-
బిగ్బాస్లో నటి లవ్.. పెళ్లయిన 8 ఏళ్లకు పేరెంట్స్గా ప్రమోషన్! (ఫోటోలు)
-
బిగ్బాస్ అమర్దీప్ కొత్త సినిమా.. షూటింగ్ సెట్లోనే సన్మానం!
బిగ్బాస్ ఫేమ్ అమర్దీప్, సుప్రీత సురేఖవాణి జంటగా కొత్త చిత్రంలో నటిస్తున్నారు. మాల్యాద్రి రెడ్డి దర్శకత్వంలో ఒక కొత్త సినిమా తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఏం3 మీడియా అండ్ మహా మూవీస్ బ్యానర్లో మహేంద్ర నాధ్ కూoడ్ల నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది.అయితే ఇటీవల ఓ డాన్స్ షోలో అమర్దీప్ చౌదరి, తేజు విజయం సాధించారు. ఈ సందర్భంగా షూటింగ్ సెట్లో సెలబ్రేషన్స్ చేసుకున్నారు. అమర్దీప్ మూవీ షూటింగ్ లోకేషన్లోనే టీం సభ్యులు అందరూ కలిసి కేక్ కట్ చేశారు. అనంతరం అమర్దీప్ను సన్మానించారు. దీనికి సంబంధించిన ఫోటోలు తెగ వైరలవుతున్నాయి.ఈ సందర్భంగా అమర్ దీప్ చౌదరి మాట్లాడుతూ..'నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది. కష్టపడితే విజయం వస్తుందని అనడానికి నిదర్శనం ఇదే. ప్రేక్షకుల సపోర్ట్ వలనే ఇదంతా సాధ్యమైంది. అలాగే మా సినిమా ని సైతం ప్రేక్షకులు ఆదరించాని కోరారు. ఈ కార్యక్రమంలో నిర్మాత మహేంద్ర నాధ్ కూoడ్ల ,డైరెక్టర్ మాల్యాద్రి రెడ్డి, హీరోయిన్ సుప్రీత, టేస్టీ తేజ పాల్గొన్నారు. -
బిగ్బాస్ బ్యూటీ ప్రేమ పెళ్లి.. ప్రెగ్నెన్సీ ప్రకటించిన భామ!
బాలీవుడ్ జంట ప్రిన్స్ నరులా- యువికా చౌదరి త్వరలో పేరెంట్స్గా ప్రమోషన్ పొందనున్నారు. బిగ్బాస్ -9 సీజన్లో పరిచయమైన ఈ జంట ఆ తర్వాత ప్రేమలో పడ్డారు. బిగ్బాస్ హౌస్లో ఉండగానే ప్రిన్స్.. ఆమెకు ప్రపోజ్ చేశాడు. అతడి ప్రేమకు ముగ్దురాలైన యువిక వెంటనే ఓకే చెప్పింది. అనంతరం ఈ ప్రేమజంట 2018 జనవరిలో ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. అదే ఏడాది అక్టోబర్లో పెళ్లి బంధంలోకి అడుగుపెట్టారు.తాజాగా యువికా చౌదరి గర్భం ధరించినట్లు సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. 'మా జీవితాల్లోకి త్వరలోనే బేబీ రాబోతోంది' అంటూ ఇన్స్టా వేదికగా రాసుకొచ్చారు. తన భార్య నుంచి అందుకునే ఉత్తమ బహుమతి ఇదే అంటూ ఆమెకు ప్రిన్స్ నరులా కృతజ్ఞతలు తెలిపాడు. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు ఈ జంటకు అభినందనలు చెబుతున్నారు.కాగా.. 2019లో నాచ్ బలియే అనే డ్యాన్స్ షోలో జంటగా పాల్గొని గెలిచారు. ప్రిన్స్ నరౌలా రియాలిటీ షోలలో తన టాలెంట్ చూపించేవాడు. 2015లో వచ్చిన రోడీస్- 2 సీజన్లో విజేతగా నిలిచాడు. మరోవైపు అతను స్ప్లిట్స్ విల్లా 8వ సీజన్ ట్రోఫీ గెలుచుకున్నాడు. హిందీ బిగ్బాస్ 9వ సీజన్ టైటిల్ అందుకున్నాడు. నటి యువికా చౌదరి.. ఓం శాంతి ఓం, నాటీ @40, వీరే కీ వెడ్డింగ్, ఎస్పీ చౌహాన్, ద పవర్ వంటి చిత్రాల్లో నటించింది. View this post on Instagram A post shared by PRINCE YUVIKA NARULA ❤️❤️❤️ (@princenarula) -
Bigg Boss: ఇద్దరు భార్యలతో ‘బిగ్బాస్’లోకి.. ఎవరా కంటెస్టెంట్?
