-
ఈ చలాకీ చిన్నారి.. పెళ్లి కూతురైంది.. బంగారు బొమ్మలా! (ఫోటోలు)
-
నటుడితో కూతురి పెళ్లి.. అర్జున్ కట్నంగా ఏమిచ్చాడో తెలుసా?
కూతురి ప్రేమను అర్థం చేసుకుని నచ్చినవాడితో పెళ్లి జరిపించాడు యాక్షన్ కింగ్ అర్జున్. తన పెద్ద కూతురు ఐశ్వర్య.. లెజెండరీ నటుడు తంబిరామయ్య కుమారుడు ఉమాపతి ఒకరినొకరు ప్రేమించుకున్నారు. ఈ విషయాన్ని తండ్రితో చెప్పింది. ఆమె ప్రేమను అర్థం చేసుకున్న అర్జున్.. తంబిరామయ్యతో మాట్లాడాడు. ఆయన కూడా పచ్చజెండా ఊపడంతో ఈ మధ్యే ఘనంగా పెళ్లి జరిపించారు. అనంతరం చెన్నైలో ఎంతో వేడుకగా రిసెప్షన్ సెలబ్రేట్ చేశారు.కోట్లాది కట్నంతన గారాల కూతుర్ని అత్తారింటికి సాగనంపిన అర్జున్.. అల్లుడికి భారీగానే కట్నం ఇచ్చాడంటూ సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్గా మారింది. వందలాది కోట్లు కట్నం ఇచ్చాడని ప్రచారం జరుగుతోంది. అలాగే కోట్లు విలువ చేసే విలాసవంతమైన బంగ్లాను కానుకగా ఇచ్చాడట! అర్జున్కు మగ పిల్లలు లేరు. ఉన్న ఇద్దరూ కూతుర్లే! అందుకే తను సంపాదించిన ఆస్తులను భారీ మొత్తంలో కట్నంగా ఇచ్చేందుకు అస్సలు వెనకడుగు వేయలేదని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.యాక్టరే కాదు సింగర్ కూడా!అర్జున్ సినిమాల విషయానికి వస్తే.. విరున్ను అనే ద్విభాషా(మలయాళ, తమిళ) చిత్రం చేస్తున్నాడు. అలాగే తీయవర్ కులైగళ్ నాదుంగ, విడాముయుర్చి సినిమాల్లో నటిస్తున్నాడు. ఈయన నటుడు మాత్రమే కాదు, రచయిత, దర్శకనిర్మాత కూడా! అలాగే చిట్టుకురువి (పరశురామ్), కట్టున అవలా కట్టువేండ (జైసూర్య) వంటి పలు సాంగ్స్ సైతం పాడాడు. సర్వైవర్ తమిళ్ షోతో హోస్ట్గానూ మారాడు.చదవండి: సినిమాను మించిన స్టోరీ.. విడాకుల తర్వాత ఆరేళ్లకు..! -
కూతురు ఐశ్వర్య ప్రేమ పెళ్లి.. హీరో అర్జున్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
యాక్షన్ కింగ్ అర్జున్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. అప్పట్లో హీరోగా చేశాడు. ప్రస్తుతం మాత్రం క్యారెక్టర్ ఆర్టిస్టుగా బిజీగా ఉన్నాడు. రీసెంట్గా ఇతడి కూతురు ఐశ్వర్య పెళ్లి జరిగింది. తమిళ నటుడు తంబిరామయ్య కొడుకు, నటుడు ఉమాపతి రామయ్యతో వివాహం జరిగింది. అయితే వీళ్లిద్దరూ ప్రేమించుకుని పెళ్లి పీటలు ఎక్కారు. సంగీత్, పెళ్లి, రిసెప్షన్ పూర్తయిన తర్వాత వీళ్లంతా మీడియాతో మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలు చెప్పారు.(ఇదీ చదవండి: మరో ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు లేటెస్ట్ హారర్ మూవీ 'లవ్ మీ')'తంబిరామయ్యది మంచి సంప్రదాయ కుటుంబం. ఆ మధ్య ఓ టీవీ షోకి హోస్టింగ్ చేశారు. అందులో ఉమాపతి రామయ్య ఓ కంటెస్టెంట్గా పోటీ చేశాడు. అప్పుడే తన నాకు నచ్చేశాడు. ఓ రోజు నా కూతురు ఐశ్వర్య నాతో విడిగా మాట్లాడాలని అడిగింది. దీంతో అది ప్రేమ వ్యవహారం అని ఊహించా. ఉమాపతి రామయ్య పేరు చెప్పడంతో నేను షాకయ్యా. ఆ తర్వాత ఉమాపతి రామయ్య ఫ్యామిలీతో నేను కట్టించిన ఆంజనేయ స్వామి ఆలయంలో మాట్లాడుకున్నాం. అలా ఐశ్వర్య, ఉమాపతి పెళ్లి జరిగిపోయింది' అని అర్జున్ చెప్పుకొచ్చారు.పెళ్లయిన తర్వాత ఐశ్వర్య సినిమాల్లో నటిస్తారా అని అడుగుతున్నారనే ప్రశ్నకు బదులిచ్చిన అర్జున్.. తన జీవిత భాగస్వామిని ఎంపిక చేసుకున్న ఆమెకు.. పెళ్లి తర్వాత నటించాలా వద్దా అనే విషయం కూడా తెలుసని అర్జున్ పేర్కొన్నాడు. (ఇదీ చదవండి: దానికి నేను సరైన వ్యక్తి కాదు.. వాళ్లయితేనే: శ్రుతి హాసన్) -
కమెడియన్ కుమారుడితో అర్జున్ కూతురి పెళ్లి.. గ్రాండ్గా రిసెప్షన్
యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా కుమార్తె ఐశ్వర్య అర్జున్, లెజెండరీ నటుడు తంబి రామయ్య కుమారుడు ఉమాపతి జూన్ 10న వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు. ఇరుకుటుంబాలు సహా దగ్గరి బంధుమిత్రులు సమక్షంలో ఈ వివాహం ఘనంగా జరిగింది. శుక్రవారం (జూన్ 14న) చెన్నై లీలా ప్యాలెస్లో సినీ, రాజకీయ ప్రముఖుల సమక్షంలో ఐశ్వర్య దంపతుల రిసెప్షన్ అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి తమిళనాడు సీఎం స్టాలిన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అలాగే హీరో రజనీకాంత్, ఉపేంద్ర, డైరెక్టర్ శంకర్, ప్రభుదేవా, డైరెక్టర్ లోకేష్ కనక రాజ్, సత్యరాజ్ ,కుష్బూ, విజయ్ సేతుపతి, హీరో శివ కార్తికేయన్, తమిళనాడు బీజేపీి అధ్యక్షులు అన్నామలై, స్నేహ తదితరులు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు.చదవండి: చివరిసారిగా అడుగుతున్నా.. ఒక్కసారి వచ్చిపో షారూఖ్.. -
