-
టీడీపీ దొంగ ఓట్ల అడ్డా.. బాపట్ల
సాక్షి ప్రతినిధి, బాపట్ల: తెలుగుదేశం పార్టీ దొంగ ఓట్లకు బాపట్ల జిల్లాను అడ్డాగా మార్చుకుంది. ఇక్కడ వెల్లడైన దొంగ ఓట్ల వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఒక్క పర్చూరు అసెంబ్లీ నియోజకవర్గంలోనే వేల సంఖ్యలో దొంగ ఓట్లు ఉన్నట్లు వెల్లడైంది. ఈ విషయాన్ని అధికారపార్టీకి చెందిన నియోజకవర్గ ఇన్చార్జి ఆమంచి కృష్ణమోహన్ జిల్లా అధికారులు, రాష్ట్ర ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేశారు. దొంగ ఓట్లను తొలగించాలని ఒక్క పర్చూరు నుంచే 12,944 ఫారం–7 దరఖాస్తులను స్థానికులు అధికారులకు సమర్పించారు. దశాబ్దాల క్రితం ఇతర ప్రాంతాలకు వెళ్లిపోయిన వారు చాలా మంది ప్రస్తుతం ఉన్న ప్రాంతాలతోపాటు పర్చూరులోనూ ఓట్లు ఉంచుకున్నారు. కొందరు రెండు చోట్లా ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. వేల సంఖ్యలో ఉన్న అక్రమ ఓట్లతోనే పర్చూరు, రేపల్లె, అద్దంకి నియోజకవర్గాల్లో టీడీపీ వరుసగా గెలుస్తోందన్న విషయం అందరికీ తెలిసిందే. వీటితోపాటు వేమూరు, బాపట్ల, చీరాల నియోజకవర్గాల్లోనూ టీడీపీ దొంగ ఓట్లను పెద్ద ఎత్తున చేర్పించుకొన్నట్లు సమాచారం. ఇదే విషయాన్ని అధికారపార్టీకి చెందిన మంత్రి మేరుగు నాగార్జున, ఎంపీ మోపిదేవి వెంకటరమణారావు, బాపట్ల ఎమ్మెల్యే కోన రఘుపతి, చీరాల ఇన్చార్జి కరణం వెంకటేష్, అద్దంకి ఇన్చార్జి బాచిన కృష్ణచైతన్య ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేశారు. దొంగ ఓట్లు తొలగించాలని ఫారం–7 దరఖాస్తులను సమర్పించారు. వేమూరు నియోజకవర్గంలో ఇప్పటివరకు 2,407 ఫారం–7 దరఖాస్తులు ఇవ్వగా రేపల్లెలో 5,544, బాపట్లలో 3,155, అద్దంకిలో 2,619, చీరాలలో 1,870 ఫారం–7 దరఖాస్తులు ఇచ్చినట్లు సమాచారం. దీంతోపాటు అక్రమ ఓట్ల జాబితానూ ఎన్నికల అధికారులకు అందిస్తున్నారు. టీడీపీ ఉలికిపాటు దొంగ ఓట్ల తొలగింపునకు అధికార పార్టీ పట్టుబట్టడంతో టీడీపీ ఉలిక్కిపడింది. దీనినుంచి బయట పడేందుకు అధికారపార్టీ నేతలు టీడీపీ ఓట్ల తొలగింపునకు కుట్రలు చేస్తున్నారంటూ ఎల్లో మీడియా, సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారానికి దిగింది. ఎన్నికల కమిషన్కూ తప్పుడు ఫిర్యాదులు చేసి రాద్ధాంతం చేస్తోంది. కృష్ణజిల్లా నాగాయలంకలో ఉంటున్న జాగర్లమూడి లక్ష్మీతులసికి బాపట్ల జిల్లా పర్చూరు మండలం దేవరపల్లి పోలింగ్ బూత్ 148లో, మార్టూరు మండలం బొల్లాపల్లి పోలింగ్ బూత్ నంబర్ 70లో రెండు చోట్లా ఓట్లు ఉన్నాయి. పర్చూరు మండలం నూతలపాడులో ఉంటున్న మిరియా చాయమ్మకు దేవరపల్లి 148 పోలింగ్ బూత్, నూతలపాడు 159 బూత్లో ఓట్లు ఉన్నాయి. సోమేపల్లి చిన్నవెంకటేశ్వర్లు తండ్రి వెంకటాద్రి హైదరాబాద్లో ఉంటున్నారు. ఆయనకి హైదరాబాద్లో ఓటు ఉంది. దాంతోపాటు దేవరపల్లి పోలింగ్ బూత్ 148లో సీరియల్ నంబర్ 631లో కూడా ఓటు ఉంది. హైదరాబాద్లో నివాసం ఉండే కొమ్మాలపాటి వీరాంజనేయులుకు దేవరపల్లి 148 పోలింగ్ బూత్లో సీరియల్ నంబర్ 581తో ఓటు ఉంది. హైదరాబాద్ శేరిలింగంపల్లి పోలింగ్ బూత్ నంబర్ 430లో సీరియల్ నంబర్ 247తోనూ ఓటు ఉంది. దొంగ ఓట్లు తొలగిస్తాం జిల్లావ్యాప్తంగా సుమారు 30 వేల వరకు ఫారం–7 దరఖాస్తులు వచ్చాయి. దీనిపై జాయింట్ కలెక్టర్తో విచారణ చేయిస్తున్నాం. ఫారం–7లను పూర్తిగా పరిశీలించాం. ఒకే వ్యక్తికి రెండు చోట్ల ఓట్లుంటే తొలగిస్తాం. నిబంధనల మేరకు దొంగ ఓట్లపై చర్యలు తీసుకుంటాం. ఫేక్ దరఖాస్తులు చేసిన వారిపైనా చర్యలు ఉంటాయి. – రంజిత్బాషా, కలెక్టర్, బాపట్ల జిల్లా -
ఆమంచికి సీఎం పరామర్శ
చీరాల: బాపట్ల జిల్లా చీరాల మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ పర్చూరు నియోజకవర్గ ఇన్చార్జి ఆమంచి కృష్ణమోహన్ను సీఎం వైఎస్ జగన్ బుధవారం ఫోన్లో పరామర్శించారు. సోమ వారం రాత్రి ఆమంచికి చెందిన ఆక్వా నర్సరీ లో వాకింగ్ చేస్తుండగా కట్లపాము కాటేసింది. దీంతో ఆయనను ప్రాథమిక చికిత్స నిమిత్తం చీరాల ఏరియా వైద్యశాలకు తరలించారు. అక్కడ వైద్య పరీక్షలు చేసిన వైద్యులు ప్రాణా పాయం నుంచి కాపాడారు. వైద్యుల సూచన లతో కుటుంబ సభ్యులు మెరుగైన వైద్యం కోసం విజయవాడలోని మణిపాల్ ఆస్పత్రికి ఆమంచిని తరలించగా మంగళవారం ఆయన హాస్పిటల్ నుంచి డిశ్చార్జి అయ్యారు. -
అద్దంకి పొలం-ఖర్జూర ‘ఫలం’.. 40 ఏళ్లు దిగుబడి, ఎకరాకు 4 లక్షల ఖర్చు
