-
హారర్... కామెడీ సమానంగా ఉంటాయి: అంజలి
‘‘గీతాంజలి మళ్లీ వచ్చింది’ సినిమా పాయింట్ను కోన వెంకట్గారు నాలుగేళ్ల ముందే చెప్పారు. అయితే అప్పుడు నేను బిజీగా ఉండటం, ఆ తర్వాత ఈ సినిమాలోని ఇతర నటీనటులు బిజీగా ఉండటంతో కుదరలేదు. మధ్యలో కరోనా వచ్చింది. హారర్, కామెడీని బ్యాలెన్స్ చేస్తూ చేసిన ఈ మూవీ ప్రేక్షకులకు నచ్చుతుంది’’ అన్నారు హీరోయిన్ అంజలి. ‘గీతాంజలి’కి సీక్వెల్గా రూపొందిన చిత్రం ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’. శివ తుర్లపాటి దర్శకత్వంలో ఎంవీవీ సినిమాస్తో కలిసి కోన వెంకట్ నిర్మించిన ఈ మూవీ ఈ నెల 11న రిలీజవుతోంది. ఈ సందర్భంగా అంజలి మాట్లాడుతూ– ‘‘గీతాంజలి’కి ఇది సీక్వెల్ కాబట్టి పాత్రలని మార్చలేదు. కానీ, కొత్త క్యారెక్టర్స్ను (అలీ, సునీల్, సత్య) తీసుకొచ్చాం. రొటీన్గా చేస్తే నటిగా నాకు ఆసక్తి ఉండదు కాబట్టి ప్రతి సినిమాకి కొత్తగా ఉండాలనే చూస్తున్నాను. ఈ ఉగాదికి ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’తో వస్తుండటం హ్యాపీ’’ అన్నారు. -
'గీతాంజలి మళ్లీ వచ్చింది' మూవీ ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)
-
'గీతాంజలి మళ్లీ వచ్చింది' ట్రైలర్ చూసేయండి
థియేటర్లో ప్రేక్షకులను భయపెడుతూనే కడుపుబ్బా నవ్వించిన చిత్రం 'గీతాంజలి'. అంజలి ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా ఇప్పటికి వచ్చి దాదాపు పదేళ్లు అవుతుంది. ఇన్నేళ్ల తర్వాత దానికి సీక్వెల్గా 'గీతాంజలి మళ్లీ వచ్చింది' అనే సినిమా విడుదలకు ఇప్పుడు సిద్ధంగా ఉంది. తాజాగా ఈ చిత్రం నుంచి ట్రైలర్ను మేకర్స్ విడుదల చేశారు. శివ తుర్లపాటి తెరకెక్కిస్తున్న ఈ పాన్ ఇండియా సినిమాని కోన ఫిల్మ్ కార్పొరేషన్, ఎంవీవీ సినిమా సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఏప్రిల్ 11న ఈ చిత్రం విడుదల కానుంది. ఇందులో టైటిల్ పాత్రలో అంజలి పోషిస్తుండగా.. శ్రీనివాస్ రెడ్డి, సత్యం రాజేశ్, అలీ తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. అంజలికి ఇది 50వ చిత్రం. ఈ చిత్రానికి కోన వెంకట్ కథ, స్క్రీన్ప్లే సమకూర్చడం విశేషం. అంచనాలతో వచ్చిన ప్రేక్షకులు అంతకుమించి ఆస్వాదించేలా ఈ సినిమా ఉంటుందని కోన వెంకట్ చెప్పారు. -
'ఇలాంటి టైటిల్ పెట్టకపోవడం ఆశ్చర్యంగా ఉంది'
మిర్చి విజయ్, అంజలి నాయర్ హీరో హీరోయిన్లుగా నటిస్తోన్న తాజా చిత్రం వైఫ్. ఈ చిత్రం ద్వారా హేమంత్ నాదం దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఒలింపియ మూవీస్ సంస్థ అధినేత ఎస్.అంబేడ్కర్ నిర్మిస్తున్నారు. గతంలో జిప్సీ, డాడా, కలిగేత్తి మూర్కన్ వంటి వైవిధ్యభరిత కథా చిత్రాలను ఆయన నిర్మించారు. తాజాగా ఈ మూవీకి సంబంధించి టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ను మేకర్స్ రిలీజ్ చేశారు. దంపతుల మధ్య నవీన అనుబంధాలను ఆవిష్కరించే కథాచిత్రంగా ఇది ఉంటుందని డైరెక్టర్ హేమంత్ నాదం అన్నారు. అందుకే ఈ చిత్రానికి వైఫ్ అని పేరు పెట్టామని తెలిపారు. ఇలాంటి టైటిల్ను ఇప్పటివరకు ఎవరూ పెట్టకపోవడం ఆశ్చర్యాన్ని కలిగించిందన్నారు. చదరంగంలో రాణికి అపార శక్తి ఉంటుందన్నారు. అదేవిధంగా ఒక ఇంటిని చక్కదిద్దడంలో భార్య పాత్ర ముఖ్యమన్నారు. వివాహానంతరం భార్యాభర్తల మధ్య పెరిగే ప్రేమానుబంధాన్ని ఎమోషనల్గా ఆవిష్కరించే చిత్రమని చెప్పారు. ఈ చిత్రం ద్వారా మిర్చి విజయ్ను కథానాయకుడిగా పరిచయం చేస్తున్నట్లు చెప్పారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలోనే వెల్లడించనున్నట్లు దర్శకుడు పేర్కొన్నారు. ఈ చిత్రానికి కేఏ శక్తివేల్ చాయాగ్రహణం, జెన్ మార్టిన్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ సినిమాలో మైత్రేయన్, రెడిన్ కింగ్స్ లీ, కల్యాణి నటరాజన్, విజయ్బాబు, విల్లు, కదిర్ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. Super happy to present the First Look of my next Romcom #Wife with @RJVijayOfficial 👰🏻♀️🤵🏻 Directed by @dir_hemanathan Produced by @ambethkumarmla @olympiaMovis@Abishek_jg @shakthi_dop @JenMartinmusic @PMohan93 @gayathribala21@sharmaseenu11@VishnuEdavan1 @DoneChannel1 pic.twitter.com/fqnzgwDBaZ — Anjali (@ianjalinair) March 23, 2024 -
ఆమెను చూస్తే గర్వంగా ఉంది
