే దివి తన యాటిట్యూడ్తో ఎంతోమందిని బుట్టలో వేసుకుంది. బిగ్బాస్ నాల్గో సీజన్లో పాల్గొన్న ఆమె హౌస్లో తన ప్రయాణం ఎక్కువ రోజులు సాగకపోయినప్పటికీ తక్కువ సమయంలోనే ఎక్కువ గుర్తింపు సంపాదించుకుంది. అలా ఏకంగా మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేసే అవకాశాన్ని పట్టేసింది. తాజాగా దివి ఓ అరుదైన ఘనత సొంతం చేసుకుంది. 2020లో టీవీ పరిశ్రమకు చెందిన మోస్ట్ డిజైరబుల్ వుమెన్గా దివి నిలిచింది. హైదరాబాద్ టైమ్స్ దివిని బుల్లితెర మోస్ట్ డిజైరబుల్ వుమెన్గా ప్రకటించింది. శ్రీముఖి, విష్ణుప్రియ, అనసూయ వంటి టాప్ యాంకర్లను సైతం వెనక్కు నెట్టి మరీ దివి ఫస్ట్ ప్లేస్లో నిలవడమంటే మామూలు విషయం కాదు. దీని గురించి దివి మాట్లాడుతూ.. "ఇది కలా? నిజమా? ఇప్పటికీ అస్సలు నమ్మశక్యంగా లేదు. జనాలు నా అందం కన్నా నా గుణాన్ని ప్రేమించారు. అందరూ నన్ను బ్యూటీ విత్ బ్రెయిన్ అంటుంటే సంతోషంగా ఉంటుంది. అయినా కాలంతో పాటు అందం మారిపోతుందేమో కానీ తెలివితేటలు మాత్రం ఎప్పటికీ మనతోనే ఉంటాయి" అని చెప్పుకొచ్చింది. ఏదేమైనా దివి పాప ఇలాంటి రికార్డును సాధించడంతో అభిమానులు ఫుల్ ఖుషీలో ఉన్నారు. హైదరాబాద్ టైమ్స్.. మోస్ట్ డిజైరబుల్ వుమెన్ ఆన్ టీవీ-2020 జాబితా ఇదే.. 1. దివి వైద్య 2. విష్ణుప్రియ 3. శ్రీముఖి 4. రష్మీ గౌతమ్ 5. వర్షిణి సౌందరరాజన్ 6.వర్ష 7.వింధ్యా విశాఖ 8. అశ్విని 9. దీప్తి 10. సమీరా షెరీఫ్ 11. అషూ రెడ్డి 12. లహరి శరి 13.అనసూయ భరద్వాజ్ 14. అలేఖ్య హారిక 15. నవ్య స్వామి చదవండి: ‘బిగ్బాస్–4’ ఫేమ్ దివీ విద్య లీడ్ రోల్లో ‘క్యాబ్ స్టోరీస్’ -
లవ్ మ్యారేజే, కాదంటే చంపుతా: అరియానా
రామ్గోపాల్ వర్మను ఇంటర్వ్యూ చేసి అప్పట్లో బాగా క్లిక్ అయింది అరియానా గ్లోరీ. అయితే ఆమె పేరును అంతా మరిచిపోయారు అనుకునేలోపు తెలుగు బిగ్బాస్ నాల్గో సీజన్లో అడుగుపెట్టి నానారచ్చ చేసింది. తనకు తప్పు అనిపిస్తే ఏకంగా బిగ్బాస్నే ఎదురించగలిగే సత్తా ఆమెది. అందుకే అరియానాను అందరూ బోల్డ్ పాప అని పిలుచుకుంటే ఆమె అభిమానులు మాత్రం గోల్డ్ పాప అని పలకరిస్తుంటారు. తాజాగా అరియానా అభిమానులతో క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ నిర్వహించింది. ఈ సందర్భంగా తన వాట్సాప్ డీపీని, వాల్పేపర్ను షేర్ చేసింది. వాట్సాప్ డీపీలో ట్రెడిషనల్గా ఉన్న ఈ బ్యూటీ వాల్పేపర్ మీద మాత్రం ట్రెండీగా రెడీ అయింది. ఈ మధ్య యూట్యూబ్ వీడియోలు ఎందుకు చేయడం లేదన్న ప్రశ్నకు.. అసలు ఎలాంటి వీడియోలు చేయాలో అర్థం కావడం లేదని బదులిచ్చింది. నటన, హోస్టింగ్.. ఈ రెండింట్లో యాంకరింగ్ ఎక్కువ ఇష్టమని, ఆ తర్వాతే యాక్టింగ్ అని తేల్చి చెప్పింది. తన ఫేవరెట్ పర్సన్ తానే అంటూ ఐ లవ్ మై సెల్ఫ్ అని చెప్పింది. బిగ్బాస్ భామ అరియానా గ్లోరీ అదిరే స్టిల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి బిగ్బాస్ రెండో సీజన్ విన్నర్ కౌశల్ గారిని కలుద్దామనుకున్నానని, కానీ సరైన సమయం దొరకడం లేదని తెలిపింది. అలాగే అవెంజర్ బైక్ నడపాలన్న తన మనసులోని కోరికను బయటపెట్టింది. ప్రేమ పెళ్లా? పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకుంటావా? అన్న ప్రశ్నకు సూటిగా సుత్తి లేకుండా లవ్ మ్యారేజే చేసుకుంటానని కుండ బద్ధలు కొట్టింది. అరేంజ్డ్ మ్యారేజ్ చాలా కష్టమని అభిప్రాయపడింది. కానీ లవ్ మ్యారేజ్ అంటే కూడా కాస్త భయమేనని చెప్పింది. 'నా తిక్కకు, పిచ్చికి, కోపానికి ప్రేమించినవాడు నన్ను పెళ్లి చేసుకుంటాడా? చేసుకోవాల్సిందే, లేదంటే చంపి పారేస్తా'నని చెప్పింది. ఇక క్రష్ గురించి బయటకు చెప్పనన్న అరియానా కొంతమంది అబ్బాయిలను చూసినప్పుడు 'అరె, భలే ఉన్నాడే ఈ అబ్బాయి' అని మనసులో అనుకుంటానని పేర్కొంది. అభిమానులు కోరిక మేరకు వారికి తన వాట్సాప్ నెంబర్ ఇవ్వాలనుందని, కానీ అందుకు ఇంట్లోవాళ్లు ఒప్పుకోరని కొంటెగా బదులిచ్చింది. చదవండి: పెళ్లికి రెడీ అవుతున్న అరియానా! వరుడు ఎవరంటే.. -
కరోనా: గొప్ప మనసు చాటుకున్న బిగ్బాస్ విన్నర్ అభిజిత్
దేశవ్యాప్తంగా కరోనా విజృంభిస్తోంది. ఈ సెకండ్ వేవ్ మరింత తీవ్రంగా ఉండటంతో తెలుగు రాష్ట్రాల్లో లాక్డౌన్ విధించిన సంగతి తెలిసిందే. దీంతో సామాన్య ప్రజలు మరోసారి నిత్యవసర సరుకులు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ ఆపత్కాలంలో పేద కటుంబాలను ఆదుకునేందుకు సామాన్య ప్రజల నుంచి సెలబ్రెటీల వరకు ముందుకు వస్తున్నారు. తాజాగా బిగ్బాస్ 4 సీజన్ విన్నర్ అభిజిత్ తన ఉదారతను చాటుకున్నాడు. సిద్దిపేటకు చెందిన ముడు పేద కుటుంబాలకు నిత్యావసర సరుకులు పంపిణి చేసి వారి అవసరాన్ని తీర్చాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలను, వీడియోలు అభిజిత్ తన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశాడు. ‘మూడు కుటుంబాలు నిత్యవసర సరుకుల కోసం ఇబ్బంది పడుతున్నారని నిన్న సాయంత్రం సిద్దిపేట నుంచి ఓ వ్యక్తి నాకు ఫోన్ చేశాడు. వెంటనే నేను నాకు తెలిసిన యువకులను దీని గురించి తెలుసుకోమ్మని చెప్పాను. తెల్లారి లేచే సరికి ఈ ఫొటోలు, వీడియొలు నాకు పంపించారు. ఇందుకు సహకరించిన సిద్దిపేట యువకులకు ధన్యవాదాలు’ అంటూ అభిజిత్ రాసుకొచ్చాడు. View this post on Instagram A post shared by Abijeet (@abijeet11) -
‘బిగ్బాస్–4’ ఫేమ్ దివీ విద్య లీడ్ రోల్లో ‘క్యాబ్ స్టోరీస్’
తెలుగు ‘బిగ్బాస్–4’ ఫేమ్ దివీ విద్య లీడ్ రోల్లో నటించిన చిత్రం ‘క్యాబ్ స్టోరీస్’. కేవీఎన్ రాజేష్ దర్శకత్వం వహించారు. ‘గాలి సంపత్’ చిత్రనిర్మాత ఎస్. కృష్ణ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 28న ‘స్పార్క్’ ఓటీటీలో ప్రీమియర్ కానుంది. ఈ సందర్భంగా దర్శక–నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘సరికొత్త కాన్సెప్ట్తో అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్గా రూపొందిన చిత్రమిది. సాయి కార్తీక్ చక్కని సంగీతం అందించారు. గిరిధర్, ధన్రాజ్, ప్రవీణ్, శ్రీహన్, సిరి తదితరులు ఇతర పాత్రల్లో నటించిన మా సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి’’ అన్నారు. -
ఆర్జీవీ OTTలో బిగ్బాస్ బ్యూటీ దివి మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..