అర్జున్ కూతురి పెళ్లి వీడియో నెట్టింట వైరల్
యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా పెద్ద కూతురు, హీరోయిన్ ఐశ్వర్య పెళ్లి కొద్దిరోజుల క్రితమే ఘనంగా జరిగింది. అయితే, తాజాగా తన ముద్దుల కూతురి పెళ్లి వేడుక వీడియోను అభిమానుల కోసం ఆయన షేర్ చేశాడు. కోలీవుడ్ లెజెండరీ నటుడు, దర్శకుడు తంబి రామయ్య కుమారుడు, యంగ్ హీరో ఉమాపతితో జూన్ 10న వీరి ప్రేమ వివాహం జరిగింది. చెన్నైలోని హనుమాన్ ఆలయంలో జరిగిన ఈ వేడుకలో చాలామంది ప్రముఖులు పాల్గొని కొత్త దంపతులను ఆశీర్వదించారు.అర్జున్ షేర్ చేసిన వీడియోలో ఐశ్వర్య- ఉమాపతిల పెళ్లి వేడుకను చూడొచ్చు. వీణా శ్రీవాణి అందించిన చక్కని సంగీతంతో వీడియో ప్రారంభమౌతుంది. పెళ్లి పీటలపై ఐశ్వర్యను చూసుకున్న అర్జున్ చాలా మురిసిపోతాడు. అందుకు సంబంధించిన సన్నివేశాలు వీడియోలో చాలానే ఉన్నాయి.మా ముద్దుల కూతురు ఐశ్వర్య తనకు నచ్చిన, మా ప్రియమైన ఉమాపతిని వివాహం చేసుకున్నప్పుడు మేము అనుభవించిన ఆనందం మాటల్లో చెప్పలేము. తన పెళ్లి ఎన్నో మరపురాని జ్ఞాపకాలను ఇచ్చింది. వారిద్దరూ కొత్త అధ్యాయంలోకి అడుగు పెట్టడం చూస్తుంటే మా హృదయాలు గర్వంతో నిండిపోయాయి. 'జీవితకాలం పాటు మీ ప్రేమకు తోడు ఆనందం కూడా జతకూడాలని వేల కోట్ల ఆశీర్వాదాలు అందిస్తున్నాము. మీరు పంచుకునే ప్రేమలాగే మీ ప్రయాణం కూడా అందంగా ఉండాలి. ఎప్పటికీ మేము మీ ఇద్దరినీ ప్రేమిస్తున్నాము.' అని అర్జున్ ఎమోషనల్గా ఒక పోస్ట్ చేశాడు. View this post on Instagram A post shared by Arjun Sarja (@arjunsarjaa) -
కమెడియన్ కొడుకుతో అర్జున్ కూతురు పెళ్లి(ఫోటోలు)
-
హీరోను పెళ్లాడిన అర్జున్ కూతురు.. ఫోటోలు వైరల్!
యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా పెద్ద కూతురు, హీరోయిన్ ఐశ్వర్య పెళ్లి బంధంలోకి అడుగుపెట్టింది. కోలీవుడ్ లెజెండరీ నటుడు, దర్శకుడు తంబి రామయ్య కుమారుడు, యంగ్ హీరో ఉమాపతిని ఆమె పెళ్లి చేసుకుంది. చెన్నైలో హనుమాన్ ఆలయంలో జరిగిన ఈ వివాహా వేడుకలో బంధువులు, సన్నిహితులు పాల్గొన్నారు. తాజాగా వీరి పెళ్లి ఫోటోలను సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరలవుతున్నాయి.కాగా.. ఐశ్వర్య- ఉమాపతిల ఎంగేజ్మెంట్ వేడుక గతేడాది అక్టోబర్లో జరిగింది. కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్న వీరిద్దరు పెద్దల అనుమతితోనే నిశ్చితార్థం చేసుకున్నారు. తాజాగా మూడుముళ్ల బంధంలోకి అడుగుపెట్టారు. ఇక సినిమాల విషయానికి వస్తే.. ఐశ్వర్య కెరీర్ అనుకుంత సక్సెస్ఫుల్గా సాగడం లేదు. కూతురి కోసం అర్జున్ డైరెక్టర్గా మారి సినిమా తీయగా అది కూడా ఆశించినంత ఫలితం అందుకోలేకపోయింది. మరోవైపు ఉమాపతి తమిళ చిత్రాల్లో నటిస్తున్నారు. కోలీవుడ్లో అడగప్పట్టత్తు మగజనంగళే, మనియార్ కుటుంబం, తిరుమనం, థానే వాడి సినిమాల్లో హీరోగా నటించాడు. View this post on Instagram A post shared by Aishwarya Arjun (@aishwaryaarjun) -
అర్జున్ సర్జా కూతురి పెళ్లి.. గ్రాండ్గా హల్దీ సెలబ్రేషన్స్ (ఫోటోలు)
-
అర్జున్ సర్జా ఇంట పెళ్లి వేడుకలు.. హీరోయిన్ హల్దీ పిక్స్ వైరల్
యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా పెద్ద కూతురు, హీరోయిన్ ఐశ్వర్య మరో రెండు రోజుల్లో పెళ్లి పీటలెక్కనుంది. కోలీవుడ్ లెజెండరీ నటుడు, దర్శకుడు తంబి రామయ్య ఇంటికి కోడలిగా వెళ్లనుంది. తంబి రామయ్య కుమారుడు, యంగ్ హీరో ఉమాపతితో జూన్ 10న చెన్నైలోని హనుమాన్ ఆలయంలో వేదమంత్రాల సాక్షిగా ఏడడుగులు వేయనుంది. ఆప్యాయంగా ముద్దాడిన తండ్రిఇప్పటికే పెళ్లి పనులు జోరందుకోగా తాజాగా హల్దీ, మెహందీ వేడుకలు జరిగాయి. అందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్గా మారాయి. అందులో అర్జున్ సర్జా తన కూతురిని ఆప్యాయంగా ముద్దాడాడు. కాగా ఇది లవ్ మ్యారేజ్.. ఐశ్వర్య- ఉమాపతి ప్రేమించుకున్నారు. ఈ విషయాన్ని పెద్దల దృష్టికి తీసుకెళ్లగా గతేడాదే వారు పచ్చజెండా ఊపారు. అక్టోబర్లో నిశ్చితార్థం జరిపారు.కెరీర్..సినిమాల విషయానికి వస్తే.. ఐశ్వర్య కెరీర్ అనుకుంత సక్సెస్ఫుల్గా సాగడం లేదు. కూతురి కోసం అర్జున్ డైరెక్టర్గా మారి సినిమా తీయగా అది కూడా ఆశించినంత ఫలితం అందుకోలేకపోయింది. మరోవైపు ఉమాపతి అడగప్పట్టత్తు మగజనంగళే, మనియార్ కుటుంబం, తిరుమనం, థానే వాడి వంటి సినిమాల్లో హీరోగా నటించాడు. చదవండి: యానిమల్ బ్యూటీ కొత్త బంగ్లా.. ధరెంతో తెలుసా? -
టాలీవుడ్ హీరో కూతురి ప్రేమ పెళ్లి.. తేదీ ఫిక్స్!
