-
ఓటీటీలోకి 'ఏజెంట్' సినిమా.. ట్వీట్ చేసిన నిర్మాత
టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని అఖిల్.. లీడ్ రోల్లో నటించిన చిత్రం 'ఏజెంట్'. ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి తెరకెక్కించారు. గతేడాది ఏప్రిల్ నెలలో వచ్చిన ఈ సినిమాలో అఖిల్కు జోడీగా యంగ్ బ్యూటిఫుల్ నటి సాక్షి వైద్య నటించారు. ఒక సినిమా థియటర్లోకి వచ్చాక కనీసం 50 రోజుల్లో ఓటీటీలోకి వచ్చేస్తుంది. కానీ ఈ సినిమా ఇప్పటికీ ఓటీటీ రిలీజ్కు నోచుకోలేదు. దీంతో అక్కినేని ఫ్యాన్స్ నిరాశ చెందారు. అయితే ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఫ్యాన్స్కు ఇదొక శుభవార్త అనే చెప్పవచ్చు. ఎప్రిల్ 8న అఖిల్ పుట్టినరోజు సందర్బంగా ఎజెంట్ నిర్మాత అనిల్ సుంకర శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశారు. దీంతో అఖిల్ ఫ్యాన్స్ రియాక్ట్ అయ్యారు. ముందు ఏజెంట్ సినిమాను ఓటీటీలో విడుదల చేయండి అంటూ కామెంట్లు చేశారు. దీంతో అనిల్ సుంకర రిప్లై ఇచ్చారు. ఏజెంట్ ఓటీటీ స్ట్రీమింగ్ హక్కులను సోనీ లివ్ దక్కించుకున్నట్లు అనిల్ తెలిపారు. ఈ విషయాన్ని చాలా సార్లు చెప్పాను. అతి త్వరలోనే ఏజెంట్ సినిమా సోనీ లివ్లో స్ట్రీమింగ్ అవుతుందని అనిల్ ట్వీట్ ద్వారా తెలిపారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ విషయం వైరల్ అవుతుంది. గత ఏడాది ఏప్రిల్ 28న రిలీజైన ఈ మూవీ సుమారు రూ. 85 కోట్లతో తెరకెక్కినట్లు సమాచారం. కానీ ఇందులో పది శాతం కలెక్షన్స్ కూడా సినిమా రాబట్టలేకపోయింది. దీంతో నిర్మాత అనిల్ సుంకరకు భారీగా నష్టాలు వచ్చినట్లు తెలుస్తోంది. ఎజెంట్లో మలయాళ టాప్ హీరో మమ్ముట్టి కీలక పాత్రలో కనిపించారు. దీంతో మలయాళంలో కూడా సినిమాను విడుదల చేశారు. కానీ అక్కడ కూడా డిజాస్టర్గా మిగిలిపోయింది. ఏజెంట్ మూవీతో సాక్షి వైద్య హీరోయిన్గా టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. తాజాగా అనిల్ సుంకర చేసిన ట్వీట్తో ఏజెంట్ ఓటీటీ విషయంపై మళ్లీ వార్తలు వైరల్ అవుతున్నాయి. I already informed couple of times. We sold the digital to B4U and they to Sony. Hopefully they will do it asap. https://t.co/5k0aFYKZbB — Anil Sunkara (@AnilSunkara1) April 8, 2024 -
సలార్లో అఖిల్ అక్కినేని.. క్లారిటీ ఇచ్చిన ప్రశాంత్ నీల్ సతీమణి
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కిన 'సలార్' బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపించి తాజాగా ఓటీటీలోకి కూడా వచ్చేసింది. ప్రశాంత్ నీల్ దర్శకత్వానికి.. ప్రభాస్, పృథ్వీరాజ్ల యాక్షన్ సీన్స్కు ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. సలార్ పార్ట్-2 ఉంటుందని ఇప్పటికే ప్రకటన వచ్చేసింది. దానికి 'సలార్ శౌర్యాంగపర్వం' అనే టైటిల్ కూడా రివిల్ అయిపోయింది. సలార్ సీక్వెల్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇందులో టాలీవుడ్ యంగ్ హీరో అఖిల్ అక్కినేని అతిథి పాత్రలో కనిపించనున్నారంటూ నెట్టింట ప్రచారం జరుగుతుంది. అఖిల్ లుక్తో పాటు అతని బాడీ కూడా బాలీవుడ్ హీరోలకు ఏం తక్కువ కాదు అన్నట్టుగా ఉంటుంది. అఖిల్ భారీ యాక్షన్ సీన్స్లలో దుమ్ములేపగలడు. దీంతో సలార్ పార్ట్ 2లో అఖిల్ ఎంట్రీ దాదాపు ఖాయం అని నెట్టింట వార్తలు వైరల్ అయ్యాయి. దీనిపై ప్రశాంత్ నీల్ సతీమణి లిఖితా రెడ్డి తాజాగా స్పందించారు. అవన్నీ పూర్తిగా వదంతులు మాత్రమేనని, అందులో ఎలాంటి నిజం లేదని ఆమె తెలిపారు. ఈ విషయాన్ని తన ఇన్స్టాగ్రామ్ వేదికగా నెటిజన్లు అడిగడంతో క్లారిటీ ఇచ్చారు. సలార్లో దేవా తండ్రి పాత్ర ఎవరు పోషిస్తున్నారు..? తన తండ్రిని రాజమన్నార్ చంపాడనే విషయం దేవాకు తెలుసా..? అని చాలామంది అడిగిన ప్రశ్నకు ఆమె రివీల్ చేయలేదు.. సమాధానాల కోసం తాను కూడా ఎదురు చూస్తున్నట్లు చెప్పారు. 'సలార్' గ్లింప్స్లో చూపించిన జురాసిక్ పార్క్ డైలాగ్ గురించి ఆమె చాలా ఆసక్తికరమైన సమాధానం చెప్పారు. శౌర్యాంగపర్వం విడుదలయ్యాకు ఆ డైలాగ్ కరెక్టా? కాదా? అనేది తెలుస్తుందని తెలిపారు. అంతేకాకుండా పండిట్ రోల్ కూడా సలార్లో కొంత మాత్రమే రివీల్ చేసినట్లు ఆమె చెప్పారు. -
గాయపడ్డ టాలీవుడ్ యంగ్ హీరో అఖిల్.. ఇంతకీ ఏమైంది?