బిగ్బాస్ సీజన్-4తో తర్వాత యూత్లో బాగా క్రేజ్ సంపాదించుకున్న నటి దివి. అంతకుముందు పలు సినిమాల్లో నటించినా ఈ భామకు పెద్దగా గుర్తిపు రాలేదు. కానీ బిగ్బాస్ 4వ సీజన్లో హౌజ్లో అడుగు పెట్టి ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించింది. ఉన్నది కొద్ది రోజులే అయినా అందరి దృష్టిని ఆకర్షించింది. తన అందం, అభినయం, ముక్కుసూటి తనంతో ఎంతోమందిని ఆకట్టుకుంది ఈ బ్యూటీ. తాజాగా క్యాబ్ స్టోరీస్ అనే చిత్రంలో నటించింది ఈ భామ. కెవిఎన్ రాజేష్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను ఎస్ కృష్ణ నిర్మించారు. అయితే కరోనా ఎఫెక్ట్తో ఈ మూవీని థియేటర్లో కాకుండా డైరెక్ట్గా ఓటీటీలో రిలీజ్ చేయనున్నారు. యువ ఔత్సాహిక పారిశ్రామికవేత్త సాగర్ మాచనూరు వర్మతో కలిసి స్పార్క్ అనే ఓటీటీని స్థాపించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా రాంగోపాల్ వర్మ తన భవిష్యత్తు ప్రాజెక్టులన్నీ స్పార్క్ ఓటీటీలోనే అందుబాటులో ఉంచేలా ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇప్పటికే ఇందులో వర్మ తెరకెక్కించిన డి చిత్రం విడుదలైంది. తాజాగా దివి లేటెస్ట్ మూవీ క్యాబ్ స్టోరీస్ స్పార్క్లో ఈనెల 28నుంచి స్ర్టీమింగ్ కానుంది. ఈ మేరకు పోస్టర్ని రిలీజ్ చేశారు. ఇక ఈ మూవీలో గిరిధర్, ధన్రాజ్, ప్రవీణ్,శ్రీహాన్, సిరి కీలక పాత్రలు పోషించారు. సుజాత సిద్ధార్థ్ సినిమాటోగ్రఫీ అందించగా, సాయి కార్తీక్ సంగీతం అందించారు. చదవండి : ఐటెం గర్ల్ అయినందుకు ఎలాంటి బాధ లేదు: రాఖీ సావంత్ -
మోనాల్పై అఖిల్కి ఎంత ప్రేమో.. ఈ పోస్ట్ చూస్తే తెలిసిపోతుంది
‘మోనాల్-అఖిల్ మధ్య ఏదో ఉంది.. అది కచ్చితంగా ప్రేమే. లేకపోతే అంత క్లోజ్గా ఎలా ఉంటారు? అఖిల్ కోసం మోనాలు ఎన్ని త్యాగాలు చేసింది. అఖిల్ కూడా మోనాల్ని ఎవరైనా ఏమైనా అంటే అస్సల్ సహించడు. దీన్ని ప్రేమ కాకపోతే ఇంకేం అంటారు? బయటకు వచ్చాక కచ్చితంగా వాళ్లు పెళ్లి చేసుకుంటారు’... బిగ్బాస్ నాల్గో సీజన్ మొదలయ్యాక రెండో వారం నుంచి బుల్లితెర ప్రేక్షకుల మదిలో మెదిలిన అనుమానాలు ఇవి. ఈ అనుమానాలు నిజం చేస్తూ బయట కూడా ఈ జంట ఎప్పుడూ కలుస్తూ నెట్టింట హల్ చేస్తుంది. పైకి మంచి స్నేహితులు అని చెబుతున్నా.. ఎప్పటికప్పుడు ప్రేమ, పెళ్లి పదాలు వాడుతూ అభిమానులను కన్ఫ్యూజన్లో పడేస్తున్నారు. అయితే అప్పుడప్పుడు మాత్రం వీరి ప్రేమ విషయాన్ని పరోక్షంగా ఒప్పుకుంటూ పోస్టులు పెడుతున్నారు. ఆ పోస్ట్లతో వీరిమధ్య ప్రేమ ఉందనే సందేహాలు మరింత ఎక్కువవుతున్నాయి. ఇక తాజాగా అఖిల్ మరో అడుగు ముందుకేసి తన రాణి మోనాలే అని చెప్పేశాడు. దీంతో వారి మధ్య కచ్చితంగా ప్రేమ ఉందని తెలిసిపోయింది. మోనాల్ పుట్టిన రోజు(మే 13)సందర్భంగా గురువారం అఖిల్ ఆమెకు బర్త్డే విషెష్ తెలియజేస్తూ.. సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టారు. రాణులకు సంబంధించి చాలా కథలు విన్నా.. రియల్ లైఫ్ రాణి మాత్రం నువ్వేనంటూ మోనాల్ పై ప్రేమను అఖిల్ చెప్పుకొచ్చారు. ఆమె గురించి వర్ణించడానికి తాను వాడిన పదాలు చిన్న పదాలు అని, అయితే ఆ పదాలను మించి వర్ణించడం తన వల్ల కావడం లేదని అఖిల్ చెప్పుకొచ్చాడు. మోనాల్ లాంటి వ్యక్తిని పరిచయం చేసినందుకు బిగ్ బాస్ షోకు థ్యాంక్స్ అని అఖిల్ అన్నాడు. మోనాల్ భవిష్యత్తులో చాలా ఎత్తుకు ఎదగాలని కోరుకుంటున్నానని అఖిల్ పేర్కొన్నారు. ప్రేమతో జైకృష్ణ జై శ్రీరామ్ అంటూ అంటూ అఖిల్ తన పోస్ట్ ను ముగించాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. అఖిల్ పోస్టును చూసిన నెటిజన్లు మోనాల్ పై అఖిల్ కు ఇంత ప్రేమ ఉందా..? అని కామెంట్లు చేస్తున్నారు. ఇక అఖిల్, మోనాల్ కలిసి ‘గుజరాతి అమ్మాయి..తెలుగు అబ్బాయి’అనే వెబ్ సిరీస్లో కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే. View this post on Instagram A post shared by 𝐀𝐊𝐇𝐈𝐋𝐒𝐀𝐑𝐓𝐇𝐀𝐊 (@akhilsarthak_official) -
కొత్త ఇంటికి మారిన బిగ్బాస్ భామ అరియాన