బుల్లితెరపై బిగ్బాస్ షోకి ఉన్న క్రేజ్ గురించి అందరికీ తెలిసిందే. తెలుగులోనే కాదు ఏ భాషలో అయినా ఈ రియాల్టీ షోకి మంచి ఆదరణ ఉంది. అందుకే ఓటీటీలో కూడా ఈ షోని రన్ చేస్తున్నారు. ఇప్పటికే బాలీవుడ్లో రెండు సీజన్లు ఓటీటీల్లో స్ట్రీమింగ్ అయి మంచి విజయం సాధించాయి. దీంతో తాజాగా హిందీలో బిగ్బాస్ ఓటీటీ సీజన్ 3ని ప్రారంభించారు మేకర్స్. ఎప్పటి మాదిరిలో ట్రెండింగ్లో ఉన్న నటీనటులతో పాటు ఫేమస్ యూట్యూబర్స్ ఇందులో పాల్గొన్నారు. అయితే ప్రతి సీజన్లోనూ ఓ జంట ఇందులో పాల్గొంటుంది. సీజన్లో 3లో కూడా దాన్ని కొనసాగించారు. విచిత్రంగా ఓ కంటెస్టెంట్ తన ఇద్దరు భార్యలతో హౌస్లోకి ఎంట్రీ ఇచ్చి షాకిచ్చాడు. ఆ కంటెస్టెంట్ పేరు ఆర్మాన్ మాలిక్. అతనో ఫేమస్ యూట్యూబర్. మొదటి భార్య పాయల్ మాలిక్, రెండో భార్య క్రితికా మాలిక్ ఇద్దరితో కలిసి బిగ్బాస్ హౌస్లోకి అడుగు పెట్టాడు. ‘బిగ్బాస్’ హిస్టరీలోనే ఇది తొలిసారి. ఇలా ఇద్దరు భార్యలతో షోలో పాల్గొనడాన్ని బిగ్బాస్ మాజీ కంటెస్టెంట్ దేవోలినా భట్టాచార్జితో పాటు పలువురు తప్పు పట్టినా.. ఆర్మాన్ మాత్రం తనను తాను సమర్థించుకుంటున్నాడు. (చదవండి: బిగ్ బాస్ షో.. చూడడానికే అసహ్యంగా ఉందన్న మాజీ కంటెస్టెంట్!)తమ మధ్య ఎలాంటి వివాదాలు రావని.. ఒక ఫ్యామిలీగా ఎలా ఉంటామో చూపించడానికే బిగ్బాస్లోకి వచ్చానని ఆర్మాన్ చెబుతున్నాడు. అంతేకాదు అభిమానులకు తన పర్సనల్ లైఫ్ ఎలా ఉంటుంది.. నా వ్యక్తిత్వం ఎలాంటి అని తెలియజేసేందుకు ఈ షో బాగా ఉపయోగపడుతుందని చెప్పాడు. తనదైన ఆటతీరుతో అందరి మనసులు గెలుచుకొని..కప్ కొడతానని ఆర్మాన్ చెప్పుకొచ్చాడు. మరి ఇద్దరి భార్యలతో కలిసి ఆర్మాన్ ఎలా ఆడతాడు? ఎలాంటి కంటెంట్ ఇస్తాడు అనేది మున్ముందు తెలుస్తుంది. అలా ప్రేమలో పడి..ఆర్మాన్, పాయల్ది ప్రేమ వివాహం. పాయల్ ఓ బ్యాంకు ఉద్యోగిణి. ఓ సందర్భంలో బ్యాంకులోకి వెళ్లిన ఆర్మాన్..తొలి చూపులోనే ఆమెతో ప్రేమలో పడ్డాడు. ఆరో రోజుల్లోనే తన ప్రేమను వ్యక్తం చేసి పెళ్లి చేసుకున్నాడు. ఎనిమిదేళ్ల పాటు కలిసి జీవించారు. ఓ మగ బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత మళ్లీ క్రితికా మాలిక్తో ప్రేమలో పడిపోయాడు. ఆమె పాయల్కు బెస్ట్ ఫ్రెండ్. పాయల్ ద్వారనే ఆర్మాన్కి పరిచయం అయింది. కొన్నాళ్ల తర్వాత ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది. పాయల్కు తెలియకుండానే పెళ్లి చేసుకున్నారు. కొన్నాళ్ల పాటు ముగ్గురి మధ్య గొడవలు కూడా జరిగాయి. చివరకు పాయల్ అంగీకరించడంతో ముగ్గురు కలిసి ఒకే ఇంట్లో కాపురం పెట్టారు. పాయల్కి ముగ్గురు సంతానం కాగా, కృతిక ఒక పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. కొన్నాళ్ల పాటు ఈ ముగ్గురు హైదరాబాద్లోనే ఉన్నారు. ప్రస్తుతం పిల్లలతో కలిసి పంజాబ్లోని చండీగఢ్లో నివసిస్తున్నారు.తొలిసారి అనిల్ కపూర్ హిందీ బిగ్బాస్ ఓటీటీ సీజన్ 1కి కరణ్ జోహార్.. సీజన్ 2కి సల్మాన్ హోస్ట్గా వ్యవహరించారు. సీజన్ 3కి కూడా సల్మానే హోస్ట్ అని అంతా భావించారు. కానీ సీనియర్ హీరో అనిల్ కపూర్ని హోస్ట్గా పరిచయం చేసి షాకిచ్చారు. ఈ సీజన్ 3లో వడపావ్ గర్ల్ చంద్రికా దీక్షిత్, నటుడు రణ్వీర్ ష్రాయ్, శివానీ కుమారీ, బాక్సర్ నీరజ్ గోయట్, ప్రముఖ లాయర్ సనా మక్బూల్ ఖాన్, సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్ విశాల్ పాండే, లవ్ కేష్ కటారియా పాల్గొన్నారు. ప్రముఖ ఓటీటీ ‘జియో సినిమా’లో స్ట్రీమింగ్ అవుతోంది. View this post on Instagram A post shared by Kritika malik (@kritika_malik_9) -
బిగ్ బాస్ షో.. చూడడానికే అసహ్యంగా ఉందన్న మాజీ కంటెస్టెంట్!
ప్రముఖ బుల్లితెర రియాలిటీ షో బిగ్బాస్ ఉన్న క్రేజే వేరు. ఏ భాషలో అయినా ఈ షో సినీ ప్రియులను అలరిస్తూనే ఉంది. తాజాగా హిందీలో బిగ్బాస్ ఓటీటీ సీజన్ -3 ప్రారంభమైంది. ఈ షోలోకి పలువురు కంటెస్టెంట్స్ గ్రాండ్గా ఎంట్రీ ఇచ్చారు. అయితే ఇందులో ప్రముఖ యూట్యూబర్ ఆర్మాన్ మాలిక్పైనే అందరిదృష్టి పడింది. ఎందుకంటే అతను తన ఇద్దరు భార్యలు పాయల్, కృతికతో కలిసి హౌస్లోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత ఆర్మాన్తో వారి ప్రేమ గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.అయితే ఇది చూసిన మాజీ బిగ్బాస్ కంటెస్టెంట్ దేవోలీనా భట్టాచార్జీ విమర్శలు గుప్పించింది. వీరిని చూస్తుంటే చాలా అసహ్యంగా ఉందని పేర్కొంది. అసలు ఇది వినోదం కోసం తీసుకొచ్చిన షోలా లేదని మండిపడింది. రియాలిటీ షో ద్వారా బహుభార్యత్వాన్ని ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు ఆమె తన ట్విటర్లో రాసుకొచ్చింది.