‘‘అంజలిగారి కెరీర్లో ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’ 50వ సినిమా. ఓ తెలుగమ్మాయి ఇన్ని సినిమాలు చేసి, విజయం సాధించడం గర్వంగా ఉంది. అంజలిగారు వందకుపైగా సినిమాలు చేయాలి. మార్చి 22న ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’ సినిమాతో పాటు నా మూవీ ‘ఓం భీం బుష్’ కూడా విడుదలవుతోంది. ఈ రెండు చిత్రాలు విజయం సాధించాలి’’ అని హీరో శ్రీ విష్ణు అన్నారు. హీరోయిన్ అంజలి టైటిల్ రోల్లో నటించిన చిత్రం ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’. 2014లో వచ్చిన ‘గీతాంజలి’ సినిమాకు ఈ చిత్రం సీక్వెల్. శివ తుర్లపాటి దర్శకత్వంలో కోన ఫిల్మ్స్ కార్పొరేషన్ , ఎంవీవీ సినిమాస్పై కోన వెంకట్ నిర్మించిన ఈ చిత్రం మార్చి 22న విడుదలకానుంది. ఈ సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్కు హీరో శ్రీ విష్ణు, దర్శకులు గోపీచంద్ మలినేని, బాబీ, బుచ్చిబాబు సన అతిథులుగా హాజరయ్యారు. అంజలి మాట్లాడుతూ – ‘‘గీతాంజలి మళ్లీ వచ్చింది’ నా కెరీర్లో ఓ ప్రత్యేకమైన చిత్రంగా నిలుస్తుంది. యాభై సినిమాలు చేయడం నాకు సంతోషాన్నిస్తోంది’’ అన్నారు అంజలి. ‘‘ఈ సినిమాలోని ప్రతి పాత్ర ప్రేక్షకులకు కనెక్ట్ అవుతుంది’’ అన్నారు కోన వెంకట్. ‘‘ఓ మంచి చిత్రానికి దర్శకత్వం వహించాననే సంతృప్తి కలిగింది’’ అన్నారు శివ తుర్లపాటి. నటులు అలీ, ‘సత్యం’ రాజేష్, శ్రీనివాస రెడ్డి మాట్లాడారు. -
గీతాంజలి మళ్లీ వచ్చింది.. భయపెడుతోన్న టీజర్
రర్ సినిమాలకు ఎప్పుడూ మంచి గిరాకీయే ఉంటుంది. ఇక్కడ ఎవరు నటించారు? ఎవరు డైరెక్ట్ చేశారు? అనేదానికన్నా కథేంటి? కాన్సేప్ట్ ఏంటి? అనే చూస్తారు ప్రేక్షకులు. అలాంటిది ఆల్రెడీ హిట్ కొట్టిన హారర్ మూవీ గీతాంజలికి సీక్వెల్ తెరకెక్కుతోంది. దీంతో అంచనాలు భారీగా పెరిగిపోయాయి. అంజలి ప్రధాన పాత్రలో నటించిన మూవీ గీతాంజలి మళ్లీ వచ్చింది. ఇది అంజలి కెరీర్లో 50వ చిత్రంగా తెరకెక్కింది. శివ దర్శకత్వం వహించిన ఈ మూవీని రచయిత–నిర్మాత కోన వెంకట్ సమర్పణలో ఎంవీవీ సత్యనారాయణ, జీవీ నిర్మించారు. శ్రీనివాస్ రెడ్డి, ‘సత్యం’ రాజేశ్, ‘షకలక’ శంకర్, అలీ, సునీల్, సత్య ప్రధాన పాత్రలు పోషించారు. మొదట టీజర్ లాంచ్ ఈవెంట్ను స్మశానవాటికలో చేద్దామనుకున్నారు. తర్వాత ఆ ఆలోచనను విరమించుకున్నారు. హైదరాబాద్లోని ఓ కన్వెన్షన్ హాల్లో శనివారం సాయంత్రం టీజర్ లాంచ్ చేశారు. అంజలి క్లాసికల్ డ్యాన్స్తో టీజర్ మొదలైంది. దెయ్యాలను ఎలా నమ్మారు? అనే దగ్గరి నుంచి దెయ్యాలకు జడుసుకునేవరకు చూపించారు.హారర్తో పాటు కామెడీ కూడా పుష్కలంగా ఉన్నట్లు కనిపిస్తోంది. ఇక ఈ సినిమాను మార్చి 22న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. చదవండి: మీమర్ పిచ్చి ప్రశ్నలు.. హీరో వద్దని వారిస్తున్నా పదేపదే.. -
ముద్దు సన్నివేశాల్లో నటించడం పై అంజలి ఆసక్తికర వ్యాఖ్యలు
-
ముద్దు సన్నివేశాల్లో నటించడంపై అంజలి ఆసక్తికర వ్యాఖ్యలు
తెలుగమ్మాయి అంజలి వరుస సినిమాలతో దూసుకెళ్తోంది. కేవలం టాలీవుడ్లో కాకుండా కోలీవుడ్, మాలీవుడ్ సినిమాల్లోనూ నటిస్తూ..బిజియెస్ట్ హీరోయిన్గా మారిపోయింది. తాజాగా ఈ బ్యూటీ ముద్దు సన్నివేశాలు, రొమాంటిక్ సీన్స్పై తన అభిప్రాయాన్ని తెలియజేసింది. సినిమాల్లో ముద్దు సన్నివేశాలు సహజంగా వస్తాయని, అందులో నటించక తప్పదన్నారు. అయితే అలాంటి సన్నివేశాల్లో నటించేటప్పుడు తనకు కాస్త ఇబ్బందిగానే ఉంటుందని, కానీ కథ డిమాండ్ చేస్తే చేయక తప్పదన్నారు. (చదవండి: రియల్ లైఫ్లో ఒక్కటి కానున్న రీల్ జంట!) ‘ కొన్ని సన్నివేశాల్లో నటించేటప్పుడు సహనటుడు నా గురించి ఏమనుకుంటాడోనని ఆందోళన కలుగుతుంది..ఇంటిమేట్ సన్నివేశాలు సినిమాకు అవసరం కాబట్టి వాటిని నిరాకరించలేను. అసౌకర్యంగానే వాటిల్లో నటిస్తాను నిజ జీవితంలో ఇద్దరు ప్రేమికుల మధ్య ఉండే కెమిస్ట్రీకి సినిమాలో ప్రేమికుల మధ్య ఉండే దానికి చాలా వ్యత్యాసం ఉంటుంది. అందుకే సహనటులతో ముద్దు సన్నివేశాల్లో నటించేటప్పుడు నాకు ఇబ్బందిగా అనిపిస్తుంది’ అని అంజలి చెప్పారు. (చదవండి: తెలుగులో ఇదే నా చివరి సినిమా.. మళ్లీ ఆ చాన్స్ రాకపోవచ్చు: మహేశ్ బాబు) ఇక తన పెళ్లిపై వస్తున్న రూమర్స్ గురించి స్పందిస్తూ.. ‘కొందరు నా పర్సనల్ విషయాల గురించి ఇష్టానుసారంగా రాసేస్తున్నారు. గతంలో జర్నీ నటుడు జైతో ప్రేమలో ఉన్నానని రూమర్స్ క్రియేట్ చేశారు. ఆ తర్వాత అమెరికాకు చెందిన వ్యక్తితో పెళ్లి అయిందని వార్తలు రాశారు. అవన్నీ రూమర్స్ మాత్రమే. వాటిని చూసి నవ్వుకుంటాను తప్ప సీరియస్గా తీసుకొను’అని అంజని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం అంజలి రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న పాన్ ఇండియా మూవీ గేమ్ ఛేంజర్లో సెకండ్ హీరోయిన్గా నటిస్తోంది. 2014లో ఆమె నటించిన గీతాంజలి సీక్వెల్ ‘గీతాంజలి మళ్ళీ వచ్చింది’ మూవీ షూటింగ్ ఇటీవలే ప్రారంభమైంది. వీటితో పాటు పలు తమిళ, మలయాళ సినిమాల్లో నటిస్తోంది. -
'హీరోతో లవ్.. వ్యాపారవేత్తతో పెళ్లి'.. అంజలి ఆన్సరిదే!
