-
Rajasthan Assembly elections 2023: అల్లర్లు, అవినీతిలో రాజస్తాన్ టాప్
జైపూర్: నేరాలు, అవినీతి, అల్లర్లలో రాజస్తాన్ను కాంగ్రెస్ ప్రభుత్వం దేశంలోనే అగ్రస్థానంలోకి తీసుకెళ్లిందని ప్రధాని మోదీ ఎద్దేవాచేశారు. శనివారం రాజస్తాన్లోని భరత్పూర్, నాగౌర్లో జరిగిన ఎన్నికల ప్రచార సభల్లో మోదీ పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై, ముఖ్యమంత్రి గెహ్లాత్పై విమర్శలు ఎక్కుపెట్టారు. ‘ ఓవైపు విశ్వవిజేతగా భారత్ ప్రభవిస్తోంది. మరోవైపు రాజస్తాన్లో ఏం జరుగుతోందో మీకందరికీ తెల్సిందే. అల్లర్లు, నేరాల నమోదులో రాజస్తాన్ అగ్రపథంలో దూసుకుపోతోంది. బుజ్జగింపు రాజకీయాల కారణంగా సంఘ విద్రోహ శక్తులు స్వైరవిహారం చేస్తున్నాయి. అందుకే ఈసారి మీకు ఓట్లు వేయబోము అని మెజీషియన్కు ఓటర్లు చెప్పేశారు. ఈసారి ఎన్నికల తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్ అదృశ్యమవుతుంది. డిసెంబర్ మూడున కాంగ్రెస్ మాయమవడం ఖాయం’’ అని గెహ్లోత్నుద్దేశిస్తూ మోదీ విమర్శించారు. చిన్నతనంలో తండ్రికి సాయపడుతూ గెహ్లోత్ మెజీషియన్గా దేశపర్యటన చేసిన సంగతి తెల్సిందే. ఈనెల 25వ తేదీన రాష్ట్రంలో పోలింగ్ జరగనుంది. డిసెంబర్ మూడో తేదీన ఫలితాలు ప్రకటిస్తారు. వారెక్కడుంటే నేరాలు అక్కడ ‘ ఎక్కడ కాంగ్రెస్ ప్రభుత్వాలు కొలువుతీరాయో అక్కడ నేరగాళ్లు, ఉగ్రవాదులు, అల్లర్లు పెరిగిపోతున్నాయి. కాంగ్రెస్ బుజ్జగింపు రాజకీయాలకు పెట్టిందిపేరు. ప్రజల జీవితాలను పణంగా పెట్టేందుకు ఎంతగా దిగజారేందుకైనా కాంగ్రెస్ సిద్ధం. అవినీతి పరాకాష్టకు చేరింది. ఈ ఐదేళ్ల కాంగ్రెస్ హయాంలో మహిళలు, దళితులపై నేరాలు ఎక్కువయ్యాయి. హోలీ, శ్రీ రామనవమి, హనుమాన్ జయంతి.. ఏ పర్వదినమైనా సరే రాష్ట్ర ప్రజలు ప్రశాంతంగా పండుగ జరుపుకున్నదే లేదు. ఎప్పుడూ అల్లరిమూకల దాడులు, ఘర్షణలు, వివాదాలు, కర్ఫ్యూ.. ఇవే రాజస్తాన్లో దర్శనిమిచ్చాయి. మహిళలు అబద్ధపు రేప్ కేసులు పెడుతున్నారని స్వయంగా సీఎం వ్యాఖ్యానించారు. ఇలాంటి వ్యక్తి మహిళలను రక్షిస్తారా?. ఈయనకు ఒక్క నిమిషమైనా సీఎం కుర్చీలో కూర్చొనే హక్కు ఉందా?’’ అని మోదీ మండిపడ్డారు. ‘మగాళ్లు ఉన్న రాష్ట్రం కాబట్టే రాజస్తాన్లో రేప్లు ఎక్కువ అంటూ మంత్రి శాంతికుమార్ ధరివాల్ మాట్లాడతారు. ఇలాంటి వ్యాఖ్యలు చేసే నేతలు ఉన్నందుకు కాంగ్రెస్ పార్టీ సిగ్గుపడాలి. అసెంబ్లీలో ఇంత దారుణంగా మాట్లాడినా ఈ మంత్రిపై ఎలాంటి శిక్షలు లేవు. ఎందుకంటే సీఎం రహస్యాలు ఈయనకు తెలుసు మరి. పైగా ఈయనకు రివార్డ్గా టికెట్ దక్కింది’’ అంటూ మోదీ వ్యాఖ్యానించారు. దళితుడు ఉన్నతాధికారి కావడం ఇష్టం లేదు ‘‘ దళితులపై కాంగ్రెస్ వివక్ష చూపుతోంది. డీగ్ జిల్లాకు చెందిన హీరాలాల్ సమరియా ప్రధాన సమాచార కమిషనర్(సీఐసీ)గా బాధ్యతలు చేపట్టారు. ఆ పదవి స్వీకరించిన తొలి దళితుడు ఆయన. ఈయన ఎంపిక సమావేశాన్ని కాంగ్రెస్ బాయ్కాట్ చేసింది. దళిత అధికారి అంతటి ఉన్నతస్థాయికి చేరుకోవడం కాంగ్రెస్కు ఇష్టంలేదు. రాష్ట్రంలో నిత్యావసర సరకులు, ఇంధన ధరల పెరుగుదలకు గెహ్లోత్ సర్కారే కారణం. పొరుగు ఉన్న రాష్ట్రాల్లో కంటే రాజస్తాన్లో లీటర్ పెట్రోల్ రూ.12 ఎక్కువ ధర. మేం అధికారంలోకి రాగానే ధరలను సమీక్షించి, సవరిస్తాం’’ అని మోదీ హామీ ఇచ్చారు. -
'ఐక్యమయ్యాం.. విజయం సాధిస్తాం: రాహుల్ గాంధీ
జైపూర్: రాజస్థాన్ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో జైపూర్లో ప్రచారానికి కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీని సీఎం అశోక్ గహ్లోత్, సచిన్ పైలెట్ సంయుక్తంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారిని చూసిన రాహుల్.. చిరునవ్వులు కురిపించారు. మనం ఏకమయ్యాం.. రాష్ట్రంలో విజయం సాధిస్తాం అని అన్నారు. రాజస్థాన్లో సీనియర్ నాయకులు అశోక్ గహ్లోత్, సచిన్ పైలెట్కు మధ్య కొద్ది రోజులుగా విబేధాలు నడుస్తున్నాయి. గత ప్రభుత్వం ఏర్పాటులో తన వర్గీయులకు అన్యాయం జరుగుతుందని సచిన్ పైలెట్ ఆరోపించారు. 2020లో దాదాపు 18 మంది ఎమ్మెల్యేలతో సచిన్ పైలెట్.. సీఎం అశోక్ గహ్లోత్పై తిరుగుబాటు యత్నం చేశారు. ఆ తర్వాత ఆయన తన ఉపముఖ్యమంత్రి, పార్టీ రాష్ట్ర అధ్యక్షుని పదవులను కోల్పోయారు. పార్టీ కేంద్ర అధిష్ఠానం కల్పించుకుని అప్పటికి సద్దుమణిగేలా చేసింది. అప్పటి నుంచి ఇద్దరు నేతల మధ్య విబేధాలు కొనసాగుతున్నాయి. రాజస్థాన్లో నవంబర్ 25న పోలింగ్ జరగనుంది. ఇప్పటికి అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ సాంప్రదాయాన్ని తిరగరాస్తామని ధీమాతో ఉంది. అటు.. ప్రతిపక్షంలో ఉన్న బీజేపీ ఈసారి అధికారాన్ని చేజిక్కించుకోవాలని చూస్తోంది. ఇదీ చదవండి: రాజకీయ విబేధాల నడుమ దీపావళి వేడుకల్లో అజిత్ పవార్, సుప్రీయా సూలే -
పైలట్తో కుస్తీకి బై బై..కలిసి గెలుస్తున్నాం: అశోక్ గెహ్లాట్