అక్కినేని యంగ్ హీరో అఖిల్ గాయపడ్డాడు. తాజాగా 'సలార్' సక్సెస్ సెలబ్రేషన్స్ జరిగాయి. ఇందులో అఖిల్ కనిపించాడు. కాకపోతే ఎడమ చేతికి కట్టు ఉండటంతో పెద్ద దెబ్బ తగిలిందని అర్థమైంది. అసలు ఇంతకీ అఖిల్ చేతికి ఏమైంది? 'సలార్' సక్సెస్ పార్టీలో ఈ కుర్ర హీరో కనిపించడానికి కారణమేంటనేది చూద్దాం. గతేడాది డిసెంబరు 22న థియేటర్లలోకి వచ్చిన 'సలార్' సినిమా ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. ప్రస్తుతం రూ.700 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది. ఈ క్రమంలోనే మొన్నీమధ్య బెంగళూరులో గ్రాండ్ సక్సెస్ పార్టీ చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో మూవీ టీమ్ అంతా పాల్గొన్నారు. అదే టైంలో అయ్యగారు అఖిల్ కూడా కనిపించాడు. కాకపోతే చేతికి కట్టుతో కనిపించడంతో గాయం విషయం బయటపడింది. (ఇదీ చదవండి: Salaar OTT: 'సలార్' ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ అయ్యిందా? స్ట్రీమింగ్ అప్పుడేనా?) అయితే అఖిల్.. గతేడాది 'ఏజెంట్' మూవీతో వచ్చాడు. ఘోరమైన డిజాస్టర్ తన ఖాతాలో వేసుకున్నాడు. అయితే యువీ క్రియేషన్స్ బ్యానర్లో ఓ కొత్త దర్శకుడితో అఖిల్ సినిమా అని అప్పట్లో అన్నారు. ఇది నిజమో కాదో క్లారిటీ రావాల్సి ఉంది. అయితే యువీ క్రియేషన్స్ అంటే ప్రభాస్ సొంత సంస్థనే. అలా అఖిల్కి ఆహ్వానం అంది ఉండొచ్చు. అలా 'సలార్' సక్సెస్ సెలబ్రేషన్స్లో కనిపించి ఉండొచ్చు. ఇక గాయం విషయానికొస్తే.. బయటకు చెప్పకుండా అఖిల్ సినిమా షూటింగ్లో పాల్గొంటున్నాడేమో. ఈ క్రమంలోనే గాయమై ఉండొచ్చని అంటున్నారు. మరి ఈ విషయమై క్లారిటీ రావాల్సి ఉంది. చేతికి కట్టు చూస్తే పెద్ద గాయంలానే కనిపిస్తుంది. మరి ఎప్పుడైందో ఏమో? (ఇదీ చదవండి: రూ.100 కోట్ల వసూళ్లు దాటేసిన 'హనుమాన్'.. ఆ విషయమైతే చాలా స్పెషల్) -
అయ్యగారు ఈసారైనా ఓటీటీలోకి వస్తారా..?
టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని అఖిల్.. లీడ్ రోల్లో నటించిన చిత్రం 'ఏజెంట్'. ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి తెరకెక్కించారు. గతేడాది ఏప్రిల్ నెలలో వచ్చిన ఈ సినిమాలో అఖిల్కు జోడీగా యంగ్ బ్యూటిఫుల్ నటి సాక్షి వైద్య నటించారు. ఒక సినిమా థియటర్లోకి వచ్చాక కనీసం 50 రోజుల్లో ఓటీటీలోకి వచ్చేస్తుంది. కానీ ఈ సినిమా ఇప్పటికీ ఓటీటీ రిలీజ్కు నోచుకోలేదు. దీంతో అక్కినేని ఫ్యాన్స్ నిరాశ చెందారు. అయితే ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఫ్యాన్స్కు ఇదొక గుడ్న్యూస్ అనే చెప్పవచ్చు. ఈ సినిమా ఓటీటీ రిలీజ్కు ఉన్న చిక్కులు అన్నీ తొలగిపోయాయని తెలుస్తోంది. దీంతో జనవరి 26న రిపబ్లిక్ డే సందర్భంగా 'ఏజెంట్' చిత్రాన్ని 'సోని లివ్' ప్రసారం చేయనున్నట్లు సమాచారం. ఈ సినిమా వల్ల సుమారు రూ. 30 కోట్ల వరకు నష్టం వచ్చినట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేశాయి. దీంతో ఏజెంట్ చిత్రాన్ని ఓటీటీ సంస్థలు కూడా తీసుకునేందుకు పెద్దగా ముందుకు రాలేదు. ఇప్పటికే ఈ సినిమా ఓటీటీలోకి వచ్చేస్తుందంటూ పలు మార్లు వార్తలు వచ్చాయి. కానీ కొన్ని కారణాల వల్ల మళ్లీ బ్రేక్ పడుతూ వచ్చింది. ఈసారైనా జనవరి 26న ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుందా..? అంటూ సోషల్మీడియాలో సందేహాలు వ్యక్తమౌతున్నాయి. ఈ సినిమాలోని అనవసరమైన సన్నివేశాలను తొలగించి.. మంచి సన్నివేశాలను జోడించి కొత్త వెర్షన్ను విడుదల చేయాలనే ఉద్దేశంలో మేకర్స్ ఉన్నారట. -
నెలలోపే ఓటీటీ వస్తుంటే.. ఈ సినిమాలకేమైంది?
ప్రస్తుత సినిమా ప్రపంచంలో ఓటీటీలదే హవా. తమ అభిమాన స్టార్ హీరోల సినిమాలు ఎప్పుడొస్తాయా అని చూస్తున్నారు అభిమానులు. సినిమా రిలీజైన మొదటి రోజు నుంచే.. ఏ ఓటీటీలో వస్తుంది? ఏ రోజు స్ట్రీమింగ్ అవుతుందని తెలుసుకోవాలని తహతహలాడుతుంటారు. పెద్ద పెద్ద స్టార్స్ సినిమాలు, బ్లాక్ బస్టర్స్ సైతం నెల తర్వాతే ఓటీటీల్లో ప్రత్యక్షమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ ఏడాది రిలీజై నెలల గడుస్తున్నా కొన్ని సినిమాలు ఇప్పటివరకు ఓటీటీకి రాలేదు. ఇంతకీ ఆ సినిమాలేవీ? ఎందుకు రాలేదు? అనే విషయాలపై ఓ లుక్కేద్దాం. అఖిల్ ఏజెంట్… అఖిల్ అక్కినేని ఏజెంట్ మూవీ ఇప్పటివరకు ఓటీటీకి రాలేదు. ఏప్రిల్లో రిలీజైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్గా నిలిచింది. సురేందర్ రెడ్డి ఈ చిత్రాన్ని తెరకెక్కించగా.. మలయాళ స్టార్ మమ్ముట్టి కీలకపాత్రలో కనిపించారు. ఈ మూవీ ఓటీటీ రైట్స్ను సోనీ లివ్ దక్కించుకున్న సంగతి తెలిసిందే. అసలు కథేంటంటే? రామకృష్ణ అలియాస్ రిక్కీకి రా(RAW) ఏజెంట్ కావాలనేది కల. దానికోసం మూడుసార్లు పరీక్ష రాసి పాస్ అయినా రిజెక్ట్ అవుతాడు. మహాదేవ్(మమ్ముట్టి) రా చీఫ్. భారతదేశాన్ని టార్గెట్ చేసిన ది గాడ్ (డినో మోరియా)ని అంతం చేయాలనేది ఈయన లక్ష్యం. అందుకోసం ఓ మిషన్ ప్లాన్ చేస్తాడు. అనుకోకుండా ఈ మిషన్లో భాగమవుతాడు. ఇంతకు మహాదేవ్.. రిక్కీకి ఏం చేయమన్నాడు? రిక్కీ రా ఏజెంట్ కల నేరవేరిందా? మహాదేవ్ మిషన్ పూర్తయిందా? లేదా? అన్నదే 'ఏజెంట్' స్టోరీ. నయనతార కనెక్ట్… లేడీ సూపర్ స్టార్ నయనతార ప్రధాన పాత్రలో నటించిన చిత్రం కనెక్ట్. థియేటర్లలో మంచి వసూళ్లను రాబట్టిన ఈ మూవీ ఓటీటీలో మాత్రం రిలీజ్ కాలేదు. అశ్విన్ శరవణన్ దర్శకత్వంలో థ్రిల్లర్ మూవీగా తెరకెక్కించారు. ఈ సినిమా గతేడాది డిసెంబర్లో థియేటర్లలో విడుదలైంది. నయనతార భర్త విఘ్నేష్ శివన్ ఈ మూవీని నిర్మించాడు. కనెక్ట్ ఓటీటీ హక్కులను డిస్నీ ప్లస్ హాట్ స్టార్ దక్కించుకున్నట్లు ప్రచారం జరిగింది. కానీ సినిమా మాత్రం ఇప్పటివరకు ఓటీటీ రిలీజ్ కాలేదు. ఆదా శర్మ.. ది కేరళ స్టోరీ ఆదా శర్మ ప్రధాన పాత్రలో తెరకెక్కించిన చిత్రం 'ది కేరళ స్టోరీ'. బాలీవుడ్ డైరెక్టర్ సుదీప్తో సేన్ ఈ చిత్రాన్ని తెరకెక్కించగా.. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించింది. కేవలం రూ.40 కోట్ల బడ్జెట్తో తీసిన ఈ మూవీ.. దాదాపు రూ.300 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఈ చిత్రం రిలీజ్ నెలలు గడుస్తున్నా ఇంతవరకు ఓటీటీకి రావడం లేదు. సెన్సిటివ్ కంటెంట్ కావడంతోనే ఓటీటీ ఫ్లాట్ఫామ్స్ వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. -
అఖిల్పై రూ. 100 కోట్లు.. కొత్త డైరెక్టర్తో ప్రయోగం!
