Assigned lands
-
చంద్రబాబు అన్ని వర్గాలను మోసం చేశారు: సీఎం జగన్
సాక్షి, ఏలూరు: చంద్రబాబు పాలనలో అన్ని వర్గాలను మోసం చేశారని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ధ్వజమెత్తారు. బాబు సీఎంగా ఉన్నప్పుడు అంతా దోపిడినే జరిగిందని మండిపడ్డారు. ప్రజలకు మంచి చేసి చంద్రబాబు ఎప్పుడూ సీఎం కాలేదని అన్నారు. తొలిసారి వెన్నుపోటుతో, రెండోసారి కార్గిల్ యుద్ధం పుణ్యాన, మూడోసారి రుణమాఫీతో అధికారంలోకి వచ్చారని ప్రస్తావించారు. త్వరలో ఎన్నికలు జరగబోతున్నాయన్న సీఎం జగన్.. చంద్రబాబుకు మిగతా సామాజిక వర్గాలపై ఎలాంటి అభిప్రాయం ఉందో గుర్తు తెచ్చుకోవాలని ప్రజలకు సూచించారు. ఎస్సీలో ఎవరైనా పుట్టాలనుకుంటారా, బీసీల తోకలు కత్తిరిస్తానని చంద్రబాబు చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. ఇచ్చిన మేనిఫెస్టోలపై కమిట్మెంట్ లేని నాయకుడు చంద్రబాబు అని విమర్శించారు. ఎన్నికలు దగ్గరవుతున్న కొద్దీ తోడేళ్లంతా ఏకమవుతున్నారని సీఎం జగన్ మండిపడ్డారు. దొంగల ముఠా అంతా ఏకమై ప్రతి ఇంటికి బెంజ్ కారు ఇస్తామంటారు.. నమ్మి మోసపోవద్దని హితవు పలికారు. 2014 చంద్రబాబు, పవన్ ఏకమై ఇచ్చిన హామీలు నెరవేర్చారా అని ఆలోచించాలని సూచించారు. తనకు ప్రజా దీవెనలు ఉన్నంత వరకు ఎవరితోనూ పొత్తు పెట్టుకోనని స్పష్టం చేశారు. చదవండి: నిమ్మగడ్డ రమేష్ కొత్త పన్నాగం.. దానికి సమాధానముందా? సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి శుక్రవారం ఏలూరు జిల్లా నూజివీడులో నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 46,463.82 ఎకరాలను వ్యవసాయం కోసం కొత్తగా 42,307 మందికి డీకేటీ పట్టాలు పంపిణీ చేశారు. నిరుపేదలకు భూముల పంపిణీని ప్రారంభించడంతోపాటు అసైన్డ్ భూములకు యాజమాన్య హక్కులు కల్పించడం, లంక భూములకు పట్టాలు అందజేశారు. చుక్కల భూములు, షరతుల గల పట్టా భూములు, సర్వీస్ ఈనాం భూములను 22 ఏ జాబితా నుంచి తొలగించడం, భూమి కొనుగోలు పథకం కింద ఇచ్చిన భూములపై హక్కుల కల్పన, గిరిజనులకు ఆర్ఓఎఫ్ఆర్ పట్టాల పంపిణీని సీఎం జగన్ ఈ సభలో ప్రారంభించారు. శ్మశాన వాటికలు లేని దళిత వాడల కోసం రాష్ట్రంలో 1,563 గ్రామాల్లో 951 ఎకరాల ప్రభుత్వ భూమిని కేటాయించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. రైతుల భూ సమస్యలకు పరిష్కారం చూపిస్తూ.. కొత్తగా డీకేటీ పట్టాలను అందిస్తున్నామని తెలిపారు. చుక్కుల భూములకు సైతం పరిష్కారం చూపించామని, అసైన్డ్ భూములు, లంక భూములకు భూ హక్కులు కల్పిస్తున్నామని చెప్పారు. భూ తగాదాలకు పరిష్కారం చూపిస్తూ రికార్డులు అప్డేట్ చేస్తున్నామన్నారు. వేలమంది సర్వేయర్లతో వేగంగా సర్వే చేపడుతున్నామని తెలిపారు. ‘మొదటి దశలో 18 లక్షల ఎకరాల సర్వే పూర్తి చేశాం. రెండవ దశలో 24.6 లక్షల ఎకరాల సర్వే పూర్తి చేశాం. మొత్తంగా 45 లక్షల ఎకరాల సరిహద్దు అంశాలు పరిష్కరించాం. 4 వేల గ్రామాల్లో రీసర్వే పూర్తయింది. సర్వే పూర్తయిన గ్రామాల్లో అక్కడి సచివాలయాల్లోనే రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. గిరిజన రైతులకు పోడు భూములపై హక్కు కల్పించాం లంక భూమి సాగు చేసుకుంటున్న రైతులకు హక్కు కల్పించాం. గ్రామ ఇనామ్ సర్వీస్ భూములనునిషేధిత జాబితా నుంచి తొలగించాం ఎస్సీ కార్పొరేషన్ ద్వారా పంపిణీ చేసిన భూములకూ హక్కులు కల్పిస్తున్నాం. దళిత వర్గాల కోసం రాష్ట్ర వ్యాప్తంగా స్మశానవాటికలకు స్థలాలు కేటాయించాం. సామాజిక న్యాయాన్ని ఒక విధానంగా అమలు చేస్తున్నాం. అధికారంలోకి వచ్చాక 2 లక్షల 7 వేల ఉద్యోగాలు భర్తీ చేశాం. ఇళ్ల పట్టాల లబ్ధిదారుల్లో 80 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకే ఇచ్చాం’ అని సీఎం జగన్ పేర్కొన్నారు. చదవండి: చంద్రబాబుకు సీఎం జగన్ స్ట్రాంగ్ కౌంటర్ -
రెవె'న్యూ' విధానాలతో భూ హక్కు
సాహసోపేత నిర్ణయాలతో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన రెవిన్యూ సంస్కరణలు, కొత్త కార్యక్రమాలతో ఇటు ప్రజలు, అటు ప్రభుత్వ ఆదాయం గణనీయంగా పెరుగుతోంది. ప్రధానంగా భూముల విలువ అనూహ్యంగా పెరిగిపోవడంతో పేద రైతుల తల రాత మారిపోతోంది. ఎందుకూ పనికి రావనుకున్న భూములకు సైతం మంచి ధరలు కళ్లెదుటే కనిపిస్తుండటంతో అసైన్డ్ రైతుల పంట పండింది. ‘కొనుగోళ్లు – అమ్మకాలు – రిజిస్ట్రేషన్లు’ చక్రం ద్వారా లక్షల కోట్ల రూపాయల లావాదేవీలు ఇకపై మరింతగా ఊపందుకోనున్నాయి. తద్వారా రాష్ట్రంలో సంపద సృష్టి ఏమేరకు జరిగిందన్నది ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. వీటన్నింటికీ తోడు ఇన్నాళ్లూ అనుభవంలో ఉన్నప్పటికీ రికార్డు పరంగా హక్కు లేని భూమికి ఇప్పుడు ‘ఇది నా భూమి’ అని సంతృప్తిగా చెప్పుకునే పరిస్థితిని రైతులకు కలిగించింది. సాక్షి, అమరావతి : వివాదాలు, సమస్యలు, ఎడతెగని జాప్యంతో కునారిల్లిన రెవెన్యూ శాఖను వైఎస్ జగన్ ప్రభుత్వం నాలుగేళ్లలో సమూలంగా మార్చేసింది. ఆ వ్యవస్థలో వేళ్లూనుకుపోయిన ప్రతి సమస్యను పరిష్కరించేందుకు మార్గం చూపింది. సర్టిఫికెట్లు పొందడాన్ని సులభతరం చేయడం దగ్గర నుంచి కుప్పలు తెప్పలుగా పేరుకుపోయిన నిషేధిత భూముల చిక్కు ముడులు విప్పడం, సాహసోపేతమైన రీతిలో అసైన్డ్ భూములపై యాజమాన్య హక్కులు కల్పించడం ద్వారా లక్షలాది రైతుల కుటుంబాల్లో వెలుగులు నింపింది. భూ వివాదాలను శాశ్వతంగా పరిష్కరించే లక్ష్యంతో స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయని విధంగా తొలిసారి భూముల రీ సర్వేను చేపట్టి విజయవంతంగా నిర్వహిస్తోంది. రాష్ట్ర విభజన తర్వాత పరిపాలనా సౌలభ్యం కోసం అన్ని ప్రాంతాల అభిప్రాయాలు, సంప్రదాయాలను గౌరవిస్తూ పార్లమెంటు నియోజకవర్గాల వారీగా జిల్లాలు ఏర్పాటు చేసి రాష్ట్రానికి ఒక కొత్త స్వరూపాన్ని ఇచ్చింది. మొత్తంగా నాలుగేళ్లలో రెవెన్యూ శాఖలో చోటుచేసుకున్న మార్పులు ఇలా ఉన్నాయి. మహా యజ్ఞంలా భూముల రీ సర్వే ► అస్తవ్యస్థంగా మారిన భూముల వ్యవస్థను గాడిలో పెట్టేందుకు చరిత్రలో ఏ ప్రభుత్వం చేయని విధంగా సాహసోపేతంగా భూముల రీ సర్వే చేపట్టిన వైఎస్ జగన్ ప్రభుత్వం సత్ఫలితాలు సాధిస్తోంది. బ్రిటీష్ కాలం నాటి భూముల రికార్డుల స్థానంలో ఆధునిక డిజిటల్ భూ రికార్డులను అందుబాటులోకి తీసుకువస్తోంది. దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలోనూ ఇప్పటి వరకు జరగని విధంగా మొత్తం భూ విస్తీర్ణాన్ని కొలిచే బృహత్తర కార్యక్రమం ఇది. ఇందుకోసం ఏకంగా 14,630 మంది సర్వేయర్లను నియమించడం ఒక రికార్డు. ► రికార్డుల ట్యాంపరింగ్కు అవకాశం లేకుండా భూ యజమానులకు స్పష్టమైన హక్కు కల్పించడం, అక్షాంశాలు, రేఖాంశాల ద్వారా భూముల హద్దులను గుర్తించి.. ఆ భూమికి రక్షణ కల్పించడమే ధ్యేయంగా రీ సర్వే అత్యంత ఆధునిక రీతిలో సాగుతోంది. అత్యంత సంక్లిష్టమైన ఈ సర్వే తొలి దశలో 2 వేల గ్రామాల్లో అన్ని దశల్లోనూ పూర్తి కాగా, మరో 2 వేల గ్రామాల్లో త్వరలో పూర్తవనుంది. ప్రతి మూడు నెలలకు 2 వేల గ్రామాల చొప్పున సర్వే పూర్తికానుంది. ► సర్వే పూర్తయిన గ్రామాల్లో ఇప్పటి వరకు 4.80 లక్షల మ్యుటేషన్లు జరిగాయి. 16.55 లక్షల మంది రైతులకు భూ హక్కు పత్రాలు పంపిణీ చేశారు. 8.70 లక్షల భూ కమతాలకు సంబంధించి ల్యాండ్ పార్సిల్ మ్యాప్లు తయారయ్యాయి. రైతులకు శ్రమ లేకుండా, వారి డబ్బు ఖర్చు కాకుండా రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా ఎంతో క్లిష్టమైన ఈ పనుల్ని పూర్తి చేసింది. ► ఆయా గ్రామాల్లోని గ్రామ సచివాలయాల్లో రిజిస్ట్రేషన్ సేవలు సైతం అందుబాటులోకి వచ్చాయి. తొలిసారి భూముల హద్దులను నిర్ధారించి, భూ రక్ష సర్వే రాళ్లను రాష్ట్ర ప్రభుత్వ ఖర్చుతో పాతుతున్నారు. గ్రామాలు, మున్సిపాల్టీల్లోని భూములను కూడా తొలిసారి సర్వే చేసి, ఇళ్ల యజమానులకు ఓనర్షిప్ సర్టిఫికెట్లు ఇచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ప్రతి దళితవాడకు శ్మశాన వాటిక రాష్ట్రంలోని దళిత వాడలకు శ్మశాన వాటిక సమస్య లేకుండా చేసేందుకు ఆ దిశగా నడుం బిగించింది. శ్మశాన వాటికలు లేని దళిత వాడలను గుర్తించి, వెంటనే ఏర్పాటు చేస్తోంది. రాష్ట్రంలోని 1,700 గ్రామాల్లో 1050.08 ఎకరాల భూమిని శ్మశాన వాటికలకు కేటాయించింది. సుదీర్ఘకాలం తర్వాత భూ పంపిణీ రాష్ట్రంలో సుదీర్ఘ కాలం తర్వాత నిరుపేదలకు వ్యవసాయ భూములు పంపిణీ చేయడానికి వైఎస్ జగన్ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. 23 జిల్లాల్లో 50 వేల ఎకరాలను అర్హులైన పేదలకు పంచనున్నారు. 46 వేల మందికి భూములివ్వడానికి ఎంపిక చేయగా, అందులో ఎక్కువ మంది దళితులే. వ్యవసాయ కూలీలుగా, ఇతర పనులు చేసుకుంటూ జీవించే వారిని ప్రభుత్వం రైతులుగా మార్చనుంది. రాష్ట్రంలో 2013 తర్వాత మళ్లీ భూ పంపిణీకి వైఎస్సార్సీపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అసైన్డ్ భూములకు యాజమాన్య హక్కులు ► అసైన్డ్ భూములపై యాజమాన్య హక్కులు కల్పించడంతో లక్షలాది మంది దళిత, పేద రైతుల ఆర్థిక స్థితి ఒక్కసారిగా పెరిగిపోయింది. అసైన్ చేసిన 20 ఏళ్ల తర్వాత అసైన్దారులు లేకపోతే వారి వారసులకు పూర్తి యాజమాన్య హక్కులు లభించేలా వైఎస్ జగన్ ప్రభుత్వం అసైన్డ్ భూముల చట్టాన్ని సవరించింది. ► తమ భూములపై తమకు హక్కులు ఇవ్వాలని అసైన్డ్ రైతులు చాలా ఏళ్లుగా కోరుతున్నారు. దీనిపై ప్రత్యేకంగా దృష్టి పెట్టిన వైఎస్ జగన్ ప్రభుత్వం అసైన్ చేసిన 20 ఏళ్ల తర్వాత హక్కుదారులు వారికి అవసరమైనప్పుడు అమ్ముకునే అవకాశం కల్పించింది. దీనివల్ల తమ భూములపై హక్కులు లేని 15,21,160 మంది పేద దళిత, ఇతర పేద వర్గాల రైతులకు సంబంధించిన 27,41,698 ఎకరాల భూమిపై యాజమాన్య హక్కులు లభిస్తున్నాయి. ‘ఇక ఇది నా భూమి’ అని ఆ రైతులు గర్వంగా చెప్పుకునే పరిస్థితి కల్పించింది. ► ఇన్ని లక్షల ఎకరాల లావాదేవీలు మార్కెట్లోకి రావడంతో ఆర్థిక వృద్ధి కూడా పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. విలువ లేని పేద రైతుల భూమికి విలువ పెంచడంతోపాటు రాష్ట్ర ఆర్థిక వృద్ధికి ఊతమిచ్చే నిర్ణయంగా దీన్ని నిపుణులు అభివర్ణిస్తున్నారు. కొత్త జిల్లాల కల సాకారం ► ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు వైఎస్ జగన్ ప్రభుత్వం పార్లమెంటు నియోజకవర్గాల వారీగా జిల్లాలను పునర్వ్యవస్థీకరించింది. 13 జిల్లాలను 26 జిల్లాలుగా, 51 రెవెన్యూ డివిజన్లను 77 డివిజన్లుగా పునర్వ్యవస్థీకరించింది. జిల్లా కేంద్రాలు, భౌగోళిక, సామాజిక, ఆర్థిక, చారిత్రక, సాంస్కృతిక అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుని విభజన పూర్తి చేసింది. ► పార్లమెంటు నియోజకవర్గాన్ని ఒక యూనిట్గా తీసుకుని 25 జిల్లాలు ఏర్పాటు చేయాల్సి ఉన్నప్పటికీ, గిరిజన ప్రాంతం విస్తృతి దృష్ట్యా అరకు పార్లమెంట్ను రెండు జిల్లాలుగా ఏర్పాటు చేసింది. పరిపాలనా వికేంద్రీకరణ, భౌగోళిక అనుకూలతలతోపాటు ప్రజల మనోభావాలకు ప్రాధాన్యత ఇచ్చింది. ► ప్రతి జిల్లాకు అక్కడి పరిస్థితులను బట్టి పేరు పెట్టి, ఆయా ప్రాంతాల ప్రాధాన్యాన్ని మరింత పెంచింది. గత టీడీపీ ప్రభుత్వం ఎన్టీఆర్ను విస్మరిస్తే.. ఆయన జన్మించిన కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టడం ద్వారా వైఎస్ జగన్ ప్రభుత్వం ఆయన గౌరవాన్ని నిలబెట్టింది. 1.68 లక్షల సర్వీసు ఈనాం భూములకు విముక్తి గ్రామాల్లో కుల వృత్తుల వారికి ఇచ్చిన ఈనాం భూములను నిషేధిత జాబితా నుంచి తొలగించాలని నిర్ణయించారు. 1,68,604 ఎకరాల ఈనాం భూమిని నిషేధిత జాబితా నుంచి తొలగించి యాజమాన్య హక్కులు కల్పిస్తున్నారు. లంక భూములకు డి పట్టాలు అనేక సంవత్సరాలుగా అపరిష్కృత సమస్యగా ఉన్న లంక భూములకు డీకేటీ పట్టాలిస్తున్నారు. 8 జిల్లాల్లో ఉన్న కృష్ణా, గోదావరి లంకల్లోని 9,062 ఎకరాలకు సంబంధించిన 19,176 మంది రైతులకు పట్టాలు దక్కనున్నాయి. మూడు కేటగిరీల్లో లంక భూములను సాగు చేసుకుంటున్న రైతులు తమకు పట్టాలు ఇవ్వాలని కోరుతుండడంతో వివాదాల్లేకుండా సాగు చేసుకుంటున్న అర్హులకు పట్టాలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. సి కేటగిరీలోని కొన్ని భూములకు ఐదేళ్ల లీజుకు ఇవ్వనుంది. చుక్కల భూముల సమస్యకు పరిష్కారం ► అత్యంత వివాదాస్పదమై ఏళ్ల తరబడి లక్షలాది మంది రైతుల కుటుంబాల్లో చీకట్లు నింపిన చుక్కల భూముల సమస్యను రాష్ట్ర ప్రభుత్వం సునాయాసంగా పరిష్కరించింది. 15 జిల్లాల్లో 2.06 లక్షల ఎకరాల చుక్కల భూములను నిషేధిత ఆస్తుల జాబితా (22 ఏ (1) ఇ) నుంచి ఒకేసారి తొలగించి చరిత్ర సృష్టించింది. ► చుక్కల భూములుగా ఆర్ఎస్ఆర్లో రికార్డు చేసిన భూములు ప్రభుత్వానికి చెందినవా, ప్రైవేటు పట్టాదారులవా అనే అంశాన్ని గత ప్రభుత్వం ఖరారు చేయకుండా నిషేధిత భూముల జాబితాలో చేర్చింది. ఆ రికార్డులన్నింటినీ పరిశీలించి చుక్కల భూములకు విముక్తి కల్పించింది. ఈ నిర్ణయం వల్ల 1,07,134 మంది రైతులకు వారి భూములపై శాశ్వత హక్కులు లభించాయి. షరతులు గల పట్టా భూములపై తొలగిన ఆంక్షలు ► చుక్కల భూముల తరహాలోనే సమస్యాత్మకంగా తయారైన షరతులు గల పట్టా భూములకు ప్రభుత్వం పరిష్కారం చూపింది. 33 వేల ఎకరాల షరతులు గల పట్టా భూములను నిషేధిత ఆస్తుల జాబితా నుంచి తొలగించి ఆ రైతులకు మేలు చేకూర్చింది. ► బ్రిటీష్ హయాం నుంచి రైతుల చేతుల్లో ఉన్న భూములను తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో 22ఏ కేటగిరీలో పెట్టగా, అలా పెట్టడం అన్యాయమని భావించి నిబంధనల ప్రకారమే వాటిని ఆ జాబితా నుంచి ఈ ప్రభుత్వం తీసివేసింది. ► ఇలా ఒక్క కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలోనే 18 వేలకుపైగా ఎకరాలను 22ఏ నుంచి తీసివేశారు. 2022 అక్టోబర్ 20న అవనిగడ్డలో బహిరంగ సభలో సీఎం వైఎస్ జగన్ నిషేధిత భూముల జాబితా నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించి కొందరికి పట్టాలిచ్చారు. అనాదీనం, ఖాళీ కాలమ్ భూముల సమస్యకు చెక్ అనాదీనం, ఖాళీ కాలమ్ భూములను చుక్కల భూముల చట్టం పరిధిలోకి తీసుకువచ్చి, వాటిని నిషేధిత భూముల జాబితా నుంచి తొలగించేందుకు ప్రభుత్వం మార్గం సుగమం చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 50 వేల ఎకరాలకు సంబంధించిన 35 నుంచి 40 వేల మంది రైతులు దీనివల్ల లబ్ధి పొందారు. సాదాబైనామా కేసుల పరిష్కారం గతంలో భూముల లావాదేవీలను తెల్ల కాగితాల మీద రాసుకోవడం, నోటి మాటగా జరిగిన భూముల లావాదేవీల (సాదాబైనామా విధానం) సమస్యకు పరిష్కారం చూపింది. ఒక నిర్ధిష్ట విధానాన్ని రూపొందించడం ద్వారా ఈ సమస్యను పరిష్కరించింది. మ్యుటేషన్లలో పారదర్శకత ► మ్యుటేషన్ల పేరుతో జరిగే అక్రమాలకు ముగింపు పలికేలా ప్రభుత్వం అనేక మార్పులు చేపట్టింది. ఇష్టానుసారం మ్యుటేషన్లు చేయడాన్ని నిలిపివేసి, పట్టాదారుకు నోటీసు ఇచ్చి, విచారణ జరిగిన తర్వాతే రెవెన్యూ రికార్డులో మార్పు జరిగేలా సాఫ్ట్వేర్ను మార్చారు. దీంతో కరెక్షన్ పేరుతో జరిగే మ్యుటేషన్లు నిలిచిపోయాయి. ► మ్యుటేషన్లు తిరస్కరించే అధికారాన్ని తహశీల్దార్లకు తీసివేసి ఆర్డీఓలకు అప్పగించడంతో ఇబ్బందులు తగ్గిపోయాయి. రిజిస్ట్రేషన్కు ముందే సర్వే నంబర్ సబ్ డివిజన్ చేసుకునే విధానాన్ని ప్రవేశ పెట్టడంతో డబుల్ రిజిస్ట్రేషన్లు తగ్గాయి. రీ సర్వే పూర్తయిన గ్రామాల్లో ఆటో మ్యుటేషన్ విధానాన్ని తీసుకువస్తున్నారు. ఇప్పటికే పలుచోట్ల ఈ విధానం అందుబాటులోకి వచ్చింది. సర్టిఫికెట్ల జారీ సులభతరం ► ప్రజలకు అవసరమైన ముఖ్యమైన సర్టిఫికెట్ల జారీ ప్రక్రియను వైఎస్ జగన్ ప్రభుత్వం సులభతరం చేసింది. సర్టిఫికెట్లు జారీ చేయడానికి దరఖాస్తులు తీసుకునే గ్రామ, వార్డు సచివాలయం, మీసేవా కేంద్రాలు, ఆన్లైన్ వెబ్ అప్లికేషన్, కాల్ సెంటర్ వంటి వ్యవస్థలన్నింటికీ స్పష్టమైన మార్గదర్శకాలు ఇచ్చి వాటి ప్రకారమే పని చేయిస్తోంది. ► హౌస్ హోల్డ్ డేటా బేస్లో ఉన్న కుటుంబానికి వెంటనే ఫ్యామిలి మెంబర్ సర్టిఫికెట్ ఇవ్వడం, ఇంటిగ్రేటెడ్ సర్టిఫికెట్ గతంలో జారీ అయి ఉంటే ప్రస్తుత తహశీల్దార్ డిజిటల్ సంతకం, ప్రస్తుత తేదీతో మళ్లీ వెంటనే ఇవ్వడం లాంటి అనేక మార్పులు తీసుకువచ్చి అమలు చేస్తోంది. ఆస్తిని సంపదగా మార్చే ప్రక్రియ ముమ్మరం భూములకు సంబంధించి అంతర్జాతీయ సంస్థలు ఏదైతే జరగాలని చెబుతున్నారో.. అలాంటి మార్పులన్నీ ఇప్పుడు ఏపీలో జరుగుతున్నాయి. ఎక్కడైనా సరే ఆస్తిని సంపదగా మార్చుకున్న దేశాలు అభివృద్ధి చెందుతాయి. ఆస్తి సంపదగా మారాలంటే అడ్డంకులను ప్రభుత్వమే తొలగించాలి. ఆ పని ఏపీ ప్రభుత్వం చేస్తోంది. భూ హక్కులకు భద్రత కల్పించడం, సరిహద్దుల స్పష్టత, అమ్మకాలు–కొనుగోళ్లను సులభం చేయడం, ఆంక్షలను తొలగించడం, మంచి భూ పరిపాలన యంత్రాంగాన్ని తయారు చేయడం ప్రధానమైనవి. ఏపీ ప్రభుత్వం ఈ పనులన్నీ చేస్తోంది. అసైన్డ్ భూములపై ఆంక్షలు ఎత్తేయడం, చుక్కల భూములు, అనా«దీనం భూములపైనా ఆంక్షలు తొలగించడం ఇందులో భాగమే. రిజిస్ట్రేషన్ ప్రక్రియ గ్రామ స్థాయికి రావడం పెద్ద మార్పు. ఇలా ఆస్తిని సంపదగా మార్చే ప్రక్రియలో ప్రభుత్వం వేగంగా అడుగులు ముందుకు వేసింది. తద్వారా వేల కోట్ల సంపద ఆవిష్కృతమైంది. – ఎం.సునీల్కుమార్, భూ చట్టాల నిపుణుడు, నల్సార్ వర్సిటీ అసోసియేట్ ప్రొఫెసర్, హైదరాబాద్ -