జైపూర్ : ఆ ఇద్దరు కాంగ్రెస్ అగ్రనేతలు మొన్నటిదాకా ఒకరిపై ఒకరు విమర్శల దాడి చేసుకున్నారు. ఎవరికి వారే అన్నట్టు గ్రూపు రాజకీయాలు నడిపారు. ఇప్పుడు ఆ రాష్ట్రంలో ఎన్నికలు రాగానే పార్టీ కోసం ఒక్కటయ్యారు. తమ మధ్య ఏమీ లేదని,పార్టీ గెలుపే తమ ఉమ్మడి లక్ష్యమని చెబుతున్నారు.ఇద్దరు నేతల్లో ఒకరు రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ కాగా, మరొకరు ఆ రాష్ట్ర మాజీ డిప్యూటీ సీఎం సచిన్ పైలట్. తామిద్దరం ఒక్కటే అన్న సంకేతాలను ఇటు పార్టీ క్యాడర్కు,అటు ప్రజల్లోకి బలంగా పంపేందుకు బుధవారం ఉదయం రాజస్థాన్ సీఎం అశోక్గెహ్లాట్ ఎక్స్(ట్విటర్)లో ఒక ఫొటో షేర్ చేశారు. ఈ ఫొటోకు టు గెదర్ విన్నింగ్ అగెయిన్(కలిసి గెలుస్తున్నాం) అనే క్యాప్షన్ను జోడించారు. ఈ ఫొటోలో సచిన్ పైలట్, పార్టీ నేషనల్ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్తో కలిసి అశోక్ గెహ్లాట్ చర్చిస్తున్నారు. అటు సచిన్ పైలట్ కూడా తాజాగా మీడియాతో మాట్లాడుతూ తనకు గెహ్లాట్కు మధ్య ఎలాంటి వివాదాలు లేవని రాజకీయ నాయకులుగా తాము హుందాగా వ్యవహరించాల్సి ఉంటుందన్నారు. గతంలో పైలట్, గెహ్లాట్పై చేసిన విమర్శలను గుర్తు చేయగా ‘నేనలాంటి వ్యాఖ్యలేవీ చేయలేదు..ఎవరన్నారో వారే బాధ్యత వహిస్తారు’ అని తోసిపుచ్చారు. ప్రస్తుతం ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో భాగంగా రాజస్థాన్లో ఈ నెల23న పోలింగ్ జరగనుంది. एक साथ जीत रहे हैं फिर से#कांग्रेस_फिर_से pic.twitter.com/saWIdZ0SGl — Ashok Gehlot (@ashokgehlot51) November 15, 2023 ఇదీ చదవండి..ఒక్కసారి డిసైడ్ అయితే.. తగ్గేదేలే! రైతు బిడ్డ ఘనత -
Rajasthan Election 2023: గహ్లోత్కు సొంతింట సమస్యలు
సర్దార్పురా. కాంగ్రెస్ పాలిత రాజస్థాన్లో ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో అందరి దృష్టినీ ఆకర్షిస్తున్న స్థానం. ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ ప్రాతినిధ్యం వహిస్తున్న సర్దార్పురాలో ఎన్నెన్నో సమస్యలు సీఎంను చీకాకు పెడుతున్నట్టు వస్తున్న వార్తలు కాంగ్రెస్ పార్టీని కలవరపరిచేవే. వాటిని హైలైట్ చేస్తూ, సీఎం సెగ్మెంట్లోనే సమస్యల పరిష్కారానికి దిక్కు లేదంటూ బీజేపీ రాష్ట్రమంతటా ప్రచారాన్ని హోరెత్తిస్తోంది.. సర్దార్పురా అసెంబ్లీ స్థానం రాజస్తాన్లో గత పాతికేళ్ల నుంచీ అందరి నోళ్లలోనూ నానుతూ వస్తోంది. సీఎం అశోక్ గెహ్లోత్ ఇక్కణ్నుంచి తొలిసారి 1998లో ఉప ఎన్నికలో నెగ్గారు. ఆ ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పీసీసీ చీఫ్గా ఆయన సారథ్యంలో కాంగ్రెస్ ఘనవిజయం సాధించింది. 200 అసెంబ్లీ స్థానాలకు గాను ఏకంగా 153 సీట్లు గెలుచుకుంది. దాంతో గెహ్లోత్ తొలిసారి సీఎం పీఠమెక్కారు. అప్పటినుంచీ ఇక్కడ వరుసగా ఆయనే గెలుపొందుతూ వస్తున్నారు. సర్దార్పురాలో కాంగ్రెస్ మొత్తమ్మీద 8సార్లు నెగ్గగా రెండుసార్లు బీజేపీ గెలిచింది. గెహ్లోత్ తొలిసారి నెగ్గేందుకు ముందు 1990, 1993ల్లో బీజేపీ తరఫున రాజేంద్ర గెహ్లోత్ ఇక్కడ రెండుసార్లు గెలిచారు. 1998 నుంచి అశోక్ గెహ్లోత్ హవాయే సాగుతూ వస్తోంది. 2008లో బీజేపీ నుంచి మరోసారి బరిలో దిగిన రాజేంద్ర గెహ్లోత్ 15 శాతానికి పైగా ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. ఇక 2013, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ శంభుసింగ్ ఖేత్సర్ను బరిలో దించినా లాభం లేకపోయింది. గెహ్లోత్ చేతిలో ఆయన వరుసగా 13 శాతం, 30 శాతానికి పైగా ఓట్ల తేడాతో ఓడారు. అయినా... స్వయంగా సీఎం ప్రాతినిధ్యం వహిస్తున్నా తమ సమస్యలకు మాత్రం ఎండ్ కార్డు పడటం లేదన్నది సర్దార్పురా వాసుల ఆవేదన. వానాకాలం వస్తే చాలు, ఎక్కడ చూసినా నీరు నిలిచిపోయి తమ బతుకు దుర్భరమవుతుందని శివ్సింగ్ రాథోడ్ అనే స్థానికుడు వాపోయాడు. ‘‘రోడ్లు దారుణంగా ఉన్నాయి. డ్రైనేజీ అవ్యవస్థ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ప్రతి వానాకాలంలోనూ డ్రైనేజీలు పొంగిపొర్లడం, రోడ్లన్నీ నీటితో నిండిపోవడం నియోజకవర్గంలో చాలాచోట్ల సాధారణ దృశ్యం. సీఎం సెగ్మెంట్లోనే ఇలాంటి సమస్యలకు దశాబ్దాలుగా మోక్షం దక్కకపోవడం నిజంగా దారుణం’’అన్నాడాయన. కాలనీలే మునిగాయి...! 2021 వర్షాకాలంలోనైతే డ్రైనేజీలు పొంగి పొర్లి సర్దార్పురా పట్టణంలో కాలనీలకు కాలనీలే నీట మునిగాయి! దాంతో సహాయక చర్యల కోసం ఏకంగా సైన్యాన్ని రంగంలోకి దించాల్సిన పరిస్థితి తలెత్తింది!! రెండేళ్లు గడిచిపోయినా సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా ఒక్క చర్య కూడా తీసుకోలేదని గోపాల్సింగ్ అనే స్థానికుడు ఆవేదన వెలిబుచ్చాడు. నియోజకవర్గంలో చాలాచోట్ల డ్రైనేజీ నీళ్లతోనే కూరగాయలు పండిస్తున్నారంటూ రాథోడ్ ఆందోళన వెలిబుచ్చాడు. ఇది చాలా ఏళ్లుగా జరుగుతున్నా యంత్రాంగం పట్టించుకోవడం లేదన్నది స్థానికుల ఫిర్యాదు. గెహ్లోత్ కేవలం తన సామాజికవర్గం ఓట్లు ఎక్కువగా ఉన్న కొన్ని ప్రాంతాలకు మాత్రమే అభివృద్ధిని పరిమితం చేయడమే ఈ సమస్యకు మూల కారణమని బీజేపీ ఆరోపిస్తోంది. మాలీలే ఎక్కువ... సర్దార్పురాలో మాలీ సామాజికవర్గం వారి సంఖ్య చాలా ఎక్కువ. తర్వాతి స్థానంలో ఓబీసీలుంటారు. ఇక జాట్లు, మహాజన్లు, ఎస్సీ, మైనారిటీలూ ఎక్కువగానే ఉన్నారు. చదవండి: జడ్జీలను ‘ఎంచు’కుంటోంది: కేంద్రంపై సుప్రీం మండిపాటు సర్దార్పురా అసెంబ్లీ స్థానం విశేషాలు.. జోధ్పూర్ జిల్లా నట్టనడుమ ఉన్న అసెంబ్లీ స్థానమిది. మహరాజు సర్దార్సింగ్ పేరిట దీనికి ఈ పేరొచ్చింది. ఇక్కడ ఆరు శతాబ్దాల నాటి మెహ్రాన్గఢ్ కోట ఉంది. దాని పక్కనే 300 ఏళ్ల కింద సర్దార్సింగ్ నిర్మించిన ఘంటా ఘర్ ఇప్పటికీ ఉంది. ఆ పక్కనే ఉన్న సర్దార్ మార్కెట్ కూడా ఆయన హయాంలో వచి్చనదే. సర్దార్పురా.. సమస్యల చిట్టా... రాజస్తాన్లోని అతి పెద్ద అసెంబ్లీ స్థానాల్లో సర్దార్పురా ఒకటి. స్వయానా సీఎం ప్రాతినిధ్యం వహిస్తున్న స్థానం. అయినా ఇక్కడ సమస్యలకు మాత్రం కొదవ లేదు...! ► అధ్వానమైన రోడ్లు ► దారుణమైన డ్రైనేజీ వ్యవస్థ ► తీవ్రమైన తాగునీటి సమస్య ► వాననీరు పోయే ఏర్పాట్ల లేమి ► ప్రతి సీజన్లోనూ నీట మునిగే కాలనీలు ►ఆరోగ్య సేవలు, వసతులకు తీవ్ర కొరత ►కలుషిత నీటితో పంటల సాగు ♦ మొత్తం ఓటర్లు 2,54,572 మంది ♦పురుషులు1,29,869 మంది ♦ స్త్రీలు1,24,703 మంది ♦మొత్తం పోలింగ్ కేంద్రాలు - 212 ♦పోలింగ్ తేదీ నవంబర్ 25 చదవండి: ధుంధాడ్లో దూకుడెవరిదో! -
రాజస్థాన్: ఎపుడూ డిపాజిట్ దక్కలే.. అయినా తగ్గేదేలే!
