-
బిగ్బాస్ అమర్దీప్ కొత్త సినిమా.. షూటింగ్ సెట్లోనే సన్మానం!
బిగ్బాస్ ఫేమ్ అమర్దీప్, సుప్రీత సురేఖవాణి జంటగా కొత్త చిత్రంలో నటిస్తున్నారు. మాల్యాద్రి రెడ్డి దర్శకత్వంలో ఒక కొత్త సినిమా తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఏం3 మీడియా అండ్ మహా మూవీస్ బ్యానర్లో మహేంద్ర నాధ్ కూoడ్ల నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది.అయితే ఇటీవల ఓ డాన్స్ షోలో అమర్దీప్ చౌదరి, తేజు విజయం సాధించారు. ఈ సందర్భంగా షూటింగ్ సెట్లో సెలబ్రేషన్స్ చేసుకున్నారు. అమర్దీప్ మూవీ షూటింగ్ లోకేషన్లోనే టీం సభ్యులు అందరూ కలిసి కేక్ కట్ చేశారు. అనంతరం అమర్దీప్ను సన్మానించారు. దీనికి సంబంధించిన ఫోటోలు తెగ వైరలవుతున్నాయి.ఈ సందర్భంగా అమర్ దీప్ చౌదరి మాట్లాడుతూ..'నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది. కష్టపడితే విజయం వస్తుందని అనడానికి నిదర్శనం ఇదే. ప్రేక్షకుల సపోర్ట్ వలనే ఇదంతా సాధ్యమైంది. అలాగే మా సినిమా ని సైతం ప్రేక్షకులు ఆదరించాని కోరారు. ఈ కార్యక్రమంలో నిర్మాత మహేంద్ర నాధ్ కూoడ్ల ,డైరెక్టర్ మాల్యాద్రి రెడ్డి, హీరోయిన్ సుప్రీత, టేస్టీ తేజ పాల్గొన్నారు. -
కొత్త కారు కొన్న అమర్ దీప్, తేజస్విని.. ధర ఎంతో తెలుసా?
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు అమర్దీప్ చౌదరి మెగాస్టార్ లెక్క.. సీరియల్స్ ద్వారా తెలుగు ఆడియెన్స్కు బాగా చేరువైన అమర్ ఆ గుర్తింపుతో బిగ్బాస్ సీజన్ 7లోకి ఎంట్రీ ఇవ్వడం. ఆపై రన్నర్గా నిలిచాడు. ఇక సీరియల్ నటి, కన్నడ బ్యూటీ అయిన తేజస్వని గౌడను ఆమర్ ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. అలా ఇద్దరూ సినిమా ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు.బిగ్ బాస్ తర్వాత అమర్ జీవితమే మారిపోయిందని చెప్పవచ్చు. పలు సినిమా ఛాన్స్లతో పాటు సీరియల్స్తో ఫుల్ బిజీగా ఉన్నారు. ఇప్పటికే సురేఖా వాణి కూతురు సుప్రితతో అమర్ ఒక సినిమాలో నటిస్తున్నాడు. షూటింగ్ కార్యక్రమాలు కూడా వేగంగా జరుగుతున్నాయి. ఇలాంటి సమయంలో తాజాగా తన అభిమాన హీరో రవితేజతో కూడా సినిమా ఛాన్స్ దక్కించుకున్నాడు.అయితే, అమర్ దీప్, తేజస్విని తాజాగా కొత్త కారు కొన్నారు. బ్లాక్ కలర్లో ఉన్న టాటా సఫారి కారును వారు కొన్నారు. దీని ధర రూ. 25 లక్షలకు పైగానే ఉండవచ్చని తెలుస్తోంది. కారు ముందు తేజస్విని తన స్నేహితులతో సందడి చేసింది. అమర్తో కలిసి వారందరు దిగిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. View this post on Instagram A post shared by Tejaswini Gowda (@_tejaswini_gowda_official) -
అమర్ను సర్ప్రైజ్ చేసిన శోభ.. అతడి కోసం త్యాగం..
బిగ్బాస్ షోను డీల్ చేయాలంటే చాలా ఓపిక ఉండాలి. కంటెస్టెంట్లను మెచ్చుకోవాలి. తప్పు చేసినవారిని సరిచేయాలి.. వారి నుంచి ఎంటర్టైన్మెంట్ రప్పించాలి.. ఎపిసోడ్ను జోష్గా ఉంచాలి.. ప్రేక్షకులు షో చూడగలిగేలా చేయాలి.. ఇలా చాలానే ఉంటాయి. అయితే సినిమాలతో బిజీగా ఉన్నా సరే బిగ్బాస్ను ఓ బాధ్యతగా భుజానెత్తుకున్నాడు కింగ్ నాగార్జున. వరుసగా ఐదు సీజన్లకు ఆయనే వ్యాఖ్యాతగా వ్యవహరించాడు. ఎనిమిదో సీజన్కు కూడా ఆయనే యాంకర్గా ఉంటాడు. ఇందులో డౌటే లేదు. శోభాకు టీషర్ట్ గిఫ్ట్ కాకపోతే నాగ్ ఎక్కువగా కోప్పడడు. అలాంటిది ఏడో సీజన్లో మాత్రం ఉగ్రరూపాన్ని చూపించాడు. ఒక్కొక్కరు మారు మాట్లాడకుండా చేశాడు. అమ్మాయిలను మాత్రం సుతిమెత్తగానే వారించేవాడు. ఓ రోజు శోభా శెట్టి నాగ్ ధరించిన టీ షర్ట్ చూసి ముచ్చటపడింది. అది కావాలని మనసులో మాట బయటపెట్టింది. అంత ప్రేమగా అడిగితే మన్మథుడు కాదంటాడా? షో అయిపోయిన వెంటనే ఆ టీ షర్ట్ను ఇచ్చేశాడు. కానీ అదే షోలో అమర్దీప్ అడిగితే మాత్రం నీకు ఇచ్చేదేంటన్నట్లుగా చూశాడు. ఫ్రెండ్ కోసం త్యాగం ఇక షో అయిపోయాక ఆ టీషర్ట్ ధరించి ఫోటోషూట్ కూడా చేసింది శోభ. అయితే స్నేహితుడి కోరిక గుర్తొచ్చి అతడి కోసం ఓ ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది. నాగార్జున తనకు గిఫ్ట్గా ఇచ్చిన టీషర్ట్ను ఓ షోలో అమర్కు త్యాగం చేసింది. 'ఇది నాకెంతో విలువైన బహుమతి. కానీ ఆరోజు అమర్ నాగ్ సర్ను అడిగాడు, కాబట్టి ఇది తనకు ఇచ్చేస్తున్నా' అని చెప్పింది. అది తీసుకుని మురిసిపోయిన అమర్ స్టేజీపైనే దాన్ని ధరించి సంబరపడ్డాడు. ఇది చూసిన జనాలు శోభను మెచ్చుకుంటున్నారు. ఫ్రెండ్ అంటే నీలా ఉండాలని కామెంట్లు చేస్తున్నారు. చదవండి: షారుక్ ఖాన్ అంత ఆస్తి లేదు, భరణం ఎంతిచ్చానంటే? -
సరికొత్త కథతో శ్రీకారం
‘బిగ్ బాస్’ ఫేమ్ అమర్దీప్ చౌదరి హీరోగా, నటి సురేఖా వాణి కుమార్తె సుప్రీత హీరోయిన్గా కొత్త చిత్రానికి శ్రీకారం జరిగింది. ఈ చిత్రానికి మాల్యాద్రి రెడ్డి దర్శకుడు. మహర్షి కూండ్ల సమర్పణలో ఎం3 మీడియా బ్యానర్పై మహా మూవీస్తో కలిసి మహేంద్రనాథ్ కూండ్ల నిర్మిస్తున్న ఈ సినిమా గురువారం ఆరంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత ఏఎం రత్నం కెమెరా స్విచ్చాన్ చేయగా, బసిరెడ్డి క్లాప్ కొట్టగా, వీర శంకర్ గౌరవ దర్శకత్వం వహించారు. మహేంద్రనాథ్ కూండ్ల మాట్లాడుతూ– ‘‘ఇండియన్ సినిమాలో ఇంతవరకూ ఎవరూ టచ్ చేయని కొత్త కథతో ఈ సినిమాని రూపొందిస్తున్నాం’’ అన్నారు. ‘‘మాలాంటి కొత్త వాళ్లకి ఎం3 మీడియా చాన్స్ ఇవ్వడం హ్యాపీగా ఉంది’’ అన్నారు మాల్యాద్రి రెడ్డి. ‘‘బిగ్ బాస్’కి వెళ్లకముందే ఈ సినిమా ఒప్పుకున్నాను’’ అన్నారు అమర్దీప్ చౌదరి. సుప్రీత, నటీనటులు సురేఖా వాణి, తేజస్వి, గౌతమ్ కృష్ణ, రఘు, నటుడు, దర్శకుడు తల్లాడ సాయికృష్ణ మాట్లాడారు. ఈ చిత్రానికి సంగీతం: దాస్ కడియాల, కెమెరా: బాల సరస్వతి. -
హీరోగా ఛాన్స్ కొట్టేసిన 'బిగ్బాస్' అమర్దీప్.. హీరోయిన్ సెలక్షన్ అదుర్స్