పోషకాలు మెండుగా ఉండి చూడగానే నోరూరించే ఖర్జూరం అంటే ఇష్టపడనివారు ఎవరూ ఉండరు. ఎడారి పంట అయిన ఈ ఖర్జూరాన్ని మధ్య ఆసియా, ఉత్తర ఆఫ్రికా దేశాల్లో ఎక్కువగా సాగు చేస్తారు. మనదేశంలో రాజస్థాన్, గుజరాత్లోని కొన్ని ప్రాంతాల్లో ఖర్జూరం సాగుచేస్తున్నప్పటికీ మనం వినియోగించే ఖర్జూరంలో మెజారిటీ వాటా దిగుమతులే. దుబాయ్, సౌదీ, ఒమన్, ఖతర్, బహ్రెయిన్ వంటి దేశాలనుంచి భారత్ ఖర్జూరం దిగుమతి చేసుకుంటుంది. అయితే ఖర్జూరం పంటలో లాభ దాయకతను గుర్తించిన దేశంలోని వివిధ ప్రాంతాల రైతులు ఇప్పుడిప్పుడే దీని సాగుపై మక్కువ చూపిస్తుండటంతో సాగు విస్తీర్ణం క్రమేపీ పెరుగుతోంది. మన రాష్ట్రంలో అనంతపురం జిల్లాలో వాణిజ్య ప్రాతిపదికన ప్రారంభమైన ఖర్జూరం సాగు ప్రస్తుతం బాపట్ల జిల్లాకు విస్తరించింది. అద్దంకి: బాపట్ల జిల్లా అద్దంకి నియోజకవర్గంలోని అద్దంకి, బల్లికురవ, కొరిశపాడు మండలాల్లో సుమారు 6.8 ఎకరాల్లో రైతులు ఖర్జూరం పంట సాగు చేస్తున్నారు. అద్దంకి మండలంలోని తిమ్మాయపాలెం గ్రామంలో ఉప్పుటూరి చిరంజీవి అనే రైతు 2.5 ఎకరాల్లో నాణ్యమైన బర్హీరకం సాగుచేస్తున్నాడు. దుబాయ్ నుంచి మొక్కలు తెచ్చి విక్రయించే తమిళనాడు వ్యాపారి నిజాముద్దీన్ దగ్గర మొక్కలు కొనుగోలుచేసినట్లు చిరంజీవి చెప్పారు. వ్యవసాయంలో వినూత్న ప్రయోగాలు చేస్తేనే లాభం ఉంటుందని భావించి ఖర్జూరం సాగువైపు మొగ్గు చూపినట్లు తెలిపారు. చిరంజీవి తోట తోట ప్రస్తుతం నాలుగేళ్ల వయసులో ఉంది. అనుకూలమైన నేలలివే.. సారవంతమైన తువ్వ (తెల్ల) నేల, గరప, నల్ల నేల, బంక నేలలతోపాటు, పీహెచ్ విలువ 8 నుంచి 10 వరకు ఉన్న చౌడు భూముల్లోనూ ఖర్జూరం సాగు చేసుకోవచ్చు. నీరు నిల్వ ఉండే నేలలు ఈ పంటకి అనుకూలంకాదు. ఖర్జూరం వేసవిలో కాపుకి వస్తుంది. ఉషో్టగ్రత 25 నుంచి 40 డిగ్రీల వరకు ఉంటే మంచి దిగుబడి వస్తుంది. అధిక వర్షాలు, చలిగాలులు ఖర్జూరం పంటకు ఇబ్బందికరం. దీనివల్ల మొక్కలు తెగుళ్ల బారిన పడే అవకాశం ఉంటుంది. నాటిన మూడేళ్లకు కాపు ఈత జాతికి చెందిన ఖర్జూరం మొక్క నాటిన మూడేళ్లకు కాపుకి వస్తుంది. ఇందులో ఆడ, మగ మొక్కలు ఉంటాయి. 10 ఆడ మొక్కలకు ఒక మగ మొక్క అవసరం. సాలుకు సాలుకు మధ్య మొక్కకు మొక్కకు మధ్య 24 అడుగుల ఎడంతో ఎకరాకు 78 మొక్కలు నాటుకోవచ్చు. మగ మొక్కలు తోటకు చుట్టూ అంచు వరుసలో నాటుతారు. మగ మొక్కలు కండెకు వచ్చిన తరువాత ఆ పుప్పొడిని భద్రపరుస్తారు. ఖర్జూరం మొక్క డిసెంబర్లో పూతకు వస్తుంది. ఆడ మొక్కలు పూతకు రాగానే ఆ పూతపై మొగ మొక్కల నుంచి సేకరించిన పుప్పొడిని చల్లుతారు. పూసిన మూడు నుంచి నాలుగు నెలలకు కాయలు పక్వానికి వస్తాయి. ఐదు నెలలకు గెలలను కోసి విక్రయించుకోవచ్చు. ఖర్జూరం సాగుకు ఎకరాకు రూ.4 లక్షల వరకు వ్యయం అవుతుంది. మూడో ఏడాది నుంచి 40 ఏళ్లపాటు దిగుబడి వస్తుంది. తొలి నాలుగేళ్లు దిగుబడి తక్కువగా ఉంటుంది. ఖర్జూరం మొక్కలు నాటిన నుంచి ఏడేళ్ల వరకు అంతరపంటలుగా పప్పు ధాన్యాలు, పశువుల మేత వంటివి సాగుచేసుకోవచ్చు. గుంటూరుకు చెందిన వ్యాపారి బర్హీ రకం కాయలను కిలో రూ.250 చొప్పున కొనుగోలు చేస్తున్నట్లు రైతు చిరంజీవి చెప్పారు. ఈ రకం ఖర్జూరాన్ని ప్రాసెస్ చేయకుండానే తినవచ్చని తెలిపారు. ఒక్కో మొక్క రూ.4,500 అద్దంకి ప్రాంతానికి బాగా అనుకూలమైన రకం బర్హీ. ఇందులో పసుపు, ఎరుపు రకాలు బాగా తియ్యగా ఉంటాయి. వీటిని తమిళనాడుకు చెందిన నిజాముద్దీన్ దుబాయ్ నుంచి తెప్పిస్తాడు. నెల పాటు తన వద్ద మొక్కలను పెంచి ఒక్కో మొక్క రూ.4.500 చొప్పున విక్రయిస్తాడు. అదే విధంగా రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాల నుంచి కూడా మొక్కలు తెప్పించుకోవచ్చు. మొక్కల సంఖ్య, నాటే విధానం వివరాలు నర్సరీ నిర్వాహకులనుంచి తెలుసుకోవచ్చు. అనంతపురం రైతును స్ఫూర్తిగా తీసుకున్నా.. సంప్రదాయ వ్యవసాయ సాగులో ఏటా నష్టాలు వస్తున్నాయి. ఖర్జూరం సాగులో ఒక్కసారి పెట్టుబడి పెడితే నాలుగో సంవత్సరం నుంచి నలభై సంవత్సరాల వరకు ఎటువంటి దిగులు ఉండదు. అయితే ఖర్జూరం మొక్కలను మన దేశంలో టిష్యూ కల్చర్ చేయకపోవడంతో ఇతర దేశాల నుంచి తెప్పించుకోవాల్సి వస్తోంది. దీంతో మొక్కల కొనుగోలుకు అధిక ఖర్చు అవుతోంది. ఉపాధి హామీ ద్వారా ఉద్యాన శాఖ పరిధిలో మొక్కలు ఇస్తే ఖర్జూరం సాగు మరింత పెరిగే అవకాశం ఉంది. – చిరంజీవి, రైతు, తిమ్మాయిపాలెం అధిక ఉష్ణోగ్రతలు అనుకూలం ఉషో్టగ్రతలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఖర్జూరం సాగు చేసుకోవచ్చు. వేసవిలో వర్షాలు పడితే కాపు రాదు. బాపట్ల జిల్లాలో ఇప్పుడిప్పుడే కొంతమంది రైతులు ఖర్జూరం సాగు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. అయితే మగ మొక్కల నుంచి పుప్పొడి సేకరించి, ఆడ మొక్కల పూతపై వేసే సాంకేతిక నైపుణ్యం ఉన్న వాళ్లు అవసరం. లేకపోతే రైతే ఆ పని నేర్చుకోవాల్సి ఉంటుంది. వాతావరణం అనుకూలిస్తే ఖర్జూరం సాగులో మంచి లాభాలు వస్తాయి. – దీప్తి, అద్దంకి డివిజన్, ఉద్యానశాఖ అధికారి, బాపట్ల జిల్లా -
తీరంలో తనివితీరా!