Rajasthan Assembly Elections 2023: రాజస్థాన్ ఎన్నికల సందర్బంగా 78 ఏళ్ల తీతర్ సింగ్ వార్తల్లో నిలిచారు. వరుసగా 32వ సారి కూడా ఎన్నికల బరిలో తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు రడీ అయ్యారు. 1970 నుంచి గ్రామపంచాయతీ నుంచి లోక్సభ వరకు 31 ఎన్నికల్లో పోటీ చేసిన తీతర్ సింగ్ ప్రతిసారీ ఓటమిని చవిచూశారు. అయితే తగ్గేదెలే అంటూన్న తితార్ సింగ్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. రాజస్థాన్లోని గంగానగర్కు చెందిన 78 ఏళ్ల తీతర్ సింగ్ మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం (MGNREGA) దినసరి కూలీ. తాజా ఎన్నికల్లో వరుసగా స్వతంత్ర అభ్యర్థిగా శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు నామినేషన్ దాఖలు చేశారు. కరణ్పూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి బీజేపీ, కాంగ్రెస్ పార్టీలతో పోటీకి సై అన్న తీతర్ సింగ్ ఈ పోటీ వెనుక అసలు ఉద్దేశాన్ని కూడా వెల్లడించారు. రాష్ట్రంలోని 25ఎఫ్ గులాబేవాలా గ్రామంలో నివాసం ఉంటున్న సౌదాగర్ సింగ్ కుమారుడు తీతర్ సింగ్. చదవింది ఐదవ తరగతి. కరణ్పూర్ అసెంబ్లీ నియోజకవర్గం 1985లో తొలిసారి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశాననీ అన్ని ఎన్నికల్లో ఓడిపోయినా ఆ ఆశ మాత్రం అలాగే ఉంది అంటారు తీతర్ సింగ్. ఎందుకంటే నాలుగు తరాలు గడిచినా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు అటు పేదలకుగానీ ఇటు గ్రామాభివృద్ధికి చేసిందేమీ లేదని విమర్శించారు.ఇప్పటికైనా పేద ప్రజలకు ప్రభుత్వభూమి, కనీస సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. అంతేకాదు తానుఎమ్మెల్యేగా ఎన్నికైతే గ్రామంలోని రోడ్ల అభివృద్ధితో పాటు పలు అభివృద్ధి పనులు చేపట్టడంతోపాటు భూమిలేని పేద కూలీలకు భూమి కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరతానని తెలిపారు. ఎన్నికలలో పోటీ చేయడానికి తన మేకలను, ఇంటిని అమ్ముకున్నారట. స్థానికుల నుంచి సేకరించిన కొద్దిపాటి విరాళాలతోనే పోటీకి దిగారు. స్నేహితులతో కలిసి డోర్ టు డోర్ కాన్వాసింగ్ చేయడం మరో ప్రత్యేకత. గిన్నిస్ బుక్లో స్థానం సంపాదించాలనేది సింగ్ కల అట. వృద్ధాప్యం కారణంగా చదవడం, రాయడం మర్చిపోయినా సంతకం మాత్రం చేయగలరు. అయినా ఎన్నికల్లో పోటీ చేయడాన్ని మాత్రం వీడలేదు. అంతేకాదు ప్రతీ ఎన్నికలోనూ అతనికి డిపాజిట్ కూడా దక్కలేదు. 2018 రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో 653 ఓట్లు, 2013 అసెంబ్లీ ఎన్నికల్లో 427, 2008 అసెంబ్లీ ఎన్నికల్లో 938 ఓట్లు వచ్చాయట. ఇక 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నుంచి సురేంద్ర పాల్ సింగ్, కాంగ్రెస్ నుంచి గుర్మీత్ సింగ్ కూనర్తో సింగ్ తలపడనున్నారు. తీతర్ సింగ్కు భార్య గులాబ్ కౌర్, ఇక్బాల్ సింగ్ ,రిచ్పాల్ సింగ్ అనే ఇద్దరు కుమారులున్నారు. ఈసారి ఎన్నికల్లో భార్యా పిల్లలు తనకు మద్దతుగా నిలిచారని సింగ్ చెప్పారు. కాగా రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన పోటీ కాంగ్రెస్, బీజేపీ మధ్యనే నెలకొంది. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ సదర్పుర అసెంబ్లీ నియోజక వర్గం నుంచి ఇప్పటికే నామినేషన్ వేశారు. ఇక్కడ నవంబర్ 25న పోలింగ్, డిసెంబర్ 3న ఓట్ల లెక్కింపు జరగనుంది. Titar singh srikaranpur nirdlay akele dum lde 💪🏻 pic.twitter.com/nuWGnNmI9k — Rajan Gupta (@rajangupta066) November 2, 2023 -
కేంద్రానికి రాజస్థాన్ సర్కార్ షాక్!.. ఇద్దరు ఈడీ అధికారుల అరెస్టు
జైపూర్: రాజస్థాన్లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య పోరు నడుస్తోంది. రాష్ట్రంలోని కాంగ్రెస్ నాయకుల మీద ఈడీ దాడులు జరుపుతుండగా.. రాష్ట్రంలోని దర్యాప్తు సంస్థలు కూడా కేంద్రధీటుగా బదులిస్తున్నాయి. తాజాగా కేసు నమోదు వ్యవహారంలో ఇద్దరు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు లంచం తీసుకుంటుండగా రాష్ట్ర ఏసీబీ (అవినీతి వ్యతిరేక సంస్థ) అధికారులు అరెస్టు చేశారు. ఓ చిట్ ఫండ్కు సంబంధించిన ఓ వ్యవహారంలో కేసు నమోదు చేయకుండా ఇద్దరు ఈడీ అధికారులు రూ.15 లక్షల లంచం తీసుకున్నారని ఏసీబీ అధికారులు ఆరోపించారు. వీరిద్దరూ ఆధారాలతో సహా పట్టుబడ్డారని తెలిపారు. విదేశీ మారక నిబంధనలను ఉల్లంఘించారనే ఆరోపణలపై రాజస్థాన్ సీఎం అశోక్ గహ్లోత్ కుమారుడు వైభవ్ను ఈడీ అక్టోబర్ 30న తొమ్మిది గంటల పాటు విచారించిన విషయం తెలిసిందే దీనిపై కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రాన్ని తీవ్రంగా విమర్శించింది. రాజకీయ కక్షతోనే కేంద్రం ఈడీ దాడులు జరిపిస్తోందని ఆరోపించింది. బీజేపీ హయాంలో కేంద్ర దర్యాప్తు సంస్థలు విశ్వాసాన్ని కోల్పోయాయని సీఎం గహ్లోత్ అన్నారు. ఈ క్రమంలోనే ఇద్దరు ఈడీ అధికారులను అరెస్టు చేయడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. Rajasthan ACB has arrested an ED official for taking a bribe of ₹15 lakhs. Modi thought he could scare Ashok Gehlot and Congress…😀 pic.twitter.com/AT9ZAyONF3 — Shantanu (@shaandelhite) November 2, 2023 రాజస్థాన్లో నవంబర్ 25న ఎన్నికల జరగనున్నాయి. ప్రస్తుతం అధికారంలో ఉన్న సీఎం అశోక్ గహ్లోత్ నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ.. మరోసారి అధికార పీఠం దక్కించుకోవాలని దూకుడుగా ఉంది. అటు.. ఈసారి తప్పకుండా అధికారం తమదేనని బీజేపీ ప్రయత్నాలు చేస్తోంది. అటు ఢిల్లీ మద్యం కుంభకోణంలో అరవింద్ కేజ్రీవాల్కు కూడా ఈడీ సమన్లు జారీ చేసింది. అయితే.. నేడు ఈడీ అధికారుల ముందు ఆయన హాజరుకావాల్సి ఉంది. కానీ ఈడీ సమన్లను వెనక్కి తీసుకోవాలని ప్రత్యుత్తరం రాస్తూ ఈడీ ముందు హాజరుకాలేదు. ఇదీ చదవండి: మూడు బ్యాగులతో ఎథిక్స్ కమిటీ ముందు హాజరైన మహువా మెయిత్రా -
ఈడీ ముందుకు రాజస్థాన్ సీఎం అశోక్ గహ్లోత్ కుమారుడు