'జానకి కలగనలేదు' సీరియల్స్తో బుల్లితెర ప్రేక్షకులకు దగ్గరైన అమర్దీప్ చౌదరి బిగ్ బాస్తో మరింత పాపులర్ అయ్యాడు. సీజన్-7లో ఆయన రన్నర్గా నిలిచినా ప్రేక్షకుల్లో మాత్రం చెరిగిపోని ముద్రే వేశాడని చెప్పవచ్చు. టైటిల్ విన్నర్గా ఆట బరిలోకి దిగిన అమర్.. గెలవాలనే తపన, కోరిక ఎక్కువగానే కనిపించినా అప్పుడప్పుడు అతనిలోని కోపం కంట్రోల్ తప్పడంతోనే రన్నర్గా మిగిలాడని చెప్పవచ్చు. బిగ్ బాస్తో వచ్చిన గుర్తింపుతో ఇప్పటికే చాలా మంది మరో అడుగు ముందుకేసి అవకాశాలు అందిపుచ్చుకుంటున్నారు. బిగ్ బాస్తో గుర్తింపు తెచ్చుకున్న సయ్యద్ సోహైల్ ఇప్పటికే పలు సినిమాల్లో హీరోగా మెప్పిస్తున్నాడు. ఫిబ్రవరి 2న బూట్కట్ బాలరాజు సినిమా కూడా విడుదల కానుంది. తాజాగా అమర్దీప్ చౌదరి కూడా హీరోగా తన అదృష్టాన్ని మరోసారి పరీక్షించుకోనున్నాడు. ఆయన గతంలోనే ‘ఐరావతం’ అనే సినిమాలో కనిపించిన విషయం తెలసిందే. ఇందులో ప్రముఖ మోడల్ తన్వీ నేగితో పాటు ఎస్తేర్ నొరోహా కీలక పాత్రలో కనిపించారు. డిస్నీ ప్లస్ హాట్ స్టార్లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమా ఫర్వాలేదనిపిస్తుంది. అమర్ నుంచి మరోక సినిమా వస్తుందని అఫీషియల్గానే ప్రకటన వచ్చేసింది. M3 మీడియా బ్యానర్లో మహేంద్ర నాథ్ కొండ్ల ఈ సినిమాను నిర్మించనున్నారు. ఈ చిత్రంలో సీనియర్ హీరో వినోద్ కుమార్తో పాటు రాజా రవీంద్ర వంటి సీనియర్ నటులు నటిస్తున్నారు. హీరోయిన్గా ఎంట్రీ ఇస్తున్న సుప్రీత అమర్దీప్ హీరోగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో హీరోయిన్ ఎంపిక చాలా క్రేజీగా ఉందని చెప్పవచ్చు. టాలీవుడ్లో సీనియర్ నటిగా ఎంతో గుర్తింపు తెచ్చుకున్న సురేఖ వాణి కూతురు సుప్రీత ఈ చిత్రంలో హీరోయిన్గా ఎంట్రీ ఇవ్వనుంది. వెండితెరపై అడుగుపెట్టకుండానే ఈ బ్యూటీకి భారీగానే పాపులారిటీని సంపాదించుకుంది.. సుప్రీతకు హీరోయిన్ కావాల్సినన్ని అర్హతలు కూడా ఆమెలో ఉన్నాయని చెప్పవచ్చు. ఇన్స్టాలో ఈ బ్యూటీకి 8 లక్షలకు పైగానే ఫాలోవర్స్ ఉన్నారు. ఆమె తన అమ్మగారితో కలిసి చేస్తున్న రీల్స్కు సోషల్ మీడియాలో విపరీతమైన క్రేజ్ ఉంది. View this post on Instagram A post shared by Revanth Chowdary (@_revanth_chowdhary_) View this post on Instagram A post shared by Bandaru Supritha Naidu (@_supritha_9) -
నా తల్లి ముందే అలాంటి బూతులు వినాల్సి వచ్చింది: అమర్
బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 పలు వివాదాలతో ముగిసింది. హౌస్లో అమర్, శోభ,ప్రియాంక (SPY) ఒక బ్యాచ్లో ఉంటే.. శివాజీ, ప్రశాంత్, యావర్ (SPA) బ్యాచ్లో ఉన్నారు. ఈ రెండు బ్యాచ్ల మధ్య పెద్ద గొడవలే జరిగాయి. ఫైనల్గా ప్రశాంత్ విన్నర్ అయితే.. అమర్ దీప్ రన్నర్ అయ్యాడు. కానీ చాలా మంది ప్రేక్షకుల అభిమానాన్ని ఆయన అమర్ పొందాడు. అతను హీరో రవితేజ సినిమాలో ఛాన్స్ వస్తే చాలు అనుకున్నాడు. బిగ్ బాస్ వల్ల ఆ అవకాశం దక్కింది అదే నాకు పెద్ద విజయం అని అమర్ పేర్కొన్నాడు. బిగ్ బాస్ ఫైనల్ రోజున అమర్ కారుపై దాడి జరుగుతున్నప్పుడు అతని పరిస్థితి ఎలా ఉందో ఒక ఇంటర్వ్యూలో అమర్ ఇలా తెలిపాడు. 'హౌస్ నుంచి బయటకు రాగానే మా వాళ్లు అందరూ నన్ను దాక్కో అన్నారు... బయట ఏం జరుగుతుందో నాకు అర్థం కాలేదు. నేను ఎందుకు దాక్కోవాలి..? నేను ఏం తప్పు చేశాను అని కారు ఎక్కి స్టార్ట్ అయ్యాం. కారు బయటకు రాగానే చాలామంది నా కారు చూట్టూ తిరుగుతూ ఫోన్ లైట్ ఆన్ చేశారు. నేను కనిపించగానే ఒక్కసారిగా బూతులు తిట్టడం స్టార్ట్ చేశారు. రాళ్లతో కారు అద్దాలు పగలకొట్టారు.. అమ్మ పక్కన ఉండగానే నోటికి ఏదొస్తే అది అనేశారు. తల్లి పక్కన ఉన్నప్పుడు అలాంటి మాటలు ఏ కుమారుడు వినలేడు.. వారందరి కోపం నామీద కదా అని కారు దిగే ప్రయత్నం చేస్తే అమ్మ ఆపింది. నాలుగు దెబ్బలు తిన్నా పర్వాలేదు కానీ ఆ తిట్లు భరించలేకపోయాను. కొందరైతే నా భార్య తేజును తీసుకెళ్తాం అంటూ బూతులు మాట్లాడారు. ఇవే మాటలు మిమ్మల్ని ఎవరైనా అంటే తట్టుకోగలరా..? ఓర్చోకోగలరా..? వారందరి మీదా నేనూ రియాక్ట్ కాగలను, కేసులు పెట్టగలను కానీ వారికీ కుటుంబాలు ఉంటాయని ఆలోచించి వద్దనుకున్నాను. నేను మీకు ఏం పాపం చేశాను..? అదొక గేమ్ మాత్రమే.. హౌస్లో కొందరు నన్ను పదేపదే తిట్టినా పెద్దవారు కదా అని ఓర్చుకున్నాను.. వారి వద్ద నేను నిజాయితీగానే మాట్లాడాను.. బ్యాక్ బిచింగ్ చేయలేదు. అని అమర్ తెలిపాడు. అందరిలా తను కూడా సామాన్య కుటుంబం నుంచి వచ్చానని అమర్ పేర్కొన్నాడు. తన నాన్నగారు ఆర్టీసీ ఉద్యోగి అని.. అందులో ఒక మెకానిక్గా పనిచేస్తాడని అమర్ తెలిపాడు. సినిమా అంటే అభిమానంతో ఈ పరిశ్రమలోకి వచ్చి నిలదొక్కుకునే ప్రయత్నం చేస్తున్నానని చెప్పాడు. తన అమ్మగారు అనంతపురం జిల్లాలో బీజేపీ మహిళా విభాగం 'మహిళా మోర్చా' లో కార్యకర్తగా పనిచేస్తున్నారని ఆయన చెప్పాడు. -
పల్లవి ప్రశాంత్ అరెస్ట్పై మొదటిసారి రియాక్ట్ అయిన అమర్ దీప్
బిగ్బాస్ సీజన్ 7 టైటిల్ను రైతుబిడ్డ అనే ట్యాగ్లైన్తో ఎంట్రీ ఇచ్చిన పల్లవి ప్రశాంత్ గెలుచుకుంటే రన్నర్గా బుల్లితెర నటుడు అమర్ దీప్ ఉన్నాడు. బిగ్ బాస్లో ఉన్న సమయంలో వీరిద్దరి మధ్య పెద్ద మాటల యుద్ధమే జరిగింది. కానీ వారిద్దరూ మళ్లీ ఒకటిగా సొంత బ్రదర్స్ మాదిరి కలిసిపోయే వారు. అయితే బిగ్బాస్ సీజన్ 7 టైటిల్ విన్నర్ను ప్రకటించిన తర్వాత అమర్, ప్రశాంత్ అభిమానుల మధ్య గొడవ జరిగింది. ఆ గొడవ కాస్త అమర్దీప్ కారుపై దాడి చేసే వరకు వెళ్లింది. ఆ సమయంలో కారులో తన కుటుంబ సభ్యులతో కలిసి అమర్ ఉన్నాడు. అంతేకాకుండా అశ్విని, గీతూ రాయల్ కారుతో పాటు ఆరు ఆర్టీసీ బస్సులను కూడా కొందరు దుండగులు ధ్వంసం చేశారు. పోలీసుల సూచనలు పాటించకుండా పల్లవి ప్రశాంత్ ర్యాలీ చేయడం వల్లే ఈ గొడవకు కారణమని పోలీసులు అయన్ను అరెస్ట్ చేసి చంచల్గూడ జైలుకు కూడా పంపించారు. ఆపై ప్రశాంత్ బెయిల్ మీద విడుదలయ్యాడు. తాజాగా అమర్ మొదటిసారి బిగ్ బాస్ గురించి రియాక్ట్ అయ్యాడు. 'హౌస్ నుంచి నేను బయటకు రాగానే ఏం జరుగుతుందో అనేది నాకేం అర్థం కాలేదు. అప్పుడు నా మైండ్ బ్లాంక్గా ఉంది. అక్కడితోనే ఆ గొడవ ముగిసిపోయింది. బిగ్ బాస్ వల్ల నాకు చాలా మంచి గుర్తింపు వచ్చింది. అంతేకాకుండా అభిమానుల ప్రేమ దొరికింది. అన్నింటికి మించి నా అన్న రవితేజ సినిమాలో ఛాన్స్ దక్కింది. బిగ్ బాస్ విన్నర్ కంటే నాకు రవితేజ సినిమా అవకాశం దక్కడమే గొప్ప విజయం. ఈ షో ద్వారా నాకు కావాల్సిన ఆదరణ దక్కింది. ఇప్పుడు ఎక్కడికెళ్లినా నన్ను గుర్తిస్తారు.. ఇవన్నీ కూడా బిగ్ బాస్ ద్వారా వచ్చిన అచీవ్మెంట్స్ అని నేను భావిస్తాను. పల్లవి ప్రశాంత్ అరెస్ట్ అనేది మిస్ అండర్స్టాండింగ్ వల్లే జరిగింది. ఇప్పుడు ఎలాంటి సమస్య లేదు. కంటెస్టెంట్ల మధ్య ఎలాంటి గొడవలు ఉండవు.. కానీ కొందరు ఫ్యాన్స్ చేస్తున్న పనుల వల్లే ఇలాంటి ఇబ్బందులు ఎదరైతాయి. ఫ్యాన్స్ మధ్య గొడవలు ఉండటం సహజమే.. ఇదీ ఎప్పుడూ ఉండేదే.. నేను విద్యార్థిగా ఉన్నప్పుడు నా అభిమాన హీరోను ఎవరైనా ఒక మాట అంటే గొడవపడే వాళ్లం... కొంత ఆలోచన శక్తి వచ్చాక అవన్నీ వదిలేసి అందరం కలిసి ప్రతి హీరో సినిమా చూసేవాళ్లం.. ఒకరి కోసం తిట్టుకోవడం, గొడవ పడటం లేకుండా అందరూ కలిసి ఆనందంగా ఉండండి.' అని అమర్ అన్నాడు. -
అమర్ రన్నర్ కావడంతో నాగార్జునకు చెడ్డపేరు: శివాజీ