సాక్షి ప్రతినిధి, బాపట్ల: సముద్రతీర ప్రాంతానికి పర్యాటకుల రద్దీ పెరిగింది. బాపట్ల జిల్లాలోని బాపట్ల సూర్యలంక, చీరాల రామాపురం, ఓడరేవు, పాండురంగాపురం బీచ్లను చూసేందుకు సందర్శకులు ఎగబడుతున్నారు. గతంతో పోలిస్తే సముద్ర తీరం చూసేవారి సంఖ్య మరింతగా పెరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల నుంచి నిత్యం సందర్శకులు బీచ్లకు తరలివస్తున్నారు. వారాంతంలో సందర్శకుల సంఖ్య రెట్టింపునకు మించి ఉంటోంది. ప్రధానంగా హైదరాబాద్ నగరంతో పాటు తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా పర్యాటకులు ఇక్కడి బీచ్లకు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. విశాఖ, గోవా, చెన్నైలతో పోలిస్తే తెలంగాణ రాష్ట్రానికి బాపట్ల, చీరాల బీచ్లు మరింత దగ్గరగా ఉన్నాయి. రైల్వేతో పాటు ఇతర రవాణా సౌకర్యాలున్నాయి. సొంత వాహనాలే కాకుండా రైల్లో రావాలనుకునేవారికి మరింత అనుకూలంగా ఉంది. ఖర్చుకూడా తక్కువవుతుండటంతో ఇక్కడ సందర్శకుల తాకిడి పెరిగింది. వీకెండ్స్లో చీరాల, బాపట్ల తీరప్రాంతంలోని బీచ్లకు రోజుకు 50 వేలకు మించి సందర్శకులు వస్తున్నారు. మిగిలిన రోజుల్లోనూ 20 వేల మందికి తగ్గకుండా వస్తున్నారు. విజయవాడ కనకదుర్గమ్మ, మంగళగిరి పానకాల లక్ష్మీనరసింహ స్వామి, నరసరావుపేటలోని శ్రీ త్రికోటేశ్వరస్వామి, బాపట్లలోని సుందరవల్లీ రాజ్యలక్ష్మి సమేత శ్రీ క్షీరభావన్నారాయణస్వామి, పొన్నూరులోని శ్రీ ఆంజనేయస్వామి లాంటి ప్రసిద్ధి చెందిన ఆలయాలు ఈ ప్రాంతంలో ఉండటంతో సందర్శకులు అటు దేవాలయాలను, ఇటు బీచ్లను చూసుకుని వెళుతున్నారు. పర్యాటకాభివృద్ధికి పెద్దపీట.. తీరంలో సందర్శకుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతుండటంతో ప్రభుత్వం ఇక్కడ పర్యాటకాభివృద్ధికి అత్యంత ప్రాధాన్యతనిస్తోంది. తీరప్రాంతానికి రోడ్లు వేసి రవాణా సౌకర్యాన్ని మరింత మెరుగుపర్చింది. తీరప్రాంతంలో ఉన్న ప్రభుత్వ భూముల్లో సొంతంగా రిసార్టుల నిర్మాణానికి సిద్ధమైంది. పెరిగిన రిసార్ట్లు బీచ్లకు సందర్శకులు పెరగడంతో అంతే స్థాయిలో ఇక్కడ రిసార్టులూ పెరుగుతున్నాయి. బాపట్ల సూర్యలంకలో 32 రూమ్లతో హరిత రిసార్ట్స్ హోటల్ ఉంది. అటవీశాఖ ఆధ్వర్యంలో ఎకో రిసార్ట్స్ ఏర్పాటు చేసింది. రోజూ 90 శాతం రూమ్లు ఫుల్ అవుతుండగా.. వీకెండ్స్లో వందశాతం నిండిపోతున్నాయి. గడిచిన నాలుగేళ్లలో రద్దీ 50 శాతానికి పైగా పెరిగిందని అధికారులు చెబుతున్నారు. గతంలో నెలకు రూ.20 లక్షల వ్యాపారం జరగ్గా.. ఇప్పడది రూ.40 లక్షలకు పెరిగిందని హరిత రిసార్ట్స్ మేనేజర్ చెప్పారు. హరిత రిసార్ట్స్లో రోజుకు రూమ్రెంట్ రూ.2,500 నుంచి 4,500 వరకూ ఉంది. ఇక ఈ ప్రాంతంలో గోల్డెన్శాండ్, వీ.హోటల్ , సీబ్రీజ్, రివేరా తదితర పేర్లతో వందలాది రూమ్లతో కార్పొరేట్ స్థాయి ప్రైవేటు రిసార్ట్స్లు పెద్ద ఎత్తున వెలిశాయి. వీటిల్లో రోజుకు రూమ్రెంట్ రూ.10 వేల నుంచి 20 వేల వరకూ ఉంది. ఆన్లైన్ బుకింగ్స్తో ఇవి నిత్యం నిండిపోతున్నాయి. ఇక సాధారణ స్థాయిలో వందలాదిగా రిసార్ట్లు వెలిశాయి. వీటిల్లో రోజుకు రూమ్కు రూ.3 వేలకు పైనే రెంట్ ఉంది. చీరాల, బాపట్ల పట్టణాల్లోనూ ఇబ్బడి ముబ్బడిగా హోటళ్లు వెలిశాయి. బీచ్ల ఎఫెక్ట్తో అన్నీ నిత్యం రద్దీగా ఉంటున్నాయి. నాణ్యంగా ఫుడ్ ఉంటుందని పేరున్న హోటళ్లకు మరింత డిమాండ్ ఉంది. గోవా బీచ్ కన్నా బాగుంది సూర్యలంక బీచ్ గోవా బీచ్ కన్నా బాగుంది. ఇక్కడి వాతావరణం ప్రశాంతంగా ఉంది. మొదటిసారి సూర్యలంక బీచ్కు వచ్చాం. మళ్లీ మళ్లీ రావాలనిపిస్తోంది. బీచ్ పరిశుభ్రంగా ఉంది. సెక్యూరిటీ కూడా బాగుంది. – సాద్, అతీఫ్, అమాన్అలీ, నాసిద్.. హైదరాబాద్ ఖర్చు చాలా తక్కువ రైలు సౌకర్యం అందుబాటులో ఉండటంతో చీరాల, బాపట్ల బీచ్లకు రాగలుగుతున్నాం. ఖర్చు కూడా చాలా తక్కువగా అవుతోంది. బీచ్ చాలా బాగుంది. ప్రైవేటు రిసార్ట్లలో అద్దె చాలా ఎక్కువగా వసూలు చేస్తున్నారు. – నవీన్, ప్రభాకర్, అజయ్.. మిర్యాలగూడ మూడేళ్లుగా మరింత రద్దీ సూర్యలంక, చీరాల ప్రాంతంలోని బీచ్లకు సందర్శకులు పెరిగారు. మూడేళ్లుగా పర్యాటకుల రద్దీ మరింతగా పెరిగింది. సోమవారం నుంచి గురువారం వరకు 90 శాతం రూమ్లు బుక్ అవుతుండగా.. శుక్రవారం నుంచి ఆదివారం వరకు 100 శాతం బుక్ అవుతున్నాయి. హోటల్ వ్యాపారం మరింతగా వృద్ధి చెందింది. రద్దీ పెరగడం వల్లే ఈ ప్రాంతంలో రిసార్టులు పెద్ద ఎత్తున వెలుస్తున్నాయి. – నాగభూషణం, మేనేజర్, హరిత రిసార్ట్స్ -
అమెరికాలో అద్దంకి వాసి మృతి.. కొడుకుని కాపాడి..
