Bandaru Dattatreya
-
పవన్ కల్యాణ్ మాకు ఫ్యామిలీ ఫ్రెండ్: మంచు విష్ణు
Manchu Vishnu About Pawan Kalyan: అలయ్-బలయ్ కార్యక్రమంలో పవన్ కల్యాణ్, తాను మాట్లాడుకోకపోవడంపై మంచు విష్ణు క్లారిటీ ఇచ్చారు. తామిద్దరం మాట్లాడుకున్నాం అని, అయితే ఉప రాష్రపతి ఉండట వల్ల స్టేజ్పై మాత్రమే మాట్లాడుకోలేదని పేర్కొన్నారు. ఇక కార్యక్రమం అనంతరం పోస్ట్ చేసిన ట్వీట్పై స్పందిస్తూ..పవన్ ఫ్యాన్స్ కోసమే ఆ వీడియోను షేర్ చేసినట్లు తెలిపారు. తమ మధ్య విభేదాలు లేవని, పవన్కల్యాణ్ తమకు ఫ్యామిలీ ఫ్రెండ్ అని పేర్కొన్నారు. అంతేకాకుండా నిన్న తండ్రి మోహన్బాబు-చిరంజీవి ఫోన్లో మాట్లాడుకున్నట్లు వివరణ ఇచ్చారు. కాగా బండారు దత్తాత్రేయ నిర్వహించిన అలయ్-బలయ్ కార్యక్రమంలో మంచు విష్ణు- పవన్ కల్యాణ్ ఎదురుపడినా ఇద్దరి మధ్యా మాటల్లేవ్ అంటూ సోషల్ మీడియాలో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. చదవండి: శివబాలాజీ భార్యపై మోహన్ బాబు సీరియస్ Can you guess whose at the end of the video? 💪🏽 pic.twitter.com/FJyMiWRA2T — Vishnu Manchu (@iVishnuManchu) October 17, 2021 చదవండి: ‘మా’ ఎన్నికలు: ట్రోలర్స్పై మండిపడ్డ మంచు లక్ష్మి శ్రీవారిని దర్శించుకున్న ‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణు అండ్ టీం -
సందడిగా అలయ్ బలయ్.. హాజరైన ప్రముఖులు
-
జలవిహార్లో సందడిగా ‘అలయ్- బలయ్’ కార్యక్రమం
సాక్షి, హైదరాబాద్: హర్యానా గవర్నర్ దత్తాత్రేయ కూతురు విజయ లక్ష్మి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘అలయ్- బలయ్’ కార్యక్రమం ఆదివారం జలవిహార్లో ప్రారంభమైంది. ఈ కార్యక్రమాన్ని తెలంగాణ గవర్నర్ తమిళసై సౌదర్యరాజన్ ప్రారంభించారు. అనంతరం ఆమె గిరిజన మహిళలలో నృత్యం చేశారు. అలయ్- బలయ్ కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో హర్యానా గవర్నర్ దత్తాత్రేయ, హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ రాజేంద్రవిశ్వనాథ్ ఆర్లేకర్, కేంద్ర హోంశాఖ మంత్రి కిషన్రెడ్డి, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, మా అధ్యక్షుడు మంచు విష్ణు, తెలంగాణ మండలి ప్రొటెం ఛైర్మెన్ భూపాల్ రెడ్డి, హోమ్ మంత్రి మహమూద్ అలీ, నటుడు కోట శ్రీనివాస్ రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా హర్యానా గవర్నర్ దత్తాత్రేయ మాట్లాడుతూ.. కలిసి తిందాం, కలిసి పాడుదాం, కలిసి ఆడుదాం అనే సంప్రదాయం ‘అలయ్ బలాయ్’ కార్యక్రమానిదని తెలిపారు. ఏళ్లుగా ‘అలయ్ బలయ్’ కొనసాగుతోందని తెలిపారు. హర్యానా గవర్నర్ దత్తాత్రేయ కూతురు విజయలక్ష్మీ మాట్లాడుతూ.. ‘అలాయ్ బలాయ్’ తెలంగాణ రుచులను ప్రోత్సహిస్తూ.. ప్రతి ఒక్కరిని సమానదృష్టితో చూస్తుందని తెలిపారు. తెలంగాణ సాధనకోసం అన్ని పార్టీలను ఏకతాటిపైకి తెచ్చిందని అన్నారు. పార్టీలకు జెండాలకు అతీతంగా అందరిని ఒకే వేదికపైకి తెచ్చేది ‘అలయ్ బలాయ్’ అని చెప్పారు. తెలంగాణ సంస్కృతిని తరతరాలకు అందించడమే ‘అలయ్ బలాయ్’ ఉద్దేశమని పేర్కొన్నారు. ప్రతి ఏటా గవర్నర్ దత్తాత్రేయ ఆధ్వర్యంలో ఆర్భాటంగా నిర్వహిస్తున్న ‘అలయ్ బలాయ్’ కార్యక్రమాన్ని గత రెండేళ్ల నుండి గవర్నర్ కూతురు విజయలక్ష్మి నిర్వహిస్తున్నారు. దసరా పండగ తర్వాత రెండో రోజు అలయ్ బలాయ్ నిర్వహిస్తారు. అలయ్ బలాయ్లో తెలంగాణ వంటల(వెజ్, నాన్ వెజ్)తో సిద్ధం చేశారు. -
ఐక్యతా స్ఫూర్తికి వేదిక అలయ్బలయ్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఆదివారం నిర్వహిస్తున్న అలయ్ బలయ్ ఉత్సవాల సందర్భంగా బండారు దత్తాత్రేయకు ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలిపారు. దసరా అనంతరం నిర్వహించే ఈ వేడుకల ద్వారా సమాజంలోని ఐక్యత, సామరస్యస్ఫూర్తి మరింత బలోపేతమవుతాయన్నారు. ‘ఏక్ భారత్ శ్రేష్ట్ భారత్’ స్ఫూర్తిని పెంపొందించేందుకు, వివిధ ప్రాంతాలకు చెందిన జానపద కళాకారుల నైపుణ్యాల ప్రదర్శనకు గొప్ప వేదికగా నిలుస్తోందని శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. -
ఈనెల 17న ‘అలయ్బలయ్’
సాక్షి, హైదరాబాద్: ఏటా దసరా సందర్భంగా ప్రస్తుత హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ ఆనవాయితీగా నిర్వహించే ‘అలయ్బలయ్’ కార్యక్రమం ఈనెల 17న జరగనుంది. హైదరాబాద్ నెక్లెస్రోడ్లోని జలదృశ్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని ఆదివారం జరిగిన అలయ్బలయ్ సన్నాహక సమావేశంలో నిర్ణయించారు. కమిటీ అధ్యక్షురాలు బండారు విజయలక్ష్మి సమావేశం అనంతరం ‘సాక్షి’తో మాట్లాడుతూ ఈసారి అలయ్బలయ్ కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ముఖ్యఅతిథిగా హాజరు కానున్నట్లు తెలిపారు. హరియాణా సీఎం మనోహర్లాల్ ఖట్టర్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల గవర్నర్లు బిశ్వభూషణ్ హరిచందన్, తమిళిసై సౌందరరాజన్, ఇరు రాష్ట్రాల సీఎంలు వైఎస్ జగన్మోహన్రెడ్డి, కేసీఆర్, కేంద్ర కార్మిక శాఖమంత్రి భూపేందర్ యాదవ్, పర్యాటక, సాంస్కృతిక శాఖమంత్రి జి.కిషన్రెడ్డిలతో పాటు పలువురిని ఆహ్వానించనున్నట్లు ఆమె వెల్లడించారు. సమావేశంలో బండారు దత్తాత్రేయ, సభ్యులు జనార్దనరెడ్డి, జిగ్నేశ్రెడ్డి, ప్రదీప్కుమార్, సత్యం యాదవ్, మాజీ ఎమ్మెల్యే రామచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
వైద్యరంగానికి కేంద్ర బిందువుగా ఎయిమ్స్
సాక్షి, యాదాద్రి: ప్రతి ఒక్కరికీ వైద్యం అందుబాటులో ఉండాలనే లక్ష్యంతో ప్రధాని మోదీ ఎయిమ్స్ కళాశాలను అభివృద్ధి చేస్తున్నా రని హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ చెప్పారు. ప్రభుత్వ వైద్యరంగానికి బీబీనగర్ ఎయిమ్స్ కేంద్ర బిందువుగా మారుతోందని అన్నారు. ప్రతి జిల్లాకు ప్రభుత్వ ఆస్పత్రి, వైద్య కళాశాల ఏర్పాటే ప్రధాని లక్ష్యమని.. అందుకే కేంద్ర బడ్జెట్లో రూ.2.40 లక్షల కోట్లను వైద్యరంగానికి కేటాయించారని చెప్పా రు. దత్తాత్రేయ శుక్రవారం యాదాద్రి భువనగిరి జిల్లాలోని బీబీనగర్ ఎయిమ్స్లో అకడమిక్ సెక్షన్ను ప్రారంభించారు. దత్తాత్రేయ మాట్లాడుతూ.. హెల్త్ డిజిటల్ ఐడీ కార్డు అందుబాటులోకి తెచ్చి ప్రైవేటు, ప్రభుత్వ ఆస్పత్రులలో మెరుగైన వైద్య సేవలు అందించడానికి కృషి జరుగుతోందన్నారు. భువనగిరి ఖిల్లాను పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయడానికి అవసరమైన నిధులను ఈ బడ్జెట్లో కేటాయిస్తామని కేంద్రమంత్రి కిషన్రెడ్డి హామీ ఇచ్చారని చెప్పారు. ఎయిమ్స్లో కొత్త క్యాంపస్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి మాట్లాడుతూ.. ఉస్మానియా, నిమ్స్ ఆస్పత్రులపై పనిభారం తగ్గించేలా ఎయిమ్స్ అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. ఎయిమ్స్ ద్వారా అందించే వైద్య సేవలను, కోవిడ్ సమయంలో నిర్వహించిన సేవలను ఎయిమ్స్ డైరెక్టర్ వికాస్ భాటియా వివరించారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ దీపక్ తివారీ, ఎయిమ్స్ డీన్ డాక్టర్ రాహుల్, మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ నీరజ్, డాక్టర్ శ్యామల, బీజేపీ జిల్లా అధ్యక్షుడు పీవీ శ్యాంసుందర్రావు, సీనియర్ నేతలు గూడూరు నారాయణరెడ్డి, బండ్రు శోభారాణీ పాల్గొన్నారు. -
ఓబీసీల హక్కులకు బాసటగా నిలవాలి