టాలీవుడ్ నటుడు అర్జున్ సర్జా కూతురు ఐశ్వర్య త్వరలోనే పెళ్లి పీటలెక్కనుంది. ఇప్పటికే తమిళ నటుడు ఉమాపతి రామయ్యతో నిశ్చితార్థం జరిగిన సంగతి తెలిసిందే. వీరిద్దరి వివాహా వేడుక జూన్ 10న చెన్నైలో జరగనుంది. నగరంలోని అంజనసుత శ్రీ యోగాంజనేయ మందిరం పోరుర్లో వేదికగా నిలవనుంది.గతేడాది నిశ్చితార్థంకాగా.. గతేడాది ఎంగేజ్మెంట్ చేసుకున్న ఈ జంట జూన్లో పెళ్లిబంధంతో ఒక్కటి కానుంది. ఉమాపతి, ఐశ్వర్య ప్రేమ వివాహం చేసుకోబోతున్నారు. వీరి ప్రేమకు రెండు కుటుంబాలు అంగీకరించడంతో గతేడాది నిశ్చితార్థం ఘనంగా నిర్వహించారు. వరుడు ఎవరంటే?కోలీవుడ్లో ప్రముఖ కమెడియన్గా గుర్తింపు తెచ్చుకున్న తంబి రామయ్య కుమారుడే ఉమాపతి. తమిళంలో మనియార్ కుటుంబం, తిరుమణం, తన్నే వండి సినిమాల్లో ఉమాపతి నటించారు. అర్జున్ సర్జా కూతురు కూడా తమిళ సినిమాల్లోకి అడుగుపెట్టింది. విశాల్ మూవీ పటతు యానై సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. తమిళ చిత్ర పరిశ్రమలో అందాల నటిగా పేరు తెచ్చుకున్న ఐశ్వర్యను ఉమాపతి పెళ్లి చేసుకోనున్నారు. View this post on Instagram A post shared by Aishwarya Arjun (@aishwaryaarjun) -
రాముడి ప్రాణప్రతిష్ఠ రోజే పిల్లలకు పేర్లు పెట్టుకున్న స్టార్ హీరో.. ఎందుకంటే?
యాక్షన్ ప్రిన్స్, శాండల్వుడ్ నటుడు ధ్రువ సర్జా, ప్రేరణ దంపతులు తమ పిల్లలకు పేర్లు పెట్టారు. తెలుగు వారికి సుపరిచయం అయిన అర్జున్కు ధ్రువ సర్జా మేనళ్లుడు అవుతాడనే విషయం తెలిసిందే. తాజాగా కుటుంబ సభ్యుల సమావేశంలో పిల్లలకు నామకరణం చేశారు. ఈ కార్యక్రమంలో బాలీవుడ్ హీరో సంజయ్ దత్, అర్జున్ సర్జా పాల్గొన్నారు. ఆంజనేయుడికి గొప్ప భక్తుడైన ధ్రువ సర్జా.. తన పిల్లలకు ఏం పేరు పెట్టాలనే ఆసక్తి నెలకొంది. అయితే ఈ క్యూరియాసిటీకి తెర పడింది. దీంతో పాటు తొలిసారిగా ఆయన కుమారుడి ఫోటో కూడా రివీల్ అయింది. అయోధ్యలో, రాముడిని ప్రతిష్టాపన చేసిన రోజున తన పిల్లలకు పేర్లు పెట్టారు. తన కూతురికి రుద్రాక్షి, కుమారుడికి హయగ్రీవ అని నామకరణం చేశారు. వాయుపుత్ర హనుమంతుడు మహిరావణుడిని సంహరించడానికి పంచముఖి ఆంజనేయస్వామిగా అవతరించాడు. పంచముఖి అంటే ఐదు ముఖాలు. ఇందులో హనుమంతుని ముఖంతో సహా నరసింహ, వరాహ, హయగ్రీవ, గరుడతో సహా ఐదు ముఖాలు ఉన్నాయి. అందులో నుంచి హయగ్రీవ అనే పేరును తన కుమారుడికి పెట్టుకున్నాడు ధ్రువ సర్జా.. ధృవ దంపతులకు 2022 ప్రారంభంలో కుమార్తె జన్మించగా.. 2023 సెప్టెంబర్లో ఆయనకు మగబిడ్డ పుట్టాడు. అయోధ్యలో రాముడిని ప్రతిష్టాపన చేసిన రోజున రోజున తన పిల్లలకు పేర్లు పెట్టాలని ఆయన ఇన్నిరోజులు వేచి చూశాడు. హనుమంతుడిని రాముడికి సేవకుడిగా పిలుస్తారు.. అలాంటి ఆంజనేయుడికి పరమ భక్తుడు ధ్రువ సర్జా.. అందుకే రామమందిరంలో జరిగే ప్రత్యేక కార్యక్రమం రోజున పిల్లలకు పేర్లు పెట్టారు. దీనిపై మాట్లాడిన ధృవ సర్జా.. అయోధ్యలో 12.20కి పూజలు జరిగాయి. మేము అదే సమయంలో మా పిల్లలకు పేర్లు పెట్టాము. సంజయ్ దత్ కూడా శివ భక్తుడు. తన కూతురికి రుద్రాక్షి అని పేరు పెట్టడంతో ఆయన సంతోషించాడు. రుద్రాక్ష అంటే ఆ శివుడికి చాలా ఇష్టమైనది అని తెలిసిందే.. త్వరలో కుటుంబ సమేతంగా అయోధ్యకు వెళతామని ఆయన చెప్పాడు. -
500 ఏళ్లుగా ఎవరూ చేయలేదు థాంక్స్ మోడీ..!