సాక్షి, బాపట్ల జిల్లా : ఉద్యోగ రీత్యా అమెరికాలో నివసిస్తున్న బాపట్ల జిల్లా అద్దంకి వాసి ప్రమాదవశాత్తు నీటిలో మునిగి మృతి చెందిన ఘటన భారత కాలమానం ప్రకారం శనివారం జరిగింది. అందిన సమాచారం మేరకు పట్టణానికి చెందిన పొట్టి రాజేశ్ కుమార్(42) సాఫ్ట్వేర్ ఇంజినీర్గా ఫ్లోరిడాలో పనిచేస్తున్నారు. కుటుంబ సభ్యులతో కలసి బీచ్కు వెళ్లాడు. బీచ్లో స్నానం చేస్తున్న కుమారుడు మునిగిపోతుండటంతో నీళ్లలోకి వెళ్లి కుమారుడిని రక్షించి తాను ప్రమాదవశాత్తు నీళ్లలో మునిగి మృతిచెందాడు. ప్రజాప్రతినిధులు, అధికారులు మృతదేహాన్ని పట్టణానికి తెచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. -
అక్కను వేధించవద్దన్నందుకు అమానుషం
చెరుకుపల్లి: తన అక్కను వేధించవద్దని చెప్పిన పదో తరగతి విద్యార్థిపై ఓ యువకుడు మరో ముగ్గురు స్నేహితులతో కలిసి పెట్రోల్ పోసి నిప్పంటించారు. తీవ్రంగా గాయపడిన ఆ విద్యార్థి చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఈ అమానుష ఘటన బాపట్ల జిల్లా చెరుకుపల్లి మండలం రాజవోలు గ్రామ పరిధిలోని ఉప్పాలవారిపాలెంలో శుక్రవారం జరిగింది. బాపట్ల డీఎస్పీ మురళీకృష్ణ కథనం ప్రకారం... రాజవోలు గ్రామ పరిధిలోని ఉప్పాలపాలేనికి చెందిన ఉప్పాల మాధవి కుమారుడు ఉప్పాల అమర్నా«థ్ (15) ఉదయం ఐదు గంటల సమయంలో రాజవోలుకు సైకిల్పై ట్యూషన్కు వెళుతున్నాడు. ఆ సమయంలో రాజవోలు గ్రామానికి చెందిన పాము వెంకటేశ్వరరెడ్డి (వెంకీ), అతని స్నేహితులు మరో ముగ్గురు కలిసి అమర్నాథ్ను అడ్డగించి సైకిల్ లాక్కుని రోడ్డు పక్కన మొక్కజొన్న బస్తాలు వేసిన చోటుకు తీసుకువెళ్లి దాడి చేశారు. అనంతరం ముందుగానే తెచ్చుకున్న పెట్రోల్ను అమర్నాథ్పై పోసి నిప్పు అంటించి అక్కడ నుంచి పారిపోయారు. మంటలు రావటంతో సమీపంలోని గ్రామస్తులు గమనించి ఘటనాస్థలానికి చేరుకుని మంటలను ఆర్పి అమర్నాథ్ కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మంటల్లో తీవ్రంగా గాయపడిన అతడిని గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతిచెందాడు. గతంలోనూ దాడి.. పదో తరగతి ఫెయిల్ అయి ఖాళీగా తిరుగుతున్న పాము వెంకటేశ్వరరెడ్డి (వెంకీ) కొంతకాలంగా అమర్నా«థ్ అక్కను టీజ్ చేస్తున్నాడు. దీంతో వెంకీ, అమర్నాథ్ మధ్య గొడవ జరిగింది. అమర్నా«థ్పై వెంకీ దాడి చేశాడు. ఈ విషయం వెంకీ కుటుంబ సభ్యుల దృష్టికి కూడా అమర్నాథ్ తరఫు పెద్దలు తీసుకెళ్లారు. పాఠశాలలకు సెలవులు రావడంతో వీరు కలవలేదు. తిరిగి పాఠశాలలు పునఃప్రారంభం కావడంతో అమర్నా«థ్, ట్యూషన్, స్కూలుకు వెళుతున్నాడు. ఈ క్రమంలో ఇటీవల మార్గంమధ్యలో అమర్నాథ్ను వెంకీ అడ్డగించి బెదిరించటం పరిపాటిగా మారింది. ఈ క్రమంలో వెంకీ తన స్నేహితులతో కలిసి శుక్రవారం అమర్నాథ్పై దాడి చేసి పెట్రోలు పోసి నిప్పంటించారు. అమర్నాథ్ తండ్రి నాంచారయ్య గతంలోనే మరణించారు. అమర్నాథ్ తల్లి మాధవి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నట్లు డీఎస్పీ చెప్పారు. -
చంద్రబాబు పేరు చెబితే ఒక్క పథకం గుర్తురాదు
-
మత్స్యకారులకు మేలు కలిగేలా స్మార్ట్ కార్డుల జారీ
-
ఎన్నికలప్పుడే చంద్రబాబుకు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు గుర్తొస్తారు..
-
నిజాంపట్నంకు చేరుకున్న సీఎం జగన్
-
నెల్లూరు, బాపట్ల జిల్లాల్లో చుక్కల భూములకు విముక్తి
సాక్షి, అమరావతి: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, బాపట్ల జిల్లాల్లో భారీ స్థాయిలో చుక్కల భూములకు ప్రభుత్వంవిముక్తి కల్పించింది. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోనే 41,041 ఎకరాల భూములను నిషేధిత ఆస్తుల జాబితా నుంచి తొలగించింది. బాపట్ల జిల్లాలో 5,776 ఎకరాలను ఈ జాబితా నుంచి తొలగించింది. ఈ మేరకు రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి. సాయిప్రసాద్ శనివారం వేర్వేరు గెజిట్ నోటిఫికేషన్లు జారీ చేశారు. చుక్కల భూములకు విముక్తి కల్పించేందుకు రాష్ట్రవ్యాప్తంగా సుమోటో వెరిఫికేషన్ నిర్వహించిన విషయం తెలిసిందే. అందులో భాగంగా శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కలెక్టర్ సుమోటో వెరిఫికేషన్ నిర్వహించి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. దీని ఆధారంగా ఆ జిల్లాలో 41,041 ఎకరాల చుక్కల భూములను 1908 రిజిస్ట్రేషన్ల చట్టంలోని సెక్షన్ 22ఎ(1)ఇ నుంచి తొలగించారు. ఇవి కాకుండా సెక్షన్ 22ఎ(1)ఇ లోనే ఉన్న 13,883 ఎకరాలను 22ఎ(1)ఎ లోకి, 14,133 ఎకరాలను 22ఎ(1)బి లోకి, 751 ఎకరాలను 22ఎ(1)సి లోకి, 62 ఎకరాలను 22ఎ(1) డి లోకి మార్చారు. కేవలం 10 సెంట్లను మాత్రమే 22ఎ(1)ఇ లో కొనసాగిస్తున్నారు. అలాగే, బాపట్ల జిల్లాలో 5,776 ఎకరాల చుక్కల భూములను 22ఎ(1)ఇ నుంచి తొలగించారు. ఇవి కాకుండా సెక్షన్ 22ఎ(1)ఇలోనే ఉన్న 1,080 ఎకరాలను 22ఎ(1)ఎ లోకి, 89 ఎకరాలను 22ఎ(1)బి లోకి, 858 ఎకరాలను 22ఎ(1)సి లోకి మార్చారు. 13,461 ఎకరాలను మాత్రం 22ఎ(1)ఇ లోనే ఉంచారు. ఇప్పటికే పలు జిల్లాల్లో చుక్కల భూములను నిషేధిత ఆస్తుల జాబితా నుంచి తొలగిస్తూ గెజిట్ నోటిఫికేషన్లు జారీ చేయగా, తాజాగా ఈ రెండు జిల్లాలకు నోటిఫికేషన్లు ఇచ్చారు. ఎప్పుడూ లేని విధంగా 15 జిల్లాల్లో ఒకేసారి 2.06 లక్షల ఎకరాలను చుక్కల భూముల నుంచి తొలగించడం ద్వారా లక్ష మంది రైతులకు ప్రభుత్వం మేలు చేకూరుస్తోంది. -
చిరకాల వాంఛ నెరవేరింది