ఢిల్లీ: రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ కుమారుడు వైభవ్ గహ్లోత్ నేడు ఢిల్లీలోని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) ఎదుట విచారణకు హాజరయ్యారు. విదేశీ మారకద్రవ్య ఉల్లంఘన కేసులో ఆయనను ఈడీ అధికారులు ప్రశ్నించనున్నారు. ఫారిన్ ఎక్స్ఛేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ (ఫెమా) నిబంధనలను ఉల్లంఘించారని పేర్కొంటూ వైభవ్ గెహ్లోత్కు ఈడీ ఇటీవల సమన్లు జారీ చేసింది. ఆగస్టులో జైపూర్, ఉదయ్పూర్, ముంబయి, ఢిల్లీలోని పలు ప్రదేశాలలో మూడు రోజుల పాటు ఈడీ దాడులు చేసింది. రాజస్థాన్ ఆధారిత హాస్పిటాలిటీ గ్రూప్ ట్రిటన్ హోటల్స్ & రిసార్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్తో సహా వర్ధ ఎంటర్ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థల డైరెక్టర్లు, ప్రమోటర్లు శివ శంకర్ శర్మ, రతన్ కాంత్ శర్మ తదితరులపై ఈడీ ఇటీవల దాడులు జరిపింది. వైభవ్ గెహ్లాట్తో వ్యాపారవేత్త రతన్ కాంత్ శర్మకు సంబంధాలు ఉన్నాయని గుర్తించినట్లు ఈడీ ఆరోపించింది. ఈ పరిణామాల అనంతరం వైభవ్ గహ్లోత్కు కూడా సమన్లు జారీ చేసింది. కాగా.. గతంలో రతన్ కాంత్ శర్మ కార్ రెంటల్ కంపెనీలో వైభవ్ గెహ్లోత్ వ్యాపార భాగస్వామిగా ఉన్నారు. రాజస్థాన్లో మరికొద్ది రోజుల్లో ఎన్నికలు సమీపిస్తున్న వేళ వైభవ్ గహ్లోత్పై ఈడీ దాడులు చేయడంతో కాంగ్రెస్ విమర్శలకు దిగింది. రాజకీయ కక్ష సాధింపు చర్యలో భాగమే ఈడీ దాడులు అని ఆరోపిస్తోంది. ఇదీ చదవండి: శివసేన, ఎన్సీపీ అనర్హత పటిషన్లపై స్పీకర్కు సుప్రీంకోర్టు తుది గడువు -
ఆవు పేడ కిలో రెండు రూపాయలకు కొంటాం: రాజస్తాన్ సీఎం
జైపూర్: రాజస్తాన్ సీఎం అశోక్ గెహ్లోత్ అయిదు గ్యారెంటీలను ప్రకటించారు. ప్రభుత్వ ఉద్యోగులకు పాత పింఛను విధానం అమలు, గోధన పథకం కింద ఆవుపేడను కిలో రెండు రూపాయల చొప్పున కొనుగోలు, కాలేజీ విద్యార్థులకు ల్యాప్టాప్ లేదా టాబ్లెట్ పీసీ పంపిణీ ఇందులో ఉన్నాయి. నవంబర్ 25వ తేదీన అసెంబ్లీకి జరిగే ఎన్నికల్లో తమ పార్టీని మళ్లీ గెలిపిస్తే వీటిని నెరవేరుస్తామని ఆయన శుక్రవారం మీడియా సమావేశంలో హామీ ఇచ్చారు. త్వరలోనే పార్టీ మేనిఫెస్టోను విడుదల చేస్తామన్నారు. స్కూళ్లలో ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెడతామని, ప్రకృతి వైపరీత్యాల్లో నష్టపోయిన వారికి రూ.15 లక్షల బీమా కల్పిస్తామని చెప్పారు. పాత పింఛను విధానాన్ని భవిష్యత్తులో కూడా కొనసాగించేలా చట్టం చేస్తామన్నారు. ప్రభుత్వ కాలేజీల్లో చేరే విద్యార్థులకు మొదటి ఏడాదిలోనే ల్యాప్టాప్ లేదా టాబ్ ఇస్తామన్నారు. ఇవికాకుండా, వంటగ్యాస్ సిలిండర్ను రూ.500కే అందజేయడం, రాష్ట్రంలోని 1.05 కోట్ల కుటుంబాల్లోని ఒక్కో మహిళకు ఏడాదికి విడతలుగా రూ.10 వేల చొప్పున అందజేస్తామని ఇప్పటికే ఆ పార్టీ నేత ప్రియాంకా గాంధీ వాద్రా ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా సీఎం గెహ్లోత్ కేంద్ర ప్రభుత్వం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ)ని దుర్వినియోగం చేస్తోందని ఆరోపించారు. ‘దేశంలో ఈడీ వీధి కుక్కల కంటే ఎక్కువగా హడావుడి చేస్తోందని ఒక సీఎం(భూపేష్ బఘేల్) అనాల్సి వచ్చింది. ఇంతకంటే దౌర్భాగ్యం ఇంకేముంటుంది?’ అని వ్యాఖ్యానించారు. అంత మాట అన్నారంటే ఆయన ఎంతగా బాధపడ్డారో అర్థం చేసుకోవాలని పేర్కొన్నారు. ‘దర్యాప్తు విభాగాలు మీకు రాజకీయ ఆయుధాలుగా మారాయి. మోదీజీ, మీకు అర్థం కావడం లేదు. మీకు కౌంట్డౌన్ మొదలయ్యింది’అని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ గోవింద్ సింగ్ దోతాస్రా ఇంటిపై గురువారం ఈడీ దాడులు జరిగిన విషయం తెలిసిందే. -
రాజస్తాన్ సీఎం గెహ్లోత్ కుమారుడికి ఈడీ సమన్లు
జైపూర్: రాజస్తాన్లో ఎన్నికల వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. పరీక్ష పేపర్ లీకేజీ కేసులో మనీల్యండరింగ్ ఆరోపణలపై రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు, పాఠశాల విద్యాశాఖ మాజీ మంత్రి గోవింద్ సింగ్ దోతాస్రా ఇళ్లపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) దాడులు జరిపింది. అదేవిధంగా, విదేశీ కరెన్సీ నిబంధనల ఉల్లంఘన కేసులో సీఎం అశోక్ గెహ్లోత్ కుమారుడు వైభవ్కు సమన్లు జారీ చేసింది. శుక్రవారం ఢిల్లీలోని తమ ప్రధాన కార్యాలయంలో జరిగే విచారణకు హాజరు కావాలని ఆయన్ను కోరింది. సీఆర్పీఎఫ్ బలగాల బందోబస్తు నడుమ గురువారం ఈడీ అధికారుల బృందం జైపూర్, సికార్లలోని గోవింద్ సింగ్ ఇళ్లలో సోదాలు చేపట్టారు. వచ్చే నెలలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఈయన సికార్ జిల్లాలోని లచ్చమన్గఢ్ నుంచి పోటీలో ఉన్నారు. అదేవిధంగా, దౌసా జిల్లాలోని మహువా సీటుకు పోటీలో ఉన్న కాంగ్రెస్ అభ్యర్థి ఓం ప్రకాశ్ హుడ్లా, మరికొందరి ఇళ్లలో కూడా సోదాలు చేపట్టినట్లు ఈడీ వర్గాలు తెలిపాయి. 2022 డిసెంబర్లో రాజస్తాన్ పబ్లిక్ సరీ్వస్ కమిషన్ నిర్వహించిన సీనియర్ టీచర్ గ్రేడ్–2 పరీక్షలో జనరల్ నాలెడ్జి ప్రశ్నపత్రం లీకైంది. అప్పటి విద్యాశాఖ మంత్రి గోవింద్సింగ్ తదితరులు కలిసి ఒక్కో అభ్యర్థి నుంచి రూ.8 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు వసూలు చేసి, ఈ దందాకు పాల్పడినట్లు ఈడీ ఆరోపిస్తోంది. వైభవ్పై ఆరోపణలేంటీ? సీఎం గెహ్లోత్ కుమారుడు వైభవ్ విదేశీ మాదక ద్రవ్య మారి్పడి చట్టం కేసును ఎదుర్కొంటున్నారు. 2011 నుంచి ఈ కేసుకు సంబంధించిన పత్రాలను సమకూర్చుకోవాల్సి ఉన్నందున వైభవ్ శుక్రవారం విచారణకు హాజరుకాకపోవచ్చని ఈడీ అంటోంది. విచారణ వాయిదా కోరవచ్చని భావిస్తోంది. రాజస్తాన్కు చెందిన ట్రిటాన్ హోటల్స్ అండ్ రిసార్ట్స్, వార్ధా ఎంటర్ ప్రైజెస్ సంస్థల ప్రమోటర్లకు చెందిన జైపూర్, ఉదయ్పూర్, ఢిల్లీల్లోని పలు ప్రాంతాల్లో ఆగస్ట్లో ఈడీ సోదాలు జరిపింది. వీరికి వైభవ్ గెహ్లోత్తో సంబంధాలున్నట్లు ఈడీ అనుమానిస్తోంది. దాడుల్లో రూ.1.2 కోట్ల లెక్కల్లో చూపని నగదును గుర్తించింది. -
బీజేపీ రెబల్ ఎమ్మెల్యే ఇంటికి సీఎం గెహ్లాట్
-
ముఖ్యమంత్రి పదవి నన్ను వదులుకోదు