దేవోలీనా తన ట్విటర్లో రాస్తూ..' ఇదేంటి వినోదం అని మీరు అనుకుంటున్నారా? దీన్ని ఎలా పిలుస్తారో కూడా నాకు అర్థం కావడం లేదు. ఇలాంటి వాటి గురించి వినగానే నాకు అసహ్యం అనిపిస్తోంది. బిగ్ బాస్ మీకేమైంది? బహుభార్యత్వంతో మీరు వినోదాన్ని పంచాలనుకుంటున్నారా? ఈ షోను చిన్నారుల నుంచి వృద్ధుల వరకు అందరు వీక్షిస్తున్నారు. ఇలాంటి వాటితో మీరు కొత్త తరానికి ఏమి నేర్పించాలనుకుంటున్నారు? వీరిని చూసిన అందరూ 2, 3, 4 వివాహాలు చేసుకోవచ్చా? అందరూ కలిసి సంతోషంగా జీవించగలరా? రోజు ఇలాంటి సంఘటనలతో బాధపడుతూ దుర్భర జీవితాన్ని గడుపుతున్న వారిని వెళ్లి అడగండి.' అని చురకలు అంటించింది.'అందుకే దేశంలో ప్రత్యేక వివాహ చట్టం, యూనిఫాం సివిల్ కోడ్ తప్పనిసరిగా ఉండాలి. చట్టం అందరికీ ఒకటే. అప్పుడే ఈ సమాజం ఇలాంటి వాటి నుంచి విముక్తి పొందుతుంది. మొదటి భార్య ఉండగా రెండో భార్య. ఒకవేళ భార్యలు కూడా ఇద్దరు భర్తలను కలిగి ఉంటే.. మీరు చూస్తూ కాలక్షేపం చేస్తారా? అని ప్రశ్నించింది. ఇలాంటి వాళ్లను ఏ కారణంతో ఫాలో అవుతారు? కొత్త తరానికి బహుళ వివాహాలు చేసుకోవాలని ఈ షో ద్వారా నేర్పిస్తున్నారా? ఇది తలచుకుంటేనే భయమేస్తోంది. ' అని రాసుకొచ్చింది.అంతేకాకుండా.. 'మీకు 2-3 పెళ్లిళ్లు చేసుకోవడం అంత అవసరం అయితే చేసుకుని ఇంట్లోనే ఉండండి. మీ నీచమైన మనస్తత్వాన్ని ప్రపంచానికి చూపకండి. ఇలాంటి వాటితో సమాజం విధ్వంసం వైపు వెళ్తుంది. మరి బిగ్ బాస్.. మీకు ఏమైందో నాకు తెలియడం లేదు' అంటూ ట్విటర్ ద్వారా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇది చూసిన నెటిజన్స్ దేవోలీనాను ప్రశంసిస్తున్నారు. ఆ ముగ్గురిని రియాల్టీ షోలోకి తీసుకొచ్చినందుకు బిగ్ బాస్పై దుమ్మెత్తి పోస్తున్నారు. కాగా.. ఈ రియాలీటి షోకు అనిల్ కపూర్ హోస్ట్ చేస్తున్నారు. బిగ్ బాస్ ఓటీటీ సీజన్-3 జియో సినిమాలో ప్రసారమవుతోంది.Do you think this is entertainment? This is not entertainment, it's filth. Don't make the mistake of taking this lightly because it's not just a reel, it's real. I mean, I can't even understand how anyone can call this shamelessness entertainment ? I feel disgusted just hearing… https://t.co/BVeVjGrTm2— Devoleena Bhattacharjee (@Devoleena_23) June 22, 2024 -
ఖరీదైన కారు గిఫ్ట్ ఇచ్చిన బిగ్బాస్ శోభాశెట్టి (ఫొటోలు)
-
ఈ నెలాఖరు నుంచి బిగ్బాస్ ప్రారంభం.. ఫస్ట్ కంటెస్టెంట్ ఈవిడే!
బిగ్బాస్ రియాలిటీ షోను ఇష్టపడే జనాలు చాలామందే ఉన్నారు. వీరికోసం ఏ యేటికాయేడు కొత్త సీజన్లు వస్తూనే ఉన్నాయి. ఇప్పటివరకు హిందీలో బిగ్బాస్ షో.. 17 సీజన్లు విజయవంతంగా పూర్తి చేసుకుంది. షో మొదలవగానే సంతోషపడే బిగ్బాస్ ప్రియులు ఫినాలే వచ్చేసరికి అప్పుడే అయిపోయిందా అని ఫీలవుతున్నారు. ఇలాంటివారికోసం నిర్వాహకులు ఓటీటీ సీజన్ను ప్రవేశపెట్టారు. టీవీలో కాకుండా కేవలం ఓటీటీలో మాత్రమే ఈ షో చూడవచ్చన్నమాట! ఫస్ట్ కంటెస్టెంట్ఈ బిగ్బాస్ ఓటీటీ కూడా ఇప్పటివరకు రెండు సీజన్లు పూర్తి చేసుకుంది. తాజాగా మూడో సీజన్కు రంగం సిద్ధమైంది. ఈసారి సల్మాన్ ఖాన్కు బదులుగా స్టార్ నటుడు అనిల్ కపూర్ను హోస్ట్గా తీసుకున్నారు. తాజాగా బిగ్బాస్ ఓటీటీ ప్లాట్ఫామ్ జియో సినిమా.. ఫస్ట్ కంటెస్టెంట్ ఈవిడే అంటూ ఇన్స్టాగ్రామ్లో ఓ ఫోటో షేర్ చేసింది. ఆ ఫోటోలో ఓ చిన్న స్నాక్స్ బండి దగ్గర జనం గుమిగూడి ఉన్నారు. వారికి ఓ అమ్మాయి కావల్సివని సిద్ధం చేసి ఇస్తోంది. మరికొద్ది రోజుల్లో బిగ్బాస్ ఓటీటీ 3ఈ పిక్స్ చూసిన నెటిజన్లు తను ఫేమస్ వడాపావ్ గర్ల్ చంద్రిక అని కామెంట్లు చేస్తున్నారు. చంద్రిక.. ఢిల్లీలోని వీధుల్లో వడాపావ్ అమ్ముతూ ఫేమస్ అయింది. బిగ్బాస్ షో కోసం ఈ మధ్యే ఢిల్లీ నుంచి ముంబైకి వచ్చేసింది. మరి సోషల్ మీడియాలో అందరి దృష్టిని ఆకర్షించిన ఈ అమ్మాయి షోలో క్లిక్ అవుతుందో, లేదో చూడాలి. హిందీ బిగ్బాస్ ఓటీటీ మూడో సీజన్ జూన్ 21 నుంచి ప్రారంభం కానుంది. జియో సినిమాలో ఈ వెబ్తెర బిగ్బాస్ను చూసేయండి.. View this post on Instagram A post shared by JioCinema (@officialjiocinema) చదవండి: రజనీకాంత్ సినిమాలో అనవసరంగా నటించా: హీరోయిన్ -
పెళ్లి వాయిదా వేసుకున్న మరగుజ్జు సింగర్.. కారణం అదే