పండ్లు ఉన్న చెట్టుకే రాళ్లదెబ్బలు అన్న సామెత మాదిరిగా సెలబ్రిటీల గురించి ముఖ్యంగా సినీ హీరోయిన్ల గురించి సోషల్ మీడియాలో లేనిపోనివి రాసేస్తుంటారు. అంజలి విషయంలోనూ ఇదే జరుగుతోంది. ఈ అచ్చ తెలుగమ్మాయి ఫొటో చిత్రం ద్వారా టాలీవుడ్లో హీరోయిన్గా పరిచయమైంది. రామ్ దర్శకత్వంలో 'కట్రదు తమిళ్' చిత్రం ద్వారా కోలీవుడ్లో ఎంట్రీ ఇచ్చిన అంజలి అక్కడ తొలి సినిమాతోనే మంచి పేరు తెచ్చుకుంది. ఆ తరువాత తనకు తమిళంలో వరుసగా అవకాశాలు రావడం మొదలెట్టాయి. దీంతో అంజలి అక్కడ బిజీ హీరోయిన్గా మారింది. స్టార్ హీరోలతో జోడీ అలాంటి సమయంలోనే పిన్నితో మనస్పర్థలు తలెత్తడంతో హైదరాబాద్కు మకాం మార్చింది. ఇది ఈమెకు ప్లస్సే అయ్యిందని చెప్పవచ్చు. ఇక్కడ వెంకటేశ్, బాలకృష్ణ వంటి స్టార్ హీరోలతో జత కట్టే అవకాశాలు అందుకుంది. ఇకపోతే హీరో జైతో ప్రేమాయణం.. పెళ్లికి సిద్ధం అవుతున్న అంజలి అంటూ ఆ మధ్య జోరుగా ప్రచారం సాగింది. దాన్ని అప్పట్లోనే అంజలి లైట్ తీసుకుంది. ఇప్పుడేమో.. ఒక వ్యాపారవేత్తను పెళ్లి చేసుకుని అమెరికాలో సెటిల్ అయిందని ప్రచారం జరుగుతోంది. తెలియకుండానే పెళ్లి చేస్తున్నారు! దీనిపై ఒక ఇంటర్వ్యూలో స్పందించిన అంజలి సినిమా రంగంలో తనకు చాలా మంది స్నేహితులు ఉన్నారని చెప్పింది. దీంతో తనను ఎవరితో కలిపి రాయాలన్నది కొందరు వారే సొంతంగా నిర్ణయించుకుని రాసేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. మొదట్లో హీరో జైను ప్రేమిస్తున్నట్లు రాశారని, ఇప్పుడు ఓ వ్యాపారవేత్తను పెళ్లి చేసుకుని అమెరికాలో సెటిల్ అయినట్లు ప్రచారం జరుగుతోందని తెలిపింది. తనకు తెలియకుండానే తన పెళ్లి చేసేస్తుండడంతో నవ్వు వస్తోందని పేర్కొంది. తమిళంలో ఈమె నటించిన ఏళు కడల్ ఏళు మలై చిత్రం త్వరలో తెరపైకి రావడానికి సిద్ధం అవుతోంది. మరోవైపు గీతాంజలి 2 కూడా త్వరలో రిలీజ్ కానుంది. చదవండి: షూటింగ్లో గాయపడ్డ హీరో నితిన్? -
శ్రీలీలతో పోల్చినందుకు రిపోర్టర్ కి దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన అంజలి
-
శ్రీలీల 6 సినిమాలు చేస్తోంది.. మీరేమో.. అంజలి రిప్లై ఇదే!
తెలుగు హీరోయిన్ అంజలి ప్రధాన పాత్రలో నటించిన సూపర్ హిట్ చిత్రాల్లో గీతాంజలి(2014) ఒకటి. పదేళ్ల తర్వాత దీనికి సీక్వెల్గా 'గీతాంజలి మళ్లీ వచ్చింది' అనే సినిమా తెరకెక్కింది. అంజలితో పాటు సత్యం రాజేష్, శ్రీనివాస్ రెడ్డి, షకలక శంకర్ ప్రధాన పాత్రలు పోషించారు. 'నిన్ను కోరి' సినిమాకు కొరియోగ్రాఫర్గా పని చేసిన శివ తుర్లపాటి ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. శనివారం ఈ సినిమాలోని క్యారెక్టర్స్ను పరిచయం చేస్తూ విలేకర్ల సమావేశం నిర్వహించారు. శ్రీలీలతో పోలిక.. అంజలి చిరాకు ఈ సందర్భంగా ఓ జర్నలిస్ట్ అంజలిని ఉద్దేశిస్తూ ఓ ప్రశ్న అడిగింది. 'తెలుగువారికి మీరంటే చాలా అభిమానం. నేను కూడా మీకు పెద్ద అభిమానిని. అయితే మీకు ఇంతవరకు సరైన బ్రేక్ రాలేదని అనిపిస్తోంది. తెలుగమ్మాయి అవడం వల్ల బ్రేక్ రాలేదా? లేదా ఇతర కారణాలేమైనా ఉన్నాయా?' అని అడిగింది. దీనికి అంజలి బదులిస్తూ.. 'నాకు బ్రేక్ రాకపోతే మీకు ఫేవరెట్ హీరో అయ్యేదాన్నే కాదు' అని చెప్పింది. దీనికి సదరు జర్నలిస్టు స్పందిస్తూ.. అలా అని కాదు.. ఈ రోజు శ్రీలీల వరుసగా సినిమాలు చేస్తోంది. మీరేమో.. అని నసగడంతో అంజలి మధ్యలోనే అందుకుంది. కిక్ ఉంటేనే చేస్తా 'నేనెప్పుడూ ఒకటి, రెండు స్థానాల కోసం పోటీపడలేదు. ఒక్కొక్కరికి ఒక్కో హీరోయిన్ నచ్చుతారు. నాకు స్క్రిప్ట్ నచ్చితేనే, అందులోనూ నన్ను నేను ప్రూవ్ చేసుకునే అవకాశం ఉంటేనే ఆ సినిమా చేస్తాను. లేదంటే ఆ పాత్ర ఒప్పుకోను. నేను ఒకేసారి నాలుగు సినిమాలు చేయొచ్చు. కానీ నాలుగింటికి బదులు ఒక్క మంచి సినిమా చేయడమనేది నాకిష్టం. నేను తెలుగుతో పాటు ఇతర మూడు భాషల్లోనూ నటిస్తున్నాను. ఒకేసారి అన్ని చోట్లా నేను ఉండలేను. అక్కడో సినిమా, ఇక్కడో సినిమా చేస్తున్నాను. నాకు కిక్కిచ్చే పాత్రలే చేస్తున్నాను' అని చెప్పుకొచ్చింది అంజలి. చదవండి: సీరియల్ నటి ప్రియాంకకు ఆపరేషన్.. గతంలో ఆమె ప్రియుడికి కూడా! -
నవ్విస్తూ...భయపెడుతూ..