-
ప్రధానికి టాలీవుడ్ స్టార్ హీరో రిక్వెస్ట్.. అదేంటో తెలుసా?
ప్రస్తుతం అందరి దృష్టి అంతా అయోధ్య రామమందిరం వైపే ఉంది. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రస్తుతం తమిళనాడులోని చెన్నైలో పర్యటిస్తున్నారు. ఖేలో ఇండియా గేమ్స్ను ప్రారంభోత్సవానికి పీఎం హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రధానిని ప్రముఖ సినీ నటుడు, అర్జున్ సర్జా కలిశారు. తన కుమార్తెతో కలిసి ప్రత్యేక జ్ఞాపికను అందజేశారు. ఈ సందర్భంగా చెన్నైలో తాను స్వయంగా నిర్మించిన హనుమాన్ ఆలయాన్ని సందర్శించాలని ప్రధానికి విజ్ఞప్తి చేశారు. అర్జున్ సర్జా విజ్ఞప్తిపై పీఎం సానుకూలంగా స్పందిచారు. త్వరలోనే ఆలయాన్ని సందర్శిస్తానని హామీ ఇచ్చినట్లు అర్జున్ వెల్లడించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. https://t.co/w9Kk48BQVJ — Soma Sundaram 🇮🇳 (@isomasundaram72) January 20, 2024 -
గ్రాండ్గా ఆ హీరోహీరోయిన్ నిశ్చితార్థం.. త్వరలో పెళ్లి కూడా
కొన్నాళ్ల నుంచి వినిపిస్తున్నదే నిజమైంది. ఆ హీరోహీరోయిన్ ఒకటయ్యారు. పెద్దల సమక్షంలో ఉంగరాలు మార్చుకున్నారు. ఈ నిశ్చితార్థ వేడుక చాలా గ్రాండ్గా జరిగింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. (ఇదీ చదవండి: బిగ్బాస్ 7లో ఈసారి షాకింగ్ ఎలిమినేషన్.. క్రేజీ కంటెస్టెంట్ ఔట్?) ఎవరా జోడీ? కర్ణాటకకు చెందిన అర్జున్ సర్జా.. సొంత భాషలో కంటే తెలుగు, తమిళంలోనే బాగా పాపులర్ అయ్యాడు. జెంటిల్మేన్, హనుమాన్ జంక్షన్ లాంటి చిత్రాలతో టాలీవుడ్ ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు. రీసెంట్గా 'లియో'లో హరోల్డ్ దాస్ అనే పాత్రలో ఆకట్టుకున్నాడు. ఇకపోతే ఇతడి కూతురు ఐశ్వర్య అర్జున్.. హీరోయిన్గా పలు సినిమాలు చేసింది. ఈమె నిశ్చితార్థమే ఇప్పుడు జరిగింది. తమిళంలో కామెడీ తరహా పాత్రలతో నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న తంబి రామయ్య కొడుకు ఉమాపతి.. హీరోగా పలు సినిమాలు చేశాడు. ఇప్పుడు ఇతడితోనే అర్జున్ కూతురు ఐశ్వర్య ఎంగేజ్మెంట్ జరిగింది. చెన్నైలో ఈ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. డిసెంబరులోనే పెళ్లి కూడా ఉండొచ్చని అంటున్నారు. సో అదన్నమాట విషయం. (ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు హిట్ 'మ్యాడ్' సినిమా.. స్ట్రీమింగ్ అప్పుడేనా?) View this post on Instagram A post shared by Aishwarya Arjun (@aishwaryaarjun) View this post on Instagram A post shared by Dhruvasarja_fans_adda🔵 (@dhruvasarja_fans_adda) -
యాక్షన్ థ్రిల్లర్ మూవీతో వస్తోన్న 'అర్జున్'.. క్రేజీ అప్డేట్ ఇదే!
టాలీవుడ్ యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా, నటి ఐశ్వర్య రాజేష్ మొదటిసారి జంటగా నటించిన చిత్రం తీయవన్ కులైగళ్ నడుంగా. బిగ్బాస్ అభిరామి, రామ్కుమార్ జీకే రెడ్డి, లోగు, వేల రామమూర్తి, తంగదురై, బ్రేకింగ్ స్టార్ రాహుల్ ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రాన్ని జీఎస్ఆర్ పతాకంపై జి.అరుణ్కుమార్ నిర్మిస్తున్నారు. కాగా ఈ చిత్రం ద్వారా దినేష్ లక్ష్మణన్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. తాజాగా ఈ చిత్రం షూటింగ్ పూర్తయినట్లు మేకర్స్ వెల్లడించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసిన సంబురాలు చేసుకున్నారు చిత్రబృందం. (ఇది చదవండి: ఉపాసన తాతగారికి రూ.కోటి చెక్ అందించిన ‘జైలర్’ నిర్మాత) ఇప్పటికే రిలీజైన తీయవన్ కులైగళ్ నడుంగా మూవీ ఫస్ట్లుక్ పోస్టర్కు ప్రేక్షకులు, సినీ వర్గాల నుంచి విశేష స్పందన వచ్చిందని పేర్కొన్నారు. యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో రూపొందిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన నిర్మాణాంతర కార్యక్రమాలు ప్రస్తుతం జరుగుతున్నాయని చెప్పారు. చిత్ర టీజర్, మోషన్ పోస్టర్, సింగిల్ సాంగ్ ఆడియో విడుదల కార్యక్రమాలు త్వరలోనే నిర్వహిస్తామన్నారు.. దీనికి శరవణన్ అభిమన్సు ఛాయా గ్రహణం, భరత్ అసీవగన్ సంగీతం అందిస్తున్నారు. యాక్షన్ కింగ్ అర్జున్, నటి ఐశ్వర్య రాజేష్ కాంబోలో తొలిసారిగా వస్తున్న ఈ చిత్రంపై మంచి అంచనాలు నెలకొన్నాయి. కాగా త్వరలోనే చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు నిర్మాత తెలిపారు. (ఇది చదవండి: కారులో రచ్చ చేసిన హీరోయిన్.. నెక్స్ట్ టార్గెట్ విజయ్?) It's a wrap for Aishwarya Rajesh’s upcoming crime thriller #TheeyavarKulaigalNadunga! Teaser coming soon! pic.twitter.com/0VvHN8HEis — Christopher Kanagaraj (@Chrissuccess) September 4, 2023 -
అర్జున్ బర్త్ డే.. అదిరిపోయిన గ్లింప్స్!