సినిమా ఫలితం ఎలా ఉన్నా.. టాలీవుడ్ మార్కెట్లో అఖిల్ అక్కినేనికి ఓ ప్రత్యేకమైన ఇమేజ్ ఉంది. ఒక్క హిట్ పడితే చాలు..అఖిల్ స్టార్ హీరో అయిపోవడం ఖాయం. కానీ దురదృష్టవశాత్తు..అఖిల్ ఖాతాలో ఇప్పటి వరకు ఓ భారీ హిట్ లేదు. భారీ అంచనాలు పెట్టుకున్న ‘ఏజెంట్’ డిజాస్టర్గా నిలిచింది. దాదాపు 80 కోట్ల భారీ బడ్జెట్తో నిర్మించిన ఈ చిత్రానికి రూ. 10 కోట్ల కలెక్షన్స్ కూడా రాలేదు. అంతేకాదు.. ఓటీటీ స్ట్రీమింగ్ సైతం వివాదంలో చిక్కుకొని..ఇప్పటికీ రిలీజ్ కాలేదు. దీంతో అఖిల్ కొన్ని రోజులుగా మీడియాకు దూరంగా ఉంటున్నారు. ఇప్పుడిప్పుడే ఏజెంట్ ఫలితాన్ని మర్చిపోయి..కొత్త సినిమాపై దృష్టిపెడుతున్నాడట. రూ. 100 కోట్లతో కొత్త సినిమా ఏజెంట్ రిలీజై ఆరు నెలలు దాటినా..అఖిల్ కొత్త సినిమాను ప్రకటించలేదు. అయితే యూవీ క్రియేషన్స్ బ్యానర్లో అఖిల్ తదుపరి సినిమా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీతో అనిల్ కుమార్ అనే కొత్త దర్శకుడు తెలుగు తెరకు పరిచయం కాబోతున్నాడు. యూవీ క్రియేషన్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మించబోతోంది. ఫ్లాప్ హీరో, కొత్త డైరెక్టర్ అయినప్పటికీ..దాదాపు రూ. 100 కోట్ల బడ్జెట్తో ప్రయోగం చేయబోతోంది యూవీ క్రియేషన్స్. ప్రస్తుతం అఖిల్కు టాలీవుడ్ మార్కెట్లో ఉన్న విలువ కంటే ఇది చాలా ఎక్కువ. కంటెంట్పై ఉన్న నమ్మకంతోనే రూ. 100కోట్లు పెట్టడానికి కూడా నిర్మాతలు భయపడడం లేదట. పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రాన్ని రూపొందించబోతున్నారు. 2025లో రిలీజ్? అఖిల్ కొత్త సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటున్నారట. నాగార్జున సైతం ఈ చిత్రాన్ని దగ్గరుండి చూసుకోవాలని భావిస్తున్నారు. ప్రస్తుతం ఆయన నా సామిరంగ, బిగ్బాస్ 7 షోతో బిజీగా ఉన్నారు. వచ్చే ఏడాది జనవరిలో ఆయన ఫ్రీ అయిపోతారు. అప్పుడు మరోసారి కథ విని..ఫైనల్ వెర్షన్ని లాక్ చేస్తారట. ఫిబ్రవరి లేదా మార్చిలో ఈ చిత్రం సెట్స్పైకి వెళ్లనుంది. 2025లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. -
మరింత అందంకోసం సర్జరీ చేయించుకున్న అఖిల్ !
-
అక్కినేని అఖిల్ గురించి వైరల్ అవుతున్న న్యూస్!
