-
ఆ ప్రశ్న అడగడంతో ఐష్కు కోపమొచ్చింది!
ఐశ్వర్య రాయ్.. అప్పట్లో సినిమా ఇండస్ట్రీనే షేక్ చేసింది. ఈ మధ్య సినిమాలకు దూరంగా ఉంటున్న ఈ ముద్దుగుమ్మ పొన్నియన్ సెల్వన్ 1, 2 చిత్రాల్లో మాత్రం తళుక్కుమని మెరిసి ఫ్యాన్స్ను ఖుషీ చేసింది. కెరీర్ తారాస్థాయిలో ఉన్న సమయంలో ఇంగ్లీష్లోనూ సినిమాలు చేసింది. ఇటు బాలీవుడ్, అటు హాలీవుడ్ను ఏకకాలంలో హ్యాండిల్ చేసింది. అయితే ఐష్.. హాలీవుడ్కు షిఫ్ట్ కానుందంటూ కొన్నేళ్ల క్రితం ఓ వార్త వైరల్గా మారింది. దీని గురించి హీరోయిన్ను ప్రశ్నించగా ఆమె మండిపడింది. ఏమంటున్నారు? నేనలా చెప్పానా? ఏ ఇంటర్వ్యూలో అన్నానో చెప్పండి. ముందు ఆ వీడియో చూపించిన తర్వాతే మాట్లాడదాం.. అని ఫైర్ అయింది.మీరు ప్రశ్నలు అడగండి.. కాదనను.. కానీ ఆల్రెడీ నేను ఏదో చెప్పేసినట్లు స్టేట్మెంట్లు ఇవ్వొద్దు. తమిళ, బెంగాలీ, హిందీ ఇండస్ట్రీలో సినిమాలు చేస్తున్నాను. అలాగే ఇంగ్లీష్ చిత్రాల్లోనూ వర్క్ చేస్తున్నాను. అక్కడ పని చేస్తున్నాను కదా అని హాలీవుడ్కు వెళ్లిపోతాననుకోవడం కరెక్ట్ కాదు అని ఆగ్రహించింది. ఐశ్వర్య గతంలో చేసిన కామెంట్లు ప్రస్తుతం మరోసారి వైరలవుతున్నాయి.చదవండి: పెళ్లి తర్వాత ప్రేమ ఉండదు.. భార్యతో సంతోషం కూడా..: నటుడు -
కజ్రారే సాంగ్.. లైవ్లో డ్యాన్స్ మర్చిపోలేనన్న అమితాబ్..
కొన్ని పాటలు ఎవర్గ్రీన్.. ఎప్పుడు విన్నా ఎక్కడలేని ఉత్తేజం వస్తుంది. అలాంటి పాటే కజ్రారే.. కజ్రారే..! 2005లో వచ్చిన బంటీ ఔర్ బబ్లీ మూవీలోని సూపర్ హిట్ సాంగ్ ఇది. అప్పట్లో ఈ సాంగ్ ఓ రేంజ్లో మార్మోగిపోయింది. అందులో అమితాబ్ బచ్చన్తో పాటు ఆయన కుమారుడు అభిషేక్ బచ్చన్, కోడలు ఐశ్వర్య రాయ్ నటించారు. అయితే ఈ పాట రిలీజయ్యే సమయానికి వారికింకా పెళ్లి కాలేదు.. అది వేరే విషయం!ఎంతో పాపులర్..బంటీ ఔర్ బబ్లీ సినిమా రిలీజై 19 ఏళ్లు అయిన సందర్భంగా బిగ్బీ ఆనాటి జ్ఞాపకాలను నెమరేసుకున్నాడు. ఓ అభిమాని కజ్రారే సాంగ్ ఫోటోను షేర్ చేయగా దానిపై అమితాబ్ స్పందిస్తూ.. ఆ పాట ఎంత పాపులర్ అయిందో! ఇప్పటికీ ఆ సాంగ్ అందరినీ ఆకట్టుకుంటూనే ఉంది. మర్చిపోలేని విషయం ఏంటంటే.. భయ్యూ(అభిషేక్)తో కలిసి స్టేజీపై ఈ పాటకు లైవ్లో డ్యాన్స్ చేశాను అంటూ నవ్వుతున్న ఎమోజీలను జత చేశాడు. ఐశ్వర్య పేరు ప్రస్తావించాల్సింది!కాగా 2006 జరిగిన ఫిలింఫేర్ అవార్డుల కార్యక్రమంలో అమితాబ్, అభిషేక్తో పాటు ఐశ్వర్య రాయ్.. స్టేజీపై కజ్రారే పాటకు డ్యాన్స్ చేశారు. ఆ సందర్భాన్ని గుర్తు చేసుకున్న బిగ్బీ.. ఐశ్వర్య పేరు కూడా ప్రస్తావించి ఉంటే బాగుండేది అని పలువురు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. అసలు మీరు, మీ కుమారుడు ఈ పాటకు అవసరం కూడా లేదు. ఐశ్వర్య లేకపోతే ఎవరూ చూసేవారు కూడా కాదు, అలాంటిది తననే మర్చిపోయారా? అని విమర్శిస్తున్నారు. సీక్వెల్..బంటీ ఔర్ బబ్లీ విషయానికి వస్తే యశ్ రాజ్ ఫిలింస్ నిర్మించిన ఈ సినిమాలో అభిషేక్ హీరోగా రాణి ముఖర్జీ హీరోయిన్గా నటించింది. బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్గా నిలిచిన ఈ చిత్రానికి 2022లో సీక్వెల్ కూడా వచ్చింది. ఇందులో అభిషేక్కు బదులుగా సైఫ్ అలీ ఖాన్ నటించాడు. అలాగే రాణీ ముఖర్జీ, సిద్దాంత్ చతుర్వేది, శర్వారి వాఘ్, పంకజ్ త్రిపాఠి కీలక పాత్రలు పోషించారు. అయితే ఈ చిత్రం అనుకున్నంత సక్సెస్ కాలేకపోయింది. the song became so popular that it still regenerates attention and love .. and the best moments with the song, Bhaiyu, were when we performed this live on stage .. 🙏🤣🤣 https://t.co/vKuMM7ipIN— Amitabh Bachchan (@SrBachchan) May 27, 2024 చదవండి: ఓటీటీలో మలయాళ హిట్ సినిమా.. తెలుగులో స్ట్రీమింగ్ -
కేన్స్లో మెరిసిన ఐశ్వర్య.. ఫొటోస్ వైరల్! (ఫొటోలు)
-
చేతికట్టు తొలగించి కేన్స్లో మెరిసిన ఐశ్వర్య రాయ్
ఫ్రాన్స్లో 77వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ అట్టహాసంగా కొనసాగుతోంది. ఈ సందర్భంగా సినీ తారలు, సెలిబ్రిటీస్ సరికొత్త డిజైనర్ దుస్తుల్లో రెడ్ కార్పెట్పై మెరిశారు. కేన్స్లో ఎంతమంది కనిపించినా సరే.. అందరి చూపులు ఐశ్వర్య రాయ్ మీదే ఉంటాయి. ఈ క్రమంలో ఆమె చేతికి గాయం ఉండటంతో ఫ్యాన్స్ షాకయ్యారు. అయినా సరే గాయంతోనే ఈ వేడుకకు తన కుమార్తెతో ఐశ్వర్య వెళ్లారు. కానీ, రెడ్ కార్పెట్పై ఆమె ఎలా కనిపించనున్నారో అని లక్షలాది మంది అభిమానులు ఎదురుచూశారు. ఏది ఏమైనా నెటిజన్లు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న తరుణం రానే వచ్చింది. 2024 కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో పాల్గొన్న ఐశ్వర్యరాయ్ బచ్చన్ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి.కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్కు ఐశ్వర్య తన గ్లామర్ను జోడించింది. డిఫరెంట్ ఫ్యాషన్ సెన్స్తో ప్రేక్షకులను మెస్మరైజ్ చేయడంలో ఆమె మరొసారి సక్సెస్ అయ్యారు. ఐశ్వర్యను చూసేందుకు భారీ సంఖ్యలో అభిమానులు చేరుకున్నారు. 77వ ఫిల్మ్ ఫెస్టివల్లో బ్లాక్, వైట్, గోల్డెన్ కాంబినేషన్లో ఉండే గౌనులో ఐశ్వర్య కనిపించారు. ప్రముఖ డిజైనర్ 'ఫల్గుణి షేన్ పీకాక్' వారు డిజైన్ చేసిన డ్రెస్ను ఆమె ధరించారు. గాయం వల్ల తన కుడి చేతికి ఆర్మ్ స్లింగ్ ధరించి కనిపించిన ఐశ్వర్య ప్రస్తుతానికి తొలగించింది. కానీ, ఆదే చేతికి తెల్లని కట్టు కనిపిస్తుంది. వాస్తవంగా ఆమె చేతిక తీవ్రమైన గాయమే అయినట్లు తెలుస్తోంది. కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో గత 20 ఏళ్ల నుంచి ఆమె పాల్గొంటుంది. అందుకే ఆమె ఈసారి కూడా అక్కడ అడుగుపెట్టింది. దీంతో చాలా మంది అభిమానులు ఐశ్వర్యను ప్రశంసిస్తున్నారు. ఆమెలో ఉన్న డెడికేషన్కు చాలామంది ఫిదా అవుతున్నారు.Breathtaking Beauty ✨ Her Walk 🔥#AishwaryaRai #AishwaryaRaiBachchan #AishwaryaAtCannes #Cannes2024 #CannesQueenAishwarya #Cannes pic.twitter.com/KxgxW1GyQs— Aishwarya Rai Fan (@Ram_TamilNadu_) May 16, 2024 -