అంజలి టైటిల్ రోల్ చేసిన తాజా చిత్రం ‘గీతాంజలి మళ్ళీ వచ్చింది’. ‘గీతాంజలి’ సినిమాకు ఇది సీక్వెల్. శ్రీనివాస్ రెడ్డి, ‘సత్యం’ రాజేశ్, ‘షకలక’ శంకర్, అలీ, సునీల్, సత్య ఇతర ప్రధాన పాత్రలు పోషించారు. రచయిత–నిర్మాత కోన వెంకట్ సమర్పణలో ఎంవీవీ సత్యనారాయణ, జీవీ నిర్మించిన ఈ చిత్రం ఈ ఏడాది ప్రథమార్ధంలో విడుదల కానుంది. శనివారం ఈ సినిమాలోని క్యారెక్టర్స్ను పరిచయం చేస్తూ విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అంజలి మాట్లాడుతూ– ‘‘గీతాంజలి మళ్ళీ వచ్చింది’ అంతా ఒక ఎత్తైతే.. క్లైమాక్స్ మరో రేంజ్లో ఉంటుంది. ‘గీతాంజలి’ని ఫ్రాంచైజీగా చేస్తూ, కోనగారు ‘గీతాంజలి మళ్ళీ వచ్చింది’ చేశారు. కోనగారి కామెడీ ట్రాక్, ఈ సినిమాను ఆయన డిజైన్ చేసిన తీరు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. దర్శకుడు శివగారికి ఈ సినిమాతో పెద్ద బ్రేక్ వస్తుంది’’ అన్నారు. ‘‘గీతాంజలి మళ్ళీ వచ్చింది’’ని అమెరికాలో చేద్దామనుకున్నాం. కొన్ని ్రపాక్టికల్ కారణాల వల్ల ఊటీ బ్యాక్డ్రాప్కి మార్చాం. ప్రేక్షకులు వారి అంచనాలకు మించి ఈ సినిమాను ఎంజాయ్ చేస్తారు’’ అన్నారు కోన వెంకట్. ‘‘ప్రేక్షకులను భయపెడుతూ, నవ్విస్తూ ఎంజాయ్ చేసేలా ఈ సినిమా ఉంటుంది’’ అన్నారు శ్రీనివాస్ రెడ్డి. ‘‘బ్లాక్బస్టర్ మూవీ ‘గీతాంజలి’కి సీక్వెల్ చేసే అవకాశాన్ని కల్పించిన కోనగారికి, ఎంవీవీగారికి థాంక్స్’’ అన్నారు శివ తుర్లపాటి. నటుడు రవికృష్ణ, ఎడిటర్ చోటా కె. ప్రసాద్, సినిమాటోగ్రాఫర్ సుజాత సిద్ధార్థ్, మ్యూజిక్ డైరెక్టర్ ప్రవీణ్ లక్కరాజు మాట్లాడారు. -
ప్రేమికుల రోజు సందర్భంగా బ్లాక్ బస్టర్ సినిమా 'రీ రిలీజ్'
దాదాపు పన్నెండేళ్ల క్రితం వచ్చిన 'జర్నీ' సినిమా అప్పట్లో యూత్ను ఎంతగానో కట్టిపడేసింది. అంజలి, జై, శర్వానంద్, అనన్య జోడిగా ఈ చిత్రంలో నటించారు. ఈ సినిమాను చూసిన వారందరూ ఇప్పటి జనరేషన్లో టువంటి అమ్మాయిలు కూడా ఉంటారా? అనేంతగా సినిమా కథలో హీరోయిన్ పాత్ర ఉంటుంది. ఇందులోని ప్రేమ కథలకు ఆడియెన్స్ ఫిదా అయ్యారు. మురుగదాస్ నిర్మాణం, ఎం.శరవణన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి సీ.సత్య సంగీతం అందించారు. అప్పట్లో ప్రేక్షకులను ఈ సినిమా మెప్పించింది. 2011 సెప్టెంబర్ 16న థియేటర్లోకి వచ్చిన ఈ సినిమాను ప్రేక్షకులు పెద్ద ఎత్తున ఆదరించి బ్లాక్ బస్టర్ హిట్ను చేశారు. అలాంటి బ్లాక్ బస్టర్ మూవీ ఇప్పుడు మళ్లీ రీ రిలీజ్ కాబోతోంది. అసలే టాలీవుడ్లో ఇప్పుడు రీ రిలీజ్ల ట్రెండ్ నడుస్తోన్న సంగతి తెలిసిందే. ప్రతీ నెల ఏదో ఒక కల్ట్ క్లాసిక్ మూవీ రీ రిలీజ్ అవుతూనే ఉంది. ఈ రీ రిలీజ్లకు థియేటర్లు షేక్ అవుతున్నాయి. అయితే ఇప్పుడు ఇదే క్రమంలో ఈ ఏడాది ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఫిబ్రవరి 14న ‘జర్నీ’ని రీ రిలీజ్ చేయబోతున్నారని తెలుస్తోంది. లక్ష్మీ నరసింహా మూవీస్ బ్యానర్ మీద ఏ.సుప్రియ ఈ చిత్రాన్ని భారీ ఎత్తున మళ్లీ రీ రిలీజ్ చేయబోతున్నారు. ఫిబ్రవరిలో జర్నీని గ్రాండ్గా మళ్లీ థియేటర్లోకి తీసుకురాబోతున్నారు. ప్రేమికులకు ఈ సినిమా మంచి ఫీస్ట్ లాంటిదని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. -
2023.. న్యూ ఇయర్ వేళ.. ఢిల్లీలో జరిగిన ఘోరమిదే!