తమిళ స్టార్ హీరో, దళపతి విజయ్ తాజాగా నటిస్తోన్న చిత్రం లియో. ఈ చిత్రాన్ని లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రాన్ని సెవెన్ స్క్రీన్ స్టూడియో సంస్థ నిర్మిస్తోంది. త్రిష, ప్రియా ఆనంద్, గౌతమ్ మీనన్, మిస్కిన్, బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతమందిస్తున్నారు. అయితే ఈ చిత్రంలో సీనియర్ నటుడు, యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా ప్రధాన పాత్రలో కనిపించనున్నారు. తాజాగా ఇవాళ ఆయన బర్త్ డే కావడంతో లియో మేకర్స్ క్రేజీ అప్ డేట్ ఇచ్చారు. (ఇది చదవండి: విజయ్ 'లియో' కోసం మరోసారి కశ్మీర్కి!) అర్జున్ బర్త్ డే సందర్భంగా ఆయన పాత్రకు సంబంధించిన గ్లింప్స్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ చిత్రంలో ఆయన హరోల్డ్ దాస్ అనే క్యారెక్టర్లో అర్జున్ కనిపించనున్నారు. ఈ విషయాన్ని డైరెక్టర్ లోకేశ్ తన ట్విటర్లో షేర్ చేశారు. హ్యా బర్త్ డే అర్జున్ సార్ అంటూ.. థ్యాంక్యూ ఫర్ ఎక్స్ట్రార్డినరీ ఏఫర్ట్ అంటూ విషెస్ తెలిపారు. అయితే గ్లింప్స్ చూస్తే అర్జున్ ఫుల్ యాక్షన్ రోల్లో కనిపిస్తున్నారు. ప్రతి నాయకుడిగా ఓ రేంజ్లో ఉండనున్నట్లు తెలుస్తోంది. కాగా ఇప్పటికే చిత్రీకరణను పూర్తి చేసుకున్న ఈ చిత్ర దసరా సందర్భంగా అక్టోబర్ 19న థియేటర్లలో రిలీజ్ కానుంది. (ఇది చదవండి: రజినీకాంత్ 'జైలర్'.. సగం బడ్జెట్ ఆయనకే ఇచ్చేశారుగా!) And now meet #HaroldDas 🔥🔥 Thank you @akarjunofficial sir for the extraordinary efforts you’ve put in for this film! Wishing our #ActionKing a very happy birthday! 🤜🤛 #Leo🔥🧊#GlimpseOfHaroldDas#HBDActionKingArjun pic.twitter.com/DQnhxXbRkh — Lokesh Kanagaraj (@Dir_Lokesh) August 15, 2023 -
కూతురి కోసం యాక్షన్ కింగ్ మరో ప్రయత్నం, ఈసారైనా వర్కవుట్ అయ్యేనా?
యాక్షన్ కింగ్గా గుర్తింపు పొందిన నటుడు అర్జున్. ఈయనలో మంచి దర్శకుడూ ఉన్నాడనే విషయం తెలిసిందే. చాలా ఏళ్ల పాటు హీరోగా నటించిన ఈయన ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటిస్తున్నారు. ఈయనకు ఇద్దరు కూతుర్లు ఉన్న విషయం తెలిసిందే. అందులో పెద్ద కూతురు ఐశ్వర్య అర్జున్ సినీ రంగ ప్రవేశం చేసి తమిళంలో విశాల్ సరసన మదయానై చిత్రంలో కథానాయకిగా నటించారు. అయితే ఆ చిత్రం ఆమె కెరీర్కు ఏమాత్రం సాయం చేయలేదు. దీంతో అర్జున్ తన కూతురు ఐశ్వర్య కథానాయికగా సొల్లితరవా అనే చిత్రాన్ని స్వీయ దర్శకత్వంలో తమిళం, కన్నడం భాషల్లో నిర్మించారు. ఆ చిత్రం కూడా ఆశించిన విజయాన్ని సాధించలేదు. చాలా గ్యాప్ తర్వాత అర్జున్ ఆయన కూతుర్ని కథానాయికగా నిలబెట్టడానికి మరో ప్రయత్నం చేస్తున్నారు. ఈసారి ఆయన పాన్ ఇండియా చిత్రాన్ని చేస్తున్నారు. తన సొంత బ్యానర్.. శ్రీరామ్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్ పతాకంపై నిర్మిస్తున్న ఈ చిత్రానికి కథ, కథనం, మాటలు, దర్శకత్వం బాధ్యతలను కూడా ఆయనే చేపట్టారు. ఐశ్వర్య అర్జున్ కథానాయికగా నటిస్తున్న ఇందులో ప్రముఖ కన్నడ నటుడు ఉపేంద్ర అన్నయ్య కొడుకు నిరంజన్ను హీరోగా పరిచయం చేస్తున్నారు. నటుడు సత్యరాజ్, ప్రకాశ్ రాజ్, జయరాం తదితరులతో పాటు అర్జున్ కూడా ముఖ్యపాత్రను పోషిస్తున్నారు. కేజీఎఫ్ చిత్రం ఫేమ్ హిన్దేష్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ బుధవారం హైదరాబాద్లో ప్రారంభమైంది. View this post on Instagram A post shared by Aishwarya Arjun (@aishwaryaarjun) చదవండి: సైలెంట్గా ఓటీటీలోకి వచ్చేసిన ఆదిపురుష్ -
ప్రతి ఒక్కరూ మెచ్చే 'ఇద్దరు': హీరోయిన్ సోనీ