ఐశ్వర్యారాయ్ టోట్ బ్యాగ్ ధర తెలిస్తే నోరెళ్లబెడతారు!
బాలీవుడ్ నటి ఐశ్వరరాయ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. విశ్వసుందరి ఐశ్వర్యరాయ్ తల్లి అయ్యాక కూడా ఆమె అదే గ్లామర్ని మెయింటెయిన్ చేస్తూ యువ హీరోయిన్లకు తీసిపోని విధంగా ఉంటుంది. ఆమె కూతురు ఆరాధ్య కూడా తల్లి అందాన్ని పుణికి పుచ్చుకున్నట్లు ఆకర్షణీయంగా ఉంటుంది. స్టైయిలిష్ దుస్తులతో కెమెరాకి చిక్కి అభిమానులను ఖుషీ చేస్తుంటుంది. ఇటీవల్ల ఏ వేడుకలోనైన ఈ క్యూట్ మామ్ అండ్ డాటర్స్ ఇద్దరు కలిసే సందడి చేస్తున్నారు. ఫ్రాన్స్ వేదికగా ప్రతిష్టాత్మక కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ అట్టహాసంగా ప్రారంభమైంది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ఉన్న పలువురు సెలబ్రిటీలు ఈ ఈవెంట్కు హాజరై సందడి చేస్తున్నారు. ఆ వేడుకలో పాల్గొనేందుకు బయలు దేరుతూ మంబై ఎయిర్పోర్ట్లో ఇలా కెమెరాకు చిక్కారు తల్లికూతుళ్ల ద్వయం. అయితే ఆమె చేతికి బ్యాండేజ్ వేసుకుని కనిపించడంతో ఆమెకు ఏమైందని అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఇక కూతురు ఆరాధ్య తల్లి చేతికి గాయం అయ్యిందని ఆమె టోట్ బ్యాగ్ని తాను తీసుకుని అమ్మకు కాస్త ఉపశమనం కలిగించింది. తల్లి కూతుళ్లు ఇద్దరు మంచి స్టయిలిష్ డ్రెస్లతో స్టన్నింగ్ లుక్లో కనిపించారు. ఐశ్వర్య ఫ్యాంటుపై లూయిస్ విట్టన్ ట్రెంట్ కోట్లో అబ్బరపర్చగా, ఆరాధ్య నల్లటి ఫ్యాంటుపై తెలుపు స్పీకర్లతో కూడిన స్వెట్షర్ట్లో ఉంది. ఇక్కడ ఐశ్వర్య గూచీ బ్లాక్ లెదర్ టోట్ బ్యాగ్ ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఈ బ్రాండ్ బ్యాగ్ ధరలు అత్యంత ఖరీదైనవి. ఇక్కడ ఐశ్వర్యరాయ్ బ్యాగ్ టోట్ ధర ఏకంగా రూ. 80, 000/ పలుకుతుందట. ఈ కేన్స్ ఈవెంట్లో ఎప్పుడూ స్పెషల్ అట్రాక్షన్గా ఐశ్వర్య రాయ్ నిలుస్తుంటుంది. ఆమెను భారతదేశంలోని కేన్స్ రాణి అని చెప్పొచ్చు. అంతేగాదు ఆమె అభిమానులు 2024 కేన్స్లో ఐశ్వర్యరాయ్ లుక్ ఎలా ఉంటుందా అని ఆత్రతగా ఎదురుచూస్తున్నారు. View this post on Instagram A post shared by Varinder Chawla (@varindertchawla) (చదవండి: మిస్ యూఎస్ఏ విజేతల వరుస రాజీనామాలు! రీజన్ ఏంటో చెప్పిన తల్లులు) -
గాయపడిన ఐశ్వర్య రాయ్.. అయినా అక్కడికి ప్రయాణం
ప్రతి సంవత్సరం కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్కు కొత్త కళ తెచ్చేది బాలీవుడ్ హీరోయిన్ ఐశ్వర్య రాయ్. ఫ్రాన్స్లో 77వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ అట్టహాసంగా ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈనెల 25 వరకు కొనసాగుతున్న ఈ వేడుకులలో భారత్ తరపున పాల్గొనేందుకు తాజాగా ఐశ్వర్య తన కుమార్తె ఆరాధ్య బచ్చన్తో కలిసి కేన్స్కు ప్రయాణం అయ్యారు. ఈ క్రమంలో విమానాశ్రయంలో ఆమె కనిపించారు. కానీ, తన కుడి చేతికి ఆర్మ్ స్లింగ్ ధరించి ఉండటంతో చాలా మంది అభిమానులను ఆందోళనకు గురి చేసింది. ఆమె చేతికి తీవ్రమైన గాయం అయినట్లు తెలుస్తోంది. ఐశ్వర్యకు ఏమైందోనని అభిమానులు ఆందోళన చెందుతున్నారు.ఆమె గాయం గురించి పలువురు నెటిజన్లు స్పందిస్తూ.. ఆందోళన వ్యక్తం చేశారు. ఒక అభిమాని ఇలా అన్నాడు, 'OMG ఆమె గాయపడిన చేతులతో కేన్స్లో ఎలా నడుస్తుంది. కేన్స్ రెడ్ కార్పెట్పై ఐశ్వర్య నడుస్తూ ఉంటే ఆ కార్యక్రమానికే అందం వస్తుంది. కానీ, ఈసారి ఆ రెడ్ కార్పెట్పై ఆమె నడవగలదా అంటూ వారు సందేహం వ్యక్తం చేస్తున్నారు. కేన్స్లో ఆమె లుక్ కోసం ఎదురు చూస్తున్నామని మరొకరు తెలిపారు. ఐశ్వర్య చేతికి అయిన గాయానాకి గల కారణాలు మాత్రం తెలియలేదు.ఐశ్వర్య రాయ్ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ 2002లో తొలిసారి మెరిసింది. ఆ సమయంలో భారీ బంగారు ఆభరణాలతో నీతా లుల్లా డిజైన్ చేసిన చీరలో రెడ్ కార్పెట్ మీద మొదటిసారి కనిపించింది. అదె సంవత్సరంలో ఆమె నటించిన దేవదాస్ సినిమా ఆ ఫెస్టివల్లో ప్రదర్శించబడింది. షారూఖ్ ఖాన్, దర్శకుడు సంజయ్ లీలా బన్సాలీతో ఆమె కేన్స్లో పాల్గొంది. అప్పటి నుంచి దాదాపు ప్రతి సంవత్సరం ఈ అంతర్జాతీయ కార్యక్రమంలో ఆమె రెడ్ కార్పెట్పై తన అందంతో కట్టిపడేస్తుంది.ఐశ్వర్యతో పాటు అదితి రావు హైదరీ, శోబితా ధూళిపాళ, కియారా అద్వానీ కూడా కేన్స్లో కనిపించనున్నారు. ఊర్వశి రౌతేలా ఇప్పటికే కేన్స్లో పింక్ లుక్లో కనిపించింది. View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) -
ఐశ్వర్య కూతురేనా? గుర్తుపట్టలేకుండా ఉందే..