అది 2023, జనవరి ఒకటి.. దేశమంతా నూతన సంవత్సర వేడుకల్లో మునిగితేలుతోంది. ఇంతలో దేశ రాజధాని ఢిల్లీలో దారుణం చోటుచేసుకుంది. ఈ ఘటన యావత్ దేశప్రజలను కలచివేసింది. మర్నాటి ఉదయం వెలుగు చూసిన ఒక వీడియో సంచలనంగా మారింది. అదే.. ఢిల్లీలో నూతన సంవత్సరం వేళ కంఝావాలాలో చోటుచేసుకున్న హిట్ అండ్ రన్ ఘటన. ఒక హోటల్ జరిగిన న్యూ ఇయర్ పార్టీకి హాజరైన అంజలి(20) స్కూటీపై ఇంటికి తిరిగి వెళుతోంది. ఇంతలో అటుగా కారులో వచ్చిన యువకులు ఆమె వాహనాన్ని ఢీకొని, కారుని వేగంగా పోనిచ్చారు. అయితే ఆమె కారు కింద ఇరుక్కుపోయింది. కారు ఆమెను ఈడ్చుకుంటూ 12 కిలోమీటర్లు దూరం వరకూ వెళ్లింది. ఆమె తనను కాపాడాలని అరుస్తున్నా ఎవరూ పట్టించుకోలేదు. ఫలితంగా ఆమె మృతి చెందింది. ఈ ఘటన దేశ ప్రజల్లో ఆగ్రహాన్ని నింపింది. ఢిల్లీ పోలీసులు ఈ కేసులో అంజలి స్నేహితురాలు నిధిని కూడా విచారించారు. ఆ సమయంలో అంజలి మద్యం మత్తులో ఉందని నిధి పోలీసులకు తెలిపింది. కాగా వారి స్కూటీ కంఝావాలాలోని సుల్తాన్పురి ఏరియాకు చేరుకున్నంతలో మితిమీరిన వేగంతో వచ్చిన ఒక కారు వీరి స్కూటీని ఢీకొంది. దాంతో నిధి ఎగిరి పక్కన పడిపోగా, అంజలి కారు కింద ఇరుక్కుపోయింది. అయితే కారును ఆపకుండా.. కారులో ఉన్న అయిదుగురు నిందితులు 12 కిలోమీటర్ల దూరం వరకూ అంజలిని ఈడ్చుకుంటూ వెళ్లారు. తరువాత ఆమె మృతదేహాన్ని రోడ్డుపక్కన పడేసి పరారయ్యారు. పోలీసుల విచారణలో నిధి.. తమను కారు ఏవిధంగా ఢీకొన్నదో తెలిపింది. అయితే ఆ సమయంలో తాను భయాందోళనకు లోనైనందుకు పోలీసులకు వెంటనే ఈ విషయం చెప్పలేకపోయానని నిధి పేర్కొంది. కాగా తెల్లవారుజామున 3.24 గంటలకు ఒక మృతదేహాన్ని ఈడ్చుకుంటూ ఒక కారు కుతుబ్ మినార్ వైపు అతివేగంతో వెళుతున్నదని ఢిల్లీలోని కంఝావాలా పోలీస్ స్టేషన్కు సమాచారం అందింది. ఈ ఘటన దర్యాప్తు దరిమిలా విధులలో నిర్లక్ష్యం వహించారంటూ 11 మంది పోలీసులను సస్పెండ్ చేశారు. వీరిలో ఇద్దరు సబ్ ఇన్స్పెక్టర్లు, నలుగురు అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్లు, నలుగురు హెడ్ కానిస్టేబుళ్లు, ఒక కానిస్టేబుల్ ఉన్నారు. ఈ కేసులో ఢిల్లీ పోలీసులు 800 పేజీల ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. పోలీసులు ఏడుగురిని నిందితులుగా కేసులో చేర్చారు. వీరిలో అమిత్ ఖన్నా, అశుతోష్లపై మోటారు వాహన చట్టం కింద కేసు కూడా నమోదైంది. బాధిత కుటుంబానికి ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ రూ.10 లక్షల ఆర్థిక సాయం అందించారు. ఇది కూడా చదవండి: 2023లో ప్రధాని మోదీ ఎన్ని దేశాల్లో పర్యటించారు? ఎవరిని కలిశారు? -
గీతాంజలి మళ్లీ వస్తోంది
అంజలి టైటిల్ రోల్లో, ‘సత్యం’ రాజేష్, శ్రీనివాస్ రెడ్డి కీలక పాత్రల్లో నటించిన హారర్ కామెడీ ఫిల్మ్ ‘గీతాంజలి’ (2014) హిట్గా నిలిచింది. ఈ సినిమాకు సీక్వెల్గా ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’ సినిమా తెరకెక్కుతోంది. ఇందులో అంజలి, ‘సత్యం’ రాజేష్, శ్రీనివాస్ రెడ్డి, ‘షకలక’ శంకర్ ప్రధాన తారాగణంగా నటిస్తున్నారు. ‘నిన్నుకోరి’, ‘నిశ్శబ్దం’ సినిమాలకు వర్క్ చేసిన కొరియోగ్రాఫర్ శివ తుర్లపాటి ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. రచయిత, నిర్మాత కోన వెంకట్ సమర్పణలో ఎంవీవీ సినిమా, కోన ఫిల్మ్ కార్పొరేషన్ సంస్థలపై ఎంవీవీ సత్యనారాయణ, జీవీ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. హైదరాబాద్, ఊటీ నేపథ్యాల్లో ఈ సినిమా కథనం సాగుతుంది. ‘‘ఇప్పటి వరకు 80 శాతం చిత్రీకరణ పూర్తయింది. త్వరలో జరగనున్న ఊటీ షెడ్యూల్తో ఈ సినిమా షూటింగ్ పూర్తవుతుంది. వచ్చే ఏడాది ప్రారంభంలో ఈ సినిమాను విడుదల చేయాలనుకుంటున్నాం’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. -
Anjali: కుక్కపిల్లకు ఓ రేంజ్లో బర్త్డే సెలబ్రేట్ చేసిన అంజలి (ఫోటోలు)
-
Anjali: వెకేషన్లో చిల్ అవుతున్న బ్యూటిఫుల్ అంజలి (ఫోటోలు)
-
'గేమ్ చేంజర్' షూటింగ్లో రామ్చరణ్కు గాయాలు!