యాక్షన్ కింగ్ అర్జున్, రాధికా కుమారస్వామి (కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి భార్య), సోని చరిష్టా హీరోహీరోయిన్లుగా నటించిన ఔట్ అండ్ ఔట్ యాక్షన్ ఎంటర్టైనర్ 'ఇద్దరు'. ఎఫ్.ఎస్.ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై డి.ఎస్.రెడ్డి సమర్పణలో ఎస్.ఎస్.సమీర్ దర్శకత్వం వహించారు. ఫర్హీన్ ఫాతిమా నిర్మించిన ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఈనెల 7న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ప్రముఖ నటుడు జె.డి.చక్రవర్తి, అమీర్ ఖాన్ సోదరుడు ఫైసల్ ఖాన్, స్వర్గీయ కె.విశ్వనాథ్ ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రం విడుదల సందర్భంగా హీరోయిన్లలో ఒకరైన సోని చరిష్టా మాట్లాడుతూ.. 'ఈ చిత్రంలో నటించే అవకాశం ఇచ్చిన దర్శకుడు సమీర్ కి నా కృతజ్ఞతలు. యాక్షన్ కింగ్ అర్జున్ తో స్క్రీన్ షేర్ చేసుకోవడం నిజంగా నా అదృష్టం. 'ఇద్దరు' అనే ఈ చిత్రం నా కెరీర్ లో ఓ మైలురాయి. చిత్ర సమర్పకులు డి.ఎస్.రెడ్డి, నిర్మాత ఫర్హీన్ ఫాతిమాకు కూడా ఈ సందర్భంగా థ్యాంక్స్' అని అన్నారు. (ఇదీ చదవండి: అభిమానుల్ని మోసం చేస్తున్న స్టార్ హీరోలు!) -
అర్జున్ కూతురు పెళ్లి ఎప్పుడంటే.. వారి పరిచయం మొదలైంది అక్కడే
యాక్షన్ కింగ్ అర్జున్ పెద్ద కూతురు నటి ఐశ్వర్య పెళ్లి గురించి ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఆ వార్త నిజమేనని వరుడి తండ్రి ప్రకటన చేశారు. దీంతో త్వరలో అర్జున్ ఇంట శుభకార్యం జరగనుంది. కొలీవుడ్లో ప్రముఖ కమెడియన్, దర్శకుడు తంబి రామయ్య కుమారుడు, యువ నటుడు ఉమాపతితో వివాహం జరగనుంది. పెళ్లిపై తంబి రామయ్య ఏమన్నారంటే.. సోషల్మీడియాలో వస్తున్న వార్త నిజమే.. ఐశ్వర్య, ఉమాపతిల పెళ్లి త్వరలో జరగనుందని తంబి రామయ్య ప్రకటించారు. ఐశ్వర్యను ప్రేమిస్తున్నానని, ఇద్దరం పెళ్లి చేసుకోవాలని అనుకున్నామని మొదట తమ అబ్బాయి చెప్పాడంతో... ఇరు కుటుంబాల పెద్దలు కలిసి పెళ్లి గురించి మాట్లాడుకున్నాం అన్నారు. నవంబర్ 8న ఉమాపతి పుట్టినరోజన పెళ్లి తేదీని ప్రకటిస్తామన్నారు. వచ్చే ఏడాదిలో వీరిద్దరి పెళ్లి జరుపుతామని తంబి రామయ్య తెలిపారు. ఉమాపతి- ఐశ్వర్య పరిచయం ఎక్కడంటే.. ఇద్దరు సినిమా రంగంలో ఉన్నా.. కలిసి నటించింది లేదు. మరి వీరిద్దరి మధ్య ఎక్కడ ప్రేమ చిగురించిందని పలువురు సోషల్ మీడియాలో వెతుకుతున్నారు. ఆర్జున్ హోస్ట్గా ZEE తమిళ్లో ఓ రియాలిటీ షో ‘సర్వైవర్’ చేశారు. అక్కడ షూటింగ్లో ఉమాపతి స్టార్ కంటెస్టెంట్గా ఉన్నారు. ఆ సమయంలో ఈ జంట ఒకరినొకరు కలుసుకున్నారని తెలుస్తోంది. అక్కడి నుంచి మొదలైన వారి స్నేహం కాస్త ప్రేమకు దారి తీసింది. (ఇదీ చదవండి: హీరోలందరికి ఎఫైర్లున్నాయి.. నా భర్తను మాత్రమే ఎందుకంటారు?) ఆ తర్వాత అర్జున్ నిర్మించిన ఆంజనేయ స్వామి ఆలయం ప్రారంభోత్సవంలో తంబి రామయ్య కుటుంబం పాల్గొన్నారు. ఆ సమయంలోనే వారిద్దరి లవ్స్టోరీ ఇరు కుటుంబాలకు తెలిసిందట. ఆపై కుటుంబ పెద్దలు కూడా ఆశీస్సులు అందించారని తెలుస్తోంది. ఏదేమైనా వచ్చే ఏడాదిలో వీరి పెళ్లి జరగనుంది. అర్జున్, తంబి రామయ్య ఇద్దరూ కూడా సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో పేరున్నవారే కావడంతో వారి కుటుంబంలో జరిగే పెళ్లికి భారీగానే స్టార్స్ హాజరవుతారు. (ఇదీ చదవండి: ఈ నటిని గుర్తుపట్టారా? అప్పుడు ఐటమ్ సాంగ్స్ ఇప్పుడేమో ఆశ్రమంలో!) -
ప్రముఖ కమెడియన్ కుమారుడితో అర్జున్ కూతురు పెళ్లి
యాక్షన్ కింగ్ అర్జున్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. తెలుగులోనూ అర్జున్కి మాంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇక అర్జున్ కూతురు ఐశ్వర్యను ఇది వరకే తమిళ్, కన్నడలో హీరోయిన్గా నటించిన సంగతి తెలిసిందే. కానీ టాలీవుడ్లో మాత్రం తన ఎంట్రీ ప్రకటనతోనే సినిమా ఆగిపోయింది. ఈ నేపథ్యంలో ఐశ్వర్యకు సంబంధించి ఓ వార్త కోలీవుడ్లో విపరీతంగా ప్రచారం జరుగుతుంది. (ఇదీ చదవండి: డ్రగ్స్ కేసు.. వీడియో రిలీజ్ చేసిన నటి సురేఖావాణి) అదేమిటంటే..