అందాల తార ఐశ్వర్యరాయ్- బాలీవుడ్ స్టార్ అభిషేక్ బచ్చన్ దంపతుల గారాలపట్టి.. ఆరాధ్య. ఐశ్వర్య ఎక్కడికి వెళ్లినా ఆమెతో పాటే వెళ్తుంది ఆరాధ్య. అటు ఐష్ కూడా కూతురి స్కూల్ ఈవెంట్స్కు తప్పక హాజరువుతుంది. ఇక అనంత్ అంబానీ ప్రీవెడ్డింగ్ సెలబ్రేషన్స్కు బాలీవుడ్ తారలు హాజరైన సంగతి తెలిసిందే! అందులో బచ్చన్ ఫ్యామిలీ కూడా ఉంది. అభిషేక్, ఐష్, ఆరాధ్య ఈ సెలబ్రేషన్స్ను తెగ ఎంజాయ్ చేశారు. గెటప్ మార్చింది.. అయితే ఎప్పుడు చూసినా నుదుటిపై జుట్టు ఉండేలా హెయిర్కట్ చేసుకునే ఆరాధ్య ఈసారి మాత్రం లుక్కు మార్చింది. నుదుటన పాపిట తీసి హెయిర్ లీవ్ చేసుకుంది. ఇందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్గా మారాయి. ఆరాధ్య గెటప్ చూసి జనాలు ఆశ్చర్యపోతున్నారు. 'ఆ నుదుటి మీద కురులు(బ్యాంగ్స్) లేకపోతే ఆరాధ్య ఎంత బాగుందో.. ఈ పిల్ల అచ్చం ఆమె అమ్మలాగే ఉంది.' అచ్చం తల్లిలాగే.. 'యవ్వనంలో ఐశ్వర్య ఎలా ఉండేదో.. సేమ్ టు సేమ్.. అలాగే ఉంది. ఇంత క్యూట్గా ఉన్న పాప ఎందుకని అలా బ్యాంగ్స్తో తన ముఖాన్ని దాచుకుందో..', 'ఏంటి ? ఈమె ఆరాధ్యనా? నిజంగా గుర్తుపట్టలేకున్నాం. తన కొత్త హెయిర్స్టైల్ చాలా బాగుంది. ఎంతో ఎదిగిపోయినట్లుగా కనిపిస్తోంది' అని కామెంట్లు చేస్తున్నారు. అభిషేక్ బచ్చన్, ఐశ్వర్య రాయ్ 2007లో వివాహం చేసుకున్నారు. వీరికి 2011 నవంబర్ 16న ఆరాధ్య జన్మించింది. Look at my two girls 😍 they look so beautiful 😻 #AishwaryaRaiBachchan #AishwaryaRai pic.twitter.com/hDE73iuXzQ — AISHWARYA RAI 💙 (@my_aishwarya) March 3, 2024 The family ❤️. Beautiful #AishwaryaRai with Aradhya pic.twitter.com/h4O8HWs4TE — अपना Bollywood🎥 (@Apna_Bollywood) March 4, 2024 చదవండి: తెలుగు సినిమాల్లో కనిపించట్లే.. అవకాశాలు రావడం లేదా? -
ఐశ్వర్యను ప్లాస్టిక్ అనేసిన హీరో.. దాని పరిణామాలు దారుణంగా..
ఒక్కసారి నోరు జారితే అంతే సంగతులు.. సరదాగా అన్నా, సీరియస్గా అన్నా ఆ మాటలను వెనక్కు తీసుకోలేరు. కొన్నిసార్లు అనుకోకుండా మాట్లాడే పదాలే పెద్ద తలనొప్పిగా మారుతుంటాయి. బాలీవుడ్ రొమాంటిక్ హీరో ఇమ్రాన్ హష్మీకి ఇలాగే జరిగింది. 2014లో ఇతడు కాఫీ విత్ కరణ్ షోకి వెళ్లాడు. అక్కడ ర్యాపిడ్ ఫైర్ సెషన్లో భాగంగా యాంకర్ ప్లాస్టిక్ అన్న పదం ప్రస్తావించగానే ఇమ్రాన్ ఐశ్వర్యరాయ్ పేరు చెప్పాడు. అందరూ షాక్ ఇంకేముంది.. ఐశ్వర్య అభిమానులకు చిర్రెత్తుకొచ్చింది. మా హీరోయిన్ నీ కంటికి ప్లాస్టిక్లా కనిపిస్తోందా? అని చెడుగుడు ఆడుకున్నారు. నిజానికి తను ఐశ్వర్య పేరు చెప్పగానే లొకేషన్లో ఉన్నవారంతా షాకయ్యారట! ఈ ఆన్సర్ ఉంచుదామా? తీసేద్దామా? అని అడిగితే సెట్లో ఉన్నవాళ్లు అలాగే ఉండనీయమని చెప్పారని అప్పటి సంగతులను గుర్తు చేసుకున్నాడు ఇమ్రాన్. దాని వల్ల ఎదురైన పరిణామాలను(ట్రోలింగ్ను) చాలాకాలం పాటు భరించాల్సి వచ్చిందన్నాడు. అదొక గేమ్.. తప్పుగా అనుకోవద్దు ఈ విషయం గురించి గతంలోనూ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. 'నేను ఐశ్వర్యరాయ్కు పెద్ద అభిమానిని. నేను తప్పు ఉద్దేశంతో అనలేదు. నేను ఆమెను ఎంతగానో అభిమానిస్తాను. షోలో యాంకర్ ఒక వస్తువు పేరు చెప్పగానే నన్ను ఎవరో ఒక సెలబ్రిటీల పేర్లు చెప్పమన్నారు. అందుకే ఆమె పేరు చెప్పానే తప్పితే అంతకు మించి ఏ ఉద్దేశమూ లేదు. దీన్ని అనవసంగా తప్పుడు ప్రచారం చేస్తున్నారు' అని వివరణ ఇచ్చాడు ఇమ్రాన్ హష్మీ. చదవండి: దేవిశ్రీప్రసాద్ ఇంట పండగ వాతావరణం.. తండ్రయిన సింగర్ సాగర్ -
ఐశ్వర్యరాయ్పై రాహుల్ కామెంట్స్.. సిద్దరామయ్యకు బీజేపీ కౌంటర్
ఢిల్లీ: అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవం, సినీ నటి ఐశ్వర్యరాయ్పై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ తీరుపై బీజేపీ నేతలు, ప్రముఖ సింగర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే సమయంలో రాహుల్కు కౌంటర్ కూడా ఇచ్చారు. కాగా, భారత్ జోడో న్యాయ్ యాత్రలో భాగంగా ప్రసంగించిన రాహుల్ గాంధీ అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవంపై మాట్లాడారు. ఈ సందర్భంగా రాహుల్.. దేశాన్ని నడిపించే వ్యక్తులను అయోధ్య ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి దూరంగా ఉంచారని విమర్శలు చేశారు. అదే సమయంలో బాలీవుడ్ సెలబ్రిటీలు అయిన అమితాబ్ బచ్చన్, ఐశ్వర్యరాయ్ బచ్చన్లను అయోధ్యకు ఆహ్వానించారని మండిపడ్డారు. ఈ క్రమంలోనే మీరు రామ మందిర ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం చూశారా. అందులో ఒక్కరైనా ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ ముఖాలను చూశారా. కానీ ఈ కార్యక్రమానికి అమితాబ్ బచ్చన్, ఐశ్వర్య బచ్చన్, ప్రధాని నరేంద్ర మోదీ హాజరయ్యారు. కానీ దేశాన్ని నిజంగా నడిపించే వ్యక్తులను మనం అంత గొప్ప కార్యక్రమంలో చూడలేదు. వాళ్లు దేశాన్ని ఎప్పటికీ నియంత్రించలేరని గుర్తుంచుకోవాలి. కనీసం రాష్ట్రపతి కూడా లేకపోవడం ఆయా వర్గాలను అవమానించడమేనని తేల్చి చెప్పారు. పారిశ్రామికవేత్తలు, అమితాబచ్చన్ను ఆహ్వానించడం ద్వారా జనాభాలో