బిగ్ బాస్ రియాలిటీ షోతో చాలామంది గుర్తింపు తెచ్చుకున్నారు. అలా హిందీలో 16వ సీజన్లో పాల్గొన్న మరగుజ్జు తజికిస్థాన్ సింగర్ అబ్దు రోజిక్ కూడా చాలా ఫేమ్ సొంతం చేసుకున్నాడు. తనదైన పాటలు, కామెడీ టైమింగ్తో ఎంటర్ టైన్ చేస్తున్నాడు. 20 ఏళ్ల అబ్దు.. ఈ ఏడాది ఏప్రిల్లో దుబాయికి చెందిన ఓ అమ్మాయితో నిశ్చితార్థం చేసుకుని అందరికీ షాకిచ్చాడు. జూలైలో పెళ్లి ఉంటుందని చెప్పాడు. కానీ ఇప్పుడు దాన్ని వాయిదా వేస్తున్నట్లు క్లారిటీ ఇచ్చాడు.(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేస్తున్న 'రాజు యాదవ్'.. స్ట్రీమింగ్ అప్పుడేనా?)20 ఏళ్ల అబ్దు రోజిక్.. షార్జాకు చెందిన అమీరాతో ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు. జూలై 7న నిఖా(ముస్లిం పద్ధతిలో పెళ్లి) చేసుకుంటానని సోషల్ మీడియాలో ప్రకటించాడు. కానీ ఇప్పుడీ వేడుక కాస్త అబ్దు.. బాక్సింగ్ మ్యాచ్ వల్ల వాయిదా పడింది. ఈ విషయాన్ని స్వయంగా ఇతడే రివీల్ చేశాడు. జూలై 6న బాక్సింగ్ టైటిల్ కోసం పోటీ పడే మ్యాచులో ఛాన్స్ వచ్చిందని, ఇందులో పాల్గొంటే చాలా డబ్బు వస్తుందని, తనకు ఇది ఆర్థికంగా ఉపయోగపడుతుందని చెప్పాడు.అసలు బాక్సింగ్ రింగ్లో ఫైట్ చేసే ఛాన్స్ వస్తుందని ఊహించలేదని చెప్పిన అబ్దు.. ఈ ఏడాది తన జీవితంలో చాలా మంచి విషయాలు జరిగాయని వాటిలో ఇదొకటి అని అన్నాడు. అయితే అనుకోని విధంగా బాక్సింగ్ మ్యాచ్ కోసం నిఖా వాయిదా వేసుకోక తప్పట్లేదని చెప్పుకొచ్చాడు.(ఇదీ చదవండి: ప్రభాస్ 'కల్కి' ట్రైలర్.. ఆ విషయంపై ట్రోల్స్) -
ఆస్పత్రిలో చేరిన బిగ్బాస్ బ్యూటీ.. సోషల్ మీడియాలో పోస్ట్ వైరల్!
ప్రముఖ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్- 10 ద్వారా ఫేమ్ తెచ్చుకున్న కన్నడ నటి నమ్రత గౌడ. తాజాగా ఆమె ఆస్పత్రిలో చేరారు. డెంగ్యూతో బాధపడుతున్న ఆమె ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంది. ఇది చూసిన అభిమానులు త్వరగా కోలుకోవాలని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.నమ్రత గౌడ తన ఇన్స్టాలో రాస్తూ.. " ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాను. ప్రస్తుతానికి నా ఆరోగ్యం మెరుగ్గానే ఉంది. నా కోసం ప్రార్థించిన అందరికీ ధన్యవాదాలు" అని రాసింది. కాగా.. నమ్రత ఆసుపత్రి బెడ్పై ఉండగా.. తన తల్లి ఆహారం తినిపిస్తున్న ఫోటోను షేర్ చేసింది. కన్నడ టీవీ సీరియల్ షో నాగినిలో శివాని పాత్ర పోషించినందుకు నమ్రత గౌడ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. కన్నడ టెలివిజన్ పరిశ్రమలో 2011లో 'కృష్ణ రుక్మిణి' అనే సీరియల్తో ఆమె కెరీర్ ప్రారంభించారు. -
Hamida: నటి బర్త్డే పార్టీలో బిగ్బాస్ సెలబ్రిటీల హంగామా (ఫోటోలు)
-
గుర్తు పట్టలేని విధంగా మారిపోయిన బిగ్బాస్ బ్యూటీ.. అసలేం జరిగింది?
సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూ ఫేమస్ అయిన బ్యూటీ ఉర్ఫీ జావెద్. ఈ బాలీవుడ్ భామకు బిగ్బాస్తోనే గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత బోల్డ్ ఫ్యాషన్ దుస్తులతో సోషల్ మీడియాలో సెన్సేషన్గా మారింది. విచిత్రమైన ఫ్యాషన్ డ్రెస్సులు ధరించి ఎప్పుడు వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది. ఇదిలా ఉండగా.. తాజాగా తన ఇన్స్టాలో ఫోటోలు షేర్ చేసింది ముద్దుగుమ్మ. గుర్తు పట్టలేని విధంగా ఉన్న ఫోటోలు పంచుకున్న భామ.. తనకెదురైన సమస్యను ఫ్యాన్స్తో పంచుకుంది. ఇంతకీ అదేంటో తెలుసుకుందాం.తాను అధికంగా ఫిల్లర్స్ వాడినందు వల్లే మొహం ఇలా మారిపోయిందంటూ ఉర్ఫీ రాసుకొచ్చింది. వాటి వల్లే అలర్జీ బారిన పడినట్లు తెలిపింది. ప్రతి రోజు ఇదే సమస్యతో నిద్ర లేస్తానంటూ ఆవేదన వ్యక్తం చేసింది. వీటితో తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నట్లు పేర్కొంది. ఉర్ఫీ తన ఇన్స్టాలో రాస్తూ.. 'అధికస్థాయిలో ఫిల్లర్స్ వల్ల నా ముఖంలో ఇలా మారిపోయింది. నాకు అలెర్జీలు ఉన్నాయి. అంతే కాదు నా ముఖం చాలాచోట్ల ఉబ్బినట్లు కనిపిస్తుంది. నేను ప్రతి రోజు ఇలానే నిద్రలేస్తాను. నా ముఖం ఎప్పుడూ వాచి ఉంటుంది. ఎప్పుడూ తీవ్రమైన అసౌకర్యంగా ఉంటా. ఇవేమీ ఫిల్లర్స్ కాదు అబ్బాయిలు.. అలెర్జీ వల్లే ఏర్పడిందే. ఇమ్యునోథెరపీ తర్వాత ఇలా వాచిపోయిన ముఖంతో చూస్తే.. నేను అలర్జీతో బాధపడుతున్నా. నాకు 18 ఏళ్ల వయస్సు నుంచి ఉపయోగిస్తున్న సాధారణ ఫిల్లర్లు, బొటాక్స్ వల్ల ఏం కాలేదు. కానీ మీకు నా ముఖం ఉబ్బినట్లు కనిపిస్తే, ఎక్కువ ఫిల్లర్స్ తీసుకోమని మాత్రం సలహా ఇవ్వకండి. కాస్తా దయ చూపండి చాలు' అంటూ పోస్ట్ చేసింది. ఇది చూసిన ఫ్యాన్స్ గెట్ వెల్ సూన్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. View this post on Instagram A post shared by Uorfi (@urf7i) -
'ఆడిషన్ కోసం వెళ్లి స్వలింగ సంపర్కుడిని కలిశా'.. బిగ్బాస్ కంటెస్టెంట్!