యాంకర్గా కెరీర్ను ఆరంభించి అతి తక్కువ సమయంలోనే సోషల్ మీడియాలో సెన్సేషన్గా మారిపోయింది అరియానా గ్లోరీ. ఆర్జీవీ చేసిన ఒక్క ఇంటర్వ్యూ ఈ బ్యూటీకి క్రేజ్ సంపాదించి పెడితే బిగ్బాస్ ద్వారా తనెంటో ప్రూవ్ చేసుకుంది. సీజన్-4 హౌజ్లో అడుగుపెట్టిన ఈ బ్యూటీ తన ముక్కుసూటితనంతో ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది. పలు సెలబ్రిటీలు సైతం అరియాన యాటిట్యూడ్కి ఫిదా అయ్యి స్వయంగా సోషల్ మీడియాలో ఆమెకు మద్దతిచ్చిన సంగతి తెలిసిందే. ఇక ఇటీవల ఈ భామ పెళ్లికూతురిగా ముస్తాబైన ఫొటోషూట్ పిక్స్ సోషల్ మీడియాలో హాల్చల్ చేస్తున్నాయి. ఈ క్రమంలో ఆమెకు సంబంధించిన మరో వార్త సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఇవాళ (బుధవారం) తను కొత్త ఇంటికి మారంటు ఇన్స్టాగ్రామ్లో ఓ వీడియో షేర్ చేసింది. ఈ వీడియోలో అరియాన మంకీ బొమ్మను చూపిస్తూ చింటు, చింటు అంటూ సందడి చేసింది. ఇక ఎక్కడపడితే అక్కడ సమాన్లతో నిండిపోయి గజిబిజిగా ఉన్న వారి కొత్త ఇంటిని చూపిస్తూ.. ‘హాయ్ ఫ్రెండ్స్ రీసెంట్గా మేం కొత్త ఇంటికి మారాం.. చూడండి ఇది మా పరిస్థితి’ అంటూ స్టోరీ షేర్ చేసింది. అది చూసిన నెటిజన్లు ‘మీ ఇల్లు చాలా బాగుంది. ఇంతకి కొన్నారా లేదా రెంటుకు దిగారా’ అంటు కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఈ ఇంటిని కొన్నారా లేదా అనేది మాత్రం ఈ బిగ్బాస్ బ్యూటీ క్లారిటీ ఇవ్వలేదు. -
ఏదైతే భయపడ్డానో అదే జరిగింది: అభిజిత్
తెలుగు బిగ్బాస్ నాల్గో సీజన్ విన్నర్ అభిజిత్ తల్లి కోవిడ్ బారిన పడింది. ఈ విషయాన్ని అభిజిత్ స్వయంగా సోషల్ మీడియా ద్వారా తన అభిమానులకు తెలియజేశాడు. "ఏదైతే భయపడ్డామో అదే జరిగింది. అమ్మకు పాజిటివ్ అన్న విషయం మంగళవారం తెలిసింది. కుటుంబ సభ్యులం పరీక్ష చేయించుకుంటే అందరికీ నెగెటివ్ వచ్చింది. కాస్త ఊరటనిచ్చే విషయం ఏంటంటే అమ్మకు సీటీ లెవల్స్ బాగానే ఉన్నాయి. త్వరగానే కోలుకుంటుందని ఆశిస్తున్నా" "ఇకపోతే ఈ కోవిడ్ మానసిక ధైర్యానికి పరీక్ష పెడుతుంది. ఐసోలేషన్లో ఉండటం అనేది చెత్త విషయం. ఒక వ్యాధి సోకిన మనిషిని రూమ్లో బంధించడం అనేది దారుణం. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. దురదృష్టవశాత్తూ మనం ఘోర పరిస్థితిలో ఉన్నాం. దీని గురించి ఇంకా మాట్లాడదల్చుకోలేదు. ఈ సమయాన్ని వృథాగా పోనీయకుండా ఏదైనా కొత్తది నేర్చుకోవాలనుకున్నా. అలా స్పానిష్ నేర్చుకుంటున్నాను" అని అభిజిత్ చెప్పుకొచ్చాడు. చదవండి: ఈ యంగ్ హీరోను గుర్తుపట్టారా? -
అరియానా అసలు పేరు తెలుసా? నాగార్జునకు కూడా చెప్పలేదు!
అరియానా గ్లోరీ.. బిగ్బాస్ షోలో ముక్కుసూటిదనంతో దూసుకెళ్తూ ప్రత్యేక గుర్తింపు పొందింది. ఐ యామ్ బోల్డ్ అంటూ బిగ్బాస్ హౌజ్లో అడుగు పెట్టిన ఈ భామ ఎంతో అభిమానులను సొంతం చేసుకుంది. బిగ్బాస్ కంటే ముందు యూట్యూబ్ యాంకర్గా ఉన్న అరియాన సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మను ఇంటర్వ్యూ చేయడంతో ఒక్కసారిగా సెలబ్రెటీ అయిపోయింది. ఇంటర్వ్యూలో సమయంలో తనను బికినీలో చూడాలని ఉంది అంటూ ఆర్జీవీ చేసిన కామెంట్స్తో అమ్మడు ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది. ఆ క్రేజ్తో బిగ్బాస్ ఎంట్రీ కొట్టెసిన అరియాన గ్లోరీ అసలు పేరు చాలా తక్కువ మంది తెలుసు. బిగ్ బాస్ తొలి ఎపిసోడ్లో హోస్ట్ నాగార్జున సైతం తన అసలు పేరు అడిగినప్పటికీ ఈ అమ్మడు రీవీల్ చేయలేదు. తనకు అరియానా పేరు అంటేనే ఇష్టమని, అసలు తన పాత పేరు గుర్తు కూడా లేదండూ చెప్పుకొచ్చిన సంగతి తెలిసిందే. తెలంగాణలోని తాండూరు నుంచి వచ్చిన ఈ అరియానా గ్లోరీ అసలు పేరు మంగలి అర్చన. అయితే ఈ పేరు చాలా మందికి తెలియదు.. కేవలం తన క్లోజ్ ఫ్రెండ్స్, కుటుంబీకులు మాత్రమే తెలుసు. వారు మాత్రమే తనని అప్పడప్పుడు అర్చన అని పిలుస్తారని, బయట వారంత అరియానా అనే పిలుస్తారట. ఎందుకంటే అర్చన పేరు తనకు కలిసి రాకపోవడం అరియానా గ్లోరీగా పేరు మార్చుకుందట. ఇదిలా ఉంటే అరియానా త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కనుందనే వార్త తాజాగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. అయితే వరుడు ఎవరనేది క్లారిటీ రావాల్సి ఉంది. చదవండి: పెళ్లికి రెడీ అవుతున్న అరియానా! వరుడు ఎవరంటే.. -
బిగ్బాస్ దివిపై ట్రోల్స్.. పాప కాస్తా ఓవర్ చేస్తోందంటూ..