అఖిల్ అక్కినేని నటించిన 'ఏజెంట్' చిత్రం తర్వాత ఆయన మళ్లీ కొత్త సినిమాను ప్రకటించలేదు. భారీ యాక్షన్, స్పై థ్రిల్లర్గా 'ఏజెంట్' తెరకెక్కింది. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమా కోసం అఖిల్ ఎంతో కష్టపడ్డారు. సిక్స్ ప్యాక్తో కనిపించడం కోసం ఆయన కొన్నినెలలపాటు శ్రమించారు. కానీ ఏజెంట్ అంతగా ప్రేక్షకులను మెప్పించలేదు. ఎజెంట్ సినిమాలో అఖిల్ హాలీవుడ్ హీరోలకు ధీటుగా కనిపిస్తాడు. అతని ప్రధాన బలం హైట్, అందుకు తగ్గట్టు ఆయన మెయిన్టైన్ చేస్తున్న సిక్స్ ప్యాక్.. ఏజెంట్ స్క్రిప్టు పక్కాగా ఉండుంటే భారీ హిట్ అయిండేది. ఇదే విషయాన్ని ఆ చిత్ర నిర్మాత బహిరంగంగానే చెప్పాడు. (ఇదీ చదవండి: సాక్షి టీవీ వాట్సాప్ ఛానెల్ క్లిక్ చేసి ఫాలో అవ్వండి) తాజాగా అక్కినేని అఖిల్కు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆయన ఓ కాస్మోటిక్ సర్జరీ చేయించుకుంటున్నట్లు ఇండస్ట్రీలో ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే హాలీవుడ్ హీరోలా ఉన్న అఖిల్ మరింత అందంగా కనిపించడానికి తన ముఖానికి స్వల్ప సర్జరీ చేయించుకుంటున్నారని సమాచారం. తన ముక్కుకు సంబంధించి కొన్ని మెరుగులు దిద్దుతున్నారట. దీనికోసం ఆయన విదేశాలకు వెళ్తున్నారని టాక్. ఇందులో నిజం ఎంత ఉందో తెలియదు కానీ ఈ వార్తలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అఖిల్ ఏజెంట్ తర్వాత పక్కా ప్లాన్తో ఒక ప్రాజెక్ట్కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని టాక్. ఈ సినిమాకు అనిల్ కూమార్ అనే కొత్త దర్శకుడు డైరెక్షన్ చేయనున్నారని తెలుస్తోంది. అనిల్ గతంలో సాహో, రాధేశ్యామ్ వంటి పాన్ ఇండియా సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్గా చేశాడు. ఈ సినిమాకు ధీర అనే టైటిల్ కూడా సెలెక్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో హీరోయిన్గా జాన్వీ కపూర్ నటిస్తుందని వార్తల వస్తున్నాయి. ఆమె ప్రస్తుతం జూ.ఎన్టీఆర్ దేవర చిత్రంలో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. -
రాజమౌళి పరివేక్షణలో అఖిల్ సినిమా..
-
ఓటీటీలోకి 'ఏజెంట్'.. ఐదు నెలల తర్వాత ఆ రోజే రిలీజ్
ఏ సినిమా అయినా మహా అయితే నెల.. లేదంటే నెలన్నరలోపే ఓటీటీలోకి వచ్చేస్తుంది. కానీ అక్కినేని హీరో అఖిల్ నటించిన 'ఏజెంట్' మాత్రం పత్తా లేకుండా పోయింది. అప్పుడెప్పుడో ఏప్రిల్ చివర్లో థియేటర్లలోకి వచ్చింది. ఆ తర్వాత వెంటనే ఓటీటీ రిలీజ్ ఫిక్స్ చేసుకున్నా.. దాన్ని అలా వదిలేశారు. దీంతో అందరూ ఆ మూవీ గురించి మర్చిపోయారు. ఇన్నాళ్లకు ఓటీటీ రిలీజ్ తేదీని అధికారికంగా ప్రకటించారు. ఏమైంది? దాదాపు రూ.80 కోట్ల బడ్జెట్తో తీసిన యాక్షన్ మూవీ 'ఏజెంట్'. అయితే రిలీజ్కి ముందు అంచనాలు బాగానే ఉండటంతో.. హిట్ అవుతుందని అందరూ అనుకున్నారు. కానీ ఘోరంగా బోల్తా కొట్టింది. పదుల కోట్ల నష్టాన్ని నిర్మాతకు మిగిల్చింది. దీంతో డిజిటల్ హక్కులు కొనుగోలు చేసిన సోనీ లివ్.. ఓటీటీ రిలీజ్ విషయంలో వెనకడుగు వేసింది. (ఇదీ చదవండి: సమ్మోహనుడా పాట షూటింగ్లో దర్శకుడితో గొడవ, ఏడ్చేసిన హీరోయిన్!) ఐదు నెలల తర్వాత అయితే మే 19నే తొలుత ఓటీటీ రిలీజ్ చేస్తామని చెప్పారు. కానీ ఆ సమయానికి విడుదల చేయలేదు. అప్పుడు ఇప్పుడు అనుకుంటూ వచ్చారు కానీ పూర్తిగా పక్కనబెట్టేశారు. దీంతో అందరూ 'ఏజెంట్' గురించి మర్చిపోయారు. ఇలాంటి టైంలో సెప్టెంబరు 29 నుంచి స్ట్రీమింగ్ చేయనున్నట్లు సోనీలివ్ అధికారికంగా ప్రకటించింది. అంటే దాదాపు ఐదు నెలల తర్వాత ఓ సినిమా ఓటీటీలోకి రానుంది. ఇది నిజంగా విశేషమే. కథేంటి? రామకృష్ణ అలియాస్ రిక్కీకి రా(RAW) ఏజెంట్ కావాలనేది కల. దానికోసం మూడుసార్లు పరీక్ష రాసి పాస్ అయినా రిజెక్ట్ అవుతాడు. మహాదేవ్(మమ్ముట్టి) రా చీఫ్. భారతదేశాన్ని టార్గెట్ చేసిన ది గాడ్ (డినో మోరియా)ని అంతం చేయాలనేది ఈయన లక్ష్యం. అందుకోసం ఓ మిషన్ ప్లాన్ చేస్తాడు. అనుకోకుండా ఈ మిషన్లో భాగమవుతాడు. ఇంతకు మహాదేవ్.. రిక్కీకి ఏం చేయమన్నాడు? రిక్కీ రా ఏజెంట్ కల నేరవేరిందా? మహాదేవ్ మిషన్ పూర్తయిందా? లేదా? అన్నదే 'ఏజెంట్' స్టోరీ. (ఇదీ చదవండి: ఓటీటీలో సూపర్హిట్ లవ్ స్టోరీ.. ఫ్రీగా చూసేయండి!) The wait is over! Brace yourself for the wild adrenaline rush! The Agent starring Mammotty and Akhil Akkineni will be streaming on Sony LIV from 29th Sept.#SonyLIV #AgentOnSonyLIV #Agent @AkhilAkkineni8 @mammukka @DirSurender @sakshivaidya99 @AnilSunkara1 pic.twitter.com/zYL0ljh8M1 — Sony LIV (@SonyLIV) September 22, 2023 -
నువ్వు నా కొడుకు కాబట్టి...అఖిల్ పై నాగార్జున ఫన్నీ కామెంట్స్
-
చాలా స్ట్రెస్ గా ఉంది నాన్న..!
