-
అనుష్క సినిమా వాయిదా...పోలిశెట్టి రిలీజ్ కష్టాలు
-
అనుష్కను కోడలిగా చేసుకోవాలనుకున్న స్టార్ డైరెక్టర్..?
అభిమానులు స్వీటీ అని పిలుచుకునే నటి అనుష్క. అందం, అభినయంలో విశేష గుర్తింపు ఆమె సొంతం. మంగళూరుకి చెందిన యోగా టీచర్ అయిన ఈమె 2005లో సూపర్ చిత్రంతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఆ చిత్రంలో అందాలను ఆరబోసిన అనుష్క ఆ తరువాత కూడా చాలా చిత్రాల్లో గ్లామరస్ పాత్రలకే పరిమితమయ్యారు. అలా తెలుగు, తమిళం భాషల్లో నటిస్తూ బిజీగా ఉన్న ముద్దుగుమ్మ కెరియర్ను అరుంధతి చిత్రం ఒక్కసారిగా మార్చేసింది. అందులో జేజమ్మగా తన అభినయంతో ప్రేక్షకుల నుంచి జేజేలు అందుకున్నారు. ఆ తరువాత బాహుబలి, భాగమతి వంటి చిత్రాల్లో అద్భుత నటనతో ప్రేక్షకులను అబ్బురపరిచారు. అయితే సైజు జీరో చిత్రం అనుష్క నట జీవితాన్ని ఒక్కసారిగా తలకిందులు చేసేసిందనే చెప్పాలి. అందులో పాత్ర కోసం అనుష్క బరువుని భారీగా పెంచేసుకుంది. ఆ తరువాత బరువు తగ్గడానికి చాలా ప్రయత్నాలు చేసినా ఫలితం లేకపోయింది. దీంతో కొన్ని సినిమాలు ఆమె చేయలేకపోయింది. చాలా గ్యాప్ తర్వాత నిశ్శబ్దం అనే చిత్రంతో వచ్చినా అది శబ్దం లేకుండానే వెళ్లిపోయింది. మళ్లీ ఇప్పుడు అనుష్క- నవీన్ పొలిశెట్టి కీలక పాత్రల్లో వస్తున్న చిత్రం ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’.ఈ సినిమా ఆగస్టు 4న ప్రేక్షకుల ముందుకు రానుంది. మహేష్బాబు.పి దర్శకత్వం వహిస్తున్నారు. (చదవండి: ‘బలగం' హీరోయిన్కి అవమానం!) ఇదిలా ఉంటే అనుష్క పెళ్లికి సంబంధించిన ఓ వార్త ఇప్పుడు నెట్టింట వైరల్గా మారింది. గతంలో అనుష్కని తన ఇంటి కోడలిగా చేసుకోవాలని భావించారట స్టార్ డైరెక్టర్ రాఘవేంద్రరావు. తమ కుమారుడిని పెళ్లి చేసుకుంటారా? అని డైరెక్ట్గా అనుష్కనే అడిగారట. అయితే అనుష్క మాత్రం రాఘవేంద్రరావు ప్రపోజల్ని సున్నితంగా తిరస్కరించారట. (చదవండి: అమ్మాయిలతో మాట్లాడేందుకు రెండేళ్లు పట్టింది: ఆనంద్ దేవరకొండ) ఇదీ గతంలో జరిగిన విషయం అంటూ ఇప్పుడు ఇండస్ట్రీలో వైరల్ అవుతుంది. గతంలో తన కుమారుడు ప్రకాష్కు పెళ్లి చేయాలనే ఆలోచన వచ్చినప్పడు రాఘవేంద్రరావు ఫస్ట్ చాయిస్ అనుష్కనే అనుకున్నారట. ఇదే విషయాన్ని డైరెక్ట్గా అనుష్కను అడిగితే... తను సున్నితంగా తిరష్కరించిందట. ఇప్పట్లో పెళ్లి చేసుకోవాలనే ఆలోచన లేనట్లు అనుష్క చెప్పిందట. దీంతో 2014లో ముంబైకి చెందిన కనికతో ప్రకాష్కు పెళ్లి రాఘవేంద్రరావు జరిపించారని ప్రచారం జరుగుతుంది. ఆ తర్వాత 2017లో ఈ జంట విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. ఆ తర్వాత కూడా మళ్లీ అనుష్క వద్దకు పెళ్లి మ్యాటర్ గురించి చర్చించాలని భావించాడట. కానీ అప్పటికే పెళ్లికి నో చెప్పిన అనుష్క.. మళ్లీ తన అబ్బాయిని చేసుకునేందుకు ఒప్పుకుంటుందా అనే సందేహంతో రాఘవేంద్రరావు ఆగిపోయారట. -
అనుష్కా శెట్టి, నవీన్ పొలిశెట్టిల ‘లేడీ లక్’ ఫుల్ వీడియో సాంగ్ చూశారా?
నవీన్ పొలిశెట్టి, అనుష్కా శెట్టి లీడ్ రోల్స్లో నటించిన చిత్రం ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’. మహేశ్బాబు .పి దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్ బ్యానర్పై వంశీ, ప్రమోద్ నిర్మించారు. ఈ సినిమా ఆగస్ట్ 4న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానుంది. రథన్ సంగీతం అందించిన ఈ చిత్రంలోని ‘లేడీ లక్..’ అంటూ సాగే వీడియో సాంగ్ని సోమవారం రిలీజ్ చేశారు. రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించిన ఈ పాటను కార్తీక్ పాడారు. ‘‘ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపొందిన చిత్రం ఇది. చెఫ్ అన్వితా రవళిగా అనుష్క, స్టాండప్ కమెడియన్ సిద్ధుగా నవీన్ పాత్రలు మనసులను హత్తుకునేలా ఉంటాయి. ‘లేడీ లక్..’ సాంగ్లో నవీన్ ఎనర్జీ, అనుష్క చార్మింగ్ లుక్స్ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటాయి’’ అని చిత్ర యూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి కెమెరా: నీరవ్ షా. -
రొమాంటిక్ ఎంటర్టైనర్
అనుష్కా శెట్టి, నవీన్ పోలిశెట్టి ప్రధానపాత్రల్లో నటించిన ఫీల్గుడ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ ‘మిస్శెట్టి మిస్టర్ పోలిశెట్టి’. పి.మహేశ్ బాబు దర్శకత్వంలో వంశీ, ప్రమోద్ నిర్మించిన ఈ సినిమాను ఈ వేసవిలో విడుదల చేయాలనుకున్నా కుదర్లేదు. దీంతో తాజాగా ఆగస్టు 4న ఈ సినిమాను విడుదల చేస్తున్నట్లు ప్రకటించి, కొత్త పోస్టర్ను విడుదఅనుష్కా శెట్టి, నవీన్ పోలిశెట్టి ల చేశారు మేకర్స్. చెఫ్ అన్విత రవళి శెట్టిపాత్రలో అనుష్కా శెట్టి, స్టాండప్ కమెడియన్ సిద్ధుపాత్రలో నవీన్ పోలిశెట్టి కనిపిస్తారు. ఈ సినిమాకు సంగీతం: రధఅనుష్కా శెట్టి, నవీ¯Œ ΄÷లిశెట్టి ్రç . -
హతవిధి.. ధనుష్ వాయిస్లో ఉన్న మ్యాజిక్కే వేరు!