మిగతా 73 శాతం మందికి ప్రాముఖ్యత లేదని చెప్పినట్టేనని మండిపడ్డారు. దీంతో, రాహుల్ కామెంట్స్ వివాదాస్పదంగా మారాయి. Congress Clown Prince @RahulGandhi now has a dangerous & creepy obsession with successful & self-made women. Frustrated by constant rejections by Indians, Rahul Gandhi has sunk to a new low of demeaning India's Pride Aishwarya Rai. A fourth-generation dynast, with zero… pic.twitter.com/6TA442wWTZ — BJP Karnataka (@BJP4Karnataka) February 21, 2024 ఇక, రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై కర్ణాటక బీజేపీ, సింగర్ సోనా మహాపాత్ర స్పందిస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాహుల్ కామెంట్స్పై కర్ణాటక బీజేపీ స్పందిస్తూ.. దేశంలో కాంగ్రెస్ను ప్రజలు ఆదరించకపోవడంతో రాహుల్ మనోవేదనకు గురవుతున్నారు. ఈ క్రమంలో ఆయన ఏం మాట్లాడుతున్నాడో రాహుల్కే తెలియడం లేదు. రాహుల్ కన్నడిగులను అవమానించారని మండిపడింది. కన్నడ ఆత్మగౌరవం గురించి మాట్లాడే సీఎం సిద్దరామయ్య.. రాహుల్ వ్యాఖ్యలను ఖండిస్తారా? అని ప్రశ్నించింది. సాటి కన్నడ వ్యక్తి(ఐశ్వర్యరాయ్)ని రాహుల్ అవమానిస్తుంటే సీఎం సిద్దరామయ్యా చూస్తూ ఎలా ఊరుకుంటారని మండిపడింది. మహిళలను కూడా కించపరిచే స్థాయికి తిరగజారాడంటూ వ్యాఖ్యలు చేసింది. మరోవైపు.. రాహుల్ వ్యాఖ్యలపై సింగర్ సోనా ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఈ సందర్బంగా రాజకీయ నాయకులు(రాహుల్ గాంధీ) తమ స్వలాభం కోసం ప్రసంగాల్లో మహిళలను కించపరచడం ఏంటి? అని ప్రశ్నించారు. What’s with politicians demeaning women in their speeches to get some brownie points in a sexist landscape?Dear #RahulGandhi ,sure someone has demeaned your own mother, sister similarly in the past & irrespective you ought to know better? Also, #AishwaryaRai dances beautifully.🙏🏾 — Sona Mohapatra (@sonamohapatra) February 21, 2024 -
స్టార్ జంటపై విడాకుల రూమర్స్.. భర్తలాగే సింపుల్గా చెప్పేసింది!
బాలీవుడ్ మోస్ట్ ఫేమస్ జంటల్లో ఐశ్వర్యరాయ్- అభిషేక్ బచ్చన్ ఒకరు. ఈ మాజీ ప్రపంచసుందరి బాలీవుడ్ హీరోను పెళ్లాడింది. వీరిద్దరికీ ఆరాధ్య అనే కూతురు ఉంది. 2007లో ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జోడీపై ఇటీవల పెద్దఎత్తున రూమర్స్ వస్తున్నాయి. ఈ జంట విడాకులు తీసుకోబోతోందంటూ సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఎందుకంటే గతంలో ఐశ్వర్యరాయ్ తన కూతురితో కలిసి 50వ పుట్టినరోజు వేడుకను జరుపుకుంది. ఆ సమయంలో కేవలం ఆమె తన తల్లి, కుమార్తెతో మాత్రమే ఉన్నారు. అంతేకాకుండా ఆరోజు అత్తమామలు ఎవరూ కూడా శుభాకాంక్షలు తెలుపలేదు. అభిషేక్ కూడా చాలా సింపుల్గా రెండు ముక్కల్లో ఒక పోస్ట్ను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. అంతే కాకుండా ఎంతో ఇష్టంగా ఐశ్వర్య ఇచ్చిన ఉంగరాన్ని కూడా ప్రస్తుతం అభిషేక్ ధరించడం లేదని తెలిసింది. దీంతో ఈ జంట విడాకులు తీసుకుంటోందన్న వార్తలకు మరింత బలం చేకూరింది. అయితే వీటిపై ఇంతవరకు ఎవరూ స్పందించలేదు. ఈ వార్తలను ఖండించలేదు కూడా. అయినప్పటికీ సోషల్ మీడియాలో రూమర్స్ ఏమాత్రం ఆగడం లేదు. అయితే తాజాగా ఐశ్వర్యరాయ్ పెట్టిన పోస్ట్తో అలాంటి వాటికి చెక్ పెట్టినట్లు తెలుస్తోంది. అయితే బాలీవుడ్ హీరో, ఐశ్వర్యారాయ్ భర్త తన 48వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఈ విషయం తెలుసుకున్న ఫ్యాన్స్, సినీతారలు పలువురు ఆయనకు సోషల్ మీడియా వేదికగా విషెస్ చెబుతున్నారు. తమ అభిమాన హీరో బర్త్డే కావడంతో ఉదయం నుంచి బాలీవుడ్ ఫ్యాన్స్ నెట్టింట సందడి చేస్తున్నారు. ఈ సందర్భంగా ఐశ్వర్యరాయ్ తన భర్తకు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలిపింది. తన కూతురు, భర్తతో కలిసి ఉన్న ఫోటోను ఇన్స్టాలో పంచుకుంది. అంతే కాకుండా అభిషేక్ బచ్చన్ చిన్నప్పటి ఫోటోను షేర్ చేసింది. ఐశ్వర్యరాయ్ తన ఇన్స్టాలో రాస్తూ.. 'ఇదిగో మీకివే నా జన్మదిన శుభాకాంక్షలు. మీరు చాలా సంతోషం, ప్రేమ, ప్రశాంతత, శాంతి, ఆరోగ్యంతో ఉండాలని.. ఆ దేవుడు ఆశీర్వాదంతో ఎల్లప్పుడు మీరు ప్రకాశిస్తూ ఉండాలని కోరుకుంటున్నా' అంటూ క్యాప్షన్ ఇచ్చింది. అయితే గతంలో ఐశ్వర్యరాయ్ బర్త్ డే సందర్భంగా అభిషేక్ ఇలానే సింపుల్గా విషెస్ చెప్పారు. ఐశ్వర్య కూడా కాస్తా లేటైనా భర్తకు అదే తరహాలో విషెస్ చెబుతూ పోస్ట్ పెట్టింది. ఇది చూసిన అభిమానులు తమ అభిమాన హీరోకు హ్యాపీ బర్త్ డే అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కొందరేమో ఈ ఒక్క పోస్ట్తో విడాకుల రూమర్స్కు చెక్ పెట్టిందంటూ పోస్టులు పెడుతున్నారు. ఇక సినిమాల విషయాకొస్తే గతేడాది పొన్నియిన్ సెల్వన్ చిత్రాలతో ఐశ్వర్యరాయ్ మెప్పించింది. అభిషేక్ సైతం గతేడాది గూమర్ చిత్రంతో అలరించాడు. View this post on Instagram A post shared by AishwaryaRaiBachchan (@aishwaryaraibachchan_arb) -
ఆ స్టార్ కపుల్పై విడాకుల రూమర్స్.. ఆ పోస్టే కారణమా?