నటి దివి బిగ్బాస్ తర్వాత ఒక్కసారిగా ఫేంను సంపాదించుకుంది. అంతకుముందు సినిమాల్లో నటించినప్పటికి ఈ భామ ఎవరికి అంతగా సుపరిచితురాలు కాదు. కానీ బిగ్బాస్ 4వ సీజన్లో హౌజ్ అడుగు పెట్టి ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించింది. ఉన్నది కొద్ది రోజులో అయినా అంత్యంత ప్రేక్షకదారణ పొందింది. తన అందం, అభినయం, ముక్కుసూటి తనంతో ఎంతోమందిని ఆకట్టుకుంది ఈ బ్యూటీ. కాగా బిగ్బాస్ తర్వాత దివి సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్గా ఉంటోంది. అంతేగాక ఫోటో షూట్లు చేస్తూ, పలు ప్రకటనలో నటిస్తూ ఫుల్ బిజీ అయిపోయింది. ఇదిలా ఉండగా ప్రస్తుతం దివి బంజారాహిల్స్లోని ప్రోటిన్ మార్ట్ అనే బ్రాండ్కు అంబాసిడర్గా వ్యవహరిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆమె ఇటీవల ఈ బ్రాండ్ ప్రకటనలో నటించింది. ఈ యాడ్కు సంబంధించిన వీడియోను దివి తన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసింది. ఇక అది చూసిన నెటిజన్లు.. ‘దివి పాప కాస్తా ఓవర్ చేస్తోంది’ అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ యాడ్లో దివి తన వంట మనిషి చేసిన చేప కూర తింటూ ఆమెతో కాస్తా దురుసుగా ప్రవర్తిస్తుంది. దీంతో వంట మనిషి అవి ప్రోటిన్స్ నాన్ వెజ్ మార్ట్ నుంచి తీసుకొచ్చిన చేపలు పాపగారు అని చెప్పడంతో.. తనకు ప్రోటిన్స్ మీద నమ్మకం ఉందంటూ కాస్తా ప్రకటన ఇచ్చింది. కాగా ఇటీవల ఓ ఇంటరర్వ్యూలో దివి మాట్లాడుతూ.. అధికంగా ప్రోటీన్లను అందించే సీఫుడ్ అంటే తనకెంతో ఇష్టమని చెప్పిన సంగతి తెలిసిందే. కాగా గతంలో ఆమె సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన మహర్షితో పాటు పలు సినిమాల్లో సైడ్ ఆర్టిస్ట్గా నటించిన సంగతి తెలిసిందే. View this post on Instagram A post shared by Divi Vadthya (@actordivi) చదవండి: సీ ఫుడ్.. మై డైట్ అంటున్న బిగ్బాస్ బ్యూటీ దివి -
అలీ రెజా కొత్త కారు, రవి ఏదో అంటున్నాడే?
అలీ రెజా.. బిగ్బాస్ రియాలిటీ షోలో పాల్గొన్న ఇతడు తన యాటిట్యూడ్తో, ఆటతీరుతో ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నాడు. బిగ్బాస్ మూడో సీజన్లో టాప్ 5 కంటెస్టెంట్లలో ఒకరిగా నిలిచిన అలీ ఈ షో తర్వాత ఏకంగా నాగార్జునతో కలిసి నటించే అవకాశాన్ని సైతం దక్కించుకున్నాడు. అలా యాక్షన్ మూవీ వైల్డ్ డాగ్ సినిమాలోనూ నటించి అభిమానులను మెప్పించాడు. తాజాగా అలీ రెజా ఓ కొత్త కారు కొన్నాడు, మహీంద్రా జిప్సీ ముందు ఫొటోకు పోజివ్వగా దీన్ని ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశాడు. దీంతో బుల్లితెర స్టార్స్తో పాటు ఫ్యాన్స్ అతడికి శుభాకాంక్షలు చెప్తున్నారు. ఈ క్రమంలో యాంకర్ రవి డిఫరెంట్గా కంగ్రాట్స్ చెప్పాడు,. వాట్ ద .. అంటూ ఎమోజీలు పెట్టాడు. ఇది చూసిన నెటిజన్లు.. ఎమోజీలతో బాగానే కవర్ చేస్తున్నావే అంటూ సెటైర్లు వేస్తున్నారు. View this post on Instagram A post shared by Ali Reza (@i.ali.reza) చదవండి: నాగార్జున ఫ్యాన్స్ను ఏప్రిల్ ఫూల్ చేసిన 'వైల్డ్ డాగ్' యూనిట్ -
సోహైల్కు ఖరీదైన బైక్ బహుమతిగా ఇచ్చిన ఫ్యాన్
ప్రముఖ రియాలిటీ షో బిగ్బాస్ ఎంతోమందికి నేమ్, ఫేమ్ తీసుకొచ్చింది. బిగ్బాస్ ముందు వరకు అంతగా పరిచయం లేదని వారంతా ఈ షోతో ఎంతో ఫేమస్ అయిపోయారు. వీరిలో సింగరేణి ముద్దు బిడ్డ సయ్యద్ సోహైల్ ఒకడు. అప్పటిదాకా సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో నటించిన సోహైల్కు తెలుగు బిగ్బాస్-4 సీజన్ ఒక్కసారిగా గుర్తింపునిచ్చింది. హౌజ్లో ‘కథ వేరే ఉంటది’ అంటూ తనదైన మేనరిజమ్తో ఎంతో మంది అభిమానులను సంపాదించుకన్నాడు ఈ సింగరేణి ముద్దు బిడ్డ. 100 రోజుల పాటు హౌస్లో సందడి చేసిన సోహైల్ ఈ సీజన్లో స్పెషల్ అట్రాక్షన్గా నిలిచాడు. దీంతో సోహైల్కు ఒక్కసారిగా ఫ్యాన్ ఫాలోయింగ్ వీపరితంగా పెరిగిపోయిందనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. బిగ్బాస్ షో నుంచి బయటకు రాగానే అతడి కోసం వందల సంఖ్యలో ఫ్యాన్స్ బారులు తీరిన దృశ్యమే ఇందుకు ఉదహరణ. తాజాగా ఓ అభిమాని సోహైల్ బర్త్డే సందర్భంగా సర్ప్రైజ్ ప్లాన్ చేశాడట. ఏప్రీల్ 18న సోహైల్ పుట్టిన రోజు సందర్భంగా లక్కీ అనే అభిమాని సోహైల్కు ఖరిదైన స్పోర్ట్స్ బైక్ను బహుమతిగా ఇచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియోను సోహైల్ తన ఇన్స్ట్రాగ్రామ్ షేర్ చేస్తూ ఆనందం వ్యక్తం చేశాడు. అంతేగాక సదరు అభిమానికి ఈ సందర్భంగా సోహైల్ కృతజ్ఞతలు తెలిపాడు. కాగా బిగ్బాస్కు వెళ్లిన తర్వాత సోహైల్ లైఫ్ టర్న్ అయ్యిందని చెప్పవచ్చు. బిగ్బాస్ నుంచి వచ్చిన తర్వాత సినిమాల్లో నటించాలని ఉన్నట్లు తన మనసులోని మాటను సోహైల్ వెల్లడించిన విషయం తెలిసిందే. ఇలా తన కోరికను బయట పెట్టాడో లేదో అలా సోహైల్కు దర్శక నిర్మాతల నుంచి సినిమా అవకాశాలు వచ్చాయి. ఈ క్రమంలో బిగ్బాస్ అనంతరం వరుస అవకాశాలు దక్కించుకుంటున్న సోహైల్.. హీరోగా ఓ సినిమాలో నటించనున్నాడు. ‘జార్జ్ రెడ్డి’, ‘ప్రెషర్ కుక్కర్’ చిత్రాల నిర్మాత అప్పిరెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సోహైల్ స్నేహితుడు శ్రీనివాస్ వింజనంపాటి ఈ చిత్రం ద్వారా దర్శకునిగా పరిచయమవుతున్నాడు. View this post on Instagram A post shared by 𝐒𝐘𝐄𝐃 𝐒𝐎𝐇𝐄𝐋 𝐑𝐘𝐀𝐍 (@syedsohelryan_official) -