-
అమ్మ మీద చిరాకు పడతావ్ ఏంట్రా..? అక్కినేని నాగార్జున
-
నిన్ను చూస్తే జెలస్ ఉందిరా : అక్కినేని నాగార్జున
-
మిస్టర్ మజ్ను గురించి అక్కినేని నాగార్జున సూపర్ ఫన్ ఇంటర్వ్యూ అఖిల్ తో
-
నిన్న అఖిల్...ఈ రోజు నిఖిల్...మీరు మారిపోయారయ్యా
-
ఫ్లాప్స్ తట్టుకోలేక యూ టర్న్ తీసుకున్న అక్కినేని బ్రదర్స్
-
ఓటీటీలో అఖిల్ 'ఏజెంట్' మూవీ వాయిదా.. స్ట్రీమింగ్ అప్పుడే
అక్కినేని అఖిల్ తాజాగా నటించిన చిత్రం ఏజెంట్. సాక్షి వైద్య ఇందులో హీరోయిన్గా నటించింది. స్పై థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమాను సురేందర్ రెడ్డి డైరెక్ట్ చేశారు. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా అఖిల్ కెరీర్లో మరో ఫ్లాప్గా మిగిలింది. మేకోవర్ కోసం చాలా కష్టపడిన అఖిల్కు ఏజెంట్ తీవ్ర నిరాశనే మిగిల్చింది. తొలిరోజు నుంచే నెగిటివ్ టాక్తో ప్రేక్షకుల అంచనాలను ఏమాత్రం అందుకోలేకపోయింది. ఇదిలా ఉంటే ఇప్పుడీ సినిమా ఓటీటీ రిలీజ్పై మరో కన్ఫ్యూజన్ వచ్చి పడింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ సోనీ లివ్ ఈ సినిమా డిజిటల్ హక్కులను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈరోజు(మే19)నుంచే స్ట్రీమింగ్ చేస్తున్నట్లు కూడా సోనీలివ్ ఓ పోస్టర్ను రిలీజ్ చేసింది. చదవండి: షూటింగ్లో ప్రమాదం.. సల్మాన్ఖాన్కు గాయాలు అయితే మళ్లీ ఏమైందో ఏమో కానీ ఏజెంట్ స్ట్రీమింగ్ను వాయిదా వేసింది. థియేటర్ రిలీజ్కు, ఓటీటీ విడుదలకు కనీసం 20 రోజుల గ్యాప్ కూడా లేకపోవడంతో మరో వారం పాటు వాయిదా వేస్తున్నట్లు తెలుస్తుంది. మే26న ఏజెంట్ మూవీ ఓటీటీలో అందుబాటులోకి రానున్నట్లు సమాచారం. Were is #Agent OTT RELEASE MAY 19 @SonyLIV @SonyLIVHelps pic.twitter.com/gLANHasQ1S — OTTGURU (@OTTGURU1) May 19, 2023 -
ఏజెంట్పై ఫలితంపై అఖిల్ రియాక్షన్..