నవీన్ పొలిశెట్టి, అనుష్క శెట్టి హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి. ఈ సినిమా కోసం తెలుగు ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. మహేష్ బాబు పి దర్శకత్వం వహించిన ఈ చిత్రం నుంచి కొన్ని రోజుల క్రితం విడుదలైన మొదటి సాంగ్కు మంచి స్పందన లభించింది. బుధవారం ఈ చిత్రం నుంచి మరో పాటను విడుదల చేశారు. ఈ సాంగ్ను హీరో ధనుష్ పాడడం విశేషం. ధనుష్ గతంలో కూడా ఎన్నో సాంగ్స్ పాడి అలరించాడు. అందుకే సింగర్గా ఆయన ప్రతిభ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ముఖ్యంగా ఈయన పాడిన కొలవరి డి ఎంత పెద్ద సక్సెస్ సాధించిందో మనందరికీ తెలుసు. ఇక ఇప్పుడు తన గాత్రంతో హతవిధి సాంగ్కు మరింత వన్నె తెచ్చాడీ హీరో. నవీన్ పొలిశెట్టి నిస్పృహతో అరిచే వాయిస్తో ఈ పాట మొదలవుతుంది. హీరో తన భవిష్యత్తు తెలుసుకోవాలని ఒక చిలక దగ్గరకు వెళితే ఆ చిలక కూడా పారిపోతుంది. అలా తన లైఫ్లో ఏది గొప్పగా చేయాలనుకున్నా అది అనుకున్నట్టు జరగకపోవడం అనే కాన్సెప్ట్తో సాంగ్ కొనసాగుతుంది. అంతేకాదు తనకు ఎదురవుతున్న సంఘటనల వల్ల హీరో ఎంత నిరుత్సాహానికి లోనవుతాడనే విషయాన్ని దర్శకుడు ఈ పాటలో స్పష్టంగా చూపించాడు. లిరిక్స్ విషయానికి వస్తే 'బుల్లిచీమ బతుకుపై... బుల్డోజరైందాయ్' అనే పంచులతో మిస్టర్ శెట్టి జీవితాన్ని స్పష్టంగా వివరిస్తుంది ఈ పాట. ఇంత మంచి లిరిక్స్ను రామజోగయ్య శాస్త్రి అందించడం విశేషం. ధనుష్ గొంతు, రామజోగయ్య శాస్త్రి లిరిక్స్తో పాటు సంగీత దర్శకుడు రధన్ మ్యూజిక్ ఈ సాంగ్ను ప్రేక్షకులకు మరింత దగ్గర చేస్తుంది. చదవండి: చాతిపై పవర్ స్టార్ పచ్చబొట్టు -
అట్టు అనుష్క ఇటు కృతి సనన్... నారీ నారీ నడుమ ప్రభాస్
-
ప్రభాస్ను అనుష్క ముద్దుగా ఏమని పిలుస్తుందో తెలుసా?
టాలీవుడ్లో ప్రభాస్-అనుష్కల జోడీకి సెపరేట్ ఫ్యాన్బేస్ ఉంది. ఆన్స్క్రీన్లోనే కాకుండా, ఆఫ్స్క్రీన్లోనూ వీరి కెమిస్ట్రీకి ఎంతోమంది అభిమానులు ఉన్నారు. ఇక ఎప్పటినుంచో ప్రభాస్-అనుష్కలు ప్రేమలో ఉన్నారని వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. త్వరలోనే పెళ్లి చేసుకోనున్నారనే రూమర్స్ కూడా వినిపిస్తున్నాయి. చదవండి: 'విమానం'లో అనసూయ లుక్ అదిరిందిగా.. రంగమ్మత్తలా ఉందే! కానీ అందరూ అనుకున్నట్టు తమ మధ్య ఏమీ లేదని, కేవలం ఫ్రెండ్స్ అని అనుష్క, ప్రభాస్లో క్లారిటీ ఇచ్చినా ఫ్యాన్స్ మాత్రం వీళ్లు రియల్ లైఫ్ కపుల్ అయితే బాగుండని కోరుకుంటారు. ఇక తాజాగా మరోసారి ప్రభాస్-అనుష్కల రిలేషన్షిప్పై సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఇంతకీ ఏమైందంటే.. అనుష్క, నవీన్ పొలిశెట్టి జంటగా నటించిన మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి టీజర్ రీసెంట్గా విడుదలైన సంగతి తెలిసిందే. దీన్ని ప్రభాస్ తన ఇన్స్టా స్టోరీలో షేర్ చేస్తూ.. టీజర్ చాలా బావుందంటూ ప్రశంసలు కురిపించాడు. దీనిపై అనుష్క స్పందిస్తూ.. థ్యాంక్యూ 'పప్సు' అంటూ కామెంట్ చేసింది. ఈ స్టోరీని స్క్రీన్ షాట్ చేసిన పలువురు ఫ్యాన్స్ సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. చదవండి: వారికి ఇష్టమైనప్పుడు.. మనం ఏం చేయగలం: కంగనా -
'మిస్ శెట్టి.. మిస్టర్ పొలిశెట్టి' టీజర్ వచ్చేసింది.. ఫుల్ కామెడీ
జాతిరత్నాలు సినిమాతో తిరుగులేని క్రేజ్ అందుకున్న హీరో నవీన్ పొలిశెట్టి. ఈ సినిమా తర్వాత ఆయన నటిస్తున్న తాజా చిత్రం ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’. ఇందులో స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి హీరోయిన్గా నటిస్తుంది. రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు డెబ్యూ డైరెక్టర్ మహేశ్ బాబు దర్శకత్వం వహిస్తున్నారు. సినిమాను అనౌన్స్ చేసి చాలాకాలమే అయినా ఇడేట్ప్పటివరకు ఇలాంటి అప్డేట్ ఇవ్వలేదు. కానీ తాజాగా ఈ సినిమా టీజర్ను వదిలారు మేకర్స్. ఇందులో నవీన్ పొలిశెట్టి స్టాండప్ కమెడియన్గా కనిపించనుండగా, అనుష్క చెఫ్గా నటించనుంది. యూవీ క్రియేషన్స్ బ్యానర్పై శరవేగంగా సాగుతున్న ఈ సినిమా షూటింగ్ ఇప్పుడు ముగింపు దశకు చేరుకున్నట్లు తెలుస్తుంది. ఈ ఏడాదిలోనే ఈ సినిమాను విడుదల చేసుందేకు మేకర్స్ రెడీ అవుతున్నారు. -
Anushka Shetty: బొద్దుగా మారిన అనుష్క.. కారణం ఇదేనా?