బుల్లితెర నటుడు అభిషేక్ కుమార్ ఉదరియాన్ అనే సీరియల్ ద్వారా గుర్తింపు తెచ్చుకున్నాడు. గతేడాది బిగ్బాస్ సీజన్-17 షో ద్వారా మరింత ఫేమస్ అయ్యారు. ప్రస్తుతం ఖత్రోన్ కే ఖిలాడీ -14 అనే షో కనిపించనున్నారు. అయితే టీవీ షోలతో బిజీగా ఉన్న అభిషేక్ ముంబయిలో తనకెదురైన చేదు అనుభవాన్ని పంచుకున్నారు. కెరీర్ ప్రారంభంలో జరిగిన షాకింగ్ ఘటనను తాజా ఇంటర్వ్యూలో వెల్లడించారు. తాను కూడా క్యాస్టింగ్ కౌచ్ బారిన పడినట్లు వివరించారు.అభిషేక్ కుమార్ మాట్లాడుతూ..'నేను 2018లో ముంబయికి వచ్చా. మా ఇంట్లో అబద్ధం చెప్పి వచ్చా. నేను నటుడిని కావాలని వారితో చెప్పినప్పుడు వారికి ఇష్టం లేదన్నారు. దీంతో అబద్ధం చెప్పాల్సి వచ్చింది. ముంబయిలో జరిగిన ఆడిషన్లో పాల్గొన్నా. నేను చెత్త ప్రదర్శన ఇచ్చినా నన్ను ఎంపిక చేశాడు. అది చూసిన ఆశ్చర్యపోయా. బహుశా నా గ్లామర్ వల్ల అనుకున్నా. కానీ అదంతా ఫేక్ ఆడిషన్ అని తర్వాత తెలిసింది. అయితే అక్కడ ఓ స్వలింగ సంపర్కుడు నన్ను కలిశాడు. అతను నాతో అనుచితంగా ప్రవర్తించాడు. అతని వల్ల భయంతో ఇంటికి పరిగెత్తా. వెంటనే జనరల్ బోగిలో టికెట్ బుక్ చేసుకుని మరీ తిరిగొచ్చా' అని తన అనుభవాన్ని పంచుకున్నారు. -
బిగ్బాస్ నటి బ్రేకప్.. నువ్వు ఇంకా ఎదగాలన్న మరో నటి!
బిగ్బాస్ బ్యూటీ ఇషా మాల్వియా ఇటీవల ఎక్కువగా వార్తల్లో నిలుస్తోంది. బాయ్ఫ్రెండ్ సమర్థ్ జురెల్తో బ్రేకప్ చేసుకున్న సంగతి తెలిసిందే. హౌస్లో ఉండగానే వీరిమధ్య విభేదాలు తలెత్తాయి. ఈ నేపథ్యంలో వీరిద్దరు విడిపోవడం మరో నటి, బిగ్బాస్ కంటెస్టెంట్ రింకూ ధావన్ విమర్శలు చేసింది. ఇషా మాల్వియా మరో ఆరు నెలల్లో కొత్త బాయ్ఫ్రెండ్తో కనిపిస్తుందని కామెంట్స్ చేసింది.అయితే రింకూ ధావన్ చేసిన కామెంట్స్పై ఇషా మాల్వియా గట్టిగానే రియాక్ట్ అయింది. ముందు నీ జీవితం ఎలా ఉందో చూస్కో అంటూ ఇచ్చిపడేసింది. ఈ టాపిక్ కాస్తా ఇద్దరి మధ్య మాటల యుద్ధానికి దారితీసింది. ఇషా కామెంట్స్పై రింకూ ధావన్ స్పందించింది. మీరు నా వైవాహిక జీవితం, విడాకుల తీరు గురించి మాట్లాడిన తీరు మీ సున్నితత్వాన్ని తెలియజేస్తోందని అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. బిగ్ బాస్ తర్వాత ఇషాతో టచ్లో కూడా లేనని చెప్పింది.రింకూ తన ఇన్స్టాలో రాస్తూ..' నువ్వు తెలివిగలదానివి అని చెప్పా. అందులో తప్పేం లేదు. నీ జీవితం నీ ఇష్టం. నేను అందులో జోక్యం చేసుకోవడం లేదు. ఎందుకంటే మీరు ప్రతి విషయాన్ని సొంతంగా హ్యాండిల్ చేయగలరు. నా విడాకుల గురించి మీరు మాట్లాడిన విధానం చూస్తే మీ సున్నితత్వాన్ని తెలియజేసింది. జీవితంలో మీరు నిజంగా ఎదగాలని కోరుకుంటున్నా. అదే జరగకపోతే రాబోయే 8 నెలల్లో ఇలాంటి ప్రకటనలే వస్తాయి. విష్ యూ గుడ్ లక్' అంటూ పోస్ట్ చేసింది. View this post on Instagram A post shared by Rinku Dhawan (@rinku.dhawan15) -
తండ్రి బర్త్ డే.. సర్ప్రైజ్ ఇచ్చిన బిగ్బాస్ బ్యూటీ!