సాక్షి, హైదరాబాద్: వెనకబడిన తరగతుల హక్కుల రక్షణ బాధ్యత జాతీయ బీసీ కమిషన్(ఎన్సీబీసీ)పై ఉందని రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ వ్యాఖ్యానించారు. బీసీల అభ్యున్నతికి ఈ కమిషన్ మరింత పాటుపడాలని సూచించారు. ఎన్సీబీసీ రెండేళ్లు పూర్తి చేసుకున్న నేపథ్యంలో ఆదివారం ఇక్కడి ఖైరతబాద్లోని విశ్వేశ్వరయ్య భవన్లో ఆ కమిషన్ చైర్మన్ భగవాన్లాల్ సహానీ అధ్యక్షతన జరిగిన జాతీయ సదస్సులో తమిళిసై మాట్లాడారు. ఎన్సీబీసీ పనితీరు మెరుగ్గా ఉందని, దీంతో క్షేత్రస్థాయిలో ఓబీసీల్లో ధైర్యాన్ని నింపిందని కొనియాడారు. ప్రధాని మోదీ వల్లే ఎన్సీబీసీకి చట్టబద్ధత, రాజ్యాంగ హోదా దక్కాయని అన్నారు. కేంద్రమంత్రి జి.కిషన్రెడ్డి మాట్లాడుతూ మోదీ కేబినెట్లో 27 మం ది బీసీలకు ప్రాతినిధ్యం కల్పించి బీసీల పట్ల బీజేపీ తన ప్రేమను చాటుకుందన్నారు. రిజర్వేషన్ల అంశం కేంద్ర పరిధిలో కాకుండా రాష్ట్రాలకే ఇచ్చిందని, నాగాలాండ్లో గిరిజనులకు అక్కడ 85 %ఎస్టీ రిజర్వేషన్లు అమలవుతున్నాయని గుర్తుచేశారు. విద్యతోనే భవిష్యత్తు: దత్తాత్రేయ హరియాణ గవర్నర్ బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ గొర్లు, బర్లు పంపిణీ చేస్తే లాభం ఉండదని, విద్యతోనే ఉత్తమ భవిష్యత్తుకు బాట వేసిన వాళ్లమవుతామని అభిప్రాయపడ్డారు. బీసీలకు కేటాయించిన 27 % రిజర్వేషన్లు పక్కాగా అమలయ్యేలా ఎన్సీబీసీ కఠినంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రభుత్వ రంగంతో సమానంగా ప్రైవేటు రంగంలో కూడా దళిత, బహుజనులు విజయం సాధించాలని ఆకాంక్షించారు. ప్రతి రంగంలో మహిళలకు సముచితస్థానం క ల్పించాల్సిన అవసరముందన్నారు.ఈ సందర్భంగా గవర్నర్ చేతుల మీదుగా ఎన్సీబీసీ రెండేళ్ల పురోగతి పుస్తకాన్ని ఆవిష్కరించారు. అనంతరం జాతీయ బీసీ కమిషన్ సభ్యుడు తల్లోజు ఆచారి ఎన్సీబీసీ రెండేళ్ల విజయాలను సభలో వివరించారు. బీసీ గణనపై రగడ జనగణనలో బీసీ కులాలవారీగా గణాంకాలు సేకరించాలని తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం కార్యకర్తలు సభలో నినాదాలు చేశారు. దీంతో సభ కొంతసేపు గందరగోళంగా మారింది. పోలీసులు జోక్యం చేసుకుని ఆందోళనాకారులను అదుపులోకి తీసుకోవడంతో సభ సాఫీగా సాగింది. -
విద్యార్థిని చెక్కే శిల్పి... ఉపాధ్యాయుడు
‘వ్యక్తిత్వాన్ని నిర్మించే, మనోబలాన్ని పెంచే, బుద్ధి వైశాల్యాన్ని విస్తరించే, ఒక మనిషిని తన కాళ్ల మీద తాను నిలబడేలా చేసే విద్య మనకు కావాలి’ అంటారు స్వామి వివేకానంద. ఒక బలమైన దేశా నికి నిజమైన మూలాధారం ఉపాధ్యా యులే. వారి ప్రయత్నాలే నూతన తరాల భవిష్యత్ను కాంతిమయం చేస్తాయి. ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకొం టున్న సందర్భంలో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ను గౌరవంగా స్మరించుకుంటాం. దౌత్యవేత్త, పండితుడు, అన్నింటికీ మించి గొప్ప ఉపాధ్యాయుడు అయిన సర్వేపల్లి, దేశానికి రాష్ట్రపతి స్థాయికి ఎదిగారు. అందరినీ కలుపుకొని పోయేలా సమాజాన్ని మార్చేందుకు విద్య అనేది ముఖ్యమైన సాధనం అని ఆయన భావించారు. టీచర్ అంటే కేవలం తరగతి గదికే పరిమితమైన వారు కాదు. దానికి మించిన పాత్ర వాళ్లు పోషిస్తారు. బోధన అనేది నిరంతర ప్రక్రియ. ఉపాధ్యాయులు చురుగ్గా, సృజన శీలంగా, పట్టు వదలని విక్రమార్కుల్లా, ఎప్పటికప్పుడు కొత్త విషయాలు నేర్చుకునేలా, కాలానుగుణంగా పాత చింతకాయ భావాలను వదిలేసేలా ఉండాలి. అప్పుడే వాళ్లు అత్యుత్తమమైన మానవ వనరులను సృష్టించగలరు. జీవితంలో ఎదురయ్యే ఆటు పోట్లను తట్టుకోగలిగేలా విద్యార్థులను తీర్చిదిద్దగలరు. అత్యున్నత విద్యాసంస్థల్లో చదివినప్పటికీ, కఠినతరమైన పరీ క్షల్లో విజయులైనప్పటికీ కొంతమంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారన్న వార్తలు చదివినప్పుడు ప్రాణం విలవిల్లాడు తుంది. అందుకే బోధన అనేది కేవలం పిల్లల మెదళ్లలో జ్ఞాన తృష్ణను రగిల్చేదిగా మాత్రమే మిగలరాదు; వారి హృదయాలలో ఒక సానుకూల భావనను నెలకొనేట్టుగా చేయాలి. గూగుల్ ఎన్న టికీ గురువుకు ప్రత్యామ్నాయం కాజాలదు! ఉపాధ్యాయులు విద్యా ప్రపంచంలో వస్తున్న నూతన పరి ణామాలపట్ల వారు ఎరుకతో ఉండాలి. కోవిడ్–19 మహమ్మారి మనకు ఆన్లైన్ బోధన ప్రాధాన్యతను తెలియపర్చింది. అందుకే టీచర్లు సాంకేతిక పరిజ్ఞానంలో వస్తున్న కొత్త సాధనాలైన కృత్రిమ మేధ, వస్తు అంతర్జాలం, బ్లాక్చైన్ టెక్నాలజీ, డిజిటల్ క్లాస్ రూమ్స్ లాంటి వాటిపట్ల సాధికారత కలిగివుండాలి. డిజిటల్ నాలెడ్జ్ బ్యాంకును సృష్టించాలి. మన చిన్నారుల ఐక్యూను విశే షంగా పెంచడం మన లక్ష్యం కావాలి. వచ్చే సమస్యలకు వాళ్లే పరిష్కారాలు ఇవ్వగలిగేట్టు చేయాలి. ఆలోచన, చర్చ, ప్రయోగం అనేవి బోధనా శైలిలో ముఖ్యాంశాలు కావాలి. అప్పుడు మాత్రమే మనం నాయకులను, శాస్త్రవేత్తలను సృష్టించగలం. మెడికల్ సైన్స్, టెక్నాలజీ, మేనేజ్మెంట్, హ్యుమానిటీస్, సైన్స్లాంటి విద్యలోని ప్రతి రంగంలోనూ మనం శీఘ్రగతిన పురోగతి సాధించాం. ఐఐటీలు, ఐఐఎంలు, కేంద్ర, రాష్ట్ర విశ్వ విద్యాలయాలు ఈ రోజున విద్య గరపడంలో ఎంతో ముందు న్నాయి. అత్యున్నత విద్యా సంస్థల్లో 2019–20 సంవత్సరంలో 3.85 కోట్ల మంది ఉన్నారు. 2018–19లో ఈ సంఖ్య 3.74 కోట్లు. అంటే 11.36 లక్షల పెరుగుదల. పాఠశాల విద్యలో కూడా మనం ఎన్నో రెట్ల స్థిరమైన ప్రగతిని సాధించాం. ఉపాధి ఏర్పరుచుకు నేలా, ఉద్యోగాలు సృష్టించేలా మన విద్యార్థులు, యువతకు స్థిరమైన సాధికారతనిచ్చేలా చేయడంలో మన సామూహిక కృషి, పట్టుదలకు ఈ సంఖ్యలు ఉదాహరణ. మనం గమనించవలసింది నిరుద్యోగిత, పేదరికం, అసమా నతలు, ఆఖరికి వివక్షలాంటి ఎన్నో సవాళ్లను ఎదుర్కోవడానికి విద్య అనేది ఆచరణీయ పరిష్కారం. అందుకే సమాజంలోని బల హీన వర్గాలైన ఓబీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీల చదువుల విషయంలో అదనపు కృషి అవసరం. పేదరికంవల్ల ఈ వర్గాల నుంచి ఎంతోమంది పిల్లలు చదువులు మానుకుంటున్నారు. వాళ్లను మనం పాఠశాలల్లో ఉంచేలా చేయాలి. సమానత్వం, న్యాయం, సౌభ్రాతృత్వం, స్వేచ్ఛా విలువలతో కూడిన నవ భారతం నిర్మించడంలో, ఆత్మ నిర్భర్ భారత్ స్వప్నాన్ని నెరవేర్చడంలో నూతన విద్యా విధానం–2020 ప్రాము ఖ్యతగల పనిముట్టు కాగలదు. మన విద్యా విధానం ఒకే మూసలో పోసినట్టుండే యంత్రాలను తయారుచేసేట్టుగా కాకుండా, నైపుణ్యం, దూరదృష్టి, హేతువుతో కూడిన బహుముఖ ప్రజ్ఞను అలవర్చేదిగా ఉండాలి. అందుకే నూతన విద్యా విధానం విద్యాసంబంధ కార్యకలాపాలకూ, సాంస్కృతిక, వృత్తి సంబంధ నైపుణ్యాలకూ మధ్య గట్టి గీత గీయడం లేదు. ఆరవ తరగతి నుంచే శిక్షణతో కూడిన వృత్తి సంబంధ విద్య ప్రారంభమ వుతుంది. కనీసం ఐదో తరగతి వరకు వారి మాతృ, ప్రాంతీయ భాషల్లో బోధన ఉంటుంది. ఇరవై ఒకటో శతాబ్దపు విద్యా విధానం సౌలభ్యం, సమత, అందుబాటు, జవాబుదారీతనం అనే మూలసూత్రాల మీద నిర్మితమైంది. ఉపాధ్యాయులు పిల్లలను ఒక మాతృమూర్తిలా సంరక్షిం చాలి. మామూలు ఉపాధ్యాయుడు కేవలం తరగతి గది పాఠా లతో మాత్రమే విద్యార్థితో సంబంధంలో ఉంటాడు. కానీ మంచి ఉపాధ్యాయుడు దానికి మించి పిల్లల మనసుల్లో ముద్రవేయ గలుగుతాడు. మాకు భౌతికశాస్త్రం బోధించిన రామయ్య సర్, తెలుగు బోధించిన శేషాచార్య నాకు ఇప్పటికీ గుర్తున్నారు. వాళ్లు అద్వితీయమైన ఉపాధ్యాయులు. విద్యార్థులు, ఉపాధ్యాయుల మధ్య సరైన భావమార్పిడికి చాలా ప్రాధాన్యత ఉంటుంది. మార్కులు, గ్రేడ్లు మాత్రమే ముఖ్యం కాదని పిల్లలకు అర్థమయ్యేలా చెప్పాలి. విలువలు, వ్యక్తిత్వం, పట్టుదల, వినయం కూడా అంతే ముఖ్యం. ఉపా ధ్యాయ వృత్తి గొప్పది. భారతరత్న డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలామ్ రాష్ట్రపతిగా పదవీ విరమణ అనంతరం కూడా బోధన కొనసా గించారు. బోధన అనేది ఉద్యోగం కాదు; ఉత్తమ మానవులను తీర్చిదిద్దే ఒక మతం. మన ఉపాధ్యాయులు ఈ గొప్ప ధర్మాన్ని వ్యాపింపజేసే ప్రవర్తకులు. మీ త్యాగాల వల్ల ఎవరూ విస్మరణకు గురికాని నవభారతం సాకారమయ్యే కొత్త యుగంలోకి ప్రవేశి స్తామని నా విశ్వాసం. ‘ఒక మనిషి వ్యక్తిత్వం, అంతర్వా్యప్తి, భవి ష్యత్ రూపొందించగలిగే బోధన అనేది చాలా పవిత్రమైన వృత్తి’ అన్న అబ్దుల్ కలాం మాటలతో దీన్ని ముగిస్తాను. వ్యాసకర్త:బండారు దత్తాత్రేయ హరియాణా గవర్నర్ (నేడు ఉపాధ్యాయ దినోత్సవం) -
Bandaru Dattatreya: నేనూ పేద కుటుంబం నుంచే వచ్చా
సాక్షి, జమ్మికుంట(కరీంనగర్): ‘నేనూ పేద కుటుంబంలోనే పుట్టా. కష్టపడి ఎదిగాను. కేంద్రమంత్రిగా పనిచేశా. గవర్నర్గా కొనసాగుతున్నా. ఇందుకు కారణం ఉన్నత చదువులు చదవడమేనని హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ అన్నారు. గురువారం కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలోని గొల్లకురుమలు ఏర్పాటు చేసిన ఆత్మీయ సత్కారసభకు దత్తాత్రేయ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా గొల్లకురుమల ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. అనంతరం దత్తాత్రేయ మాట్లాడుతూ గొల్ల,కురుమలు గొర్లకాపరులుగా ఆగిపోవద్దన్నారు. వ్యాపారవేత్తలుగా, రాజకీయ నాయకులుగా ఎదగాలని సూచించారు. గొల్ల కురుమలను ఎస్సీ జాబితాలో కలపాలనే వినతిని సర్కారుకు సిఫారసు చేస్తానన్నారు. వరంగల్, మహబూబ్నగర్ జిల్లాల్లో ఉన్ని పరిశ్రమ ఏర్పాటు చేసేలా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ తుల ఉమ, నాయకులు మహిపాల్, రవీందర్, మల్లేశ్, సురేశ్, సాయిబాబా పాల్గొన్నారు. చదవండి: ఈటల గెలిస్తే ప్రభుత్వం కూలుతుందా? -
హరియాణా స్వాతంత్య్ర వేడుకల్లో ‘బతుకమ్మ’