రామ్చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న పొలిటికల్ యాక్షన్ డ్రామా ‘గేమ్ చేంజర్’. కియారా అద్వానీ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో అంజలి, సునీల్, నవీన్ చంద్ర, ఎస్జే సూర్య, జయరాం కీలక పాత్రలు పోషిస్తున్నారు. కాగా ‘గేమ్చేంజర్’ తాజా షెడ్యూల్ చిత్రీకరణ ఈ నెల 20 నుంచి ప్లాన్ చేశారు. అయితే ఈ షెడ్యూల్ రద్దు అయ్యింది. ‘‘గేమ్చేంజర్’లోని కొందరు ఆర్టిస్టులు షూటింగ్కు అందుబాటులో లేని కారణంగానే ఈ నెలలో జరగాల్సిన షూటింగ్ రద్దు అయింది. అక్టోబర్ రెండోవారంలో తిరిగి షూటింగ్ను స్టార్ట్ చేస్తాం’’ అని చిత్రయూనిట్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. అయితే రెండు రోజుల క్రితం రామ్చరణ్కు షూటింగ్లో చిన్న గాయమైందని ఓ వార్త వైరలవుతోంది. గాయం కారణంగా డాక్టర్ పది రోజుల వరకు విశ్రాంతి తీసుకోమన్నారని తెలుస్తోంది. ఈ కారణం వల్ల కూడా షూటింగ్ రద్దైనట్లు సమాచారం. ‘దిల్’ రాజు, శిరీష్ నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది విడుదల కానుంది. ఈ సినిమాకు సంగీతం: తమన్. -
ప్రతీకార జ్వాలతో..
అంజలి టైటిల్ రోల్లో, శ్రీనివాస రెడ్డి కీలక పాత్రలో రాజ్కిరణ్ దర్శకత్వంలో రూపొందిన ‘గీతాంజలి (2014)’ మంచి విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు సీక్వెల్గా ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’ని తెరకెక్కిస్తున్నారు. కోన వెంకట్ సమర్పణలో ఎంవీవీ సత్యనారాయణ, జీవీ నిర్మిస్తున్న ఈ సినిమా హైదరాబాద్లో ఆరంభమైంది. తొలి సీన్కి రామచంద్ర క్లాప్ ఇవ్వగా, స్క్రిప్ట్ని ఎంవీవీ సత్యనారాయణ, కోన వెంకట్ ఈ చిత్రదర్శకుడు శివ తుర్లపాటికి అందజేశారు. ప్రతీకార జ్వాలతో మళ్లీ వచ్చేస్తోంది గీతాంజలి అని ప్రకటించి, శనివారమే షూటింగ్ ఆరంభించినట్లు వెల్లడించారు మేకర్స్. ఈ చిత్రానికి సంగీతం: ప్రవీణ్ లక్కరాజు. -
సినీ కెరీర్లో అరుదైన మైల్స్టోన్ చేరుకున్న ఈ ఐదుగురు
యాభైలో పడ్డారంటే యాభై ఏళ్ల వయసులో పడ్డారనుకుంటున్నారేమో! ఆ మాటకొస్తే.. ధనుష్, విజయ్ సేతుపతి, అంజలికన్నా సీనియర్ ఆర్టిస్ట్ అయిన సిమ్రానే ఇంకా వయసు పరంగా యాభై టచ్ అవ్వలేదు. ఆమె యాభైలోకి అడుగుపెట్టడానికి ఇంకో రెండు మూడేళ్లు పడుతుంది. ఇక ధనుష్, భరత్ నలభై టచ్ చేస్తే.. ఇంకో అయిదు అదనంగా అంటే... సేతుపతి నలభై అయిదు టచ్ చేశారు. అంజలి నలభై లోపే. ఈ అయిదుగురూ అయిదుపదుల్లో పడింది సినిమాల పరంగా. ఈ అయిదుగురూ చేస్తున్న 50వ సినిమా విశేషాల్లోకి వెళదాం... రెండు దశాబ్దాల్లో రెండోది రెండు దశాబ్దాల కెరీర్లో నటుడు– నిర్మాత ధనుష్ దర్శకత్వం వహించిన తొలి సినిమా ‘పా. పాండి’ (2017). ఈ సినిమా తర్వాత మరో సినిమా కోసం దర్శకుడిగా ధనుష్ మెగాఫోన్ పట్టాలనుకున్నారు. ‘నాన్ రుద్రన్’గా ప్రచారం జరిగిన ఈ సినిమా ఎందుకో సెట్స్పైకి వెళ్లలేదు. మళ్లీ ఇన్నాళ్లకు ధనుష్ నటిస్తూ, దర్శకత్వం వహిస్తున్న సినిమా సెట్స్పైకి వెళ్లింది. అయితే ఇది ధనుష్ కెరీర్లో 50వ సినిమా కావడం విశేషం. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. ఈ సినిమా నార్త్ చెన్నై బ్యాక్డ్రాప్లో యాక్షన్ డ్రామాగా ఉంటుందట. సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం 2024లో రిలీజ్ కానుంది. మహారాజా హీరో.. విలన్.. సపోర్టింగ్ యాక్టర్... ఇలా పాత్రకు తగ్గట్టు ఇమిడిపోతూ విలక్షణ నటుడిగా ప్రేక్షకుల్లో పేరు సంపాదించుకున్నారు విజయ్ సేతుపతి. కెరీర్లో విజయ్ సేతుపతి 50 చిత్రాల మైలురాయికి చేరుకున్నారు. ఆయన 50వ సినిమాకు ‘మహారాజా’ అనే టైటిల్ను ఖరారు చేశారు. నితిలన్ సామినాథన్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో హీరోయిన్ మమతా మోహన్దాస్, నట్టి నటరాజ్, బాలీవుడ్ దర్శక–నిర్మాత, నటుడు అనురాగ్ కశ్యప్ కీలక పాత్రల్లో నటించారు. ఆల్రెడీ ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ కూడా తుది దశకు చేరుకున్నాయి. ‘పాషన్ స్టూడియోస్’ సుధన్ సుందరం, జగదీష్ పళనీసామి నిర్మించిన ఈ సినిమా విడుదల తేదీపై త్వరలో ఓ స్పష్టత రానుంది. లా స్టూడెంట్ దక్షిణాదిలో నటిగా అంజలికి మంచి మార్కులే వేశారు ప్రేక్షకులు. హీరోయిన్గా, సెకండ్ హీరోయిన్గా, కీలక పాత్రల్లో నటిస్తున్న అంజలి కెరీర్లో హాఫ్ సెంచరీ కొట్టారు. అదేనండీ.. యాభై సినిమాల మైల్స్టోన్కు చేరుకున్నారు. అంజలి ప్రధాన పాత్రలో అశోక్ వేలాయుధం దర్శకత్వంలో ‘ఈగై’ అనే ఓ కోర్టు డ్రామా మూవీ తెరకెక్కుతోంది. ఈ చిత్రం అంజలికి 50వది. ఆల్రెడీ చిత్రీకరణ మొదలైంది. ఈ చిత్రంలో అంజలి లా స్టూడెంట్గా నటిస్తున్నారని, సునీల్ ఓ కీలక పాత్రలో కనిపిస్తారని తెలిసింది. గ్రీన్ అమ్యూస్మెంట్ ప్రొడక్షన్స్, డీ3 ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ సినిమా త్వరలో విడుదల కానుంది. సిమ్రాన్ శబ్దం సిమ్రాన్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. దక్షిణాదిలోనే కాదు..