అసైన్డ్ భూముల యాజమాన్య హక్కులపై భారీ కసరత్తు
సాక్షి, అమరావతి: అసైన్డ్ భూములపై యాజమాన్య హక్కులు కల్పించేందుకు ప్రభుత్వం భారీ కసరత్తు చేస్తోంది. అసైన్డ్ రైతులకు హక్కులిచ్చేందుకు అసైన్డ్ భూముల చట్టాన్ని సవరించిన ప్రభుత్వం దాన్ని అమలు చేసే దిశగా వేగంగా అడుగులేస్తోంది. అందులో భాగంగా జిల్లాల్లో అసైన్డ్ భూముల లెక్కలు తేల్చేందుకు గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు చురుగ్గా వెరిఫికేషన్ జరుగుతోంది. ఈ ఏడాది జూలై 31 నాటికి అసైన్ చేసి 20 ఏళ్లు పూర్తయిన భూముల వివరాలను వీఆర్వోలు తనిఖీ చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రాథమికంగా 27.41 లక్షల ఎకరాలపై హక్కులివ్వాలని ఇప్పటికే నిర్ణయించగా క్షేత్ర స్థాయిలో ఆ భూములను పరిశీలిస్తున్నారు. క్షేత్ర స్థాయిలో నిశిత పరిశీలన.. ప్రతి రెవెన్యూ గ్రామంలో అసైన్డ్ భూములు అసైన్దారుల చేతుల్లో ఉన్నాయా, లేదా అనే విషయాన్ని వీఆర్వోలు నిశితంగా పరిశీలిస్తున్నారు. ప్రతి సర్వే నంబర్కు సంబంధించిన పట్టాను పరిశీలించి ఆ పట్టాదారు ప్రభుత్వం భూమి కేటాయించిన వ్యక్తా లేక అతని వారసుడా? అనే విషయాన్ని నమోదు చేస్తున్నారు. సంబంధిత భూమి వారి ఆధీనంలోనే ఉందా? రెవెన్యూ రికార్డుల ప్రకారం.. ఆ భూమి లంక భూమా? లేక నీటి వనరులకు సంబంధించిన భూమా? ఆ భూమి అతనికి ప్రభుత్వం ఎప్పుడు అసైన్ చేసింది? వంటి వివరాలను సేకరిస్తున్నారు. అసైన్డ్ భూములకు సంబంధించి డీకేటీ రిజిస్టర్లు, 1బీ అడంగల్, 22ఎ జాబితా, ఇతర రెవెన్యూ రికార్డులు చూసి వాటికి తగ్గట్టు క్షేత్ర స్థాయి పరిస్థితి ఉందా లేదా?, వాస్తవ పరిస్థితి ఏమిటనే విషయాలను నమోదు చేస్తున్నారు. 4 వేల గ్రామాల్లో పూర్తి.. ఇప్పటివరకు 4 వేల గ్రామాల్లోని 8 లక్షల ఎకరాల్లో వీఆర్వోలు వెరిఫికేషన్ పూర్తి చేశారు. తహశీల్దార్లు 2,600 గ్రామాల్లో తనిఖీలు పూర్తి చేయగా, ఆర్డీవోలు వెయ్యికి పైగా గ్రామాల్లో, జేసీలు 150కిపైగా గ్రామాల్లో వెరిఫికేషన్ ముగించారు. దీంతో తనిఖీలు పూర్తయిన గ్రామాల్లో తహశీల్దార్లు అసైన్డ్ భూముల జాబితాలను తయారు చేస్తున్నారు. వీఆర్వోలు, తహశీల్దార్ల స్థాయిలో జరిగిన వెరిఫికేషన్ను ఆర్డీవోలు, సబ్ కలెక్టర్లు పరిశీలిస్తున్నారు. ఈ నెలాఖరు నాటికి వెరిఫికేషన్ను పూర్తి చేసి రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామాల్లో అసైన్డ్ భూముల జాబితాలను తయారు చేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్నారు. ఇవన్నీ తయారైన తర్వాత వచ్చే నెలలో పూర్తి స్థాయిలో తనిఖీ చేసి జిల్లా కలెక్టర్లకు పంపనున్నారు. వారి నుంచి జిల్లా రిజిస్ట్రార్లకు 22(ఎ) నిషేధిత ఆస్తుల జాబితా నుంచి తొలగించాల్సిన భూముల జాబితాను పంపడానికి కసరత్తు జరుగుతోంది. -
అమరావతి అసైన్డ్ భూముల కుంభకోణంలో సీఐడీ కేసు కొట్టేయాలంటూ నారాయణ పిటిషన్
-
October 1st, 2023: చంద్రబాబు కేసు అప్డేట్స్
Updates.. 7:45 PM పవన్ వారాహి యాత్రకు అంబటి కౌంటర్ 1+1 = 2 గణితంలో... కొన్నిసార్లు రాజకీయాలలో 1+1 = 0 అవుతుందని ఫ్లాప్ అయిన అవనిగడ్డ "వరాహగళం" నిరూపించింది ! @PawanKalyan@JaiTDP @naralokesh @JanaSenaParty — Ambati Rambabu (@AmbatiRambabu) October 1, 2023 వారాహి యాత్ర +యువగళం = వరాహగళం @naralokesh @PawanKalyan — Ambati Rambabu (@AmbatiRambabu) October 1, 2023 7:30 PM లోకేష్, అచ్చెన్నాయుడు, యనమలకు విజయసాయిరెడ్డి కౌంటర్ ప్రజాధనం దోచుకుని అడ్డంగా దొరికిన చంద్రబాబు గారు అరెస్టయితే, సామాన్యులను డబ్బుకు ప్రలోభపెట్టి గుండు గీయించడం ఇంకా పెద్ద నేరం అవుతుంది. జుట్టు అనేది ఓ వ్యక్తి ఆత్మగౌరవానికి సంబంధించినది. అంతగా నిరసన తెలపాలనుకుంటే లోకేశ్, అచ్చెన్న, యనమలలాంటి ‘ఉద్ధండులు’ కేశ సమర్పణ చేసి యజమానిపై… — Vijayasai Reddy V (@VSReddy_MP) October 1, 2023 5:40 PM ఆశలన్నీ అక్టోబర్ 3 మీదే.. ►అక్టోబర్ మూడో తేదీపై టీడీపీ కోటీ ఆశలు ►సుప్రీంకోర్టులో కేసు నెగ్గేందుకు దారులపై సీనియర్ నేతలతో సమాలోచనలు ► సాంకేతిక కారణాలు తప్ప బలమైన గ్రౌండ్ చంద్రబాబుకు ఈ కేసులో లేవంటున్న లాయర్లు ►గవర్నర్ అనుమతి తీసుకోలేదని బలంగా వాదించాలని సూచన 5:30 PM రంగంలోకి బీజేపీలోని టీడీపీ లీడర్లు.. ►జైలులో ఉన్న చంద్రబాబు కోసం రంగంలోకి బీజేపీలోని టీడీపీ లీడర్లు ►చంద్రబాబును రక్షించేందుకు ఏం చేయాలో సమాలోచనలు ►భువనేశ్వరి, బ్రాహ్మణిలను కలిసిన సీఎం రమేష్ ►రాజమండ్రిలో చంద్రబాబు కుటుంబ సభ్యులను పరామర్శించిన సీఎం రమేష్ ►బీజేపీ పెద్దలతో ఎలాగైనా అపాయింట్మెంట్ ఇప్పించాలని సూచన ►ఢిల్లీలో ప్రయత్నాలు ముమ్మరం చేయాలని ఆదేశాలు 2:30 PM శంషాబాద్లో టీటీడీపీ శ్రేణుల ఓవరాక్షన్.. ►శంషాబాద్ ఎయిర్ పోర్టులో టీటీడీపీ శ్రేణుల ఓవర్యాక్షన్ ►చంద్రబాబు అరెస్టును వ్యతిరేకిస్తూ ప్రధాని వచ్చే సమయంలో ఎయిర్ పోర్టులో నిరసన ►ఢిల్లీ నుంచి హైదరాబాద్కు ప్రధాని మోదీ ►చంద్రబాబును ప్రధాని మోదీ కాపాడాలంటూ బ్యానర్ ప్రదర్శించిన మాజీ ఎమ్మెల్యే కాట్రగడ్డ ప్రసూన ►చంద్రబాబు అరెస్టుపై ప్రధాని స్పందించాలని విజ్ఞప్తి 12:50PM ప్రగల్భాలు పలికేవాళ్లంతా ఆత్మావలోకనం చేసుకోండి: పేర్ని నాని ►చంద్రబాబు వ్యవహారం చూస్తుంటే ఎన్ని కన్నీళ్ల ఉసురు ఇదీ.. నీడల్లే వెంటాడుతోందీ.. అనే పాట గుర్తొస్తోంది ►కాపులకు రిజర్వేషన్ అమలు చేస్తానని ఓట్లేయించుకుని తర్వాత మోసం చేశారు ►ముద్రగడ పద్మనాభం పిలుపుతో అప్పట్లో ఉద్యమం చేశారు ►కానీ నిన్నటి చంద్రబాబు ఉద్యమంలో అందరూ నవ్వుకుంటూ విజిల్స్ వేశారు ►అంటే చంద్రబాబు జైలుకు పోవటంపై ఆ పార్టీ వారికి కించిత్ కూడా బాధ లేదు ►చంద్రబాబు మీద అక్రమ కేసులు పెడితే కోర్టులు ఎందుకు జైలుకు పంపుతాయి? ►ప్రజాసొమ్ము కైంకర్యం చేయకపోతే కోర్టులు ఎందుకు వదిలేయలేదు? ►లంచాలు తిని కంచాలు మోగించటం చూస్తుంటే.. తినమరిగిన కోడి ఇల్లెక్కి కూసినట్టుంది ►టీడీపీకి కోటిమంది సభ్యత్వం ఉన్నట్టు చెప్పుకునేవారు ►మరి నిన్న ఎంతమంది గంట కొట్టారు? ►అంటే వారందరు కూడా చంద్రబాబు అవినీతి చేసినట్టు అనుకుంటున్నారు ►ఇప్పటికైనా ప్రగల్భాలు పలికేవాళ్లంతా ఆత్మావలోకనం చేసుకోవాలి ►ప్రత్యేక హోదా కోసం పోరాటం చేస్తే జైల్లో వేస్తాం అని అప్పట్లో చంద్రబాబు అన్నారు 12:24PM చంద్రబాబు లాయర్ సిద్ధార్ధ లూథ్రా ట్వీట్ నిర్వేదం ►ఇప్పటి వరకూ బాబు కేసులో లూథ్రాకు దొరకని బలమైన వాదం ►ఎంత సేపు సెక్షన్ 17a తప్ప మరో వాదన లేదు ►గవర్నర్ అనుమతి అడగలేదని అంటున్నారు, కాని తప్పు చేయలేదని లూథ్రా చెప్పలేకపోతున్నారు ►జడ్జిలు త్వరగా తీర్పులు ఇవ్వడం ముఖ్యమన్న లూథ్రా ►ఓ కేసు విషయాన్ని ప్రస్తావించిన సిద్ధార్ధ లూథ్రా Our Indian SC has in its judgement in Balaji Baliram Mupade [29.10.2020] written of the need for judicial discipline requires promptness in delivery of judgements https://t.co/etrm1sXw7s — Sidharth Luthra (@Luthra_Sidharth) October 1, 2023 11:50AM ►చంద్రబాబుకు పవన్ కొమ్ముకాయడం విడ్డూరం: ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి ►చంద్రబాబు నాయుడుకి జైల్లో దోమలు కుడుతున్నాయి అనడం హాస్యాస్పదం ►ప్రజల సొమ్ము 375 కోట్లు స్వయానా చంద్రబాబు నాయుడు ఖాతాల్లోకి స్కిల్ డెవలప్మెంట్ పేరుతో వెళ్ళాయన్న వాస్తవం సిఐడి స్పష్టం చేసింది ►దత్త పుత్రుడు పవన్ కళ్యాణ్ వాళ్ళ అమ్మను అవమానించిన ,అన్నని అవమానపాలు చేసిన చంద్రబాబు కోమ్ము కాయటం విడ్డూరం ►చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయిన రోజు ఎన్టీఆర్ దంపతులు స్వర్గంలో ఆనంద భాష్పాలు రాల్చుంటారు. 10:45AM జైలు జీవితానికి అలవాటు పడిన చంద్రబాబు ►ఉదయం న్యూస్ పేపర్ లతో కాలక్షేపము ►5 చానెల్ తో regular గా tv చూస్తున్న బాబు ►రాజమండ్రి జైల్లో 22వ రోజు రిమాండ్ ఖైదీగా కొనసాగుతున్న చంద్రబాబు ►చంద్రబాబుకు పూర్తి స్థాయిలో భద్రత కల్పిస్తున్న జైలు వర్గాలు ►ఎప్పటికప్పుడు ఇంటి నుంచి బోజనము ►వేడి నీళ్లు స్నానం ►ప్రతీ వారం ములాఖత్ 10:31AM సానుభూతి కోసం టిడిపి అష్ట కష్టాలు ►ఏపీ వ్యాప్తంగా నారా భువనేశ్వరి బస్సు యాత్ర? ►ఈ నెల మొదటి వారంలో ప్రారంభిస్తారని సమాచారం ►అన్ని జిల్లాలను కవర్ చేసేలా భువనేశ్వరి బస్సు యాత్ర ►టీడీపీ శ్రేణుల్లో మనోధైర్యం నింపేలా భువనేశ్వరి యాత్ర 9:24AM విద్యార్థుల తల్లిదండ్రుల రక్తం పీల్చే దుర్మార్గుడు నారాయణ: ఎమ్మెల్యే అనిల్ ►సీఐడీ తనను కూడా అరెస్ట్ చేయబోతోందని మాజీ మంత్రి నారాయణ కి తెలుసు. ►చంద్రబాబు, నారాయణ విచారణకు సహజరించకుడదని మాట్లాడుకునేందుకు జైలులో బాబుకు కలిసారు ►స్టూడెంట్స్ తల్లిదండ్రుల రక్తం పీల్చుకునే దుర్మార్గుడు నారాయణ ►రూ. 800 కోట్ల విలువ చేసే పేదల భూములను కొట్టేసిన నువ్వు సత్య హరిచంద్రుడి వా..? ►నారాయణ, చంద్రబాబు చరిత్ర ఏంటో రాష్ట్ర ప్రజలకు తెలుసు.. ►టిడిపి నేతలు గంటలు కొట్టడం దేవుడి స్క్రిప్ట్.. ముద్రగడ కి చేసిన అన్యాయం గుర్తు వచ్చింది ►చంద్రబాబు చేసిన ద్రోహం టిడిపి నేతలకు కూడా కనిపిస్తుంది ►రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మాత్రమే మనస్ఫూర్తిగా బాధపడుతూ ఉన్నారు. ►ముద్రగడను , ఆయన కుటుంబ సభ్యులను చిత్ర హింసలు పెట్టి. ఇబ్బందులు పెట్టిన విషయం టిడిపి నేతలకు గుర్తు లేదా..? ►లోకేష్ ఒక పులికేశి.. ఢిల్లీలో లాయర్స్ తో మాట్లాడుతూ ఉన్నాడని టిడిపి నేతలు బిల్డప్ ఇస్తున్నారు ►సీఐడీ అధికారులకు దొరక్కుండా లోకేష్ దొంగలగా తప్పించుకుని తిరుగుతూ ఉంటే.. నిన్న అధికారులు పట్టుకుని నోటీస్ లు ఇచ్చారు.. 9.05AM పవన్ కళ్యాణ్ వారాహి యాత్రపై నారా లోకేశ్ ట్వీట్ ►4వ విడత వారాహి యాత్ర సక్సెస్ కావాలి.. జనసేనకు జైకొట్టాలి ►అవనిగడ్డలో జరగబోయే వారాహి యాత్ర బహిరంగ సభ విజయవంతం చేసేందుకు జనసేనతో కలిసి నడవాలని టీడీపీ శ్రేణులను కోరుతున్నా రేపటి నుంచి ప్రారంభం అయ్యే జనసేన అధ్యక్షుడు @PawanKalyan గారి నాలుగో విడత వారాహి యాత్ర విజయవంతం కావాలని ఆకాంక్షిస్తున్నాను. అవనిగడ్డలో జరగబోయే వారాహి బహిరంగ సభకి సైకో జగన్ సర్కార్ అడ్డంకులు కల్పించే అవకాశాలు ఉన్నాయి. వారాహి యాత్ర విజయవంతం చేసేందుకు తెలుగుదేశం శ్రేణులు జనసేనతో… — Lokesh Nara (@naralokesh) September 30, 2023 8:29AM తిరుమలలో టీడీపీ పచ్చ రాజకీయాలు. ►ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రంలో టీడీపీ కార్యకర్తల ఓవరాక్షన్ ►స్కామ్ లో అరెస్టయిన చంద్రబాబుకు మద్దతు అంటూ నిరసనలు ►టీడీపీ జెండాలతో శ్రీవారి ఆలయం వద్ద రాజకీయం ►తిరుమలలో స్టీల్ గ్లాసులతో చప్పుడు చేస్తూ వీడియో రికార్డింగ్ ►సోషల్ మీడియాలో అప్ లోడ్ చేసేందుకు ప్రయత్నం ►టీడీపీ తీరుపై మండిపడుతున్న హైందవ సంఘాలు, భక్తులు ►టీడీపీకి గుణపాఠం చెప్తామంటున్న శ్రీవారి భక్తులు 7:50AM చంద్రబాబు క్వాష్ పిటిషన్పై 3న సుప్రీంకోర్టులో విచారణ ►స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం కేసులో ఎఫ్ఐఆర్ క్వాష్ చేయాలంటూ టీడీపీ అధినేత చంద్రబాబు సుప్రీం కోర్టులో క్రిమినల్ ఎస్ఎల్పీ దాఖలు ►3వ తేదీన విచారణ చేపట్టనున్న జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బేలా ఎం త్రివేదిలతో కూడిన ధర్మాసనం ►ఈ ధర్మాసనం ముందు ఆఖరి ఐటెం నంబర్ 63గా రిజిస్ట్రీ వెబ్సైట్లో పొందుపరిచారు ►గత విచారణ సందర్భంగా చంద్రబాబు పిటిషన్ విచారణకు జస్టిస్ ఎస్వీఎన్ భట్టి నిరాకరించిన విషయం విదితమే. ►దీంతో ఈ పిటిషన్ జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బేలా ఎం త్రివేది ధర్మాసనం వద్దకు విచారణకు వచ్చింది. 7:30AM 4న ఓటుకు కోట్లు కేసు విచారణ ►తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఓటుకు కోట్లు కేసును ఈ నెల 4న విచారణ చేపట్టనున్న సుప్రీంకోర్టు. ►తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీకి అనుకూలంగా ఓటు వేయాలని ఎమ్మెల్సీ స్టీఫెన్సన్ను ప్రలోభాలకు గురిచేసిన విషయం విదితమే. ►ఈ కేసులో టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడిని ముద్దాయిగా చేర్చాలని ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి న్యాయపోరాటం ►ఇందులో భాగంగా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు ►ఈ పిటిషన్ను 4వ తేదీ నవిచారణ చేపట్టనున్న జస్టిస్ ఎంఎం సుందరేశ్, జస్టిస్ సంజయ్కుమార్లతో కూడిన ధర్మాసనం బాబు మాజీ పీఎస్ ‘పెండ్యాల’ సస్పెన్షన్ ►మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మాజీ పీఎస్ పెండ్యాల శ్రీనివాసరావుపై సస్పెన్షన్ వేటు. ►ఈయన ప్రస్తుతం ప్రణాళికా శాఖలో అసిస్టెంట్ సెక్రటరీగా పనిచేస్తున్నారు. ►స్కిల్ కుంభకోణం కేసుతో పాటు ఐటీ నోటీసుల్లో పెండ్యాల శ్రీనివాసరావు పేరు ఉంది. ►విచారణ నిమిత్తం సీఐడీ గతంలో ఆయనకు నోటీసులు కూడా జారీ ►అయితే, ప్రభుత్వానికి సమాచారం ఇవ్వకుండా అమెరికాకు పారిపోయిన పెండ్యాల. ప్రభుత్వం అనుమతిలేకుండా అమెరికాకు వెళ్లడం సర్వీస్ రూల్స్ను అతిక్రమించడం కిందకు వస్తుంది. ►మరోవైపు.. శ్రీనివాసరావు శుక్రవారంలోగా రాష్ట్రానికి తిరిగి రావాల్సిందిగా నోటీసు పంపిన ప్రభుత్వం. ►అయితే, ఆయన రాకపోవడంతో సర్వీసు నిబంధనల మేరకు ఆయనను సస్పెండ్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ 2న భువనేశ్వరి నిరాహారదీక్ష ►నంద్యాల: చంద్రబాబు అరెస్టుకు నిరసనగా అక్టోబర్ 2వ తేదీన ఆయన సతీమణి భువనేశ్వరి ఒక్క రోజు నిరాహారదీక్ష ►టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు స్పష్టీకరణ 7:00AM అమరావతిలో అసైన్డ్ భూముల కుంభకోణం కేసు ► అసైన్డ్ భూములు హస్తగతం చేసుకునేందుకు వెచ్చించిన నల్లధనం గుట్టు రట్టు ►నారా , నారాయణ నల్లధనం నెట్వర్క్ బట్టబయలు ►అమరావతిలోని బడుగు, బలహీనవర్గాల అసైన్డ్ రైతులను బెదిరించి భూములు కొట్టేశారు ►ఎన్స్పైర నుంచి ఆర్కే హౌసింగ్కు నిధుల బదిలీ.. అక్కడి నుంచి బినామీలకు నగదు ►అసైన్డ్ రైతుల భూముల లూటీ ►తమ బినామీలకే భూసమీకరణ ప్యాకేజీ స్థలాలు దక్కేలా వ్యూహం ►అవినీతి నెట్వర్క్ను బట్టబయలు చేసిన సిట్ దర్యాప్తు ►పచ్చగద్దల జాబితాలో గంటా, ప్రత్తిపాటి, దేవినేని ఉమా, రావెల తదితరులు ►ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీవీ వియ్యంకుడు కూడా ►రూ.16 కోట్లతో.. రూ. 816 కోట్లు కొట్టేసిన నారాయణ 6:40AM అసైన్డ్ భూములను బినామీల ద్వారా కొల్లగొట్టిన టీడీపీ పెద్దలు ♦నారా చంద్రబాబునాయుడు (టీడీపీ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి) ♦ నారా లోకేశ్ (టీడీపీ ప్రభుత్వంలో మంత్రి) ♦ పొంగూరు నారాయణ (టీడీపీ ప్రభుత్వంలో మంత్రి) ♦ గంటా శ్రీనివాసరావు (టీడీపీ ప్రభుత్వంలో మంత్రి) ♦ దేవినేని ఉమామహేశ్వరరావు (టీడీపీ ప్రభుత్వంలో మంత్రి) ♦ ప్రత్తిపాటి పుల్లారావు (టీడీపీ ప్రభుత్వంలో మంత్రి) ♦ రావెల కిశోర్ బాబు (టీడీపీ ప్రభుత్వంలో మంత్రి) ♦ తెనాలి శ్రావణ్ కుమార్ (టీడీపీ మాజీ ఎమ్మెల్యే) ♦ గుమ్మడి సురేశ్ (టీడీపీ ప్రభుత్వంలో ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు వియ్యంకుడు) ♦ మండల ఎస్.ఎస్.కోటేశ్వరరావు (రియల్టర్) ♦ మండల రాజేంద్ర (రియల్టర్) ♦ కేవీపీ అంజనీ కుమార్ (రియల్టర్) ♦ దేవినేని రమేశ్ (రియల్టర్) ♦ బొబ్బ హరిశ్చంద్ర ప్రసాద్ (రియల్టర్) ♦ హరేంద్రనాథ్ చౌదరి (రియల్టర్) ♦ పొట్లూరి సాయిబాబు (సిటీ కేబుల్) ♦ దోనేపూడి దుర్గా ప్రసాద్ (రియల్టర్) 6:35AM నారా లోకేష్కు సీఐడీ నోటీసులు ♦ఇన్నర్ రింగ్రోడ్ అలైన్మెంట్ స్కామ్లో 41ఏ కింద నారా లోకేష్కు నోటీసులు ♦ఈ కేసులో ఏ14గా లోకేశ్ ♦ఢిల్లీలో ఎంపీ జయదేవ్ ఇంట్లో అందజేసిన అధికారులు ♦4వ తేదీన తాడేపల్లి కార్యాలయంలో హాజరు కావాలి ♦హెరిటేజ్ ఫుడ్స్ బ్యాంకు ఖాతా, భూలావాదేవీల బోర్డు మినిట్స్ తేవాలి ♦విచారణకు సహకరించాలి.. నిబంధనలు పాటించకుంటే అరెస్టు తప్పదు ♦నోటీసుల్లో పేర్కొన్న దర్యాప్తు అధికారులు -