సాక్షి, న్యూఢిల్లీ: గురుగ్రామ్లో హరియాణా ప్రభుత్వం నిర్వహించిన స్వాతంత్య్ర వేడుకల్లో బతుకమ్మ సాంస్కృతిక ప్రదర్శన ఆకర్షణగా నిలిచింది. ఈ వేడుకలకు అతిథిగా హాజరైన హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ జాతీయ జెండాను ఆవిష్కరించి కళాకారులను అభినందించారు. -
హర్యానా గవర్నర్గా బండారు దత్తాత్రేయ ప్రమాణస్వీకారం
సాక్షి, న్యూఢిల్లీ : హర్యానా గవర్నర్గా బండారు దత్తాత్రేయ ప్రమాణస్వీకారం చేశారు. గురువారం హర్యానా హైకోర్టు సీజే ఆయనతో ప్రమాణం చేయించారు. కాగా, ఇటీవలే హిమాచల్ ప్రదేశ్ నుంచి హర్యానా గవర్నర్గా దత్తాత్రేయ బదిలీ అయిన సంగతి తెలిసిందే. -
‘అన్న అంత్యక్రియల కోసం వచ్చిన నన్ను చూసి అందరు ఏడ్చారు’
సాక్షి, న్యూఢిల్లీ: ఆత్యయిక స్థితి సమయంలో జైలు నుంచి వచ్చి అన్న అంత్యక్రియల్లో పాల్గొన్న తనను చూసి అందరూ చలించిపోయారని హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ పేర్కొన్నారు. 1975 జూన్ 25న అమలులోకి వచ్చిన ఆత్యయిక స్థితి నాటి రోజులు, పడిన కష్టాలు దత్తాత్రేయ గుర్తుచేసుకున్నారు. ఆత్యయిక స్థితి అమలులోకి వచ్చిన రోజును ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిన రోజుగా ఆయన అభివర్ణించారు. మన దత్తన్నే.. మారు వేషంలో ‘‘ఆ సమయంలో ఆర్ఎస్ఎస్లో సంఘ్ ప్రచారక్గా పనిచేస్తున్నా. ఆర్ఎస్ఎస్ను నిషేధించడంతో పలువురితో కలసి రహస్య జీవితం గడపాల్సి వచ్చింది. మారువేషాల్లో జయప్రకాశ్ నారాయణ నాయకత్వంలోని సంఘర్షణ సమితికి పనిచేసే వాళ్లం. తొమ్మిది నెలల తర్వాత నేటి మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో పోలీసులు మీసా చట్టం కింద అరెస్టు చేశారు. జైలులో ఉన్న సమయంలోనే అన్న అనారోగ్యంతో మరణించారు. అంత్యక్రియల కోసం పెరోల్పై బయటకు వచ్చాను. పోలీసుల రక్షణ వలయంలో వ్యాన్ నుంచి దిగిన నన్ను చూసి బంధువులు, చుట్టుపక్కల వాళ్లు చలించిపోయారు’’ అని నాటి రోజులను గుర్తు చేసుకున్నారు. చదవండి: మంచుకొండల్లో ఎంజాయ్ చేసిన గవర్నర్ -
ధరిత్రికి ప్రాణవాయువు పర్యావరణమే
పర్యావరణంతో కలిసి జీవించడం మనందరి ప్రాథమిక బాధ్యత. మన జీవన విలువలలో పర్యావరణ పరిరక్షణను ఒక భాగంగా చేసుకోవలసిన అవసరం ఉంది. ‘పర్యావరణం ఒక శాశ్వత ఆర్థిక వ్యవస్థ’ కానీ కొంత మంది అత్యాశ వల్ల పూర్తిగా మానవాళికి చేటు జరిగేలా ఉంది. భూమిపై అన్ని వనరులూ సక్రమంగా ఉంటేనే మానవ అభివృద్ధి నిజమవుతుంది. కానీ, అంతులేని ఆధిపత్య దాహం వల్ల భూమండలం కాలుష్య కాసారంగా మారిపోయింది. ఉపరితలంపై ఉన్నవనరులే కాదు, భూగర్భ జలాలు, ఖనిజ వనరులను పలు దేశాలు విచక్షణారహితంగా వాడుకోవడం వల్ల కాలుష్యం పెరిగి రాబోయే కొన్ని దశాబ్దాలలో సహజ వనరులు అంతరించిపోయే ప్రమాదం ఉందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. నేడు అంతర్జాతీయ పర్యావరణ దినోత్సవం. ఈ సందర్భంగా ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ పర్యావరణ కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజలను జాగృతపరిచే ప్రయత్నాలు చేస్తోంది. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని ఐక్యరాజ్యసమితి 1972లో ప్రారంభించింది. పర్యావరణానికి అనుకూలమైన చర్యలు తీసుకోవడానికి అవసరమైన ప్రపంచ అవగాహనను పెంచడానికి ఈ రోజున కొన్ని చర్యలు చేపడతారు. భూమికి చెందిన పర్యావరణ వ్యవస్థలను పునరుద్ధరించాల్సిన అత్యవసర అవసరాలపై ప్రజలు, ప్రభుత్వాలు, వివిధ ప్రజా సంఘాల దృష్టిని కేంద్రీకరించడానికి ప్రయత్నించడమే ఈ సారి ఐక్యరాజ్యసమితి ముఖ్యఉద్దేశం. జీవ వైవిధ్యాన్ని పర్యావరణ సమతుల్యాన్ని కాపాడటంలో అడవులది కీలక పాత్ర. ‘చెట్లే మనిషికి గురువులు’ అన్నాడు మహాకవి రవీంద్రనాథ్ ఠాగూర్. కానీ ఆ మానవులే నేడు చెట్లను తమ స్వార్థం కోసం అభివృద్ధి, సాంకేతికత పేరుతో అడ్డగోలుగా నరికేస్తున్నారు. మన దేశంలో ఒక చెట్టును నరికేముందు ఐదు మొక్కలు నాటడం ఆచారంగా ఉండేది. కానీ నేడు ఆ పరిస్థితి మారిపోయింది. మనిషి ఎంత ఎత్తుకు ఎదిగినా దీనికి ఆధారం భూమి. గాలి, నీరు, నింగి, నిప్పు, నేల అనే పంచభూతాల్లో ఏ ఒక్కటి లోపించినా జీవనం అస్తవ్యస్తమవుతుంది. రోజురోజుకూ భూగోళంపై పచ్చదనం తగ్గిపోవడం, కొన్ని రకాల జీవరాశులు నశించిపోవడం.. పర్యావరణానికి పెనుముప్పుగా పరిణమించింది. భూతాపాన్ని తగ్గించే విషయంలో అడవులది కీలక పాత్ర. విస్తారమైన అడవులు భూగోళానికి ఊపిరి తిత్తులవంటివి. మన దేశంలో జాతీయ సగటు అడవుల శాతం 24.06%గా ఉంటోంది. దక్షిణ భారత దేశంలో అత్యధికంగా కేరళలో 54.42 శాతం ఉండగా, తమిళనాడు 20.17, కర్ణాటక 20.11, తెలం గాణ 18.36, ఆంధ్రప్రదేశ్ 17.88 శాతంతో తర్వాతి స్థానాల్లో ఉండగా హిమాచల్ ప్రదేశ్ 66.52%తో ఉంది. గత దశాబ్ద కాలం (2009–2019)లో భారత దేశ పట్టణీకరణ దాదాపు 34.47% మేర పెరిగింది. పట్టణాల విస్తీర్ణం వేగంగా పెరుగుతుండటంతో అడవులు తీవ్రంగా నరికివేతకు గురవుతున్నాయి. తద్వారా వర్షాభావ పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఫలితంగా ఈ దశాబ్దం చివరినాటికి వాతావరణంలో విపరీతమైన మార్పులు చోటుచేసుకోనున్నాయి. అప్పుడు ఋతుపరివర్తన జరిగి అకాల వర్షాలు, వరదలు, అధిక ఎండలు, కరువు పరిస్థితులు ఏర్పడి అపార నష్టం సంభవిస్తుంది. దీనివల్ల సమస్త మానవజాతి మనుగడకే ప్రమాదం ఏర్పడుతుంది. ఈ సత్యాన్ని మనం గ్రహించాల్సిన అవసరం ఉంది. ఈ శతాబ్దం చివరికి భూమి సగటు ఉష్ణోగ్రత పెరుగుదలను 2 డిగ్రీల సెల్సియస్కు పరిమితం చేయాలనే లక్ష్యంతో రూపొందిన పారిస్ వాతావరణ ఒప్పందానికి ప్రపంచ దేశాలు కట్టుబడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 2030 నాటికి వార్షిక ఉద్గారాలను 44 బిలియన్ టన్నులకు పరిమితం చేయగలిగితే ఉష్ణోగ్రత 2 డిగ్రీల కన్నా పెరగకుండా చూసుకోవచ్చు. ఇది జరగాలంటే.. ఇప్పటి కన్నా 25% తక్కువగా కర్బన ఉద్గారాలు విడుదలయ్యేలా మానవాళి తన అలవాట్లను, జీవనశైలిని విప్లవాత్మకంగా మార్చుకోగలగాలి. మానవ నాగరికత నది తీరాల్లోనే మొదలైందనేది కాదనలేని సత్యం. మనదేశంలో అనేక పవిత్ర నదులు, త్రివేణి సంగమాలు ఉన్నాయి. ప్రకృతిని పవిత్రంగా భావించి, ఆరాధించి, గౌరవించే ఈ సంప్రదాయాన్ని ఈనాటి నవీన సమాజంలో మరలా ప్రారంభిం చాల్సి ఉంది. ఆయా నదులు వాటి తీరాలు ఆక్రమణకు గురి కాకుండా వాటిల్లో చెత్తా చెదారాలు వేయకుండా శుభ్రంగా చూసుకోవడం మనందరి కనీస బాధ్యత. నది తీరాల వెంబడి కాలుష్య పరిశ్రమలను స్థాపించి వాటి చెత్తా చెదారం అంతా నదుల్లోకి పారబోస్తున్నారు. ఉదాహరణకి గంగానది తీరం పొడవునా ఉన్న పరిశ్రమల నుంచి వచ్చే రసాయన వ్యర్థాలతో, యాత్రికులు పడేసే చెత్తతో కలుషితమై పోయి, తాగడానికి కాదు కదా, స్నానానికి కూడా పనికిరాని పరిస్థితికి చేరుకుంటోంది. పైగా గంగా నదిలో శవాల విసిరివేత మనందరికీ సిగ్గుచేటు. సరస్సులు, చెరువుల ఆక్రమణను అరికట్టాల్సి ఉంది. కేంద్ర ప్రభుత్వం పర్యావరణ పరిరక్షణకై తగు చర్యలు చేపడుతుండడం ఎంతో ముదావహం. కేంద్రం 20 వేల కోట్ల రూపాయలతో ‘నమామి గంగే’ పేరు తో గంగానది తీర ప్రక్షాళనకు పూనుకోవడం బృహత్తర చర్య. అలాగే ‘స్వచ్ఛ్ భారత్ అభియాన్’ ద్వారా పరిసరాల పరిశుభ్రతను ప్రతిఒక్కరు పాటించేలా చర్యలు చేపడుతున్నారు. ‘టాయిలెట్స్ బిఫోర్ టెంపుల్స్’ పేరుతో దేశంలో ఇప్పటివరకు కొత్తగా 9 కోట్ల మరుగుదొడ్లు నిర్మించడం ఎంతో గొప్ప చర్య. అలాగే ‘గ్రీన్ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాం’ ద్వారా దేశ యువతకు సరికొత్త ఉపాధి కల్పించే దిశగా చర్యలు చేపట్టింది. ఇప్పటివరకు గత మూడేళ్లలో దాదాపు 6,778 చదరపు కిలోమీటర్ల మేర కొత్త అటవీ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం జరిగింది. అలాగే కేంద్ర ప్రభుత్వం దాదాపు 36.73 కోట్ల ఎల్ఈడీ బల్బులను అందుబాటులోకి తెచ్చి, పెద్దఎత్తున వాటి వినియోగాన్ని ప్రోత్సహించడంతో దాదాపు 38 మిలియన్ టన్నుల కర్బన ఉద్గారాలను తగ్గించగలిగాం. ఉజ్వల పథకం కింద 8 కోట్ల కుటుంబాలకు పొగ రహిత వంటగదులు అందుబాటులోకి తెచ్చినట్లైంది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద క్లీన్ ఎనర్జీ కార్యక్రమమని చెప్పవచ్చు. హిమాచల్ప్రదేశ్ ‘నగర్ వన్ ఉద్యాన్‘ పేరుతో అన్ని పట్టణాలలో కృతిమ ఉద్యానవనాలు ఏర్పాటు చేస్తోంది. అలాగే ‘మోడల్ ఎకో విలేజ్ ‘పేరుతో ఉత్తమ పర్యావరణ గ్రామాలను ఎంపిక చేసి వాటికీ ప్రోత్సాహకాలు అందిస్తుంది. అయితే