బిగ్ బాస్ తెలుగు సీజన్ -7లో మూడో స్థానంతో సరిపెట్టుకున్న అక్కసు శివాజీలో కనిపిస్తుంది. అందుకే ఆయన పలు ఇంటర్వ్యూలలో ఇప్పటికీ కూడా అమర్, శోభా పట్ల పలు చిల్లర వ్యాఖ్యలతో పాటు పరుష పదజాలం ఉపయోగిస్తూ మాట్లాడుతున్నాడు. చివరకు అమర్ రన్నర్ ఎలా అయ్యాడో అంటూ చెప్పుకొస్తున్నాడు. బిగ్ బాస్లో శివాజీని అన్నిరోజులు ఉంచడమే గొప్ప విషయం అనుకుంటుంటే.. తనను తాను ఎదో గొప్ప అనుకునే భ్రమలో ఇప్పటికీ ఆయన ఉన్నాడు. శివాజీ వల్లే ఈ సీజన్లో ఇంత రచ్చ అయిందని చెప్పేవారు ఎందరో ఉన్నారు. అనవసరంగా తనను ఈ సీజన్లోకి తీసుకున్నారని కూడా పలువురు కామెంట్లు కూడా చేశారు. హౌస్లో ఎప్పుడూ కూడా తాను పోతా పోతా అంటాడు, ఆటలు ఆడడు, బెడ్డు వదలడు, పైగా చెయ్యి నొప్పి, మాట్లాడితే వెటకారాలు, నీతిబోధలు. బిగ్ బాస్లో ఆయన చేసింది ఇదే కదా.. మరోకటి ఏమైనా ఉంటే చెప్పండి అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు కూడా. గట్టు పంచాయితీలు తీర్చే ఈ పెద్దకు ఇద్దరు పాలేర్లు. వారిద్దరినీ తన చుట్టూ తిప్పుకోవడం.. బిగ్ బాస్లో శివాజీ చేసింది ఏమిటి..? నచ్చని వారిపై దుమ్మెత్తిపోయడం.. ఇప్పడు బిగ్ బాస్ బయట కూడా అదే చేస్తున్నాడు. శోభా శెట్టి గొడవతో తనను నెగిటివ్గా చూపించే ప్రయత్నం బిగ్ బాస్ చేశారని తాజాగా శివాజీ సంచలన ఆరోపణ చేశాడు. శోభా శెట్టి పరాకాష్టకు వెళ్లింది. అందుకే మా ఇంట్లో ఆడపిల్లలు అయితే.. అంటూ కోపంగా ప్రవర్తించానని అంటూ శివాజీ ఇలా చెప్పాడు. 'గేమ్ ఒక దశకు వచ్చాక విన్నర్ ఎవరు..? ఎవరెవరికి ఏ స్థానాలు దక్కుతాయో కూడా అంచనా వేశాను. 1, 2, 3 స్థానాల్లో మనం ముగ్గురం ఉండబోతున్నామని ప్రశాంత్ చేతిలో రాశాను. అయితే ఊహించని విధంగా ఒక వ్యక్తిని బిగ్ బాస్ కావాలనే హైలైట్ చేస్తూ వచ్చాడు. బిగ్ బాస్ కూడా అతడిని పొగడడం నాకు నచ్చలేదు. అతను (అమర్) చపాతి చేస్తే బాగుంది నాకు కూడా పంపించు అని బిగ్ బాస్ అంటాడు... నేను ఎంతో కష్టపడి వడలు చేపిస్తే కనీసం ఒక మాట కూడా నాకు దక్కలేదు. పలుసార్లు పౌల్ గేమ్ ఆడిన వ్యక్తిని చివరకు రన్నరప్ను చేశారు. ఇలాంటి తప్పిదాల వల్ల నాగార్జున గారికి చెడ్డ పేరు వస్తుంది. ఇదే విషయం నాగ్ సారుకు కూడా త్వరలో చెబుతాను. న్యాయంగా అయితే టాప్ 3లో ప్రశాంత్, నేను, యావర్ ఉండేవాళ్లం.' అని శివాజీ అన్నారు. -
బిగ్ బాస్ అమర్పై శివాజీ చెత్త వ్యాఖ్యలు.. ఇవి దేనికి సంకేతం..?
బిగ్ బాస్ తెలుగు సీజన్ -7 ముగిసిపోయి చాలా రోజులే అయింది. విన్నర్ పల్లవి ప్రశాంత్ అరెస్ట్ ఆపై బెయిల్ మీద విడుదల ఇలా పలురకాల వివాదాలతో ఇప్పటికీ అప్పుడప్పుడు ఈ సీజన్ గురించి వార్తలు వస్తునే ఉన్నాయి. ఈ సీజన్లో రన్నర్గా ఆమర్ దీప్ ఉంటే టాప్-3లో శివాజీ ఉన్నాడు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఆయన బిగ్ బాస్ గురించి పలు వ్యాఖ్యలు చేశాడు. బిగ్ బాస్ జర్నీలో బాగా ఇబ్బంది పడిన సందర్భం ఎంటి..? అని శివాజీకి ప్రశ్న ఎదురైంది. హౌస్లో మాదిరే ఇంటర్వ్యూలో కూడా అమర్ పట్ల ఉన్న కోపాన్ని తన వ్యాఖ్యలతో శివాజీ ఇలా చెప్పాడు. 'ప్రశాంత్, యావర్ విషయంలో నేను స్టాండ్ తీసుకున్న సందర్భాల్లో చాలా సార్లు ఇబ్బంది పడ్డాను. ప్రశాంత్ కెప్టెన్ బ్యాడ్జ్ లాక్కున్నారు. అతను సరిగ్గా హౌస్ను హ్యాండిల్ చేయలేకున్నాడు అని అందరూ ఓట్లు వేయడంతో అతని బ్యాడ్జ్ను బిగ్ బాస్ తీసుకున్నాడు. ఒక కామన్ మ్యాన్ కెప్టెన్ అయితే సెలబ్రిటీలకు నచ్చట్లేదా అని కోపం వచ్చింది. హౌస్లో కొందరు యావర్తో గొడవలు పెట్టుకున్నప్పుడు కోపం వచ్చింది. ఫైనల్గా నేను ఒకరిని కొట్టేద్దామని అనుకున్న సందర్భం కూడా వచ్చింది. మూడు వారాలుగా బిగ్ బాస్లో ప్రశాంత్ను మానశికంగా కొందరు టార్చర్ చేశారు. ఆ సమయంలో ప్రశాంత్ను అమర్ రెచ్చగొడుతున్నాడు. నేను పక్కనే ఉన్నాను.. నేను వాడి పక్కన ఉంటే ఎవరినీ లెక్క చేయడు. 14 వారంలో అమర్, ప్రశాంత్ మధ్య భారీగా గొడవ జరుగుతుంది. ఆ సందర్భంలో ఆమర్ను నాలుగు పీకి వెళ్లిపోదాం అనిపించింది. ప్రశాంత్ భుజం మీద చెయి వేసి అమర్ తోసుకుంటూ వెళ్తున్నప్పుడు నాలో కోపం కట్టలు తెంచ్చుకుంది. గేమ్కు బౌండ్ అయి అగ్రిమెంట్లో సంతకం చేశాను కాబట్టి అమర్ను ఏం చేయలేకపోయాను. ఆ సమయంలో నా రక్తం మరిగిపోయింది.' అంటూ అమర్పై మరోసారి ఇంటర్వ్యూలో శివాజీ రెచ్చిపోయాడు. బిగ్ బాస్ అనేది ఒక గేమ్.. ఒక్కొసారి మాటల వల్ల అదుపు తప్పుతుంటారు. అది సహజం అని అందరికీ తెలుసు.. ఆ తర్వాత మళ్లీ ఒకరినొకరు అర్థం చేసుకుంటూ ముందుకు వెళ్తారు. అదీ హౌస్ వరకే పరిమితం. అయినా ప్రశాంత్, అమర్ ఇద్దరూ ఎన్ని గొడవలు పడినా మళ్లీ బ్రదర్స్ మాదిరి ఒకటిగా ఉన్న సందర్భాలు చాలానే ఉన్నాయి. బిగ్ బాస్ సీజన్ -7 ముగిసి పోయిన చాప్టర్.. బయటకు వచ్చాక కూడా ఇలా ఒకరిపై విషం చిమ్మడం ఎందుకు శివాజీ.. ఇలాంటి చెత్త వ్యాఖ్యలు చేసి ఏం చెప్పదలుచుకుంటున్నారు. అయినా ప్రశాంత్ కెప్టెన్సీ నచ్చలేదని మీరు కూడా చెప్పారు కదా.. అప్పుడే మరిచిపోతే ఎలా శివాజీ.. అమర్ను నువ్వు రెచ్చగొట్టలేదా మానసిక వేదనకు గురి చేయలేదా అంటూ శివాజీపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. హౌస్లో ఇలాంటి మాటలు మాట్లాడే బయట జనాన్ని రెచ్చగొట్టి అమర మీద దాడి చేయించావు అంటూ పలువురు కామెంట్లు చేస్తున్నారు. అమర్ ఇంటికి వెళ్లి దాడి చేయండి అని ఇలా పరోక్షంగా మళ్లీ రెచ్చగొడుతున్నావా అంటూ శివాజీపై విరుచుకుపడుతున్నారు. అమర్పై చేసిన వ్యాఖ్యల వీడియో కింద ఎక్కువ మంది శివాజీని ఏకిపారేసిన కామెంట్లే కనిపిస్తున్నాయి. -
అమర్ కారుపై దాడి.. రియాక్ట్ అయిన ప్రియాంక
బిగ్బాస్ తెలుగు సీజన్- 7 ఫైనల్ తర్వాత అన్నపూర్ణ స్టూడియో వద్ద పెద్ద దుమారమే రేగింది. ఈ సీజన్లో పల్లవి ప్రశాంత్ విన్నర్ కాగా అమర్ దీప్ రన్నర్ అయ్యాడు. బిగ్ బాస్ ఫైనల్ రోజున హౌస్ నుంచి బయటకు వస్తున్న సమయంలో ఆమర్ కారుపై ఒక వర్గం ఫ్యాన్స్ దాడి చేశారు. అశ్విని, గీతూ రాయల్ కారుతో పాటు ఆరు ఆర్టీసీ బస్సులను ధ్వంసం చేశారు. తాజాగా ఈ విషయంపై ఒక యూట్యూబ్ ఛానల్లో ప్రియాంక రియాక్ట్ అయింది. అభిమానులు ఎవరైనా కానీ ఇలా దాడి చేయడం చాలా దారుణమని ఆమె ఇలా తెలిపింది. 'ఫ్యాన్స్ పేరుతో ఇలాంటి చర్యలకు పాల్పడటం చాలా దారుణం. మీకు ఎవరైనా నచ్చకపోతే వారిని వ్యతిరేకించండి.. అందులో తప్పులేదు కానీ ఇలా దాడి చేయడం చాలా హేయం. ఎవరమైనా ఎంతో కష్టపడి ఒక వస్తువును కొంటాము. కానీ ఇలా కొన్ని క్షణాల్లో నాశనం చేయడం కరెక్ట్ కాదు. దాడి సమయంలో కారులోపల మహిళలు ఉన్నారనే ఆలోచన కూడా లేకుంటే ఎలా..? హౌస్లో గేమ్ పరంగా మాత్రమే మాలో గొడవలు ఉన్నాయి. టాస్క్ ముగియగానే పల్లవి ప్రశాంత్,యావర్,శివాజీ,అమర్ ఇలా అందరం చాలా బాగా కలిసే ఉండే వాళ్లం. మాలో ఎలాంటి గొడవలు లేవు.' ముఖ్యంగా చివరి 4 వారాల్లో ప్రశాంత్తో నాకు మంచి బాండింగ్ ఏర్పడింది. వాడు నిజంగానే భూమి బిడ్డ అని ఆమె తెలిపింది. కానీ ఆ ఇంటర్వ్యూ జరిగిన సమయానికి పల్లవి ప్రశాంత్ అరెస్ట్ కాలేదు.. దీంతో ఆ ఇంటర్వ్యూలో ప్రశాంత్ అరెస్ట్పై ఆమెకు ఎలాంటి ప్రశ్నలు ఎదురు కాలేదు. -
బిగ్బాస్ రన్నరప్ గొప్పమనసు.. కుటుంబంతో కలిసి ఏం చేశాడంటే?