అక్కినేని అఖిల్, సాక్షి వైద్యం జంటగా నటించిన చిత్రం ఏజెంట్. ఇటీవలే థియేటర్లలో రిలీజైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద అభిమానుల అంచనాలను అందుకోలేకపోయింది. ఈ చిత్రంలో మలయాళ స్టార్ మమ్ముట్టి కీలక పాత్రలో కనిపించారు. తాజాగా ఈ చిత్రం రిజల్ట్పై అఖిల్ స్పందించారు. తన ఫ్యాన్స్, ఏజెంట్ మూవీ నటీనటులను ఉద్దేశిస్తూ ఆయన ట్వీట్ చేశారు. అఖిల్ తన ట్వీట్లో రాస్తూ.. 'ఏజెంట్ సినిమాకి ప్రాణం పోయడం కోసం తమ జీవితాలను అంకితం చేసిన నటీనటులు, సిబ్బందికి నేను హృదయపూర్వక ధన్యవాదాలు. మేము మా స్థాయిలో ఉత్తమంగా ప్రయత్నించాం. కానీ దురదృష్టవశాత్తూ ఈ చిత్రం తెరపై మేము కోరుకున్న విధంగా మెప్పించలేదు. మేము మీ కోసం మంచి చిత్రాన్ని అందించలేకపోయాము. నాకు పెద్ద సపోర్ట్గా నిలిచిన నిర్మాత అనిల్కు ప్రత్యేక ధన్యవాదాలు. మా సినిమాపై నమ్మకం ఉంచిన డిస్ట్రిబ్యూటర్లందరికీ.. మాకు ఎంతో సపోర్ట్ చేసిన మీడియాకు ధన్యవాదాలు. నేను పని చేయడానికి కారణం మీరిచ్చే ప్రేమ, శక్తి . నన్ను నమ్మిన వారి కోసం బలంగా తిరిగి వస్తా.' అంటూ నోట్ విడుదల చేశారు. pic.twitter.com/MxG9cT5c19 — Akhil Akkineni (@AkhilAkkineni8) May 15, 2023 -
మరో తెలుగు సినిమాలో ఛాన్స్ కొట్టేసిన జాన్వీ కపూర్!
బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ ఇప్పటికే తెలుగులో ఎన్టీఆర్ సరసన ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాతో జాన్వీకపూర్ టాలీవుడ్కి పరిచయం కానుంది. ఈ మూవీ సెట్స్పై ఉండగానే ఈ అందాల తార ఇప్పుడు తెలుగులో మరో అవకాశాన్ని దక్కించుకుంది. అఖిల్ అక్కినేని లేటెస్ట్ మూవీలో జాన్వీని ఫైనల్ చేసినట్లు టాక్ వినిపిస్తుంది. యూవీ క్రియేషన్స్ అఖిల్తో ఓ భారీ బడ్జెట్ సినిమాను రూపొందిస్తున్నారు. ఈ చిత్రానికి ధీర అనే టైటిల్ పరిశీలనలో ఉంది. ఈ సినిమాలో హీరోయిన్గా జాన్వీ కపూర్ దాదాపుగా ఫిక్స్ అయ్యిందట. త్వరలోనే దీనికి సంబంధించి అఫీషియల్ అనౌన్స్మెంట్ రానున్నట్లు తెలుస్తుంది. ఇక రామ్చరణ్తో బుచ్చిబాబు తెరకెక్కిస్తున్న సినిమాలోనూ హీరోయిన్గా జాన్వీని ఫైనల్ చేసినట్లు సమాచారం. ఈ లెక్కన NTR30 రిలీజ్ అనంతరం ఈ భామకు తెలుగులో మరిన్ని అవకాశాలు వస్తాయనడంలో ఏమాత్రం సందేహం లేదనే టాక్ ఇండస్ట్రీలో జోరుగా వినిపిస్తుంది. -
ఫ్యాంటసీ బ్యాక్డ్రాప్లో అఖిల్ కొత్త సినిమా.. టైటిల్ ఇదే!
కేరీర్లో సాలిడ్ హిట్ కోసం ట్రై చేస్తున్న అఖిల్ అక్కినేనికి ప్రతిసారి నిరాశే మిలుగుతుంది. భారీ అంచాలు పెట్టుకున్న ‘ఏజెంట్’ ఇటీవల విడుదలై భారీ పరాజయాన్ని మూటగట్టుకుంది. ఈ సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో సత్తా చాటాలనుకున్నాడు అఖిల్. కానీ ఆయన ప్రయత్నం ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. అఖిల్ కెరీర్లోనే భారీ డిజాస్టర్ మూవీగా ఏజెంట్ నిలిచింది. (చదవండి: ‘తొలిప్రేమ’ తర్వాత అవకాశాలు వచ్చినా కాదనుకున్నాను: వాసుకి) అయితే సినిమా ఫలితాన్ని పట్టించుకోకుండా.. తన తర్వాత చిత్రంపై ఫోకస్ పెట్టాడు ఈ అక్కినేని హీరో. ‘సాహో’ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్గా చేసిన అనిల్ కుమార్ ఇటీవల అఖిల్కు ఓ కథ వినిపించారట. అది తనకు బాగా నచ్చడంతో వెంటనే ఓకే చెప్పాడట. ఫ్యాంటసీ బ్యాక్డ్రాప్లోని ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ నిర్మించనుందని టాక్. (చదవండి: చైతూ నా దగ్గర ఆ ప్రామిస్ తీసుకున్నాడు: వెంకట్ ప్రభు ) అంతేకాదు ఈ చిత్రానికి ‘ధీర’ అనే టైటిల్ పరిశీలనలో ఉన్నట్లు ఫిల్మ్నగర్లో ప్రచారం జరుగుతోంది. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుందట. మరి ఈ చిత్రంతోనైనా అఖిల్ సాలిడ్ హిట్ కొడతాడో లేదో చూడాలి. -
అక్కినేని కుటుంబాన్ని వెంటాడుతున్న ఫ్లాపులు.. స్పందించిన చై!