అసైన్డ్ భూములు కొట్టేసేందుకు.. ‘నల్ల’మార్గం
సాక్షి, అమరావతి: అమరావతిలో అసైన్డ్ భూముల కుంభకోణం కేసు తీగ లాగితే నారా, నారాయణ నల్లధనం నెట్వర్క్ బట్టబయలైంది. అమరావతిలోని బడుగు, బలహీనవర్గాల అసైన్డ్ రైతులను బెదిరించి వారి భూములు కొల్లగొట్టడం కోసం నల్లధనం తరలించేందుకు చంద్రబాబు ముఠా పన్నిన పన్నాగం బయటపడింది. బంధువులు, బినామీలు, సన్నిహితులు, తమ ఉద్యోగుల పేరిట అసైన్డ్ భూములు హస్తగతం చేసుకునేందుకు వెచ్చించిన నల్లధనం గుట్టు రట్టయింది. అమరావతిలో అసైన్డ్ భూముల కుంభకోణం కేసు దర్యాప్తు చేస్తున్న సీఐడీ ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) ఆ నల్లధనం నెట్వర్క్ను ఛేదించింది. అసైన్డ్ భూముల జాబితాలోని కేటగిరీ 1 నుంచి 4 వరకు ఉన్న 617.65 ఎకరాలను కొట్టేసేందుకు ఏర్పాటు చేసుకున్న ‘నల్ల’మార్గాన్ని ఆధారాలతోసహా బట్టబయలు చేసింది. బినామీల పేరిట అసైన్డ్ భూములు కొల్లగొట్టిన ముఠా జాబితా తవ్వుతుంటే.. చంద్రబాబు, లోకేశ్, నారాయణ, గంటా, ప్రత్తిపాటి, దేవినేని ఉమా ఇలా టీడీపీ పెద్దల పేర్లు బయటపడుతున్నాయి. నల్లధనం కోసం కంపెనీ ఏర్పాటు నారాయణ విద్యా సంస్థలకు మౌలిక వసతుల కల్పన, ఉద్యోగుల జీతాల చెల్లింపు కోసమని ‘ఎన్స్పైర మేనేజ్మెంట్ సర్వీసెస్’ అనే కంపెనీని ఏర్పాటు చేశారు. అసైన్డ్ భూములు కొల్లగొట్టడం కోసమే నారాయణ కుమార్తె సింధూర, అల్లుడు పునీత్ డైరెక్టర్లుగా ఎన్స్పైర కంపెనీని నెలకొల్పారు. నారాయణ విద్యా సంస్థలకు అన్ని రకాల చెల్లింపులు నిర్వహిస్తున్నందుకు ఎన్స్పైరకు 10 శాతం కమిషన్ చెల్లిస్తున్నట్లు రికార్డుల్లో చూపారు. ఇదే అవకాశంగా ఎన్స్పైరలోకి ఇతర సంస్థల నుంచి భారీగా నిధులు మళ్లించారు. ఎన్స్పైరలో ఇతర కంపెనీలు భారీగా పెట్టుబడులు పెట్టినట్లు చూపడం గమనార్హం. ఒలంపస్ క్యాపిటల్ ఏషియా క్రెడిట్ అండ్ సీఎక్స్ పార్టనర్స్ మ్యాగజైన్ అనే కంపెనీ 2016లో ఏకంగా రూ. 400 కోట్లు పెట్టుబడి పెట్టినట్టు చూపించారు. ఇక 2018లో మోర్గాన్ స్టాన్లీ ప్రైవేట్ ఈక్విటీ ఏషియా, బన్యాన్ ట్రీ గ్రోత్ క్యాపిటల్ అనే సంస్థలు 75 మిలియన్ డాలర్లు (రూ. 613.27 కోట్లు) పెట్టుబడి పెట్టినట్టు రికార్డుల్లో చూపారు. దీంతో రెండు విడతల్లో ఎన్స్పైర కంపెనీలోకి రూ.1,013.27 కోట్లు వచ్చి చేరాయి. ఇలా భారీగా నల్లధనాన్ని ఎన్స్పైరలోకి మళ్లించినట్లు తెలుస్తోంది. ఎన్స్పైర టు రామకృష్ణ హౌసింగ్ నారాయణ సమీప బంధువు కేవీపీ అంజని కుమార్ రంగంలోకి వచ్చారు. ఆయన మేనేజింగ్ డైరెక్టర్గా ఉన్న రామకృష్ణ హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ను నల్లధనం తరలింపునకు మార్గంగా చేసుకున్నారు. అక్రమ నిధులను ఎన్స్పైర నుంచి రామకృష్ణ హౌసింగ్ కార్పొరేషన్ బ్యాంకు ఖాతాల్లోకి బదిలీ చేశారు. అప్పటికే నారాయణ విద్యా సంస్థల సిబ్బంది, మరికొందరిని తమ బినామీలుగా ఎంపిక చేసుకున్నారు. రామకృష్ణ హౌసింగ్ బ్యాంకు ఖాతాల నుంచి ఆ బినామీల వ్యక్తిగత బ్యాంకు ఖాతాల్లోకి నిధులను మళ్లించారు. వారు ఆ నగదు డ్రా చేసుకున్నారు. ప్రభుత్వం ఎలాంటి పరిహారం ఇవ్వకుండా అసైన్డ్ భూములను తీసుకుంటుందని బడుగు, బలహీనవర్గాల రైతులను అప్పటికే భయపెట్టారు. తద్వారా ఆ రైతుల అసైన్డ్ భూములను తమ బినామీలైన ఉద్యోగులు, ఇతరులకు అతి తక్కువకు విక్రయించేలా కథ నడిపించారు. నిబంధనలకు విరుద్ధంగా అసైన్డ్ భూములు తమ బినామీల ద్వారా హస్తగతం చేసుకున్నారు. తర్వాత బినామీలే సీఆర్డీఏకు ఆ భూములను ఇచ్చినట్టు చూపించి వారికే భూసమీకరణ ప్యాకేజీ వచ్చేలా చేశారు. ఆ విధంగా 617.65 ఎకరాలకు గాను రూ. 3,737 కోట్ల విలువైన భూసమీకరణ ప్యాకేజీ స్థలాలను పొందారు. జీపీఏ, సేల్డీడ్ల ద్వారా హస్తగతం కేటగిరీ 1 నుంచి 4 వరకు 617.65 ఎకరాలకు సంబంధించి రెవెన్యూ రికార్డుల్లో ఉన్న అసైన్డ్ రైతుల జాబితా, సీఆర్డీఏ రికార్డుల్లో ఉన్న రైతుల పేర్లను పరిశీలిస్తే అక్రమాల బాగోతం బయటపడుతోంది. ఈ జాబితాలో చంద్రబాబు, నారాయణ, గంటా శ్రీనివాసరావు, వారి సన్నిహితులు, బంధువులు, బినామీలే బయటపడుతున్నారు. అమరావతి పరిధిలోని అనంతవరం, కృష్ణాయపాలెం, కురగల్లు, లింగాయపాలెం, మందడం, నెక్కల్లు, నవులూరు, రాయపూడి, తుళ్లూరు, ఉద్దండరాయునిపాలెం, వెంకటపాలెం, బోరుపాలెం, నేలపాడు తదితర గ్రామాల్లోని ఎస్సీ, ఎస్టీ, బీసీ రైతులకు చెందిన 617.65 ఎకరాల అసైన్డ్ భూములను జీపీఏ, సేల్ డీడ్లు ద్వారా హస్తగతం చేసుకున్నట్లు దర్యాప్తులో వెల్లడైంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ రైతుల నుంచి అసైన్డ్ భూములను బినామీల ద్వారా కొల్లగొట్టిన టీడీపీ పెద్దలు ♦ నారా చంద్రబాబునాయుడు (టీడీపీ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి) ♦ నారా లోకేశ్ (టీడీపీ ప్రభుత్వంలో మంత్రి) ♦ పొంగూరు నారాయణ (టీడీపీ ప్రభుత్వంలో మంత్రి) ♦ గంటా శ్రీనివాసరావు (టీడీపీ ప్రభుత్వంలో మంత్రి) ♦ దేవినేని ఉమామహేశ్వరరావు (టీడీపీ ప్రభుత్వంలో మంత్రి) ♦ ప్రత్తిపాటి పుల్లారావు (టీడీపీ ప్రభుత్వంలో మంత్రి) ♦ రావెల కిశోర్ బాబు (టీడీపీ ప్రభుత్వంలో మంత్రి) ♦ తెనాలి శ్రావణ్ కుమార్ (టీడీపీ మాజీ ఎమ్మెల్యే) ♦ గుమ్మడి సురేశ్ (టీడీపీ ప్రభుత్వంలో ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు వియ్యంకుడు) ♦ మండల ఎస్.ఎస్.కోటేశ్వరరావు (రియల్టర్) ♦ మండల రాజేంద్ర (రియల్టర్) ♦ కేవీపీ అంజనీ కుమార్ (రియల్టర్) ♦ దేవినేని రమేశ్ (రియల్టర్) ♦ బొబ్బ హరిశ్చంద్ర ప్రసాద్ (రియల్టర్) ♦ హరేంద్రనాథ్ చౌదరి (రియల్టర్) ♦ పొట్లూరి సాయిబాబు (సిటీ కేబుల్) ♦ దోనేపూడి దుర్గా ప్రసాద్ (రియల్టర్) రూ.16 కోట్లతో.. రూ. 816 కోట్లు కొట్టేసిన నారాయణ రాజధానిలో నారాయణ బంధువులు, బినామీల పేరిట 148 ఎకరాలు ఉన్నట్టుగా సిట్ దర్యాప్తులో వెల్లడైంది. అందుకోసం నారాయణ రూ.16.50 కోట్లను అక్రమంగా తరలించారు. అందుకు ప్రతిగా 148 ఎకరాలను పొందారు. ఆ 148 ఎకరాలకు సీఆర్డీఏ భూసమీకరణ కింద ఇచ్చింది రూ.816 కోట్లు విలువైన స్థలాల ప్యాకేజీ. ఆ భూములకు పదేళ్లపాటు కౌలు కూడా పొందగలుగుతారు. బినామీ రైతులకు సీఆర్డీఏ ఇప్పటికే చెల్లించిన కౌలు మొత్తం రూ. 50 లక్షలు మళ్లీ రామకృష్ణ హౌసింగ్ బ్యాంకు ఖాతాలో జమ చేశారు. అక్కడ నుంచి ఆ మొత్తాన్ని మళ్లీ నారాయణ విద్యా సంస్థల బ్యాంకు ఖాతాల్లోకి బదిలీ చేయడం గమనార్హం. అంటే అసైన్డ్ భూములు దక్కించుకుంది నారాయణే అన్నది స్పష్టమైంది. అదే రీతిలో చంద్రబాబు, గంటా, ప్రత్తిపాటి, దేవినేని ఉమా, ఇతర టీడీపీ పెద్దలు, వారి బంధువులు బినామీల ద్వారా 617 ఎకరాల్లో ఎంత భారీ దోపిడీకి పాల్పడ్డారో స్పష్టమవుతుంది. -
పేదలను బెదిరించారు..‘అసైన్డ్’ కాజేశారు
(వడ్డాది శ్రీనివాస్/సాక్షి, అమరావతి): టీడీపీ ప్రభుత్వ హయాంలో రాజధాని అమరావతి ముసుగులో చంద్రబాబు బరితెగించి పాల్పడిన భారీ భూదోపిడీ బండారం బట్టబయలైంది. గతంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, పేద రైతులకు కేటాయించిన అసైన్డ్ భూములను కొల్లగొట్టేందుకు పక్కాగా అమలుచేసిన కుతంత్రం ఆధారాలతో సహా నిగ్గుతేలింది. ఏకంగా రూ.3,737.30 కోట్ల విలువైన 617.70 ఎకరాల అసైన్డ్ భూదోపిడీ విస్మయపరుస్తోంది. ఈ భూములకు పరిహారం ఇవ్వబోమని అప్పట్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ రైతులను బెదిరించి వారి భూములను చంద్రబాబు, నారాయణ, తదితర టీడీపీపెద్దలు 814 మంది బినామీల ముసుగులో హస్తగతం చేసుకుని దేశ చరిత్రలోనే అత్యంత భారీ అసైన్డ్ భూకుంభకోణానికి తెగబడ్డారు. అనంతరం.. అసైన్డ్ భూములకు ప్యాకేజీ ప్రకటించి వారి కుతంత్రాన్ని చాటుకున్నారు. ఈ భూములను అన్యాక్రాంతం చేయడానికిగానీ దాన్ని అధికారికంగా గుర్తించడానికిగానీ వీల్లేదన్న ఉన్నతాధికారుల లిఖితపూర్వక అభ్యంతరాలను వారు బేఖాతరు చేశారు. పైగా.. రెవెన్యూ కార్యాలయాల్లో అసైన్డ్ భూముల రికార్డులను గల్లంతు చేసేసి.. అసలు 1954 నుంచి 2014 వరకు అమరావతి పరిధిలో పేదలకు భూ పంపిణీనే చేయలేదని ఏకంగా న్యాయస్థానాన్ని మోసంచేసిన తీరు వ్యవస్థలను మోసం చేయడంలో చంద్రబాబు తెగింపునకు అద్దంపడుతోంది. కానీ, ఇప్పుడు వీరి పాపం పండింది.. కథ అడ్డం తిరిగింది. చంద్రబాబు, నారాయణ, లోకేశ్ల కథ, స్క్రీన్ప్లే, దర్శకత్వంలో సాగిన ఈ అసైన్డ్ భూదోపిడీ ఆధారాలతో సహా బట్టబయలైంది. 1954 తరువాత పంపిణీ చేసిన అసైన్డ్ భూముల పంపిణీ రికార్డులు కూడా వెలుగులోకి రావడంతో పచ్చముఠా పన్నాగం బెడిసికొట్టినట్లయింది. అందుకు సంబంధించిన కీలక ఆధారాలు ‘సాక్షి’ సేకరించింది. పచ్చ గద్దల అసైన్డ్ భూదోపిడీపై ‘సాక్షి’ అందిస్తున్న ప్రత్యేక కథనాల్లో మొదటి భాగం ఇది.. జీఓ–1తో భయపెట్టి.. జీఓ–41తో దోపిడీ 2014లో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రాజధాని పేరిట భారీ భూదోపిడీకి చంద్రబాబు స్కెచ్ వేశారు. అసైన్డ్ భూములను కొల్లగొట్టేందుకు దేశ చరిత్రలో ఏ పాలకుడు కూడా పాల్పడని దారుణానికి తెగించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, పేద రైతులను బెదిరించి మరీ వారి అసైన్డ్ భూములను చేజిక్కించుకున్నారు. అందుకోసం పక్కా పన్నాగంతో రాజధాని కోసం భూసమీకరణ ప్యాకేజీని నిర్ణయిస్తూ 2015, జనవరి 1న జారీచేసిన జీఓ నంబరు 1ను జారీచేశారు. ఆ జీఓలో అమరావతిలోని ప్రైవేటు భూములకు మాత్రమే భూసమీకరణ ప్యాకేజీ ప్రకటించారు. అసైన్డ్ భూములకు ప్రకటించలేదు. అనంతరం.. చంద్రబాబు, నారాయణ తమ బినామీలు, ఏజెంట్లను అమరావతి గ్రామాల్లోకి పంపి ప్రభుత్వం అసైన్డ్ భూములను ఎలాంటి ప్యాకేజీ ఇవ్వకుండా ఉచితంగా తీసుకుంటుందని ఎస్సీ, ఎస్టీ, బీసీ, పేద రైతులను భయపెట్టారు. కాబట్టి తమకు ఆ భూములు విక్రయిస్తే ఎంతోకొంతైనా డబ్బులు వస్తాయని మభ్యపెట్టారు. అందుకోసం ఆర్కే హౌసింగ్ ప్రైవేటు లిమిటెడ్ సంస్థతోపాటు తమ బినామీలైన రియల్ ఎస్టేట్ వ్యాపారులు, వారి ఏజెంట్లను గ్రామాల్లోకి పంపించి దుష్ప్రచారం చేయించారు. దీంతో తీవ్ర ఆందోళన చెందిన పేద రైతులు అత్యంత తక్కువ ధరకు అంటే ఎకరాకు కేవలం రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షలకే చంద్రబాబు, నారాయణ, ఇతర టీడీపీ పెద్దల బినామీలకు సేల్డీడ్ల ద్వారా తమ అసైన్డ్ భూములను విక్రయించారు. అలా.. ఆ ముఠా ఏడాదిపాటు తమ పన్నాగాన్ని పక్కగా అమలుచేసి అసైన్డ్ భూములన్నింటినీ తమ బినామీల పరం చేశారు. ఆ తరువాత చంద్రబాబు అసలు కుట్రను తెరపైకి తెచ్చారు. అసైన్డ్ భూములకు కూడా ఆరు కేటగిరీల కింద విభజించి 2016, ఫిబ్రవరి 17న జీఓ నంబరు 41 ద్వారా భూసమీకరణ ప్యాకేజీ ప్రకటించారు. అంటే.. అప్పటికే అసైన్డ్ భూములు చంద్రబాబు, నారాయణ బినామీల పేరిట ఉండటంతో వారికే భూసమీకరణ ప్యాకేజీ దక్కేలా చూసుకున్నారు. ఎంతగా అంటే.. ఎకరాలోపు ఉన్న భూమికి కూడా ఎకరా భూసమీకరణ ప్యాకేజీ ప్రకటించారు. ఎందుకంటే అసైన్డ్ భూములను చిన్నచిన్న బిట్లుగానే తమ బినామీల పేరిట పచ్చ ముఠా చేజిక్కిచ్చుకుంది. తద్వారా ఎక్కువ ప్యాకేజీ వచ్చేలా కథ నడిపింది. ఆ మేరకు చంద్రబాబు, నారాయణ, టీడీపీ పెద్దల బినామీలకు అసైన్డ్ భూముల సమీకరణ ప్యాకేజీని సీఆర్డీఏ వర్తింపజేసింది. అలా చంద్రబాబు చట్ట ప్రకారం ఆ ప్యాకేజీకి అర్హులైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, పేద రైతులను దారుణంగా మోసగించారు. ఉన్నతాధికారుల అభ్యంతరాలు బేఖాతరు.. నిజానికి.. అసైన్డ్ భూములను కొనుగోలు చేయడం చట్ట విరుద్ధం. అలా చట్ట విరుద్ధంగా కొనుగోలు చేసిన వారికి భూసమీకరణ ప్యాకేజీ ప్రకటించడానికే వీల్లేదు. చట్ట ప్రకారం దేశంలో 1954కు ముందు ఎస్సీ, ఎస్టీ, బీసీ, పేద రైతులకు పంపిణీ చేసిన భూములను ఇతరులకు విక్రయించుకునే అవకాశముంది. 1954 తరువాత పంపిణీ చేసిన అసైన్డ్ భూములను కొనుగోలు చేయడంగానీ విక్రయించడంగానీ చట్ట విరుద్ధం. అలాగే, ఎస్సీ, ఎస్టీ, బీసీ, పేద రైతుల ప్రయోజనాలు కాపాడేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ మేరకు అసైన్డ్ భూముల అన్యాక్రాంత నిరోధక చట్టం తీసుకొచ్చింది. ఇదే విషయాన్ని స్పష్టంచేస్తూ రెవెన్యూ ఉన్నతాధికారులు అసైన్డ్ భూముల బదలాయింపును గుర్తిస్తూ వారికి కూడా భూసమీకరణ ప్యాకేజీ ప్రకటించడాన్ని వ్యతిరేకించారు. ఈ మేరకు అప్పటి ఉమ్మడి గుంటూరు జిల్లా కలెక్టర్తోపాటు సీఆర్డీఏ, సీసీఎల్ఏ అధికారులు తమ అభ్యంతరాలను లిఖితపూర్వకంగా వ్యక్తంచేశారు. కానీ, అప్పటి మున్సిపల్–సీఆర్డీఏ శాఖ మంత్రిగా ఉన్న పొంగూరు నారాయణ ఉన్నతాధికారలుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ‘అది మీకు సంబంధంలేని వ్యవహారం. మేం చెప్పినట్లు చేయండి. పైస్థాయిలో నేను మాట్లాడతాను’.. అని వారికి హుకుం జారీచేశారు. అప్పటి అడ్వకేట్ జనరల్ కూడా అసైన్డ్ భూముల అన్యాక్రాంతాన్ని గుర్తించడానికి చట్టం అనుమతించదని స్పష్టంచేశారు. ఈ మేరకు అప్పటి కలెక్టర్, సీఆర్డీఏ, రెవెన్యూ, న్యాయ శాఖ ఉన్నతాధికారులు, అడ్వకేట్ జనరల్ తమ అభ్యంతరాలను జీఓ–41 నోట్ ఫైళ్లలో లిఖితపూర్వకంగా తెలిపారు. కానీ, వారి అభ్యంతరాలను చంద్రబాబు బేఖాతరు చేశారు. కోర్టును సైతం మోసం చేసి మరీ.. అసైన్డ్ భూములను కొల్లగొట్టేందుకు చంద్రబాబు ఏకంగా న్యాయస్థానాన్నే మోసం చేయడం విస్మయపరుస్తోంది. చట్ట ప్రకారం 1954 తరువాత పంపిణీ చేసిన భూములను విక్రయించడం, కొనుగోలు చేయకూడదు. కానీ, తమ కుట్రను అమలుచేసేందుకు ఏకంగా అమరావతి పరిధిలోని రెవెన్యూ కార్యాలయాల్లో అసైన్డ్ భూముల రికార్డులను చంద్రబాబు, నారాయణ మాయం చేశారు. 1954 తరువాత భూపంపిణీ రికార్డులు ఏమీలేవని అమరావతి పరిధిలోని మంగళగిరి, తుళ్లూరు, తాడికొండ మండల రెవెన్యూ అధికారులతో ఓ నివేదిక ఇప్పించారు. ఆ నివేదికను న్యాయస్థానానికి సమర్పించారు. అంటే.. అమరావతి పరిధిలో ఉన్న అసైన్డ్ భూములన్నీ కూడా 1954కు ముందు పంపిణీ చేసినవే తప్ప.. ఆ తరువాత 2015లోగా అసలు భూపంపిణీయే చేయలేదని ఏకంగా న్యాయస్థానాన్నే పక్కదారి పట్టించారు. కానీ, 1954 తరువాత చాలాసార్లు పేదలకు అసైన్డ్ భూములు పంపిణీ చేశారు. వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వ హయాంలో కూడా 2004–05లో అసైన్డ్ భూములు పంపిణీ చేశారు. కానీ, ఆ రికార్డులన్నీ మాయం చేసేశారు. అమరావతిలో ఉన్న భూములన్నీ కూడా 1954కు ముందు పంపిణీ చేసినవే అని చెబుతూ, వాటిని విక్రయించేందుకు.. కొనుగోలు చేసేందుకు చట్టం అనుమతిస్తుందని వక్ర భాష్యం చెబుతూ న్యాయస్థానాన్ని మోసగించిన చరిత్ర చంద్రబాబుకే దక్కుతుంది. పత్రాలు వెలుగులోకి.. పచ్చ కుట్ర బట్టబయలు ఇలా.. ఎంత మసిపూసి మారెడుకాయ చేయాలని చూసినా చంద్రబాబు భూదోపిడీ కుట్ర బట్టబయలైంది. అమరావతిలోని అసైన్డ్ భూములలో 1954కు తరువాత పంపిణీ చేసిన భూములు ఉన్నాయన్న రికార్డులు వెలుగులోకి వచ్చాయి. వాటిలో 1987, 2004–05లలో పంపిణీ చేసిన అసైన్డ్ భూములు కూడా ఉన్నాయని తేలింది. దీనిపై సీఐడీ ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) సమగ్ర విచారణలో మొత్తం భూబాగోతం వెలుగుచూసింది. అమరావతి పరిధిలో 1954 తరువాత కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ రైతులకు అసైన్డ్ భూములు పంపిణీ చేశారని రెవెన్యూ అధికారులు వెల్లడించారు. 