తెలుగువారి రియాలిటీ షో బిగ్బాస్ సీజన్-7 ఈ ఏడాది అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. ఆదివారం జరిగిన గ్రాండ్ ఫినాలేలో రైతుబిడ్డ ప్రశాంత్ ట్రోఫిని దక్కించుకోగా.. అమర్దీప్ రన్నరప్గా నిలిచాడు. అయితే బిగ్బాస్ ముగియడంతో ప్రస్తుతం ఎవరి పనుల్లో వారు బిజీగా ఉన్నారు. తాజాగా రన్నరప్ అమర్దీప్ తన కుటుంబంతో కలిసి సొంత జిల్లా అనంతపురం వెళ్లారు. అనంతపురం వెళ్లిన అమర్దీప్ తన ఫ్యామిలీతో కలిసి సేవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఓ ట్రస్ట్ తరఫున పేద విద్యార్థులు, మహిళలకు దుప్పట్లు అందజేశారు. అక్కడే చిన్నపిల్లలతో కలిసి కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో అమర్దీప్తో పాటు ఆయన భార్య తేజు, మదర్ కూడా పాల్గొన్నారు. అనంతరం అక్కడికి వచ్చన వారికి భోజనాలు వడ్డించారు. ఈ సందర్భంగా.. దేవుడికి నాకు ఇచ్చిన శక్తిమేరకు తప్పకుండా సాయం చేస్తూనే ఉంటానని అమర్దీప్ తెలిపారు. కాగా.. బిగ్ బాస్ షో ముగిశాక తన ఫ్యామిలీతో కలిసి వెళ్తున్న అమర్దీప్ కారుపై రాళ్లదాడి జరిగిన సంగతి తెలిసిందే. -
బిగ్ బాస్పై మానవ హక్కుల కమిషన్కు ఫిర్యాదు
బిగ్ బాస్ తెలుగు 7 సీజన్ ఫైనల్ రోజున అన్నపూర్ణ స్టూడియో వద్ద భారీ రచ్చే జరిగింది. బిగ్ బాస్ విన్నర్ ప్రశాంత్ అభిమానులు చేసిన ఫలితంగా అక్కడ గొడవలు జరిగాయని పోలీసులు కేసులు కూడా నమోదు చేశారు. ఇలా అన్నపూర్ణ స్టూడియో వద్ద పెద్ద గొడవే జరిగింది. ఇప్పటికే బిగ్ బాస్ షోను బ్యాన్ చేయాలని పలువురు ప్రముఖులు కామెంట్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా బిగ్ బాస్ షో గురించి తెలంగాణ మానవ హక్కుల కమిషన్కు (HRC ) హైకోర్టు న్యాయవాది అరుణ్ ఫిర్యాదు చేశారు. బిగ్ బాస్ షో అనేది ప్రజలపై తీవ్రమైన ప్రభావం చూపుతుందని ఆయన పేర్కొన్నారు. బిగ్ బాస్ ఫైనల్ రోజున అక్కడ జరిగిన గొడవపై రెండు కేసులు నమోదు అయ్యాయి. కానీ ఎక్కడ హీరో నాగార్జున పేరు లేదు. ఈ కేసులలో నాగార్జున పేరును కూడా చేర్చాలి. అయన కూడా ఈ గొడవలకు బాద్యులే. అంత గొడవ బిగ్ బాస్ నిర్వాహకులు నిర్లక్ష్యం వహించారు. దీంతో 6 ఆర్టీసీ బస్సులు, కార్లు ధ్వంసం అయ్యాయి. ఇప్పటికే ఇదే విషయంపై హైకోర్టుకు లేఖ రాశాను. నాగార్జునను కూడా వెంటనే అరెస్ట్ చెయ్యాలి.' అని ఆయన కోరారు. కేసుల విషయాలు.. బిగ్ బాస్ తెలుగు ఏడో సీజన్లో పాల్గొన్న అమర్దీప్, అశ్విని, అక్కడే ఉన్న మరో సెలబ్రిటీ గీతూ రాయల్ కార్ల మీద దాడి జరిగింది. వారి కార్ల అద్దాలు పగిలాయి. దీంతో గీతూ రాయల్ పోలీస్ స్టేషన్లో కేసు కూడా పెట్టారు. ఆ తరువాత ఆరు ఆర్టీసీ బస్సులు, ఒక పోలీసు వాహనంపై కూడా దాడి చేశారు. పోలీసులు సుమోటోగా ఈ కేసు పెట్టారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితులను గుర్తించే పనిలో ఉన్నారు. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో 147, 148, 290, 353, 427 r/w 149 IPC, సెక్షన్ 3 PDPP AC కింద కేసులు పెట్టారు. మొత్తం రెండు కేసులు ఉండగా ఒకదానిలో పల్లవి ప్రశాంత్ పేరు ఉన్నట్లు సమాచారం. -
నేనైతే కారుతో గుద్దిపడేసేవాడిని.. అమర్ విషయంపై సోహైల్ ఫైర్
బిగ్బాస్ సీజన్ 7 టైటిల్ను రైతుబిడ్డ అని చెప్పుకుంటున్న పల్లవి ప్రశాంత్ గెలుచుకున్నాడు. ఈ సీజన్ రన్నర్గా బుల్లితెర నటుడు అమర్ దీప్ ఉన్నాడు. బిగ్ బాస్లో ఉన్న సమయంలో వీరిద్దరి మధ్య పెద్ద మాటల యుద్ధమే జరిగింది. కానీ వారిద్దరూ మళ్లీ ఒకటిగా సొంత బ్రదర్స్ మాదిరి కలిసిపోయే వారు. అయితే బిగ్బాస్ సీజన్ 7 టైటిల్ విన్నర్ను ప్రకటించిన తర్వాత అమర్, ప్రశాంత్ అభిమానుల మధ్య గొడవ జరిగింది. ఆ గొడవ కాస్త అమర్దీప్ కారుపై దాడి చేసే వరకు వెళ్లింది. ఆ సమయంలో కారులో తన కుటుంబ సభ్యులతో కలిసి అమర్ ఉన్నాడు. ఈ విషయంపై చాలామంది రియాక్ట్ అవుతున్నారు. తాజాగా సయ్యద్ సోహైల్ రియాక్ట్ అయ్యాడు. 'ఒక వ్యక్తిపై అభిమానం ఉండాలి కానీ ఉన్మాదం పనికిరాదు.. అమర్ కారుపై దాడి చేసింది అందరూ కూడా యువకులే. మనకు ఉద్యోగాలు లేక ఇలా ఎన్నో ఇబ్బందులు పడుతున్నాము. ఇలాంటి పనులు చేసి తల్లిదండ్రులకు చెడ్డపేరు తీసుకు రాకండి. అభిమానం ముసుగులో ఇలా అమర్పై దాడి చేయడం ఎంత వరకు కరెక్ట్... ఆ దాడి సమయంలో అమర్తో పాటు ఆయన అమ్మగారు, భార్య తేజు ఉన్నారు. వారి కారును చుట్టుముట్టి అద్దాలు పగులకొట్టి ఆపై వారందరినీ నోటికి వచ్చిన బూతులు తిట్టారు. అమర్ భార్య, అమ్మగారిని చెప్పలేని పదాలతో తిట్టారు. మరోకడు అయితే ఆ బూతులు వినలేడు కూడా.. అలాంటి పదాలతో తిట్టడం ఎంత వరకు కరెక్ట్... నేను కూడా ఒక కొడుకుగా చెబుతున్నా.. ఇలాంటి మాటలు నాకే ఏదురైతే గనుకా ఆ సమయంలో కారుతోనే గుద్దిపడేసేవాడిని తర్వాత ఏదైతే అది జరగని.. తన తల్లిదండ్రులను అంటే ఎవరిలోనైనా ఇదే అభిప్రాయం వస్తుంది. భార్య, అమ్మను తన ముందే ఇలా తిడితే ఎవడూ సహించడు. కారుతో అలానే గుద్ది పారేస్తాడు.. కానీ అమర్ సైలెంట్గా వెళ్లిపోయాడు. నిజానికి వాడు చాలా మంచోడు ఇండస్ట్రీలో ఎవరినీ అడిగినా అదే చెబుతాడు.. అంత గొడవ జరిగినా తర్వాత కూడా తన అమ్మ, భార్య జోలికి మాత్రం రాకండి. ఏమైనా చేయాలనుకుంటే తనను మాత్రమే చేసుకోండి అని చెప్పాడు. ఇంతలా ఒక మనిషిని ఇబ్బంది పెట్టడం దేనికి..?' అని సోహైల్ రియాక్ట్ అయ్యాడు. -
పరారీలో బిగ్బాస్ విజేత పల్లవి ప్రశాంత్!