బాపట్ల: బాపట్ల జిల్లా ఆవిర్భావ వేడుకలు మంగళవారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. మేళ తాళాలు, కోలాట నృత్యాలు, నెమలి నృత్య ప్రదర్శన, డప్పు కళాకారులు, వాయిద్య కళాకారుల ప్రదర్శనలు పట్టణ ప్రజలను అబ్బురపరిచాయి. రథంబజారులోని భావనారాయణస్వామి దేవాలయం వద్ద నిర్వహించిన సంబరాలకు అశేష జనం హాజరయ్యారు. జిల్లా కలెక్టర్ కె.విజయకృష్ణన్, జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్, బాపట్ల శాసనసభ్యులు కోన రఘుపతి కుటుంబ సమేతంగా భావనారాయణస్వామికి పొంగలి నివేదించారు. ముందుగా కుంభమేళాతో దేవాలయానికి చేరుకున్నారు. అనంతరం జిల్లా అధికారులను ప్రజాప్రతినిధులు, ప్రజాప్రతినిధులను అధికారులు సత్కరించారు. రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణారావు మాట్లాడుతూ డాక్టర్ బాబూ జగ్జీవన్ రామ్, అంబేద్కర్ ఆశయాలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కొనసాగిస్తున్నారని అన్నారు. ప్రజా సంక్షేమ కార్యక్రమాల అమలులో ముఖ్యమంత్రి సాహసోపేత నిర్ణయాలతో ముందుకు వెళ్తున్నారని చెప్పారు. బాపట్ల జిల్లా ఏర్పాటుతో ప్రజల చిరకాల వాంఛ నెరవేరిందన్నారు. నిజాంపట్నం పోర్టు రెండవ దశ విస్తరణ, అభివృద్ధి నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయన్నారు. చీరాల ఓడరేవు నిర్మాణం, తీర ప్రాంతాల అభివృద్ధితో జిల్లా పర్యాటక ప్రాంతంగా రూపుదిద్దుకోనుందని వివరించారు. అభివృద్ధికి అవసరమైన సహజ వనరులన్నీ జిల్లాలో పుష్కలంగా ఉన్నాయని అభివర్ణించారు. జిల్లా ప్రజలంతా సంతోషంగా ఉన్నారని అన్నా రు. ఎంపీ నందిగం సురేష్ మాట్లాడుతూ పేదరికంలో ఉన్న వారిని స్థితిమంతులుగా చేయడానికి ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతుందన్నారు. ఒకసారి ప్రజలకు ఏదైనా మాట ఇస్తే ముఖ్యమంత్రి జగన్ మరిచిపోరని అన్నారు. ఎమ్మెల్యే కోన రఘుపతి మాట్లాడుతూ బాపట్ల జిల్లా అభివృద్ధి వైపు ముందుకు సాగుతోందని అన్నారు. బాపట్లకు త్వరలో కొత్తగా రైల్వేలైన్ రానుందన్నారు. ప్రజల ఆకాంక్షలు, కలలు సాకారం అయ్యాయని, ముఖ్యమంత్రి జగన్ నిర్ణయంతోనే ఇది సాధ్యమైందని అన్నారు. జిల్లా ఆవిర్భావం అనంతరం జిల్లా యంత్రాంగం చేసిన కృషిని ఆయన ప్రత్యేకంగా ప్రశంసించారు. జిల్లా కలెక్టర్ కె.విజయకృష్ణన్ మాట్లాడుతూ అందరూ కలిసికట్టుగా పనిచేస్తే బాపట్ల జిల్లా మరింత పురోభివృద్ధిలో పయనిస్తుందని అన్నారు. ప్రజలకు సేవలందించడం, మౌలిక సదుపాయాల కల్పనలో అధికారులు చేసిన కృషిని ఆమె ప్రత్యేకంగా అభినందించారు. జిల్లా ప్రజలకు కలెక్టర్ శుభాకాంక్షలు తెలిపారు. ఎస్పీ వకుల్ జిందాల్ మాట్లాడుతూ శాంతిభద్రతలకు ఎలాంటి విఘా తం కలగకుండా ప్రజలంతా సహకరించారని అన్నారు. ప్రజలు ప్రశాంతంగా జీవించే వాతావరణ కల్పించడానికి పోలీసు యంత్రాంగం నిరంతరం కృషి చేస్తుందన్నారు. జేసీ డాక్టర్ కె.శ్రీనివాసులు మాట్లాడుతూ చుక్కల భూముల కింద తొమ్మిది వేల ఎకరాల భూములను గుర్తించి హక్కుదారులకు పూర్తి హక్కులు కల్పించేలా నిషేధిత భూముల జాబితాలో నుంచి తొలగించా మని తెలిపారు. చీరాల–చిలకలూరిపేట, నిజాంపట్నం–బుడంపాడు వరకు రెండు జాతీయ రహదారులు జిల్లాకు వస్తున్నాయని చెప్పారు. జిల్లా అభివృద్ధిలో అధికారులు, ప్రజాప్రతితులు అందించిన సహకారం మరువలేనిదన్నారు. అద్దంకి మాజీ ఎమ్మెల్యే బాచిన గరటయ్య, చీరాల నియోజకవర్గ ఇన్చార్జి కరణం వెంకటేష్బాబు, బుడా చైర్మన్ దేవినేని మల్లికార్జునరావు, బుడా వైస్చైర్మన్ ఏ.భానుప్రతాప్, జిల్లా రెవెన్యూ అధికారి కె లక్ష్మీ శివజ్యోతి తదితరులు పాల్గొన్నారు. -
అమెరికా వెళ్లిన ఏడు నెలలకే..
మార్టూరు: ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్లిన ఓ తెలుగు విద్యార్థి ఏడు నెలలకే అనుమానాస్పదస్థితిలో అర్ధంతరంగా తనువు చాలించాడు. బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. బాపట్ల జిల్లా మార్టూరు మండలం జొన్నతాళి గ్రామానికి చెందిన గోవాడ రమేష్ దంపతులకు ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. కుమారుడు గోవాడ నాగసాయి గోపి అరుణ్ కుమార్ (22) ఇంజినీరింగ్ పూర్తి చేసి ఎంఎస్ చదవడం కోసం గతేడాది ఆగస్టులో అమెరికా వెళ్లాడు. లాంనార్ యూనివర్సిటీలో ఎంఎస్ చదువుతూ టెక్స్పోర్టన్ ఏరియాలో ఐదుగురు స్నేహితులతో కలిసి నివాసం ఉంటుండగా, వారితో ఒక యువతి కూడా ఉంటోంది. ఈ క్రమంలో మార్చి 1న అరుణ్ కుమార్ స్నేహితులకు కనిపించకుండా పోవడంతో గదిలోని స్నేహితురాలి ఫిర్యాదు మేరకు అమెరికా పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. దర్యాప్తులో భాగంగా పోలీసులు మార్చి 3వ తేదీన అరుణ్కుమార్ మృతదేహాన్ని వారి నివాసానికి సమీపంలో ఓ నీటి సరస్సులో గుర్తించి స్నేహితులకు, ఇండియాలోని తండ్రి రమేష్కు సమాచారం అందించారు. శవ పరీక్ష అనంతరం అరుణ్కుమార్ మృతదేహాన్ని అతని స్నేహితులు స్వంత ఖర్చులతో ఇండియా పంపగా.. శనివారం మధ్యాహ్నం స్వగ్రామం జొన్నతాళి చేరింది. పోస్టుమార్టం నివేదిక వస్తేనే కానీ అరుణ్కుమార్ మృతికి కారణం తెలియదని కుటుంబ సభ్యులు భావిస్తున్నారు. ఉన్నత చదువులు చదివి తమ కుటుంబాన్ని ఆదుకుంటాడని ఆశించి అమెరికా పంపిస్తే శవమై తిరిగి వస్తాడని ఊహించలేదంటూ కుటుంబ సభ్యులు రోదిస్తున్న తీరు వర్ణనాతీతం. సాయంత్రం గ్రామంలో అరుణ్కుమార్ అంత్యక్రియలు నిర్వహించారు. -
బాపట్ల జిల్లా మేదరమెట్లలో ఘోర రోడ్డు ప్రమాదం
-
బాపట్ల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. అద్దంకి ఎస్ఐ భార్య, కూతురు మృతి