న్యూఢిల్లీ: ముఖ్యమంత్రి పదవి వదులుకోవాలని తాను అనుకుంటున్నప్పటికీ ఆ పదవి తనను వదిలి పెట్టబోదని రాజస్తాన్ సీఎం, కాంగ్రెస్ సీనియర్ నేత అశోక్ గహ్లోత్ వ్యాఖ్యానించారు. త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిస్తే మళ్లీ తానే ముఖ్యమంత్రి అవుతానని పరోక్షంగా తేల్చిచెప్పారు. సీఎం పదవిపై ఆశలు పెట్టుకోవద్దంటూ పార్టీలో తన ప్రత్యర్థి అయిన సచిన్ పైలట్కు నర్మగర్భంగా సూచించారు. గహ్లోత్ గురువారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. ‘దేవుడి దయతో మీరు నాలుగోసారి ముఖ్యమంత్రి అవుతారని ఓ మహిళా నాతో చెప్పింది. ముఖ్యమంత్రి పోస్టు వదులుకోవాలని నేను అనుకుంటున్నా అది నన్ను వదలడం లేదని ఆమెతో చెప్పా. ఇక ఎప్పటికీ ఆ పదవి నన్ను వదలకపోవచ్చు’ అని గహ్లోత్ వెల్లడించారు. రాజస్తాన్లో సీఎం పోస్టు కోసం ఈసారి సచిన్ పైలట్ గట్టిగా పోటీపడుతున్నారు. ఈ నేపథ్యంలో గహ్లోత్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. పార్టీలో అంతర్గత కుమ్ములాటలు బయటపడ్డాయని ప్రత్యర్థులు అంటున్నారు. ఎవరికి టికెట్లు ఇచ్చినా అభ్యంతరం లేదు. ఎవరికి టికెట్లు ఇచ్చినా తనకు అభ్యంతరం లేదన్నారు. పైలట్ వర్గం సహా అందరితో చర్చించి, అభ్యర్థులను ఖరారు చేస్తామని వెల్లడించారు. ముఖ్యమంత్రి పదవిని ఎవరికి అప్పగించాలో పార్టీ నాయకత్వమే నిర్ణయిస్తుందని, పార్టీ నిర్ణయానికి అందరూ కట్టుబడి ఉండాల్సిందేనని తేల్చిచెప్పారు. రాష్ట్రంలో తాము చేసిన అభివృద్ధే తమ పార్టీని గెలిపిస్తుందని చెప్పారు. ముఖ్యమంత్రి పదవి వదులుకుంటానని చెప్పే ధైర్యం దేశంలో ఎంతమంది సీఎంలకు ఉందని ప్రశ్నించారు. రాజస్తాన్లో నవంబర్ 25న ఎన్నికలు జరుగనున్నాయి. -
సీఎం పదవిపై అశోక్ గెహ్లాట్ సంచలన వ్యాఖ్యలు
జైపూర్: వచ్చే నెలలో(నవంబర్) జరగబోయే అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు దేశంలో రాజకీయ వేడిని పెంచాయి. ప్రధాన పార్టీలన్నీ, అభ్యర్థుల ఎంపిక, ప్రచారాల్లో మునిగిపోయాయి. మిజోరాం, తెలంగాణలో ప్రాంతీయ పార్టీల ప్రభావం ఎక్కువ ఉన్నప్పటికీ.. మధ్యప్రదేశ్, రాజస్తాన్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో ప్రధానంగా బీజేపీ, కాంగ్రెస్ మధ్యే ద్విముఖ పోరు నెలకొని ఉంది. ఈ మూడింటిలో రెండు రాష్ట్రాల్లోనూ( చత్తీస్గఢ్, రాజస్థాన్) కాంగ్రెస్ అధికారంలో ఉంది. 200 స్థానాలున్న రాజస్థాన్ అసెంబ్లీకి నవంబర్ 25న ఒకే విడుతలో ఎన్నికలు జరగనున్నాయి. డిసెంబర్ 3న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో తాజాగా రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. తన ప్రధాన ప్రత్యర్థి, కాంగ్రెస్ సీనియర్ నేత సచిన్ పైలట్ని పరోక్షంగా టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పించారు. దేవుడి దయతో తనను నాలుగోసారి ముఖ్యమంత్రిగా చూడాలని కోరుకుంటున్నట్లు ఒక మహిళా తనతో చెప్పారని అన్నారు. తాను ఈ సీఎం పదవిని వదిలిపెట్టాలని అనుకుంటున్నాప్పటికీ.. అది అతన్ని విడిచెపెట్టడం లేదని ఆమెతో చెప్పినట్లు పేర్కొన్నారు. భవిష్యత్తులో కూడా తనని విడిచిపెట్టదు కూడా అని చెప్పారు. తనలో ఏదో ఉందని, అందుకే పార్టీ హైకమాండ్ తనను రాష్ట్రానికి నాయకత్వం వహించడానికి మూడుసార్లు ఎంపిక చేసిందని అన్నారు. అయితే..హైకమాండ్ తీసుకునే ఏ నిర్ణయమైనా అందరికీ ఆమోదయోగ్యంగా ఉంటుందని ఆయన అన్నారు. సోనియా గాంధీ జాతీయ అధ్యక్షురాలు అయ్యాక ఆమె తీసుకున్న తొలి నిర్ణయం తనను సీఎం చేయడమేనని చెప్పారు. అదే విధంగా కాంగ్రెస్ తన అభ్యర్థుల జాబితాను విడుదల చేయడంలో ఎందుకు జాప్యం చేసిందన్న ప్రశ్నకు గెహ్లాట్ స్పందిస్తూ.. ప్రతిపక్ష బీజేపీ మాత్రమే ఆ విషయంపై చింతిస్తోందని కౌంటర్ వేశారు. తాము పోట్లాడటం లేదని బీజేపీ ఆందోళన చెందుతోందని చురకలంటించారు. అందరి అభిప్రాయాలను పరిశీలించి, నిర్ణయాలు తీసుకుంటామని చెప్పారు. తాను సచిన్ పైలట్ మద్దతుదారులతో కూడా మాట్లాడుతున్నానని, వారికి అనుకూలంగా నిర్ణయం తీసుకుంటున్నానన్నారు. నిర్ణయాలు సజావుగా జరుగుతున్నాయని, అందుకే బీజేపీకి టెన్షన్ మొదలైందన్నారు. చదవండి: కర్ణాటక గాయం బీజేపీకి గుర్తుందా? ఒకవేళ మంచి ప్రత్యామ్నాయాలు దొరికితే.. కాంగ్రెస్ పార్టీ తప్పకుండా అభ్యర్థుల్ని మారుస్తుందని గెహ్లాట్ స్పష్టం చేశారు. తమ పార్టీలో ఎలాంటి చీలికలు లేవని, తాను క్షమించు, మరచిపో మంత్రాన్ని అనుసరిస్తున్నానని చెప్పారు. ఇంతకుముందు రాజస్థాన్లో కాంగ్రెస్ తిరిగి అధికారంలోకి వస్తుందని పైలట్ చెప్పడంతో.. అతని క్యాంప్లోని సభ్యులకూ టికెట్లు లభిస్తాయన్న వార్తలు వస్తున్నాయి. కాగా గతంలో.. గెహ్లాట్, ఆయన మాజీ డిప్యూటీ పైలట్ నేతృత్వంలోని క్యాంపుల మధ్య విభేదాలు తలెత్తిన విషయం తెలిసిందే. 2020లో గెహ్లాట్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పైలట్ తన క్యాంప్తో కలిసి తిరుగుబాటు చేసినప్పుడు.. కాంగ్రెస్ ప్రభుత్వం దాదాపుగా కుప్పకూలిపోయే పరిస్థితి వచ్చింది. అయితే కాంగ్రెస్ హైకమాండ్ రాజస్థాన్ ప్రభుత్వాన్ని కూలడం నుంచి కాపాడింది. అందుకే.. అవకాశం దొరికినప్పుడల్లా పైలట్పై అశోక్ గెహ్లాట్ విరుచుకుపడుతుంటారు. ఇప్పుడు మరోసారి అతనిపై మండిపడుతూ విమర్శలు గుప్పించారు. మరోవైపు కాంగ్రెస్ రాజస్థాన్ మినహా నాలుగు రాష్ట్రాలకు కనీసం తమ తొలి అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. ఒక్కరాజస్థాన్ను మాత్రం హోల్డ్లో పెట్టింది. అధికార పార్టీ కాంగ్రెస్ తన అభ్యర్థుల జాబితాను విడుదల చేయకపోవడం పెద్ద విషయమనే చెప్పాలి. సీఎం అశోక్ గహ్లోత్, రెబల్ ఎమ్మెల్యే సచిన్ పైలట్ మధ్య ఉన్న ఘర్షణ కారణంగా అభ్యర్థుల జాబితాను బహిర్గతం చేయడంలో జాప్యం జరుగుతోందని భావిస్తున్నారు. -
సాక్షి కార్టూన్ 18-10-2023
సాక్షి కార్టూన్ 18-10-2023 -
అభ్యర్థుల ఖరారుపై చర్చ.. సచిన్ పైలెట్కు అందని ఆహ్వానం
జైపూర్: రాజస్థాన్ కాంగ్రెస్ పార్టీలో కీలక పరిణామాలు చోటుచేసుంటున్నట్లు కనిపిస్తోంది. పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశానికి సీనియర్ నాయకుడు సచిన్ పైలెట్ను ఆహ్వానించలేదు. ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశంలో రాష్ట్రంలో రానున్న అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి అభ్యర్థుల పేర్లను ఖరారు చేయడంపై చర్చ జరగనుంది. ఈ సమావేశానికి ఖర్గే, కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీతో పాటు రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, ఏఐసీసీ రాష్ట్ర ఇన్ఛార్జ్ సుఖ్జీందర్ రాంధావా, రాజస్థాన్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చీఫ్ గోవింద్ దోతస్రా, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, పార్టీ రాజస్థాన్ స్క్రీనింగ్ కమిటీ చీఫ్ గౌరవ్ గొగోయ్ తదితరులను ఆహ్వానించారు. సచిన్ పైలెట్, రాజస్థాన్ స్పీకర్ సీపీ జోషిల పేర్లు ఇందులో లేవు. बचत, राहत, बढ़त, हिफ़ाज़त और उत्थान, कांग्रेस के सुशासन से ऐसे बदला राजस्थान ! भरोसा है हमें कि जनता फ़िर से देगी आशीर्वाद। आज राजस्थान के परिप्रेक्ष्य में केंद्रीय चुनाव समिति की महत्वपूर्ण बैठक हुई। pic.twitter.com/ygR5auUdUf — Mallikarjun Kharge (@kharge) October 18, 2023 రాజస్థాన్లో మరోసారి అధికారంలోకి వస్తామని ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే విశ్వాసం వ్యక్తం చేశారు. పొదుపు, ఉపషమణం, వృద్ధి, రక్షణలతో కాంగ్రెస్ గుడ్ గవర్నెన్స్ రాజస్థాన్లో సమూల మార్పులు తీసుకువచ్చిందని అన్నారు. ప్రజలు మరోసారి దీవిస్తారని ధీమా వ్యక్తం చేశారు. ఈ రోజు ముఖ్యమైన సమావేశం ఉందని ట్విట్టర్(ఎక్స్) వేదికగా ట్వీట్ చేశారు. మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో ఎన్నికల నేపథ్యంలో పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ(సీఈసీ) అక్టోబర్ 13 ఢిల్లీలో ఇప్పటికే సమావేశమైన విషయం తెలిసిందే. ఇదీ చదవండి: నోరు నొక్కేందుకే ఈ కుట్ర: భయపడుతూ కూచుంటే ఎలా? -
రాజస్తాన్లో అప్పుల భారం పెంచిన కాంగ్రెస్ ప్రభుత్వం
జైపూర్: రాజస్తాన్లో కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంపై అప్పుల భారం పెంచిందని∙కేంద్ర మంత్రి, బీజేపీ సీనియర్ నేత అర్జున్రామ్ మేఘ్వాల్ ఆరోపించారు. ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడారు. ద్రవ్యోల్బణ రిలీఫ్ క్యాంపుల పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని విమర్శించారు. 2018లో అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఎన్నో హామీలు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ఈ ఐదేళ్లలో ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని ఆక్షేపించారు. రైతు రుణాల మాఫీ, నిరుద్యోగ భృతి వంటివి ఏమయ్యాయని ప్రశ్నించారు. కాంగ్రెస్ పాలనలో రాష్ట్రంపై అప్పుల భారం పెరగడం తప్ప ప్రజలకు ఒరిగిందేమీలేదని దుయ్యబట్టారు. రాష్ట్రంలో జీడీపీ దారుణంగా పడిపోయిందని మంత్రి మేఘ్వాల్ ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో సుపరిపాలన కాదు, దుష్పరిపాలన సాగుతోందని మండిపడ్డారు. ఆర్థిక వ్యవస్థ పతనం కావడంతో నిరుద్యోగం పెరిగిపోయిందని, నేరాలు పెచ్చరిల్లుతున్నాయని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో కొత్తగా పరిశ్రమలు, పెట్టుబడులు రావడం లేదని విమర్శించారు. చదవండి: ఆపరేషన్ అజయ్: ఢిల్లీ చేరుకున్న రెండో విమానం -
రాజస్థాన్ సీఎంకు షాక్.. సొంత పార్టీ ఎమ్మెల్యే వినూత్న నిరసన
ఆధిపత్య పోరు, నేతల మధ్య విబేధాలు వంటి సంక్షోభ సమస్యలతో రాజస్థాన్ కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే నిండా వివాదంలో మునిగిన విషయం తెలిసిందే. తాజాగా అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కాంగ్రెస్ సర్కార్కు మరో షాక్ తగిలింది. సొంత పార్టీ ఎమ్మెల్యే నుంచే సీఎం అశోక్ గహ్లోత్కు వ్యతిరేకత వ్యక్తమైంది. గహ్లోత్కు నిరసనగా కోటా జిల్లాలోని సంగోడ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే భరత్ సింగ్ మంగళవారం గుండు కొట్టించుకొని వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు. తన మాటలు, సూచలను పట్టించుకోకుండా అవినీతిపరుడైన గనులశాఖమంత్రి ప్రమోద్ జైన్ భాయకు సీఎం గహ్లోత్ మద్దతిస్తున్నారని ఆరోపించారు. అతన్ని రక్షించేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. గుండు గీయించుకున్న తర్వాత ఆ వెంట్రుకలను సీఎంకు పంపించారు. దాంతోపాటు ఓ లేఖ కూడా పంపారు. ఖాన్ కీ జోప్రియా గ్రామాన్ని కోట జిల్లాలో చేర్చలేదని.. దీంతో సీఎం మీద ఉన్న గౌరవం, విశ్వాసం చచ్చిపోయాయని లేఖలో విమర్శించారు. ‘ఎవరైనా చనిపోతే వారి సన్నిహితులు(బంధువలు) గుండు కొట్టించుకోవడం మన సంప్రదాయం.. అందుకే నేను గుండు గీయించుకుని.. ఆ వెంట్రుకలను మీకు పంపుతున్నా. సీఎం పదవి శాశ్వతం కాదు’ అంటూ లేఖలో పేర్కొన్నారు. ఈ మేరకు కోటా జిల్లాలో జరుగుతున్న అవినీతిపై ఆయన విచారం వ్యక్తం చేశారు. కాగా రాష్ట్ర క్రీడలు, యువజన వ్యవహారాల మంత్రి, అశోక్ చందన తన సొంత ప్రభుత్వానికి వ్యతిరేకంగా విద్యుత్ సమస్యలపై ధర్నా చేసిన నాలుగు రోజులకు బుండి జిల్లా కేంద్రంలో ఈ సంఘటన జరిగింది. కోటా నగరంలోని గుమన్పురా ప్రాంతంలోని తన నివాసం వద్ద మద్దతుదారులతో కలిసి ఎమ్మెల్యే రావణుడి దిష్టిబొమ్మను కూడా దహనం చేశారు. చదవండి: వాళ్ల నాలుక చీరేయాలి.. కళ్లు పెరికేయాలి: కేంద్ర మంత్రి సంచలన వ్యాఖ్యలు -
ఎవరితో పెట్టుకుంటున్నారో వారికి తెలియాలి
జైపూర్: కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఇప్పటివరకు జనాభాగణన పూర్తిచేయకుండా 'ఒకే దేశం ఒకే ఎన్నికలకు పిలుపునివ్వడమంటే ప్రజాస్వామ్యాన్ని ప్రమాదంలోకి నెట్టడమే అన్నారు రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్. ఇక రాజస్థాన్లో అయితే ప్రజలు ఇప్పటికే కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవాలని నిర్ణయించుకున్నారని బీజేపీ ఎవరితో పెట్టుకుంటున్నారన్న విషయం వారికి తెలియాలని అన్నారు. అశోక్ గెహ్లాట్ మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉందని, రాజ్యాంగం చిన్నాభిన్నమైందని నేను ఎప్పటి నుంచో చెబుతునే ఉన్నాను. ఈరోజు దేశంలో జరిగేవన్నీ చూస్తుంటే దేశం ఎటువైపు వెళ్తుందో కూడా చెప్పడం కష్టమేనని.. ఇటువంటి నిర్ణయాలు తీసుకునేటప్పుడు కేంద్రం ప్రతిపక్షాల అభిప్రాయం కూడా అడిగి ఉంటే బాగుండేదని కానీ వారు ఎవరి అభిప్రాయాన్ని అడగకపోవడం అనేక అనుమానాలకు తావిస్తోందని అన్నారు. ఇక మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ప్రస్తావన తీసుకొస్తూ అసలు ఇలాంటి కమిటీలో మాజీ రాష్ట్రపతి భాగస్వామి కావడం నేనింత వరకు ఎప్పుడు వినలేదు, చూడలేదని అన్నారు. ఇందులోకి అనవసరంగా ఆయనను లాగుతున్నారని అన్నారు. ప్రభుత్వానికి ప్రత్యేక సమావేశాలకు పిలుపునిచ్చే హక్కు ఉంది కానీ ప్రజలకు కారణం చెప్పాల్సిన అవసరం కూడా ఉందన్నారు. ఇక రాజస్థాన్ ప్రజలైతే మళ్లీ కాంగ్రెస్ పార్టీకే అధికారం కట్టబెట్టాలనే నిర్ణయానికి వచ్చేశారని అసలు వారు ఎవరితో పెట్టుకుంటున్నారో వారికి తెలియాలని ఘాటుగా స్పందించారు. ఇది కూడా చదవండి: ఆర్టికల్ 370 రద్దుపై విచారణ.. తీర్పును రిజర్వ్లో ఉంచిన సుప్రీం -
గుర్తు, సీట్లపై చర్చ అనవసరం సార్! అభ్యర్థిపైనే చర్చ ఉంటుంది సార్!