హైదరాబాద్: పబ్లిక్ న్యూసెన్స్కు కారకుడైన బిగ్బాస్ సీజన్–7 విజేత గొడుగు పల్లవి ప్రశాంత్ కోసం జూబ్లీహిల్స్ పోలీసులు గాలింపు చేపట్టారు. ప్రస్తుతం ఆయన పరారీలో ఉండగా ఫోన్ కూడా స్విచ్చాఫ్లో ఉండటంతో అతడి అనుచరులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. గజ్వేల్ సమీపంలోని కొలుగూరు గ్రామానికి చెందిన పల్లవి ప్రశాంత్ ఆదివారం రాత్రి జరిగిన బిగ్బాస్–7 విజేతగా ఎంపిక కాగా, అమర్దీప్ రన్నరప్గా నిలిచారు. ఈ నేపథ్యంలో ఇద్దరి అభిమానులు పెద్ద సంఖ్యలో జూబ్లీహిల్స్రోడ్ నె.ం 5లోని అన్నపూర్ణ స్టూడియో వద్దకు చేరుకుని నినాదాలు చేయడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. అమర్దీప్ను విజేతగా ప్రకటించ కపోవడంతో ఆయన అభిమానులు గొడవకు దిగారు. మరోవైపు పల్లవి ప్రశాంత్ అభిమానులు వేలాదిగా అక్కడికి చేరుకుని నినాదాలు చేస్తూ అమర్దీప్ కారును ధ్వంసం చేశారు. ఈ సందర్భంగా ఇరువర్గాలు పరస్పర దాడులకు దిగడమేగాక అటుగా వస్తున్న ఆర్టీసీ బస్సులపై రాళ్లు రువ్వి ధ్వంసం చేశారు. బయట గొడవ జరుగుతున్నట్లు గుర్తించిన బిగ్బాస్ యాజమాన్యం పల్లవి ప్రశాంత్ను స్థానిక పోలీసుల సహకారంతో రహస్య మార్గం నుంచి బయటికి పంపించింది. మళ్లీ ఇటు వైపు రావొద్దని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. అయితే పల్లవి ప్రశాంత్ ఇటు పోలీసుల ఆదేశాలను, అటు బిగ్బాస్ యాజమాన్యం సూచనలను బేఖాతర్ చేస్తూ గొడవ జరుగుతున్న ప్రాంతానికి ఓపెన్ టాప్ జీప్పై చేరుకోవడంతో రావడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. ఇరు వర్గాల మద్దతుదారులు రాళ్లు రువ్వుతూ మహిళా కంటెస్టెంట్లపై దాడి చేసి బీభత్సం సృష్టించారు. ఇందుకు కారకుడైన పల్లవి ప్రశాంత్పై జూబ్లీహిల్స్ పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. మంగళవారం ఈ విషయం తెలుసుకున్న పల్లవి ప్రశాంత్ ఫోన్ స్విచ్చాఫ్ చేసి పోలీసులకు దొరక్కుండా పరారయ్యాడు. దీంతో అతడి సోదరుడు పరుశరాములు కోసం పోలీసులు ఒక బృందాన్ని స్వగ్రామానికి పంపించారు. కారు డ్రైవర్ సాయి కిరణ్ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. పల్లవి ప్రశాంత్ కోసం ప్రత్యేకంగా మూడు బృందాలు ఏర్పాటు చేశారు. ఆయన అనుచరుల ఫోన్ డేటాను సేకరించారు. కొమరవెల్లి సమీపంలోని ఓ గ్రామంలో పల్లవి ప్రశాంత్ ఉన్నట్లుగా గుర్తించిన పోలీసులు అక్కడికి కూడా ఓ బృందాన్ని పంపించనున్నారు. ఇదిలా ఉండగా బస్సులపై రాళ్లు రువి్వన వ్యక్తులను గుర్తించేందుకు సీసీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. ఇందుకోసం 15 మంది పోలీసులు ఆయా ప్రాంతాల్లోని సీసీ ఫుటేజీలను వడపోస్తున్నారు. -
నాకేం జరిగినా భయపడను..
-
నా కుటుంబంతో సహా రోడ్డుపై నిల్చోబెట్టారు.. నాకేం జరిగినా పర్లేదు.. కానీ: అమర్దీప్
బిగ్ బాస్ సీజన్లో రైతుబిడ్డ తర్వాత పోటీలో నిలిచిన కంటెస్టెంట్ అమర్దీప్. హౌస్లో ఫుల్ అగ్రెసివ్గా కనిపించిన అమర్.. ఈ సీజన్ రన్నరప్గా నిలిచారు. రైతుబిడ్డతో చివరి వరకు పోటీపడిన అమర్దీప్ రన్నర్గా బయటికొచ్చాడు. అ?అయితే మాస్ మహారాజా రవితేజ సినిమాలో ఛాన్స్ కొట్టేసిన అమర్.. అంతే సంతోషంగా బిగ్ బాస్ హౌస్ నుంచి తన ఇంటికి బయలుదేరాడు. కానీ ఊహించని విధంగా అతని కారుపై జరిగిన దాడి అతని అభిమానులకు తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. స్టూడియో బయట జరిగిన రాళ్లదాడితో అమర్ కుటుంబసభ్యులు, ఫ్యాన్స్ షాక్కు గురయ్యారు. ఈ నేపథ్యంలో అమర్దీప్ ఈ ఘటనపై తొలిసారి మాట్లాడారు. ఈ మేరకు తన యూట్యూబ్ ఛానెల్లో ఓ వీడియోను రిలీజ్ చేశారు. ఇంతకీ అమర్దీప్ ఏమన్నారో తెలుసుకుందాం. అమర్దీప్ మాట్లాడుతూ.. 'అందరికీ నమస్కారం. ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలకు పాదాభివందనం. మీలో ఒక్కడిగా నన్ను చూశారు. ఇంతకన్నా నేను చెప్పుకోవడానికి ఏం లేదు. గెలవలేను అనుకున్నవాన్ని..గెలుపుదాకా తీసుకొచ్చి గెలిపించారు. ఇంతకు మించిన అదృష్టం లేదు. ఈ విషయంలో నేను ఫీల్ అవ్వాల్సిన లేదు. కానీ ఇక్కడ బాధాకరమైన విషయం ఎంటంటే.. చాలామంది నన్ను అడుగుతున్నారు. నేను ఈ విషయాన్ని చెప్పాలని కూడా అనుకోలేదు. బాధలో ఉండిపోయాను' అని అన్నారు. రాళ్లదాడిని ప్రస్తావిస్తూ..' కారు అద్దాలు పగలగొట్టారు.. బయటికి రా.. నీ అంతు చూస్తాం అన్నారు. నేను ఒక్కడినే ఉన్నప్పుడు మీ ఇష్టం వచ్చింది చేసుకోండి. నాకేం భయం లేదు. ఎవరికీ భయపడను. భయపడాల్సిన అవసరం లేదు. కానీ మన ఇంట్లో కూడా అమ్మ, అక్క, చెల్లి, భార్య ఉంటుంది. వాళ్లు మన పక్కన ఉన్నప్పుడు ఎలా ప్రవర్తించాలి అని ఆలోచిస్తే బాగుండు అని నా అభిప్రాయం. కారు అద్దం పగలగొట్టినప్పుడు ఆ గాజు పెంకులన్నీ మా అమ్మ, భార్య తేజు మీద పడ్డాయి. ఎవరికీ ఏం కాలేదు కాబట్టి సరిపోయింది. రాళ్లదాడి వల్ల ఏదైనా జరిగి ఉంటే ఈ రోజు నేను ఎవరినీ కోల్పోయేవాడినో నాకు తెలియదు' అని ఆవేదన వ్యక్తం చేశాడు. అప్పుడే నేను గెలిచా.. ఇలాంటివీ ఎవరికీ జరగకూడదు. ఇంకెప్పుడు ఇలా చేయకండి. మీకు కోపముంటే తిట్టండి పడతాను. కామెంట్స్ పెట్టండి చూస్తాను. ఇంకా కోపముంటే వీడియోలు తీసి పెట్టండి. ఎలాగో పెట్టారు. నా కుటుంబాన్ని మొత్తం బాధపెట్టారు. అయినా నేను ఏది పట్టించుకోవడం లేదు. నేను అభిమానించే హీరో మాస్ మహారాజా రవితేజ గారే వచ్చి సినిమాలో అవకాశమిచ్చారు. అప్పుడే నేను గెలిచా. ఆ గెలుపుతోనే బయటికి వచ్చాను' అని అన్నారు. చాలా బాధేసింది.. కారు దాడిపై స్పందిస్తూ.. 'కానీ ఆనందంతో బయటకు వస్తాననుకున్న నన్ను నా కుటుంబంతో సహా రోడ్డుపై నిల్చోబెట్టారు. ఆ విషయంలో చాలా బాధేసింది. అయిన ఫర్వాలేదు. ఆ దేవుడు, అభిమానుల దయవల్ల మా ఇంట్లో వాళ్లకి ఏం కాలేదు. నాకు ఏం అయినా ఫర్వాలేదు. మన ఫ్యామిలీ పక్కన ఉన్నప్పుడు దయచేసి ఆలోచించండి. కప్పుపోతే తిరిగి తెచ్చుకోవచ్చు. డబ్బు పోతే తిరిగి సంపాదించుకోవచ్చు. కానీ మనిషి పోతే తిరిగి తీసుకురాలేం. ఈ విషయాన్ని గుర్తు పెట్టుకోండి. చాలా రిక్వెస్ట్గా అడుగుతున్నా. దయచేసి ఇలా ఎవరిమీద ఇలా ప్రవర్తించకండి. నా మీద మీకు ఏదైనా కోపం ఉంటే చెప్పండి. ఎక్కడికి రమ్మన్నా వస్తా. కానీ దయచేసి ఇలా మాత్రం ఎవరికీ చేయకండి. థ్యాంక్యూ ఆల్. అందరికీ ధన్యవాదాలు' అని వీడియోలో వెల్లడించారు. కాగా.. బిగ్బాస్ షో ముగిసిన అనంతరం అమర్దీప్, అశ్విని, గీతూ రాయల్ కార్లతో పాటు ఆర్టీసీ బస్సులపై రాళ్ల దాడి జరిగిన సంగతి తెలిసిందే. -
BB7 RunnerUp Amardeep Photos: సింపుల్ లుక్లో బీటెక్ బాబు అమర్దీప్ (ఫోటోలు)
-
' ఆయన చేసిందేమీ లేదు.. మీరు అనవసరంగా పైకెత్తకండి..'.. అమర్దీప్ కామెంట్స్!
ఉల్టా- పుల్టా అంటూ మొదలైన బిగ్బాస్ సీజన్-7కు ఆదివారం ఎండ్కార్డ్ పడింది. అందరూ అనుకున్నట్లుగానే సింపతీ వర్కవుటై రైతుబిడ్డ విన్నర్గా నిలిచాడు. ఈ సీజన్ రియాలిటీ షో రన్నరప్గా అమర్దీప్ స్థానం దక్కించుకున్నాడు. అయితే దాదాపు వంద రోజులకు పైగా తెలుగు ప్రేక్షకులను అలరించిన ఈ షో గ్రాండ్గా ముగిసింది. ఈ షో అనంతరం బిగ్బాస్ కంటెస్టెంట్స్ ఇంటర్వ్యూ ఇవ్వడం కామన్. అందరిలాగే రన్నరప్ అమర్దీప్ సైతం ఇంటర్వ్యూకు హాజరైన ప్రోమో రిలీజైంది. ఈ ప్రోమోలో ఇంటిసభ్యుల గురించి అమర్దీప్ ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. అమర్దీప్ మాట్లాడుతూ.. 'మొదటి 5 వారాలకే నా ఫర్మామెన్స్కు ఎలిమినేట్ అయిపోతానని డిసైడ్ అయిపోయా. రన్నరప్ అయినప్పటికీ నాకు ఎలాంటి ఫీలింగ్ కలగలేదు. నేను ఎవరినైతే దేవుడిగా భావించానో ఆయనే కోట్ల ప్రజల ముందు ఒక అభిమానిగా నన్ను గుర్తించాడు. నా దృష్టిలో నేను గెలిచాను. శోభాశెట్టి, ప్రియాంక విషయాకొనిస్తే నాకు ఇద్దరు సమానమే. ఒకరు ఎక్కువ కాదు.. ఒకరు తక్కువ కాదు.' అని అన్నారు. ఆ తర్వాత శివాజీ హౌస్లో ఉండగానే ప్రశాంత్ను విన్నర్ను చేసే పోతానని చెప్పారు కదా.. దీనికి మీ సమాధానమేంటి? అని అమర్దీప్ను యాంకర్ ప్రశ్నించారు. దీనికి బదులిస్తూ.. ' మీరు అలా చెప్పి అనవసరంగా ఆయన్ను పైకి లేపకండి'.. ఆయన గేమ్ ఆడుకుని బయటికి వెళ్లిపోయాడు. ప్రశాంత్ తన గేమ్ తాను ఆడుకున్నాడు. కప్ కొట్టాడు అంతే' అని చెప్పారు. ఆ తర్వాత శివాజీ హౌస్లో లేకపోతే యావర్, ప్రశాంత్ను మీరంతా ఎప్పుడో తొక్కేసేవాళ్లా? అని మరో ప్రశ్న ఎదురైంది. దీనికి బదులిస్తూ.. 'నీ బలమేంటో తెలుసుకో.. పక్కోన్ని నమ్ముకో.. పక్కన పెట్టుకో.. ముందుకు రా..' అని సమాధానమిచ్చాడు. దీంతో ప్రోమో ముగిసింది. అయితే ఈ షో ముగిసిన తర్వాత అమర్దీప్, అశ్విని, గీతూ రాయల్ కార్లపై దాడి జరిగిన సంగతి తెలిసిందే. -
జనం చూశారు.. అమర్కు జై కొట్టారు, శివాజీనీ ఛీ కొట్టారు!