సాక్షి, బాపట్ల జిల్లా: మేదరమెట్ల వద్ద జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. మృతుల్లో అద్దంకి ఎస్సై సమంధర్ వలి భార్య కూతురు కూడా ఉన్నారు. చిన్నగంజాం లో తిరుణాలకు డ్యూటీకి వెళ్లిన ఎస్సై సమందర్ వలి, తన భార్య కూతురుతో పాటు, పక్కింటి మరో ఇద్దరిని కూడా తీసుకెళ్లారు. శివాలయంలో దర్శనం ముగించుకున్న తర్వాత డ్రైవర్ని ఇచ్చి కుటుంబ సభ్యులను అద్దంకి ఇంటికి పంపించారు. అయితే తిరుగు ప్రయాణంలో మేదరమెట్ల జాతీయ రహదారిపై రాగానే డ్రైవర్ కునుకు తీయడంతో ఒకసారిగా కారు డివైడర్ను ఢీకొట్టింది. కారు పల్టీ కొట్టి అవతలి రోడ్డుపై పడిపోవడంతో అటుగా వచ్చిన లారీ కారుని ఢీకొంది. దీంతో కారులో ఉన్న ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు వహీదా(39) ఆయేషా(9) గుర్రాల జయశ్రీ (50) గుర్రాల దివ్య తేజ(27), డ్రైవర్ బ్రహ్మచారిగా గుర్తించారు. డ్రైవర్ చేసిన తప్పిదం వల్ల ఐదుగురు నిండు ప్రాణాలు బలయ్యాయి.. తన భార్యతో పాటు తన 9 ఏళ్ల కూతురు ప్రమాదంలో చనిపోవడంతో అద్దంకి ఎస్ఐ సమందర్ వలి బోరున వినిపిస్తున్నారు. కారులో ఇరుక్కుపోయిన మృతదేహాలను బయటకు తీసేందుకు పోలీసులు చాలా సేపు శ్రమించాల్సి వచ్చింది. మృతదేహాలను అద్దంకి మార్చురీకి తరలించారు. -
బాపట్లలో విషాదం: చెట్టు మీదే ప్రాణం విడిచిన చిన్నారి
సాక్షి, బాపట్ల: జిల్లాలో ఆదివారం విషాదకర ఘటన చోటు చేసుకుంది. కొరిశపాడు మండలం దైవాల రావూరులో ఆటాడుకుంటూ విద్యుత్ తీగలు తగిలి ఓ చిన్నారి చెట్టు మీదే కన్నుమూశాడు. మరో చిన్నారి ఈ ఘటనలో గాయపడి.. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. గ్రామానికి చెందిన ఇద్దరు చిన్నారులు ఆదివారం కావటంతో.. స్థానికంగా ఉన్న సాయిబాబా గుడి ఎదురుగా ఉన్న చెట్టు మీద ఎక్కి ఆడుకుంటున్నారు. ఈ తరుణంలో.. చెట్టు మధ్యలో ఉన్న కరెంటు తీగలు గమనించక ముందుకు వెళ్లారు. దీంతో విద్యుద్ఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందాడు ఓ చిన్నారి. ఇక మరో చిన్నారి కరెంట్ షాక్ దెబ్బకు కింద పడిపోయి గాయాలపాలయ్యాడు. మృతి చెందిన చిన్నారి గడ్డం బుజ్జి కుమారుడు అఖిల్ గా స్థానికులు గుర్తించారు. మరొక బాలుడిని చికిత్స నిమిత్తం మేదరమెట్ల లోని ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. ప్రాణం విడిచి చెట్టు మీదే పడి ఉన్న చిన్నారి అఖిల్ మృతదేహం చూసి గ్రామస్తులంతా విలపించారు. -
హైవేపై విమానాల ఎమర్జెన్సీ ల్యాండింగ్.. ట్రయల్ రన్ సక్సెస్
మేదరమెట్ల(బాపట్ల జిల్లా): కొరిశపాడులోని పి.గుడిపాడు సమీపంలో జాతీయ రహదారిపై విమాన ఎమర్జెన్సీ ల్యాండింగ్ ట్రయల్ రన్ నిర్వహించారు. జె.పంగులూరు మండలంలోని రేణింగివరం నుంచి కొరిశపాడు వరకు ఏర్పాటు చేసిన ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఏర్పాటు చేశారు. ట్రయల్ రన్ కారణంగా గురువారం ఉదయం 10.30 గంటల నుంచి 12 గంటల వరకు ఒంగోలు వైపు నుంచి వచ్చే వాహనాలు అద్దంకి వైపునకు.. గుంటూరు వైపు నుంచి వచ్చే వాహనాలు రేణింగివరం వద్ద నుంచి అద్దంకి వైపునకు మళ్లించారు. ట్రయల్ రన్ సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు. సీఐ రోశయ్య, భారత వైమానికి దళం గ్రూప్ కెప్టెన్ ఆర్.ఎస్. చౌదరి, ఎస్బీ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, మేదరమెట్ల, కొరిశపాడు ఎస్ఐలు శివకుమార్, వెంకటేశ్వరరావు, ఎయిర్ఫోర్స్ సిబ్బంది పాల్గొన్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) చదవండి: గుడివాడపైనే గురెందుకు? రెచ్చగొడుతున్నదెవరు? -
16 జాతీయ రహదారిపై ఎమర్జెన్సీ ఎయిర్ ల్యాండింగ్ స్ట్రిప్
-
థాంక్యూ.. సీఎం జగన్ మామయ్య (ఫొటోలు)
-
బాపట్ల : సీఎం జగన్ చేతుల మీదుగా ట్యాబ్ల పంపిణీ (ఫొటోలు)
-
ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ విప్లవానికి శ్రీకారం చుట్టాం : సీఎం జగన్
-
పెత్తందారుల పిల్లలు మాత్రమే ఇంగ్లీష్ మీడియం చదవాలా?: సీఎం జగన్
సాక్షి, బాపట్ల జిల్లా: పెత్తందారీ భావజాలం చూస్తుంటే బాధనిపిస్తుందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. యడ్లపల్లిలో ట్యాబ్ల పంపిణీ కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ, కొందరు పెత్తందారులు తమ పిల్లల్ని ఇంగ్లీష్ మీడియంలో చదివిస్తారు. పేద పిల్లలకు ఇంగ్లీష్ మీడియం చదువులు చెప్పిస్తుంటే కోర్టులకు వెళతారు’’అని అన్నారు. నా పుట్టినరోజు గురించి కాదు.. పుట్టిన బిడ్డ గురించి ఆలోచన చేస్తున్నానన్నారు. ‘‘ఈ రోజు దేవుడి దయతో మరో మంచి కార్యక్రమానికి స్వీకారం చుట్టబోతున్నాం. ఆర్థిక స్థోమత వల్ల పిల్లలను చదివించుకోలేని తల్లిదండ్రుల బాధలను చూశా. తలరాతలు మారాలంటే చదువు ఒక్కటే మార్గం. పిల్లల భవిష్యత్ను ఉన్నతంగా తీర్చిదిద్దేలా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ విప్లవానికి శ్రీకారం చుట్టాం. సమాజంలో ఉన్న అంతరాలు తొలగాలి. పేద విద్యార్థులకు ఇంగ్లీష్ మీడియం, డిజిటల్ విద్య అందకూడదనే పెత్తందారీ భావజాలం చూసి బాధ వేసింది. విద్యార్థులకు అందించే చదువులో సమానత్వం ఉండాలి. మంచి విద్యా విధానంతో పిల్లల తలరాతలు మారతాయి. భావి తరాల పిల్లల భవిష్యత్ను ఉన్నతంగా తీర్చిదిద్దాలన్నదే లక్ష్యం. చదువులో సమానత్వం ఉంటేనే ప్రతి కుటుంబం అభివృద్ధి’’ అని సీఎం జగన్ పేర్కొన్నారు. ‘‘తెలుగు, ఇంగ్లీష్, హిందీతో పాటు దాదాపు 8 భాషల్లో పాఠ్యాంశాలు ఉంటాయి. పిల్లలకు మరింత సులువుగా పాఠాలు అర్థమయ్యేలా ట్యాబ్లు అందిస్తున్నాం. క్లాస్ టీచర్ చెప్పే పాఠశాలకు ఈ ట్యాబ్లు సపోర్ట్గా ఉంటాయి. పిల్లలు మంచి పేరు తెచ్చుకోవాలని తల్లిదండ్రులు కోరుకుంటారు. నా సుదీర్ఘ రాజకీయ ప్రయాణంలో పేద తల్లిదండ్రుల కష్టాలను చూశాను. మూడున్నరేళ్లలో ఎక్కడా వెనకడుగు వేయలేదు’’ అని సీఎం అన్నారు. ‘‘పిల్లలకు నష్టం జరిగే కంటెంట్ను ట్యాబ్ల్లో తొలగించాం. విద్యార్థులకు ఇచ్చే ఒక్కో ట్యాబ్లో బైజూస్ కంటెంట్ విలువ రూ.32 వేలు.