2014–19 మధ్య జరిగిన అసైన్డ్ భూముల అన్యాక్రాంతం కుంభకోణంపై సమగ్రంగా దర్యాప్తు చేయాలని కూడా లిఖితపూర్వకంగా నివేదించారు. సిట్ బృందాలు అమరావతి గ్రామాల్లో క్షేత్రస్థాయిలో విస్తృతంగా పర్యటించి సర్వే నిర్వహించడంతోపాటు సబ్ రిజిస్ట్రార్, తహశీల్దార్, కలెక్టర్ కార్యాలయాల్లో రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించాయి. దాంతో గణాంకాలతో సహా పూర్తి ఆధారాలతో అసైన్డ్ భూముల కుంభకోణం వెలుగులోకి వచ్చింది. అసైన్డ్ భూముల రికార్డుల్లో ఉన్న రైతుల పేర్లు, సీఆర్డీఏ ప్రకటించిన భూసమీకరణ ప్యాకేజీలోని అసైన్డ్ రైతుల పేర్లను సరిపోల్చి చూడగా అసలు బండారం బయటపడింది. రెవెన్యూ రికార్డుల్లోని అసైన్డ్ భూముల రైతులకు, సీఆర్డీఏ ప్రకటించిన ప్యాకేజీలోని అసైన్డ్ భూముల రైతుల పేర్లకు ఏమాత్రం పొంతన లేనేలేదు. దాంతో చట్ట విరుద్ధంగా చంద్రబాబు, నారాయణ కొల్లగొట్టిన అసైన్డ్ భూముల చిట్టా బయటపడింది. ఏకంగా 617.70 ఎకరాల అసైన్డ్ భూములను టీడీపీ ముఠా కొల్లగొట్టిందన్నది తేలిపోయింది. కేటగిరీలూ అనుకూలంగానే.. ఇక జీఓ–41 ప్రకారం ఆరు కేటగిరీల కింద నాటి ప్రభుత్వం ప్యాకేజిని ప్రకటించింది. వాటిలో నాలుగు కేటగిరీల కింద చంద్రబాబు, నారాయణ తమ బినామీల పేరిట అసైన్డ్ భూములను చేజిక్కించుకున్నారు. ఆ నాలుగు కేటగిరీలకు జరీబు భూములకు చంద్రబాబు ప్రభుత్వం ప్రకటించిన భూసమీకరణ ప్యాకేజీ ఇలా ఉంది.. రూ.3,737.30 కోట్ల అసైన్డ్ భూదోపిడీ మరోవైపు.. నాలుగు కేటగిరీ కింద దోపిడీ చేసిన 617.70 ఎకరాల అసైన్డ్ భూములకు చంద్రబాబు, నారాయణ గ్యాంగ్ ప్యాకేజీ ద్వారా ఏకంగా రూ.3,737.30 కోట్లు దక్కించుకుంది. ఎందుకంటే భూసమీకరణ ప్యాకేజీ ప్రకటించిన తరువాత అమరావతిలో నివాస స్థలం చ.గజం మార్కెట్ ధర కనీసం రూ.30వేలు, వాణిజ్య స్థలం మార్కెట్ ధర చ.గజం కనీసం రూ.50వేలు చొప్పున విక్రయాలు సాగాయి. ఇక అమరావతి నిర్మించిన తరువాత వాటి విలువ మరింత భారీగా పెరుగుతుంది కూడా. ఇక భూసమీకరణ ప్యాకేజీలో కనీస విలువగా ఎకరా ప్యాకేజీ ప్రకటించారు. అంటే.. ఎకరా లోపు భూమిని తీసుకున్నా సరే ఎకరాకు ప్యాకేజీ ఇచ్చారు. ఎందుకంటే చంద్రబాబు, నారాయణ తమ బినామీలు ఎక్కువ మంది ద్వారా చిన్న చిన్న కమతాలను చేజిక్కించుకున్నారు. తద్వారా ప్రతీ బినామీకి కనీసం ఎకరా ప్యాకేజీ వచ్చేలా చేశారు. -
మాజీ మంత్రి నారాయణ దాఖలు చేసిన వ్యాజ్యాలపై హైకోర్టు విచారణ
రాజధాని అసైన్డ్ భూముల వ్యవహారంలో తనపై పెట్టిన 2 కేసులు కొట్టివేయాలని పిటిషన్ విచారణ ను ఈ నెల 25 కు వాయిదా వేసిన న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులు పొడిగించిన న్యాయస్థానం -
వియ్యంకుల వారి భూ విందు
సాక్షి, అమరావతి: ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా..? చంద్రబాబు బృందం అమరా వతిలో ఏకంగా రూ.5,600 కోట్ల విలువైన 1,400 ఎకరాల అసైన్డ్ భూములను కొల్లగొట్టితే ఆయన మంత్రివర్గ సహచరులు పొంగూరు నారాయణ, గంటా శ్రీనివాసరావు అదే రీతిలో భారీ భూదోపిడీకి పాల్పడ్డారు. వియ్యంకులు కూడా అయిన వారిద్దరూ బినామీల పేరిట 48 ఎకరాల అసైన్డ్ భూములను కాజేసినట్లు సీఐడీకి చెందిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఆధారాలతో సహా వెలికి తీసింది. టీడీపీ సర్కారు ఒక్క రూపాయి కూడా పరిహారం ఇవ్వకుండానే అసైన్డ్ భూములను రాజధాని కోసం తీసుకుంటుందని బడుగు రైతులను బెదిరించి నారాయణ – గంటా తమ పన్నాగాన్ని అమలు చేశారు. అందుకోసం సీఆర్డీఏ అధికార యంత్రాంగాన్ని దుర్వినియోగం చేశారు. అసైన్డ్ భూముల చట్టాన్ని ఉల్లంఘించి తమ విద్యా సంస్థల సిబ్బంది, సమీప బంధువులు 37 మందిని బినామీలుగా చేసుకుని 142 సేల్ డీడ్ల ద్వారా 150 ఎకరాలను దక్కించుకు న్నారు. దీనిపై సిట్ అధికారులు పూర్తి ఆధారా లతో కేసు నమోదు చేశారు. రూ.18 కోట్లతో హస్త గతం చేసుకున్న ఆ 150 ఎకరాల విలువ ల్యాండ్ పూలింగ్ వర్తింపజేసిన అనంతరం అమాంతం రూ.550 కోట్లకు చేరుకోవడం గమనార్హం. బినామీల ఖాతాల్లోకి డబ్బులు.. వియ్యంకులైన పొంగూరు నారాయణ, గంటా శ్రీనివాసరావులు పన్నాగం పన్ని, అధికార బలంతో అమరావతిలో అసైన్డ్ భూములను కొల్లగొట్టారు. అనంతవరం, కృష్ణాయపాలెం, కురగల్లు, లింగాయపాలెం, మందడం, నెక్కళ్లు, నవులూరు, రాయపూడి, తుళ్లూరు, ఉద్దండరాయునిపాలెం, వెంకటపాలెంలోని అసైన్డ్ భూములపై కన్నేశారు. భూసమీకరణ కింద తీసుకునే అసైన్డ్ భూములకు ప్రభుత్వం పరిహారం ఇవ్వదని సీఆర్డీఏ, రెవెన్యూ అధికారుల ద్వారా ఆయా గ్రామాల్లోని పేద రైతులను నమ్మించారు. అనంతరం తమ బినామీలు అయిన ఆర్కే హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రతినిధులతో ఆ భూములను కారు చౌకగా కొనుగోలు చేసేందుకు సంప్రదింపులు జరిపారు. అందుకోసం నారాయణ విద్యా సంస్థల ద్వారా రూ.18 కోట్లను ఆర్కే హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్కు మళ్లించారు. నారాయణ విద్యా సంస్థల సిబ్బంది, తమ సమీప బంధువులను బినామీలుగా చేసుకుని వారి పేరిట బ్యాంకు ఖాతాలు తెరిచారు. ఆర్కే హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి ఆ బినామీల బ్యాంకు ఖాతాల్లోకి నిధులు మళ్లించారు. అనంతరం నారాయణ విద్యా సంస్థల సిబ్బంది, తమ సమీప బంధువుల పేరిట అసైన్డ్ భూములను సేల్ డీడ్ ద్వారా హస్తగతం చేసుకున్నారు. మంగళగిరి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం కేంద్రంగా 37 మంది పేరుతో 142 సేల్డీడ్లు రిజిస్టర్ చేయడం గమనార్హం. ఇలా కేవలం రూ.18 కోట్లకు 150 ఎకరాలను గుప్పిట పట్టారు. ఈ వ్యవహారం అంతా 2015 సెప్టెంబరు, అక్టో బర్, నవంబరులో పూర్తి చేశారు. రూ.532 కోట్లు నష్టపోయిన అసైన్డ్ రైతులు అసైన్డ్ పేద రైతుల నుంచి 150 ఎకరాలు తమ హస్తగతం అయ్యాక నారాయణ, గంటాలు అసలు విషయాన్ని తెరపైకి తెచ్చారు. అప్పటికే చంద్రబాబు పన్నాగం ప్రకారం అసైన్డ్ భూము లకు కూడా భూసమీ కరణ ప్యాకేజీ ఇవ్వాలని నిర్ణయించారు. కానీ ఆ విషయాన్ని గోప్యంగా ఉంచారు. అసైన్డ్ భూములు తమ గుప్పిట్లోకి వచ్చిన తరువాత ఆ నిర్ణయాన్ని తాపీగా 2016 ఫిబ్రవరి లో ప్రకటించారు. అంతేకాదు అసైన్డ్ చట్టానికి విరుద్ధంగా అసైన్డ్ భూములను కొనుగోలు చేసినవారికి కూడా భూసమీకరణ ప్యాకేజీ వర్తింపజేస్తామని చంద్రబాబు ప్రభుత్వం ప్రకటించడం గమనార్హం. తద్వారా అమరావతిలో భూముల మార్కెట్ విలువ అమాంతం పెరిగేలా చేశారు. అమరావతిలో ఎకరా మార్కెట్ విలువ రూ.4 కోట్లు అని నాడు ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబే చెప్పడం గమనార్హం. నారాయణ, గంటా బినామీల ద్వారా దక్కించుకున్న 150 ఎకరాలకు భూసమీకరణ ప్యాకేజీని వర్తింపచేసుకున్నారు. దీని ప్రకారం జరీబు భూములకు ఎకరాకు వెయ్యి గజాల నివాస స్థలం, 450 గజాల వాణిజ్య స్థలం కేటాయించారు. ఈమేరకు 150 ఎకరాలకుగాను 1.50 లక్షల గజాల నివాస స్థలం, 67,500 గజాల వాణిజ్య స్థలం దక్కాయి. మార్కెట్ విలువ ప్రకారం ఆ భూముల విలువ దాదాపు రూ.550 కోట్లకు చేరింది. కేవలం రూ.18 కోట్లతో అక్రమంగా భూములను దక్కించుకుని 3 నెలల్లో ఆ భూముల విలు వను రూ.550 కోట్లకు పెంచేసుకున్నారు. అస త్య ప్రచారాలు, బెదిరింపులకు పాల్పడకుండా ఉంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ అసైన్డ్ రైతుల భూముల విలువ రూ.550 కోట్లకు పెరి గి ఆ ప్రయోజనం వారికే దక్కేది. దశాబ్దాలుగా ఎస్సీ, ఎస్టీ, బీసీ రైతులు సాగు చేసుకుంటున్న భూములను నారాయణ, గంటా బెదిరించి కా రుచౌకగా గద్దల్లా తన్నుకుపోయారు. కాగా, నారాయణ ఇప్పటికే ముందస్తు బెయిల్పై ఉన్నారు. -
‘అసైన్డ్’ సవరణపై వివరాలు అందజేయండి
సాక్షి, హైదరాబాద్: అసైన్డ్దారులకు హక్కులు కల్పించే తెలంగాణ అసైన్డ్ భూముల చట్ట సవరణపై వివరాలు అందజేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. రెండు వారాల్లోగా కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వ ప్రధాన న్యాయమూర్తి, రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శితోపాటు చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ (సీసీఎల్ఏ)కు ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ అసైన్డ్ భూముల చట్టం–1977కు 2018లో సవరణ చేయడాన్ని సవాల్ చేస్తూ తెలంగాణ రిపబ్లికన్ పార్టీ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేసింది. చట్టంలోని సెక్షన్ 4(1)(b) ప్రకారం నిర్దేశించిన విధంగా 2007, జనవరి 29 నుంచి థర్డ్ పార్టీలకు అనుకూలంగా అసైన్డ్ భూముల రీఅసైన్మెంట్ కోసం కటాఫ్ తేదీని 2017, డిసెంబర్ 31 వరకు పొడిగించిందని.. ఇది చట్టవిరుద్ధమని, రాజ్యాంగ వ్యతిరేకమని పేర్కొన్నారు. ఈ మేరకు ప్రభుత్వం తీసుకొచ్చిన యాక్ట్ నంబర్ 12ను కొట్టివేయాలని కోరారు. ఈ పిల్పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ ఎన్వీ శ్రవణ్కుమార్ ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టింది. పిటిషనర్ న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. పేదల ఆర్థిక స్వావలంబన కోసం ప్రభుత్వం అర్హులైన వారికి 1969లో సాగు భూమిని అందజేసిందని చెప్పారు. అయితే వారి నిరక్ష్యరాస్యత, అజ్ఞానం, సామాజిక, ఆర్థిక వెనుకబాటును అలుసుగా తీసుకున్న కొందరు వారి భూములను స్వల్ప ధరలకు కొనుగోలు చేశారన్నారు. రూ.50 లక్షల నుంచి కోటి విలువైన భూములను రూ.5 లక్షలు చెల్లించి పలుకుబడి ఉన్న వారు సొంతం చేసుకున్నారని వెల్లడించారు. అసలు లబ్ధిదారులు ఆ భూముల ద్వారా లబ్ధిపొందలేకపోయారని పేర్కొన్నారు. లబ్దిదారుల నుంచి కొనుగోలు చేసిన వ్యక్తుల నుంచి భూములను స్వాదీనం చేసుకుని, అంతకు ముందు కేటాయించిన వారికి తిరిగి ఇచ్చేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. 1977, తెలంగాణ అసైన్డ్ భూముల చట్టం సెక్షన్ 3 ప్రకారం అసైన్డ్ భూముల అమ్మకం చెల్లదన్నారు. ఇప్పుడు అసైన్డ్ భూములను థర్డ్ పార్టీల (ఇప్పుడు అ«దీనంలో ఉన్న వారు)కు అప్పగించేలా ప్రభుత్వం చట్ట సవరణ చేయడం సమర్థనీయం కాదని చెప్పారు. ఇలాంటి భూములు రాష్ట్ర వ్యాప్తంగా 2 లక్షల ఎకరాలు ఉండగా, ఒక్క రంగారెడ్డి జిల్లాలోనే 74 వేల ఎకరాలున్నాయన్నారు. వాదనలు విన్న ధర్మాసనం.. ప్రభుత్వానికి నోటీసులు జారీ చేస్తూ, విచారణ వాయిదా వేసింది. -
తండ్రీకొడుకులు ఇద్దరూ స్కామ్స్టర్లే
సాక్షి, అమరావతి: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుకు ఐటీ శాఖ నోటీసులు ఇచ్చిన స్కామ్.. సీమన్స్, అమరావతి భూకుంభకోణాల దారులన్నీ ఒకే చోటుకు చేరుతున్నాయని మాజీ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) చెప్పారు. ఐటీ శాఖ చంద్రబాబుకు ఇచ్చిన నోటీసుల్లో పేర్కొన్న వ్యక్తులే.. సీమన్స్, అమరావతి అసైన్డ్ భూకుంభకోణాల్లో ప్రధానపాత్ర పోషించారని సీఐడీ తేల్చిందని గుర్తుచేశారు. ఈ కుంభకోణాల మూలాలు చంద్రబాబు, ఆయన కొడుకు లోకేశ్ల వద్దే ఉన్నాయని చెప్పారు. తండ్రీకొడుకులు ఇద్దరూ స్కామ్స్టర్లేనన్నారు. వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాజధానిలో ఎస్సీ, ఎస్టీ అసైన్డ్ భూములు చేతులు మార్చే క్రమంలో పెద్ద స్కామ్ జరిగిందని గతంలోనే సీఐడీ తేల్చిందని గుర్తుచేశారు. అమరావతి పేరుతో జరిగిన స్కామ్లన్నింటిలో డొల్ల కంపెనీలు పెట్టి, వాటిద్వారా తండ్రీకొడుకులు ముడుపులు పుచ్చుకున్న విషయాలు ఇప్పటికే సీఐడీ విచారణలో రట్టయిందని ఎత్తిచూపారు. డొల్ల కంపెనీలతో డబ్బును జేబులో వేసుకోవడం.. హవాలా ద్వారా తండ్రీకొడుకులకు చేరవేయడంలో ఈ మధ్య కూడా మరో స్కామ్ బయటకొచ్చిందని చెప్పారు. అమరావతిలో రాజధాని కడతానని, ప్రతి ఇటుకకు డబ్బులివ్వండని.. మనల్ని అందర్నీ తాకట్టు పెట్టి బాండ్స్ ఇష్యూచేసి చంద్రబాబు తెచ్చిన డబ్బులు ఆయా కంపెనీలకు ఇచ్చారని తెలిపారు. ఆ కంపెనీల ద్వారా నిధులు డొల్ల కంపెనీలకు మళ్లించారని, ఐటీ శాఖ నోటీసులు చూస్తే.. చంద్రబాబు మొత్తం రూ.160 కోట్ల రూపాయలు కొట్టేశారని తేలిందని చెప్పారు. లోకేశ్ మిత్రుడు రాజేశ్, చంద్రబాబు పీఏ శ్రీనివాస్ ద్వారా అమరావతి పేరుతో జనం సొమ్మును కొట్టేశారన్నారు. ఐటీ శాఖ నోటీసుల్లో పేర్కొన్న తరహాలోనే.. ఇప్పటికే సీఐడీ విచారణలో తేలిన స్కిల్ స్కాం, అమరావతి అసైన్డ్ భూముల కుంభకోణం, కాంట్రాక్ట్ పనుల్లో అక్రమాలు, ఫైబర్నెట్ స్కామ్లలోను ఈ వ్యక్తుల ద్వారా ఇదే విధమైన రూటింగ్ జరిగిందని చెప్పారు. ఎంవీపీ, పీఏ శ్రీనివాస్, రాజేశ్ తదితరులు ఆ కుంభకోణాల్లోను ప్రధానపాత్ర పోషించారన్నారు. ఐదేళ్లలో రకరకాల స్కీమ్ల పేరుతో స్కామ్లు చేసిన చంద్రబాబు వేలకోట్ల రూపాయలు దోచుకుని హైదరాబాద్లో దాచుకున్నారని మండిపడ్డారు. ఇప్పుడు అవన్నీ ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయన్నారు. ప్రజాధనాన్ని దోచేసిన తండ్రీకొడుకులను వలేసి భలే పట్టుకున్నారని ఐటీ శాఖను ప్రశంసించాల్సింది పోయి విమర్శించడం సిగ్గుచేటని చెప్పారు. తండ్రీకొడుకులు ఏయే పాపాలు చేశారని నాలుగేళ్లుగా చెబుతున్నామో అవన్నీ ఒక్కొక్కటిగా ఆధారాలతో దొరుకుతున్నాయని తెలిపారు. కచ్చితంగా చంద్రబాబు పాపం పండే రోజు వచ్చింది.. అవినీతి బట్టబయలైంది.. పరిహారం చెల్లించాల్సిన రోజు వస్తుంది.. అని పేర్ని నాని చెప్పారు. -
సీఎం జగన్ ముమ్మాటికీ దళిత బంధువే
సాక్షి, అమరావతి: ఈనాడు అధినేత రామోజీరావు తెలుగు రాష్ట్రాల మధ్య శకుని పాత్ర పోషిస్తున్నారని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు (సామాజిక న్యాయం) జూపూడి ప్రభాకర్రావు విమర్శించారు. దేశ స్వాతంత్య్రమంత వయసు కలిగిన రామోజీరావు బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. తెలంగాణలో కేసీఆర్ దళితబంధు పథకాన్ని అమలు చేస్తున్నంత మాత్రాన మిగతా రాష్ట్రాల ముఖ్యమంత్రులంతా దళిత వ్యతిరేకులని రామోజీ భావిస్తున్నారా? అని ప్రశ్నిచారు. అసైన్డ్ భూములను ఆక్రమించి ఫిలింసిటీని నిర్మించుకున్నది రామోజీరావు అయితే అసైన్డ్ భూములపై బడుగు, బలహీన వర్గాలకు హక్కులు కల్పించిన ధీరోదాత్తుడు వైఎస్ జగన్ అని పేర్కొన్నారు. దళితులు కళ్లు తెరిస్తే ఫిల్మ్సిటీని దున్నేస్తారని హెచ్చరించారు. పేదోడి బిడ్డలకు ఇంగ్లిష్ మీడియం చదువులను అడ్డుకున్న దురహంకారి రామోజీ అని మండిపడ్డారు. ఏపీలో అమలవుతున్న అమ్మ ఒడి తెలంగాణలో ఉందా? అని ప్రశ్నిచారు. సీఎం జగన్ పట్ల దళితులకున్న ప్రేమను చంద్రబాబు బృందం ఎప్పటికీ కొనలేదని స్పష్టం చేశారు. దళితుల కష్టాలు టీడీపీ నేతలకు, ఈనాడు రామోజీరావుకు తెలియవన్నారు. రాష్ట్ర ప్రభుత్వ పథకాలపై తప్పుడు కథనాలు ప్రచురించటాన్ని ఖండించారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఇవేమిటి మరి? పేదల జీవన ప్రమాణాలను పెంపొందిస్తూ నాలుగేళ్లలో పారదర్శకంగా రూ.2.31 లక్షల కోట్లు డీబీటీ ద్వారా అందించిన సీఎం జగన్ ఖచ్చితంగా దళిత బంధువు అవుతారని స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా సీఎం జగన్ 31 లక్షల ఇళ్ల స్థలాలిస్తే లబ్ధిదారుల్లో దళిత కుటుంబాలే అధికంగా ఉన్నాయని చెప్పారు. దేశవ్యాప్తంగా ఐదు లక్షల కుటుంబాలను ఆర్థికంగా, సామాజికంగా అన్ని విధాలా మెరుగైన స్థితికి తెచ్చిన రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ మాత్రమేనని ఇటీవల సర్వే ద్వారా కేంద్రమే గుర్తించిందని తెలిపారు. దళితుల ఆత్మ గౌరవానికి ప్రతీకగా 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహాన్ని విజయవాడ నడి»ొడ్డులో ఏర్పాటు చేస్తున్న సీఎం జగన్ ముమ్మాటికీ దళిత బంధువేనని స్పష్టంచేశారు. -
‘అసైన్డ్’ రాబందు నీతి రాగాలు!