సినీ తారలపై రూమర్స్ ఎక్కువగా వింటుంటాం. ప్రస్తుతం సోషల్ మీడియా రోజుల్లో అవీ కాస్తా ఎక్కువగానే వస్తున్నాయనే చెప్పాలి. లవ్, బ్రేకప్, పెళ్లి, విడాకులు ఇలా రోజు వార్తలు వినిపిస్తూనే ఉంటాయి. బాలీవుడ్లో అయితే ఇలాంటివీ మరీ ఎక్కువే. గత కొద్ది రోజులుగా బాలీవుడ్ స్టార్ కపుల్ అభిషేక్ బచ్చన్, ఐశ్వర్య రాయ్ బచ్చన్పై విడాకులు తీసుకుంటున్నట్లు తెగ చర్చ నడుస్తోంది. ఇటీవల అభిషేక్ చేసిన పోస్ట్ ఈ వార్తలకు మరింత బలం చేకూర్చుతోంది. అభిషేక్ తన ఇన్స్టాలో రాస్తూ.. “విఫలమవుతుందనే భయం మీ కలలను నాశనం చేస్తుంది. ఫెయిల్యూర్ నుంచి నేర్చుకుంటే మీ కలలను నిర్మిస్తుంది' అంటూ పోస్ట్ చేశారు. దీంతో ఈ జంట విడాకులు తీసుకుంటున్నారా? అన్న చర్చ మరోసారి మొదలైంది. అయితే గతంలోనూ ఈ జంటపై చాలాసార్లు రూమర్స్ వచ్చాయి. (ఇది చదవండి: నాలుగేళ్లుగా డేటింగ్.. రహస్యంగా నిశ్చితార్థం?) విడాకుల రూమర్స్ అభిషేక్ బచ్చన్, ఐశ్వర్య రాయ్ బచ్చన్ వివాహాబంధంలోకి అడుగుపెట్టి 16 ఏళ్లు పూర్తయింది. ఈ జంటకు ఆరాధ్య అనే కుమార్తె కూడా ఉంది. ఇటీలస ఆరాధ్య స్కూల్ డే ఈవెంట్కు ఐశ్వర్య మాత్రమే హాజరైంది. దీంతో విడాకుల రూమర్స్ వచ్చాయి. ఆ తర్వా బిగ్ బితో కలిసి ప్రొ కబడ్డీ ఆటను చూసేందుకు కూడా రావడంతో రూమర్స్కు బ్రేక్ పడింది. అంతే కాకుండా ఓ ఈవెంట్లో అభిషేక్ బచ్చన్.. పెళ్లి ఉంగరం ధరించకుండా రావడంతో మరోసారి రూమర్స్ వైరలయ్యాయి. అయితే తాజాగా అభిషేక్ చేసిన పోస్ట్ వల్ల మరోసారి విడాకుల మ్యాటర్ తెరపైకి వచ్చింది. తన ఇన్ స్టాగ్రామ్ స్టోరీస్లో ఫెయిల్యూర్పై పోస్ట్ పెట్టడమేనని తెలుస్తోంది. ఈ పోస్ట్ ద్వారానే విడాకులకు హింట్ ఇచ్చారని నెటిజన్స్ భావిస్తున్నారు. అయితే ఈ వార్తలపై ఇంతవరకు అభిషేక్, ఐశ్వర్య ఎవరూ స్పందించలేదు. ఇక సినిమాల విషయానికొస్తే గతేడాది మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన పొన్నియన్ సెల్వన్ చిత్రంలో మెప్పించింది. మరోవైపు చిరంజీవి విశ్వంభరలో నటించనుందనే ప్రచారం కూడా జరుగుతోంది. కాగా.. అభిషేక్ బచ్చన్ సైతం ఇటీవలే గూమర్ చిత్రంతో నటించారు. ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేదు. -
ప్రపంచ సుందరి పోటీలకు వేదికగా భారత్
న్యూఢిల్లీ: భారత్ త్వరలో ఒక ప్రతిష్టాత్మక ఈవెంట్కు వేదిక అవనుంది. ఈ ఏడది జరిగే 71వ ప్రపంచ సుందరి పోటీలకు ఇండియా ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ మేరకు మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్ తన అధికారిక ఎక్స్(ట్విటర్)లో ఖాతాలో ఈ విషయాన్ని వెల్లడించింది. మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్ ఈ నిర్ణయంతో 28 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత మిస్ వరల్డ్ పోటీలకు భారత్ వేదికగా నిలవనుంది. చివరిసారిగా 1996లో బెంగళూరులో భారత్లో మిస్ వరల్డ్ పోటీలు నిర్వహించారు. Chairman of Miss World, Julia Morley CBE stated "Excitement fills the air as we proudly announce India as the host country for Miss World. A celebration of beauty, diversity, and empowerment awaits. Get ready for a spectacular journey! 🇮🇳 #MissWorldIndia #BeautyWithAPurpose — Miss World (@MissWorldLtd) January 19, 2024 ఫిబ్రవరి 18 నుంచి మార్చి 9 వరకు ఢిల్లీలోని భారత్ కన్వెన్షన్ సెంటర్, ముంబయిలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్లో మిస్ వరల్డ్ పోటీలు జరగనున్నాయి. మార్చి 9న నిర్వహించే మిస్ వరల్డ్ ఫైనల్ పోటీలను రాత్రి 7.30 గంటల నుంచి 10.30 గంటల వరకు ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించవచ్చు. కేవలం అందం మాత్రమే కాకుండా సేవా కార్యక్రమాల ద్వారా సమాజంలో సానుకూల మార్పును తీసుకొచ్చే సామర్థ్యం, తెలివితేటలు ఉన్నవారిని గుర్తించి సత్కరించడం దీని ముఖ్య ఉద్దేశం. గతంలో భారత్కు చెందిన ఐశ్వర్యరాయ్, ప్రియాంక చోప్రా, మానుషి చిల్లర్ తదితరులు మిస్ వరల్డ్గా ఎంపికయ్యారు. ఇదీచదవండి.. మోదీ భావోద్వేగం -
మణిరత్నం భారీ స్కెచ్.. మరో సూపర్ హిట్ ఖాయమేనా!