‘బిగ్బాస్’ ఆఫర్ రిజెక్ట్ చేశా, డబ్బు కోసం కాదు కానీ.., : ఇంద్రజ
బుల్లితెరపై బిగ్బాస్ రియాల్టీ షోకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ముఖ్యంగా తెలుగులో అయితే ఈ బిగ్ రియాల్టీ షోకి విపరీతమైన ఆదరణ ఉంది. ఈ షోలో పాల్గొనే అవకాశం వస్తే వదులుకోలేరు. దానికి కారణం ‘బిగ్బాస్’ నుంచి బయటకు వస్తే.. డబ్బుతో పాటు సీనీ అవకాశాలు రావడమే. అందుకే చాలా మంది సెలబ్రిటీలు ఈ షోలోకి వెళ్తుంటారు. కొంత మంది సెలెబ్రిటీలు మాత్రం అవకాశం వచ్చినా వెళ్లడానికి మొగ్గు చూపపడం లేదు. ఆ లిస్టులో హీరోయిన్ ఇంద్రజ కూడా ఉన్నారు. బిగ్బాస్ నాల్గొ సీజన్లో ఇంద్రజకు అవకాశం వస్తే వెళ్లలేదట.ఒకప్పుడు హీరోయిన్గా వెలుగు వెలిగిన ఇంద్రజ.. గతకొద్ది కాలంగా సినిమాలకు దూరంగా ఉంటుంది. ఇటీవల బుల్లితెరపై ప్రసారమయ్యే ఓ కామెడీ షోకి జడ్జీగా వ్యవహరిస్తోంది. అయితే తాజాగా ఓ చానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో బిగ్బాస్ షోపై తన మనసులోని మాటను బయటకు పెట్టింది. ‘బిగ్బాస్’ నాల్గో సీజన్లో ఆఫర్ వచ్చింది. కానీ నేను రాలేనని చెప్పాను. ఫ్యామిలీని చెన్నైలో వదిలి.. నేను ఇక్కడ ఉండలేను. అందుకే బిగ్బాస్లోకి వెళ్లలేదు. భవిష్యత్తులోనే అవకాశం వచ్చినా వెళ్లలేదు. అయితే గెస్ట్గా అవకాశం వస్తే మాత్రం వెళ్తాను. అది కూడా డబ్బులు కోసం కాదు. హోస్ట్గా వ్యవహరిస్తున్న కింగ్ నాగార్జునని చూడడానికే వెళ్తా. ఆయనతో కాసేపు హ్యాపీగా మాట్లాడి బయటకు వస్తా. నాగ్ హోస్టింగ్ చాలా బాగుంటుంది. ఇప్పటికీ స్టైలీష్గా, అందంగా ఉన్నారు’ అంటూ కింగ్ నాగార్జునపై ప్రశంసలు కురిపించారు ఇంద్రజ. అలాగే నాగార్జునతో కలిసి హలో బ్రదర్ సినిమాలో ‘కన్నెపిట్టరో’ పాటకు నటించాని, ఆ ఎక్స్పీరియన్స్ ఎప్పటికీ మర్చిపోలేనని’ ఆ మధుర జ్ఞాపకాలను ఇంద్రజ గుర్తుచేసుకుంది. చదవండి: అలా పెళ్లి చేసుకోలేదు.. తన లవ్స్టోరీ చెప్పిన ఇంద్రజ నవ్వులు పూయిస్తున్న డాక్టర్ ‘రౌడీ బేబీ’ పేరడీ సాంగ్ -
అఖిల్ కొత్త బైకు: సోహైల్, మోనాల్కు నో ఛాన్స్!
అఖిల్ సార్థక్.. బిగ్బాస్కు ముందు వరకు ఈ పేరు ఎవరికీ పెద్దగా తెలియదు. కానీ బిగ్బాస్ తర్వాత ఇతడు తెలియని బుల్లితెర ప్రేక్షకుడు లేడంటే అతిశయోక్తి కాదు. కింగ్ నాగార్జున వ్యాఖ్యాతగా వ్యవహరించిన బిగ్బాస్ నాలుగో సీజన్లో పాల్గొన్న అఖిల్ తన యాటిట్యూడ్తో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు. షో నుంచి బయటకు వచ్చిన ఇతడు పాతికేళ్లకే కారు కొన్నాలన్న కోరికను సైతం గత నెలలో సాకారం చేసుకున్నాడు. తాజాగా ఈ యంగ్ యాక్టర్ లేటెస్ట్ బైక్ను సొంతం చేసుకున్నాడు. ఈ మేరకు ఫొటోలతో పాటు బైక్ నడుపుతున్న వీడియోను అభిమానులతో షేర్ చేసుకున్నాడు. ఈ సందర్భంగా.. "నా కలను నిజం చేసిన ఆ దేవుడికి, నా తల్లిదండ్రులకు, శ్రేయోభిలాషులకు, అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. ఇదంతా మీ వల్లే సాధ్యమైంది. నన్ను ఇంతలా సపోర్ట్ చేస్తూ నా వెన్నంటే ఉన్న అందరికీ థ్యాంక్ యూ సో మచ్. రానున్న రాజుల్లో మీ అందరూ గర్వపడేలా చేస్తాను" అని రాసుకొచ్చాడు. ఇక ఈ బైకుకు ఒకటే సీటు ఉండటంతో ఆశ్చర్యపోయిన సోహైల్ తానెక్కడ కూర్చోవాలని ప్రశ్నించాడు. దీనిపై అఖిల్ స్పందిస్తూ.. నీకోసం నా గుండెలో స్పెషల్ సీటు ఉందని రిప్లై ఇచ్చాడు. అతడి ఫ్యాన్స్ మాత్రం అక్కడ ఆల్రెడీ మోనాల్ ఉందిగా అని కామెంట్లు చేస్తున్నారు. ఇక గంగవ్వేమో జర నెమ్మదిగా నడుపు అని తన మనవడు అఖిల్కు సూచించింది. పలువురు సెలబ్రిటీలతో పాటు అతడి అభిమానులు సైతం అఖిల్ కొత్త బైకు కొన్నందుకు కంగ్రాట్స్ చెప్తున్నారు. ఈ బైకుకు ఒకటే సీటు ఉండటంతో అఖిల్.. సోహైల్, మోనాల్నే కాదు, ఎవరినీ ఎక్కించుకుని రైడ్కు తీసుకెళ్లలేడు. కాగా గతంలో పలు సీరియళ్లలో నటించిన అఖిల్ ప్రస్తుతం మోనాల్ గజ్జర్తో "తెలుగు అబ్బాయి గుజరాత్ అమ్మాయి" అనే వెబ్ సిరీస్ చేస్తున్నాడు. చదవండి: అఖిల్ కొత్త కారు: షికారుకెళ్దామంటున్న సోహైల్ భయంతో అవ్వా అంటూ ఏడ్చినంత పని చేసిన గంగవ్వ! -