సాక్షి, అమరావతి: పేదల అసైన్డ్ భూములను రాబందులా ఆక్రమించి ఫిలింసిటీ కోట కట్టుకున్న ఈనాడు రామోజీ దయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్లుగా నీతులు వల్లించడం విస్మయం కలిగిస్తోంది! ఆంధ్రప్రదేశ్లో ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా ఎస్సీలకు సమున్నత స్థానంతోపాటు అసైన్డ్ భూములపై హక్కులు కల్పించి జీవన ప్రమాణాలను పెంపొందించేందుకు తీసుకుంటున్న చర్యలు స్పష్టంగా కనిపిస్తున్నా ‘మీరెలా దళిత బంధువు జగన్?’ అని బరితెగింపు కథనాలను రామోజీ నిస్సిగ్గుగా ప్రచురించారు. దేశమంతా ప్రశంసిస్తున్న నవరత్నాల సంక్షేమ పథకాలను పొరుగు రాష్ట్రంలో ఎందుకు అమలు చేయడం లేదని అడిగే ధైర్యం రామోజీకి ఉందా? ఎస్సీల్లో పుట్టాలని ఎవరు కోరుకుంటారు? అని టీడీపీ పెద్దలు దురహంకారపూరిత వ్యాఖ్యలు చేస్తే రామోజీ కలం కదల్లేదు ఎందుకు? దళితులు శుభ్రంగా ఉండరని, వారికి చదువు రాదని, అయినాసరే సూపరింటెండెంట్లు అయిపోతారంటూ నాటి మంత్రి ఒకరు తమ పెత్తందారీతనాన్ని బయటపెట్టుకుంటే రామోజీ ఎక్కడ నక్కారు? రాజకీయాలు మీకెందుకురా? అంటూ దళితులనుద్దేశించి నాటి టీడీపీ ఎమ్మెల్యే పరుష పదజాలంతో చేసిన వ్యాఖ్యలు రామోజీ మరచిపోయినా ప్రజలు మరువరు. రాజధాని అమరావతి ప్రాంతంలో చంద్రబాబు సర్కారు దళితులను భయపెట్టి భూములను కాజేయడం నిజం కాదా? వ్యవసాయ భూమి ఉన్న దళితులకు కనీసం మోటారు కనెక్షను కూడా ఇవ్వకుండా ఇబ్బంది పెట్టింది నిజంకాదా? ఎస్సీ కార్పొరేషన్ రుణాల పేరుతో పారదర్శకతకు పాతరేసి అయినవారికి కాంట్రాక్టులు కట్టబెట్టిన ఘనత గత ప్రభుత్వానిది కాదా? ప్రభుత్వ విద్య, వైద్య రంగాలను చంద్రబాబు సర్కారు నిర్లక్ష్యం చేయడంతో పేదలపైన దళితులపై పెనుభారం పడలేదా? ఉన్నత చదువులు, వైద్యానికి పేదలు దూరం కాలేదా? ఫీజు రీయింబర్స్మెంట్ లాంటి పథకానికి తూట్లు పొడవటంతో దళిత బిడ్డల చదువులు అర్థాంతరంగా నిలిచిపోలేదా? దళితులకు కనీసం ఒక్క ఇంటి పట్టా అయినా గత ప్రభుత్వం పంపిణీ చేసిందా? నాలుగేళ్లలో అంతకు మించి.. పొరుగు రాష్ట్రంలో రూ.10 లక్షల చొప్పున దళిత బంధు పధకం కింద సాయం అందిస్తున్నట్లు ఒక పోలిక తెచ్చే ప్రయత్నాన్ని ఈనాడు చేసింది. ఆయా రాష్ట్రాల్లో ఆర్థిక పరిస్థితులు, ప్రాధాన్యతలను అనుసరించి బడ్జెట్ కేటాయింపులు ఉంటాయి. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం వివిధ వృత్తుల్లో వున్న ఎస్సీ కుటుంబాలకు డీబీటీ, నాన్ డీబీటీతో అంతకంటే ఎక్కువ లబ్ధి చేకూర్చింది. ఐదేళ్లలో టీడీపీ సర్కారు ఎస్సీల కోసం రూ.24,677.63 కోట్లు ఖర్చు చేయగా వైఎస్సార్ సీపీ ప్రభుత్వం నాలుగేళ్లలోనే రూ.38,445.35 కోట్లను డీబీటీ ద్వారా 1,31,05,372 మంది దళితులకు నేరుగా పారదర్శకంగా అందించింది. వైఎస్సార్ ఆసరా, వైఎస్సార్ చేయూత, వైఎస్సార్ వాహనమిత్ర, జగనన్న చేదోడు, వైఎస్సార్ నేతన్న నేస్తం, వైఎస్సార్ మత్స్యకార భరోసా, వైఎస్సార్ కళ్యాణమస్తు, వైఎస్సార్ బీమా, డాక్టర్ వైఎస్సార్ ఉచిత పంటల బీమా, వైఎస్సార్ రైతు భరోసా, వైఎస్సార్ సున్నా వడ్డీ లాంటివి ఇందులో ఉన్నాయి. ఇక పరోక్ష నగదు బదిలీ ద్వారా జగనన్న తోడు, జగనన్న గోరుముద్ద, వైఎస్సార్ సంపూర్ణ పోషణ, జగనన్న విద్యాకానుక, ఇళ్ల స్థలాల పంపిణీ, తదితర పధకాలతో ఇప్పటివరకు 68,62,813 మంది లబ్ధిదారులకు మరో రూ.21,475 కోట్ల మేర సాయం అందింది. ఇళ్ల స్థలాల పంపిణీ, ఇంటి నిర్మాణాల ద్వారా దళిత కుటుంబాలకు పెద్ద ఎత్తున ప్రయోజనం చేకూరింది. రాష్ట్రవ్యాప్తంగా 31 లక్షలకుపైగా ఇళ్ల పట్టాలిస్తే అందులో 6,36,732 మంది దళిత వర్గాలకు చెందిన అక్కచెల్లెమ్మలే ఉన్నారు. దీనిద్వారా ఆయా కుటుంబాలకు రూ.10,949 కోట్ల మేర లబ్ధి చేకూరింది. ఇక వారి కోసం 4,18,646 ఇళ్ల నిర్మాణాల రూపంలో మరో రూ.10,949 కోట్ల లబ్ధి చేకూరుతోంది. చరిత్రలో ఈ స్థాయిలో దళితులకు ఏ ప్రభుత్వమూ అండగా నిలబడలేదు. లోపాలను సరిదిద్ది విదేశీ విద్యా పథకం విదేశీ విద్యా పథకం రద్దైందని, బెస్ట్ అవైలబుల్ పథకం లేదని, పోటీ పరీక్షల శిక్షణ కార్యక్రమాలు లేవంటూ ఈనాడు అవాస్తవాలను కుమ్మరించింది. విదేశీ విద్యా పథకంలో లోపాలు, అక్రమాలను నివారించి ఆ స్థానంలో జగనన్న విదేశీ విద్యా దీవెన పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం తెచ్చింది. ప్రతిభ ఉన్న విద్యార్థులందరికీ సమాన అవకాశాలు కల్పించేలా, ప్రతిష్టాత్మక కాలేజీల్లో సీటు సాధించిన వారికి పూర్తి స్థాయిలో ఫీజులు చెల్లిస్తూ పథకాన్ని సమున్నతంగా తీర్చిదిద్ది అమలు చేస్తున్నారు. అభ్యర్ధులు ఎంచుకోదగ్గ 21 కోర్సుల్లో క్యూఎస్ ర్యాంకింగ్, టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ ర్యాంక్ల ప్రకారం 50 ఉత్తమ ర్యాంకుల గల విద్యాసంస్థలలో ప్రవేశం పొందిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్ధులకు గరిష్టంగా రూ 1.25 కోట్లు/ట్యూషన్ ఫీజు100 శాతం చెల్లించేలా పథకాన్ని గొప్పగా మార్చి అమలు చేస్తున్నారు. మిగిలిన వర్గాలకు రూ.కోటి గానీ ట్యూషన్ ఫీజు గానీ (ఏది తక్కువ అయితే అది) చెల్లిస్తున్నారు. ఈ స్థాయిలో విదేశీ విద్యకు గత ప్రభుత్వం భరోసా ఇవ్వగలిగిందా? కనీస ప్రమాణాలు పాటించని స్కూళ్లకూ బెస్ట్ అవైలబుల్ స్కీంను గత ప్రభుత్వంలో అమలు చేశారు. ఇప్పుడు ఆ స్కూళ్ల కంటే మెరుగ్గా ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిషు మీడియంలో చదువులు అందుతున్నాయి. అత్యుత్తమంగా తరగతి గదులను డిజిటలైజ్ చేస్తున్నారు. 8వ తరగతి విద్యార్థులకు ట్యాబులు అందిస్తున్నారు. బైలింగ్యువల్ టెక్టŠస్బుక్స్, డిక్షనరీ, యూనిఫారం, షూలతో విద్యాకానుక అందిస్తున్నారు. నాడు–నేడు ద్వారా స్కూళ్లన్నీ సర్వాంగ సుందరంగా మారుతున్నాయి. స్టడీ సర్కిళ్లపై తప్పుడు ప్రచారం పోటీ పరీక్షల కోసం ఆంధ్రప్రదేశ్ స్టడీ సర్కిల్ కోచింగ్ ప్రోగ్రామ్లను నిర్వహిస్తోంది. విశాఖపట్నం, విజయవాడ, తిరుపతిలో స్టడీ సర్కిల్లున్నాయి. తిరుపతి స్టడీ సర్కిల్లో బ్యాంక్ పీఓ పరీక్షల కోచింగ్ కార్యక్రమాన్ని నూతన భవనంలో ప్రారంభించారు. సివిల్ సర్వీస్ పరీక్షల కోచింగ్ ప్రోగ్రామ్ విశాఖపట్నం బ్రాంచ్లో ప్రారంభించారు. గ్రూప్ 1 సేవల కోచింగ్ విజయవాడలో ప్రారంభమైంది. మరి రామోజీ వీటిని తెలుసుకుంటున్నారా? ♦ గత ప్రభుత్వం విద్యోన్నతి పథకం కింద 9,775 మంది అభ్యర్థులను శిక్షణ కోసం ప్రైవేట్ కోచింగ్ ఇన్స్టిట్యూట్లకు పంపగా ఒక అభ్యర్థి మాత్రమే ఎంపికయ్యారు. ఆ పథకాన్ని సవరించి సివిల్స్ సర్వీస్ పరీక్షకు ఏపీ స్టడీ సర్కిల్లోనే ఇప్పుడు కోచింగ్ ఇస్తున్నారు. ♦ రాష్ట్రంలో 27 ఎస్సీ, ఎస్టీ పథకాలు నిర్వీర్యం అయ్యాయంటూ ఈనాడు చేసిన మరో ఆరోపణ అవాస్తవం. షెడ్యూల్డ్ కులాల లబ్ధిదారులకు స్థిరమైన జీవనోపాధి కోçÜం ప్రభుత్వం రూ.133.67 కోట్లతో 2,300 ఎస్సీలకు ఫోర్ వీలర్ మినీ ట్రక్ మొబైల్ డిస్పెన్సరీ యూనిట్ వాహనాలను రేషన్ సరుకుల డోర్ డెలివరీ కోసం అందించింది. ♦ గత ప్రభుత్వాలు కమ్యూనిటీ డెవలప్మెంట్కు 30 శాతం నిధులు వినియోగించినట్టు ఈనాడు బాకా ఊదుతోంది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అంతకు మించి ఖర్చు చేసిందన్నది వాస్తవం. 2019–20 నుంచి 2022–23 వరకు ఎస్సీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసం షెడ్యూల్డ్ కులాల కాంపోనెంట్లో క్యాపిటల్ కింద రూ.3,440.15 కోట్లను పంచాయతీరాజ్ ఇంజనీరింగ్, రోడ్లు భవనాలు, గ్రామీణ నీటి సరఫరా, మైనర్ ఇరిగేషన్, పురపాలక, మహిళా శిశు సంక్షేమ తదితర శాఖలు ఖర్చు చేశాయి. ♦ రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన విప్లవాత్మక భూ సంస్కరణలతో పెద్దసంఖ్యలో ఎస్సీలు లబ్ధి పొందారు. అసైన్డ్ భూముల మీద 33.29 లక్షల ఎకరాల భూములపై వారికి యాజమాన్య హక్కులు కల్పించారు. ఇది ఆయా కుటుంబాలు ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు దోహదపడుతోంది. ఎస్సీ కాంపోనెంట్లో టాప్ ఎస్సీ కాంపొనెంట్ అమల్లో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ దేశంలోనే మొదటి స్థానంలో ఉంది. దేశంలోని 20 రాష్ట్రాల్లో ఎస్సీ కాంపొనెంట్ కింద చేసిన ఖర్చు కన్నా ఒక్క ఆంధ్రప్రదేశ్లో చేసిన ఖర్చే అధికంగా ఉంది. ఎస్సీ కాంపొనెంట్ ద్వారా దేశవ్యాప్తంగా 12.41 లక్షల స్వయం సహాయక సంఘాలు ఏర్పాటైతే మన రాష్ట్రంలోనే 8.54 లక్షల సంఘాలు ఏర్పాటయ్యాయి. కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది ప్రారంభంలో విడుదల చేసిన నివేదికలోని గణాంకాలు ఇవి. షెడ్యూల్డ్ కులాల కాంపోనెంట్కు గత ప్రభుత్వం ఐదేళ్లలో కేవలం రూ.33,625.49 కోట్లు ఖర్చు చేయగా వైఎస్సార్ సీపీ ప్రభుత్వం నాలుగేళ్లలోనే రూ.59,936.48 కోట్లు వెచ్చించింది. -
అసైన్డ్ భూములపై సర్వహక్కులు!
సాక్షి, హైదరాబాద్/ చేవెళ్ల: రాష్ట్రంలోని దళిత, గిరిజన ఓటర్లను తమ వైపు తిప్పుకొనేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రణాళికలను సిద్ధం చేసింది. ఈసారి తమకు అధికారమిస్తే.. గతంలో వారికి అసైన్ చేసిన భూములపై సర్వహక్కులు కల్పిస్తామని, ఆ భూములను అమ్ముకోవడం సహా అన్నిరకాల యాజమాన్య హక్కులను అనుభవించవచ్చని హామీ ఇవ్వనుంది. ఈ మేరకు శనివారం చేవెళ్ల వేదికగా జరగనున్న ‘ప్రజాగర్జన’సభలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జునఖర్గే కాంగ్రెస్ పార్టీ ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ను ప్రకటించనున్నారు. భూముల అంశమే ప్రధానంగా.. కాంగ్రెస్ తమ డిక్లరేషన్లో ఎస్సీ, ఎస్టీలకు భూపంపిణీ అంశాన్నే ప్రధానంగా ప్రస్తావించనున్నట్టు పార్టీ వర్గాలు చెప్తున్నాయి. గతంలోని కాంగ్రెస్ ప్రభుత్వాలు వివిధ రూపాల్లో పేదలకు అసైన్ చేసిన భూముల్లో.. ఎస్సీ, ఎస్టీలకు చెందిన 24 లక్షల ఎకరాలపై వారికి పూర్తిస్థాయిలో యాజమాన్య హక్కులు కల్పిస్తామని ప్రకటించనున్నట్టు వివరిస్తున్నా యి. అదే విధంగా రాష్ట్రంలోని గిరిజన, ఆదివాసీలు సాగుచేసుకుంటున్న 12 లక్షల ఎకరాల భూములకు అటవీ హక్కుల చట్టం అ మలు ద్వారా పట్టాలు అందజేస్తామని.. వాటిపై కూడా గిరిజనులకు సర్వహక్కులు కల్పిస్తామని హామీ ఇవ్వనున్నట్టు వెల్లడిస్తున్నాయి. అదనపు ఆర్థిక సాయంతో.. బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకువచి్చన దళిత బంధు పథకం కింద రూ.10 లక్షలు ఇస్తుండగా.. తాము రూ.12 లక్షలు ఇస్తామని, గిరిజనబంధు కూడా అమలు చేస్తామని కాంగ్రెస్ ప్రకటించనున్నట్టు తెలిసింది. దళితులు, గిరిజనులకు ఇళ్లు కట్టుకునేందుకు రూ.6 లక్షల చొప్పున ఆర్థిక సాయం చేస్తా మని హామీ ఇవ్వనున్నట్టు సమాచారం. ఇప్పటికే రాష్ట్రంలోని పేదలందరికీ ఇళ్ల నిర్మాణం కోసం రూ.5 లక్షల చొప్పున ఇస్తామన్న కాంగ్రెస్.. ఎస్సీ, ఎస్టీలకు మరో రూ.లక్ష అదనంగా ఇవ్వనుంది. ఇక ఖాళీగా ఉన్న ఎస్సీ, ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టులన్నీ భర్తీ చేస్తామని.. విద్య, వైద్య రంగాల్లో దళిత, గిరిజనులకు ప్రాధాన్యత కల్పించి సంక్షేమ పథకాలను అమలు చేస్తామనే హామీలు కూడా ప్రకటించనున్నట్టు సమాచారం. నేడు 4 గంటలకు‘ప్రజాగర్జన’ సభ చేవెళ్లలో ప్రజాగర్జన సభ శనివా రం సాయంత్రం 4 గంటలకు ప్రారంభం కానుంది. మల్లికార్జున ఖర్గే ఈ సభలో ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, సీడబ్ల్యూసీ ఆహా్వనితుడు దామోదర రాజనర్సింహ తదితరులు హాజరుకానున్నారు. ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ను ఖర్గే ప్రకటిస్తారని గాందీభవన్ వర్గాలు చెప్పాయి. బెంగళూరు నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి రానున్న ఖర్గే.. అక్కడి నుంచి నేరుగా చేవెళ్ల వెళ్లి సభలో పాల్గొంటారని, రాత్రికి హైదరాబాద్ చేరుకుని బస చేస్తారని తెలిపాయి. బీఆర్ఎస్ నుంచి తెలంగాణకు విముక్తి కల్పిస్తాం ప్రత్యేక రాష్ట్రం వస్తే ప్రజల జీవన స్థితిగతులు బాగుపడతాయని భావించామని.. కానీ బీఆర్ఎస్ సర్కారు పాలనలో ప్రజలు ఆత్మగౌరవం కోల్పోయి బతుకుతున్నారని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క విమర్శించారు. శుక్రవారం రాత్రి ఆయన చేవెళ్లలోని కేవీఆర్ గ్రౌండ్లో కాంగ్రెస్ ‘ప్రజాగర్జన సభ’ఏర్పాట్లను పార్టీ నేతలు శ్రీధర్బాబు, అంజన్కుమార్యాదవ్, ప్రీతమ్, వేం నరేందర్రెడ్డి, గడ్డం ప్రసాద్కుమార్, బలరాంనాయక్, కేఎల్ఆర్, చల్లా నర్సింహారెడ్డి, తదితరులతో కలసి పరిశీలించారు. తర్వాత మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ను నమ్మి పదేళ్లుగా మోసపోతున్న ప్రజలకు కాంగ్రెస్ రూపంలో విముక్తి లభించనుందన్నారు. దళిత, గిరిజనుల అభ్యున్నతి కోసం కాంగ్రెస్ ఏం చేయబోతోందో చెప్పేందుకు సభ ఏర్పాటు చేశామన్నారు. చేవెళ్ల ప్రాంతానికి కాంగ్రెస్తో ప్రత్యేక అనుబంధం ఉందని, వైఎస్ హయాంలోనే ఇది నిరూపితమైందని తెలిపారు. కాంగ్రెస్ హయాంలో దళితులకు ఇచ్చిన భూములను బీఆర్ఎస్ సర్కార్ లాక్కుంటోందని ఆరోపించారు. శనివారం సాయంత్రం జరగనున్న ప్రజాగర్జన సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ అంటేనే పేదలకు భరోసా అని శ్రీధర్బాబు, బలరాంనాయక్ పేర్కొన్నారు. -
AP: 20 లక్షల మంది రైతుల చేతికి.. 'సరికొత్త సంపద'
ఎక్కడైనా వివాదంలో ఉన్న మన 4 సెంట్ల భూమి మన సొంతమైతే ఆ ఆనందమే వేరు. ఆ కుటుంబానికి అది స్థిరాస్తిగా నిలిచిపోతుంది. అలాంటిది ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 32 లక్షల ఎకరాల భూములపై రైతులకు సర్వ హక్కులు కల్పించడమంటే మాటలు కాదు. ఒక్కసారిగా ఆ రైతుల ఆర్థిక పరిస్థితి మారిపోతుంది. సంపద సృష్టి ద్వారా ఇటు రైతులు, అటు ప్రభుత్వానికి లబ్ధి కలుగుతుంది. ఇంతటి కీలక నిర్ణయానికి కారణమైన ఏపీ ప్రభుత్వంపై భూ చట్టాల నిపుణులు ప్రశంసలు కురిపిస్తున్నారు. రాష్ట్రంలో లక్షల కోట్ల విలువైన సంపద అన్నదాతల చేతుల్లోకి రావడం దేశంలోనే విప్లవాత్మక మార్పు అని కొనియాడుతున్నారు. సాక్షి, అమరావతి: భూములపై ఆంక్షలు తొలగేలా వైఎస్ జగన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు రాష్ట్రంలో సరికొత్త సంపదను సృష్టించాయి. ఈ కొత్త సంపద సృష్టి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో పెను మార్పులు తీసుకువచ్చేందుకు దోహద పడుతుందని భూ చట్టాల నిపుణులు స్పష్టం చేస్తున్నారు. 32 లక్షల ఎకరాలను నిషేధిత ఆస్తుల జాబితా నుంచి తొలగించడం ద్వారా వాటిపై సంబంధిత రైతులకు సంపూర్ణ హక్కులు లభించనున్నాయి. అంటే ఆ భూములన్నీ కొత్తగా మార్కెట్లోకి ప్రవేశించినట్లే. ఇప్పటి వరకు ఎటువంటి లావాదేవీలు జరగని ఆ భూములన్నీ కొత్తగా మార్కెట్లోకి రావడం వల్ల వాటిపై జరిగే వ్యాపారం ఆర్థిక వృద్ధికి దోహదపడుతుంది. ఆ భూములకు చెందిన 20 లక్షల మంది రైతుల ఆర్థిక స్థితిగతులు మారతాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు. పేదల భూములకు విలువ పెంచడం ద్వారా పేదరిక నిర్మూలనకు ఇది ఉపయోగపడుతుందని స్పష్టం చేస్తున్నారు. రాష్ట్ర చరిత్రలోనే ఇది గొప్ప ఆర్థిక సంస్కరణగా అభివర్ణిస్తున్నారు. 32 లక్షల ఎకరాలకు విముక్తి అత్యంత వివాదాస్పదంగా ఏళ్ల తరబడి లక్షలాది మంది రైతుల కుటుంబాల్లో చీకట్లు నింపిన నిషేధిత జాబితా భూముల సమస్యను రాష్ట్ర ప్రభుత్వం సునాయాసంగా పరిష్కరించింది. ఎక్కడైనా నాలుగైదు ఎకరాలను నిబంధనల ప్రకారం నిషేధిత ఆస్తుల జాబితా నుంచి తొలగిస్తేనే వివాదాలు ఏర్పడేవి. ఇప్పుడు ఆ పరిస్థితిని పూర్తిగా మారుస్తూ ఏకంగా లక్షల ఎకరాలను ఆ జాబితా నుంచి తొలగిస్తోంది. తద్వారా దశాబ్దాలుగా అనేక కష్టాలు పడుతున్న సుమారు 20 లక్షల మంది రైతుల జీవితాల్లో వెలుగులు నింపింది. అసైన్డ్ భూములు, చుక్కల భూములు, షరతులు గల పట్టాలు, అనాధీనం, ఖాళీ కాలమ్, సర్వీసు ఈనాం భూములతోపాటు ఇవే తరహా మరికొన్ని కేసుల్లో మొత్తం 32 లక్షల ఎకరాలను నిషేధిత ఆస్తుల జాబితా నుంచి ప్రభుత్వం తొలగిస్తోంది. 27.41 లక్షల ఎకరాల భూములపై హక్కులు రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా అసైన్డ్ భూములపై యాజమాన్య హక్కులు కల్పిస్తూ వైఎస్ జగన్ ప్రభుత్వం చట్టాన్ని సవరించింది. కేటాయించిన 20 సంవత్సరాల తర్వాత అసైన్డ్ భూముల యజమానులకు సర్వ హక్కులు కల్పించింది. రాష్ట్రంలో ఇప్పటి వరకు సుమారు 19,21,855 మందికి 33,29,908 ఎకరాలు అసైన్మెంట్ చేస్తే ఆ రికార్డులు క్షేత్రస్థాయికి తగ్గట్టుగా లేవు. అసైన్మెంట్ జరిగి 20 ఏళ్లు పూర్తయిన భూములకు హక్కులు కల్పించడం ద్వారా 15,21,160 మంది భూమి లేని నిరుపేదలకు వారికి సంబంధించిన 27,41,698 ఎకరాలపై పూర్తి యాజమాన్య హక్కులు లభిస్తున్నాయి. రైతుల ప్రమేయం లేకుండా రెవిన్యూ యంత్రాంగం 20 సంవత్సరాలు పూర్తయిన భూముల జాబితాను తయారు చేసి వాటిని 22(ఎ) నుంచి తొలగిస్తుంది. నెల రోజుల్లో ఆంక్షలు తొలగిపోయేలా చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం చకచకా అడుగులు ముందుకు వేస్తోంది. 