గుర్తు సీట్లపై చర్చ అనవసరం సార్! అభ్యర్థిపైనే చర్చ ఉంటుంది సార్! -
రెడ్ డైరీలో రాజస్తాన్ ప్రభుత్వ అక్రమాలు
జైపూర్: రాజస్తాన్ ప్రభుత్వం అవినీతి, అక్రమాల రహస్యాలన్నీ రెడ్ డైరీలో ఉన్నాయని, దీనిపై సీఎం అశోక్ గెహ్లాట్ రాజీనామా చేయాలని కేంద్ర హోం మంత్రి అమిత్ షా డిమాండ్ చేశారు. గంగాపూర్లో శనివారం జరిగిన ‘సహకార కిసాన్ సమ్మేళన్’ను ఉద్దేశించి మంత్రి మాట్లాడారు. ఆయన ప్రసంగం ప్రారంభించగానే కొందరు నినాదాలు ప్రారంభించారు. వారినుద్దేశించి మంత్రి మాట్లాడుతూ..‘నినాదాలు చేసేందుకు కొందరిని పంపించినంత మాత్రాన ఒరిగేదేమీ ఉండదని గెహ్లాట్కు చెప్పాలనుకుంటున్నా. ఆయనకు సిగ్గుంటే, రెడ్ డైరీ వ్యవహారంపై రాజీనామా చేసి, ఎన్నికలకు వెళ్లి ఉండేవారు’అని వ్యాఖ్యానించారు. 2020లో కాంగ్రెస్ నేత ధర్మేంద్ర రాథోడ్ ఇంటిపై ఆదాయపన్ను శాఖ అధికారులు జరిపిన దాడుల్లో ‘రెడ్ డైరీ’దొరికింది. దాన్లో సీఎం గెహ్లాట్ ఆర్థిక లావాదేవీల వివరాలన్నీ ఉన్నట్లు మంత్రివర్గం నుంచి బర్తరఫ్ అయిన రాజేంద్ర గూధా చేసిన ఆరోపణలను అమిత్ షా తన ప్రసంగంలో ప్రస్తావించారు. -
వసుంధర రాజేకు షాకిచ్చిన బీజేపీ
జైపూర్: త్వరలో జరగనున్న ఎన్నికల నేపథ్యంలో బీజేపీ పార్టీ రాజస్థాన్లో వ్యూహరచనకు శ్రీకారం చుట్టింది. ఎన్నికలకు సన్నాహకంగా ఏర్పాటు చేయనున్న రెండు కమిటీ సభ్యులను ప్రకటించింది. కానీ ఈ కమిటీల్లో ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి బీజేపీ సీనియర్ నేత వసుంధర రాజే పేరు లేకపోవడం విశేషం. రాజస్థాన్ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ పార్టీ ఆ రాష్ట్రంలో సంకల్ప్ మ్యానిఫెస్టో కమిటీ, ఎన్నికల నిర్వహణ కమిటీ పేరిట రెండు కమిటీలను ఏర్పాటు చేసింది. 21 మంది సభ్యుల ఎన్నికల నిర్వహణ కమిటీకి మాజీ ఎంపీ నారాయణ్ లాల్ పంచారియా నేతృత్వం వహిస్తుండగా 25 మంది సభ్యుల సంకల్ప్ కమిటీకి కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ నాయకత్వం వహించనున్నారు. ఈ కమిటీల్లో ఎంపీ కిరోడీ లాల్ మీనా, మాజీ కేంద్ర మంత్రి రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ లకు చోటు లభించగా రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజే తోపాటు రాష్ట్ర అధ్యక్షుడు సీపీ జోషి, ప్రతిపక్ష నాయకుడు రాజేంద్ర రాథోడ్ ల పేర్లను ఈ కమిటీ జాబితాల్లో చేర్చకపోవడం చర్చనీయాంశమంది. గత కొన్నాళ్లుగా వీరంతా రాష్ట్రంలో బీజేపీ ప్రచార బాధ్యతలను భుజాన మోస్తున్నారు. మాజీ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ మాజీ రాష్ర అధ్యక్షుడు సతీష్ పూనియాలకి కూడా ఈ కమిటీల్లో చోటు దక్కలేదు. ఇదిలా ఉండగా ప్రస్తుత అశోక్ గెహ్లాట్ ప్రభుత్వంపై వ్యతిరేకతను ప్రజల్లోకి తీసుకుని వెళ్లడంలో బీజేపీ చాలా దూకుడుగా వ్యవహరిస్తోంది. రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి తోపాటు మహిళలపై జరుగుతున్న అరాచకాలనే ప్రధానాస్త్రాలుగా చేసుకుని విమర్శలు గుప్పిస్తున్నారు. రాష్ట్ర మహిళా మోర్చా అయితే మరో అడుగు ముందుకేసి 'నహీ సహేగా రాజస్థాన్' పేరిట పేపర్ లీకేజీ, రైతు సమస్యలపై నిరసన తెలుపుతూ ప్రచార కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఎలా చూసినా గెహ్లాట్ ప్రభుత్వం ప్రజలకు అందిస్తోన్న సంక్షేమ పథకాలను తిప్పికొట్టడమే బీజేపీకి పెను సవాలుగా మారింది. కాంట్రాక్టు ఉద్యోగుల బిల్లు, ఆరోగ్య హక్కు బిల్లు వంటి ప్రజాహితమైన పథకాలు రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఊతంగా నిలవనున్నాయి. కర్ణాటకలో కూడా ఇదే విధంగా ఐదు గ్యారెంటీలతో రూపందించిన పథకాలు అక్కడ ఆ పార్టీ అధికారంలో రావడానికి దోహద పడ్డాయి. రాజస్థాన్లో కూడా అదే పాచిక పారుతుందని కాంగ్రెస్ గట్టి నమ్మకంతో ఉండగా బీజేపీ దాన్ని తిప్పికొట్టే ప్రయత్నాల్లో ఉంది. అందుకోసమే కమిటీలను ఏర్పాటు చేసి ఎన్నికల ప్రణాళికలు రూపొందిస్తోంది. ఇది కూడా చదవండి: కొడుకు చేసిన పనికి తండ్రికి శిక్ష.. పార్టీ సభ్యత్వం రద్దు.. -
సచిన్ పైలెట్పై బీజేపీ ఆరోపణలు.. మద్దతు నిలిచిన గహ్లోత్..