ట్యాబ్ల్లో బైజూస్ కంటెంట్ అప్లోడ్ చేసి అందిస్తున్నాం.రూ.686 కోట్ల విలువైన 5,18,740 ట్యాబ్లను ఉచితంగా పంపిణీ చేస్తున్నాం. నెట్తో సంబంధం లేకుండా పాఠ్యాంశాలు చూసే వెసులుబాటు కల్పించాం’’ అని సీఎం పేర్కొన్నారు. చదవండి: క్యాంప్ కార్యాలయంలో బర్త్డే వేడుకలు.. కేక్ కట్ చేసిన సీఎం జగన్ ‘‘నా పుట్టిన రోజు నాడు నాకెంతో ఇష్టమైన చిన్నారుల భవిష్యత్తు కోసం చేస్తున్న మంచి కార్యక్రమంలో పలు పంచుకోవడం దేవుడు నాకిచ్చిన అదృష్టంగా భావిస్తున్నాను. మన పిల్లలు అంటే.. మన తర్వాత కూడా ఉండే మనం. పిల్లలు బాగుండాలని తమకన్నా కూడా బాగా ఎదగాలని, తమకన్నా మంచిపేరు ఇంకా తెచ్చుకోవాలని, ప్రతి తల్లీదండ్రీకూడా మనసారా కూడా కోరుకుంటారు. అలా కోరుకునే అనేక హృదయాలు రకరకాల కారణాల వల్ల అంటే తమ కులం వల్లనో, ఆర్థిక స్తోమత కారణంగానో సరిగ్గా చదివించుకోలేకపోతున్నామని వారు భావించినప్పుడు వారి మనస్సులు తల్లిడిల్లిపోతాయి. దీన్ని స్వయంగా నేను చూశాను.’’ అని సీఎం అన్నారు. -
తలరాతలు మారాలంటే చదువు ఒక్కటే మార్గం: సీఎం జగన్
ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ విద్యను ప్రవేశపెట్టడంలో భాగంగా ప్రభుత్వం చేపట్టిన రాష్ట్రస్థాయి కార్యక్రమానికి బాపట్ల జిల్లా చుండూరు మండలం యడ్లపల్లిలోని ఆలపాటి వెంకట రామయ్య జెడ్పీ ఉన్నత పాఠశాల బుధవారం వేదికైంది. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దివ్య హస్తాల మీదుగా ఎనిమిదో తరగతి విద్యార్థులకు బైజుస్ కంటెంట్తో ఉన్న ట్యాబ్ల పంపిణీకి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. ఈ రోజు దేవుడి దయతో మరో మంచి కార్యక్రమానికి స్వీకారం చుట్టబోతున్నాం. ఆర్థిక స్థోమత వల్ల పిల్లలను చదివించుకోలేని తల్లిదండ్రుల బాధలను చూశా. తలరాతలు మారాలంటే చదువు ఒక్కటే మార్గం. పిల్లల భవిష్యత్ను ఉన్నతంగా తీర్చిదిద్దేలా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ విప్లవానికి శ్రీకారం చుట్టాం. సమాజంలో ఉన్న అంతరాలు తొలగాలి. పేద విద్యార్థులకు ఇంగ్లీష్ మీడియం, డిజిటల్ విద్య అందకూడదనే పెత్తందారీ భావజాలం చూసి బాధ వేసింది. విద్యార్థులకు అందించే చదువులో సమానత్వం ఉండాలి. మంచి విద్యా విధానంతో పిల్లల తలరాతలు మారతాయి. భావి తరాల పిల్లల భవిష్యత్ను ఉన్నతంగా తీర్చిదిద్దాలన్నదే లక్ష్యం. చదువులో సమానత్వం ఉంటేనే ప్రతి కుటుంబం అభివృద్ధి అని సీఎం జగన్ పేర్కొన్నారు. 'ట్యాబ్లలలో బైజూస్ కంటెంట్ అప్లోడ్ చేసి అందిస్తున్నాం. రూ.686 కోట్ల విలువైన 5,18,740 ట్యాబ్లు ఉచితంగా పంపిణీ చేస్తున్నాం. నెట్తో సంబంధం లేకుండా పాఠ్యాంశాలు చూసే వెసులుబాటు కల్పిస్తున్నాం. ఏటా 8వ తరగతిలోకి వచ్చిన విద్యార్థులందరికీ ట్యాబ్లు అందిస్తాం. ట్యాబ్ల ద్వారా విద్యార్థులకు సులువుగా పాఠాలు అర్థమవుతాయి. అందుకు అనుగుణంగానే కంటెంట్ ఉంటుంది' అని సీఎం జగన్ తెలిపారు. మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. ఈ రోజు రాష్ట్ర విద్యారంగంలోనే విప్లవాత్మకమైన రోజు. విద్యారంగంలో సీఎం జగన్ కొత్తశకానికి నాంది పలికారు. మంత్రి మేరుగ నాగార్జున మాట్లాడుతూ.. విద్యారంగానికి సీఎం జగన్ అధిక ప్రాధాన్యం ఇచ్చారు. పేద విద్యార్థులకు కార్పొరేట్ విద్య అందించాలనేదే సీఎం జగన్ లక్ష్యం. ప్రపంచంతో పోటీపడేలా విద్యార్థులను తీర్చిదిద్దాలనేదే సీఎం ఆకాంక్ష అని అన్నారు. 12:10AM ►ట్యాబ్లలో బైజూస్ కంటెంట్ అప్లోడ్ చేసి అందిస్తున్న ఏపీ ప్రభుత్వం ►రూ.686 కోట్ల విలువైన 5,18,740 ట్యాబ్లు ఉచిత పంపిణీ ►నెట్తో సంబంధం లేకుండా పాఠ్యాంశాలు చూసూ వెసులుబాటు ►బైజూస్ లెర్నింగ్ యాప్తో లెక్కలు, ఫిజిక్స్, జువాలజీ, బయాలజీ, జియాలజీ, సివిక్స్, హిస్టరీ పాఠ్యాంశాలు ►తెలుగు ఇంగ్లీష్ హిందీతో పాటు దాదాపు 8 భాషల్లో పాఠ్యాంశాలు ►విద్యార్థులకు అర్థమయ్యేలా సుమారు 2 నుంచి 4 నిమిషాల నిడివితో యానిమేషన్, వీడియోల రూపంలో పాఠ్యాంశాలు ►బైజూస్ ప్రీలోడెడ్ కంటెంట్లో మొత్తం 57 చాప్టర్లు్ల, 300 వీడియోలు ►ట్యాబ్లపై విద్యార్థులు, ఉపాధ్యాయులకు ఇప్పటికే ఐటీ విభాగం అవగాహన 12:07AM ►రాష్ట్ర వ్యాప్తంగా 5,18,740 ట్యాబ్లు పంపిణీ చేస్తున్న ప్రభుత్వం ►4,59,564 మంది విద్యార్థులు.. 