సిల్వర్ స్క్రీన్ పై హీరోయిన్ గా చాలా మంది రాణిస్తారు. వీరిలో కొంత మంది బ్యూటీస్ మాత్రమే ప్రయోగాలు చేయటానికి ఇష్టపడతారు. వారిలో అనుష్క ఒకరు. అనుష్క అందం అభినయం కలిసిన నటి. సూపర్ సినిమాతో తెరంగ్రేటం చేసిన అనుష్క...తన అందంతోనే కాదు..అభినయంతో కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంది. అనుష్క నటనకే కాదు..గ్లామర్ కు కూడా ప్యాన్స్ ఉన్నారు. డైరెక్టర్ కె.రాఘవేంద్రరావు తనయుడు, కె.ప్రకాష్ దర్శకత్వంలో అనుష్క సైజ్ జీరో సినిమాలో నటించింది. సైజ్ జీరో ముందు వరకు అనుష్క చాలా స్లిమ్ గా ఉండేది. బాహుబలి, రుద్రమదేవి సినిమాల్లో నార్మల్ లుక్ లోనే కనిపించింది. సైజ్ జీరో కోసం అనుష్క చేసిన ప్రయోగం బెడిసి కొట్టింది. అనుష్క వెయిట్ కంట్రోల్ తప్పింది. ఆ సినిమా కోసం అనుష్క కావాలని విపరీతంగా బరువు పెరిగింది. రాజమౌళి వద్దని చెప్పిన వినకుండా ఆ సినిమాలో నటించింది అనుష్క. ఆ సినిమా మీద నమ్మకంతో బాగా లావుగా మారిపోయింది. అనుష్క నమ్మకం పెట్టుకున్న ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడింది. తన యోగా పద్దతులు ద్వారా స్లిమ్ కావచ్చు అనుకున్న అనుష్క ప్రయత్నం సక్సెస్ కాలేదు. అనవసరంగా అనుష్క సైజ్ జీరో చేసిందనే కామెంట్స్ ఎక్కువైయ్యాయి.ఇక బాహుబలి 2 కోసం అనుష్క వెయిట్ లాస్ అవ్వటానికి ఎంత ట్రై చేసిన నార్మల్ లుక్ లోకి రాలేకపోయింది. దీంతో రాజమౌళి గ్రాఫిక్స్ తో ఏదో మ్యానేజ్ చేశాడు. బాహుబలి 2 తర్వాత నటించిన భాగమతి, నిశ్శబ్దం సినిమాలో అనుష్క లావుగానే కనిపించింది. నిశ్శబ్దం తర్వాత అనుష్క ఇంకో సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. దీంతో అందరూ అనుష్క స్లిమ్ కావటం కోసం గ్యాప్ తీసుకుందనుకున్నారు. ఇక అనుష్క కూడా అమెరికా లో వెయిట్ లాస్ అయ్యేందుకు ట్రై చేసింది. కానీ ఎలాంటి రిజల్ట్ అనుష్క కి అవి ఇవ్వలేదని..ఈ మధ్య కర్ణాటకలోని ఓ ఆలయంలో కనిపించిన అనుష్క చూస్తే అర్ధమౌతుంది. ఇక సోషల్ మీడియా లో బాగా బొద్దుగా మారిన అనుష్క వీడియో వైరల్ అయింది. అయితే అనుష్క ఇంతలా వెయిట్ పెరగడానికి కారణం థైరాయిడ్ అనే ప్రచారం సోషల్ మీడియాలో జరుగుతోంది.. అందులో ఎంతవరకు నిజం ఉందనేది మాత్రం అనుష్కనే తేల్చాలి. ఇక అనుష్క బొద్దుగా మారటంపై చాలా మంది చాలా రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.అనుష్కకి సినిమాల్లో నటించే ఆలోచన లేదని..అందుకే ఫిట్ నెస్ విషయం పట్టించుకోవటం లేదంటూ డిస్కషన్ చేస్తున్నారు. ఇంకొంత మంది నెటిజన్స్ అనుష్క ఇలా లావు కనిపించటం వెనుక రీజన్ ఉండొచ్చని అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం అనుష్క..యూవీ క్రియేషన్స్ లో మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమాలో నటిస్తుంది. ఈ సినిమా కోసమే అనుష్క లావు అయిందనే వాదనలు వినిపిస్తున్నాయి. రీసెంట్ గా రిలీజైన మిస్ శెట్టి..మిస్టర్ పొలిశెట్టి మూవీ పోస్టర్ అండ్ లిరికల్ సాంగ్ లో అనుష్క అంత బొద్దుగా కనిపించలేదు. అయితే ఈ సినిమా విషయంలో కూడా అనుష్క లావుగా కనిపించకుండా ఉండేందుకు గ్రాఫిక్స్ వాడారనే మాట టీటౌన్ లో వినిపిస్తోంది. ఇక అనుష్క ఫ్యాన్స్ మాత్రం స్వీటీ మళ్లీ నార్మల్ లుక్ లో రావాలనుకుంటున్నారు.కానీ ఫ్యాన్స్ కల నిజం అయ్యేలా లేదు. ఎందుకంటే ప్రసస్తుతం అనుష్క వయస్సు నాలుగు పదులు దాటేసింది. ఏజ్ పరంగా చూసుకున్న అనుష్క నార్మల్ లుక్ లోకి..ఫ్యాన్స్ కోరుకున్న విధంగా తయారు కావాలంటే కొంచెం కష్టమే. కానీ అనుష్క కి సినిమా అంటే చాలా ఇష్టం. అందుకే ఎంత రిస్క్ అయినా చేస్తుంది. అందుకే సైజ్ జీర్ చేసింది. ఆ సినిమా మీద ప్రేమే మళ్లీ అనుష్క ను స్లిమ్ గా మార్చేలా చేస్తుందేమో చూడాలి. -
అనుష్క, నవీన్ పొలిశెట్టి మూవీ టైటిల్, ఫస్ట్లుక్ అవుట్
హీరోయిన్ అనుష్క శెట్టి, నవీన్ పోలిశెట్టి జంటగా ఓ చిత్రం రాబోతున్న సంగతి తెలిసిందే. వీరిద్దరి కాంబినేషన్ సినిమా అనగానే ప్రేక్షకుల్లో అంచనాలు నెలకొన్నాయి. యు.వి.క్రియేషన్స్ పతాకంపై ‘రారా కృష్ణయ్య ఫేం’ పి మహేశ్ బాబు ఈ మూవీని తెరకెక్కిస్తున్నాడు. ఇటీవల సెట్పైకి వచ్చిన ఈ మూవీ టైటిల్, ఫస్ట్లుక్ పోస్టర్లను చిత్ర బృందం విడుదల చేసింది. ఇప్పటికే ప్రచారంలో ఉన్న ఈ మూవీ టైటిల్ను ‘మిస్ శెట్టి.. మిస్టర్ పొలిశెట్టి’గా ఖరారు చేశారు. ఈ సందర్భంగా, అనుష్క, నవీన్ పొలిశెట్టిల లుక్ను కూడా రిలీజ్ చేశారు. కాగా ఈ సినిమాలో సిద్ధు పొలిశెట్టి అనే స్టాండప్ కమెడియన్గా నవీన్, అన్విత రవళి శెట్టి అనే చెఫ్గా అనుష్క నటించనున్నారు. కాగా ఈ సమ్మర్కు తెలుగుతో పాటు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. నిశ్శబ్దం తర్వాత అనుష్క, జాతిరత్నాలు తర్వాత నవీన్ నటిస్తున్న ఈ చిత్రంపై ఇప్పటికే బజ్ క్రియేట్ అయ్యింది. ఈ సినిమాకు రధన్ సంగీతం అందిస్తున్నాడు. Introducing our most favourite combo; #MissShettyMrPolishetty to you all🤩 Get ready for a Rollercoaster ride of Entertainment this Summer@MsAnushkaShetty @NaveenPolishety @filmymahesh @radhanmusic #NiravShah #RajeevanNambiar #KotagiriVenkateswararao @UV_Creations @adityamusic pic.twitter.com/mkG8bWrMnz — UV Creations (@UV_Creations) March 1, 2023 -
Anushka Latest Photos: గుర్తు పట్టలేనంతగా మారిపోయిన అనుష్క శెట్టి.. ఎందుకో తెలుసా?
-
మరోసారి ఆ డైరెక్టర్కు అనుష్క గ్రీన్ సిగ్నల్?