మల్టీ స్టార్ చిత్రాలకు కేరాఫ్గా అడ్రస్ దర్శకుడు మణిరత్నం. అదేవిధంగా క్రేజీ కాంబినేషన్ను సెట్ చేయడంలో ఈయన దిట్ట. చాలాకాలం క్రితమే రజనీకాంత్, మమ్ముట్టి, అరవింద్స్వామి హీరోలుగా దళపతి చిత్రాన్ని తెరకెక్కించి సూపర్హిట్ కొట్టారు. అదేవిధంగా ఆ మధ్య శింబు, అరుణ్విజయ్, అరవిందస్వామి, ప్రకాష్రాజ్వంటి స్టార్ నటులతో సెక్క సివంద వానన్ చిత్రాన్ని రూపొందించి సక్సెస్ సాధించారు. ఇటీవల విక్రమ్, జయంరవి, కార్తీ, విక్రమ్ ప్రభు, శరత్కుమార్, ప్రకాష్రాజ్, ఐశ్వర్యారాయ్, త్రిష, ఐశ్వర్య లక్ష్మి వంటి నటీనటులతో రెండు భాగాలుగా తెరకెక్కించిన పొన్నియిన్సెల్వన్ చిత్రాలు అనూహ్య విజయాలను సాధించాయి. తాజాగా మణిరత్నం మరో భారీ చిత్రానికి శ్రీకారం చుట్టారు. మణిరత్నం, కమలహాసన్ కాంబినేషన్లో గత 37 ఏళ్ల క్రితం నాయకన్ చిత్రం రూపొందించి ఘనవిజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. తాజాగా వీరి కాంబినేషన్లో థగ్స్ లైఫ్ అని భారీ గ్యాంగ్స్టర్స్ కథా చిత్రం రూపొందుతోంది. దీనికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు ఇప్పటికే మొదలయ్యాయి. ఈ చిత్రంలో జయంరవి, దుల్కర్ సల్మాన్, గౌతమ్ కార్తీక్ ముఖ్య పాత్రలు పోషించనున్నారు. ఇకపోతే నటి త్రిష ఇందులో హీరోయిన్గా నటించబోతున్నట్లు ప్రచారంలో ఉంది. కాగా నటి ఐశ్వర్యారాయ్ థగ్స్ లైఫ్లో నటించనున్నట్లు టాక్ వైరల్ అవుతోంది. తాజాగా ఈ వరుసలో ప్రముఖ మలయాళ నటి ఐశ్వర్య లక్ష్మీ పేరు వచ్చి చేరింది. ఈ విషయాన్ని నిర్మాతల వర్గం ఇటీవల అధికారికంగా వెల్లడించింది. ఈ ముగ్గురు పొన్నియిన్సెల్వన్ చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే. దీనికి మణిరత్నం ఆస్థాన సంగీత దర్శకుడు ఏఆర్ రెహ్మాన్ సంగీతాన్ని అందిస్తున్నారు. దీంతో ఇది మరో పొన్నియిన్ సెల్వన్ చిత్రం కానుందా? అనే చర్చ సినీ వర్గాల్లో జరుగుతోంది. ఈ చిత్రానికి సంబంధించిన కమలహాసన్ గెటప్, విడుదల చేసిన టీజర్ థగ్స్ లైఫ్ చిత్రంపై ఇప్పటి నుంచే అంచనాలను పెంచేస్తున్నాయి. -
విశ్వనటుడితో మాజీ ప్రపంచసుందరి.. ఆ క్రేజీ ప్రాజెక్ట్లోనే!
కోలీవుడ్ స్టార్ హీరో కమలహాసన్ గతేడాది కథానాయకుడిగా నటించి, నిర్మించిన విక్రమ్ చిత్రం సంచలన విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో ఇండియన్–2 చిత్రంలో ఆయన నటిస్తున్నారు. ఈ చిత్రం సమ్మర్ స్పెషల్గా తెరపైకి రావడానికి సిద్ధం అవుతోంది. అదేవిధంగా తెలుగులో ప్రభాస్ కథానాయకుడిగా నటిస్తున్న కల్కీ చిత్రంలో కమలహాసన్ ప్రధాన పాత్రను పోషిస్తున్నారు. ఆ తర్వాత మణిరత్నం దర్శకత్వంలో మరోసారి నటించడానికి రెడీ అవుతున్నారు. ఈ కాంబోలో తెరకెక్కనున్న భారీ చిత్రం ఈ నెలలోనే సెట్పైకి వెళ్లనున్నట్లు సమాచారం. దీనకి థగ్స్ లైఫ్ అనే టైటిల్ను కూడా ఖరారు చేసిన విషయం తెలిసిందే. అంతే కాకుండా ఈ చిత్రానికి సంబంధించిన ఒక వీడియోను ఇటీవల విడుదల చేయగా.. అందులో కమలహాసన్ తన శత్రువులతో తన పేరు రంగరాయ శక్తివేల్ నాయకన్. కాయల్ పట్టికారన్( కాయల్పట్టికి చెందిన వాడిని) అని చెప్పే డైలాగ్స్ థగ్స్ లైఫ్ చిత్రంపై అంచనాలు మరింత పెంచేశాయి. ఇదిలా ఉండగా.. ఈ చిత్రంలో త్రిష, కమలహాసన్కు జంటగా నటించబోతున్నట్లు ప్రచారం జరిగింది. తాజాగా ఈ భారీ క్రేజీ చిత్రంలో దర్శకుడు మణిరత్నం అభిమాన నటి, మాజీ ప్రపంచసుందరి ఐశ్వర్యారాయ్ నటించబోతున్నట్లు నెట్టింట ప్రచారం జరుగుతోంది. ఇదే నిజమైతే కమలహాసన్, ఐశ్వర్యారాయ్ కలిసి నటించే తొలి చిత్రం ఇదే అవుతుంది. త్రిష, జయంరవికి గానీ, దుల్కర్సల్మాన్కుగానీ జంటగా నటించే అవకాశం ఉందనే టాక్ వినిపిస్తోంది. ఈ విషయంలో మరింత క్లారిటీ రావాలంటే కొద్ది రోజులు వేచి చూడాల్సిందే. కాగా.. ఈ చిత్రంలో దుల్కర్సల్మాన్, జయంరవి, త్రిష ముఖ్యపాత్రలు పోషించనున్నారు. -
ఐశ్వర్యరాయ్తో వివేక్ ప్రేమాయణం.. నటుడు ఏమన్నాడంటే?