బిగ్బాస్ తెలుగు ఏడో సీజన్లో 19 మంది కంటెస్టెంట్లు అడుగుపెట్టారు. వీరందరూ తమకు తోచిన ఆట ఆడారు. హౌస్లో ఉండేందుకు ప్రయత్నించారు. కానీ షో ముందుకు సాగాలంటే ఎవరో ఒకరు ఎలిమినేట్ అవ్వాల్సిందే! అలా ఒక్కొక్కరు ఎలిమినేట్ అవుతూ పోగా గ్రాండ్ ఫినాలే వచ్చేసరికి ఆరుగురు మిగిలారు. ఇక్కడ విచిత్రం ఏంటంటే.. షోలో కొనసాగడం కోసం కష్టపడ్డ ఎంతోమంది ముందే ఎలిమినేట్ అయిపోగా.. ఏమాత్రం కష్టపడకుండా సోఫాలో సేద తీరుతూ.. బిగ్బాస్కే ఆర్డర్లు వేసిన శివాజీ మాత్రం టాప్ 3 వరకు వచ్చాడు. పగతో రగిలిపోయాడు.. ఈయనది మాస్టర్ మైండ్ అని నాగ్ అన్నారు. నిజమే, శివాజీ అంత కన్నింగ్ మాస్టర్ మైండ్ బిగ్బాస్ చరిత్రలోనే ఎవరికీ లేదు. ఒకరి మీద పగపెట్టుకుని ద్వేషంతో రగిలిపోతూ కుట్రలు పన్నుతూ పైకి మాత్రం ఏమీ ఎరుగనివాడిలా నటించడం ఆయనకే సాధ్యమైంది. శివాజీ హౌస్లో చేసింది రెండే రెండు. ఒకటి.. అమర్ను టార్గెట్ చేయడం. రెండు.. ప్రశాంత్, ప్రిన్స్ యావర్లను తన గుప్పిట్లో పెట్టుకోవడం. కామన్ మ్యాన్కు సపోర్ట్ చేస్తే జనాల్లో తనకు మంచి గుర్తింపు వస్తుందనుకున్నాడు. అందుకే రైతుబిడ్డను, అలాగే నటుడిగా పెద్ద గుర్తింపు లేని ప్రిన్స్ యావర్ను తన గ్రూపులో చేర్చుకున్నాడు. టాస్కుల్లో విజృంభించి ఆడేది వీళ్లిద్దరే కాబట్టి వీళ్లేది సాధించినా అది తన ఖాతాలోనే వేసుకునేవాడు. మానసికంగా వేధించిన ఛీవాజీ బిగ్బాస్ 7 మొదలైనప్పుడే అమర్ టైటిల్ ఫేవరెట్గా హౌస్లో అడుగుపెట్టాడు. ఈ విషయం తెలిసిన శివాజీ అతడి గురించి అంతా రీసెర్చ్ చేసి మరీ తనను టార్గెట్ చేయడం మొదలుపెట్టాడు. తనను ఎప్పుడూ కిందకు లాగాలని చూశాడు. సూటిపోటి మాటలతో వేధించాడు. లక్షలాది మంది ప్రేక్షకులు చూసే షోలో అతడిని పనికిరాని వెధవగా చిత్రీకరించాడు. తను ఏం చేసినా తప్పనేవాడు. శివాజీ కుట్రలు తెలియని అమర్దీప్ అతడిని మాత్రం గురువుగానే భావించాడు. ఈ వంకతో మరింత చనువు తీసుకున్న సోఫాజీ.. అమర్ మీద ఎన్నోసార్లు విషం కక్కాడు. ఏదైనా అంటే సరదాగా అన్నానని తప్పించుకునేవాడు. డమ్మీ చాణక్య.. జనం చూశారు! పదేపదే జనం చూస్తున్నారు అని చెప్పే శివాజీ.. తను అనే మాటలను, తన చేష్టలను జనం పట్టించుకోరనుకున్నాడేమో! కానీ జనం చూశారు. ఈ డమ్మీ చాణక్య పన్నాగాలు తెలుసుకున్నారు. ఒకరిని కిందకు లాగాలనుకుంటే ఏం జరుగుతుందో కళ్లకు కట్టినట్లు చూపించారు. అమర్కు జై కొట్టి రెండో స్థానంలో నిలబెట్టాడు. అతడిని తొక్కేయాలని చూసిన శివాజీని మూడో స్థానానికే పరిమితం చేశారు. ఇక్కడే శివాజీ ఓడిపోయాడు. అమర్కు వేస్ట్ ఫెలో, పనికిమాలినోడు, వెధవన్నర వెధవ, పిచ్చి పోహ.. ఇలా ఎన్నో బిరుదులిచ్చాడు. మరి అతడి చేతిలో ఓడిపోయిన శివాజీని ఏమని పిలిస్తే బాగుంటుందో అతడికే తెలియాలి. వాళ్లు లేకపోయుంటే శివాజీ 'జీరో' పోనీ శివాజీ హౌస్లో పెద్దగా పొడిచేసిందేమైనా ఉందా? అంటే అదీ లేదు. ఒక టాస్క్ ఆడలేదు, ఎంటర్టైన్మెంట్ అసలే చేతకాలేదు. పైగా ఆడలేక మద్దెల దరువు అన్నట్లు ప్రతిసారి తన చేయినొప్పిని సాకుగా చూపిస్తూ ఎంచక్కా ట్రిప్పుకు వచ్చినట్లు సోఫాలో సెటిలై గేమ్ చూస్తూ ఎంజాయ్ చేశాడు. సీజన్ అంతా చేయినొప్పినే చూపిస్తూ సింపతీ ఓట్లు సంపాదించుకున్నాడు. ప్రశాంత్ను విన్నర్ చేసింది తానే అని విర్రవీగుతున్న శివాజీ ఈ రోజు కనీసం టాప్ 3లో అయినా ఉన్నాడంటే అందుకు కారణం.. ప్రశాంత్, ప్రిన్స్ యావర్లే! ఇది ఎవరూ కాదనలేని నిజం! వాళ్లు లేకపోయుంటే శివాజీ 'జీరో'. చదవండి: ప్రశాంత్ను కారు దిగనివ్వని పోలీసులు.. రైతుబిడ్డను అన్నా.. ఇట్ల చేస్తే ఎలా? -
అన్నపూర్ణ స్టూడియో దగ్గర అర్థరాత్రి ఉద్రిక్తత
-
‘ఇదేం అభిమానం!’ బిగ్బాస్ గొడవపై కేసు నమోదు
సాక్షి, హైదరాబాద్: బిగ్బాస్-7లో రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ విజేతగా నిలిచాడు. అమర్ రన్నరప్గా నిలిచాడు. ఫినాలే పూర్తి అయిన తర్వాత కృష్ణానగర్ అన్నపూర్ణ స్టూడియో సమీపంలో అమర్ ఫాన్స్, పల్లవి ప్రశాంత్ అభిమనులు గొడవకు దిగారు. అయితే ఈ గొడవలో ఆర్టీసి బస్సుల అద్దాలను ఫాన్స్ ధ్వంసం చేశారు. తాజాగా ఈ ఘటనపై టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ స్పందించారు. ‘‘అభిమానం పేరుతో చేసే పిచ్చి చెష్టలు సమాజానికి శ్రేయస్కరం కాదు. ప్రజలను సురక్షితంగా, క్షేమంగా గమ్యస్థానాలకు చేర్చే ఆర్టీసీ బస్సులపై దాడి చేయడమంటే సమాజంపై దాడి చేసినట్టే. ఇలాంటి ఘటనలను టీఎస్ఆర్టీసీ యాజమాన్యం ఏమాత్రం ఉపేక్షించదు. టీఎస్ఆర్టీసీ బస్సులు ప్రజల ఆస్తి. వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది’’ అని ఆయన ఎక్స్లో పేర్కొన్నారు. ఫాన్స్ దాడిలో 6 బస్సుల అద్ధాలు ద్వంసం అయ్యాయి. ఈ ఘటనపై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో టీఎస్ఆర్టీసీ అధికారులు ఫిర్యాదు చేశారు. బాధ్యులపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ ఫిర్యాదుతో పోలీసులు ఎఫ్ఐఆర్ కూడా నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇదేం అభిమానం! బిగ్ బాస్-7 ఫైనల్ సందర్భంగా హైదదాబాద్ లోని కృష్ణానగర్ అన్నపూర్ణ స్టూడియో సమీపంలో ఆదివారం రాత్రి #TSRTC కి చెందిన బస్సులపై కొందరు దాడి చేశారు. ఈ దాడిలో 6 బస్సుల అద్ధాలు ద్వంసం అయ్యాయి. ఈ ఘటనపై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఆర్టీసీ అధికారులు ఫిర్యాదు చేశారు.… pic.twitter.com/lJbSwAFa8Q — VC Sajjanar - MD TSRTC (@tsrtcmdoffice) December 18, 2023 -
Bigg Boss 7: అమర్దీప్ కారుపై రైతుబిడ్డ ఫ్యాన్స్ దాడి.. అద్దాలు ధ్వంసం
బిగ్బాస్ 7 పూర్తయిపోయింది. రైతుబిడ్డ ట్యాగ్తో హౌసులోకి వచ్చిన పల్లవి ప్రశాంత్ విజేతగా నిలిచాడు. అమర్ రన్నరప్గా నిలిచాడు. ఇక్కడివరకు బాగానే ఉంది. కానీ ఫినాలే పూర్తయిన తర్వాత అమర్ ఫ్యాన్స్ vs రైతుబిడ్డ ఫ్యాన్స్ గొడవకు దిగారు. ఈ క్రమంలోనే అమర్ కారుతో పాటు మరో ఇద్దరి సెలబ్రిటీలు కారు అద్దాలు ధ్వంసం అయ్యాయి. అలానే ఆర్టీసీ బస్సుని కూడా వదల్లేదు. (ఇదీ చదవండి: బిగ్బాస్ విన్నర్ ప్రశాంత్.. మొత్తం ఎన్ని లక్షలు సంపాదించాడంటే?) అసలు విషయానికొచ్చేస్తే.. బిగ్బాస్ అనేది గేమ్ షో. కానీ అభిమానులు అని చెప్పుకు తిరిగే వాళ్లకు అవేమి పట్టవు. ఈ సీజన్లో నామినేషన్స్లో భాగంగా అమర్, ప్రశాంత్ మధ్య చాలాసార్లు వాదన జరిగింది. అయితే అదంతా కూడా గేమ్లో భాగమని అర్థం చేసుకోలేకపోయిన ఈ పిచ్చి ఫ్యాన్స్.. అమర్ కుటుంబ సభ్యులని సోషల్ మీడియాలో వేధించడం మొదలుపెట్టారు. కొన్నాళ్లకు అక్కడ సైలెంట్ అయ్యారు. ఇప్పుడు ఫినాలే ముగిసిన తర్వాత అమర్ తన కారులో ఇంటికి వెళ్లిపోతుంటే.. అతడి కారుపై పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ దాడికి దిగారు. వెనకవైపు అద్దం ధ్వంసం చేశారు. అలానే మరో కంటెస్టెంట్ అశ్విని, వీళ్లందరినీ ఇంటర్వ్యూలు చేసిన గీతూ రాయల్ కారుని కూడా పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ ధ్వంసం చేశారు. దీంతో గీతూ.. పోలీస్ కేసు పెట్టింది. ఇది కాదన్నట్లు అన్నపూర్ణ స్టూడియోస్ బయట ప్రశాంత్, అమర్ ఫ్యాన్స్ కొట్టుకున్నారు. ఈ క్రమంలోనే ఆర్టీసీ బస్ అద్దాలు ధ్వంసం అయ్యాయి. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. (ఇదీ చదవండి: బీటెక్ కుర్రాడు అమర్.. బిగ్బాస్ ద్వారా ఎంత సంపాదించాడంటే?) View this post on Instagram A post shared by ❤HD EDITS❤ (@_hd__edits) View this post on Instagram A post shared by Ashwini Sree (@ashwinii_sree) -
బీటెక్ కుర్రాడు.. బిగ్బాస్ ద్వారా ఎంత సంపాదించాడంటే?