అక్కినేని ఫ్యామిలీకి బ్యాడ్ టైం నడుస్తోంది. ఇటీవలి కాలంలో వారు నటించిన సినిమాలేవీ విజయం సాధించలేదు. నాగార్జున మొదలు నాగ చైతన్య, అఖిల్ నటించిన సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. సక్సెస్ పదం విని చాలాకాలమే అయింది. గతేడాది నాగార్జున, చైతన్య కలిసి నటించిన బంగార్రాజు చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత నాగార్జున నటించిన 'ది ఘోస్ట్', చైతన్య 'థాంక్యూ', అఖిల్ 'ఏజెంట్'.. సినిమాలన్నీ చతికిలపడ్డాయి. ఈ క్రమంలో అక్కినేని ఫ్యాన్స్ అంతా ఓ సాలిడ్ హిట్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఈ తరుణంలో కస్టడీ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచేందుకు సిద్ధమయ్యాడు నాగచైతన్య. మే 12న కస్టడీ థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా ఓ సమావేశంలో చైతూకు ఆసక్తికర ప్రశ్న ఎదురైంది. 'అక్కినేని అభిమానులు ఏడాదికాలంగా స్ట్రాంగ్ కమ్బ్యాంక్ కోసం ఎదురుచూస్తున్నారు. అన్నీ నిరాశాజనకమైన ఫలితాలే వస్తున్నాయి. అభిమానులకు ఏం చెప్పదలుచుకున్నారు?' అని ఓ పాత్రికేయుడు చైను ప్రశ్నించాడు. దీనికి యువసామ్రాట్ స్పందిస్తూ.. 'అభిమానులకు మేము ఎప్పుడూ సక్సెస్నే ఇవ్వాలనుకుంటాం. వారు మాపై ఎంతో ప్రేమాభిమానాలను చూపిస్తారు. ఎల్లప్పుడూ మద్దతుగా నిలబడతారు. వారికి మేము బహుమతిగా మంచి సినిమాను మాత్రమే ఇవ్వగలం. మా కుటుంబం నుంచి వచ్చిన గత కొన్ని సినిమాలు వర్కవుట్ అవలేదు. అనుకున్న ఫలితాలు రాలేదు. ఈ కెరీర్లో ఎత్తుపల్లాలు సహజమే! అందరూ దాన్ని అంగీకరించక తప్పదు. త్వరలోనే ఈ బ్యాడ్టైం ముగిసిపోతుంది. మళ్లీ మేము హిట్ ట్రాక్ ఎక్కుతాం. కస్టడీతోనే అది ప్రారంభమవుతుంది. నాకు ఆ నమ్మకముంది' అని చెప్పుకొచ్చాడు నాగ చైతన్య. చదవండి: టార్చర్, రోజూ నన్ను కొట్టి హింసించేవాడు: నటి సర్జరీ వికటించడంతో డిప్రెషన్లోకి వెళ్లిపోయా: ప్రియాంక చోప్రా -
మా నాన్న స్టోరీ వినలేదు.. నాన్న కథ విన్నారు
-
ఇప్పటికే డైరెక్టర్ ని వెనకేసుకొస్తున్న ఏజెంట్ ప్రొడ్యూసర్
-
'ఏజెంట్ ఫ్లాప్'..డిప్రెషన్లోకి అఖిల్? ఒంటరిగా దుబాయ్కి..
అక్కినేని అఖిల్ నటించిన తాజా చిత్రం ఏజెంట్. సురేందర్ రెడ్డి డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద దారుణంగా బోల్తాకొట్టింది. స్పై యాక్షన్ మూవీగా తెరకెక్కిన ఈ చిత్రం ఆశించనంతగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఫలితంగా తొలిరోజు నుంచే నెగిటివ్ టాక్తో డిజాస్టర్ అనిపించుకుంది. అఖిల్ కెరీర్లో మరో ఫ్లాప్ వచ్చి చేరింది. ఏజెంట్ సినిమా కోసం అఖిల్ సుమారు రెండేళ్లు కష్టపడ్డాడు. జిమ్లో గంటల కొద్దీ శ్రమించి లుక్ మొత్తం మార్చుకున్నాడు. ఈ సినిమాతో సాలిడ్ హిట్ వస్తుందనుకుంటే ఊహించని విధంగా దెబ్బ పడింది. చదవండి: అభిమానిని తోసేసిన షారూక్ ఖాన్.. మండిపడుతున్న నెటిజన్స్ దీనికి తోడు సోషల్ మీడియాలోనూ విమర్శలు, ట్రోలింగ్తో అఖిల్ కాస్త డిప్రెషన్కు వెళ్లినట్లు తెలుస్తుంది. దీంతో దాన్నుంచి బయటపడేందుకు సింగిల్గా దుబాయ్కు వెకేషన్కు వెళ్లిపోయాడు. తాజాగా దీనికి సంబంధించిన ఫోటో నెట్టింట వైరల్ అవుతుంది. చదవండి: VD12: రౌడీ హీరోతో శ్రీలీల.. ఘనంగా సినిమా ప్రారంభం