కరోనా వ్యాక్సిన్: గంగవ్వకు స్వల్ప అస్వస్థత
సాక్షి, కరీంనగర్: బిగ్బాస్ నాలుగో సీజన్లో కంటెస్టెంట్లందరినీ తన మాటల గారడీతో హుషారెత్తించింది గంగవ్వ. వయసులో పెద్దదైనా అందరినీ కలుపుకుంటూ, ఆఖరికి వ్యాఖ్యాత నాగార్జునను కూడా అన్న అని పిలుస్తూ ఆప్యాయతగా కబుర్లు చెప్పేది. కానీ పచ్చటి పైర్ల మధ్య జీవిస్తూ మట్టివాసన పీల్చే ఆమెకు అక్కడి ఏసీ వాతావరణం పడక అనారోగ్యం బారిన పడింది. దీంతో హౌస్ నుంచి అర్ధాంతరంగా బయటకు వచ్చేసింది. ఇక బిగ్బాస్ తర్వాత మరెంతమందో అభిమానులను సంపాదించుకున్న ఆమె తాజాగా కోవిడ్ వ్యాక్సిన్ తీసుకుంది. మల్యాలలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మంగళవారం వ్యాక్సిన్ తొలి డోసు వేసుకుంది. అయితే వ్యాక్సిన్ తీసుకునే సమయంలో చిన్నపిల్లలా భయడుతూ అవ్వా.. అంటూ కేకలు పెడుతూ ఏడిచినంత పని చేసింది. ఇక వ్యాక్సిన్ తర్వాత ఆమెకు జ్వరం వచ్చిందని, అంతే కాక ఒళ్లు నొప్పులతోనూ సతమతమవుతోందని గంగవ్వ బాధ్యతలు చూసుకునే శ్రీకాంత్ మీడియాకు తెలిపాడు. అయితే వ్యాక్సిన్ తర్వాత ఈ లక్షణాలు సాధారణమే కాబట్టి పెద్దగా భయపడాల్సిన పని లేదని చెప్పాడు. ఇప్పుడిప్పుడే ఆమె కోలుకుంటోందన్నాడు. ప్రస్తుతం ఆమె తన పనిని పక్కనపెట్టి విశ్రాంతి తీసుకుంటోందని తెలిపాడు. చదవండి: గాలి మోటార్ ఎక్కి, చక్కర్లు కొట్టిన గంగవ్వ గంగవ్వకు పట్టగొలుసులు ఇచ్చిన అఖిల్ -
ముక్కు అవినాష్ తల్లికి అనారోగ్యం: CMRF నుంచి చెక్
బిగ్బాస్ నాలుగో సీజన్ కంటెస్టెంట్, జబర్దస్త్ కమెడియన్ ముక్కు అవినాష్ తల్లి అనారోగ్యానికి లోనైంది. దీంతో తెలంగాణ ప్రభుత్వం ఆమె వైద్యానికి అవసరమయ్యే డబ్బును చెక్ రూపంలో అందించింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం రాఘవపట్నం గ్రామానికి చెందిన కాళ్ళ లక్ష్మిరాజం (ముక్కు అవినాష్ తల్లి) అనారోగ్యానికి గురైంది. దీంతో ఆమె చికిత్స కోసం ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి 60 వేల రూపాయలు మంజూరయ్యాయి. ఈ నగదుకు సంబంధించిన చెక్కును శనివారం నాడు మంత్రి కొప్పుల ఈశ్వర్ లక్ష్మీరాజం కుమారుడు అవినాష్కు అందజేశారు. అనంతరం ఈ ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. కాగా అవినాష్ బిగ్బాస్ నాలుగో సీజన్లో వైల్డ్కార్డ్ ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. లేట్గా వచ్చినా లేటెస్ట్గా వస్తూ ప్రేక్షకులకు నాన్స్టాప్ కామెడీని పంచాడు. అరియానాతో స్నేహం చేస్తూ మోనాల్ను ఆటపట్టిస్తూ తెగ సందడి చేసిన అతడు ప్రస్తుతం పలు ప్రాజెక్టులకు ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. చదవండి: 'అవ్వ బంగారం' అంటూ అఖిల్ సర్ప్రైజ్ గిఫ్ట్ 'ఆర్ఆర్ఆర్' నుంచి రామ్చరణ్కు స్పెషల్ సర్ప్రైజ్ -
మోనాల్తో వీడియో కాల్, అఖిల్ కామెంట్ వైరల్
బిగ్బాస్ 4 సీజన్ కపుల్గా మోనాల్, అఖిల్కు సోషల్ మీడియాలో వీపరీతమైన క్రేజ్ ఉంది. బిగ్బాస్ హౌజ్లో ఈ జంట చేసిన రచ్చ అంతా ఇంత కాదు. ట్రయాంగిల్ లవ్స్టోరిగా గొడవలు, ప్రేమలు, స్నేహాలు, అపార్థాలతో ఈ షో అంతా మోనాల్, అఖిల్, అభిజిత్ల చూట్టే తిరిగింది. ఇక మోనాల్-అఖిల్ల మధ్య జరిగే రొమాంటిక్ మచ్చట్ల కోసమే చాలా మంది ఈ షోని వీక్షించారనడంలో అతిశయోక్తి లేదు. ఎప్పుడో ఎలిమినేట్ కావాల్సిన మోనాల్ను బిగ్బాస్ చివరి వరకు పట్టుకొచ్చాడు. దీంతో మోనాల్ను నెటిజన్లు బిగ్బాస్ దత్త పుత్రికను చేసేశారు. అయినప్పటికి ఎప్పుడు వీరిద్దరి మంచి స్నేహితులమే అని చెబుతుంటారు. దీంతో వీరిద్దరి మధ్య ఏముందో ఇప్పటికి ఎవరికి అంతు చిక్కడం లేదు. హౌజ్ నుంచి బయటకు వచ్చాక కూడా ఈ కపుల్ తరచూ పార్టీలకు అటెండ్ అవ్వడం, పలు టీవీ షోలో జంటగా పాల్గొంటూ అదే బ్రాండ్ను కొనసాగిస్తున్నారు. వీరిద్దరి మధ్య ఉన్నది స్నేహమా, ప్రేమో అర్థంకాక ప్రేక్షకులు, అభిమానులు జుట్టు పిక్కుంటున్నారు. అయితే వీరిద్దరూ తరచూ వీడియో కాల్స్, చాట్స్ చేసుకుంటారన్న సంగతి తెలిసిందే. తాజాగా అఖిల్, మోనాల్తో వీడియో కాల్ మాట్లాడిన స్క్రీన్ షాట్ను తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేశాడు. బిగ్హౌజ్లో, బయటయ పలు టీవీ కార్యక్రమాల్లో మెనాల్పై ఉన్న ప్రేమను పాట రూపంలో వ్యక్త పరిచే అఖిల్.. ఈ సారి కవితాత్మకంగా చెప్పి కవిగా మారాడు. మోనాల్తో వీడియో కాల్ మాట్లాడిన అనంతరం అఖీల్.. మా సంతోషం ఇలా ఉందంటూ లవ్ ఎమోజీని జత చేశాడు. ఆ తరువాత ‘ప్రేమ క్యాన్సర్ వంటిది.. అది మరిచిపోయినట్టు చేస్తుంది.. చివరకు ప్రాణాలను తీసుకెళ్లిపోతోంది’ తన కవి హృదయాన్ని బయటపెట్టాడు. దీంతో అఖిల్ కామెంట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. వీరిద్దరు నిజంగానే ప్రేమలో ఉన్నారంటూ నెటిజన్లు కామెంట్స్ చేయడం ప్రారంభించారు. కాగా వీరిద్దరూ జంటగా ప్రేమ కథా నేపథ్యంలో ఓ వెబ్ సిరీస్ రానున్న సంగతి తెలిసిందే. చదవండి: రామ్ చరణ్ బర్త్డే: మెగాస్టార్ ఎమోషనల్ వీడియో ఆచార్యతో కలిసి నడిచిన సిద్ధ -