పర్యావరణాన్ని పరిరక్షించటానికి కేవలం చట్టాలు మాత్రమే సరిపోవు. మన జీవన విలువలలో పర్యావరణ పరిరక్షణను ఒక భాగంగా చేసుకోవలసిన అవసరం ఉంది. పర్యావరణంపై ప్రభావం చూపుతున్న పారిశ్రామిక కాలుష్య ఉద్గారాలను నియంత్రించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా అరి కట్టాలి. ప్రజలు మొక్కలను పెంచడం ఒక వ్యాపకంగా మార్చుకోవాలి. నదులను పునరుజ్జీవింప చేయడం, వ్యర్థాలు ఏమాత్రం ఉత్పత్తి చేయని జీవన విధానాలను అవలంభించడం వంటి విషయాలలో సమాజంలోని అందరినీ ముఖ్యంగా యువతను భాగస్వాములు చేయాల్సిన అవసరం ఉంది. ప్రపంచాన్ని కుదిపేసిన కరోనా మహమ్మారి అదే మానవాళికి ఒక గుణపాఠం కూడా నేర్పింది. ప్రకృతి, పర్యావరణం, వాతావరణ సమతుల్యత, వ్యక్తిగత పరిశుభ్రత, మంచి ఆహారపు అలవాట్లు మానవ మనుగడకు ఎంత ముఖ్యమో కరోనా మహమ్మారి నొక్కి చెప్పింది. దేశీయ ఆహారపు అలవాట్లు ఐన కొర్రలు, రాగులు, సజ్జలు లాంటి చిరు, తృణ ధాన్యాల వాడకం విరి విగా పెరిగింది. అలాగే శుభ్రమైన నీరు, స్వచ్ఛమైన గాలి, వాతావరణ పరిశుభ్రత యొక్క ఆవశ్యకతను నొక్కి చెప్పింది. ‘పర్యావరణం ఒక శాశ్వత ఆర్థిక వ్యవస్థ’ కానీ కొంత మంది అత్యాశ వల్ల పూర్తిగా మానవాళికి చేటు జరిగేలా ఉంది. భూమిపై అన్ని వనరులూ సక్రమంగా ఉంటేనే మానవ అభివృద్ధి నిజమవుతుంది. కానీ, అంతులేని ఆధిపత్య దాహం వల్ల భూమండలం కాలుష్య కాసారంగా మారిపోయింది. ఉపరితలంపై ఉన్న వనరులే కాదు, భూగర్భ జలాలు, ఖనిజ వనరులను విచక్షణారహితంగా వాడుకోవడం వల్ల కాలుష్యం పెరిగి రాబోయే కొన్ని దశాబ్దాలలో సహజ వనరులు అంతరించిపోయే ప్రమాదం ఉందని పరిశోధకుల హెచ్చరిక. పర్యావరణాన్ని రక్షించుకోవాలంటే దానిని ప్రేమిస్తే చాలు దానిని కాపాడుకోవాలనే తపన ఉంటే చాలు. మనందరి దైనందిన జీవనంలో ప్రకృతి పరిరక్షణ ఒక అలవాటుగా చేసుకుందాం. ‘సుజలాం సుఫలాం మలయజ శీతలామ్’ ‘సస్యశ్యామలాం మాతరం వందేమాతరం’ బండారు దత్తాత్రేయ వ్యాసకర్త గవర్నర్, హిమాచల్ ప్రదేశ్ (నేడు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా) -
శభాష్ డాక్టర్.. హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ ప్రశంస
సాక్షి, రామగుండం: గోదావరిఖని ప్రభుత్వ ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కంది శ్రీనివాస్రెడ్డి బుధవారం కరోనాతో చనిపోయిన ఇద్దరు వ్యక్తుల మృతదేహాలను స్వయంగా పీపీఈ కిట్లో ప్యాక్ చేసి మున్సిపల్ సిబ్బందికి అప్పగించిన తీరుకు.. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ బండారు దత్తాత్రేయ గురువారం రాత్రి ఫోన్ చేసి అభినందించారు. ‘ సిబ్బంది అందుబాటులో లేకపోవడంతో, ఒక డాక్టర్గా ఉండి మీరే స్వయంగా రెండు కోవిడ్ మృతదేహాలను ప్యాక్ చేయడం చాలా గొప్ప విషయం. మీరు చేసిన ఈ పని అభినందనీయం. సేవా భావంతోపాటు ధైర్యానికి, నిష్టకు మిమ్మల్ని చాలా మెచ్చుకుంటున్నాను. మీరు దేశానికి ఆదర్శంగా నిలిచారు.. నా అభినందనలు’ అంటూ ఫోన్లో సూపరింటెండెంట్ శ్రీనివాస్రెడ్డిని గవర్నర్ బండారు దత్తాత్రేయ కొనియాడారు. కోవిడ్ మృతదేహాన్ని ప్యాక్ చేస్తున్న సూపరింటెండెంట్ శ్రీనివాస్రెడ్డి చదవండి:హమ్మా.. నేనొస్తే గేటు తీయరా..! -
ఉగాదిరోజున సింగపూర్లో ఘనంగా శ్రీవారి కల్యాణం
సింగపూర్: లోక కల్యాణార్థం శ్రీప్లవ నామ సంవత్సర ఉగాది రోజున (ఏప్రిల్ 13) సింగపూర్ తెలుగు సమాజం ఆధ్వర్యంలో శ్రీనివాస కల్యాణోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. సింగపూర్లోని సెరంగూన్ రోడ్డులో ఉన్న శ్రీ శ్రీనివాస పెరుమాళ్ దేవాలయంలో అత్యంత భక్తిశ్రద్ధలతో, శాస్త్రోక్తంగా ఈ వేడుక జరిగింది. ఈ కార్యక్రమానికి హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ హాజరయ్యారు. శ్రీవారికి సుప్రభాత సేవ, తోమాల సేవ, అభిషేకంతో పాటు మహా గణపతి, విష్ణుదుర్గ, మహాలక్ష్మి, ఆంజనేయస్వామి వార్లకు అభిషేకం మొదలగు విశేష పూజా కార్యక్రమాలు చేశారు. అనంతరం శ్రీవారి ఆస్ధానంలో బ్రహ్మశ్రీ డా. మాడుగుల నాగఫణి శర్మ పంచాంగ శ్రవణం పఠించారు. కరోనా పరిస్థితుల దృష్ట్యా సింగపూర్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ, హిందూ ఎండోమెంట్స్ బోర్డ్ నిర్దేశించిన మార్గదర్శకాలతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. దేవాలయానికి వచ్చే భక్తుల శరీర ఉష్ణోగ్రతలను పరిశీలించడం, భక్తుల వివరాల సేకరించడంతో పాటు భక్తులు భౌతిక దూరాన్ని పాటించేలా వివిధ ఏర్పాట్లు చేశారు. కలియుగ దైవం కృప అందరికీ కలగాలనే సత్సంకల్పంతో భక్తులు ఇంటి నుంచే శ్రీనివాస కల్యాణోత్సవం వీక్షించేలా ఫేస్బుక్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేశారు. షడ్రుచుల సమ్మిళితమైన ఉగాది పచ్చడిని ప్రత్యేక ప్యాకెట్లో సుమారు 2000 మందికి అందించారు. సింగపూర్ తెలుగు సమాజం అధ్యక్షుడు కోటిరెడ్డి తెలుగువారందరికీ ప్లవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం పంచాంగ పఠనం చేసిన నాగఫణి శర్మకు, బండారు దత్తాత్రేయ గారికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు అనిల్ కుమార్ పోలిశెట్టి, కార్యదర్శి సత్యచిర్ల పాల్గొన్నారు. చదవండి: ఉగాది.. కాలగమన సౌధానికి తొలి వాకిలి -
అణగారిన వర్గాల ఆశాజ్యోతి
ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలను కేవలం ఓటు బ్యాంకులుగా చూసే దృక్కోణం మారాలి. నిజమైన సమస్యలున్న నిజమైన మనుషులుగా వారిని చూడాలి. మహాత్మా ఫూలే చింతన ఈ విషయంలో మనకు తోడ్పడగలదు. వీటన్నింటికి మించి సమానత్వం అనేదాన్ని ఒక కుటుంబ విలువగా అందరిలోనూ పాదుకొల్పాలి. భారతదేశ గతిని ఉన్నతి వైపు తిప్పిన మహాను భావులు ఎందరో. అలాం టివాళ్లకు మనం రుణపడి ఉండాలి. అలాంటివారిలో ఒకరు జ్యోతిరావు ఫూలే. భార్య సావిత్రి బాయితో కలిసి ఆయన స్త్రీవిద్యకు మార్గదర్శిగా నిలిచారు. 1827 ఏప్రిల్ 11న జన్మించిన నాటి నుంచి, 1890 నవంబర్ 28న తుదిశ్వాస విడిచే వరకూ ఫూలే అవి శ్రాంతంగా సామాజిక న్యాయం కోసం పోరాడారు. ఏడాది పిల్లాడిగా ఉన్నప్పుడే తల్లి చిమ్నాబాయి మరణించింది. మాలి కులానికి చెందిన అబ్బాయి కావడం వల్ల పైకులాల వాళ్ల లాగా చదువు కోసం కలలుగనే అవకాశాలు లేకపోవడం, తమ కులంలో కూడా చదువు అనేదానికి అంతగా ప్రాధాన్యత లేకపోవడంవల్ల వాళ్ల తండ్రి ఆయన్ని బడి మాన్పిం చాడు. అయితే వాళ్ల కులంలోంచి క్రిస్టియన్గా మారిన ఒకాయన చొరవతో స్థానిక స్కాటిష్ మిషన్ హైస్కూల్లో చదవగలిగాడు. జ్యోతిరావు ఫూలే ఏడాది వయసులో ఉన్నప్పుడు తల్లి చిమనాబాయి కన్నుమూసింది. దిగువ కులానికి చెందిన పిల్లవాడు అగ్రకుల పిల్లల్లాగా చదువు పట్ల ఆకాంక్ష ఉంచుకోవడం కష్టం.. పైగా విద్య ఫూలే కులానికి ప్రాధమ్యం కాదు. దీంతో ఫూలే పాఠశాలను వదిలిపెట్టాల్సి వచ్చింది. కానీ వీరి కులం నుంచి క్రిస్టియన్గా మారిన ఒక వ్యక్తి స్థానికంగా ఉండే స్కాటిష్ మిషన్ స్కూల్లో పూలేని చేర్పించాలని జ్యోతిరావు తండ్రికి నచ్చచెప్పడంతో తర్వాత పూలే 1847 నాటికి తన ఇంగ్లిష్ పాఠశాల చదువును పూర్తి చేశాడు. 1848లో ఒక బ్రాహ్మణ స్నేహితుడి వివాహా నికి హాజరైనప్పుడు అతడి తల్లిదండ్రుల నుంచి ఎదురైన అవమానం ఫూలేలో కులాల అసమానత మీద గట్టి పోరాటం చేయాలన్న సంకల్పాన్ని కలి గించింది. అదే సంవత్సరం క్రైస్తవ మిషనరీలు అహ్మద్నగర్(మహారాష్ట్ర)లో నడుపుతున్న బాలికల పాఠశాలను చూడటమూ, థామస్ పెయిన్ రాసిన ‘రైట్స్ ఆఫ్ మ్యాన్’ పుస్తకం చదవడమూ దోపిడీకి గురవుతున్న వర్గాల దాస్యవిమోచనకు విద్య అనే దాన్ని మహత్తర శక్తిగా గుర్తించేట్టు చేసింది. ఆ రోజుల్లో బాల్యవివాహాల సంప్రదాయం ఉండ టంతో ఆయనకు పదమూడేళ్లకే సావిత్రిబాయితో పెళ్లయింది. దాంతో ముందుగా భార్యకు చదవడం, రాయడం నేర్పి, అనంతరం బాలికల కోసం ఆమెతో కలిసి బడిని ప్రారంభించాడు. ఆ దంప తుల ఆధ్వర్యంలో 1852లో 273 మంది బాలిక లతో మూడు పాఠశాలలు నడుస్తుండేవి. స్త్రీవిద్యతో పాటు వితంతు పునర్వివాహాన్ని ఫూలే సమర్థించాడు. పైకులాల వితంతు మహిళలు సురక్షితంగా ప్రసవించేందుకు వీలుగా 1863లో ఆశ్రమం నెలకొల్పాడు. కాశీబాయి అనే బ్రాహ్మణ వితంతువు గర్భం దాల్చడం, ప్రసవించిన శిశువును ఆమె బావిలో తోయడం, అటుపై పట్టుబడి ఆమె జైలుకు వెళ్లడం జరిగింది. ఈ సంఘటనతో చలించిన ఫూలే, ‘వితంతువులారా, మీ శిశువులను ఇక్కడ సురక్షితంగా ప్రసవించండి. ఆ శిశువును మీరు పెంచుకుంటారా మీ ఇష్టం, లేదంటే ఆశ్ర మమే పెంచుతుంది’ అని ప్రకటన ఇచ్చాడు. బ్రాహ్మణుడు లేకుండా పెళ్లి చేసే పద్ధతిని కూడా జ్యోతిబా ప్రారంభించాడు. దాన్ని ముంబై హైకోర్టు కూడా గుర్తించింది. నిమ్నకులాల కోసం తమ మంచినీటి బావిని వాడుకోనివ్వడంతోపాటు, అణగారిన వర్గాలను సూచించడానికి మరాఠీ పదమైన దళిత పదాన్ని మొదటిసారి ఆయనే ప్రయోగించాడు. మాజీ ప్రధాని వాజ్పేయి 2003లో పార్లమెంట్ ప్రాంగణంలో ఫూలే విగ్ర హాన్ని ఆవిష్కరించడంతో ఆయన సేవలను గుర్తించినట్టయింది. దేశానికి స్వాతంత్య్రం వచ్చాక రాజ్యాంగ పూచీ ఉండటంతో ఎస్సీలు, ఎస్టీల హక్కుల పరిరక్షణ జరిగిన మాట వాస్తవం. కానీ అదే మాట ఇతర వెనుకబడిన కులాలైన ఓబీసీల విషయంలో చెప్పలేము. మండల్ కమిషన్ నివేదిక ప్రకారం 27 శాతం రిజర్వేషన్ కల్పించడం వారి అభ్యున్నతి విష యంలో చిన్న అడుగు మాత్రమే. వారికి కేటా యించిన వాటిల్లో చాలా బ్యాక్లాగ్ పోస్టులు భర్తీకాకుండా ఉండిపోతున్నాయి, ముఖ్యంగా ఏ, బీ గ్రూపుల్లో. ఓబీసీల్లోని నిరుపేదల ఎదుగుదల కోసం సమగ్ర విధానం అవసరం. ఓబీసీల్లో ఉప వర్గీకరణ పంపకాల్లోని అసమానతలను పరిశీలించ డానికి 2017లో బీజేపీ ప్రభుత్వం జస్టిస్ రోహిణి కమిషన్ ఏర్పాటు చేసింది. 