అందానికి ప్రతిరూపం నటి అనుష్క. ఈ బెంగళూరు బ్యూటీ తొలి రోజుల్లో యోగా టీచర్ అన్నది తెలిసిందే. ఆ తరువాత సూపర్ అనే చిత్రం ద్వారా టాలీవుడ్కు కథానాయకిగా తెరంగేట్రం చేసింది. తొలి చిత్రంతోనే ప్రత్యేకతను చాటుకున్న ఈ భామ ఆదిలో అందాలారబోతకే పరిమితమైంది. అరుంధతి చిత్రంతో తనలోని నటనను నిరూపించుకున్నారు. ఆ తరువాత వరుసగా హీరోయిన్కు ప్రాముఖ్యత కలిగిన పాత్రలు రావడం మొదలెట్టాయి. అలా నటించిన చిత్రాలే రుద్రమదేవి, బాహుబలి, భాగమతి వంటి భారీ చిత్రాలు. చదవండి: ‘కట్టప్ప’ సత్యరాజ్ కూతురు గురించి ఈ ఆసక్తికర విషయాలు తెలుసా? అలా అగ్రనటిగా రాణించిన అనుష్క కోలీవుడ్కు రెండు చిత్రంతో పరిచయం అయ్యారు. ఈ చిత్రంలోనూ తన అందాలతో యువతను ఆకట్టుకున్నారు. ఆ తర్వాత దైవ తిరుమగళ్, సింగం వంటి హిట్ చిత్రాల్లో నటించి తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకున్నారు. అలాంటిది ఇంజి ఇడుప్పళగి చిత్రంలో పాత్ర కోసం బరువు పెరిగిన అనుష్క దాన్ని తగ్గించుకోవడానికి చాలా ప్రయత్నాలు చేశారు. అయితే ఫలితం శూన్యం. దీంతో చాలా కాలం నటనకు దూరం అయ్యారు. ఆ మధ్య తెలుగులో నవీన్ పొలిశెట్టితో కలిసి ఒక చిత్రం చేస్తున్నట్లు ప్రచారం జరిగినా, అది ఏ స్టేజీలో ఉందో తెలియని పరిస్థితి. కాగా అనుష్క మరింత లావెక్కిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యి ఆశ్చర్యపరిచాయి. ఇలాంటి పరిస్థితుల్లో అనుష్క మళ్లీ కోలీవుడ్లో రీ ఎంట్రీకి సిద్ధం అవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. దర్శకుడు ఏఎల్.విజయ్ దర్శకత్వంలో నటించడానికి సిద్ధం అవుతున్నారని ప్రచారం జరుగుతోంది. ఈమె ఇంతకు ముందు ఏఎల్.విజయ్ దర్శకత్వంలో దైవతిరుమగళ్ చిత్రంలో నటించారు. కాగా మరోసారి అనుష్కతో చిత్రం చేయడానికి విజయ్ సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. చదవండి: వీధి కుక్కల దాడి ఘటనపై స్పందించిన యాంకర్ రష్మీ కొందరు దర్శకులు అనుష్కతో చిత్రాలు చేయడానికి ప్రయత్నించినా ఆమె నిరాకరించినట్లు తెలుస్తోంది. అందుకు కారణం తన బరువే అంటూ ప్రచారం జరిగింది. మరి ఇప్పుడు విజయ్ దర్శకత్వంలో నటించడానికి కారణం ఏమిటన్న ప్రశ్నకు లావుగా ఉన్న తనను గ్రాఫిక్స్ ద్వారా సన్నగా చూపించడానికి ఈ దర్శకుడు అంగీకరించినట్లు, అందుకే అనుష్క ఆయన దర్శకత్వంలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే దీనికి సంబంధించిన అధికార ప్రకటన వెలువడాల్సి ఉంది. -
అనుష్కతో నవీన్ పొలిశెట్టి ప్రేమాయణం..?
-
అనుష్క శెట్టికి ఏమైంది? ఇలా మారిపోయింది.. ఫోటోలు వైరల్
హీరోయిన్ అనుష్క శెట్టి కొంతకాలంగా ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నారు. సినిమా ఫంక్షన్లు సహా సోషల్ మీడియాలోనూ పెద్దగా యాక్టివ్గా కనిపించడం లేదు. బాహుబలి లాంటి అద్భుతమైన విజయం తర్వాత ఆమె వరుస సినిమాల్లో నటిస్తూ బిజీ అవుతుందనుకున్నారు. కానీ చాలా రోజులుగా అనుష్క బయట ఎక్కడా కనిపించడం లేదు. అయితే తాజాగా కుటుంబసభ్యులతో కలిసి బెంగళూరులో శివరాత్రి వేడుకలకు హాజరైంది.దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. దాదాపు రెండేళ్ల తర్వాత అనుష్క బయట కనిపించడంతో ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. కాగా ఇందులో అనుష్క కాస్త బొద్దుగా కనిపిస్తున్నారు. ఇక కెరీర్ విషయానికి వస్తే.. ప్రస్తుతం ఆమె నవీన్ పొలిశెట్టికి జోడీగా ‘మిస్ శెట్టి, మిస్టర్ పోలిశెట్టి’ అనే సినిమాలో నటిస్తున్నారు.యూవీ క్రియేషన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. -
అనుష్క శెట్టికి అరుదైన వ్యాధి, స్వయంగా వెల్లడించిన స్వీటీ
వెండితెరపై తమ అందం, గ్లామర్తో ఆకట్టుకుంటునే భామలు వ్యక్తిగతంగా పలు అరోగ్య సమస్యలతో బాధపడుతున్న సంగతి తెలిసిందే. అందులో స్టార్ హీరోయిన్ సమంత, మమత మోహన్ దాస్, శృతి హాసన్తో సహా పలువురు నటీనటులు ఉన్నారు. ఇటీవల మయెసైటిస్ అనే అరుదైన వ్యాధి బారిన పడ్డ సామ్ ప్రస్తుతం కోలుకుంది.మయోసైటిస్తో బాధపడుతున్నానని సమంత వెల్లడించడంతో పలువురు నటీనటులు, హీరోయిన్లు కూడా బయటకు వచ్చి తమ వ్యాధిని బయటపెట్టారు. చదవండి: ప్రేమికుల రోజున సీనియర్ హీరోకి అదితి ప్రపోజ్! సిద్ధార్థ్ రియాక్షన్ ఇదే.. తాజాగా స్వీటీ అనుష్క కూడా ఓ అరుదైన వ్యాధితో బాధపడుతున్నట్లు చెప్పింది. ఇటీవల ఓ తమిళ యూట్యూబ్ చానల్తో ముచ్చటించిన ఆమె తాను బాధపడుతున్న అరుదైన వ్యాధి గురించి బయటపెట్టింది. తనకు నవ్వే జబ్బు ఉందంటూ ఆసక్తిర వ్యాఖ్యలు చేసింది. అది పెద్ద సమస్య కానప్పటికి తాను నవ్వడం స్టార్ట్ చేస్తే 15 నుంచి 20 నిమిషాల పాటు నవ్వుతూనే ఉంటానని చెప్పింది. చదవండి: ఆలియా బాటలోనే కియారా! పెళ్లికి ముందే ప్రెగ్నెంటా? నటుడి షాకింగ్ ట్వీట్ ‘నవ్వించే సంఘటన వస్తే పడి పడి నవ్వుతూనే ఉంటాను. నవ్వుని అసలు కంట్రోల్ చేసుకోలేను. ఇక సెట్లో నేను నవ్వడం స్టార్ట్ చేస్తే షూటింగ్ ఆపేసుకోవాల్సిందే. దాదాపు 20 నిమిషాల పాటు నవ్వుతూనే ఉంటా. ఈ గ్యాప్లో ప్రొడక్షన్ వాళ్లు టిఫిన్స్, స్నాక్స్ లాంటివి కంప్లీట్ చేసుకుని వస్తారు’ అని అంటూ తన అరుదైన వ్యాధి గురించి చెప్పుకొచ్చింది. కాగా ప్రస్తుతం అనుష్క మైత్రి మూవీ ప్రొడక్షన్లో ఓ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో యంగ్ హీరో నవీన్ పొలిశెట్టితో కలిసి నటిస్తోంది. ఈ చిత్రానికి ‘మిస్ శెట్టి.. మిస్టర్ పొలిశెట్టి’ అనే టైటిల్ను పరిశీలిస్తున్నట్లు సమాచారం. -