ఐశ్వర్య అర్జున్ త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నారంటూ అనే వార్త వైరల్ అవుతుంది. అబ్బాయి కూడా కోలీవుడ్లో ప్రముఖ హాస్య నటుడు అయినటువంటి తంబి రామయ్య కుమారుడు ఉమాపతి అని ప్రచారం జరుగుతుంది. అంతేకాకుండా వారిద్దరూ గత కొంత కాలంగా ప్రేమలో ఉన్నారని కూడా తెలుపుతున్నారు. దీంతో వీరి పెళ్లికి ఇరు కుటుంబాల నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చినట్లు తెలుస్తోంది. త్వరలో వీరి పెళ్లి ఘనంగా జరగబోతోందని సమాచారం. కానీ ఈ పెళ్లి గురించి ఎలాంటి అధికారిక ప్రకటన వారి కుటుంబాల నుంచి రాలేదు. కానీ జరిగేది ఇదేనని బలంగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. (ఇదీ చదవండి: డెలివరీకి ముందు ఉపాసన ఏం చేసిందంటే.. వీడియో వైరల్!) కోలీవుడ్లో 'అదగపాతుతు మగజనంగలే' అనే సినిమాతో 2017లో ఉమాపతి రామయ్య ఎంట్రీ ఇచ్చాడు. ఇప్పటి వరకు ఆయన పలు టీవి షోలతో పాటు నాలుగు సినిమాల్లో నటించాడు. ప్రస్తుతం 'దేవ్దాస్' అనే సినిమాలో నటిస్తున్నాడు. ఐశ్వర్య విషయానికొస్తే తెలుగులో హీరోయిన్గా లాంచ్ చేయాలని అర్జున్ చాలా కసరత్తు చేశాడు. అందుకు కోసం హీరోగా విష్వక్సేన్ పేరును కూడా ప్రకటించాడు. అయితే, ఈ మూవీ నుంచి విష్వక్ తప్పుకోవడంతో ప్రాజెక్టు పట్టాలెక్కలేదు. కానీ స్క్రిప్ట్ సిద్ధంగా ఉందని త్వరలో మరో హీరో పేరును ప్రకటిస్తామని ఆయన గతంలో తెలిపాడు. Umapathy Ramaiah (Thambi Ramaiah Son) & Aishwarya Arjun (Arjun’s Daughter) to tie the knot soon! pic.twitter.com/r0dRY3i6js — Christopher Kanagaraj (@Chrissuccess) June 25, 2023 -
ఆంజనేయ స్వామి భక్తులం మాకు ఆయన ఒక సూపర్ మ్యాన్
-
అర్జున్తో వివాదం.. డబ్బులు చెల్లించారా?: విశ్వక్ సేన్ స్పందన
యంగ్ హీరో విశ్వక్ సేన్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘దాస్ కా ధమ్కీ’. మార్చి 22న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. శుక్రవారం ప్రి రిలీజ్ ఈవెంట్ను నిర్వహించిన చిత్ర యూనిట్ ప్రస్తుతం ప్రమోషన్స్తో బిజీగా ఉంది. ఈనేపథ్యంలో తాజాగా మీడియాతో ముచ్చటించిన హీరో విశ్వక్ సేన్కు యాక్షన్ కింగ్ అర్జున్ సర్జాతో వివాదంపై ప్రశ్న ఎదురైంది. అర్జున్తో కాంట్రవర్సీ తర్వాత మీరు ఆయనకు పెద్ద మొత్తంలో డబ్బులు చెల్లించారనే వార్తలు వినిపించాయి. చదవండి: ఆ హీరోయిన్ని బ్లాక్ చేసిన బన్నీ! స్క్రిన్ షాట్స్తో నటి ఆరోపణలు.. ఇది నిజమేనా? అని ఓ విలేకరి ప్రశ్నించగా.. దీనికి సమాధానం ఇచ్చేందుకు విశ్వక్ ఆసక్తి చూపలేదు. దీనిపై విశ్వక్ స్పందిస్తూ.. ‘అది గతం. ఇప్పుడు దాని గురించి ఇప్పుడు మాట్లాడాలనుకోవడం లేదు. ఎందుకంటే ఆ వ్యవహారానికి ఈ సినిమాకు ఎటువంటి సంబంధం లేదు. ఎంతోమందిపై ఉన్న గౌరవంతో నేను దాని గురించి మాట్లాడాలనుకోవడం లేదు’ అని బదులిచ్చాడు. కాగా విశ్వక్ సేన్ హీరోగా తన కూతురు ఐశ్వర్య హీరోయిన్ అర్జున్ ఓ చిత్రం తెరకెక్కించిన సంగతి తెలిసిందే. చదవండి: తారక్ వండర్ కిడ్: ఎన్టీఆర్పై శుభలేఖ సుధాకర్ ఆసక్తికర వ్యాఖ్యలు ఈ చిత్రంతో తన కూతురిని టాలీవుడ్ పరిచయం చేయాలనుకున్నాడు అర్జున్. షూటింగ్ కూడా మొదలు పెట్టిన అర్జున్ విశ్వక్ సేన్ తీరుతో ఇబ్బంది పడ్డంటు తెలిసింది. విశ్వక్ సరిగ్గా సెట్స్కు రావడం లేదని.. ఏదో ఒక కారణం చెప్పి షూటింగ్ రద్దు చేస్తున్నాడని.. వర్క్ పట్ల అతడి ప్రవర్తన బాగోలేదంటూ గతంలో అర్జున్ ప్రెస్మీట్ పెట్టి ఆరోపించారు. ఆ తర్వాత కథ విషయంలో తనకి కాస్త ఇబ్బంది ఉందని, అది చెప్పినా అర్జున్ వినడం లేదని విశ్వక్ వివరణ ఇచ్చిన విషయం తెలిసిందే. -
మార్టిన్ వస్తున్నాడు
‘‘దేశవ్యాప్తంగా కన్నడ సినిమాకు మంచి ఆదరణ లభిస్తుండటం సంతోషంగా ఉంది. సుదీప్, యశ్గార్లు నా సీనియర్ యాక్టర్స్. వారు ఆల్రెడీ పాన్ ఇండియా సినిమాలు చేశారు. వారితో నేను పోటీపడటం లేదు. ఓ యాక్టర్గా ఇంకా మెరుగయ్యేందుకు నాతోనే నేనుపోటీ పడుతుంటాను’’ అని అన్నారు హీరో ధృవ సర్జా. ‘అద్దూరి’ (2012) చిత్రం తర్వాత హీరో ధృవ సర్జా, దర్శకుడు ఏపీ అర్జున్ కాంబోలో రూపొందిన యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ ‘మార్టిన్’. ఈ చిత్రంలో వైభవి శాండల్య, అన్వేషి జైన్ హీరోయిన్స్గా నటించారు. యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా కథ అందించిన ఈ సినిమాను ఉదయ్ కె. మెహతా నిర్మించారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ ఏడాది ఈ చిత్రం రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా జరిగిన ‘మార్టిన్’ టీజర్ లాంచ్ ఈవెంట్లో ధృవ సర్జా మాట్లాడుతూ– ‘‘మార్టిన్’ చిత్రం దేశభక్తి నేపథ్యంలో ఉంటుంది. ఈ క్యారెక్టర్ కోసం నేను ఎంతగానో కష్టపడ్డాను. ఇంటర్నేషనల్ ఫైటర్స్తో కూడిన యాక్షన్ సన్నివేశాల కోసం బాగా బరువు పెరిగాను’’ అన్నారు. ‘‘రాజమౌళి, ప్రశాంత్ నీల్, మణిరత్నం వంటి దర్శకులు భాషా పరమైన హద్దులను చెరిపేశారు. ఇప్పుడు అంతా ఇండియన్ సినిమాయే’’ అన్నారు అర్జున్. ‘‘ధృవతో నేను గతంలో ప్రేమకథ చేశాను. ఇప్పుడు యాక్షన్ మూవీగా ‘మార్టిన్’ చేశాను’’ అన్నారు అర్జున్ ఏపీ. -