2.06 లక్షల ఎకరాల చుక్కల భూములకు విముక్తి 15 జిల్లాల్లో 2.06 లక్షల ఎకరాల చుక్కల భూములను నిషేధిత ఆస్తుల జాబితా (22 ఏ (1) ఇ) నుంచి ఒకేసారి తొలగించింది. రాష్ట్ర వ్యాప్తంగా చుక్కల భూముల పేరుతో ఉన్న 4.06 లక్షల ఎకరాలను సుమోటోగా రీ వెరిఫికేషన్ చేసింది. ఆర్డీఓలు, తహశీల్దార్లు 1.81 లక్షల సర్వే నంబర్లలోని 4.06 లక్షలపైగా ఎకరాలకు సంబంధించిన భూములను రీ వెరిఫికేషన్ చేశారు. రికార్డుల్లో రైతు పేరు ఉన్నట్లు ధృవీకరించుకోవడంతోపాటు 11 ఏళ్లుగా అతని ఆధీనంలోనే భూమి ఉంటే ఆ భూమిని 22 (ఏ)1ఇ నుంచి తొలగించారు. తద్వారా చుక్కల భూములపై సంబంధిత రైతులకు సర్వ హక్కులు లభించాయి. తద్వారా చాలా సంవత్సరాల నుంచి నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు ఇప్పుడు జరుగుతున్నాయి. పంట రుణాలు కూడా వస్తున్నాయి. నెల్లూరు జిల్లా కావలిలో నిర్వహించిన సభలో చుక్కల భూముల రైతులకు పట్టాలిచ్చే కార్యక్రమాన్ని సీఎం వైఎస్ జగన్ ప్రారంభించారు. షరతుల పట్టా భూములు 33 వేల ఎకరాలు చుక్కల భూముల తరహాలోనే సమస్యాత్మకంగా తయారైన షరతులు గల పట్టా భూములకు ప్రభుత్వం పరిష్కారం చూపింది. 33 వేల ఎకరాల షరతులు గల పట్టా భూములను నిషేధిత ఆస్తుల జాబితా నుంచి తొలగించి ఆ రైతులకు మేలు చేకూర్చింది. బ్రిటీష్ హయాం నుంచి రైతుల చేతుల్లో ఉన్న భూములను తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో తమకెలాంటీ ఉపయోగం ఉండదని భావించి, వాటిని 22(ఏ) కేటగిరీలో పెట్టింది. అలా పెట్టడం అన్యాయమని భావించి నిబంధనల ప్రకారమే ప్రస్తుత ప్రభుత్వం వాటిని ఆ జాబితా నుంచి తీసివేసింది. 17,730 సర్వే నెంబర్లకు సంబంధించిన 33 వేలకుపైగా ఎకరాలను 22ఏ నుంచి తొలగించింది. ఈ నిర్ణయం మోడు వారిన సుమారు 50 వేల మంది రైతుల జీవితాల్లో వెలుగులు నింపింది. ఒక్క కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలోనే 18 వేలకుపైగా ఎకరాలను 22ఏ నుంచి తీసేశారు. 2022 అక్టోబర్ 20న అవనిగడ్డలో బహిరంగ సభ ఏర్పాటు చేసి సీఎం వైఎస్ జగన్ నిషేధిత భూముల జాబితా నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించి కొందరికి పట్టాలిచ్చారు. ఇప్పుడు ఆ భూముల రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. బ్యాంకు రుణాలు వస్తున్నాయి. ఆ భూములను సర్వ హక్కులతో రైతులు అనుభవిస్తున్నారు. అనాధీనం, ఖాళీ కాలమ్ భూములు 50 వేల ఎకరాలు చుక్కల భూముల మాదిరిగానే కొన్ని ప్రాంతాల్లో అనాధీనం, ఖాళీ కాలమ్ భూముల సమస్యను ప్రభుత్వం పరిష్కరించింది. ఈ భూములను చుక్కల భూముల చట్టం పరిధిలోకి తీసుకువచ్చి వాటిని నిషేధిత భూముల జాబితా నుంచి తొలగించేందుకు మార్గం సుగమం చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 50 వేల ఎకరాలకు సంబంధించిన 35 నుంచి 40 వేల మంది రైతులు దీనివల్ల లబ్ధి పొందారు. 1.68 లక్షల సర్వీసు ఈనాం భూముల సమస్యకు పరిష్కారం సర్వీసు ఈనాం భూముల సమస్యనూ సానుకూలంగా పరిష్కరించింది. నిషేధిత ఆస్తుల జాబితా 22(ఎ) నుంచి 1.68 లక్షల ఎకరాల సర్వీసు ఈనాం భూములను తొలగిస్తోంది. 25 జిల్లాల్లో 1.13 లక్షల మంది కుల వృత్తులు చేసుకునే రైతుల కుటుంబాలకు ప్రయోజనం చేకూరనుంది. 1956లో ఈనాం చట్టం రావడంతో ఈనాం భూములను రద్దు చేసి వారికి రైత్వారీ పట్టాలు ఇచ్చారు. 2013 వరకు ఇవి రైత్వారీ పట్టా భూములుగానే ఉన్నాయి. 2013లో జరిగిన ఈనాం భూముల చట్ట సవరణతో నిషేధిత భూముల జాబితాలో చేరాయి. గ్రామ సర్వీసు ఈనాం భూములను అందరి మేలు కోసం పనిచేసిన కుల వృత్తుల వారికి (నాయీబ్రాహ్మణులు, రజకులు, వడ్రంగి వంటి వృత్తులు) ఇచ్చారు. ఆ భూములు ఆ వృత్తులు చేసుకునే వ్యక్తులు, వారి వారసులకు వస్తాయి. ఇలా సర్వీసు చేసిన కుల వృత్తుల వారి సంఖ్య గ్రామాల్లో చాలా పెద్ద సంఖ్యలో ఉండడం వల్లే వారికి రైత్వారీ పట్టాలు మంజూరు చేశారు. ఈ నేపథ్యంలో 2013లో ఈనాం చట్టానికి చేసిన సవరణలు గ్రామ సర్వీసు ఈనాం భూములకు వర్తించవని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. ఈ భూములన్నింటినీ త్వరలో 22(ఎ) నుంచి తొలగించనుంది. కొత్త ఆర్థిక వ్యవస్థకు మార్గం సుగమం భూములపై ఆంక్షలన్నింటినీ ఒక్కొక్కటిగా తొలగించుకుంటూ రావాలని గత 20 ఏళ్లుగా కేంద్ర ప్రభుత్వం, అంతర్జాతీయ సంస్థలు చెబుతున్నాయి. మార్కెట్లో పెన్ను, పేపర్ ఎంత సులభంగా అమ్ముకుని, కొనుక్కుంటున్నామో.. భూమిని కూడా అలాగే కొనుక్కుని, అమ్ముకునే పరిస్థితి ఉండాలి. అలా ఉంటేనే పేదరిక నిర్మూలన, సంపద సృష్టి జరుగుతుందనే వాదన అన్ని దేశాల్లో బలంగా వినిపిస్తోంది. ఆ దిశగానే ఏపీ ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటోంది. 32 లక్షల ఎకరాలపై ఆంక్షలు తొలగించడం అందులో భాగంగానే జరిగిందని భావించాలి. ఈ భూములపై హక్కులు కల్పించడం ద్వారా ఏపీ ప్రభుత్వం సరికొత్త ఆర్థిక వ్యవస్థను సృష్టించింది. ఉన్న భూమికి సరైన కాగితాలు, సంపూర్ణమైన హక్కులు లేకపోవడం వల్ల ఆ రైతుకు, సమాజానికి ఆర్థికంగా జరిగే నష్టం చాలా ఎక్కువ. ఆస్తి ఉన్నా.. దాన్ని సంపదగా మార్చుకోలేకపోతున్నాం. ఈ సమస్యను పరిష్కరిస్తే మన దేశం సుసంపన్న దేశంగా మారుతుందని అంతర్జాతీయంగా మేధావులు చెబుతున్నారు. అంటే ఉన్న భూమికి పత్రాలు సక్రమంగా ఉండేలా చూడాలి. ఆ భూముల మీద వారికి పూర్తి హక్కులు కల్పించాలి. ఇప్పుడు ఏపీలో ఇదే జరుగుతోంది. ఏపీలో 33 లక్షల ఎకరాల అసైన్డ్ భూములున్నాయి. అసైన్డ్ భూముల చట్ట సవరణ ద్వారా అసైన్మెంట్ జరిగిన 20 ఏళ్లు పూర్తయిన భూములన్నీ పట్టా భూములుగా మారతాయి. అప్పుడు రైతులకు అన్ని విధాలా లాభమే. విలువ పెరిగి, సంపద సృష్టి జరుగుతుంది. సమస్యలకూ పరిష్కారం లభిస్తుంది. వాటితో ముడిపడిన గొడవలూ తగ్గిపోతాయి. – ఎం. సునీల్కుమార్, భూ చట్టాలనిపుణుడు, నల్సార్ యూనివర్సిటీ అసోసియేట్ ప్రొఫెసర్, హైదరాబాద్ -
నిషేధిత జాబితా నుంచి నెలలో ‘అసైన్డ్’కు విముక్తి
సాక్షి, అమరావతి: అసైన్డ్ భూములకు యాజమాన్య హక్కులు కల్పిస్తూ చట్ట సవరణ చేసిన ప్రభుత్వం.. దాన్ని వేగంగా అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే దీనిపై స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేయగా, ఎప్పటిలోగా పూర్తి చేయాలనే విషయంపై తాజాగా అధికార యంత్రాంగానికి టైం లైన్ నిర్దేశించింది. నెల రోజుల్లో రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో కసరత్తు ముగించి అసైన్మెంట్ జరిగి 20 సంవత్సరాలు పూర్తయిన అసైన్డ్ భూములను నిషేధిత ఆస్తుల జాబితా (22)ఏ నుంచి తొలగించాలని ఆదేశించింది. అసైన్డ్ భూములకు యాజమాన్య హక్కులు కల్పిస్తూ చట్ట సవరణ చేసిన గత నెల 31వ తేదీకి ఈ భూములు సంబంధిత రైతులు, వారి వారసులు లేదా లీగల్ హైర్స్ ఆదీనంలో ఉంటే వారికి యాజమాన్య హక్కులు లభిస్తాయి. ఈ మేరకు రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, భూపరిపాలన ప్రధాన కమిషనర్ జి. సాయిప్రసాద్ జిల్లా కలెక్టర్లకు ఆదేశాలిచ్చారు. వారం నుంచి నెల రోజుల గడువు రైతుకు కేటాయించి 20 సంవత్సరాలు పూర్తయిన అసైన్డ్ భూములను 22 (ఎ) నుంచి తొలగించేందుకు వీఆర్వో నుంచి తహశీల్దార్, జేసీ, కలెక్టర్లు చేయాల్సిన పనులను కూడా వివరిస్తూ ప్రభుత్వం స్పష్టమైన మార్గదర్శకాలు ఇచ్చింది. ఇప్పుడు 50 ఎకరాల వరకు అసైన్డ్ భూములున్న గ్రామాల్లో వారం రోజుల్లో వాటిని 22(ఎ) నుంచి తొలగించాలని సూచించింది. 150 వరకు ఉంటే రెండు వారాలు, 250 ఎకరాలు ఉంటే మూడు వారాలు, 250 ఎకరాలకు పైబడి అసైన్డ్ భూములుంటే నాలుగు వారాల్లో (నెల రోజుల్లో) ఆ భూములను నిషేధిత జాబితా నుంచి తొలగించాలని స్పష్టం చేసింది. ఈ గడువు ప్రకారం పని జరిగేలా జిల్లా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ప్రభుత్వ నిర్ణయంతో రాష్ట్రవ్యాప్తంగా 22 లక్షల ఎకరాల అసైన్డ్ భూములపై రైతులకు యాజమాన్య హక్కులు లభిస్తాయి. ఈ భూములపై హక్కులు ఇవ్వాలని అనేక సంవత్సరాలుగా కోరుతున్న 15 లక్షల మందికిపైగా రైతులు లబ్ధి పొందనున్నారు. వారిలో మెజారిటీ రైతులు దళితులే. -
అసైన్డ్ భూముల సవరణ చట్టం అమలుకు మార్గదర్శకాలు జారీ
సాక్షి, అమరావతి: అసైన్డ్ భూములపై యాజమాన్య హక్కులు కల్పిస్తూ అసైన్డ్ చట్టంలో సవరణలు చేస్తూ ఆర్డినెన్స్ జారీ చేసిన ప్రభుత్వం దాన్ని అమలు చేసేందుకు మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ మేరకు భూ పరిపాలన ప్రధాన కమిషనర్, రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్ ఆదివారం జిల్లా కలెక్టర్లకు ఈ–ఫైల్ విధానంలో ఆదేశాలిచ్చారు. ప్రభుత్వం భూమి కేటాయించిన వ్యక్తి, అతను లేకపోతే అతని వారసుల ఆదీనంలో ఆ భూమి ఉంటేనే యాజమాన్య హక్కులు కల్పించాలని సూచించారు. ఆ భూములను 1908 రిజిస్ట్రేషన్ల చట్టంలోని నిషేధిత ఆస్తుల జాబితా 22 (ఎ) నుంచి తొలగించాలని ఆదేశించారు. లంక భూములు, నీటి వనరులకు సంబంధించిన భూములకు ఇందులో నుంచి మినహాయించాలని సూచించారు. ఇందుకోసం వీఆర్ఓలు, తహశీల్దార్లు, ఆర్డీఓలు–సబ్ కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, కలెక్టర్లు ఏం చేయాలనే అంశాలను నిర్దిష్టంగా మార్గదర్శకాల్లో పేర్కొన్నారు. వీఆర్ఓలు ఇలా చేయాలి.. రికార్డులను సంస్కరించడంలో (పీఓఎల్ఆర్–ప్యూరిఫికేషన్ ఆఫ్ ల్యాండ్ రికార్డ్స్) భాగంగా తహశీల్దార్లు వ్యవసాయం, ఇళ్ల పట్టాల కోసం అసైన్ చేసిన భూములను గుర్తించారు. వాటిని బట్టి వీఆర్ఓలు ఆన్లైన్ అప్లికేషన్ కోసం వివరాలను సమకూర్చాలి. ఇప్పటికే గుర్తించిన సర్వే నంబర్ల ప్రకారం ఆ భూముల డీకేటీ రిజిష్టర్లు, 1బీ, అడంగల్, 22 (ఎ) జాబితా, ఇతర రెవెన్యూ రికార్డులను పరిశీలించి క్షేత్ర స్థాయిలో వంద శాతం తనిఖీలు నిర్వహించాలి. ప్రతి సర్వే నంబర్కు సంబంధించిన పట్టాను పరిశీలించి, ఆ పట్టాదారు.. ప్రభుత్వం భూమి కేటాయించిన వ్యక్తా లేక అతని వారసుడా? (ఒరిజినల్ అసైనీనా లేక లీగల్ హైరా), సంబంధిత భూమి వారి ఆ«దీనంలోనే ఉందా? రెవెన్యూ రికార్డుల ప్రకారం అది లంక భూమా? లేక నీటి వనరులకు సంబంధించిన భూమా? ఆ భూమి అతనికి ప్రభుత్వం ఎప్పుడు అసైన్ చేసింది? వంటి వివరాలను కచ్చితంగా సేకరించాలి. ఇందుకోసం అన్ని రికార్డులను పరిశీలించి క్షేత్ర స్థాయి విచారణ నిర్వహించాలి. తహశీల్దార్ల పాత్ర వీఆర్ఓలు ఇచ్చిన అసైన్డ్ భూముల సర్వే నంబర్లను తహశీల్దార్లు క్షుణ్ణంగా పరిశీలించాలి. మండలంలోని అన్ని అసైన్డ్ భూముల వివరాలు ఆ జాబితాలో ఉన్నాయో.. లేదో.. చూడాలి. ఈ కసరత్తులో ఏ అసైన్డ్ భూమిని వదిలి వేయకూడదు. ఒకవేళ ఏదైనా భూమిని వదిలివేసినట్లు గుర్తిస్తే వెంటనే ఆ వివరాలను సీసీఎల్ఏ కార్యాలయంలోని సీఎంఆర్ఓ (కంప్యూటరైజేషన్ ఆఫ్ మండల రెవెన్యూ ఆఫీసెస్) సెక్షన్కు ఈ–ఫైల్ విధానంలో పంపి కసరత్తులో చేర్చాలి. పక్కాగా తనిఖీ చేసిన తర్వాత తహశీల్దార్ అసైన్డ్ భూముల జాబితాను గ్రామ, వార్డు సచివాలయాల్లో పబ్లిక్ నోటీస్ బోర్డులో పెట్టాలి. సూచనలు, అభ్యంతరాల కోసం 7 రోజుల సమయం ఇవ్వాలి. ఏవైనా అభ్యంతరాలు వస్తే పరిశీలించి, నిబంధనల ప్రకారం వాటిని వెంటనే క్లియర్ చేయాలి. ఆ తర్వాత మొత్తం రికార్డుల్లో 5 శాతాన్ని ఆర్డీఓలు తనిఖీ చేయాలి. జాయింట్ కలెక్టర్ల పాత్ర ఆర్డీఓలు/సబ్ కలెక్టర్లు తనిఖీ చేసిన 5 శాతం రికార్డుల్లో 1 శాతం రికార్డులను జాయింట్ కలెక్టర్ తనిఖీ చేసి, అన్నీ సరిగా ఉన్నాయో లేదో చూడాలి. వీఆర్వో నుంచి ఆర్డీఓ స్థాయి వరకు జరిగిన కసరత్తును పూర్తిగా పర్యవేక్షిస్తూ అన్ని దశల్లోనూ పారదర్శకంగా జరిగిందో లేదో పరిశీలించాలి. వెరిఫికేషన్ పూర్తయిన తర్వాత 22 (ఎ) జాబితా నుంచి ఎంపిక చేసిన సర్వే నంబర్లను తొలగించాలని కోరుతూ జిల్లా రిజిస్ట్రార్లకు ముసాయిదా లేఖ సిద్ధం చేయాలి. కలెక్టర్ దాన్ని జిల్లా రిజిస్ట్రార్కు పంపాలి. ప్రతి సంవత్సరం ఆగస్టు 5వ తేదీన ఇదే విధంగా నిబంధనల ప్రకారం 22 (ఎ) నుంచి తొలగించాల్సిన అసైన్డ్ భూముల వివరాలను జిల్లా రిజిస్ట్రార్లకు పంపాలి. అసైన్డ్ భూములను 22 (ఎ) జాబితా నుంచి తొలగించే ప్రక్రియను జిల్లా కలెక్టర్లు జాగ్రత్తగా పరిశీలించాలి. మొత్తం కసరత్తు పూర్తయిన తర్వాత కలెక్టర్.. జిల్లా రిజిస్ట్రార్కు 22 (ఎ) నుంచి తొలగించాల్సిన సర్వే నంబర్ల జాబితాను పంపి, తర్వాత దాన్ని జిల్లా గెజిట్లో ప్రచురించాలి. -
22(ఎ) జాబితా నుంచి.. ఆ భూముల్ని తొలగించవచ్చు
సాక్షి, అమరావతి: పేదలకు 1954వ సంవత్సరానికి ముందు ఇచ్చిన (అసైన్డ్) భూములను నిషేధిత ఆస్తుల జాబితా నుంచి తొలగించవచ్చని జిల్లా కలెక్టర్లకు రాష్ట్ర ప్రభుత్వం మరోసారి స్పష్టం చేసింది. ఈ మేరకు స్పష్టతనిస్తూ భూ పరిపాలన ప్రధాన కమిషనర్ (సీసీఎల్ఏ), ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి. సాయిప్రసాద్ తాజాగా సర్క్యులర్ జారీచేశారు. కర్నూలు జిల్లా జాయింట్ కలెక్టర్ తమ జిల్లాలో ఉన్న పరిస్థితిని వివరిస్తూ దీనిపై స్పష్టత ఇవ్వాలని సీసీఎల్ఏని కోరారు. కర్నూలు జిల్లాలో 5,382.78 ఎకరాల ప్రభుత్వ భూమిని 1954 జూన్ 18 నాటికి 2,755 మంది నిరుపేదలకు వ్యవసాయం చేసుకోవడానికి ఇచ్చారని, ఈ భూములను నిషేధిత ఆస్తుల జాబితా 22 (ఎ) 1 నుంచి తొలగించడంపై పలు ప్రతిపాదనలు వచ్చాయని తెలిపారు. ఆ భూముల్ని 22 (ఎ) జాబితా నుంచి తొలగించవచ్చా? లేదా? అనే దానిపై తగు సూచనలు ఇవ్వాలని కోరారు. దీనిపై సీసీఎల్ఏ స్పష్టతనిస్తూ 22 (ఎ) కేసులను త్వరితగతిన పరిష్కరించడం కోసం 2022 సెప్టెంబర్ ఒకటో తేదీన జిల్లా కలెక్టర్లకు అన్ని అంశాలపైనా తగిన వివరణలు, సూచనలతో ఒక సర్క్యులర్ ఇచ్చినట్లు తెలిపారు. మరోసారి దీనిపై స్పష్టతనిస్తూ.. 1954 జూన్ 18కి ముందు పేదలకు (డిప్రెస్డ్ క్లాసెస్) షరతులతోగానీ, షరతులు లేకుండా గానీ ఇచ్చిన భూములను 22 (ఎ) జాబితా నుంచి తొలగించవచ్చని స్పష్టంచేశారు. ఆ భూములకు సంబంధించిన పట్టాలు అందుబాటులో ఉన్నా, లేకపోయినా రెవెన్యూ రికార్డుల ఆధారంగా సుమోటోగా నిషేధిత జాబితా నుంచి తొలగించాలని ఆదేశించారు. అసైన్డ్ భూముల వ్యవహారంపై తరచూ ప్రశ్నలు వస్తుండడంతో ప్రభుత్వం ఇప్పుడు మళ్లీ ఈ సర్క్యులర్ ఇచ్చింది. స్వాతంత్య్రానికి ముందు పేదలకిచ్చిన భూములను 22(ఎ) జాబితా నుంచి తీసివేయాలని గతంలోనే ప్రభుత్వం స్పష్టంచేసినా జిల్లా కలెక్టర్లు, జేసీలు రకరకాల కారణాలు, వివాదాల భయంతో వాటి జోలికి వెళ్లడంలేదు. నిబంధనల ప్రకారం చేయాల్సిన వాటిని కూడా చేయకుండా నాన్చుతున్నారు. అందులో భాగంగానే తమ వద్దకు వచ్చే ఇలాంటి పిటిషన్లపై తాము నిర్ణయం తీసుకోవాల్సి ఉన్నా సీసీఎల్ఏకి పంపుతున్నారు. ఈ నేపథ్యంలో.. రెవెన్యూ వ్యవస్థకి సంబంధించి అనేక అంశాలపై జిల్లా కలెక్టర్లకు అధికారాలు ఉన్నాయని సీసీఎల్ఏ తరచూ స్పష్టంచేస్తూనే ఉన్నారు. ఇలాంటి అంశాలపై తామిచ్చిన మార్గదర్శకాల ప్రకారం కలెక్టర్లే నిర్ణయం తీసుకోవాలని చెబుతున్నారు. అందులో భాగంగానే 1954 ముందు పేదలకిచ్చిన భూములను 22 (ఎ) నుంచి నిరభ్యంతరంగా తొలగించవచ్చని తాజా సర్క్యులర్ ఇచ్చారు. -
అసైన్డ్ భూములపై లబ్దిదారులకు యాజమాన్య హక్కులు.. ఆర్డినెన్స్ జారీ