జైపూర్: రాజస్థాన్ సీఎం అశోక్ గహ్లోత్, ఉపముఖ్యమంత్రి సచిన్ పైలెట్ మధ్య పార్టీలో అంతర్గతంగా విభేదాలు తలెత్తిన విషయం తెలిసిందే. సీఎం కుర్చీ నాదంటే.. నాదంటూ పోట్లాడుకున్నా.. ఇంటి గొడవ గడప దాటేవరకేనని రుజువు చేశారు. సచిన్ పైలెట్ కుటుంబంపై బీజేపీ తీవ్ర ఆరోపణలు చేయగా.. పైలెట్కు మద్దతుగా సీఎం గహ్లోత్ నిలిచారు. సచిన్ పైలెట్ తండ్రి సొంత ప్రజలపైనే బాంబులు వేశారని బీజేపీ నేత అమిత్ మాలవ్య ఆరోపించారు. సచిన్ పైలట్ తండ్రి రాజేష్ పైలట్, సురేష్ కల్మాడీలపై ట్విట్టర్ వేదికగా సంచలన ఆరోపణలు చేశారు. ఏయిర్ ఫోర్స్లో పనిచేసే క్రమంలో వారిద్దరూ కలిసి 1966, మార్చి 5న మిజోరాం ఐజ్వాల్లో బాంబు దాడి జరిపారని అన్నారు. ప్రతిఫలంగా వారికి ఇందిరా గాంధీ మంత్రి పదవులు ఇచ్చారని ఆరోపణలు చేశారు. దీనిపై పైలెట్ కూడా బీజేపీపై మండిపడ్డారు. తప్పుడు సమాచారం ఇవ్వొద్దని దుయ్యబట్టారు. ఈ పరిణామాల అనంతరం సచిన్ పైలెట్కు మద్దతుగా నిలిచారు సీఎం గహ్లోత్. భారత వైమానిక దళానికి సేవలు చేసినవారిపై బీజేపీ ఆరోపణలు చేస్తోందని అన్నారు. ఇది ఏయిర్ ఫోర్స్ సేవలను అవమానించడమేనని చెప్పారు. కాంగ్రెస్ నాయకుడు రాజేష్ పైలెట్ ధైర్యవంతుడైన పైలెట్ అని అన్నారు. దేశం మొత్తం ఖండించాల్సిన అంశమని చెప్పారు. कांग्रेस नेता श्री राजेश पायलट भारतीय वायुसेना के वीर पायलट थे। उनका अपमान करके भाजपा भारतीय वायुसेना के बलिदान का अपमान कर रही है। इसकी पूरे देश को निंदा करनी चाहिए। — Ashok Gehlot (@ashokgehlot51) August 16, 2023 రాజస్థాన్లో ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ నాయకులు ఐక్యమత్యాన్ని తాజా ఘటన సూచిస్తోంది. పార్టీలో అంతర్గతంగా గొడవలు ఉన్న ఇతర పార్టీలు విమర్శలు చేస్తే ఐక్యంగా పోరాడుతున్నారు. ఇదీ చదవండి: బాంబులు వేసింది భారత్-పాక్ యుద్ధంలో.. బీజేపీ నేతకు సచిన్ పైలట్ చురకలు -
'సీఎం పదవిని వదిలేద్దామనుకున్నా.. కానీ..?'
జైపూర్: సీఎం పదవిని వదిలేద్దామనుకున్నా.. కానీ అదే తనను వదలట్లేదని అన్నారు రాజస్థాన్ సీఎం అశోక్ గహ్లోత్. ఈ మాట చెప్పడానికి చాలా ధైర్యం కావాలని చెప్పారు. 2018లో ఎన్నికల సందర్భంగా సీఎం పదవి కోసం సచిన్ పైలెట్ పోటీ పడిన విషయం తెలిసిందే. ఈ సందర్భాన్ని గుర్తు చేసుకున్న గహ్లోత్.. ఈ మేరకు మాట్లాడారు. పార్టీ అధిష్ఠానానికి కట్టుబడి ఉన్నానని చెప్పారు. 'సీఎం పదవిని వదిలేయాలని అనుకున్నా.. కానీ నేను ఎందుకు వదలాలి? ఆ పోస్టే నన్ను వదలట్లేదు.హైకమాండ్ తీసుకున్న నిర్ణయం ఏదైనా అంగీకారమే. సోనియా గాంధీ నన్ను మూడు సార్లు సీఎంను చేశారు.' అని గహ్లోత్ అన్నారు. రాజస్థాన్లో ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో అశోక్ గహ్లోత్కు, సచిన్ పైలెట్కు మధ్య ఇటీవల మళ్లీ వార్ నడిచింది. కానీ అధిష్ఠానం మరోసారి చొరవ తీసుకుని పరిస్థితిని చక్కదిద్దింది. అయితే.. తాజాగా జైపూర్లో నిర్వహించిన సమావేశంలో.. మరోసారి కాంగ్రెస్ గెలిస్తే తానే సీఎంను అని గహ్లోత్ తెలిపారు. 2030 విజన్కు పిలుపునిచ్చారు. బలమైన రాజస్థాన్ను నిర్మిద్దామని అన్నారు. '2030 గురించి నేను ఎందుకు మాట్లాడకూడదు. విద్య, ఆరోగ్యం, విద్యుత్, నీరు, రవాణా, రహదారులు వంటి రంగాల్లో విశేషమైన సేవ చేశాను. ఎందుకు నేను మరోసారి ముందుకు పోకూడదు అనిపించింది.' అని గహ్లోత్ అన్నారు. గత సెప్టెంబర్లో నిర్వహించిన కాంగ్రెస్ అధిష్ఠానానికి ఎన్నికలు జరిగిన నేపథ్యంలో గహ్లోత్ను కూడా పోటీలో నిలిచారు. గహ్లోత్ కేంద్ర స్థాయిలో ఉంటే.. సచిన్ను రాష్ట్ర స్థాయిలో ప్రధాన నాయకునిగా మారనున్నారని పుకార్లు వచ్చాయి. అయితే.. రాజస్థాన్లో సీఎంగా తాను మాత్రమే ఉండాలని ఎమ్మెల్యేలు పట్టుబడగా.. తప్పక ఉండాల్సి వచ్చిందని గహ్లోత్ చెప్పారు. ఇదీ చదవండి: Nuh violence: హర్యానా అల్లర్లు.. బుల్డోజర్ యాక్షన్కు హైకోర్టు బ్రేక్.. -
కాంగ్రెస్ సర్కార్ సంచలన నిర్ణయం.. మునేశ్ గుర్జర్ సస్పెండ్
జైపూర్: రాజస్థాన్ రాజధాని జైపూర్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ మునేశ్ గుర్జర్కు బిగ్ షాక్ తగిలింది. గుర్జర్పై రాజస్థాన్ ప్రభుత్వం వేటువేసింది. ఓ భూమి లీజ్ వ్యవహారంలో ఆమె భర్త లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆమెను సస్పెండ్ చేస్తూ గెహ్లాట్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వివరాల ప్రకారం.. మేయర్ మునేశ్ గుర్జర్ భర్త సుశీల్ గుర్జర్ ఓ భూమి లీజ్ వ్యవహారంలో లంచం డిమాండ్ చేశాడు. ఈ క్రమంలో బాధితుల నుంచి రూ.2 లక్షలు లంచం తీసుకుంటూ శనివారం ఏసీబీక అధికారులకు చిక్కాడు. మేయర్ స్వగృహంలోనే ఈ ఘటన చోటుచేసుకుంది. ఆ సమయంలో మేయర్ మునేశ్ గుర్జర్ కూడా ఇంట్లోనే ఉన్నారు. ఇక, ఆమె ఇంటి నుంచి ఏసీబీ అధికారులు రూ.40 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. లంచం వ్యవహారంలో మేయర్ హస్తం ఉన్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు. కాగా, కేసు విచారణను ప్రభావితం చేసే అవకాశం ఉండటంతో ఆమెపై చర్యలు తీసుకుంటూ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఆమెను కూడా సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం శనివారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. ఆమె ప్రాతినిధ్యం వహిస్తున్న వార్డు నంబర్ 43 కార్పొరేటర్ పదవి నుంచి కూడా సస్పెండ్ చేసింది. మరోవైపు.. ఈ కేసులో నారాయణ్ సింగ్, అనిల్ దూబే అనే మరో ఇద్దరిని కూడా ఏసీబీ అదుపులోకి తీసుకుని విచారిస్తోంది. నారాయణ్ సింగ్ నివాసంలోనూ మరో రూ.8 లక్షల నగదు లభ్యమైనట్టు ఏసీబీ అధికారులు తెలిపారు. ఈ ఘటనతో రాజస్థాన్లోని కాంగ్రెస్ సర్కార్పై బీజేపీ నేతలు తీవ్ర విమర్శలు చేశారు. ఇది దోపిడీ, అబద్ధాల ప్రభుత్వమని మండిపడింది. ఇదిలా ఉండగా.. రాజస్థాన్లో ఈ ఏడాది ఎన్నికల జరగనున్న నేపథ్యంలో మేయర్ లంచం కేసు వ్యవహారం హస్తం పార్టీకి తలనొప్పిగా మారింది. Breaking News: Mayor Munesh Gurjar निलंबित। कहा, 'कांग्रेस के बड़े नेता ने साज़िश कर फंसाया है'! pic.twitter.com/AajGDCt6IO — Rajasthan Tak (@Rajasthan_Tak) August 6, 2023 ఇది కూడా చదవండి: మహారాష్ట్రలో కీలక పరిణామం.. ఎన్సీపీలో మళ్లీ చీలిక..? -
వదలగొట్టడానికి సచిన్ పైలట్ అనే భూత వైద్యుడున్నాడట పిలవమంటారా..సార్!
వదలగొట్టడానికి సచిన్ పైలట్ అనే భూత వైద్యుడున్నాడట పిలవమంటారా..సార్! -
సీఎంకు టెన్షన్.. అసలు ఆ రెడ్ డైరీలో ఏముంది?
రెడ్ డైరీలో రాజస్థాన్ సీఎం అక్రమాల చిట్టా.. రాజస్థాన్లో ప్రకంపనలు సృష్టిస్తోన్న బహిష్కృత మంత్రి