2014లో ఓబీసీల కోసం ఏర్పాటైన పార్లమెంటరీ కమిటీకి చైర్మన్ హోదాలో నేను దేశవ్యాప్తంగా పర్యటించాను. వివిధ ఓబీసీ బృందాలతో సంభాషించాను. ఓబీసీ కమిషన్కు రాజ్యాంగబద్ధత కల్పించాలనేది అప్పుడు వచ్చిన ప్రధాన డిమాండ్లలో ఒకటి. నరేంద్ర మోదీ ప్రభుత్వం అది ప్రసాదించడం, ఆ చారిత్రక ఘట్టంలో నేనూ భాగంకావడం నేను గర్వించే విషయం. అయితే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలను కేవలం ఓటు బ్యాంకులుగా చూసే దృక్కోణం మారాలి. నిజమైన సమస్యలున్న నిజమైన మనుషులుగా వారిని చూడాలి. మహాత్మా ఫూలే చింతన ఈ విషయంలో మనకు తోడ్పడగలదు. నిరుపేద ఓబీసీల కోసం మోడల్ స్కూళ్లు ప్రారంభించడం, అత్యున్నత సంస్థల నుంచి వారు చదివే వీలు కల్పించేలా స్కాలర్షిప్పులు ఇవ్వడం, సంప్రదాయ వృత్తుల్లో ఉన్నవారిని అధునాతన సాంకేతిక పరిజ్ఞానం సాయంతో విశ్వ విపణికి అనుసంధానం చేయడం, సూక్ష్మ పరిశ్రమలు నెలకొల్పేందుకు తగిన సాంకే తిక పరిష్కారాలను వెతకడం, బ్యాంకుల నుంచి సులభంగా రుణాలు అందేలా చూడటం లాంటివి అత్యవసరం. వీటన్నింటికి మించి సమానత్వం అనేదాన్ని ఒక కుటుంబ విలువగా అందరిలోనూ పాదుకొల్పాలి. సామాజిక ఐక్యత, వివిధ వర్గాల మధ్య సామరస్యం కోసం ఫూలే స్థాపించిన సత్య శోధక్ సమాజ్ లాంటి ఎన్నో సంస్థలు పని చేయాల్సిన అవసరం ఉంది. బండారు దత్తాత్రేయ వ్యాసకర్త హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ (నేడు మహాత్మా జ్యోతిబా ఫూలే 194వ జయంతి) -
సకల రంగాల్లో నారీలోకం ముందంజ
మనుస్మృతిలోని ‘యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతా/ యత్రైతాస్తు న పూజ్యంతే సర్వస్తత్ర ఫలాః క్రియా’ అనే శ్లోకం సమాజంలో అంతర్లీనంగా వున్న మహిళల శక్తిని చాటింది. ఎక్కడైతే మహిళలు గౌరవించ బడతారో అక్కడ దేవతలు నడయాడతారని... ఎక్కడ వారికి అగౌరవం ఎదురవుతుందో అక్కడ తలపెట్టే ఎంతటి మంచి కార్యమైనా నిష్ఫలమవు తుందని దీని సారాంశం. మహిళలంటే దేవతాంశ. వారు ప్రేమకూ, దయా కారుణ్యాలకూ చిహ్నం. పవిత్రతకు మారుపేరు. అమ్మగా, సోదరిగా, బిడ్డగా, భార్యగా పురుషుల జీవితంలో వారి పాత్ర బహుముఖమైనది. స్త్రీ మూర్తి లేని సృష్టిని ఊహిం చలేం. అందుకే వారు సృజనాత్మక శక్తికి ప్రతీకగా, అజరామరమైన మన సంస్కృతీ సంప్రదాయాలకు వాహికలుగా నిలుస్తున్నారు. ఆమె మనిషికి, మాన వీయతకు మాత్రమే కాదు... సర్వ మానవాళికీ మాతృమూర్తి. ఆర్థిక, రాజకీయ, సామాజిక, సాంస్కృతిక రంగాల్లో మహిళలు సాధించిన అభివృద్ధికి గుర్తుగా ఏటా మార్చి 8న మహిళా దినోత్సవం జరుపుతున్నారు. ఇదే రోజున 1908లో 15,000మంది మహిళలు న్యూయార్క్ నగరంలో తమ హక్కుల కోసం, మెరుగైన వేతనాల కోసం, ఓటు హక్కు కోసం ఉద్యమించారు. ఏ దేశంలోనైనా సమాజ నిర్మాణంలో, దాని అభివృద్ధిలో మొదటినుంచీ మహిళల పాత్ర ప్రముఖమైనదని చరిత్ర చాటుతోంది. మహిళా దినోత్సవంనాడు ఈ వాస్తవాలను చాటేలా, మహిళా శక్తిని అందరూ గుర్తించేలా కార్యక్రమాలు రూపొందించటం అవ సరం. అవి మహిళాభ్యున్నతికి దోహదపడతాయి. మన జాతి నాగరికతలో, సంస్కృతిలో మహిళల పాత్ర ఎనలేనిది. మన ప్రాచీన శ్రుతులు, స్మృతులు ఆనాటి సమాజంలో మహిళలకున్న స్వేచ్ఛా స్వాతంత్య్రాలు అధికమేనని చాటుతున్నాయి. సమస్త జీవన రంగాల్లో వారు పురుషులతో సమా నంగా పాల్గొన్న అంశాన్ని తెలియజెప్పాయి. అరుం ధతి (మహర్షి వశిష్టుడి సతీమణి), లోపాముద్ర (మహర్షి అగస్త్యుడి భార్య), అనసూయ((మహర్షి అత్రి భార్య) తదితర సాధ్వీమణులు ఇందుకు చిహ్నం. ప్రాచీన భాష్యకారులు పతంజలి, కాత్యా యన్ వేదకాలం తొలినాళ్లలోనే మహిళలు విద్యా వంతులని చెప్పారు. యుక్తవయసు వచ్చాక తమ జీవిత భాగస్వాములను ఎంచుకునే స్వేచ్ఛ ఆడ వాళ్లకు వుండేదని రుగ్వేద మంత్రాలు చాటుతు న్నాయి. అలాగే మైత్రేయి, గార్గి వంటి మహిళా రుషులు కూడా వుండేవారని రుగ్వేదం, ఉపనిష త్తులు చెబుతున్నాయి. రామాయణంలోని సీతా మాత, మహాభారతంలోని మహారాణి ద్రౌపది మన ప్రాచీనకాలంనాటి మహిళా శక్తికి నిదర్శనం. ప్రాచీన సంప్రదాయాల్లో, దుర్గాదేవి సమక్షంలో ఉన్న దేవతలు కిరీటధారిణులై ఉండటం గమనించవచ్చు. అయితే మహిళల పరిస్థితి దిగజారిపోవడం అనేది మధ్యయుగాల్లోనే మొదలైంది. మొఘలులు, తర్వాత బ్రిటిష్ పాలనలో మహిళల స్వేచ్ఛకు, హక్కులకు పరిమితులు ఏర్పడ్డాయి. బాల్యవివాహం అనే దురాచారం 6వ శతాబ్ది నుంచే ప్రారంభమైందని భావిస్తున్నారు. భారతదేశాన్ని విదేశీయులు దురాక్రమించిన తర్వాత పరిణామాలు మరింతగా దిగజారిపోయాయి. ఈ కాలంలోనే పరదా సంస్కృతి, బాల్య వివాహాలు, సతీ సహగమనం, జోహార్, దేవదాసీ వ్యవస్థ వంటి మత దురాచారాలు వ్యాప్తిలోకి వచ్చాయి. అయితే 19వ శతాబ్ది మధ్యలో బ్రహ్మసమాజ్, ఆర్యసమాజ్, దివ్యజ్ఞాన సమాజం, రామకృష్ణ మిషన్, ఈశ్వరచంద్ర విద్యాసాగర్, మహాత్మా జ్యోతిబా పూలే, సావిత్రీబాయి పూలే వంటి సంస్థలూ, వ్యక్తులు పలు సంస్కరణోద్యమాలకు నాంది పలికి మహిళల ప్రయోజనాల కోసం కృషి చేశారు. అనేక పురాతన సంప్రదాయాలు, ఛాందసభావాలకు ఇప్పుడు కాలం చెల్లిపోయింది. ఇంటిపనికి వెలుపల అన్ని రంగాల్లోనూ మహిళలు తమ ఉనికిని చాటుకుంటున్నారు. అంతరిక్షం, పాలనా రంగ సేవ, విద్య, రాజకీయాలు, క్రీడలు, వ్యాపారం, సాహిత్యం, సైన్యం, మీడియా వంటి పలు వైవిధ్యపూరితమైన రంగాల్లో మహిళలు తమ ప్రతిభాపాటవాలను చాటుకుంటున్నారు. ఈరోజు మహిళలే అభివృద్ధికి కేంద్రబిందువు అని అర్థం చేసుకోవలసిన అవసరం ఉంది. మహిళకు సంఘటితపరమైన, గౌరవప్రదమైన స్థానం లభించని చోట మంచి క్రమశిక్షణాయుతమైన సమాజాన్ని కూడా సృష్టించలేం. హైదరాబాద్ కేంద్రంగా అంతర్జాతీయ బ్యాడ్మింటన్ ప్లేయర్ పీవీ సింధు, సైనా నెహ్వాల్, టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా క్రీడారంగంలో సాధిస్తున్న విజయాలు మనందరికీ తెలుసు. అంతర్జాతీయ మహిళా బాక్సర్ మేరీ కోమ్, అంతర్జాతీయ క్రికెట్ క్రీడాకారిణి మిథాలి రాజ్ నేటి సమాజ నడకకు ఉదాహరణలు. గత ఆరేళ్లుగా సైన్యంలో మహిళల సంఖ్య మూడు రెట్లు పెరిగింది. ఇప్పుడు భారతీయ సైన్యం, నేవీ, వాయుసేనలో 9,118 మంది మహిళలు పనిచేస్తున్నారు. వైద్య విభాగాన్ని మినహాయిస్తే సైన్యంలో ఇప్పుడు 6,807 మంది, వాయుసేనలో 1,607, నావిగాదళంలో 704 మంది మహిళాధికారులు పనిచేస్తున్నారు. భారత నావికాబలగానికి చెందిన నావికా సాగర్ పరిక్రమలో పూర్తిగా మహిళా అధికారులతో కూడిన ఆరుగురు సభ్యుల బృందం ప్రపంచం మొత్తం సముద్రాల్లో చాపచుట్టి వచ్చింది. ఇది ప్రపంచ నావికా చరిత్రలోనే అరుదైన ఘటన. భారతీయ మిస్సైల్ మహిళగా పేరొందిన టెస్సీ థామస్ డీఆర్డీఓలో సైంటిస్టుగా పనిచేస్తూ అగ్ని–4, అగ్ని–5 క్షిపణుల రూపకల్పనలో ప్రాజెక్ట్ డైరెక్టర్గా వ్యవహిరించారు. అయితే సామాజికపరమైన గణాంకాలు, నేరాల రేటు చూస్తే విచారం కలుగుతుంది. జాతీయ నేర నివేదికా మండలి ప్రకారం 2019లో మహిళలపై రోజుకు 87 అత్యాచార కేసులు నమోదు కాగా, మహిళలపై దాడి ఘటనలు 4 లక్షలకుపైగా నమోదయ్యాయి. ఏడాది మొత్తంలో 32 వేలమందికిపైగా మహిళలపై అత్యాచార ఘటనలు నమోదయ్యాయి. మహిళల రక్షణకు, వారి సమానత్వానికి తీసుకుంటున్న ప్రతి చర్యా మహిళల పరిస్థితిని ఏదో మేరకు మెరుగుపరుస్తూనే ఉంది. కానీ సామాజిక సంస్కరణా ప్రక్రియే నత్తనడకన సాగుతోంది. ఈ రంగంలో ప్రజా చైతన్యాన్ని వేగవంతం చేయాల్సి ఉంది. విద్యను కేంద్రబిందువుగా తీసుకుని చట్టాలను సమర్థంగా అమలు చేయగలిగితే మహిళలపై నేరాలు జరగని దేశంగా భారత్ను సమున్నతంగా నిలపవచ్చు. భారతీయ సంస్కృతిలో స్త్రీలను దుర్గా, లక్ష్మి వంటి దేవతలకు సమానస్థాయినిచ్చారు. కాబట్టి వారికి యావత్ సమాజం తగిన గౌరవం ఇవ్వాల్సి ఉంది. (రేపు మహిళా దినోత్సవం సందర్భంగా) బండారు దత్తాత్రేయ వ్యాసకర్త హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ -
దత్తాత్రేయపై కాంగ్రెస్ ఎమ్మెల్యేల దాడి
సిమ్లా: బీజేపీ సీనియర్ నాయకుడు, హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయకు తీవ్ర పరాభవం ఎదురయ్యింది. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు దత్తాత్రేయపై దాడి చేశారు. బడ్జెట్ స్పీచ్ అనంతరం బయటకు వెళ్తోన్న దత్తాత్రేయపై కాంగ్రెస్ ఎమ్మెల్యే దాడి చేశారు. శుక్రవారం ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ సందర్భంగా పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి సురేష్ భరద్వాజ్ మాట్లాడుతూ.. గవర్నర్ తన వాహనం వద్దకు వెళుతున్నప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆయనపై దాడి చేశారని తెలిపారు. హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఈ నెల 22 సోమవారం నాడు ఐదుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయాలని తీర్మానం ప్రవేశపెట్టారు. వీరిలో ప్రతిపక్ష నాయకుడు ముఖేష్ అగ్నిహోత్రి, ఎమ్మెల్యేలు హర్ష్ వర్ధన్ చౌహాన్, సుందర్ సింగ్ ఠాకూర్, సత్పాల్ రైజాదా, వినయ్ కుమార్ ఉన్నారు. ఈ క్రమంలో సోమవారం మధ్యాహ్నం రెండు గంటలకు వాయిదా పడిన సభ నేడు తిరిగి ప్రారంభం అయ్యింది. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం 11 గంటలకు సభ సమావేశమైన వెంటనే ప్రతిపక్ష నేత ముఖేష్ అగ్నిహోత్రి నేతృత్వంలోని కాంగ్రెస్ సభ్యులు తమ సీట్ల నుంచి లేచి నినాదాలు చేశారు. గవర్నర్ అసెంబ్లీలో ప్రసంగం చివర్లో ఉండగా.. ప్రతిపక్ష కాంగ్రెస్ సభ్యులు ఆయనను అడ్డుకునే ప్రయత్నం చేశారు. దత్తాత్రేయ కారు వద్ద ఆందోళన చేస్తోన్న హిమాచల్ ప్రదేశ్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు దాంతో గవర్నర్ తన ప్రసంగంలోని చివరి లైన్లను మాత్రమే చదివి, ప్రసంగం మొత్తం చదివినట్లుగా భావించాలని పేర్కొన్నారు. గవర్నర్ ప్రసంగంపై కాంగ్రెస్ సభ్యులు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆయన వెల్లడించిన విషయాలన్ని అబద్ధాలని ఆరోపించారు. వంట గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదల సమస్యను ప్రసంగంలో చేర్చలేదన్నారు. స్పీచ్ ముగించిన అనంతర దత్తాత్రేయ తన కారు దగ్గరకు వెళ్తుండగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆయనపై దాడి చేశారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి జై రామ్ ఠాకూర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సభలో కాంగ్రెస్ సభ్యుల ప్రవర్తనను ఖండించారు. ఇక గవర్నర్పై దాడి చేసిన ఎమ్మెల్యేలను మార్చి 20 వరకు సస్పెండ్ చేశారు. చదవండి: మంచుకొండల్లో ఎంజాయ్ చేసిన గవర్నర్ -
మంచుకొండల్లో ఎంజాయ్ చేసిన గవర్నర్
సిమ్లా: చలికాలం కావడంతో ప్రస్తుతం మంచు ప్రాంతాల్లో భారీగా మంచు కురుస్తోంది. జమ్మూ, కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్ ప్రాంతాలు మంచు దుప్పటిలో మునిగిపోయాయి. మంచుతో నిండిన ఆ ప్రాంతాలు చూపరులను కనువిందు చేస్తున్నాయి. ఓ మంచు ప్రాంతం గవర్నర్గా ఉన్న తెలంగాణ వ్యక్తి ఎంజాయ్ చేస్తున్నారు. మంచు ప్రాంతాల్లో పర్యటించి అందాలను ఆస్వాదించారు. ఆయనే హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ. హిమాచల్ప్రదేశ్లోని సిమ్లా ప్రాంతం భారీ ఎత్తున మంచు దుప్పటి కప్పేసింది. దీంతో ఆ రాష్ట్ర గవర్నర్ బండారు దత్తాత్రేయ తన సతీమణి వసంతతో కలిసి మంచు ప్రాంతాల్లో కలియ తిరిగారు. రాజ్ భవన్ ఆవరణలోనే కురిసిన మంచును పరిశీలించారు. హిమ ఫలకాలను పట్టుకుని ఎగురవేశారు. చిన్నపిల్లాడి మాదిరి గవర్నర్ ఆ మంచుతో ఆడుకున్నారు. ఆయన వెంట రాజ్భవన్ అధికారులు, సిబ్బంది కూడా ఉన్నారు. హిమపాతం ప్రకృతి ఇచ్చిన వరంగా ఈ సందర్భంగా దత్తాత్రేయ కొనియాడారు. ఇది కచ్చితంగా సానుకూల శక్తిని ఇస్తుందని పేర్కొన్నారు. హిమపాతం పండ్ల తోటలకు ఎరువుగా ఉపయోగపడుతుందని, రాబోయే కాలంలో మంచి దిగుబడికి ఇది సహాయపడుతుందని తెలిపారు. ఈ క్రమంలో మంచు కురుస్తుండడంతో అధికారులకు జాగ్రత్తలు సూచించారు. ప్రజలు ఎటువంటి అసౌకర్యాలకు గురికాకుండా చర్యలు తీసుకోవాలని గవర్నర్ దత్తాత్రేయ అధికారులను ఆదేశించారు. -
సేంద్రీయ సాగు రైతులకు మేలు
సాక్షి, అమరావతి బ్యూరో: ఆదాయం రెట్టింపు అవడంతోపాటు, ఖర్చులు తగ్గాలంటే రైతులు సేంద్రీయ వ్యవసాయానికి అధిక ప్రాధాన్యం ఇవ్వాలని హిమాచల్ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ సూచించారు. గుంటూరులో ఓ ప్రైవేట్ క్లబ్లో మంగళవారం లైవ్ భారత్ ఫౌండేషన్ నిర్వహించిన సంక్రాంతి సంబరాలు, వివేకానంద జయంతి వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యవసాయంలో సాంకేతికత ఎంత ముఖ్యమో సేంద్రీయ విధానం కూడా అంతే ముఖ్యమని చెప్పారు. సేంద్రీయ వ్యవసాయం ద్వారానే ఆరోగ్యకరమైన ఆహారం సాధ్యమన్నారు. దేశంలోనే అత్యధికంగా సేంద్రీయ వ్యవసాయం హిమాచల్ప్రదేశ్లో జరుగుతోందని తెలిపారు. ఏపీలో కూడా ఆ విధానం అమలు చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తనను కలిసిన సందర్భంగా సూచించినట్లు చెప్పారు. సంక్రాంతి రైతుల పండుగ అని, రైతులు సంతోషంగా ఉంటేనే అసలైన పండుగని పేర్కొన్నారు. భారతీయత గొప్పదనం గురించి దేశవిదేశాల్లో చాటిచెప్పిన మహనీయుడు స్వామి వివేకానంద అని చెప్పారు. ప్రపంచంలో ఎక్కువమంది యువత ఉన్న యంగ్ ఇండియా 2030 కల్లా అగ్రగామిగా ఎదుగుతుందని పేర్కొన్నారు. మాజీ మంత్రులు కన్నా లక్ష్మీనారాయణ, రావెల కిషోర్బాబు, గజల్ గాయకుడు గజల్ శ్రీనివాస్, లైవ్ భారత్ ఫౌండేషన్ చైర్మన్ వల్లూరి జయప్రకాష్నారాయణ తదితరులు పాల్గొన్నారు. -
బండారు దత్తాత్రేయను కలిసిన సీఎం వైఎస్ జగన్
సాక్షి, విజయవాడ: పర్యటనలో భాగంగా విజయవాడకు వచ్చిన హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా గవర్నర్ దత్తాత్రేయకు సీఎం జగన్ పుష్పగుచ్చం అందించి సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. అంతకు ముందు.. దత్తాత్రేయను డీజీపీ గౌతమ్ సవాంగ్ మర్యాద పూర్వకంగా కలిశారు. అనంతరం డీజీపీని హిమాచల్ ప్రదేశ్ సంప్రదాయంతో గవర్నర్ బండారు దత్తాత్రేయ సత్కరించారు. ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మను బండారు దత్తాత్రేయ మంగళవారం దర్శించుకున్నారు. దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, ఆలయ అధికారులు ఆయనకు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. పండితులు వేద ఆశీర్వచనాలు అందించారు.(చదవండి: ‘అమ్మ ఒడి’లో ల్యాప్టాప్) -
దుర్గమ్మను దర్శించిన బండారు దత్తాత్రేయ
సాక్షి, విజయవాడ: ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మను హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ మంగళవారం దర్శించుకున్నారు. దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, ఆలయ అధికారులు ఆయనకు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. పండితులు వేద ఆశీర్వచనాలు అందించారు. దర్శనం అనంతరం అమ్మవారి ప్రసాదం, చిత్రపటం గవర్నర్కు ఆలయ ఈవో అందజేశారు. ఈ సందర్భంగా బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ, కరోనా నుంచి ప్రపంచాన్ని రక్షించాలని దుర్గమ్మను కోరుకున్నానని తెలిపారు. వివేకానంద స్ఫూర్తితో యువత ముందడుగు వేయాలని పిలుపునిచ్చారు. రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలకు ఆయన సక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. (చదవండి: ఏపీకి వ్యాక్సిన్ వచ్చేస్తోంది..) దత్తాత్రేయను కలిసిన డీజీపీ.. పర్యటనలో భాగంగా విజయవాడకు వచ్చిన బండారు దత్తాత్రేయను డీజీపీ గౌతమ్ సవాంగ్ మర్యాద పూర్వకంగా కలిశారు. గేట్ వే హోటల్లో ఆయనకు పుష్ఫగుచ్ఛం అందించారు. అనంతరం డీజీపీని హిమాచల్ ప్రదేశ్ సంప్రదాయంతో గవర్నర్ బండారు దత్తాత్రేయ సత్కరించారు.(చదవండి: అరుదైన బొగ్గు క్షేత్రం ఏపీఎండీసీ కైవసం) -
విశ్వగురు దార్శనికతే.. వివేకానంద తాత్వికత..