‘గ్యాప్ ఇవ్వలా.. వచ్చింది’ అంటున్నస్టార్ హీరోయిన్స్
ఏడేళ్ల తర్వాత తెలుగుకి వచ్చారు కృతీ సనన్.. దిశా పటానీ. మూడేళ్ల తర్వాత తెలుగు సినిమా చేస్తున్నారు కియారా అద్వానీ.. మూడేళ్ల తర్వాత తెలుగు తెరపై కనిపించనున్నారు అనుష్క. ఇరవైరెండేళ్ల తర్వాత హిందీ సినిమా చేశారు జ్యోతిక.. ఎందుకీ గ్యాప్ అంటే.. వేరే భాషల్లో సినిమాలు చేయడంవల్ల, వేరే కారణాల వల్ల అన్నమాట.అంతేకానీ కావాలని ‘గ్యాప్ ఇవ్వలా... వచ్చింది’. ఇక తెలుగు, హిందీలో గ్యాప్ తర్వాత ఈ స్టార్స్ చేస్తున్న సినిమాల గురించి తెలుసుకుందాం... ‘జియా జలే...’ అంటూ వరుణ్ తేజ్తో కలిసి ‘లోఫర్’లో చాలా హాట్ హాట్గా స్టెప్పులేసిన దిశా పఠానీ గుర్తుందా? తెలుగులో తనకు ఇదే తొలి చిత్రం. ఆ మాటకొస్తే.. హీరోయిన్గానే మొదటి సినిమా. 2015లో ఈ సినిమా వచి్చంది. ఆ తర్వాత ఈ నార్త్ బ్యూటీ హిందీ పరిశ్రమకు వెళ్లి మళ్లీ తెలుగువైపు చూడలేదు. ఈ ఏడేళ్లల్లో అక్కడ సినిమాలు చేస్తూ వచి్చన దిశా చాలా గ్యాప్ తర్వాత తెలుగులో చేస్తున్న చిత్రం ‘΄ాజెక్ట్ కె’. ప్రభాస్ హీరోగా నాగ్ అశి్వన్ దర్శకత్వంలో రూ΄÷ందుతున్న ఈ ΄ాన్ ఇండియా సినిమా ద్వారా దిశా గ్రాండ్గా రీ–ఎంట్రీ ఇస్తున్నారు. దిశాలానే కృతీ సనన్ కూడా పాన్ ఇండియా సినిమా ‘ఆదిపురుష్తో తెలుగు తెరపై గ్రాండ్ రీ–ఎంట్రీ ఇవ్వనున్నారు. అలాగే దిశాలానే ప్రభాస్ సరసన కనిపించనున్నారు. ఆ బ్యూటీలానే కృతీ కూడా ఏడేళ్లకు తెలుగుకి వస్తున్నారు. మహేశ్బాబు సరసన ‘1 నేనొక్కడినే’ ద్వారా తెలుగు తెరకు పరిచయమైన కృతి ఆ తర్వాత నాగచైతన్య సరసన ‘దోచేయ్’ (2015) చేశారు. మళ్లీ తెలుగు తెరపై కనిపించలేదు. ఇక ‘ఆదిపురు‹Ù’ విషయానికొస్తే.. ప్రభాస్ హీరోగా ఓం రౌత్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందింది. రాముడి పాత్రలో ప్రభాస్ నటించగా సీతగా కృతీ సనన్ చేశారు. ఈ ఏడాది జూన్లో ఈ చిత్రం విడుదల కానుంది. ఇక హిందీ చిత్రం ‘ఫగ్లీ’ (2014) ద్వారా హీరోయిన్గా పరిచయ మైన కియారా అద్వానీ ఆ తర్వాత నాలుగేళ్లకు తెలుగు తెరపై మెరిశారు. మహేశ్బాబు సరసన ‘భరత్ అనే నేను’ (2018) చిత్రంతో పరిచయమైన ఈ బ్యూటీ ఆ తర్వాత రామ్చరణ్ సరసన ‘వినయ విధేమ రామ’ (2019)లో నటించారు. హిందీ చిత్రాలు చేస్తూ వస్తున్న కియారా కొంత గ్యాప్ తర్వాత తెలుగు తెరపై మళ్లీ రామ్చరణ్ సరసనే కనిపించనున్నారు. శంకర్ దర్శకత్వంలో రామ్చరణ్ హీరోగా రూపొందుతున్న పాన్ ఇండియా మూవీలో కియారా కథానాయికగా నటిస్తున్నారు. దిశా, కృతీలానే ఈ బ్యూటీ కూడా గ్రాండ్గా పాన్ ఇండియా మూవీతో మళ్లీ తెలుగు తెరపై కనిపించనున్నారు. ఈ ముగ్గురూ పాన్ ఇండియా సినిమాల ద్వారా మళ్లీ తెలుగులో కనిపించనుండటం వారికే కాదు.. వారి ఫ్యాన్స్కి కూడా ఆనందంగా ఉంటుంది. నిశ్శబ్దంగా... అనుష్క రెండేళ్ల క్రితం నిశ్శబ్దంగా తెరపై కనిపించారు. 2020లో విడుదలైన ‘నిశ్శబ్దం’ చిత్రంలో బదిరురాలు (మూగ, చెవిటి) పాత్ర చేశారు అనుష్క. అయితే ఈ చిత్రం నేరుగా ఓటీటీలో రిలీజైంది. అంతకుముందు 2019లో చిరంజీవి నటించిన ‘సైరా’లో వెండితెరపై కనిపించారు అనుష్క. సో.. సిల్వర్ స్క్రీన్పై ఈ బ్యూటీ కనిపించి మూడేళ్లవుతోంది. ప్రస్తుతం యూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్న చిత్రంలో కథానాయికగా నటిస్తున్నారు అనుష్క. ఇందులో నవీన్ పొలిశెట్టి హీరో. మహేశ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం ఈ ఏడాదే విడుదల కానుంది. పెద్ద అప్డేట్స్ ఏవీ ఇవ్వకుండా ఈ చిత్రం షూటింగ్ని నిశ్శబ్దంగా చేస్తున్నారు. ఈ చిత్రానికి ‘మిస్ శెట్టి.. మిస్టర్ పొలిశెట్టి’ అనే టైటిల్ అనుకుంటున్నారనే ప్రచారం జరుగుతోంది. ఇరవైరెండేళ్లకు హిందీలో... హిందీ చిత్రం ‘డోలీ సజా కే రఖ్నా’ (1998)తో తన కెరీర్ను ప్రారంభించారు జ్యోతిక. ఆ తర్వాత ‘వాలీ’ సినిమాతో తమిళ్కి పరిచయమై, వరుసగా తమిళ్, తెలుగు.. ఇలా దక్షిణాది భాషల్లో హీరోయిన్గా బిజీ అయ్యారు. హీరో స్యూరని పెళ్లి చేసుకుని, ఇద్దరు బిడ్డలకు తల్లయ్యాక కొన్నేళ్లు సినిమాలకు దూరంగా ఉన్నారామె. 2009 నుంచి 2014 వరకూ సినిమాలు చేయలేదు. 2015లో ‘36 వయదినిలే’తో రీ–ఎంట్రీ ఇచ్చి, లీడ్ రోల్స్ చేస్తున్నారు. ఇక జ్యోతిక చివరిగా హిందీ తెరపై కనిపించిన సినిమా ‘లిటిల్ జాన్’ (2001). ఇన్నేళ్ల తర్వాత ఆమె ఆ మధ్య హిందీ సినిమా ‘శ్రీ’ అంగీకరించారు. రాజ్కుమార్ రావ్ హీరోగా తుషార్ దర్శకత్వంలో రూ΄÷ందిన ఈ చిత్రం త్వరలో విడుదల కానుంది. ‘‘శ్రీ’లో నా ΄ాత్రకు సంబంధించిన షూటింగ్ పూర్తయింది. భారమైన హృదయంతో ఈ యూనిట్ నుంచి వీడ్కోలు తీసుకుంటున్నాను’’ అని పేర్కొన్నారు జ్యోతిక. -
హీరోయిన్ అనుష్క పేరు చెప్పి రూ.51 లక్షలు మోసం!