అరియానా కోలుకోవాలంటూ ఫ్యాన్స్ పూజలు
బిగ్బాస్ షో అన్నది ఓ రకంగా విలాసవంతమైన జైలు లాంటిది. అందులో అడుగు పెట్టిన వాళ్లు ప్రేక్షకులను ఆకట్టుకుని చివరి వరకు నిలబడితే విజేతగా అవతరిస్తారు. లేదంటే, మధ్యలోనే ఎలిమినేట్ అయిపోతుంటారు. అయితే షో తర్వాత కూడా వీరికి ప్రజల నుంచి ఆదరాభిమానాలు అందుతూనే ఉంటాయి. అందుకు తాజా ఘటన నిదర్శనం. తెలుగు బిగ్బాస్ నాలుగో సీజన్ కంటెస్టెంట్ అరియానా గ్లోరీ ఈ మధ్య అనారోగ్యానికి లోనైంది. తీవ్ర అనారోగ్యంతో కొద్ది రోజులుగా బాధపడింది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా సోషల్ మీడియాలో వెల్లడించింది. దీంతో ఆందోళనపడిన అభిమానులు ఇప్పుడు ఆరోగ్యం ఎలా ఉందంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. అయితే ప్రస్తుతానికి తన ఆరోగ్యం కుదుటపడిందని, జ్వరం పూర్తిగా తగ్గిపోయిందని చెప్పుకొచ్చింది. "నాకు జ్వరం వచ్చింది, వెళ్లిపోయింది. నన్నేం చేయలేదు. ఆ విషయంలో నాకు సంతోషంగా ఉంది. నా కోసం చాలామంది అదేపనిగా మెసేజ్లు చేస్తున్నారు. స్టేటస్లు పెడుతున్నారు. నేను వెంటనే కోలుకోవాలని కొందరైతే ఏకంగా పూజలు కూడా చేయిస్తున్నారు. నామీద ప్రేమ చూపిస్తున్న అందరికీ థ్యాంక్స్" అని ఈ బోల్డ్ భామ పేర్కొంది. దీంతో అరియానా తిరిగి సోషల్ మీడియాలో సందడి చేయడంతో అవినాష్, సోహైల్ సంబరపడిపోయారు. ఇక బుల్లితెరపై అవినాష్తో కలిసి సందడి చేస్తున్న అరియానా యంగ్ హీరో రాజ్తరుణ్తో కలిసి ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఆ మధ్య రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకున్న ఈ సినిమాకు సంబంధించి త్వరలోనే ఏదైనా అప్డేట్ ఇస్తారేమో వేచి చూడాలి! చదవండి: అఖిల్ పేరు పచ్చబొట్టు వేయించుకున్న ఫ్యాన్ నాగార్జునతో అభిజిత్ బిగ్ డీల్! -
'అవ్వ బంగారం' అంటూ అఖిల్ సర్ప్రైజ్ గిఫ్ట్
బిగ్బాస్ నాల్గో సీజన్లో సెంటరాఫ్ అట్రాక్షన్ గంగవ్వ. యూట్యూబ్ వీడియోలతో తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ఆమె బిగ్బాస్లో ఎంట్రీ ఇచ్చి సంచలనమే క్రియేట్ చేసింది. అయితే వయసురీత్యా అనారోగ్యం వెంటాడుతుండటంతో షో మధ్యలోనే అర్ధాంతరంగా బయటకు రాక తప్పలేదు. కానీ ఉన్నన్ని రోజులు మాత్రం అందరికంటే హుషారుగా ఉంటూ మిగతా కంటెస్టెంట్లకు గట్టి పోటీనిచ్చింది. ఇక అఖిల్ సార్థక్ను ప్రేమగా అఖిలూ... అని పిలుస్తూ సొంత మనవడిలా చూసుకునేది. దత్తత తీసుకుని పెళ్లి కూడా చేస్తానంది. అతడు కూడా అవ్వతో ఆప్యాయంగా మెలిగేవాడు. తాజాగా అఖిల్ ఇంటికి వెళ్లి రచ్చ రచ్చ చేసింది గంగవ్వ. చాలా రోజులకు అఖిల్ను కళ్లారా చూడటంతో అవ్వ తెగ సంతోషపడిపోయింది. అఖిల్ను తీసుకుపోయేందుకు వచ్చానంటూ అతడి కుటుంబ సభ్యులతో చెప్పుకొచ్చింది. ఇక అఖిల్ వేసుకున్న జీన్స్ మీద కూడా సెటైర్లు వేసింది. ఇది చినిగిపోయింది. ఇలాంటివి నేను మసిగుడ్డలుగా వాడుతానంటూ అతడి పరువు తీసింది. కానీ అంతలోనే అఖిల్ ఒక్కడే కాదు, ఇప్పుడు అందరూ ఇలాంటివే తొడుగుతున్నారని వెనకేసుకొచ్చింది. ఇక సడన్గా అఖిల్ వాళ్ల అమ్మానాన్న కనిపించకపోవడంతో అవ్వ వారి కోసం తెగ వెతికింది. అయితే ఇక్కడ అఖిలే వారి పేరెంట్స్ను బయటకు పంపించి ఆమె కోసం పట్టీలు తీసుకురమ్మన్నాడు. దీంతో అవ్వ ఇష్టపడే డిజైన్లో పట్టీలు కొనుక్కొచ్చారు. వాటిని అవ్వ కాలికి పెట్టి సర్ప్రైజ్ చేశారు. మొత్తానికి ఊరి నుంచి వచ్చిన అవ్వను ఊరికే పంపించకుండా కానుక ఇచ్చి ఘనంగా వీడ్కోలు పలికారు. ఆమె వెళ్లిపోతుండటంతో 'నా అవ్వ బంగారం..' అంటూ అఖిల్ కొద్దిగా ఎమోషనల్ అయ్యాడు. చదవండి: ఇన్స్టాగ్రామ్ రీల్స్..ఇప్పటికే..10 లక్షలకు పైగానే లైక్స్ గాలి మోటార్ ఎక్కి, చక్కర్లు కొట్టిన గంగవ్వ ఎమీ హాకిన్స్.. మరో గంగవ్వ -
బిగ్బాస్ భామల బ్యూటిఫుల్ ఫోటోలు
-
అభిమాని చేసిన పనికి షాకైన అఖిల్