బాలీవుడ్ భామ, బిగ్బాస్ బ్యూటీ ఇషా మాల్వియా సీజన్-17లో మెరిసింది. ఆమె చివరిసారిగా 'పావోన్ కి జుట్టి' అనే ఆల్బమ్ సాంగ్లో కనిపించింది. ఈ పాటకు ఆడియన్స్ నుంచి విపరీతమైన క్రేజ్ దక్కించుకుంది. అయితే తాజాగా ఈ ముద్దుగుమ్మ తన తండ్రికి బిగ్ సర్ప్రైజ్ ఇచ్చింది. ఆయన పుట్టిన రోజు కావడంతో కారును బహుమతిగా ఇచ్చింది. దీనికి సంబంధించిన ఫోటోలను తన ఇన్స్టాలో పంచుకుంది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.కాగా.. బిగ్బాస్- 17లో చివరిసారిగా కనిపించిన ఇషా మాల్వియా ప్రస్తుతం మాజీ బాయ్ఫ్రెండ్ సమర్థ్ జురెల్తో బ్రేకప్ చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే వీరిద్దరి విడిపోవడంపై తన తోటి కంటెస్టెంట్, మరో నటి రింకూ ధావన్ విమర్శలు చేసింది. ఇషాను మరో ఆరు నెలల్లో కొత్త బాయ్ఫ్రెండ్తో కనిపిస్తుందని అవహేళనగా మాట్లాడింది. తాజాగా రింకూ ధావన్ చేసిన కామెంట్స్పై ఇషా మాల్వియా ఘూటుగా స్పందించింది. ముందు నీ లైఫ్ ఎలా ఉందో చూసుకో అంటూ ఇచ్చిపడేసింది. -
కిల్లింగ్ ఔట్ఫిట్తో 'ప్రియాంక జైన్' వీడియో వైరల్
బిగ్ బాస్ రియాలిటీ షో సీజన్-7 టాప్-5లో నిలిచిన ఏకైక లేడీ కంటెస్టెంట్ ప్రియాంక జైన్. జానకీ కలగనలేదు, మౌన రాగం సీరియల్స్ ద్వారా పాపులరిటీ తెచ్చుకుంది. అలా బుల్లితెర నటిగా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ బిగ్బాస్తో మరింత ఫేమ్ తెచ్చుకుంది. బిగ్ బాస్ వల్ల తనకు మంచి పేరు కూడా వచ్చింది. తన ప్రవర్తనుకు కూడా తెలుగు ప్రేక్షకులు మంచి మార్కులే వేశారు.ప్రియాంక జైన్.. ముంబైలో పుట్టి పెరిగినప్పటికీ అచ్చం తెలుగమ్మాయిలా టాలీవుడ్ ప్రేక్షకులను బుల్లితెరపై అలరిస్తోంది. అయితే, తాజాగా తన ఇన్స్టాగ్రామ్ పేజీలో ఆమె ఒక వీడియో షేర్ చేసింది. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే ప్రియాంక ఈసారి తన అందంతో తోటి నటీమణులకు సవాల్ విసిరింది. నీటిలో తడిసిన తన గ్లామర్తో కుర్ర కారులో హీట్ పెంచింది. ఒక ఆర్టిస్ట్గా ఉన్నందున తనలోని భిన్నమైన షేడ్స్ను కూడా ప్రేక్షకులకు పరిచయం చేయాలని ఆమె తెలిపింది. ఇప్పటికే బిగ్ బాస్ నుంచి పాపులర్ అయిన అషు రెడ్డి, అరియాన వంటి స్టార్స్ సోషల్ మీడియాలో తమ అందాలతో ఫిదా చేస్తున్న విషయం తెలిసింది. ఇప్పుడు ప్రియాంక జైన్ విడుదల చేసిన వీడియో వారిని తలదన్నేలా ఉందని చెప్పవచ్చు. ఆమె ఇచ్చిన కిల్లింగ్ ఎక్స్ప్రెషన్స్కు ఆడియన్స్ ఫిదా అవుతున్నారు. ప్రియాంకలో ఇంత టాలెంట్ ఉందా అంటూ ఆశ్చర్యపోతున్నారు. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. View this post on Instagram A post shared by Priyanka M Jain (@priyankamjain___0207) -
ఇటీవలే రెండో పెళ్లి.. భార్యతో కేక్ కట్ చేసిన బిగ్బాస్ విన్నర్!
బిగ్బాస్ విన్నర్ మునావర్ ఫారూఖీ ఇటీవల తరచుగా వార్తల్లో నిలుస్తున్నారు. కొద్దిరోజుల క్రితమే రెండో పెళ్లి చేసుకున్నారు. గతేడాది బిగ్బాస్ సీజన్-17లో విజేతగా నిలిచిన మునావర్ మరోసారి వివాహాబంధంలోకి అడుగుపెట్టారు. మేకప్ ఆర్టిస్ట్ అయిన మెహజబీన్ కోట్వాలాను పెళ్లాడారు. పెళ్లయిన పది రోజుల తర్వాత ముంబయిలో రిస్పెప్షన్ వేడుక కూడా నిర్వహించారు.తాజాగా మునావర్.. తన భార్య మహ్జబీన్ కోట్వాలాతో కలిసి కేక్ కట్ చేశారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో ఇన్స్టాగ్రామ్లో వైరలవుతున్నాయి. మేకప్ ఆర్టిస్ట్ మెహజబీన్ కోట్వాలాను సీక్రెట్గా వివాహం జరిగిన విషయం అత్యంత సీక్రెట్గా ఉంచారు. ఈనెల 26న ఆదివారం ముంబయిలోని ఐటీసీ మరాఠాలో రిసెప్షన్తో ఈ విషయం బయటకొచ్చింది. ఈ వేడుకలో నటి హీనా ఖాన్ సందడి చేసింది. తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో 'మేరే యార్ కి షాదీ హై' అంటూ ఫోటోను పంచుకున్నారు.కాగా.. మునావర్కు గతంలోనే వివాహం జరిగింది. అతనికి మొదటి భార్యతో ఓ కుమారుడు ఉన్నాడు. మరోవైపు మెహజబీన్కు కూడా 10 ఏళ్ల కుమార్తె ఉన్నట్లు తెలుస్తోంది. View this post on Instagram A post shared by MunawarXTabish (@munawar___faruquiiii) -
సీక్రెట్గా రెండో పెళ్లి చేసుకున్న బిగ్బాస్ విన్నర్!