ఈ మధ్య కాలంలో సినీ ఇండస్ట్రీలో మోసాలు ఎక్కువగా జరుగుతున్నాయి. పలానా హీరో, హీరోయిన్ అపాయింట్మెంట్ ఇప్పిస్తానని, సినిమాల్లో నటించే అవకాశాలు ఇప్పిస్తామంటూ పలువురు కేటుగాళ్లు లక్షల్లో డబ్బులు తీసుకొని మోసానికి పాల్పడుతున్నారు. తాజాగా స్టార్ హీరోయిన్ అనుష్క, మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ పేరు చెప్పి రూ.51లక్షలు మోసం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. అనుష్క, మణిశర్మలతో అపాయింట్మెంట్ ఇప్పిస్తానంటూ మేనేజర్ ఎల్లారెడ్డి.. విశ్వకర్మ క్రియేషన్స్ అధినేత, వర్ధమాన నిర్మాత లక్ష్మన్ చారీ నుంచి రూ. 51 లక్షలు వసూలు చేసినట్టు తెలుస్తోంది. అనుష్కతో సినిమా డేట్స్ అంటూ నిర్మాతను పలు మార్లు బెంగళూరు తీసుకెళ్ళిన ఎల్లారెడ్డి.. మొదటగా రూ.26 లక్షలు వసూలు, తర్వాత మణిశర్మ పేరు చెప్పి మరికొన్ని డబ్బులు.. మొత్తంగా రూ.51 లక్షలు వసూలు చేసి అపాయింట్మెంట్ ఇప్పించలేదు. ఎల్లారెడ్డి చేతిలో మోసపోయానని గుర్తించిన లక్ష్మణాచారి.. ఫిలిం ఛాంబర్ ని ఆశ్రయించాడు. దీంతో మొదట డబ్బు వెనక్కి ఇస్తా అని చెప్పిన మేనేజర్, తరువాత తిరగపడ్డాడు.డబ్బులు అడిగితే ఇంట్లోని ఆడవాళ్లతో కేసులు పెట్టిస్తాని బెదిరించాడు. చివరకు చేసేదేమి లేక బాధితుడు బంజారాహిల్స్ పోలీసులను ఆశ్రయించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. -
2023: నెట్ఫ్లిక్స్లో సినిమాల జాతర.. అన్ని భారీ, పాన్ ఇండియా ప్రాజెక్ట్సే
ఓటీటీలో ఈ ఏడాది కొత్త సినిమాల జాతర నెలకొననుంది. థియేటర్లో సంక్రాంతి పండుగ సందడి ఉండగానే.. ఓటీటీలో కొత్త సినిమాలను వరుస పెట్టి ప్రకటిస్తున్నారు. ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్ఫ్లిక్స్ ఇండియా ఈ సంక్రాంతికి డిజిటల్ ప్రియులను ఆకర్షించే పనిలో పడింది. ఎప్పుడు సినిమాలు రిలీజ్ అనంతరం ప్రకటన ఇచ్చే నెట్ఫ్లిక్స్ ఈసారి థియేట్రికల్ రిలీజ్కు ముందే కొత్త సినిమాలను వరుస పెట్టి ప్రకటిస్తోంది. చదవండి: Priyanka Jawalkar: పవన్ కల్యాణ్తో అసలు నటించను! ఎందుకంటే.. సంక్రాంతి సంందర్భంగా తెలుగులో రాబోయే స్టార్ హీరోల సినిమాలను అనౌన్స్ చేసింది. వాటిలో భారీ బడ్జెట్ చిత్రాలతో పాటు పాన్ ఇండియా సినిమాలు కూడా ఉన్నాయి. ఇందులో కొన్ని రిలీజ్కు సిద్దంగా ఉండగా.. మరికొన్ని షూటింగ్ దశలోనే ఉన్నాయి. అవేంటంటే చిరంజీవి భోళా శంకర్, మహేశ్ బాబు ఎస్ఎస్ఎమ్బి 28, వరుణ్ తేజ్ వీటీ 12, అనుష్క ప్రోడక్షన్ నెం. 14, సాయి ధరమ్ తేజ్ విరూపాక్ష, నాని దసరా, డీజే టిల్లు 2 ఇంకా ఎన్నో కొత్త ప్రాజెక్ట్లు ఉన్నాయి. చదవండి: హృతిక్ను కించపరచడం నా ఉద్దేశం కాదు: ఆ కామెంట్స్పై జక్కన్న స్పందన ఇక విడుదలైన 18 పేజెస్, ధమాకా చిత్రాలు కూడా త్వరలో ఇక్కడ స్ట్రీమింగ్ కానున్నాయి. ఒక్క తెలుగు సినిమాలే కాదు హిందీ, తమిళం, కన్నడ, మలయాళ చిత్రాలను కూడా వరుసగా ప్రకటిస్తోంది. అందులో అయినప్పుడు అతి తర్వలో మీ నెట్ఫ్లిక్స్లో రాబోయే చిత్రాలు ఇవే అంటూనే థియేట్రికల్ రిలీజ్ అనంతరమే అని స్పష్టం చేసింది. నెట్ఫ్లిక్స్ జోరు చూస్తుంటే ఈ ఏడాది సినీ ప్రియులకు సినిమాల జాతర ఉండబోతున్నట్లు తెలుస్తోంది. మరి ఆ చిత్రాలేవో చూద్దాం! View this post on Instagram A post shared by Netflix India (@netflix_in) View this post on Instagram A post shared by Netflix India (@netflix_in) View this post on Instagram A post shared by Netflix India (@netflix_in) View this post on Instagram A post shared by Netflix India (@netflix_in) View this post on Instagram A post shared by Netflix India (@netflix_in) View this post on Instagram A post shared by Netflix India (@netflix_in) View this post on Instagram A post shared by Netflix India (@netflix_in) View this post on Instagram A post shared by Netflix India (@netflix_in) View this post on Instagram A post shared by Netflix India (@netflix_in) -
హైలైట్గా నిలిచిన ప్రభాస్-చరణ్ ఫోన్కాల్.. డార్లింగ్ పెళ్లిపై హింట్
బాలకృష్ణ హోస్ట్ గా ఆహా ఓటీటీలో వస్తున్న అన్స్టాపబుల్ సీజన్-2 సక్సెస్ఫుల్గా దూసుకెళ్తున్న సంగతి తెలిసిందే. ప్రభాస్ ఎపిసోడ్తో మరింత సూపర్ హిట్గా నిలిచింది షో. దేశవ్యాప్తంగా ఈ ఎపిసోడ్ కోసం డార్లింగ్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూశారు. రెండు భాగాలుగా విడుదలవుతున్న ఈ ఎపిసోడ్లోని పార్ట్-1 ఇప్పటికే స్ట్రీమింగ్ అయ్యింది. ప్రస్తుతం నెట్టింట ట్రెండింగ్గా నిలిచిన ఈ ఎపిసోడ్లో రామ్చరణ్కు ప్రభాస్ కాల్ చేయడం హైలైట్గా నిలిచింది. ఇదే క్రమంలో ప్రభాస్ని ఆటపట్టించిన రామ్ చరణ్ త్వరలోనే డార్లింగ్ మీ అందరికి గుడ్న్యూస్ చెబుతాడంటూ హింట్ ఇచ్చాడు. దీంతో అంతలోనే అందుకున్న బాలకృష్ణ.. ఆ అమ్మాయి చౌదరినా లేక శెట్టినా, లేక సనన్ హా? అంటూ ఇరికించే ప్రయత్నం చేయగా అది తాను చెప్పలేనని మీకే ఊహించుకోండంటూ క్లూ వదిలాడు. దీంతో ‘రేయ్.. ఏం మాట్లాడుతున్నావ్ డార్లింగ్’ నువ్వు నా ఫ్రెండువా ? శత్రువా ?అంటూ ప్రభాస్ ఫన్నీగా బదులిచ్చాడు. ఇక ఎప్పుడూ బయట కలిసి కనిపించని.. ప్రభాస్, చరణ్ మధ్య ఉన్న ఇంతలా బండింగ్ ఉందా? ఇద్దరూ బెస్ట్ఫ్రెండ్స్లా మాట్లాడుకుంటున్నారంటూ వారి మధ్య ఉన్న బాండింగ్ చూసి అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. Charan and prabhas phone call#RamCharan#Prabhas pic.twitter.com/RsOzTX1VqV — Ra_1 (@MahiCharan31) December 29, 2022 Mari intha close a #RamCharan and #Prabhas 😳 pic.twitter.com/OyBVV5HNew — Teja (@tejarebel10) December 29, 2022 -
‘కాంతార’ భూత కోల నృత్యం వేడుకలో అనుష్క సందడి, వీడియో వైరల్