లైంగిక వేధింపుల కేసు.. ప్రముఖ నటికి షాకిచ్చిన హైకోర్టు
ప్రముఖ కన్నడ నటి శృతి హరిహరన్కు కోర్టులో చుక్కెదురైంది. లైంగిక వేధింపుల కేసులో ఆమెకు వ్యతిరేకంగా కోర్టు ఉత్తర్వులిచ్చింది. సినీ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ ప్రశాంత్ సంబర్గిపై విచారణ నిలిపేయాలంటూ కర్ణాటక హైకోర్టు స్టే విధించింది. గతంలో నటుడు అర్జున్ సర్జాతో పాటు నిర్మాత ప్రశాంత్ లైంగిక వేధింపులకు పాల్పడ్డారని శృతి బెంగళూరు పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదైంది. ఈ కేసులో తనపేరు తొలగించాలని ప్రశాంత్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ప్రశాంత్ పిటిషన్పై విచారణ చేపట్టిన హైకోర్టు ధర్మాసనం ఈ కేసులో స్టే విధించింది. ప్రశాంత్ వేసిన పిటిషన్పై ఫిబ్రవరి 1, 2023న చేపట్టనున్నట్లు వెల్లడించింది. అసలేం జరిగిందంటే.. మరో నటుడు అర్జున్ సర్జా, నిర్మాత ప్రశాంత్ లైంగిక వేధింపులకు పాల్పడ్డారని శృతి హరిహరన్పై పోలీసులను ఆశ్రయించింది. విస్మయ సినిమా షూటింగ్ సమయంలో అర్జున్ సెట్లో తనతో అసభ్యంగా ప్రవర్తించాడని ఆమె ఆరోపించింది. అక్టోబర్ 2018లో అర్జున్, శృతి మధ్య వివాదాన్ని పరిష్కరించేందుకు ప్రముఖ నటుడు అంబరీష్ మధ్యవర్తిత్వంలో కర్ణాటక ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ సమావేశాన్ని కూడా నిర్వహించింది. కానీ ఈ కేసులో రాజీ కుదర్చలేకపోయారు. ఈ కేసు కోసం న్యూయార్క్ నుంచి శృతికి నిధులు సమకూరాయని గతంలో నిర్మాత ప్రశాంత్ ఆరోపించారు. -
ఆ విషయంలో విశ్వక్ సేన్దే తప్పు: డైరెక్టర్
యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా- యంగ్ హీరో విశ్వక్ సేన్ల వివాదం చర్చనీయాంశంగా మారింది. తన కూతురు ఐశ్వర్యను టాలీవుడ్కు పరిచయం చేస్తూ అర్జున్ ఓ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఇందులో విశ్వక్ హీరో! ఇప్పటికే అర్జున్ డైరెక్షన్లో రెండు షెడ్యూళ్ల షూటింగ్ కూడా పూర్తైంది. కానీ ఇంతలోనే సడన్గా సినిమా చిత్రీకరణను నిలిపేశారు. విశ్వక్ సేన్ షూటింగ్ హాజరు కాకుండా ఇబ్బంది పెడుతున్నాడని అర్జున్.. తన అభిప్రాయాలకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని, అందుకే షూటింగ్ ఆపమన్నానంటూ విశ్వక్ బాహాటంగా విమర్శలు గుప్పించుకున్నారు. తాజాగా ఈ వివాదంపై ప్రముఖ దర్శకుడు జీ నాగేశ్వర రెడ్డి స్పందించాడు. 'కథ చెప్పకుండా సినిమా షూటింగ్ జరగదు. అయితే పక్కనుండే వాళ్లు కథ బాగోలేదు, కెరీర్లో ఇలాంటి సినిమా సెలక్ట్ చేసుకోవడం ఎందుకు అని చెప్పినప్పుడు కచ్చితంగా మైండ్ డిస్టర్బ్ అవుతుంది. కానీ విశ్వక్ సేన్ సొంత టాలెంట్తో పైకి వచ్చినవాడు. అతడంత ఆలోచనారహితంగా పని చేశాడనుకోను. కథ వినుంటాడు, నచ్చే ఉంటుంది. మరోపక్క అర్జున సూపర్ హిట్స్ అందించిన డైరెక్టర్. కథ చెప్పేశా కదా అని అర్జున్ తన పని తాను చేసుకుంటూ వెళ్లిపోయుంటాడు. ఈ జనరేషన్ హీరోలెలా ఉన్నారంటే ఏం జరుగుతుందో మొత్తం మాకు తెలియాలంటున్నారు. అవసరమైతే కథ ట్రీట్మెంట్లో కూడా కూర్చుంటున్నారు. మొత్తం 70 సీన్లు చెప్పాక షూటింగ్ మొదలుపెట్టుకుందామని విశ్వక్ ముందే అడిగి ఉంటే సరిపోయేది. అలా కాకుండా షూటింగ్ ఆపమని చెప్పడం కరెక్ట్ కాదు. ఈ విషయంలో హీరోదే తప్పు. ఇకపోతే ఈ విషయంలో అర్జున్ మీడియా ముందుకు రావడం, దానికి విశ్వక్ వివరణ ఇచ్చుకోవడం రెండు సరైనవే. ఒక్కోసారి మన చుట్టూ ఉండే మనుషుల వల్లే సమస్యలు వస్తాయి. ఏదైనా సమస్య ఉన్నప్పుడు ఇద్దరూ డైరెక్ట్గా మాట్లాడుకుంటే ఆ ప్రాబ్లమ్స్ ఉండవు' అని చెప్పుకొచ్చాడు. చదవండి: అర్జున్ సర్జా- విశ్వక్ సేన్ వివాదం.. తెరపైకి యంగ్ హీరో