ప్రతి సీజన్లో ఎంటర్టైన్మెంట్ ఇచ్చేందుకు ఒకరుంటారు. అలా ఈ సీజన్లో అమర్దీప్ ఉన్నాడు. షో ప్రారంభంలో తడబడ్డా తర్వాత నెమ్మదిగా పుంజుకున్నాడు. అయితే కొన్ని సార్లు తన మాటలతో పాటు ఆటల్లో తెలిసీతెలియక చేసిన తప్పుల వల్ల నలుగురిలో నవ్వులపాలయ్యాడు. అంతేకాకుండా శత్రువులు ఎక్కడో ఉండరు.. మన పక్కనే ఉంటారన్నది అమర్ విషయంలో నిజమైంది. మెంటల్ టార్చర్ను చిరునవ్వుతో భరించాడు కొన్నిసార్లు స్నేహితులు సైతం తనను పట్టించుకోలేదు. గురువుగా భావించే శివాజీ అయితే అమర్ను అనరాని మాటలన్నాడు.. మెంటల్ టార్చర్ పెట్టాడు. అయినా అన్నింటినీ చిరునవ్వుతో భరించాడు. అనారోగ్యంతో బాధపడుతున్నా ఏనాడూ బయటకు చెప్పుకోలేదు. హెల్త్ ప్రాబ్లమ్ వల్ల టాస్కులు ఆడలేకపోయినా అది తన వైఫల్యంగానే భావించాడే కానీ అనారోగ్యాన్ని సాకుగా చెప్పలేదు. విజయానికి అడుగు దూరంలో ఆగిపోయిన అమర్ రన్నరప్గా నిలిచాడు. వారానికి రూ.2.5 లక్షలు మరి ఈ అనంతపురం కుర్రాడు ఎంత సంపాదించాడో తెలుసా? షోలోకి రావడానికి ముందే సీరియల్స్ ద్వారా బోలెడంత గుర్తింపు ఉంది. కనుక అమర్దీప్కు భారీగానే డబ్బులు ఆఫర్ చేశారు. వారానికి రూ.2.5 లక్షలు ఇచ్చారట! ఈ లెక్కన 15 వారాలకుగానూ రూ.37,50,000 అందుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఇందులో ట్యాక్స్లు, జీఎస్టీల రూపంలో దాదాపు సగం ప్రభుత్వమే లాగేసుకుంటుంది. చదవండి: బిగ్బాస్ 7 విజేతగా ప్రశాంత్.. ప్రైజ్మనీ ఎంతంటే? -
Bigg Boss 7 Finale Highlights: బిగ్బాస్ 7వ విజేతగా రైతుబిడ్డ ప్రశాంత్
105 రోజులకు పైగా ప్రేక్షకుల్ని అలరించిన బిగ్బాస్ 7 షోకి ఎట్టకేలకు పూర్తయింది. ఆదివారం అంగరంగ వైభవంగా గ్రాండ్ ఫినాలే జరిగింది. ఫినాలేకి అమర్దీప్, ప్రశాంత్, శివాజీ, ప్రియాంక, యావర్, అర్జున్ మిగిలారు. వీరిలో రైతుబిడ్డ ప్రశాంత్ విజేతగా నిలిచాడు. అలానే ఆదివారం ఎపిసోడ్లో చాలా అంటే చాలా ఎంటర్టైన్మెంట్ అందించారు. అవేంటో ఓ లుక్కేసేయండి. ►'కేజీఎఫ్' సినిమాలో మంచి ఎలివేషన్ సాంగ్తో నాగార్జున.. ఫినాలే ఎపిసోడ్లో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చాడు. బ్లాక్ సూట్లో రాయల్ లుక్లో కనిపించి, ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేశాడు. ►ఇక ఫినాలే కోసం వచ్చిన ఈ సీజన్ మిగిలిన హౌస్మేట్స్ అందరూ హిట్ సాంగ్స్కి డ్యాన్స్ చేసి అదరగొట్టేశారు. అశ్విని-పూజా, శోభా-తేజ, గౌతమ్-శుభశ్రీ, సందీప్-నయని పావని స్టెప్పులతో అదరగొట్టారు. భోలే అంటే హీరో, హీరో అంటే బిగ్బాస్ అని స్వయంగా కంపోజ్ చేసిన పాటకు భోలె డ్యాన్స్ చేసి ఫుల్గా ఎంటర్టైన్ చేశాడు. ►బిగ్బాస్ హౌస్ నుంచి బయటకొచ్చిన తర్వాత 15 సినిమా ఆఫర్లు వచ్చాయని టేస్టీ తేజ చెప్పుకొచ్చాడు. 9 వారాల్లో బిగ్బాస్ షోలో ఉండి ఎంత సంపాదించానో.. బయటకొచ్చిన తర్వాత 6 వారాల్లో అంతకంటే రెట్టింపు సంపాదించానని తేజ.. ఇంట్రెస్టింగ్ విషయాల్ని బయటపెట్టాడు. తేజతో పాటు గౌతమ్, భోలె, శోభాశెట్టి తదితరులు.. బిగ్బాస్ నుంచి బయటకెళ్లినా తర్వాత తమ లైఫ్ చాలా బాగుందని అందరూ తమ అభిప్రాయాల్ని చెప్పుకొచ్చారు. ►ఇక ఎలిమినేట్ అయిన హౌస్మేట్స్, హౌస్లో ఉన్న ఫ్యామిలీ మెంబర్స్తో హోస్ట్ నాగార్జున మాట్లాడిన తర్వాత.. ఇంట్లో ఉన్న ఆరుగురు డ్యాన్స్ ఫెర్ఫార్మెన్సులతో అదరగొట్టేశారు. యావర్ జిమ్ సామాన్లతో, శివాజీ కాఫీ కప్పుతో, ప్రియాంక కిచెన్ సామాగ్రితో, మొక్కతో ప్రశాంత్, రాకెట్స్తో అర్జున్, కప్పుతో అమర్ డ్యాన్స్ చేశారు. ►ఇక మొత్తం 19 మందికి సంబంధించిన బిగ్బాస్ జర్నీని వీడియోగా ప్లే చేసి అందరికీ చూపించారు. ఇది మొత్తం మంచి ఎంటర్టైన్మెంట్తో సాగింది. ప్రతిఒక్కరూ తమని తాము స్క్రీన్పై చూసుకుని మురిసిపోయారు. ఇక చివర్లో ఎమోషనల్ కంటెంట్ చూసి తేజ.. గుక్కపట్టి ఏడ్చేశాడు. మా అందరిదీ చాలా బ్యూటీఫుల్ జర్నీ అని చెప్పుకొచ్చాడు. ►ఇంట్లోని ఆరుగురు సభ్యులతో చిన్న ఫన్ టాస్క్ పెట్టిన నాగ్.. ఒక్కో కంటెస్టెంట్ మరొకరిలా యాక్ట్ చేసి మెప్పించారు. శివాజీ.. యావర్లా, అర్జున్.. శివాజీలా, యావర్.. అర్జున్లా, ప్రశాంత్.. ప్రియాంకలా, అమర్.. ప్రశాంత్లా, ప్రియాంక.. అమర్లా యాక్ట్ చేసి చూపించారు. ►హౌస్లో ఉన్న ఆరుగురిని బీబీ హౌస్లో మీ ఫేవరెట్ ప్లేస్ ఏంటి? అని నాగార్జున అడగ్గా.. ఒక్కొక్కరు తమకు నచ్చిన ప్లేస్ చెప్పారు. ప్రియాంక-స్టాండర్డ్ రూమ్, అర్జున్ - గార్డెన్ ఏరియా.. శివాజీ- యావర్-జోయకాలూస్ రూమ్, అమర్- గోడౌన్, ప్రశాంత్-గార్జెన్ ఏరియాలోని మొక్క అని చెప్పి..తమ బొమ్మలను ఆయా ప్లేసుల్లో పెట్టారు. ► అందాల తార నిధి అగర్వాల్ డాన్స్తో అదరగొటేటసింది. జవాన్ సినిమాలోని రామయ్య వస్తావయ్యా సాంగ్తో పాటు నాగార్జున సినిమాకు చెందిన పలు పాటలకు నిధి తనదైన స్టెప్పులేసి అలరించింది. ►టాప్-6లో ఉన్న ఆరుగురిలో నుంచి ఫినాలే ఎపిసోడ్లో అర్జున్ ఫస్ట్ ఎలిమినేషన్గా బయటకొచ్చాడు. ఇతడిని యాంకర్ సుమ.. హౌస్ నుంచి ఇతడిని బయటకు తీసుకొచ్చింది. ►దామిని బాగా కుక్ చేస్తుందనే ప్రశ్నకు యస్.. అశ్వినిని శోభా, ప్రియాంక తొక్కేశారు అన్న ప్రశ్నకు నో.. అర్జున్-అమర్ సంభాషణ ఒక్కోటి ఆణిముత్యం అన్న ప్రశ్నకు యస్.. శోభాపై పెట్టిన శ్రద్ధ, గేమ్ పై పెట్టుంటే తేజ టాప్-5లో ఉండేవాడనే ప్రశ్నకు యస్.. తదితర ప్రశ్నలకు అందరూ సమాధానాలు చెబుతూ ఫన్ జనరేట్ చేశారు. ►కాస్త ఎంటర్టైన్మెంట్ అయిన తర్వాత నటి చంద్రిక రవి స్టేజీ ఫెర్ఫార్మెన్స్ ఇచ్చింది. 