ప్రతి సంవత్సరం జనవరి 12న స్వామి వివేకానంద జయంతి సందర్భంగా జాతీయ యువజన దినోత్సవాన్ని పాటిస్తుంటారు. బలమైన వ్యక్తిత్వం, విజ్ఞాన శాస్త్రం లోనూ, వేదాంతంలోనూ ఆయనకున్న అపారమైన విజ్ఞానం, మానవ, జంతు జీవితం పట్ల సహా నుభూతి అనేవి ఆయన్ని శాంతి, మానవజాతి దీపశిఖగా మలిచాయి. తన బోధనల ద్వారా ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది యువజనులకు స్ఫూర్తి కలిగించారు. లేవండి, మేల్కొనండి, లక్ష్యాన్ని చేరుకునేంతవరకు నిలిచిపోకండి అనేది యువతకు వివేకానంద ఇచ్చిన స్పష్టమైన పిలుపు. స్తంభనకు గురైన మానసిక స్థితి నుంచి బయటపడేందుకు ప్రపంచానికి ఆయన ఇచ్చిన సందేశం ఇది. భారతదేశం మతం, తత్వశాస్త్రాల పవిత్ర భూమి. ఇక్కడే మహాత్ములు, మహర్షులు ఎందరో జన్మించారు. ఇది త్యాగ భూమి. మన వాస్తవమైన అస్తిత్వాన్ని లేదా హిందూ ఆలోచనా విధానాన్ని మర్చిపోయినందువల్ల మన దేశం వేల సంవత్సరాలుగా బానిసత్వంలో ఉంటూవచ్చిందని స్వామి వివేకానంద అన్నారు. సింహం పిల్ల తన కుటుంబం నుంచి వేరుపడి మేకల మందలో చేరినప్పుడు క్రమేణా అది కూడా ఆ మేకల్లాగే ప్రవర్తించేలా అన్నమాట. తాను సింహాన్ని అనే విషయం దానికి తెలీదు. దాని పరాక్రమం కానీ, దాని స్వభావం కానీ అది మర్చిపోయి ఉంటుంది. సింహం ఆ మేకలమందపై దాడి చేసినప్పుడు సింహం పిల్ల దొరికిపోతుంది. తన బిడ్డ తన సొంత అస్తిత్వాన్నే కోల్పోయిందని సింహం గ్రహిస్తుంది. తర్వాత తన బిడ్డను అది బావి వద్దకు తీసుకెళ్లి దాని వాస్తవరూపాన్ని చూపించి దాని అసలు బలాన్ని అది తెలుసుకునేటట్టు చేస్తుంది. అదేవిధంగా భారతీయ సమాజం కూడా తన అస్తిత్వాన్ని కోల్పోయిందని వివేకానంద చెప్పారు. అందుకే మనం హిందువులం అని గర్వంగా చెప్పుకోవాలని పిలుపునిచ్చారు. హిందు ఉంటే జీవన స్థితి, జీవన శైలి అని చెప్పారు. అమెరికాలోని చికాగోలో 1893 సెప్టెంబర్ 11న నిర్వహించిన ప్రపంచ మతాల సదస్సులో స్వామి వివేకానంద సుప్రసిద్ధ ప్రసంగం చేశారు. ‘అన్ని దేశాల పీడితులకు, భూమ్మీది అన్ని మతాలకు ఆశ్రయం ఇచ్చి గౌరవించిన దేశనుంచి నేను వచ్చాను. ఈ ప్రపంచానికి సహనం అనే పాఠాన్ని, సార్వత్రిక ఆమోదాన్ని నేర్పిన మతానికి చెందినవాడిని అని చెప్పుకునేందుకు నేను గర్వపడుతున్నాను. విశ్వజనీన సహనభావాన్ని మేము విశ్వసించడమే కాదు, ప్రపంచంలోని అన్ని మతాలు చెప్పేది సత్యమని మేము అంగీకరిస్తాము’ అని ఆయన చెప్పారు. నా దేశ యువతరానికి ఉక్కునరాలు, ఇనుప కండరాలు, గొప్ప హృదయం, పిడుగులాంటి మనస్సు అవసరముంది. ఈ గుణాలతోనే వీరు దేశాన్ని మార్చగలరు. ప్రపంచరంగంలో భారతీయ హోదాను వెలిగించడంలో యువత పెద్ద పాత్ర పోషిస్తుందని ఆయన విశ్వసించేవారు. ఒక సందర్భంలో యువత ఫుట్బాల్ కూడా ఆడాలని ఆయన చెప్పారు. అందుకనే ప్రధాని నరేంద్రమోదీ ఫిట్ ఇండియా అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు. సంస్కృతంలో ఒక శ్లోకం ఉంది. వ్యాయామం ఆరోగ్యానికి, దీర్ఘాయువుకు, బలానిక, సంతోషానికి కూడా దారి తీస్తుంది. ఆరోగ్యకరంగా ఉండటమే మనిషి అంతిమ గమ్యం కావాలి. అన్నిరకాల చర్యలూ ఆరోగ్యం ద్వారా మాత్రమే పూర్తవుతాయి. కోవిడ్ మహమ్మారి సమయంలో ప్రజలు ఆరోగ్యం పట్ల మరింత జాగరూకతతో వ్యవహరించారు. ఆరోగ్యకరమైన శరీరంలో వైరస్ ప్రభావం తగ్గుముఖం పట్టిందని తేలింది. ఈరోజు ప్రపంచమంతా ఆరోగ్యకరమైన శరీరానికి యోగా అవసరమని గుర్తించింది. ఇది మన ప్రాచీన జీవిత విధానంలో భాగమై ఉంటోంది. భారతీయ సంస్కృతి ప్రాధాన్యత విదేశాలు సాధించిన భౌతిక ప్రగతి భారత్కు అవసరమే కానీ మనం దానికోసం యాచించవద్దని స్వామి వివేకానంద విశ్వసించేవారు. మనం పాశ్చాత్య ప్రపంచానికి ఇవ్వాల్సిన దానికంటే ఎంతో ఎక్కువ మనవైపు ఉంది. పాశ్చాత్య ప్రపంచానికి మన అవసరం ఎంతో ఉంది. అలాగే పాశ్చాత్య ప్రపంచం నుంచి శాస్త్రీయ ఒరవడి విజ్ఞానం, కొత్త ఆవిష్కరణల గురించి ఆయిన తరచూ మాట్లాడేవారు. అదే సమయంలో భారతీయ సంస్కృతి, సంప్రదాయాలకు ఆయన ఎంతో గౌరవమిచ్చేవారు. ప్రాచ్యదేశాలు ఎన్నటికీ పాశ్చాత్యదేశాలు కాలేవు. అలాగే పాశ్చాత్య దేశాలు కూడా తూర్పు దేశాల్లాగా ఎన్నటికీ కాలేవు అని ఆయన చెప్పేవారు. వివేకానంద విద్యా తాత్వికత, నూతన విద్యావిధానంవ్యక్తిత్వాన్ని నిర్మించే, ఆలోచనలను పెంచే, విజ్ఞానాన్ని విస్తరించే, మన కాళ్లమీద మనం నిలబడేలా చేసే విద్య మనకు కావాలి అని వివేకానంద అన్నారు. విద్య ప్రధాన లక్ష్యం మానవ సృష్టేనని ఆయన భావించారు. సాంప్రదాయిక, ఆధునిక విద్యావ్యవస్థలను ఆయన అద్భుతంగా అనుసంధానించారు. ఆయన విద్యా తాత్వికత ఇప్పటికీ సందర్భోచితమే. సమగ్ర దృక్పథం చేపట్టి శారీరక, మానసిక, నైతిక, ఆధ్యాత్మిక, వృత్తిగత అభివృద్ధితోపాటు వివక్ష లేని విద్యను, అందరికీ అందుబాటులో ఉండే విద్యను ఆయన బలపర్చారు. అలాగే వాస్తవికమైన ఆధునిక దృక్పథంతో టెక్నాలజీ, వాణిజ్యం, పరిశ్రమ, సైన్స్కి సంబంధించిన పాశ్చాత్య విద్యకు కూడా ఆయన ప్రాధాన్యతనిచ్చారు. ప్రధాని నేతృత్పంలోని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన విద్యావిధానం కూడా స్వామి వివేకానంద భావాలకు అనుగుణంగా ఉంటోంది. సైన్సుతో వేదాంతాన్ని సమగ్రపర్చాల్సిన అవసరాన్ని ఆయన నొక్కి చెప్పారు. ప్రపంచం పిరికిపందల కోసం కాదు. మరింతగా తెలుసుకోవాలని కోరుకుంటున్నవారిదే ప్రపంచం అని ఆయన చెప్పారు. దళితులు, మహిళలు, పేదల అభ్యున్నతి గురించిన భావన, కర్మ ప్రాధాన్యత అనేవి ప్రత్యేకించి స్వామి వివేకానంద ఆలోచనల్లో ఉండేవి. దరిద్రులలో నారాయణుడిని చూశారాయన. మానవ సేవే మాధవసేవ అని భావించారు. దరిద్రనారాయణ భావన ద్వారా ఆయన మానవవాదాన్ని మతంతో అనుసంధించారు. చికాగోలో సర్వమత సదస్సులో కూడా ఆయన విశ్వ సౌభ్రాతృత్వమే అన్ని మతాల సారాంశమన్నారు. ఏ దేశ అభివృద్ధి అయినా దాని యువతపైనే ఆధారపడి ఉంటుంది. కాబట్టి యువతలో మేధోపరమైన సదాలోచన జాతికి అవసరం. నేడు ప్రతిరాష్ట్రమూ మాదకద్రవ్యాల సేవనం అనే సామాజిక దురాచారం పట్ల కలతచెందుతోంది. ప్రభుత్వం చట్టాలను తీసుకొస్తోంది కానీ సమాజం తన స్థాయిలో పటిష్టమైన చర్యలు తీసుకోవాలి. -బండారు దత్తాత్రేయ (నేడు స్వామి వివేకానంద 158వ జయంతి) వ్యాసకర్త హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ -
దత్తాత్రేయకు త్రుటిలో తప్పిన ప్రమాదం