బిగ్బాస్ సీజన్-17 విన్నర్ మునావర్ ఫారూఖీ గురించి బీటౌన్లో తెలియని వారు ఉండరు. స్టాండ్ అప్ కమెడియన్గా గుర్తింపు తెచ్చుకున్న మునావర్ సోషల్ మీడియా ద్వారా ఫేమస్ అయ్యాడు. బిగ్ బాస్- 17 విన్నర్గా నిలవడంతో మరింత ఫేమ్ దక్కించుకున్నారు.అయితే తాజాగా మునావర్ ఫరూఖీ రెండో పెళ్లి చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ వివాహ వేడుకకు బంధువులు, స్నేహితులు మాత్రమే హాజరైనట్లు సమాచారం. ముంబైలోని ప్రముఖ ఐటీసీ హోటల్లో సన్నిహితుల సమక్షంలో పెళ్లి చేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే మునావర్ తన పెళ్లి ఫోటోలను ఇప్పటి వరకు షేర్ చేయలేదు. మేకప్ ఆర్టిస్ట్ అయిన మెహజ్బీన్ కోట్వాలా అనే అమ్మాయిని వివాహం చేసుకున్నట్లు సోషల్ మీడియాలో వైరలవుతోంది. మునావర్ దాదాపు 10-12 రోజుల క్రితం వివాహం చేసుకున్నట్లు కనిపిస్తోంది. తాజాగా ముంబయిలో రిసెప్షన్ వేడుక నిర్వహించిన పోస్ట్ నెట్టింట వైరలవుతోంది.అతని వివాహానికి అత్యంత సన్నిహితురాలు అయిన నటి హీనా ఖాన్ హాజరైనట్లు కూడా తెలుస్తోంది. 'మేరే యార్ కి షాదీ హై' అంటూ ఆమె సెల్ఫీని కూడా పంచుకుంది. కాగా.. బిగ్ బాస్ 17లో మునావర్ తన మాజీ ప్రేయసి అయేషా ఖాన్ మోసం చేశాడని ఆరోపించింది. అతని మాజీ స్నేహితురాలు నజీలా సితాషి కూడా అతను పెద్ద మోసగాడని ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. -
బిగ్ బాస్ ఓటీటీ సీజన్ 3 అప్డేట్ వచ్చేసింది.. మారనున్న హోస్ట్
హిందీ బిగ్ బాస్ ఓటీటీ సీజన్ 3 ప్రారంభం కానుంది. జియో సినిమాలో ఇప్పటికే రెండు ఓటీటీ సీజన్లను పూర్తి చేసుకుని భారీగా అభిమానలను ఈ కార్యక్రమం సొంతం చేసుకుంది. ఓటీటీలో గత సీజన్కు మంచి ఆధరణ రావడంతో ఇప్పుడు సీజన్ 3 కోసం రంగం సిద్ధమైంది. జియో సినిమాలో ఐపీఎల్ తర్వాత ఎక్కువ మంది చూసిన షోగా బిగ్ బాస్ సీజన్ 2 నిలిచిన విషయం తెలిసిందే.బిగ్ బాస్ ఓటీటీ సీజన్ 3ను బాలీవుడ్ స్టార్ అనిల్ కపూర్ హోస్ట్ చేయనున్నట్లు తెలుస్తోంది. వాస్తవంగా హిందీ బిగ్ బాస్కు సంబంధించిన అన్ని సీజన్లను సల్మాన్ ఖాన్ హోస్ట్గా కొనసాగిన విషయం తెలిసిందే. కానీ, సల్మాన్ ఖాన్ ఈ సీజన్ నుంచి తప్పుకున్నట్లు సమాచారం. దీనికి ప్రధాన కారణం గత నెలలో సల్మాన్ ఇంటి వద్ద ఇద్దరు దుండగులు కాల్పులు జరపడంతో భద్రతాపరమైన చిక్కులు ఎదురౌతాయని ఈ కార్యక్రమానికి ఆయన దూరంగా ఉండనున్నట్లు తెలుస్తోంది. బిగ్ బాస్ ఓటీటీ సీజన్ జూన్లో ప్రారంభమౌతుందని మేకర్స్ ప్రకటించారు. కానీ, హోస్ట్ విషయంలో ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. View this post on Instagram A post shared by JioCinema (@officialjiocinema) -
బిగ్బాస్ బ్యూటీకి చేదు అనుభవం.. నెల రోజులైనా రాలేదు!
బాలీవుడ్ భామ కిరణ్ రాథోడ్ తెలుగు వారికి సైతం పరిచయం అక్కర్లేదు. హిందీ సినిమాతో కెరీర్ ప్రారంభించిన ముద్దుగుమ్మ టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చింది. నువ్వు లేక నేను లేను చిత్రంలో కీలక పాత్రలో నటించింది. ఆ తర్వాత తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళ భాషల్లోనూ చిత్రాలు చేసింది. అయితే 2016 నుంచి సినిమాలు చేయడం ఆపేసిన ముద్దుగుమ్మ.. గతేడాది జరిగిన తెలుగు బిగ్బాస్ సీజన్-7 మెరిసింది. అయితే మొదటివారంలోనే ఎలిమినేట్ అయి ఫ్యాన్స్ను నిరాశపరిచింది.ఇదిలా ఉండగా.. బిగ్ బాస్ బ్యూటీ తాజాగా చేసిన పోస్ట్ నెట్టింట చర్చనీయాంశంగా మారింది. వీసా విషయంలో తలెత్తిన సమస్యతో తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురైనట్లు పోస్ట్ ఇన్స్టాలో పోస్ట్ చేసింది. అసలేం జరిగిందో ఓ సారి తెలుసుకుందాం.ప్రస్తుతం ఫ్రాన్స్లో ప్రతిష్టాత్మక కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ జరుగుతోన్న సంగతి తెలిసిందే. ఈ ఈవెంట్కు కిరణ్ రాథోడ్ కూడా హాజరు కావాల్సి ఉంది. ఇందుకోసం ఆమె ఇప్పటికే గతనెలలోనే వీసాకు అప్లై చేసింది. కానీ ఇప్పటికీ ఆమెకు వీసా జారీ కాలేదు. దీంతో సోషల్ మీడియా వేదికగా తన ఆవేదనను వ్యక్తం చేసింది.కిరణ్ రాథోడ్ ఇన్స్టాలో రాస్తూ..'కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్కు మే 13వ తేదీనే వెళ్లాల్సి ఉంది. ఇప్పటికే మా టీమ్ అంతా అక్కడికి చేరుకున్నారు. నేను మాత్రం నెల రోజులైనా వీసా కోసం ఎదురు చూస్తూనే ఉన్నా. ఇప్పటికే ముందస్తుగా హోటల్ బుకింగ్, ట్రావెల్ బుకింగ్ ఖర్చుల కోసం రూ.15 లక్షలు వెచ్చించా. దీంతో తాను మానసికంగా తీవ్రమైన ఒత్తిడికి గురయ్యా. దీనిపై సదరు వీసా సంస్థ సమాధానం చెప్పాలి.' అని రాసుకొచ్చింది. పాపం.. ఇప్పటికైనా కిరణ్ రాథోడ్కు వీసా వస్తుందేమో చూడాల్సిందే. View this post on Instagram A post shared by Keira Rathore (@kiran_rathore_official) -