'బావ మనోభావాలు దెబ్బతిన్నాయ్' లాంటి పాటకు కేక పుట్టించే స్టెప్టులేసింది. ఇకపోతే ఎక్స్-కంటెస్టెంట్స్ని పలు అవార్డులతో హోస్ట్ నాగార్జున సత్కరించాడు. పిడకల అవార్డ్- దామిని ఇన్స్టంట్ న్యూడిల్స్ అవార్డ్- నయని పావని వాటర్ బాటిల్ అవార్డ్ - పూజామూర్తి రెడ్ లిప్స్టిక్ అవార్డ్ - శుభశ్రీ ఉడత అవార్డ్ - రతిక సంచాలక్ ఆఫ్ సీజన్ అవార్డ్- సందీప్ మాస్టర్ గోల్డెన్ మైక్ అవార్డ్ - భోలె టిష్యూ అవార్డ్ - అశ్విని డంబెల్ అవార్డ్ - గౌతమ్ ఫైర్ బ్రాండ్ - శోభాశెట్టి బేబీ సోనోగ్రఫీ ఫొటోని టీషర్ట్ పై వేసి, దాన్ని అర్జున్కి గిఫ్ట్గా ఇచ్చారు. ఇది కాస్త స్పెషల్గా అనిపించింది. ►ఇక 'ఈగిల్' సినిమా ప్రమోషన్లో భాగంగా స్టేజీపైకి వచ్చిన రవితేజ.. తన అభిమాని అయిన అమర్తో కాసేపు డ్రామా పండించాడు. తన తర్వాతి సినిమాలో ఛాన్స్ ఇస్తానని బిగ్బాస్ సాక్షిగా హామీ ఇచ్చాడు. అయితే మూవీ ఛాన్స్ ఇస్తా, బయటకొచ్చేస్తావా? అని నాగ్ అడగ్గానే మరో ఆలోచన లేకుండా అమర్ బయటకొచ్చేస్తానని అన్నాడు. అమర్ ఇష్టం చూసి నాగ్-రవితేజ ఇద్దరూ అవాక్కయ్యారు. దీనిబట్టి చూస్తే రవితేజ రాబోయే సినిమాల్లో ఏదో ఒకదానిలో అమర్ యాక్ట్ చేయడం గ్యారంటీ. ►ఫినాలేలో రెండో ఎలిమినేషన్ గా ప్రియాంక బయటకొచ్చింది. కొత్త సినిమా ప్రమోషన్ కోసం వచ్చిన రవితేజ.. ప్రియాంక ఎలిమినేట్ అయినట్లు చెప్పాడు. ►'నా సామి రంగ' మూవీ ప్రమోషన్ కోసం హౌసులోకి వచ్చిన అల్లరి నరేశ్, రాజ్ తరుణ్.. రూ.15 లక్షల డబ్బుతో ఉన్న గోల్డెన్ సూట్కేస్తో బిగ్బాస్లోకి వచ్చారు. మిగిలిన నలుగురితో (అమర్, ప్రశాంత్, శివాజీ, యావర్) చాలాసేపు డిస్కషన్ పెట్టారు. డబ్బులు తీసుకునేలా టెంప్ట్ చేశారు. చివరకు యావర్.. సూట్కేస్ తీసుకుని, తనకు తానుగా ఎలిమినేట్ అయ్యాడు. అయితే యావర్.. సోదరులు కూడా చెప్పడంతో ఇక ఫైనల్గా సూట్ కేసు తీసుకుని బయటకొచ్చేశాడు. ►'డెవిల్' మూవీ ప్రమోషన్లో భాగంగా షోకి వచ్చిన కల్యాణ్ రామ్, సంయుక్త మేనన్.. కాసేపు సినిమా గురించి చిట్చాట్ చేశారు. కాసేపు సస్పెన్స్ క్రియేట్ చేసిన తర్వాత మిగిలిన ముగ్గురిలో శివాజీ ఎలిమినేట్ అయినట్లు ప్రకటించారు. అయితే శివాజీ ఎలిమినేట్ కావడాన్ని ప్రశాంత్ తట్టుకోలేకపోయాడు. కాళ్లు పట్టేసుకుని మరీ కన్నీళ్లు పెట్టుకున్నాడు. ►ఇక టాప్-2లో మిగిలిన అమర్, ప్రశాంత్ కోసం హౌసులోకి వెళ్లొచ్చిన హోస్ట్ నాగార్జున.. వీళ్లిద్దరినీ స్టేజీపైకి తీసుకొచ్చారు. అయితే విజేత ఎవరనేది ప్రకటించడానికి ముందు బిగ్బాస్ చిన్న సర్ప్రైజ్ ప్లాన్ చేశాడు. నాగార్జున జర్నీని వీడియోగా ప్లే చేసి కాస్త ఫన్ జనరేట్ చేశాడు. ►చివరి వరకు సస్పెన్స్ మెంటైన్ చేస్తూ వచ్చిన బిగ్బాస్ హౌస్ట్ నాగార్జున.. రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ని విజేతగా ప్రకటించాడు. అయితే ఈ విషయాన్ని అస్సలు నమ్మలేకపోయిన ప్రశాంత్.. అలా షాక్లో ఉండిపోయాడు. ఇకపోతే అమర్దీప్ రన్నరప్గా నిలిచాడు. ► బిగ్ బాస్ 7వ సీజన్ విజేతగా నిలిచిన పల్లవి ప్రశాంత్కి రూ.35 లక్షల చెక్తో పాటు మారుతీ సుజుకీ బ్రెజా, రూ.15 లక్షల విలువైన జ్యూవెల్లరీ నెక్లెస్ సెట్ని కూడా బహుమతిగా అందించారు. నాకు వచ్చిన రూ.35 లక్షలు రైతులకే పంచుతాను. రైతుల కోసమే వచ్చిన రైతుల కోసమే ఆడాను. కారు నాన్నకు, నెక్లెస్ అమ్మకు బహుమతిగా ఇస్తాను అంటూ స్పీచ్తో అదరగొట్టాడు. -
బిగ్బాస్ గ్రాండ్ ఫినాలే.. అమర్కు ఊహించని ఆఫరిచ్చిన నాగ్.. మరో ఆలోచన లేకుండా!
Bigg Boss Season 7 Telugu Grand Finale: మరికొద్ది గంటల్లో బిగ్బాస్ సీజన్-7 గ్రాండ్ ఫినాలే షురూ కానుంది. వందకు పైగా రోజుల పాటు బుల్లితెర ప్రేక్షకులు కట్టి పడేసిన తెలుగువారి బిగ్ రియాలిటీ షోకు ఎండ్ కార్డ్ పడనుంది. ఈ నేపథ్యంలో సీజన్-7 విన్నర్ ఎవరనే విషయంపై అందరిలో ఆసక్తిని పెంచుతోంది. శనివారం రోజు ఇంటి సభ్యులంతా చిల్ అయ్యారు. 3వ సీజన్ రన్నరప్, యాంకర్ శ్రీముఖి.. కాసేపు ఆరుగురు ఇంటి సభ్యులతో పాటలు పాడించింది. ఇక చివరి రోజు సాయంత్రం 7 గంటలకే ఎపిసోడ్ ప్రసారం కానుండగా.. తాజాగా ప్రోమో రిలీజ్ చేశారు మేకర్స్. (ఇది చదవండి: 'సలార్' రెండో ట్రైలర్తో ప్రభాస్ రెడీ) తాజాగా రిలీజైన ప్రోమో చూస్తే ఈ ఏడాది సీజన్-7 గ్రాండ్ ఫినాలేను మరింత గ్రాండ్ సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ సీజన్లో పాల్గొన్న కంటెస్టెంట్స్ అందరూ గ్రాండ్ ఫినాలేకు హాజరైనట్లు కనిపిస్తోంది. అయితే ఈ గ్రాండ్ ఫినాలేలో మాస్ మహారాజా రవితేజ, కల్యాణ్ రామ్, యాంకర్ సుమ, ఆమె కొడుకు రోషన్, బబుల్ గమ్ హీరోయిన్ మానస చౌదరి, అల్లరి నరేశ్, రాజ్ తరుణ్ సందడి చేశారు. వీరంతా తమ సినిమాల ప్రమోషన్లలో భాగంగా గ్రాండ్ ఫినాలేకు హాజరయ్యారు. అయితే మరోవైపు ఈరోజు బిగ్ బాస్ సీజన్-7 విన్నర్ ఎవరో తెలిసిపోనుంది. కానీ అంతకంటే ముందు టాప్-6లో ఉన్న కంటెస్టెంట్స్కు సూట్ కేస్ ఆఫర్ తీసుకొచ్చారు. అల్లరి నరేశ్, రాజ్ తరుణ్ సూట్కేసుతో హౌస్లో అడుగుపెట్టారు. 'రండి బాబు రండి.. ఆలోచిస్తే ఆశాభంగం' అంటూ అల్లరి నరేశ్ వారికి సూట్కేస్ కోసం రండి వేలంపాట మొదలెట్టాడు. ఆ తర్వాత ఇన్ని రోజుల కష్టపడి ఉట్టి చేతులతో బయటికెళ్లడమా? అంటూ రాజ్ తరుణ్ టెంప్టింగ్ అయ్యేలా సలహా ఇచ్చాడు. అయితే ప్రోమో చివర్లో మాస్ రవితేజ అదిరిపోయే ఎంట్రీ ఇచ్చాడు. అయితే బిగ్ బాస్ హోస్ట్ నాగార్జున అమర్దీప్కు ఎవరు ఊహించని ఆఫర్ ఇచ్చాడు. బిగ్బాస్ గేట్స్ తెరిచి ఉన్నాయి.. నువ్వు బయటకి వస్తే నెక్ట్స్ సినిమాలో రవితేజతో పాటు నటిస్తావ్ అన్నారు. అంతేకాకుండా అమర్కు కేవలం 7 సెకన్లు మాత్రమే టైం ఇచ్చాడు. దీంతో అమర్దీప్ మరో ఆలోచన లేకుండా పరుగుత్తాడు. అయితే అమర్దీప్ నిజంగానే బయటికొచ్చేశాడా? చివరి నిమిషంలో ఏం జరిగింది? అనేది తెలియాలంటే ఇవాళ ప్రసారమయ్యే గ్రాండ్ ఫినాలేను మిస్ అవ్వకండి. (ఇది చదవండి: Bigg Boss 7: అన్ని లక్షలు ఆఫర్ చేసిన నాగ్.. టైటిల్ రేసు నుంచి ఆ ఒక్కడు డ్రాప్!)