కొన్ని ప్రేమకథలు సుఖాంతం అవుతే మరికొన్ని ప్రేమకథలు మధ్యలోనే ఆగిపోతాయి. బాలీవుడ్ సెలబ్రిటీలు వివేక్ ఒబెరాయ్- ఐశ్వర్యరాయ్ లవ్స్టోరీ రెండో కోవలోకి చెందుతుంది. వీరు గాఢంగా ప్రేమించుకున్నారు, కట్ చేస్తే ఇద్దరూ చెరొకరిని పెళ్లి చేసుకుని ఎవరి దారి వారు చూసుకున్నారు. అయితే ఐష్తో తన కొడుకు ప్రేమాయణం గురించి మొదట్లో ఏమీ తెలియలేదన్నాడు సురేశ్ ఒబెరాయ్. తాజాగా ఆయన మాట్లాడుతూ.. 'చాలా విషయాలు నాకసలు తెలియనే తెలీదు. వివేక్ ఎప్పుడూ నాతో ఓపెన్గా చెప్పలేదు. రాము (రామ్ గోపాల్ వర్మ)యే అదంతా నాతో చెప్పాడు. ఐశ్వర్యతో లవ్.. వద్దని వారించా రాము కంటే ముందు కూడా ఎవరో చెప్పినట్లు గుర్తు. కానీ తను ఏదైతే చేస్తున్నాడో అది వెంటనే ఆపేయమని చెప్పాను. ఎందుకనేది అతడికి అర్థమయ్యేలా వివరించాను' అని చెప్పుకొచ్చాడు. ఇక సల్మాన్ ఖాన్తో బ్రేకప్ చెప్పిన వెంటనే వివేక్తో ప్రేమలో పడింది ఐష్. కానీ వీరి బంధం కూడా మూన్నాళ్ల ముచ్చటగానే మిగిలిపోయింది. ఎంతో త్వరగా బ్రేకప్ చెప్పుకున్నారు. కొన్నేళ్ల తర్వాత హీరో అభిషేక్ బచ్చన్ను పెళ్లాడి అమితాబ్ ఇంటికి కోడలిగా వెళ్లింది ఐశ్వర్య రాయ్. ఎవరీ సురేశ్- వివేక్.. సురేశ్ ఒబెరాయ్ విషయానికి వస్తే ఈయన సహజ నటుడు. ఏడేళ్ల వయసులోనే తొలిసారిగా ఆడపిల్ల వేషంలో రంగస్థలంపై అడుగుపెట్టాడు. డాక్టర్ కావాలనుకుని యాక్టర్ అయ్యాడు. మిర్చ్ మసాలా, ఐత్బార్, లావారిస్, ఘర్ ఏక్ మందిర్ వంటి చిత్రాల్లో విలక్షణ పాత్రలు పోషించాడు. తెలుగులో మరణ మృదంగం వంటి సినిమాలు చేశాడు. ఇటీవలే యానిమల్ సినిమాలోనూ ఓ కీలక పాత్రలో మెరిశాడు. ఈయన తనయుడు వివేక్ ఒబెరాయ్.. రక్త చరిత్ర, క్రిష్ 3 వంటి పలు సినిమాల్లో నటించాడు. పీఎమ్ నరేంద్రమోది బయోపిక్లో ప్రధాని మోది పాత్రను పోషించాడు. తాజాగా ఇండియన్ పోలీస్ ఫోర్స్ అనే వెబ్ సిరీస్లో నటించాడు. చదవండి: దావూద్ పిచ్చిగా ప్రేమించిన హీరోయిన్.. ఒక్క ఫోటోతో జీవితం నాశనం! -
భర్త, మామతో ఈవెంట్కు వెళ్లిన ఐశ్వర్య రాయ్.. కాకపోతే!
బాలీవుడ్ దంపతులు ఐశ్వర్య రాయ్- అభిషేక్ బచ్చన్ ఈ మధ్య ఎక్కువగా బయట కలిసి కనిపించడం లేదు. ఐశ్వర్య పుట్టినరోజున కూడా చాలా లేట్గా బర్త్డే విషెస్ తెలిపాడు అభిషేక్. అది కూడా ఏదో పైపైనే చెప్పినట్లు కనిపించింది. దీంతో నెటిజన్లు బచ్చన్ కుటుంబంలో ఏదో జరుగుతోందని అనుమానపడ్డారు. ఈ అనుమానాలు ఈమధ్య మొదలైనవి కాదు. కొన్నేళ్ల నుంచే వీళ్లు విడిపోతున్నారంటూ వార్తలు వెలువడుతున్నాయి. గతంలో సదరు పుకార్లను కొట్టిపారేశాడు అభిషేక్. ఇటీవల పొన్నియన్ సెల్వన్ 2 రిలీజైన సమయంలోనూ ఐశ్వర్యను చూసి గర్వపడుతున్నానని ట్వీట్ చేశాడు. ఇంటి నుంచి బయటకు? అయినప్పటికీ ఈ రూమర్స్ ఆగిపోలేదు. పైకి ఏదో కవరింగ్ చేస్తున్నారు కానీ అసలు విషయం వేరే ఉందని అనుమానిస్తున్నారు. ఇకపోతే ఈసారి ఏకంగా ఐశ్వర్య.. తన కూతురిని తీసుకుని బచ్చన్ ఇంటి నుంచి బయటకు వచ్చేసినట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. అత్తగారు జయాబచ్చన్తో చాలాఏళ్లుగా మాటలు లేవని, భర్తతోనూ విభేదాలు రావడంతో ఆ కుటుంబంతో తెగదెంపులు చేసుకున్నట్లు సదరు వార్తల సారాంశం. ఈ క్రమంలో అభిషేక్- ఐశ్వర్య కలిసి కనిపించారు. వీరిద్దరూ ముంబైలోని ధీరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్ వార్షికోత్సవ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈవెంట్కు చెరో కారులో.. అయితే ఐశ్వర్య, తన తల్లి బృంద్య రాయ్తో కలిసి ఓ కారులో రాగా.. అభిషేక్, తన తండ్రి అమితాబ్ బచ్చన్తో కలిసి మరో కారులో ఈవెంట్కు హాజరయ్యారు. కారు దిగగానే ఐశ్వర్య.. బిగ్బీని పలకరించింది. అటు అభిషేక్.. భార్యపై చేయి వేసి ఆమెతో సరదాగా మాట్లాడుతూ లోనికి వెళ్లిపోయాడు. ఈవెంట్లోనూ బిగ్బీ, అభిషేక్, ఐశ్వర్య సరదాగా స్టెప్పులు వేశారు. కార్యక్రమం ముగిసిన తర్వాత భర్తతో పాటు అదే కారులో వెళ్లింది ఐశ్వర్య. ఇది చూసిన జనాలు ఇదేం ట్విస్టు అని కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. View this post on Instagram A post shared by AISHVERSE 💌 (@theaishverse) View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) View this post on Instagram A post shared by Manav Manglani (@manav.manglani) చదవండి: అపర్ణకు కంగ్రాట్స్ చెప్పిన నయనతార.. ఎందుకో తెలుసా..? -
బాలీవుడ్లో టాప్ 15 అత్యంత అందమైన నటీమణులు వీరే (ఫొటోలు)
-
ఐశ్వర్యరాయ్ పై నోరుజారిన అబ్దుల్ రజాక్
-
Aishwarya Rai 50th Birthday: ఐశ్వర్య రాయ్ బర్త్డే సెలబ్రేషన్స్ (ఫోటోలు)
-
Aishwarya Rai Birthday : నీలి కళ్ల సుందరి ఐశ్వర్య రాయ్ 50వ పుట్టినరోజు.. ప్రత్యేకమైన ఫోటోలు
-
బిగ్బీకి ఐశ్వర్య బర్త్డే విషెస్.. జయా బచ్చన్ను డిలీట్ చేసిందేంటి?