59,176 మంది ఉపాధ్యాయులకు ట్యాబ్లు ►రాష్ట్ర వ్యాప్తంగా వారం రోజులపాటు ట్యాబ్ల పంపిణీ కార్యక్రమం ►నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల చేతుల మీదుగా 9,703 స్కూళ్లలో బ్యాబ్ల పంపిణీ 12:03AM బాపట్ల: యడ్లపల్లి బహిరంగ సభా వేదికపై సీఎం జగన్ ►కాసేపట్లో జడ్పీ హైస్కూల్ 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్లు పంపిణీ చేయనున్న సీఎం జగన్ 11:30AM సీఎం జగన్కు ఘనస్వాగతం యడ్లపల్లిలో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి ప్రజలు ఘనస్వాగతం పలికారు. దారిపొడవునా పూలు జల్లుతూ హారతులు పడుతూ పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. జన హృదయ విజేత.. నవరత్నాలు పొదిగిన సంక్షేమ సార్వభౌమ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం బాపట్ల జిల్లాకు రానున్నారు. భావి పౌరుల బంగారు భవితకు బాటలు వేసే బృహత్తర కార్యక్రమానికి తన పుట్టిన రోజున శ్రీకారం చుట్టనున్నారు. విద్యాంధ్ర సాధనకు శంఖారావం పూరించనున్నారు. జయీభవ.. ‘విద్య’యీభవ అంటూ విద్యార్థులను దీవించనున్నారు. వరాల రేడు పర్యటన నేపథ్యంలో ఉమ్మడి గుంటూరు జిల్లా ప్రజలు ఆనందభరితులవుతున్నారు. స్వాగతం.. సుస్వాగతం అంటూ జననేతకు జేజేలు పలుకుతున్నారు. సాక్షి, నరసరావుపేట/వేమూరు: ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ విద్యను ప్రవేశపెట్టడంలో భాగంగా ప్రభుత్వం చేపట్టిన రాష్ట్రస్థాయి కార్యక్రమానికి బాపట్ల జిల్లా చుండూరు మండలం యడ్లపల్లిలోని ఆలపాటి వెంకట రామయ్య జెడ్పీ ఉన్నత పాఠశాల బుధవారం వేదికవుతోంది. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దివ్య హస్తాల మీదుగా ఎనిమిదో తరగతి విద్యార్థులకు బైజుస్ కంటెంట్తో ఉన్న ట్యాబ్ల పంపిణీ కోసం సుందరంగా ముస్తాబై వేచిచూస్తోంది. దీనికోసం జిల్లా యంత్రాంగం అవసరమైన అన్ని ఏర్పాట్లనూ పూర్తిచేసింది. మంత్రి మేరుగ నాగార్జున, కలెక్టర్ విజయకృష్ణన్, ఉన్నతాధికారులు దగ్గరుండి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. బాపట్ల జిల్లాగా ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి రెండోసారి జిల్లాకు వస్తున్నారు. అదీ తన పుట్టిన రోజున జననేత జిల్లాలో పర్యటించనుండడం విశేషం. దీంతో సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. పారీ్టశ్రేణులు, ప్రజలు జననేత రాక కోసం ఉత్సాహంగా నిరీక్షిస్తున్నారు. పటిష్ట బందోబస్తు.. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో జిల్లా పోలీస్ యంత్రాంగం పటిష్ట బందోబస్తు చేపట్టింది. ఎస్పీ వకుల్ జిందాల్ మంగళవారం యడ్లపల్లిలో భద్రతా ఏర్పాట్లను సమీక్షించారు. ఒక అదనపు ఎస్పీ, ఏడుగురు డీఎస్పీలు, 30 మంది సీఐలు, 80 మంది ఎస్సైలు, 50 మంది మహిళా కానిస్టేబుళ్లు, మరో 890 మంది ఏఎస్ఐలు, హెడ్ కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్లు, హోంగార్డులతో కలిపి మొత్తం 1,050 మంది సిబ్బందితో కట్టుదిట్ట చర్యలు చేపట్టారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ పి.మహేష్, డీఎస్పీలు టి.మురళీకృష్ణ, ఎ.శ్రీనివాసరావు, పి.శ్రీకాంత్, ఏఆర్ డీఎస్పీ ప్రేమ్ కుమార్ పాల్గొన్నారు. ఆనందంగా ఉంది సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పుట్టినరోజు మనందరికీ పండుగ రోజు. అటువంటి రోజున ఆయన నా నియోజకవర్గంలో పర్యటించడం సంతోషంగా ఉంది. పేదింటి పిల్లల తలరాతలు మార్చే విద్యకు సంబంధించిన ముఖ్యమైన కార్యక్రమానికి బాపట్ల జిల్లాను ఎంచుకున్నందుకు సీఎంకు ధన్యవాదాలు. – మేరుగ నాగార్జున, రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి -
మేనమామ సీఎం జగన్కు చిన్నారుల ప్రత్యేక శుభాకాంక్షలు
సాక్షి, అమరావతి: వైఎస్సార్ సీపీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పుట్టిన రోజు వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం, యడ్లపల్లిలో 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్ల పంపిణీ కార్యక్రమం బుధవారం ముఖ్యమంత్రి చేతుల మీదగా జరగనుంది. ఈ నేపథ్యంలో సీఎం చేతుల మీదుగా ట్యాబ్లు అందుకునేందుకు యడ్లపల్లికి వెళ్తున్న విద్యార్థులు.. తమ భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తున్న మేనమామ సీఎం వైఎస్ జగన్కు పేపర్లపై కార్టూన్లు వేసి మరీ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. హ్యాపీ బర్త్ డే జగన్ మామయ్య అంటూ నినాదాలతో సీఎంకు విషెస్ తెలిపారు. చదవండి: సీఎం జగన్కు ప్రధాని మోదీ పుట్టినరోజు శుభాకాంక్షలు -
బాపట్ల: జగనన్న 175/175.. ఆకట్టుకున్న వరి కోత
సాక్షి, బాపట్ల: జననేత వైఎస్ జగన్ పుట్టినరోజు సందర్భంగా.. రాష్ట్రవ్యాప్తంగా అభిమానం వెల్లువెత్తుతోంది. ఇదిలా ఉంటే.. గత మూడేళ్లుగా వైఎస్ జగన్మోహన్రెడ్డి పుట్టినరోజుకి తన అభిమానాన్ని డిఫరెంట్గా కనబరిచే వైఎస్ఆర్సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి కారుమూరు వెంకటరెడ్డి.. మరోసారి ప్రత్యేకతను చూపించారు. చుండూరు మండలం వలివేరు పంట పొలాలలో వైఎస్ జగన్ 175/175 సీట్లు లక్ష్యం నెరవేరాలని ఆకాంక్షిస్తూ.. వరి కోత ప్రదర్శించారు. ఇదిలా ఉంటే.. మొదటి సంవత్సరం బాపట్ల బీచ్ లో ఇసుకతో జగన్మోహన్ రెడ్డి విగ్రహాన్ని చేయించారు తర్వాత సంవత్సరం జై జగనన్న వరికొత్తతో కోయించారు తర్వాత సంవత్సరం రావిఆకు మీద జగన్మోహన్ రెడ్డి ఫోటో గియించారు. ఇక ఈ సంవత్సరం జగన్మోహన్ రెడ్డి 175/175 సీట్ల లక్ష్యం సాధించాలని 175/175 జగనన్న అని వరి కోతతో కోయించి తన అభిమానాన్ని మరో సారి చాటుకున్నారు. సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ మేరుగు నాగార్జున, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి కారుమూరు వెంకటరెడ్డి పార్టీ కార్యకర్తలు నాయకులు పాల్గొని కేక్ నీ కట్ చేసి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ముందుగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారంటూ వెంకటరెడ్డికి అభినందనలు తెలిపారు మంత్రి మేరుగు.