Manisha Rani: స్టన్నింగ్ లుక్స్తో ఆకట్టుకుంటున్న మనీషా రాణి (ఫొటోలు)
-
Deepthi Sunaina: నలుపు రంగు డ్రెస్లో 'పిచ్చెక్కిస్తున్న' సోషల్ స్టార్ దీప్తి సునైనా (ఫొటోలు)
-
సరికొత్త ది ఎపిక్ న్యూ స్విఫ్ట్ కార్ ను ఆవిష్కరించిన బిగ్ బాస్ ఫేమ్ శ్రీ సత్య (ఫొటోలు)
-
కుందనపు బొమ్మలా ప్రియాంకా జైన్ ఫొటోలు
-
20 ఏళ్లకే పెళ్లి.. 'బిగ్బాస్' స్టార్ షాకింగ్ నిర్ణయం
ప్రముఖ సింగర్ పెళ్లికి రెడీ అయ్యాడు. అది కూడా కేవలం 20 ఏళ్ల వయసులోనే చేసుకోనుండటంతో అందరూ షాక్ అవుతున్నారు. స్వతహాగా తజికిస్థాన్ సింగర్ అయిన అబ్దు రోజిక్.. హిందీలో బిగ్బాస్-16 షోలో పాల్గొని పాపులరిటీ సంపాదించాడు. తనదైన పాటలు, కామెడీ టైమింగ్తో బాగానే గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే ఇప్పుడు తను కొత్త జీవితంలోకి అడుగు పెట్టబోతున్నట్లు చెప్పి అందరూ అవాక్కయ్యేలా చేశాడు.(ఇదీ చదవండి: పెళ్లి చేసుకున్న తెలుగు సీరియల్ హీరో.. అమ్మాయి ఎవరంటే?)20 ఏళ్ల అబ్దు రజాక్.. షార్జాకు చెందిన అమీరాతో జూలై 7న నిఖా(ముస్లిం పద్ధతిలో పెళ్లి) చేసుకోనున్నాడు. ఈమె అబ్దు కంటే ఏడాది చిన్నది. అయితే వీళ్లిద్దరిది ప్రేమ వివాహం అని తెలుస్తోంది. ఇతడు పెట్టిన ఇన్ స్టా వీడియో చూస్తుంటే అదే అనిపిస్తుంది. ఇంతకీ వీడియో, క్యాప్షన్లో ఏముందంటే?'ప్రేమ కంటే విలువైనది నా జీవితంలో ఇంకేది లేదు. పెళ్లికి రెడీ అయ్యాను. జీవితంలో ఇదో కొత్త ప్రయాణం. ఎంతో ఎగ్జైట్మెంట్తో ఎదురుచూస్తున్నాను. నాది ప్రేమ పెళ్లి. అయితే ఈ ప్రేమ నాకు అంత సులభంగా దక్కలేదు. చాలా ఇబ్బందులు ఎదుర్కొని ఇంతవరకు వచ్చాను. లవ్ జర్నీ నాకు కాస్త సవాలుగానే అనిపించింది. అమీరా-నేను ఒకరిని ఒకరు ఇష్టపడ్డాం. అయితే ఇలా జరుగుతుందని మాత్రం ఎప్పుడూ ఊహించలేదు. జూలై 7వ తేదీని సేవ్ చేసుకోండి' అని అబ్దు తన సంతోషాన్ని పంచుకున్నాడు. (ఇదీ చదవండి: టాలీవుడ్లో అది చాలా కష్టం.. అసౌకర్యంగా అనిపిస్తుంది: సంయుక్త) View this post on Instagram A post shared by Abduroziq Official (@abdu_rozik) -
40 ఏళ్లు మాత్రమే బతుకుతాను.. డాక్టర్స్ మాటలతో డిప్రెషన్: గీతూ రాయల్
బిగ్బాస్ షో ద్వారా గీతూ రాయల్ చాలా పాపులర్ అయింది. సీజన్ 6లో ఆడుగుపెట్టిన గీతూ ఊహించని విధంగా ఎలిమినేట్ అయింది. వాస్తవంగా ఆమె టిక్టాక్ వీడియోలతో వెలుగులోకి వచ్చింది. ఆ తర్వాత తనదైన స్టైల్లో పలు కొటేషన్లు చెబుతూ యూత్ను ఆకట్టుకుంది. ఆపై బిగ్ బాస్ సీజన్లకు రివ్యూలు చెప్పే స్థాయి నుంచి ఏడో సీజన్లో బిగ్బాస్ బజ్కు వ్యాఖ్యాతగా వ్యవహరించే రేంజ్కు చేరుకుని భారీగా ఫ్యాన్స్ను సంపాధించుకుంది.తాజాగా గీతూ ఒక వీడియోను షేర్ చేసింది.. సుమారుగా 5 నెలల నుంచి తను ఓ సమస్యతో బాధపడుతున్నట్లు అందుకు సంబంధించి చికిత్స తీసుకుంటున్నట్లు తెలిపింది. ఈ క్రమంలో తను పడుతున్న అనారోగ్యానికి కారణాలు చెప్పింది. నేను గత ఐదు నెలలుగా బ్యాక్టిరియల్ ఇన్ఫెక్షన్తో బాధ పడుతున్నాను. 'దీనికి కారణం నేను బ్యాంకాక్ వెళ్లిన సమయంలో అనేక రకాల బొద్దింకలు, పురుగులు వంటి ఆహారపదార్థాలు తిన్నాను. అందువల్లే నేనే అనారోగ్యానికి గురైయాను అనుకుంటున్నాను. ఈ క్రమంలో మరో సందేహం కూడా ఉంది. ఒకసారి విజయవాడకు వెళ్లాను.. అక్కడ అమ్మవారి గుడి దగ్గరకు వెళ్లి కూడా దర్శించుకోకుండా వచ్చేశాను. ఇదీ కూడా కారణం కావచ్చని అనుకుంటున్నాను. ఈ రెండు సంఘటనల తర్వాతే నేను అనారోగ్యానికి గురికావడం జరిగింది. గత ఐదు నెలలుగా అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నాను. దీంతో చాలా డిప్రెషన్కు గురి కావడం జరిగింది.మొదటగా నాకు ఒక గాయం అయింది. మందులు వాడుతున్నా కూడా అది తగ్గలేదు. ఫైనల్గా ఒక పెద్ద ఆసుపత్రికి వెళ్తే ఒక పరీక్ష ద్వారా అసలు విషయం తెలిసింది. బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వచ్చిందని వైద్యులు చెప్పారు. దీనికి రెండేళ్ల పాటు ట్రీట్మెంట్ తీసుకోవాలని వైద్యులు చెప్పారు. ప్రతివారం ఒక ఇంజెక్షన్ కూడా తీసుకోవాలి. డాక్టర్లు చెప్పిన మాటలతో బాగా డిప్రెషన్కు వెళ్లిపోయాను. ప్రస్తుతం అయితే కొంతమేరకు బాగానే ఉన్నాను.' అంటూ గీతూ చెప్పింది.అలాంటి పొరపాటు చేస్తే.. 40 ఏళ్లు మాత్రమే బతుకుతానుఈ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ సోకిన వారు సరైన ఫుడ్,నిద్ర తప్పక పాటించాలని వైద్యులు సూచించినట్లు గీతూ రాయల్ చెప్పింది. పూర్తిగా డాక్టర్స్ చెప్పిన ప్రకారం లైఫ్ స్టైల్ మార్చుకోవాల్సి ఉందని ఆమె తెలిపింది.. వైద్యుల సూచనలు పాటించకుంటే మరింత అనారోగ్యానికి గురికావడం జరుగుతుందట. ఈ క్రమంలో 40 ఏళ్లకు మించి బతకడం కష్టమని డాక్టర్స్ చెప్పినట్లు గీతూ పేర్కొంది. ఫైనల్గా తన అనారోగ్య పరిస్థితికి గల కారణాల గురించి ఒక వీడియో ద్వారా పూర్తి వివరాలు పంచుకుంది.