ఇటీవల దేశవ్యాప్తంగా సినీ ఇండస్ట్రీలో మారుమ్రోగిన పేరు కాంతార. కన్నడ దర్శకుడు, నటుడు రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ ఇండియన్ బాక్సాఫీసు వద్ద సంచలనం సృష్టించింది. ప్రాంతీయ సినిమాగా వచ్చిన ఈ మూవీ పాన్ ఇండియా స్థాయిలో వసూళ్లు చేసి రికార్డు సృష్టించింది. కేవలం 16 కోట్లతో తెరకెక్కిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ. 400కోట్ల కలెక్షన్ల రాబట్టింది. కన్నడ సంస్కృతి భూత కోల నేపథ్యంలో తెరకెక్కించిన ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంది. చదవండి: విన్నింగ్ ప్రైజ్మనీతో పాటు రేవంత్ 15 వారాల పారితోషికం ఎంతంటే! దీంతో సాంప్రదాయ నృత్యం భూత కోల వేడుక దేశవ్యాప్తంగా ఆసక్తిని సంతరించుకుంది. ఈ సంస్కృతిని తెలుసుకునేందుకు చాలా మంది ఆసక్తిని చూపారు. ఈ నేపథ్యంలో భూత కోల నృత్యానికి సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరల్గా మారింది. రీసెంట్గా ప్రముఖ హీరోయిన్, ‘స్వీటీ’ అనుష్క శెట్టి ఈ భూత కోల వేడుకలో పాల్గొని సందడి చేసింది. ఈ కార్యక్రమానికి హాజరై అమ్మవారి ఆశీర్వదం తీసుకుంది అనుష్క. ఈ సందర్భంగా స్వీటీ ఈ వేడుకను తన ఫోన్ కెమెరాలలో వీడియో తీస్తూ కనిపించింది. దీంతో ఈ వీడియోను ఆమె ఫ్యాన్స్ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ వైరల్ చేస్తున్నారు. చదవండి: అందుకే సీతారామంకు తెలుగు వారిని తీసుకోలేదు: హను రాఘవపూడి Another glimpse of Sweety attending Boothakola Festival in her home town ❤️❤️✨✨#AnushkaShetty #Sweety #Anushka48 pic.twitter.com/XvwIXTnjha — PRANUSHKA FANCLUB 🌸❤️ (@pranushka_fan) December 18, 2022 -
లండన్కు వెళ్లనున్న అనుష్క..10 రోజుల అక్కడే..కారణం ఇదే
టాలీవుడ్లో అనుష్క శెట్టికి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 17 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్న ఈ దేవసేనకు.. హీరోలతో సమానమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. 2005లో సూపర్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ దర్శకత్వంలో వచ్చిన సూపర్ సినిమాతో తెలుగు సినిమాలకు పరిచయమై అనతి కాలంలోనే దక్షిణాదిలో టాప్ హీరోయిన్ హోదా సంపాదించారు. బాహుబలి లాంటి సినిమాల్లో నటించి పాన్ ఇండియా స్టార్ అయింది. అనుష్క చివరిగా నిశ్శబ్దం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. చాలా గ్యాప్ తర్వాత యంగ్ హీరో నవీన్ పొలిశెట్టి తో కలిసి ఓ సినిమాలో నటిస్తోంది. ఇటీవల ఆమె పుట్టిన రోజు సందర్భంగా విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ ఆకట్టుకుంటుంది. . యూవీ క్రియేషన్స్ పతాకంపై వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో షెఫ్ అన్విత రవళి శెట్టిగా అనుష్క నటిస్తుంది. ఇదిలా ఉంటే అనుష్క ఇప్పుడు లండన్ వెళ్లేందుకు సిద్దమతుందని సమాచారం. అయితే ఇది హాలీడే ట్రిప్ కాదట.. నవీన్ పొలిశెటి సినిమా షూటింగ్ కోసం ఆమె లండన్ వెళ్తున్నారు. దాదాపు పదిరోజుల పాటు అక్కడ షూటింగ్ చేయనున్నారు. ఈ షెడ్యూల్లో అనుష్క, నవీన్ పొలిశెట్టిలపై కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నట్లు తెలిసింది. లండన్ షెడ్యూల్ తర్వాత హైదరాబాద్లో కొన్ని కీలకమైన సీన్స్ను తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నారు. డిసెంబర్ ఎండ్లోగా షూటింగ్ను పూర్తిచేసేందుకు సన్నాహాలు చేస్తోన్నారు. (చదవండి: స్వీటీకి అనుష్క పేరు ఎలా వచ్చిందో తెలుసా?) -
అలా లెక్కలేసుకుని నేను ఇండస్ట్రీకి రాలేదు: అనుష్క శెట్టి
అందానికి, అభినయానికి చిరునామా నటి అనుష్క అని చెప్పవచ్చు. టాలీవుడ్లో సూపర్ చిత్రంతో కథానాయకిగా పరిచయమైన ఈమె నట పయనం సూపర్ ఎక్స్ప్రెస్లా సాగిపోయింది. అందులో ఎన్నో విజయాలు, అగ్రనటిగా అందలం ఎక్కిన తరుణాలు.. కొన్ని తప్పటడుగులు వెరసి అనుష్క 17 వసంతా ల సినీ జీవితం. టాలీవుడ్, కోలీవుడ్ల్లో క్రేజీ కథానాయకిగా రాణించిన అనుష్క చివరిగా నటించిన చిత్రం సైలెన్స్. ఆ చిత్రం నిరాశపరిచింది. ఇకపోతే ఇడుప్పళగి చిత్రం కోసం భారీగా బరువును పెంచుకున్న అనుష్కకు అది కేరీర్ పరంగా బాగా ఎఫెక్ట్ అయింది. చదవండి: ‘ఈ యంగ్ హీరోల తీరు వల్లే సినిమాలు ఫ్లాప్ అవుతున్నాయి’ కారణాలు ఏమైనా ఈ బొమ్మాళి వెండితెరపై కనిపించి చాలా కాలమే అయ్యింది. మళ్లీ ఎప్పుడు తెరపై మెరుస్తుందా? అని ఆమె అభిమానులు ఎదురుచూస్తున్నారు. అలాంటి వారికి తీపి కబురు అనుష్క తాజాగా ఒక తెలుగు చిత్రంలో నటిస్తోంది. యువ నటుడు నవీన్ పోలిశెట్టి కథానాయకుడిగా నటిస్తున్న ఇందులో అనుష్క లేడీ చెఫ్గా నటించడం విశేషం. ఈ పాత్రను సోమవారం మీడియాకు రిలీజ్ చేశారు. కాగా 17 ఏళ్ల పయనాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా నటి అనుష్క ఒక భేటీలో పేర్కొంటూ ఇన్నేళ్లు హీరోయిన్గా రాణించడం సంతోషంగా ఉందని చెప్పింది. పలువురు దీన్ని చిరకాల పయనం అని అంటున్నారని, అయితే తనవరకు ఇది చాలా చిన్నపయనమని పేర్కొంది. బాగా శ్రమిస్తే కథానాయికలు సినిమా రంగంలో ఎక్కువకాలం నిలదొక్కుకోవడం సాధ్యమేనంది. ఆ నమ్మకంతోనే తాను ఒక్కో అడుగు వేసుకుంటూ వచ్చానంది. చాలామంది మాదిరిగానే తాను ఈ రంగంలోకి అనుహ్యంగా ప్రవేశించానని చెప్పింది. అంతకుముందు తనకు సినిమా గురించి ఏమి తెలియదని చెప్పింది. మొట్టమొదటిసారిగా కెమెరా ముందు నిల్చున్నప్పుడు భయపడ్డానంది. చదవండి: ఈ వారం థియేటర్, ఓటీటీలో సందడి చేసే చిత్రాలివే తనకు ఫలానా హీరోతో నటించాలని ఫలానా పాత్రలో నటించాలని లెక్కలేసుకోవడం తన పాలసీ కాదని చెప్పింది. మంచి కథ ఉన్న పాత్రలు చేయాలని మాత్రమే ఆశించానంది. తాను చాలా చిత్రాల్లో నటించినా, అరుంధతి చిత్రమే నెంబర్ వన్ అని పేర్కొంది. ఏనాటికైనా అలాంటి కథా పాత్రల్లో నటించడం చాలెంజ్ అని చెప్పింది. తాను ఈ రంగానికి రాకముందు యోగా టీచర్గా పనిచేసిన విషయం చాలా మందికి తెలుసని, అయితే అంతకుముందు పాఠశాలలో మూడో తరగతి విద్యార్థులకు పాఠాలు చెప్పానన్న విషయం అతి కొద్దిమందికే తెలుసని పేర్కొంది. -
చెఫ్గా మారిపోయిన హీరోయిన్ అనుష్క.. ఫోటో వైరల్
హీరోయిన్ అనుష్క శెట్టి గరిట పట్టారు. తన వంటలను కస్ట్మర్స్కి రుచి చూపించేందుకు చెఫ్గా మారారు. అయితే ఇది రియల్ లైఫ్లో కాదు.. ఆమె నటిస్తున్న తాజా చిత్రం కోసమే. నవీన్ పోలిశెట్టి, అనుష్క శెట్టి జంటగా ‘రారా కృష్ణయ్య’ ఫేమ్ పి. మహేష్ బాబు దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోంది. యూవీ క్రియేషన్స్ పతాకంపై వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో షెఫ్ అన్విత రవళి శెట్టిగా అనుష్క నటిస్తున్నారు. కాగా సోమవారం (నవంబర్ 7) అనుష్క బర్త్డేని పురస్కరించు కుని అన్విత రవళి శెట్టి క్యారెక్టర్ లుక్ని చిత్రబృందం విడుదల చేసింది. ‘‘మా సినిమా ప్రస్తుతం రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటోంది. వచ్చే ఏడాది విడుదల చేస్తాం’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. On my Birthday I am happy to Introduce myself as Masterchef 'Anvitha Ravali Shetty' from my upcoming project with @NaveenPolishety #MaheshBabuP #NiravShah @UV_Creations 😊 Can’t wait to meet u all on Big Screen 🤞🏻❤️ pic.twitter.com/jsVFlTDwMM — Anushka Shetty (@MsAnushkaShetty) November 7, 2022 -
అరుంధతి మూవీలో బాలనటి.. అంతలా మారిపోతుందని ఊహించలేదు..!