అఖిల్ సార్థక్.. బిగ్బాస్ నాల్గో సీజన్లో అతివల మనసు దోచిన అందగాడితడు. కేవలం ఫిట్నెస్తోనే కాకుండా యాటిట్యూడ్తో, తనదైన గేమ్ ప్లేతో ఫినాలే వరకు చేరుకున్నాడు. కానీ గెలుపుకు అడుగు దూరంలో ఆగిపోయి రన్నరప్తో సరిపెట్టుకున్నాడు. అభిమానుల అండ మెండుగా ఉన్న ఇతడికి ఆ మధ్య ఓ ఫ్యాన్ ల్యాప్టాప్ ఇచ్చి సర్ప్రైజ్ చేసింది. ఆ తర్వాత ఓ వ్యక్తి బిగ్బాస్ ఐ ఉన్న బ్రేస్లెట్ ఇచ్చి అతడి మెప్పు పొందాడు. కానీ తాజాగా ఓ వీరాభిమాని చేసిన పనికి అఖిల్కు షాక్ కొట్టినంత పనైంది. ఇంతకీ ఏం జరిగిందంటే.. బిగ్బాస్ షో సమయం నుంచి అఖిల్కు వీరాభిమానిగా మారిపోయాడు అర్జున్ అనే వ్యక్తి. అతడు అందరిలా తన హీరోతో సెల్ఫీ దిగి సంతృప్తిపడాలనుకోలేదు. అతడెప్పటికీ తనతోనే ఉండిపోవాలనుకున్నాడు. దీంతో అఖిల్ పేరును ఛాతీ మీద పచ్చబొట్టు వేయించుకున్నాడు. ఈ మధ్యే అతడు అఖిల్తో ఫొటో దిగాడు. ఈ నేపథ్యంలో అతడి ఎద మీద టాటూ చూసిన అఖిల్కు దిమ్మతిరిగినంత పనైంది. తన మీద చూపించిన ప్రేమాభిమానాలకు నోట మాట రాకుండా పోయింది. ఈ క్రమంలో అతడు తన అభిమానితో దిగిన ఫొటోను ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశాడు. "ఏం చెప్పాలో అర్థం కావడం లేదు. నాకిప్పుడు మాటలు కరువయ్యాయి. కానీ ఇలాంటి అభిమానులు దొరకడం నా అదృష్టం. నా పేరును పచ్చబొట్టు వేయించుకోవడం సాధారణ విషయం కాదు. నీ జీవితంలో నన్ను భాగస్వామ్యుడిని చేసినందుకు, నా మీద ఇంత ప్రేమ చూపిస్తునందుకు థ్యాంక్ యూ అర్జున్. తప్పకుండా మీ అందరూ గర్వపడే స్థాయికి ఎదుగుతాను. కానీ ఓ ముఖ్య విషయం: మీకు నేనంటే చాలా ఇష్టం, అది నేను అర్థం చేసుకోగలను. కానీ ఈ టాటూలు వేయించుకోవడానికి బదులు ఎప్పటికీ మీరు నాతోనే ఉంటానని మాటిస్తే అదే చాలు.." అని రాసుకొచ్చాడు. ఈ ఫొటో చూసి నెటిజన్లు షాకవుతున్నారు. ఇక పాతికేళ్ల వయసులో కారు కొనుక్కోవాలన్న అభిలాషను అఖిల్ ఈ మధ్యే నేరవేర్చుకున్న విషయం తెలిసిందే. View this post on Instagram A post shared by 𝐀𝐊𝐇𝐈𝐋𝐒𝐀𝐑𝐓𝐇𝐀𝐊 (@akhilsarthak_official) చదవండి: హారిక నియామకానికి సంబంధించిన వివరాలు తొలగింపు పాతికేళ్లకే సాధించిన అఖిల్ సార్థక్ -
స్టార్ హీరోయినే నా డ్రీమ్: దేత్తడి హారిక
సాక్షి, హైదరాబాద్ : బిగ్బాస్ ఫేం..‘దేత్తడి’ హారిక బంపర్ ఆఫర్ అందుకున్నారు. తెలంగాణ టూరిజం కార్పొరేషన్ బ్రాండ్ అంబాసిడర్గా హారిక నియమితులయ్యారు. బిగ్బాస్ రియాలిటీ షోలో ఫైనల్ వరకు వచ్చిన హారిక ఈ నియామకం ద్వారా తెలంగాణ ప్రభుత్వం నుంచి మంచి అవకాశాన్ని దక్కించుకున్నారు. సోమవారం నాడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తెలంగాణ పర్యాటక భవన్లో ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో టూరిజం కార్పొరేషన్ చైర్మన్ ఉప్పల్ శ్రీనివాస్ గుప్తా ఈ మేరకు ఆమెకు నియామక పత్రాన్ని అందించారు. అలాగే దీనికి సంబంధించిన వివరాలను తెలంగాణ టూరిజం డిపార్ట్మెంట్ అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా ఆయన వెల్లడించారు. కాగా తెలంగాణ యాసతో యూట్యూబ్ ద్వారా పాపులారిటీని సాధించిన దేత్తడి హారిక ఎంతోమంది ఫాలోవర్స్ని సంపాదించుకున్నారు. ఆ క్రేజ్తోనే తెలుగు బిగ్బాస్ 4 సీజన్కు సెలక్ట్ అయ్యారు. హౌజ్లో మిగతా కంటెస్టెంట్లకు గట్టిపోటినిచ్చి ఫైనల్ వరకు పోరాడారు. టాప్ 5కు చేరి ప్రేక్షకుల మన్ననలు పొందారు. బిగ్బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా హారిక వరుస అవకాశాలు అందుకుంటున్నారు. పలు ప్రాజెక్టులతోపాటు సినిమా చాన్స్లు కొట్టేశారు హారిక. మరోవైపు.. ప్రస్తుత తన ప్రయాణం ప్రారంభమే అని, ఎప్పటికైనా హీరోయిన్ సినిమాలు చేయడమే తన లక్ష్యమని మనసులో మాటని బయటపెట్టింది బిగ్బాస్–4 ఫేమ్ దేత్తడి హారిక(అలేఖ్య హారిక). నగరంలోని మామ్ ఐవీఎఫ్ అండ్ రీసెర్చ్ ఆధ్వర్యంలో ఆదివారం ప్రపంచ మహిళా దినోత్సవ వేడుకలను నిర్వహించారు. ఈ వేడుకలో సీఈఓ హరికాంత్, డాక్టర్ పూర్ణిమతో పాటు ముఖ్య అతిథిగా దేత్తడి హారిక పాల్గొని సందడి చేసింది. ఈ సందర్భంగా ఆమె ‘సాక్షి’తో మాట్లాడుతూ.. ఒక అమ్మాయిగా తనకెప్పుడూ అమ్మే ఆదర్శమని, అంతకుమించి ఎవరినీ స్ఫూర్తిగా తీసుకోనని పేర్కొంది. ముఖ్యంగా తాను తీసుకునే మంచి నిర్ణయాలే తనకు స్ఫూర్తి అని తెలిపింది. ప్రస్తుతం వరుడు కావలెను అనే సినిమాతో పాటు మరిన్ని సినిమాల్లో చేస్తున్నాని, అంతేకాకుండా తన యూట్యూబ్ చానెల్లో మరో వెబ్ సిరీస్ రానుందన్నారు. ఎప్పటికైనా సినిమాల్లోనే.. మంచి కథాంశంతో పాటు నటనకు ప్రాధాన్యం ఉన్న సినిమాల్లో హీరోయిన్గా నటించాలనుందని దేత్తడి హారిక తెలిపింది. మహానటి లాంటి సినిమాలో చేయాలనుందని, అంతేకాకుండా రామ్ జామ్ తరహా సినిమాలన్నా తనకు ఎంతో ఆసక్తి అని పేర్కొంది. Sri Uppal Srinivas Gupta Garu, Chairman of Telangana state tourism Development corporation, appointed Miss Alekhya Harika as the new brand ambassador for TSTDC@USrinivasGupta @VSrinivasGoud @KTRTRS @harika_alekhya #Telanganatourism #TSTDC pic.twitter.com/cMIyK4yRlp — Telangana State Tourism (@tstdcofficial) March 8, 2021 చదవండి: ‘బిగ్బాస్ 4 రికార్డ్ చేసి నా పిల్లలకు చూపిస్తా’ నాగార్జునతో అభిజిత్ బిగ్ డీల్!