సాక్షి, హైదరాబాద్: హిమాచల్ప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ బండారు దత్తాత్రేయ ప్రయాణిస్తున్న కారు సోమవారం ప్రమాదానికి గురైంది. ఒక్కసారిగా అదుపు తప్పి హైవే పైనుంచి కిందకు దూసుకెళ్లింది. ఈ ప్రమాదం నుంచి ఆయన సురక్షితంగా బయటపడ్డారు. ఈ ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం ఖైతాపురం గ్రామ శివారులో హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై సోమవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లో పర్యటన నిమిత్తం దత్తాత్రేయ ఉదయం హైదరాబాద్ నుంచి బయలుదేరారు. ముందు మూడు, వెనుక మూడు వాహనాలతో కూడిన కాన్వాయ్లో దత్తాత్రేయ ప్రయాణిస్తున్న కారు మధ్యలో ఉంది. సరిగ్గా 11 గంటల ప్రాంతంలో ఖైతాపురం గ్రామ శివారులోని టీఎన్ఆర్ వ్యూస్ పరిశ్రమ ముందుకు రాగానే దత్తాత్రేయ కారు ఒక్కసారిగా అదుపుతప్పి హైవే నుంచి ఎడమవైపునకు దూసుకెళ్లింది. అదే వేగంతో ముందున్న చెట్టును ఢీకొట్టి కొంతదూరం వెళ్లి ఆగిపోయింది. ప్రమాద సమయంలో కారులో దత్తాత్రేయతో పాటు మరో ముగ్గురు ఉన్నారు. ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. ప్రమాదంతో దత్తాత్రేయ ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. కొద్దిసేపటి తర్వాత తేరుకొని కాన్వాయ్లోని మరో వాహనంలో వెళ్లిపోయారు. కాపాడిన సీటు బెల్టు దత్తాత్రేయ ప్రయాణిస్తున్న ఏపీ 09 ఏఎస్ 6666 నంబరుగల బుల్లెట్ప్రూఫ్ బెంజ్కారు ప్రమాదానికి గురైన సమయంలో వేగంగానే ఉన్నట్టు స్థానికులు చెబుతున్నారు. స్టీరింగ్ ఆకస్మాత్తుగా ఎడమవైపు లాగేయడంతో కారు అదుపు తప్పిందని డ్రైవర్ మురళి చెప్పారు. ముందు సీట్లో కూర్చున్న దత్తాత్రేయ సీటుబెల్టు ధరించారు. ఇది ఆయనను కాపాడింది. సురక్షితంగా బయటపడ్డారు. రోడ్డు కిందికి దూసుకెళ్తున్న కారు చెట్టును ఢీకొట్టడంతో పల్టీలు కొట్టకుండా నేరుగా ముందుకు వెళ్లి ఆగిపోయింది. దాంతో పెను ప్రమాదం తప్పింది. దేవుడి ఆశీస్సులతోనే... దేవుడి ఆశీస్సులు, ప్రజల ఆదరాభిమానాలతోనే ప్రమాదం తప్పిందని దత్తాత్రేయ అన్నారు. తాను పూర్తి ఆరోగ్యంగా ఉన్నానన్నారు. ప్రమాదం విషయం తెలిసి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, సహాయమంత్రి కిషన్రెడ్డి, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ గవర్నర్లు, హిమాచల్ప్రదేశ్ ముఖ్యమంత్రి, రాష్ట్ర డీజీపీ, ఇతర ప్రముఖులు ఫోన్ చేసి క్షేమసమాచారాలు తెలుసుకున్నారని చెప్పారు. వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. -
భారత ఐక్యతా వారధి సర్దార్ పటేల్
సర్దార్ వల్లభాయ్ పటేల్ గొప్ప దేశభక్తుడు, రాజనీతి జ్ఞుడు. దేశ సమగ్రత, సమైక్య తపట్ల దృఢమైన సంకల్పం, ఆయన దూరదృష్టి, చాతుర్యం దేశాన్ని తొలినాళ్లలో పలు విపత్కర సమస్యలని ఎదుర్కొని ముందుకు నడిపించడానికి ఇతోధికంగా తోడ్పడ్డాయి. ప్రముఖంగా రెండు ఘట నలను ప్రస్తావిస్తాను. గుజరాత్లోని జాం నగర్ పూర్వ రాజైన జాం సాహిబ్కు సంబంధించినది. అధికార బది లీకి ఇంకా రెండు నెలలు గడువు ఉండగా,ఈలోపే కతియవార్ రాష్ట్రాలన్నింటినీ కలిపి పాకిస్తాన్ సహా యంతో ఒక స్వతంత్ర రాజ్యంగా ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో ఢిల్లీలోని తోటి సంస్థానాధీశులను కలవబోతున్నాడని తెలుసుకొన్న పటేల్ ఇక సమయాన్ని వృథాచేయకుండా జాం సాహిబ్ సోదరుడైన కల్నల్ హిమ్మత్ సింగ్ ద్వారా వారిని తన ఇంటికి విందుకి తీసుకురావాలని కోరాడు. భోజనసందర్భంలో పటేల్ తన ఆత్మీయతతో, ప్రేమతో జాంసాహిబ్, మహారాణి వారి హృదయాలని గెలుచుకున్నాడు. దీంతో జాంసాహిబ్ స్వతంత్ర రాజ్యం ఏర్పాటు చేయాలనే ప్రణాళికను విరమించుకున్నాడు. మరో సంఘటన షేక్ అబ్దుల్లాకు సంబంధించినది. రాజ్యాంగ పరిషత్తులో ఆర్టికల్ 370ని చర్చిస్తున్న సమయంలో అసహనంతో ఉన్న షేక్ అబ్దుల్లా తన స్థానం నుండి లేచి, ‘నేను తిరిగి కశ్మీరుకు వెళుతున్నాను’ అని సభలో ప్రకటించాడు. దీంతో ప్రధాని నెహ్రూ లేని కారణంగా అక్కడే ఉన్న పటేల్.. కశ్మీర్ వెళ్లడానికి రైలు పెట్టెలో కూర్చున్న అబ్దుల్లాకు ‘ఈరోజు సభను వదిలివెళ్లగలవు కానీ ఢిల్లీని మాత్రం విడిచి వెళ్ళలేవు’ అనే సందేశాన్ని తెలియజేశారు. దాని పరిణామాలను గ్రహించిన షేక్ అబ్దుల్లా రైలు నుంచి దిగి తన ప్రయాణాన్ని రద్దు చేసుకున్నారు. అంతటి గట్టి సందేశాన్ని నిర్భీతితో ఇవ్వగల ధీశాలి పటేల్. జాతిపిత మహాత్మా గాంధీ ఆలోచనలను, భావాలను సరైన దృష్టికోణం నుండి అర్థం చేసుకున్న రాజకీయ నాయకులలో సర్దార్ పటేల్ ఒకరు. గాంధీజీ స్వరాజ్యం నుంచి సురాజ్యం గురించి చెబితే, సర్దార్ పటేల్ గారు స్వరాజ్యాన్ని సురాజ్యంగా మార్పు చేసే సుపరిపాలనకు, సంస్కరణకు దారితీసిన ఆద్యుడు. వల్లభాయ్ పటేల్ 1917 నవంబర్లో మొదటిసారి గాంధీజీతో పరిచయం ఏర్పడ్డప్పుడు ఆ సమయంలో వారి వేషధారణ హ్యాట్, సూట్, బూట్, ఇంగ్లిష్తో పాశ్చాత్యమైనది. కానీ గాంధీజీ సంపర్కంతో పూర్తిగా పరివర్తన చెంది ఖాదీ, ధోతి, కుర్తా, చెప్పులు స్వీకరించి స్వదేశీ వస్త్రధారణలోకి వచ్చారు. గాంధీజీ సత్య, అహింస సిద్ధాం తాల ప్రభావంతో, పటేల్ విదేశీ వస్తువులని, దుస్తుల్ని బహిష్కరించినారు. జాతీయ వ్యవహారాలలో అత్యంత కఠినంగా వ్యవహరించే పటేల్ వ్యక్తిగత విషయాలలో మాత్రం మృదువుగా ఉండే వారు. పటేల్తో సమావేశమై సంభాషించిన తర్వాత.. మన దేశ భవిష్యత్తు సరైన నాయకత్వం చేతుల్లో సురక్షితంగా ఉందని భావిస్తున్నాను అని జంషెడ్ జీ టాటా అన్నారు. భారత్ తొలి హోంమంత్రిగా వ్యవహరించే రోజుల్లో తన ఇంటికి ఔపచారికంగా నలభై–యాభై మంది ఐసీఎస్ అధికారులను పిలిపించుకొని వారితో దేశ ప్రజల ఆకాంక్షలకు అవసరాలకు అనుగుణంగా సేవా భావనతో, మెలగాల్సి ఉంటుందనీ, మంత్రులు ఐదేళ్లకు వస్తుంటారు పోతుం టారు కానీ మీరు ఈ వ్యవస్థలో దీర్ఘకాలంగా పని చేసేవారు, అందుకే స్వతంత్రంగా నియమావళి ప్రకారం మెలగాలనీ కోరారు. 565 పైగా సంస్థానాలను ఇండియన్ యూనియన్లో విలీనం చేయడం వారి దృఢమైన సంకల్ప శక్తికి, నాయకత్వ సామర్థ్యాలకు నిదర్శనాలు. జూనాగఢ్ సంస్థానం సౌరాష్ట్రకు సమీపంలో ఉన్న ఒక చిన్న రాచరిక రాజ్యం. దాని నవాబు పాకిస్తాన్లో విలీనం చేస్తామని ప్రకటించినప్పుడు అత్యధిక ప్రజలు భారత్లోనే విలీనం కావాలని కోరుకున్నారు. అపుడు పటేల్ భారత సైన్యాన్ని జూనాగఢ్ సంస్థానానికి పంపి 1947 నవంబర్ 9న జూనాగఢ్ను భారతదేశంలో విలీనం చేశారు. హైదరాబాద్ సంస్థానంలో నిజాం నవాబు తమ సంస్థానానికి సొంత కరెన్సీ, రైల్వే సైనిక వ్యవస్థను కలిగి ఉండడంతో హైదరాబాద్ను స్వతంత్ర దేశంగా ప్రకటిం చుకోవాలనే వాంఛ. అతను విలీనం కాకుండా భారత యూనియన్తో సంబంధాలు మాత్రమే కోరుకుంటున్నాడు. ఈ విషయాన్ని పటేల్ గ్రహించి నిజాంకు సమయం ఇవ్వడం ఉత్తమమని భావించారు. లార్డ్ మౌంట్బాటన్, నె్రçహూ సైతం నిజాంకు సాన్నిహిత్యంగా ఉండేవారు. వారు పటేల్తో చర్చలు జరిపి హైదరాబాద్ సంస్థానంపై సైనికచర్య ఉండవద్దని నిర్ణయించారు. దీన్ని ఆసరాగా తీసుకున్న నిజాం నవాబు ఒకవైపు విదేశాలతో సంబంధాలు నెరపుతూ మరోవైపు ఆయుధాలు కొనుగోలు చేస్తూ తన సైనిక శక్తిని పెంచుకొన్నారు. సంస్థానంలో హిందూ ప్రజలపై పైశాచిక దాడులను చేసి, మతాంతరీకరణలను ప్రోత్సహించారు. ఇంకోపక్కన ఇత్తెహాదుల్ ముస్లిమీన్ను స్థాపిం పజేశారు. ఖాసీం రజ్వీ నాయకత్వంలోని రజాకార్లను పెంపొందింప జేశారు. దీన్నంతటినీ పటేల్ బాగా గమనిస్తూ హైదరాబాద్ రాష్ట్రానికి మిలిటరీ జనరల్గా మున్షిని నియమించారు. ఆయన హైదరాబాద్ రాష్ట్ర పరిస్థితులపై ఎప్పటికప్పుడు కేంద్ర ప్రభుత్వానికి సమాచారాన్ని ఇచ్చేవారు. ఆనాటి వైస్రాయి లార్డ్ మౌంట్ బాటన్ పదవీ కాలం ముగిసిన వెంటనే ఇక పాత ఒప్పం దాలు చెల్లిపోయాయని భావించిన సర్దార్ పటేల్ సాహసంతో ఆపరేషన్ పోలో అనే సైనిక చర్యను చేపట్టి రజాకార్లను అంతం చేసి హైదరాబాద్ సంస్థానాన్ని 17 సెప్టెం బర్ 1948 న భారత యూనియన్లో విలీనం చేసి మువ్వన్నెల భారత పతాకాన్ని ఎగరవేయించారు. అలాగే గుజరాత్లోని ఖేడా, బార్డోలీ ప్రాంతంలో గాంధీజీ ప్రేరణతో పటేల్ నడిపిన సత్యాగ్రహం, అపూర్వమైన రైతాంగ ఉద్యమం ఆయనకు చరిత్రలో చిరస్థానం కల్పిం చాయి. భారత ప్రభుత్వం 1991లో సర్దార్ పటేల్ను ‘భారత రత్న’తో సత్కరించింది. ఆయన జన్మదినాన్ని జాతీయ ఐక్యతా దినోత్సవంగా జరుపుకుంటాము, ఈ భావాం జలితో ఆయనకు నివాళులు అర్పిస్తూ వారికి శత కోటి వందనాలు సమర్పించుకుందాం. -బండారు దత్తాత్రేయ వ్యాసకర్త గవర్నర్, హిమాచల్ప్రదేశ్