టాలీవుడ్ నటి అనుష్క ప్రధాన పాత్రలో నటించిన చిత్రం 'అరుంధతి'. ఈ మూవీ అప్పట్లో బాక్సాఫీస్ వద్ద రికార్డు సృష్టించింది. ఈ సినిమాతో ఒక్కసారిగా అనుష్క ఫేమస్ అయిపోయింది. అందరూ జేజమ్మ అంటూ ముద్దుగా పేరు పెట్టారు. అయితే ఈ సినిమాలో బాలనటిగా ఓ చిన్నారి అద్భుతంగా నటించింది. తన డైలాగులతో అందరి దృష్టిని ఆకర్షించింది. ఇంతకీ ఎవరా చిన్నారి అనుకుంటున్నారా? బాలనటిగా మెప్పించిన దివ్య నగేశ్ అందరినీ తనదైన నటనతో మెప్పించింది. అయితే ప్రస్తుతం ఆ చిన్నారి ఇప్పుడెలా ఉంది? తెలుసుకోవాలనుందా అయితే ఈ స్టోరీ చదివేయండి. (చదవండి: కాంతార మూవీ.. అమ్మ పాత్రలో నటించిన ఆమె ఎవరో తెలుసా?) చలనచిత్ర పరిశ్రమలో చైల్డ్ ఆర్టిస్ట్గా ఎంట్రీ ఇచ్చి అగ్రతారలుగా ఎదిగిన వాళ్లు చాలామంది ఉన్నారు. మరికొందరు ఒకటి, రెండు సినిమాలతోనే మర్చిపోలేని గుర్తింపును పొందారు. అలానే అరుంధతి సినిమాలో అనుష్క చిన్నప్పటి పాత్ర పోషించిన చిన్నారి దివ్య నగేశ్ కూడా సినిమాల్లో హీరోయిన్గా నటిస్తోంది. ప్రస్తుతం మలయాళంలో ఆమె పలు సినిమాలు కూడా చేసింది. టాలీవుడ్లో 'నేను నాన్న అబద్దం' అనే సినిమాలో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది దివ్య నగేశ్. ఇటీవలే ఆమె లేటెస్ట్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. ప్రస్తుతం ఆమె గుర్తుపట్టలేనంతగా మారిపోయింది. తమిళం, మలయాళం చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది అరుంధతి బాలనటి దివ్య నగేశ్. -
అనుష్కపై గరికపాటి కొంటె వ్యాఖ్యలు.. ఆర్జీవీ ట్వీట్ వైరల్
ఇటీవల హైదరాబాద్లో జరిగిన ‘అలయ్ బలయ్’ కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవి, ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు మధ్య చోటు చేసుకున్న సంఘటన పెద్ద దుమారమే రేపింది. చిరంజీవిని ఉద్దేశించి గరికపాటి చేసిన వ్యాఖ్యలపై మెగా అభిమానులతో పాటు నెటిజన్స్ కూడా పెద్ద ఎత్తున మండిపడుతున్నారు. దీంతో గరికపాటి పేరు సోషల్ మీడియాలో మారుమ్రోగిపోతుంది. తాజాగా ఈ వివాదంపై సంచలన దర్శకుడు స్పందించాడు. గరికపాటి తీరుని తప్పుబడుతూ వరుస ట్వీట్స్ చేశాడు. అందులో ఒక ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గరికపాటి గతంలో అనుష్క అందం గురించి పొగుడుతున్న వీడియో క్లిప్పుని ఆర్టీజీవి ట్విటర్లో షేర్ చేస్తూ ‘మీరు కూడానా బాహు(గరిక)బలి(పాటి)గారు!’అని క్యాప్షన్ ఇచ్చాడు. (చదవండి: రిలీజ్కు ముందే ఖరీదైన బహుమతి.. బ్లాక్ మెయిల్ చేస్తున్నారా? డైరెక్టర్ ట్వీట్ వైరల్) ఆ వీడియోలో గరికపాటి మాట్లాడుతూ.. ‘హీరోయిన్లని కుర్రాళ్ళు తెగ చూస్తూ ఉంటారు. ఇందులో ఏముంది అని అనుకునేవాడిని. కానీ నా చూపు కూడా ఒక చోట ఆగింది. అది ఎవరంటే మహానటి అనుష్క. అలా నిలబడి ఉంది.. ఒక మంచి పోజ్. మనం కవి కదా.. ఊరికే ఎలా ఉండగలం.. చూశా పై నుంచి కిందకు. ఒక రోజు పేపర్ చదువుతుంటే ముందు రాజకీయాలు చూస్తున్నా.. డిగ్రీ చదివే మా అబ్బాయి .. నా కాళ్ల దగ్గర కూర్చున్నాడు. నేను అనుకున్నాను.. స్నానం చేసొచ్చి నా కాళ్లకు దండం పెడుతున్నాడు అని, కానీ వాడు అక్కడ కూర్చొని పేపర్లోని అనుష్క ఫోటోని చూస్తున్నాడు. వాడి ధోరణిలో వాడున్నాడు.. నా ధోరణిలో నేనున్నాను. దానికేముంది ఎవడికి కావాల్సింది వాడు చూసుకుంటున్నాడు. ఏంట్రా అని అడిగితే టక్కుమని లేచి వెళ్లిపోయాడు. ఏంటా అని నేను చూశాను.. ఆ ఫోటో చూసేసరికి వాడు ఈ అమ్మాయిని చూడడంలో తప్పేమి లేదనిపించింది. నన్నే ఆకర్షిస్తుంటే.. వాడిని ఆకర్షించదా? ’అని గరికపాటి చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఆర్జీవీ చేసిన ఈ ట్వీట్ నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. OHO !!! MEEKU KOODAANAAA BAHU(GARIKA)BALI(PATI) GAARU ! 😜 pic.twitter.com/00rLB4oVj7 — Ram Gopal Varma (@RGVzoomin) October 12, 2022