ఉత్తరాదిలో కూడా సక్సెస్ఫుల్ హీరోయిన్గా ఓ వెలుగు వెలిగారు సిమ్రాన్. ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్టుగా రాణిస్తున్నారు. సిమ్రాన్ కీలక పాత్ర చేస్తున్న మూవీల్లో ‘శబ్దం’ ఒకటి. ‘ఈరమ్’ (తెలుగులో ‘వైశాలి’) చిత్రం తర్వాత హీరో ఆది పినిశెట్టి, దర్శకుడు అరివళగన్ కాంబినేషన్లో ఈ చిత్రం రూపొందుతోంది. లక్ష్మీ మీనన్ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో సిమ్రాన్, లైలా కీలక పాత్రధారులు. సిమ్రాన్కు తమిళంలో ఇది 50వ సినిమా కావడం విశేషం. ప్రేమకోసం... దాదాపు ఇరవై ఏళ్ల క్రితం వచ్చిన తమిళ చిత్రం ‘కాదల్’ తెలుగులో ‘ప్రేమిస్తే..’గా విడుదలై మంచి విజయం సాధించింది. ఈ చిత్రం తర్వాత తమిళంలో చాలా సినిమాలే చేశారు భరత్. తెలుగులో మహేశ్బాబు ‘స్పైడర్’, సుధీర్బాబు ‘హంట్’ వంటి సినిమాల్లో కీలక పాత్రల్లో నటించారు. కాగా భరత్ కెరీర్లో రూపొందిన 50వ సినిమా ‘లవ్’. వాణీ భోజన్ హీరోయిన్గా నటించిన ఈ సినిమాకు ఆర్పీ బాలా దర్శకుడు. ఈ చిత్రం ఈ నెల 28న విడుదల కానుంది. -
ఫాక్స్ కార్పొరేషన్ స్ట్రీమింగ్ సర్వీస్కు సీఈవోగా అంజలీ సూద్
ఫాక్స్ కార్పొరేషన్ ఉచిత యాడ్-సపోర్టెడ్ స్ట్రీమింగ్ సర్వీస్ అయిన ట్యూబీ కొత్త చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా భారతీయ-అమెరికన్ అంజలీ సూద్ నియమితులయ్యారు. సెప్టెంబర్ 1 నుంచి కంపెనీ సీఈవోగా ఆమె బాధ్యతలు స్వీకరించనున్నారు. విమియో కంపెనీ సీఈవోగా ఉన్న అంజలీ సూద్, తొమ్మిదేళ్లు అక్కడ పనిచేశాక ఇటీవలే పదవి నుంచి వైదొలిగారు. ట్యూబీ ఫౌండర్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఫర్హాద్ మస్సౌదీ అనంతరం ఆమె ఆ కంపెనీగా సీఈవోగా నియమితులయ్యారు. విమియో కంటే ముందు ఆమె టైమ్ వార్నర్, అమెజాన్ కంపెనీల ఫైనాన్స్, మీడియా, ఈ-కామర్స్ విభాగాల్లో పనిచేశారు. సీఈవోగా అంజలి సూద్ నాయకత్వంలో విమియో ప్రపంచవ్యాప్తంగా వీడియో క్రియేటర్లు, ఇతర ప్రొఫెషనల్స్కు కేంద్రంగా మారింది. 300 మిలియన్లకు పైగా యూజర్లను సంపాదించుకోవడంతోపాటు గణనీయమైన ఆదాయాన్నీ ఆర్జించింది. అమెరికాలో ఇటీవల అత్యధికంగా వీక్షించిన ఫ్రీ యాడ్ సపోర్టెడ్ స్ట్రీమింగ్ సర్వీస్గా ట్యూబీ నిలిచింది. నీల్సన్ ప్రకారం.. ట్యూబీకి 64 మిలియన్ల మంత్లీ యాక్టివ్ యూజర్లు ఉన్నారు. ఈ నేపథ్యంలో సీఈవోగా అంజలీ సూద్ నియామకం ప్రాధాన్యం సంతరించుకుంది. ట్యూబీని ఫాక్స్ కార్పొరేషన్ 2020లో 440 మిలియన్ డాలర్లకు కొనుగోలు చేసింది. మొత్తం టీవీ వీక్షణ నిమిషాల్లో ప్లూటోటీవీ, పీకాక్, హెచ్బీవో మ్యాక్స్లను కూడా ట్యూబీ అధిగమించింది. -
తొలి అడుగు
భద్ర, పద్మాకర్ రావ్ హీరోలుగా, నేహా, అంజలి హీరోయిన్లుగా ఉప్పలపాటి శివ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనుంది. మిస్పా మూవీ మీడియాపై పద్మాకర్రావ్ చిన్నతోట, ఆర్.సువర్ణ నిర్మిస్తున్న ఈ చిత్రం కడపలో ప్రారంభమైంది. పద్మాకర్రావ్ చిన్నతోట మాట్లాడుతూ–‘‘పదహారేళ్లుగా మీడియా రంగంలో రాణిస్తున్న మా మిస్పా మూవీ మీడియా సంస్థ నిర్మాణ రంగంలో తొలి అడుగు వేసింది. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తాం’’ అన్నారు. -
మాస్ రత్నమాల
ఊర మాస్ రత్నమాలగా కనిపించనున్నారు అంజలి. శుక్రవారం (జూన్ 16) ఆమె పుట్టినరోజు సందర్భంగా ‘వీఎస్ 11’ (వర్కింగ్ టైటిల్) సినిమాలో ఆమె చేస్తున్న రత్నమాల పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ని విడుదల చేసింది చిత్ర యూనిట్. విశ్వక్ సేన్ హీరోగా కృష్ణ చైతన్య దర్శ కత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. ‘‘యాక్షన్ డ్రామాగా రూపొందుతోన్న చిత్రమిది. ఇందులో రత్నమాలగా అంజలి కనిపించనున్నారు. ఆమె పాత్ర మాస్ ప్రేక్షకులను అలరిస్తుంది. విశ్వక్ సేన్ తొలిసారి ఈ చిత్రంలో క్రూరమైన పాత్రను పోషిస్తున్నారు’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: యువన్ శంకర్ రాజా, కెమెరా: అనిత్ మధాది, సహనిర్మాతలు: వెంకట్ ఉప్పుటూరి, గోపీచంద్ ఇన్నమూరి. -
అలాంటి వ్యక్తినే మనువాడతా!
తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ భాషల్లో ప్రముఖ కథానాయకిగా రాణిస్తున్న నటి అంజలి. రామ్ దర్శకత్వంలో కట్రదు తమిళ్ చిత్రం ద్వారా కోలీవుడ్కు కథనాయాకిగా పరిచయమైన అచ్చ తెలుగు అమ్మాయి అంజలి. ఆ తరువాత అంగాడి తెరు చిత్రంతో నటిగా తానేమిటో నిరూపించుకుంది. ఎంగేయుమ్ ఎప్పోదుమ్, కలగలప్పు వంటి చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అదే విధంగా తెలుగులో సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, గీతాంజలి వంటి చిత్రాలు మంచి పేరు తెచ్చి పెట్టాయి. అదే విధంగా కొన్ని చిత్రాల్లో ఐటమ్ సాంగ్స్, వెబ్ సీరిస్లోనూ నటిస్తూ ఇప్పటికి బిజీగానే ఉన్నారు. ఇకపోతే వ్యక్తిగత జీవితంలో ప్రేమ, పెళ్లి వంటి పలు వదంతుల్లోనూ చిక్కుకున్నారు. ముఖ్యంగా ఎంగేయుమ్ ఎప్పోదుమ్ చిత్రం షూటింగ్ సమయంలో ఆ చిత్ర కథానాయకుడు జయ్తో పరిచయం ప్రేమగా మారడం, ఇద్దరు చాలా కాలం సహ జీవనంలో ఉన్నారు అనే ప్రచారం జోరుగా సాగింది. అంతేగాక నటుడు జయ్, అంజలి త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారనే ప్రచారం కూడా సాగింది. అలాంటిది మనస్పర్థల కారణంగా ఇద్దరు విడిపోయారంటూ నటి అంజలి హైదరాబాదుకు మకాం మార్చినట్లు ప్రచారం జరిగింది. ప్రస్తుతం 36 ఏళ్ల ఈ బ్యూటీ సింగిల్ గానే ఉన్నారు. ఇటీవల ఒక భేటీలో పెళ్లి గురించి అడిగిన ప్రశ్నకు రిలేషన్షిప్లో మర్యాద చాలా ముఖ్యం అని అంజలి పేర్కొన్నారు. ఆ తర్వాతే ప్రేమ, అభిమానం అన్నీ అన్నారు. మర్యాద లేని వ్యక్తితో సంబంధమే తనకు అవసరం లేదని పేర్కొన్నారు. కెరీర్, రిలేషన్షిప్లలో ఏది కోరుకుంటారు అన్న ప్రశ్నకు తనకు రెండు ముఖ్యమన్నారు. -
‘మూడు తరాల’ మృత్యువాత!
వైరారూరల్: ఖమ్మం జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ చిన్నారిసహా ముగ్గురు మృత్యువాత పడ్డారు. బాసరలో బాబుకు అక్షరాభ్యాసం చేయించి స్వస్థలానికి తిరిగి వస్తుండగా వారి ప్రయాణం మధ్యలోనే ముగిసింది. వైరా మండలం పినపాక స్టేజీ వద్ద జాతీయ రహదారిపై కారును ఎదురుగా వస్తున్న లారీ అతివేగంతో ఢీకొనడంతో అజ్మీరా రాంబాబు (52), ఆయన కుమార్తె బానోతు అంజలి (25), మనవరాలు బానోతు శ్రీవల్లి (18 నెలలు) మృతి చెందారు. ఇదే ఘటనలో బానోతు బాబు, రాణి, స్వాతి, ప్రవీణ్కు తీవ్రగాయాలు అయ్యాయి. వివరాలిలా ఉన్నాయి.. ఖమ్మం జిల్లా కల్లూరు మండలం బోడిమల్లె తండాకు చెందిన అజ్మీరా రాంబాబు, వాచ్యానాయక్ తండాకు చెందిన బానోతు బాబు వియ్యంకులు. బాబు, రాణి కుమారుడైన డెంటల్ డాక్టర్ నవీన్కుమార్తో రాంబాబు కుమార్తె అంజలికి ఐదేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి నాలుగేళ్ల కుమారుడు కార్తికేయ, 18 నెలల కుమార్తె శ్రీవల్లి ఉన్నారు. కార్తికేయకు బాసరలో అక్షరాభ్యాసం చేయించేందకు బానోతు బాబు, రాణి దంపతులు వారి కుమారులు నవీన్, ప్రవీణ్, కోడళ్లు అంజలి, స్వాతి, మనవరాలు శ్రీవల్లిని తీసుకుని వియ్యంకుడు అజ్మీరా రాంబాబుతో కలసి బాసర వెళ్లారు. గురువారం రాత్రి తిరిగి ఖమ్మం చేరుకున్నారు. అక్కడే బంధువుల ఇంట్లో ఉండి శుక్రవారం మధ్యాహ్నం కారులో వాచ్యానాయక్ తండాకు బయలుదేరారు. కారు పినపాక స్టేజీ చేరుకుంటుండగా ఎదురుగా అతివేగంతో వచ్చిన లారీ ఢీకొనడంతో కారు ముందు భాగంగా నుజ్జునుజ్జయింది. ఈ ప్రమాదంలో రాంబాబు, ఆయన మనవరాలు శ్రీవల్లి అక్కడికక్కడే మృతి చెందగా, కుమార్తె అంజలిని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందింది. గాయపడినవారిలో బాబు, ప్రవీణ్, స్వాతి పరిస్థితి విషమంగా ఉంది. ఈ సమాచారం తెలుసుకున్న ఏసీపీ ఎం.ఎ.రెహమాన్, సీఐ తాటిపాముల సురేశ్ సిబ్బందితో ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.