సాక్షి, అమరావతి: అసైన్డ్ భూముల రైతుల తలరాతను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం సమూలంగా మార్చేసింది. రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా అసైన్డ్ భూములు పొందిన పేదలకు వాటిపై సంపూర్ణ హక్కులు కల్పి స్తూ తీసుకున్న విప్లవాత్మక నిర్ణయాన్ని అమల్లోకి తెచ్చింది. అసైన్డ్ భూములు కేటాయించి (అసైన్ చేసి) 20 ఏళ్లు పూర్తయితే వాటిని పొందిన వారికి ఆయా భూములపై యాజమాన్య హక్కులను కల్పించింది. ఈమేరకు 1977 ఏపీ అసైన్డ్ భూముల చట్టం (ప్రొహిబిషన్ ఆఫ్ ట్రాన్స్ఫర్స్) సవరణను ఆమోదిస్తూ గవర్నర్ అబ్దుల్ నజీర్ ఆర్డినెన్స్ జారీ చేశారు. మంత్రివర్గ కమిటీ సిఫారసు మేరకు భూమి లేని నిరుపేదలు వ్యవసాయం చేసుకుని దానిపై వచ్చే ఆదాయంతో జీవించేందుకు ప్రభుత్వాలు భూమిని కేటాయిస్తాయి. స్వాతం్రత్యానికి ముందు, ఆ తర్వాత రాష్ట్రంలో ఇలా లక్షల ఎకరాలను పేదలకు ఇచ్చారు. వాటికి చట్టపరంగా రక్షణ కల్పించేందుకు 1977లో అసైన్డ్ భూముల చట్టాన్ని అమల్లోకి తెచ్చారు. దీని ప్రకారం ప్రభుత్వం అసైన్ చేసిన భూములపై అమ్మకాలు, కొనుగోళ్లు జరిపే అవకాశం లేకుండా నిషేధం విధించారు. దీంతో అత్యవసర సమయాల్లో భూమిని విక్రయించుకునేందుకు నిరుపేదలకు అవకాశం లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో భూములపై తమకు యాజమాన్య హక్కులు కల్పించాలంటూ నిరుపేద అసైన్డ్ రైతుల నుంచి ప్రభుత్వానికి చాలాసార్లు వినతులు వచ్చాయి. ఈ క్రమంలో రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు నేతృత్వంలో నలుగురు మంత్రులు, ఎమ్మెల్యేలతో గతేడాది సెపె్టంబర్ 30న కమిటీని నియమించిన రాష్ట్ర ప్రభుత్వం దీనిపై అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. దీనిపై విస్తృతంగా అధ్యయనం చేసిన కమిటీ అసైన్డ్ భూములపై యాజమాన్య హక్కులు కల్పించిన తమిళనాడు, కర్నాటకలో పర్యటించి అక్కడి విధానాలను పరిశీలించింది. అసైన్డ్ భూములపై హక్కులు కల్పించిన కేరళలో కూడా అధ్యయనం చేసింది. వాటన్నింటినీ పరిశీలించడంతోపాటు రాష్ట్రంలో పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వానికి నివేదిక సమరి్పంచింది. కేటాయించి 20 ఏళ్లు పూర్తయితే సంబంధిత రైతులకు అసైన్డ్ భూములపై పూర్తి యాజమాన్య హక్కులు కల్పించాలని కమిటీ సిఫారసు చేసింది. ప్రభుత్వం ఎవరికి భూమి కేటాయించిందో వారికే యాజమాన్య హక్కులు ఇవ్వాలని స్పష్టం చేసింది. జిల్లాలవారీగా జాబితాలు.. కమిటీ సిఫారసులను ఆమోదించిన మంత్రివర్గం అందుకు అనుగుణంగా అసైన్డ్ భూముల చట్టాన్ని సవరించాలని తీర్మానించింది. ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు లేనందున వెంటనే చట్ట సవరణ కోసం ఆర్డినెన్స్ జారీ చేసింది. ప్రభుత్వం అసైన్ చేసిన వ్యవసాయ భూములతోపాటు పేదలకిచ్చిన ఇళ్ల పట్టాలకు సైతం ఇది వర్తిస్తుందని సవరణ చట్టంలో స్పష్టం చేశారు. కేటాయించి పదేళ్లు దాటితే ఆయా ఇళ్ల స్థలాలపై లబ్దిదారులకు యాజమాన్య హక్కులు లభిస్తాయి. దీనిపై 2021లోనే ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయగా ఇప్పుడు చట్టంలోనూ అందుకు వీలు కల్పించింది. వ్యవసాయ భూములైతే కేటాయించిన 20 ఏళ్లకు, ఇళ్ల స్థలాలైతే కేటాయించి పదేళ్లు పూర్తయిన వెంటనే వాటిపై సంబంధిత రైతులు, పేదలు, వారి వారసులకు యాజమాన్య హక్కులు లభిస్తాయి. వ్యవసాయేతర భూములను ఆనుకుని ఏవైనా అసైన్డ్ భూములు ఉంటే వాటిని అమ్ముకున్నప్పుడు ప్రస్తుత బేసిక్ మార్కెట్ విలువ చెల్లించాల్సి ఉంటుంది. చట్టం అమలుకు సంబంధించి ప్రభుత్వం విధి విధానాలను విడుదల చేయనుంది. వాటి ప్రకారం జిల్లాలవారీగా 20 ఏళ్లు పూర్తయిన అసైన్డ్ భూముల జాబితాను రూపొందిస్తారు. 1954 నుంచి 2014 వరకు రాష్ట్రంలో 33.29 లక్షల ఎకరాలను పేదలకు అసైన్ చేశారు. తాజా చట్ట సవరణ ప్రకారం 2003కి ముందు ఇచ్చిన భూములన్నింటిపైనా యాజమాన్య హక్కులు లభిస్తాయి. 1954 నుంచి 2003 వరకు 28 లక్షల ఎకరాలకుపైగా భూములను పేదలకివ్వగా వారంతా ఇప్పుడు లబ్ధి పొందనున్నారు. -
పేదల భూములు కొల్లగొట్టి.. హైకోర్టుకొచ్చి స్టే తెచ్చుకున్నారు
సాక్షి, అమరావతి : రాజధానిలో నిరుపేదల నుంచి కారుచౌకగా అసైన్డ్ భూములను కొల్లగొట్టిన వ్యవహారంలో సీఐడీ కేసు నమోదు చే సిన వెంటనే చంద్రబాబు, మాజీ మంత్రి నారాయణ హైకోర్టు నుంచి స్టే తె చ్చుకున్నారని సీఐడీ గురువారం హైకోర్టుకు నివేదించింది. వారి అక్రమాలు బ యటకు వస్తాయన్న ఉద్దేశంతోనే దర్యాప్తును ఎఫ్ఐఆర్ దశలోనే అడ్డుకున్నారని సీఐడీ తరఫున అదనపు అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ) పొన్నవోలు సుధాకర్రెడ్డి హైకోర్టుకు వివరించారు. వారు అక్రమాలకు పాల్పడకపోతే స్టే పొందాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. సచ్చీలురని భావిస్తే స్టే ఎత్తివేయాలని కోరి దర్యాప్తునకు సహకరించాలన్నారు. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఫిర్యాదు ఆధారంగా రాజధాని అసైన్డ్ భూముల బదలాయింపులో భారీ అక్ర మాలపై సీఐడీ నమోదు చేసిన కేసును కొట్టేయాలని కోరుతూ చంద్రబాబు, నారాయణ హైకోర్టులో క్వాష్ పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై విచారణ జరిపిన హైకోర్టు.. దర్యాప్తుతో పాటు తదుపరి చర్యలపై స్టే విధించింది. ఈ వ్యాజ్యాలపై హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ డాక్టర్ వక్కలగడ్డ రాధాకృష్ణ కృపాసాగర్ తుది విచారణ జరుపుతున్నారు. దర్యాప్తు జరపకపోతే ఆధారాలెలా వస్తాయి? అసైన్డ్ భూముల కొనుగోళ్లపై ఫిర్యాదు అందిన తర్వాత సీఐడీ ప్రాథమిక విచా రణ జరిపి, అందులో లభించిన ఆధారాలకు అనుగుణంగా బాబు, నారా యణ పై కేసు నమోదు చేసిందని ఏఏజీ చెప్పారు. ఆ విచారణ గురించి వారికి తెలి యదని, లేదంటే దానిపైనా స్టే తెచ్చుకునే వారని అన్నారు. అత్యంత శక్తివంతు లు, పలుకుబడి కలిగిన వారైనందునే ఆఘమేఘాలపై హైకోర్టుకొచ్చి స్టే తెచ్చు కోగలిగారన్నారు. ఒకవైపు దర్యాప్తు జరగకుండా స్టే తెచ్చుకుని, మరోవైపు అక్ర మాలకు ఎలాంటి ఆధారాల్లేవని చెబుతున్నారన్నారు. దర్యాప్తు జరగకపోతే ఆ ధారాలెలా వస్తాయని ప్రశ్నించారు. స్టే ఎత్తేసి దర్యాప్తునకు అనుమతివ్వా లన్నారు. అప్పుడు ఎలాంటి ఆధారాలు సమర్పిస్తామో వారు చూడవచ్చన్నారు. ఆరేళ్ల తరువాత కేసు నమోదు చేశారు.. నారాయణ తరఫున సీనియర్ న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు వాదనలు వినిపిస్తూ.. హైకోర్టు స్టే ఇచ్చినా సీఐడీ దర్యాప్తు కొనసాగించిందన్నారు. రాజ కీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే జీవో 41 జారీ చేసిన ఆరేళ్ల తరువాత కేసు నమోదు చేశారన్నారు. ఆ తరువాత జీవో 41ని సవరించారని చెప్పారు. ఈ సమయంలో న్యాయమూర్తి స్పందిస్తూ, సవరణ సమయంలో కూడా అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయా అని ప్రశ్నించగా పోసాని సమాధానం చెప్పలేదు. అనంతరం విచారణను న్యాయమూర్తి బుధవారానికి వాయిదా వేశారు. -
మంచిరేవుల భూములపై సుప్రీంకోర్టు కీలక తీర్పు
న్యూఢిల్లీ: మంచిరేవుల భూముల విషయంలో తెలంగాణ ప్రభుత్వానికి ఊరట లభించింది. 143 ఎకరాల మంచిరేవుల భూములపై సుప్రీంకోర్టు మంగళవారం కీలక తీర్పు వెలువరించింది. ఓఆర్ఆర్కు ఆనుకొని ఉన్న అసైన్డ్ భూములు తెలంగాణ ప్రభుత్వం, గ్రే హౌండ్స్కే చెందుతాయని సర్వోన్నత న్యాయస్థానం వెల్లడించింది. కాగా 143 ఎకరాల అసైన్డ్ భూమిని 1993లో ప్రైవేట్ వ్యక్తులు అక్రమంగా విక్రయించి ప్లాట్లుగా మార్చారు. రాష్ట్ర ప్రభుత్వం 1977 అసైన్మెంట్ చట్టం ప్రకారం వారికి నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసులపై ఆక్రమణదారులు హైకోర్టును ఆశ్రయించగా.. ఈ భూములు ప్రైవేటు వ్యక్తులకే చెందుతాయని హైకోర్టు సింగిల్ బెంచ్ తీర్పునిచ్చింది. ఈ తీర్పును సవాలు చేస్తూ..2021లో డివిజన్ బెంచ్లో ప్రభుత్వం సవాలు చేసింది. ప్రభుత్వం దాఖలు చేసిన రిట్ పిటిషన్ను అనుమతించి.. సింగిల్ జడ్జి తీర్పును తెలంగాణ హైకోర్టు డివిజన్ బెంచ్ పక్కన పెట్టేసింది. దీంతో హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన ఆదేశాలను ఆక్రమణ దారులు సుప్రీంకోర్టులో సవాలు చేశారు. ఈ పిటిషన్పై నేడు విచారణ జరగ్గా.. ప్రైవేటు వ్యక్తుల పిటిషన్లను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఇకపై ఈ భూముల విషయంలో కిందస్థాయి కోర్టులు, హైకోర్టులు ఎలాంటి జోక్యం చేసుకునే అధికారం లేదని సుప్రీం తేల్చి చెప్పింది. ఇప్పుడు తాము ఇచ్చిన ఆదేశాలే ఫైనల్ అని, ఇకపై ఎలాంటి జోక్యాలు అనుమతించేది లేదని స్పష్టం చేసింది. పోలీసు విభాగంలోని గ్రేహౌండ్స్కు కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులు సరైనవే అని, అవి చట్టబద్ధమైనవని జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ దీపాంకర్ దత్తల ధర్మాసనం తీర్పులో స్పష్టం చేసింది. తెలంగాణ ప్రభుత్వం తరపున న్యాయవాది శ్రీహర్ష తుది వాదనలు వినిపించారు. చదవండి: 108కు కొత్త వాహనాలు.. ప్రారంభించిన సీఎం కేసీఆర్ -
సాహసోపేత నిర్ణయాలు.. వారికి వైఎస్ జగన్ సర్కార్ ఐదు వరాలు
కలలో సైతం ఊహించని భూ సంస్కరణలివి. భారతదేశ సామాజిక చరిత్రలో ఇది మేలి మలుపు. బహుశా ఇప్పటిదాకా ఈ రీతిలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు మేలు చేసిన దాఖలాలు ఎక్కడా ఉండకపోవచ్చు. ప్రధానంగా దళిత వర్గాల స్థితిగతుల్లో వేగవంతంగా మార్పు కనిపించడం ఖాయం. బహిరంగ సభల్లో సీఎం జగన్ ‘నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీ’ అని చెప్పే మాటలు ఆయన హృదయాంతరాల్లోంచి వచ్చేవేనని రుజువైంది. సాక్షి, అమరావతి: రాష్ట్ర చరిత్రలో ఇదివరకెన్నడూ లేని విధంగా భూములకు సంబంధించి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం సాహసోపేతంగా తీసుకున్న ఐదు నిర్ణయాలు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల్లోని పేదల తల రాతలు మార్చనున్నాయి. ప్రధానంగా దళితుల పాలిట ఐదు వరాలుగా భావించవచ్చు. నిరుపేద దళితులకు సమాజంలో గౌరవనీయమైన స్థానాన్ని కల్పించడమే లక్ష్యంగా ఇటీవల మంత్రివర్గ సమావేశంలో ఐదు కీలక ప్రతిపాదనలకు ఆమోద ముద్ర వేశారు. అసైన్డ్ భూముల రైతులకు యాజమాన్య హక్కులు కల్పించాలనే చరిత్రాత్మక నిర్ణయంతో 15.21 లక్షల మంది రైతులు లబ్ధి పొందితే అందులో అత్యధికులు దళిత వర్గానికి చెందిన వారే. రాష్ట్రంలో సుదీర్ఘకాలం తర్వాత భూమి లేని నిరుపేదలకు భూముల పంపిణీకి శ్రీకారం చుట్టడం ద్వారా ఎక్కువ లబ్ధి పొందబోతున్నదీ దళిత సోదరులే. అనేక సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న లంక భూములకు డి పట్టాలు ఇవ్వడం ద్వారా దళితులు, ఇతర వర్గాల వారి కష్టాలకు ప్రభుత్వం చరమగీతం పాడింది. భూమి కొనుగోలు పథకం కింద దళితులకు ఇచ్చిన భూములపై పూర్తి హక్కులు కల్పించి వారికి మేలు చేకూర్చుతోంది. శ్మశాన వాటికలు లేని దళిత వాడ ఉండకూడదనే లక్ష్యంతో ఎవరూ అడగకుండానే 1,700 గ్రామాల్లో వాటి ఏర్పాటుకు 1,050 ఎకరాలు కేటాయించింది. వీటన్నింటి వల్ల 16 లక్షల మంది దళితులు, ఇతర పేద వర్గాల బతుకు చిత్రాలు మారనున్నాయి. ఇన్నాళ్లూ కాగితాలపైనే విలువ అసైన్డ్ భూములపై యాజమాన్య హక్కులు కల్పించడంతో అనేక సంవత్సరాలుగా భూమి ఉన్నా లేనట్లే జీవిస్తున్న లక్షలాది మంది దళిత, పేద రైతులకు మేలు జరగనుంది. ప్రభుత్వం నుంచి భూమిని పొంది 20 ఏళ్లు పూర్తయితే ఆ అసైన్మెంట్దారులు.. వారు లేకపోతే వారి వారసులకు పూర్తి యాజమాన్య హక్కులు లభిస్తాయి. అసైన్డ్ భూముల చరిత్రలో ఇదొక గొప్ప నిర్ణయం. స్వాతం్రత్యానికి ముందు, తర్వాత.. భూమి లేని నిరుపేదలకు జీవనోపాధి కల్పించడానికి ప్రభుత్వాలు భూమిని ఇచ్చేవి. ఇలా భూమి పొందే వారిలో ఎక్కువ మంది దళితులే ఉండేవారు. వారికి ప్రభుత్వాలు అసైన్ (ఇచ్చిన) చేసిన భూములను వారు సాగు చేసుకోవడమే తప్ప వాటిపై వారికి ఎటువంటి హక్కులు ఉండవు. అసైన్డ్ చట్టాల ప్రకారం ఆ భూములను అమ్మడం, కొనడం నిషేధం. ఏదైనా అవసరం వచ్చి తనకున్న అసైన్డ్ భూమిలో కొంత భాగాన్ని అమ్ముదామంటే సాధ్యమయ్యేది కాదు. ఎందుకంటే ఆ భూముల రిజి్రస్టేషన్ జరగదు. దీంతో ఇతర భూములకు, అసైన్డ్ భూములకు చాలా తేడా ఏర్పడింది. అవసరాల రీత్యా తప్పనిసరి పరిస్థితుల్లో సాదా బైనామాల పద్ధతిలో కాగితాల మీద రాసుకుని కొందరు తమ భూములను ఉన్న విలువ కంటే చాలా తక్కువకు అమ్ముకునే పరిస్థితి ఏర్పడింది. ఎన్నో ఏళ్లుగా ఎదురుచూపులు ► తమ భూములపై తమకు హక్కులు ఇవ్వాలని అసైన్డ్ రైతులు ఎన్నో ఏళ్ల నుంచి కోరుతున్నారు. స్వాతం్రత్యానికి ముందు.. 1954లో ఇచ్చిన భూములపై సంబంధిత రైతులకు యాజమాన్య హక్కులు కల్పించే అవకాశం ఇచ్చారు. కానీ అది కూడా అమలులోకి రాలేదు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అలాంటి భూములపై యాజమాన్య హక్కులు కల్పించే ప్రక్రియను ప్రారంభించింది. ► 1954 తర్వాత అసైన్మెంట్ చేసిన భూములపైనా యాజమాన్య హక్కులు ఇవ్వాలనే అభ్యర్థనపై గత ప్రభుత్వాలు చర్చించడం, కమిటీలు వేసి కాలయాపన చేయడం తప్ప ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. రాష్ట్ర విభజన తర్వాత చంద్రబాబు ప్రభుత్వం కూడా అసైన్డ్ భూములపై యాజమాన్య హక్కులు కల్పించే విషయంపై ఒక కమిటీ నియమించి చేతులు దులుపుకుంది. ► వైఎస్ జగన్ ప్రభుత్వం వచ్చాక దీనిపై ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు నేతృత్వంలో 13 మంది దళిత, గిరిజన ఎమ్మెల్యేలు సభ్యులుగా 2022 ఆగస్టు 30న ప్రజాప్రతినిధుల కమిటీని నియమించి దీనిపై నివేదిక ఇవ్వాలని సూచించింది. ఈ కమిటీ కర్ణాటక, తమిళనాడులో అసైన్డ్ భూములపై హక్కులు ఇవ్వడంతో ఆయా రాష్ట్రాల్లో పర్యటించి అక్కడి విధానాలపై అధ్యయనం చేసింది. అసైన్డ్ భూములకు సంబంధించి ఇతర రాష్ట్రాల్లో ఉన్న చట్టాలు, నిబంధనలను పరిశీలించింది. ► వాటన్నింటినీ పరిగణనలోకి తీసుకుని మన రాష్ట్రంలోని పరిస్థితులను బట్టి అసైన్ చేసిన 20 ఏళ్ల తర్వాత లబ్ధిదారులు.. వారు లేకపోతే వారి వారసులు వారికి అవసరమైనప్పుడు అమ్ముకునే అవకాశం కల్పించాలని కమిటీ ప్రభుత్వానికి సిఫారసు చేసింది. ఇందుకు రాష్ట్రం మంత్రివర్గ ఆమోదం తెలిపింది. ► అసైన్డ్ రైతుల్లో దాదాపు 70 శాతం మంది దళితులు ఉంటారని అంచనా. ఆ తర్వాత బీసీ, ఎస్టీ, మైనార్టీ రైతులకూ మేలు జరుగుతుంది. అదే సమయంలో ఎవరైనా 20 ఏళ్లకు ముందే పేద రైతుల నుంచి భూములు కొనుక్కుని ఉంటే వారికి ఎలాంటి ప్రయోజనం ఉండదు. ఆ భూములపై వారికి ఎటువంటి హక్కులు రావు. 54,129.45 వేల ఎకరాల్లో దళితులకే ఎక్కువ ► సుదీర్ఘకాలం తర్వాత రాష్ట్రంలో నిరుపేదలకు వ్యవసాయ భూములు పంపిణీ చేయడానికి వైఎస్ జగన్ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయం వల్ల దళితులకు ఎక్కువ ప్రయోజనం కలగనుంది. భూమి లేని నిరుపేదల్లో వారే ఎక్కువగా ఉన్నారు. 23 జిల్లాల్లో 54,129.45 వేల ఎకరాలను అర్హులైన పేదలకు పంచనున్నారు. 46,935 మందికి భూములివ్వడానికి ఎంపిక చేయగా అందులో దళితులే ఎక్కువ. ► వ్యవసాయ కూలీలుగా, ఇతర పనులు చేసుకుంటూ జీవించే వారిని ప్రభుత్వం రైతులుగా మార్చనుంది. రాష్ట్రంలో చివరిసారిగా 2013లో భూ పంపిణీ జరిగింది. తక్కువ భూమి అయినా పేదలకివ్వడం అదే చివరిసారి. ఆ తర్వాత భూ పంపిణీ గురించి ఎవరూ పట్టించుకోలేదు. పేదలు మాత్రం తమ జీవనోపాధికి కొంత భూమి ఇవ్వాలని అధికారులు, ప్రజాప్రతినిధులను కోరినా గత ప్రభుత్వం పట్టించుకోలేదు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. ఎవరూ అడగకుండానే దళితులు, ఇతర వర్గాల్లోని నిరుపేదలకు మేలు చేయాలనే సంకల్పంతో భూ పంపిణీకి శ్రీకారం చుట్టారు. లంక భూముల్లో 80 శాతం వీరివే ► లంక భూములకు డీకేటీ పట్టాలివ్వాలనే నిర్ణయానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. దీనివల్ల 8 జిల్లాల్లో ఉన్న కృష్ణా, గోదావరి లంకల్లోని 9,062 ఎకరాలకు సంబంధించిన 19,176 మంది రైతులకు పట్టాలు దక్కనున్నాయి. వారిలో అత్యధికులు దళిత రైతులే. ► కృష్ణా, ఎన్టీఆర్, బాపట్ల, పల్నాడు, గుంటూరు, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాల్లో మూడు కేటగిరీల్లో లంక భూములను సాగు చేసుకుంటున్న అనేక మంది రైతులకు పట్టాలు లేవు. తమకు పట్టాలు ఇవ్వాలని అనేక సంవత్సరాలుగా ప్రభుత్వాలను కోరుతున్నారు. వైఎస్ జగన్ ప్రభుత్వం దళిత రైతుల అభ్యర్థనలను పరిగణనలోకి తీసుకుని వివాదాల్లేకుండా సాగు చేసుకుంటున్న అర్హులకు పట్టాలు ఇవ్వాలని నిర్ణయించింది. సి కేటగిరీలోని కొన్ని భూములకు ఐదేళ్ల లీజుకు ఇవ్వనుంది. అప్పు మాఫీతో భూమి చేతికొచ్చింది ► భూమి కొనుగోలు పథకం ద్వారా భూములు పొందిన దళిత రైతుల కష్టాలకు వైఎస్ జగన్ ప్రభుత్వం చరమగీతం పాడింది. ఆ భూములపై రుణాలను మాఫీ చేస్తోంది. రుణాలు చెల్లించినా నిషేధిత జాబితాలో కొనసాగుతున్న భూములకు సైతం విముక్తి కల్పిస్తోంది. ఈ రెండు నిర్ణయాల వల్ల మొత్తం 22 వేల మందికిపైగా రైతులకు వారి భూములపై సంపూర్ణ హక్కులు లభించనున్నాయి. ► భూమి లేని దళిత రైతుల జీవనోపాధి కోసం గతంలో రాష్ట్ర ఎస్సీ కో–ఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ భూములను కొనుగోలు చేసి అర్హులకు ఇచ్చింది. ఆ భూములపై ఇచ్చిన రుణాలను కొందరు తిరిగి చెల్లించినా, కొందరు చెల్లించలేకపోయారు. దీంతో 16,213.51 ఎకరాలకు సంబంధించి 14,223 మంది రైతుల భూముల పత్రాలు తనఖాలో ఉన్నాయి. ► ఇప్పుడు ఆ రుణాలను ప్రభుత్వం మాఫీ చేసి భూములపై దళిత రైతులకు పూర్తి హక్కులు కల్పించింది. ఎలాంటి రుసుం తీసుకోకుండా వాటిని దళిత మహిళా రైతుల పేరుతో రిజిష్టర్ డాక్యుమెంట్లుగా ఇవ్వనున్నారు. ► రుణాలు చెల్లించి తాకట్టు నుంచి విడిపించుకున్న రైతుల భూములు కూడా నిషేధిత జాబితాలోనే కొనసాగుతున్నాయి. ఆ భూములను 22 (ఏ) నిషేధిత జాబితా నుంచి తొలగిస్తున్నారు. ఈ ప్రక్రియ కోసం చెల్లించాల్సిన రిజి్రస్టేషన్ ఫీజు, యూజర్ ఛార్జీలను ప్రభుత్వం మినహాయించింది. దళిత రైతులు ఒక్క రూపాయి కూడా చెల్లించకుండానే భూములపై హక్కులు లభిస్తాయి. నెరవేరిన దశాబ్దాల కల ► రాష్ట్రంలో దళిత వాడలకు స్మశాన వాటికల సమస్య లేకుండా చేసేందుకు వైఎస్ జగన్ ప్రభుత్వం కంకణం కట్టుకుంది. శ్మశాన వాటికలు లేని దళిత వాడల్లో వెంటనే ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో 17,564 రెవెన్యూ గ్రామాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్లు 1,900కు పైగా గ్రామాల్లో శ్మశాన వాటికలు లేవని నివేదిక ఇచ్చారు. 1,700 గ్రామాల్లో వాటి ఏర్పాటుకు ప్రభుత్వ స్థలాలు అందుబాటులో ఉన్నట్లు గుర్తించారు. దీంతో ఆ గ్రామాల్లో జనాభాను బట్టి అర ఎకరం లేదా ఎకరం కేటాయించే బాధ్యతను ప్రభుత్వం కలెక్టర్కు అప్పగించింది. ► మొత్తంగా 1,700 గ్రామాల్లో 1,050.08 ఎకరాలను శ్మశాన వాటికలకు కేటాయిస్తూ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. దళిత వాడల్లో ఎన్నో దశాబ్దాలుగా ఈ సమస్య నలుగుతోంది. తమకు శ్మశాన వాటికలు కావాలని ఎస్సీలు.. ప్రభుత్వాలు, ప్రజా ప్రతినిధులను ఎన్నో ఏళ్లుగా కోరుతున్నా, ఏ ప్రభుత్వం దానిపై ఇంత వరకు చిత్తశుద్ధితో దృష్టి పెట్టలేదు. మొట్టమొదటిసారిగా సీఎం వైఎస్ జగన్ ఈ విషయంపై దృష్టి సారించి, 1050 ఎకరాలు కేటాయించారు. అతి త్వరలో ఆయా గ్రామాల్లో వారికి శ్మశాన వాటికలు ఏర్పాటు కానున్నాయి. పెరగనున్న రైతుల స్థితిగతులు సీఎం జగన్ నిర్ణయాలతో రైతుల చేతిలో ఉన్న భూముల విలువ పెరిగింది. తద్వారా ఆయా రైతుల స్థితిగతులు, ఆదాయ హోదాలు పెరుగుతున్నాయి. అత్యవసర కాలంలో తనకంటూ విలువైన ఆస్తి ఉందంటూ ఆ భూముల్ని చూసుకుని మురిసిపోయే పరిస్థితులొచ్చాయి. ఈ సంస్కరణల వల్ల రాష్ట్ర జీడీపీ కూడా పెరుగుతుంది. దాదాపు 22 లక్షల మంది బడుగు, బలహీన వర్గాల వారికి ప్రయోజనం. – కె. నారాయణ స్వామి, ఉప ముఖ్యమంత్రి (ఎక్సైజ్, వాణిజ్య పన్నుల శాఖ మంత్రి) భూ సంస్కరణలు సీఎం జగన్కే సాధ్యం.. అసైన్డ్ భూములకు యాజమాన్య హక్కులపై సీఎం జగన్ నిర్ణయం చరిత్రలో నిలిచిపోతుంది. సామాజిక న్యాయ చరిత్రలో ఇదొక సువర్ణాధ్యాయంగా చెప్పవచ్చు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ రైతులకు అధిక ప్రయోజనం. అంబేడ్కర్ ఆశయసాధనకర్తగా సీఎం వైఎస్ జగన్ తెలుగుజాతి ఉన్నంతవరకు మిగిలిపోతారు. ఈ కాలంలో అంటరానితనంపై అవిశ్రాంత పోరాటం చేస్తున్న ఏకైక సీఎం వైఎస్ జగన్ అని చెప్పక తప్పదు. – పీడిక రాజన్న దొర, ఉప ముఖ్యమంత్రి (గిరిజన సంక్షేమ శాఖ మంత్రి) అంటరానితనంపై సవాల్ పేదలకు మేలు చేసే విషయాలపై గత పాలకులు సగం సగం నిర్ణయాలే తీసుకున్నారు. సీఎం జగన్ మాత్రం చిత్తశుద్ధితో అసైన్డ్ భూములపై నిర్ణయం తీసుకున్నారు. అంటరానితనంపై ప్రభుత్వ పరిపాలన సవాల్ విసిరినట్లు ఉంది. నాలుగేళ్ల పాలనలో విప్లవాత్మక సంస్కరణల ద్వారా సీఎం తన విశ్వరూపం చూపారు. – పినిపె విశ్వరూప్, రాష్ట్ర రవాణా శాఖ మంత్రి చరిత్రాత్మక నిర్ణయం అసైన్డ్ భూములకు యాజమాన్య హక్కులు కల్పించడం చరిత్రాత్మక నిర్ణయం. ఎంతటి కష్టమొచ్చినా ఇన్నాళ్లూ అసైన్డ్ భూములను అమ్ముకోడానికి వీలు లేని పరిస్థితి. ఇకపై ఆ బెంగ తీరనుంది. దీనివల్ల 15.21 లక్షల మంది పేదలకు చెందిన 27.41 లక్షల ఎకరాల భూమిని పేదలు అమ్ముకోడానికి అవకాశం కలుగుతోంది. వాళ్లకు హక్కులు కల్పిస్తే వారి జీవితాలు బాగు పడతాయనే ఆలోచనే గొప్ప మార్పునకు నాంది. – మేరుగు నాగార్జున, రాష్ట్ర సాంఘిక, సంక్షేమ శాఖ మంత్రి దేశంలో గొప్ప భూ సంస్కరణ అసైన్డ్ భూములపై దళితులకు సర్వహక్కులు కల్పించడం దేశంలోనే గొప్ప భూ సంస్కరణ. 20 ఏళ్లపాటు అనుభవంలో ఉన్న అసైన్డ్ భూమిపై ఉన్న ఆంక్షలన్నీ ఎత్తేసి ఆ భూమిపై సర్వహక్కుల్ని లబ్ధిదారులకు కల్పించడం నిజంగా గొప్ప విషయం. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఇలాంటి భూ సంస్కరణ జరగలేదు. భూములపై హక్కు కల్పించడం అంటే వారి హోదాను పెంచడమన్న విషయాన్ని విపక్షాలు గుర్తించాలి. – ఆదిమూలపు సురేష్, పురపాలక శాఖ మంత్రి సీఎం జగన్కు సెల్యూట్ అసైన్డ్ భూములపై సంస్కరణలు పేద రైతుల హోదాను పెంచే మహత్తర నిర్ణయంగా భావించాలి. దళిత ప్రజాప్రతినిధులమంతా సీఎం జగన్కు సెల్యూట్ చేస్తున్నాం. ఈ భూ సంస్కరణల ద్వారా 15.21 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరుతుంది. భూ రీసర్వే ద్వారా ఇప్పటికే 19 లక్షల మ్యుటేషన్లు జరిగాయి. – నందిగం సురేష్, వైఎస్సార్సీపీ బాపట్ల ఎంపీ గొప్ప ఫలితాలు ఖాయం వైఎస్ జగన్ ప్రభుత్వం విలువ లేకుండా ఉన్న భూములపై ఆంక్షలు తొలగించి, వాటిపై అనుభవదారులకు సర్వ హక్కుల్ని కల్పించింది. తద్వారా పేద రైతుల సామాజిక హోదాను పెంచే దిశగా అడుగులు ముందుకు వేసింది. ప్రభుత్వ ఆస్తులు, ప్రయివేటు వ్యక్తుల చేతుల్లో ఉన్న ఆస్తుల్ని వేర్వేరుగా రికార్డుల్లో చేర్చి, వివాదాలను పరిష్కరిస్తోంది. స్వాతంత్య్రం వచ్చాక తొలిసారి భూ హక్కుల సంస్కరణలు గొప్ప ఫలితాల్ని ఇవ్వనున్నాయి. – తానేటి వనిత, రాష్ట్ర హోం శాఖ మంత్రి రైతు హోదాను పెంచే మహత్తర నిర్ణయం 20 ఏళ్లపాటు అనుభవమున్న భూమిపై సర్వహక్కులు కల్పించటం, ఆంక్షలు ఎత్తివేత సహసోపేత నిర్ణయం. ఒక మేజర్ సంస్కరణ తీసుకు రావాలని రాష్ట్ర సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆలోచించారు. 20 ఏళ్లపాటు అనుభవంలో ఉన్న అసైన్డ్ భూమిపై ఆంక్షలన్నీ ఎత్తేసి ఆ భూమిపై సర్వహక్కుల్ని లబ్ధిదారులకు కల్పించారు. రైతుకు తన భూమిపై హక్కు ద్వారా తన హోదాను పెంచే నిర్ణయంగా భావించాలి. – మేకతోటి సుచరిత, మాజీ మంత్రి దేశ చరిత్రలో సువర్ణాధ్యాయం సీఎం వైఎస్ జగన్ సామాజిక బాధ్యతతో తీసుకున్న ఈ నిర్ణయం భారత సామాజిక న్యాయ చరిత్రలో సువర్ణ అధ్యాయం. అసైన్డ్ భూములకూ ఇక మంచి ధర వస్తుంది. ఆయా రైతుల స్థితిగతులు, ఆదాయ హోదాలు పెరుగుతాయి. విలువైన ఆస్తి అని వారు సంబరపడుతున్నారు. – జూపూడి ప్రభాకర్రావు, ప్రభుత్వ సలహాదారు -
అసైన్డ్ భూముల అంశంలో సీఎం జగన్ది సాహసోపేత నిర్ణయం: మంత్రి ధర్మాన
సాక్షి, అమరావతి: అసైన్డ్ భూముల అంశంలో సీఎం జగన్మోహన్రెడ్డి సాహసోపేత నిర్ణయం తీసుకున్నారని రాష్ట్ర రెవెన్యూ, రిజిస్ట్రేషన్, స్టాంపుల శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు తెలిపారు. ఈ నిర్ణయంతో ఇకపై అసైన్డ్ భూముల లబ్ధిదారులైన పేదలకు సర్వహక్కులు లభించనున్నట్లు చెప్పారు. రాష్ట్ర సచివాలయంలో మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. భూమి యాజమాన్యానికి సంబంధించి మార్పులు, సంస్కరణలు, ప్రయోజనకరమైన నిర్ణయాల్ని వైఎస్సార్సీపీ ప్రభుత్వం తీసుకురావడంపై హర్షం వ్యక్తం చేశారు. ‘మొదట్లో వ్యవసాయం తప్ప మరొక ఉపాధిమార్గం ఉండేది కాదు. అలాంటిది, ఈ ప్రభుత్వం వచ్చాక 20 ఏళ్లుగా తమకిచ్చినటువంటి భూమిపై సాగుచేసుకుంటున్న వ్యక్తికి ఆ భూమిపై అన్నిరకాల హక్కుల్ని కల్పించింది ఈ ప్రభుత్వం. ఇంతవరకు ఏ ప్రభుత్వం ఇలాంటి మహత్తర గొప్ప నిర్ణయం తీసుకోలేదని స్పష్టంచేస్తున్నాను’ అని చెప్పారు. 20 ఏళ్లపాటు అనుభవమున్న భూమిపై సర్వహక్కులు.. ఈ అంశంపై ఆయన మాట్లాడుతూ.. ‘ 1977లో ఏపీ శాసనసభ ప్రొహిబిషన్ ఆఫ్ ట్రాన్స్ఫర్ యాక్ట్ (పీఓటీ)–1977 అనే చట్టాన్ని తీసుకొచ్చింది. ఆ చట్టం ఏ నేపథ్యంలో వచ్చిందంటే, ఆనాడు గ్రామాల్లో ఉన్నటువంటి పరిస్థితుల్ని అధ్యయనం చేసిన పెద్దలు, ప్రభుత్వం.. పేదలకు ఇస్తున్న భూమి జమీందార్లకు, భూస్వాములకు అమ్మకం చేస్తున్నారని.. తద్వారా వారికి ఉపాధికల్పించడానికి ఇచ్చిన భూమి వారి వద్ద లేకుండా పోతుందనే విషయాన్ని గ్రహించారు. దీంతో ప్రభుత్వ లక్ష్యం దెబ్బతింటున్న నేపథ్యంలో 1977 చట్టాన్ని తీసుకొచ్చారు. ఇప్పటికి 40 ఏళ్లు దాటాయి. దేశంలోనూ సమాజంలోనూ అనేక మార్పులు వచ్చాయి. నిరుపేదల్లో అక్షరాస్యత పెరిగింది. గ్రామాల్లో భూస్వాములు, జమీందార్లు లేకుండా.. అందరికీ అనేక ఉపాధిమార్గాలు అందుబాటులోకొచ్చాయి. ఈనేపథ్యంలో ఒక మేజర్ సంస్కరణ తీసుకురావాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆలోచన చేశారు. ఆ ఆలోచనే.. ఏపీ కేబినెట్లో తీర్మానించినట్టుగా, 20 ఏళ్లపాటు అనుభవంలో ఉన్న అసైన్డ్ భూమిపైనున్న ఆంక్షలన్నీ ఎత్తేసి ఆ భూమిపై సర్వహక్కుల్ని లబ్ధిదారులకు కల్పించారు. అంటే, ఒక ప్రయివేటు భూమిపై వ్యక్తులకున్న హక్కులన్నీ... నేటికి 20 ఏళ్లుగా సాగుచేసుకుంటున్న అసైన్డ్భూమి రైతులకు కూడా ఉంటాయని ప్రభుత్వం స్పష్టం చేస్తుంది’ అని అన్నారు. రైత్వారీ పట్టాపొందిన వారికే ఆ భూమిపై హక్కు చట్టాలు తెలియక, లేదంటే అన్యాక్రాంతం చేసినా, లేక ఇప్పటికే భూములు అమ్ముకున్నట్లైతే.. వాటిని కొనుగోలు చేసిన వారికి మాత్రం పీఓటీ చట్టంలో రిలీఫ్ ఉండదని చెప్పారు. చట్టంలో దాని స్థాయి యథారీతిగానే ఉంటుందని.. ఆ భూమిపై హక్కు అప్పట్లో ఒరిజినల్ రైత్వారీ పట్టా పొందిన రైతుకు మాత్రమే చెందుతుందని స్పష్టంచేశారు. కనుక ఇప్పటికే సదరు అసైన్డ్ భూములు కొనుగోలు చేసుకున్నవారికి హక్కులు ఉండవని అర్ధం చేసుకోవాలని సూచించారు. అసైన్డ్ భూమి పొంది, 20 ఏళ్లకు పైబడి సాగుచేసుకుంటున్న భూమిపై సంబంధిత రైతుకు పూర్తిహక్కుల్ని ఈ ప్రభుత్వం కల్పించడంపై హర్షం వ్యక్తం చేశారు. 15.21 లక్షల మంది రైతులకు లబ్ధి.. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల... రాష్ట్రంలో సుమారుగా 15.21లక్షల మంది అసైన్డ్ రైతులు లబ్ధిపొందుతున్నారని అన్నారు. ‘20 ఏళ్లుదాటి ప్రభుత్వ భూమి అనుభవంలో ఉన్నవారి సంఖ్య ఇది. ఇప్పటికి ప్రభుత్వం దగ్గర ఉన్న గణాంకాల ప్రకారం 33.29 లక్షల ఎకరాల్ని రైతులకు అసైన్డ్ చేయగా 19.21 లక్షలమంది లబ్ధిదారులు ఉన్నారని.. వీటిల్లో 27.41 లక్షల ఎకరాల భూమిపై ప్రస్తుతం కేబినెట్ నిర్ణయంతో ఆంక్షల్ని ఎత్తివేయనున్నట్లు తెలిపారు. చదవండి: తప్పు చేసింది టీడీపీ హయాంలో.. విషం వీరిపైనా! -
రాష్ట్ర చరిత్రలోనే తొలిసారిగా అసైన్డ్ భూములపై సర్వ హక్కులు
-
చరిత్రాత్మక నిర్ణయం.. ‘అసైన్డ్’ రైతుల జీవితాల్లో వెలుగు
సాక్షి, అమరావతి: రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అసైన్డ్ భూములపై యాజమాన్య హక్కులు కల్పిస్తూ వైఎస్ జగన్ ప్రభుత్వం చరిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. కేటాయించిన 20 సంవత్సరాల తర్వాత అసైన్డ్ భూముల యజమానులకు సర్వ హక్కులు ఇవ్వడం భూముల వ్యవహారాల్లోనే మేలి మలుపు. దీనివల్ల 15 లక్షల మందికిపైగా రైతులకు ప్రయోజనం చేకూరడంతోపాటు రాష్ట్రంలో అసైన్డ్ భూముల వివాదాలకు తెరపడనుంది. సీఎం వైఎస్ జగన్ అధ్యక్షతన బుధవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో లక్షలాది మంది రైతుల బతుకు చిత్రాన్ని మార్చే అత్యంత కీలకమైన ఈ ప్రతిపాదనకు ఆమోద ముద్ర వేశారు. భూమి లేని నిరుపేదలు, ఆర్మీలో పని చేసిన వారు, స్వాతంత్య్ర సమర యోధులకు వ్యవసాయ భూములు ఇస్తారు (అసైన్ చేస్తారు). తమకు ఇచ్చిన భూములను స్వాతంత్య్ర సమర యోధులు, ఆర్మీలో పని చేసిన వారు (ఎక్స్ సర్వీస్మెన్).. పదేళ్ల తర్వాత అమ్ముకోవచ్చు. కానీ నిరుపేదలు మాత్రం అమ్ముకునే అవకాశం లేదు. 1954కు ముందు భూములు ఇచ్చిన వారికి పట్టాల్లో ఎక్కడా వాటిని అమ్మకూడదనే షరతు లేదు. 1954 తర్వాత ఇచ్చిన అసైన్డ్ చట్టాల్లో మాత్రం భూములు అమ్మకూడదనే నిబంధన ఉంది. దీంతో ఈ భూములన్నింటినీ నిషేధిత జాబితా 22 (ఎ)లో పెట్టారు. దీనివల్ల వాటి క్రయవిక్రయాలకు అవకాశం లేకుండా పోయింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 1954కు ముందు అసైన్డ్ అయిన భూములను నిషేధిత జాబితా నుంచి తీసివేసే ప్రక్రియ ప్రారంభించింది. 1954 తర్వాత అసైన్డ్ అయిన భూములు మాత్రం నిషేధిత జాబితాలో ఉన్నాయి. 1977లో ఏపీ అగ్రికల్చరల్ ల్యాండ్ (ప్రొహిబిషన్ ఆఫ్ ట్రాన్స్ఫర్–పీఓటీ) చట్టం వచ్చింది. దీని ప్రకారం భూమి లేని నిరుపేదలకు వ్యవసాయం కోసం ఇచ్చిన భూములు అమ్ముకోకూడదు. ఎలాంటి కష్టం వచ్చినా, అవసరం వచ్చినా, చదువుల కోసమైనా, ఆరోగ్యం కోసమైనా అమ్ముకునే అవకాశం లేదు. ఈ చట్టం రూపొందించడానికి ముందు ఉన్న అసైన్డ్ భూములు కూడా ఈ చట్టం వల్ల నిషేధిత జాబితాలోకి వచ్చేశాయి. హక్కు లేక.. అమ్ముకోలేక.. తమకు ఇచ్చిన భూమిలో ఏదైనా అవసరం వచ్చి అరెకరం, ఇంకొంత గానీ అమ్ముకోవాలనుకుంటే చట్ట ప్రకారం అమ్ముకోలేని పరిస్థితి ఉండడంతో అసైన్డ్ రైతులు తమ భూములు రిజిస్ట్రేషన్ చేయడానికి అవకాశం లేక కాగితాల మీద రాసి అమ్మకాలు జరిపారు. ఫలితంగా వారికి రావాల్సిన రేటులో కనీసం 25 శాతం కూడా దక్కేది కాదు. తక్కువ రేటుకే తమ భూములను సాదాబైనామాల పద్ధతిలో అమ్ముకునేవారు. ఆ భూమిపై హక్కు లేకపోవడం వల్ల రెవెన్యూ శాఖ ఎప్పుడైనా వారికి నోటీసులు ఇచ్చే అవకాశం ఉండేది. ఆ భూమి ప్రభుత్వం తీసేసుకుంటుందని, వేరే అవసరాలకు రిజర్వు చేస్తోందనే భయాందోళనలు రైతుల్లో ఉండేవి. మరో వైపు రెవిన్యూ రికార్డులు క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితిని తెలిపేలా లేవు. రాష్ట్రంలో ఇప్పటి వరకు సుమారు 19,21,855 మందికి 33,29,908 ఎకరాలు అసైన్డ్ చేస్తే ఆ రికార్డులు క్షేత్ర స్థాయికి తగ్గట్టుగా లేవు. 1954 నుంచి అసైన్మెంట్లు (కేటాయింపులు) జరుగుతూనే ఉన్నాయి. అంటే 70 సంవత్సరాల తర్వాత కూడా అసైన్డ్ భూములపై రైతులకు హక్కులు లేవు. ప్రజాప్రతినిధుల కమిటీతో విస్తృత అధ్యయనం ఈ భూములపై అనేక విజ్ఞప్తులు అందడంతో వీటిపై అధ్యయనం చేసి నివేదిక ఇచ్చేందుకు రెవిన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు నేతృత్వంలో 13 మంది ఎస్సీ, ఎస్టీ ఎమ్మెల్యేలతో 2022 ఆగస్టు 30న సీఎం జగన్ ప్రజాప్రతినిధుల కమిటీ ఏర్పాటు చేశారు. ఆ కమిటీ కర్ణాటక, తమిళనాడులో పర్యటించి అక్కడి విధానాలపై అధ్యయనం చేసింది. అసైన్డ్ భూములకు సంబంధించి ఇతర రాష్ట్రాల్లో ఉన్న చట్టాలు, నియమ నిబంధనలను సైతం క్షుణ్ణంగా పరిశీలించింది. కేరళ రాష్ట్రంలో అసైన్ చేసిన మూడేళ్ల తర్వాత, కర్ణాటకలో 25 ఏళ్ల తర్వాత, తమిళనాడులో పదేళ్ల తర్వాత కొన్ని నిబంధనలతో అమ్ముకునే అవకాశం ఉందన్న విషయాన్ని కమిటీ పరిగణనలోకి తీసుకుంది. కర్ణాటకలో ఐదేళ్ల తర్వాత కలెక్టర్ అనుమతితో అసైన్డ్ భూములను అమ్ముకోవచ్చు. తమిళనాడులో మిగులు భూముల్లో ఇచ్చిన అసైన్మెంట్ అయితే 25 ఏళ్ల తర్వాత అమ్ముకోవచ్చు. వీటన్నింటినీ పరిశీలించిన తర్వాత మన రాష్ట్రంలో అసైన్ చేసిన 20 ఏళ్ల తర్వాత లబ్ధిదారులు, వారు లేకపోతే వారి వారసులు (హక్కుదారులు) వారికి అవసరమైనప్పుడు అమ్ముకునే అవకాశం కల్పించాలని కమిటీ భావించింది. ఇందుకోసం ఏపీ అసైన్మెంట్ (పీఓటీ)–1977కు సవరణలు చేయాలని కమిటీ ప్రభుత్వానికి సిఫారసు చేస్తూ నివేదిక ఇచ్చింది. అంటే అసైన్మెంట్ జరిగి 20 ఏళ్లు పూర్తయితే అసైన్దారులు, వారి వారసులకు పూర్తి యాజమాన్య హక్కులు ఇవ్వాలని సిఫారసు చేసింది. దీనికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. 15.21 లక్షల మంది రైతుల జీవితాల్లో వెలుగు ప్రభుత్వ తాజా నిర్ణయం వల్ల పేద బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ రైతులకు మేలు జరుగుతుంది. సుమారు 15,21,160 మంది భూమి లేని నిరుపేదలకు వారికి సంబంధించిన 27,41,698 ఎకరాలపై పూర్తి యాజమాన్య హక్కులు లభిస్తాయి. 20 ఏళ్లకు ముందు ఇచ్చిన భూములన్నింటికీ ఇది వర్తిస్తుంది. ఈ భూములన్నీ 1954 తర్వాత అసైన్మెంట్ చేసినవే. ఈ 20 ఏళ్లలో 4,00,695 మందికి 5,88,211 ఎకరాల భూమిని అసైన్ చేశారు. ప్రతి సంవత్సరం రెవిన్యూ విభాగం 20 ఏళ్లు పూర్తయిన భూముల జాబితాను తయారు చేసి, వాటిని 22(ఎ) నుంచి తొలగిస్తుంది. గతంలో మాదిరిగా ఒక భూమిని 22(ఎ) నుంచి తొలగించాలంటే అధికారుల చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదు. రెవెన్యూ శాఖ తనకు తానే 20 ఏళ్లు దాటిన భూములను జాబితా నుంచి తీసివేస్తుంది. అసైన్డ్ రైతులు ఆఫీసుల చుట్టూ తిరిగే బాధ ఉండదు. అవినీతి ఉండదు. పారదర్శకంగా ఈ ప్రక్రియ నడుస్తుంది. అదే సమయంలో ఎవరైనా 20 ఏళ్లకు ముందే పేద రైతుల నుంచి భూములు కొనుక్కుని ఉంటే వారికి ఎలాంటి ప్రయోజనం ఉండదు. వారికి ఎటువంటి హక్కులు రావు. అలాంటి వారి విషయంలో 1977 పీఓటీ చట్టం అమల్లో ఉంటుంది. పదేళ్ల తర్వాత ఇళ్ల పట్టాలు అమ్ముకోవచ్చు వ్యవసాయ భూములే కాకుండా ప్రభుత్వం ఇళ్ల పట్టాలు నిరుపేదలకు అసైన్ చేసింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం 31 లక్షల ఇళ్ల పట్టాలను అక్కచెల్లెమ్మలకు ఇచ్చింది. ఇలా ఇచ్చిన ఇళ్లపై 20 సంవత్సరాల తర్వాత గత చట్టాల ప్రకారం సర్వ హక్కులు లభించేవి. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక దాన్ని 10 ఏళ్లకు తగ్గిస్తూ పీఓటీ చట్టంలో సవరణ చేసింది. నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు పథకం కింద పట్టాలు పొందిన వారితోపాటు, మిగిలిన వారికీ ఇది వర్తిస్తుంది.