సెలబ్రిటీలు ఏం చేసినా అందులో తప్పొప్పులు వెతకడానికి జనాలు సిద్ధంగా ఉంటారు. తాజాగా ఐశ్వర్యరాయ్ ఓ పోస్ట్ పెట్టగా చాలామంది దాన్ని తప్పుపడుతున్నారు. అక్టోబర్ 11న అమితాబ్ బచ్చన్ బర్త్డే. ఈ సందర్భంగా ఐశ్వర్య ఒక రోజు ఆలస్యంగా మామగారికి బర్త్డే విషెస్ చెప్పింది. ఎల్లప్పుడూ భగవంతుడి ఆశీర్వాదాలు మీకు ఉండునుగాక అంటూ తన కూతురు ఆరాధ్యతో బిగ్బీ దిగిన ఫోటోను షేర్ చేసింది. అంతా బాగుంది కానీ ఈ ఫోటోను జూమ్ చేసి, క్రాప్ చేసి మరీ పెట్టింది. అత్తను కూడా ఫోటోలో నుంచి డిలీట్ ఈ విషయం ఎలా తెలిసిందంటే? బిగ్బీకి అతడి మనవరాలు నవ్య నవేలి నందా(శ్వేతా బచ్చన్ కూతురు) పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఫుల్ ఫోటో ఇన్స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేసింది. ఇందులో బిగ్బీ, జయా బచ్చన్, నవ్య, అగస్త్య, ఆరాధ్య ఉన్నారు. ఇదే ఫోటోను తీసుకున్న ఐశ్వర్య తన అత్తతో సహా అందరినీ క్రాప్ చేసి అవతల పడేసింది. బిగ్బీ, ఆరాధ్య మాత్రమే ఉండేలా ఎడిట్ చేసింది. దాన్ని సోషల్ మీడియాలో వదిలింది. ఇది చూసిన జనాలు ఏదో తేడా కొడుతోందని కామెంట్లు చేస్తున్నారు. ఫ్యాషన్ వీక్లో ఐశ్వర్యను లైట్ తీసుకున్నారా? అయితే ఆమె అభిమానులు మాత్రం అది అంత పెద్ద విషయమే కాదని కొట్టిపారేస్తున్నారు. ప్రతి ఏడాది బిగ్బీ, ఆరాధ్య.. వీళ్లిద్దరు ఉన్న ఫోటో మాత్రమే పోస్ట్ చేస్తుందని, అందులో భాగంగానే ఇలా చేసిందని అంటున్నారు. కాగా ఇటీవల జయా బచ్చన్, శ్వేతా బచ్చన్ పారిస్ ఫ్యాషన్ వీక్కు హాజరయ్యారు. ఈ ఫ్యాషన్ వీక్లో ఐశ్వర్య రాయ్తో పాటు, నవ్య కూడా ర్యాంప్ వాక్ చేసింది. జయ, శ్వేత.. నవ్యను ఎంకరేజ్ చేస్తూ ఆమెలో ఉత్సాహాన్ని నింపారు, కానీ ఐశ్వర్యను మాత్రం లైట్ తీసుకున్నారు. అందుకే ఈసారి ఐశ్వర్య వారి ఫోటోలను కట్ చేసి కేవలం తన కూతురు మాత్రమే కనిపించేలా ఫోటో పోస్ట్ చేసిందని ఫ్యాన్స్ గెస్ చేస్తున్నారు. ఇకపోతే ఐశ్వర్య రాయ్ చివరగా పొన్నియన్ సెల్వన్ సినిమాలో కనిపించింది. View this post on Instagram A post shared by AishwaryaRaiBachchan (@aishwaryaraibachchan_arb) -
చిరంజీవి, ప్రభాస్ సినిమాలో ఐశ్వర్యరాయ్ బచ్చన్
-
రోజూ చేపలు తింటే ఐశ్వర్యరాయ్ లాంటి కళ్లు.. వివాదంలో మంత్రి
ముంబై: మహారాష్ట్ర బీజేపీ మంత్రి తన దురుసు వ్యాఖ్యలతో వివాదంలో చిక్కకున్నారు. రోజు చేపలు తింటే హీరోయిన్ ఐశ్వర్యరాయ్ కళ్లు లాగా అందంగా ఉంటాయని పేర్కొంటూ నోరుజారారు. నందుర్బార్ జిల్లాలో జరిగిన ఓ బహిరంగ సమావేశంలో రాష్ట్ర గిరిజనశాఖ మంత్రి విజయ్ కుమార్ గవిత్ మాట్లాడుతూ.. రోజూ చేపలను తినే వ్యక్తుల చర్మం మృదువుగా మారుతుందని, కళ్లు మెరుస్తాయని అన్నారు. తమ వైపు ఎవరూ చూసిన వెంటనే ఆకర్షితులవుతారని పేర్కొన్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇందులో ‘ఐశ్వర్యరాయ్ గురించి నేను మీకు చెప్పలేదు కదూ.. ? ఆమె మంగళూరులోని సముద్ర తీరానికి సమీపంలో నివసించేది. ఐశ్యర్య రోజూ చేపలు తినేది. మీరు ఆమె కళ్ళు చూశారా? రోజూ చేపలు తింటే మీ కళ్లు కూడా టైశ్వర్యరాయ్ లాగే అందంగా తయారవుతాయి. చేపలో కొన్ని రకాల నూనెలు ఉంటాయి. అవి మీ చర్మాన్ని మృదువుగా చేస్తాయి.’ అని మంత్రి చెప్పారు. అయితే ఈ వ్యాఖ్యలపై మంత్రి విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఇలాంటి పనికిమాలిన వ్యాఖ్యలు చేయకుండా గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యలపై దృష్టి సారించాలని ఎన్సీపీ ఎమ్మెల్యే అమోల్ మిత్కారీ మండిపడ్డారు. మరో బీజేపీ ఎమ్మెల్యే నితీష్ రాణే స్పందిస్తూ ‘నేను రోజు చేపలు తింటాను. నా కళ్లు కూడా అలాగే ఉండాలి. దీనిపై ఏమైనా పరిశోధన ఉందా? అనే విషయంపై మంత్రిని ప్రశ్నిస్తానని’ చెన్నారు. చదవండి: స్నేహితుడి కుమార్తెపై అత్యాచారం.. సీఎం కేజ్రీవాల్ కీలక నిర్ణయం म्हणून ऐश्वर्या रॉयचे Aishwarya Rai डोळे आणि त्वचा सुंदर आहे - आदिवासी विकास मंत्री VijayKumar Gavit#vijaykumargavit #aishwaryaraibachchan #aishwaryarai #adiwasi #maxmaharashtra@AishwaryaWeb @DrVijayKGavit pic.twitter.com/2kFhmgSRBk — Max Maharashtra (@MaxMaharashtra) August 21, 2023 -
దేవదా... నా నటన నచ్చిందా?
సినిమాలలోని పాపులర్ సీన్లను రీక్రియేట్ చేసి ఆనందించడం మనకు కొత్త కాదు. సంజయ్లీలా బన్సాలీ ‘దేవదాస్’ సినిమాలో ‘పారు’ పాత్రలోని ఐశ్వర్యారాయ్ని అనుకరిస్తూ కైరా ఖన్నా అనే బాలిక చేసిన వీడియో తాజాగా వైరల్ అయింది. ఐకానిక్ సినిమాలలోని పాపులర్ సీన్లను అనుకరిస్తూ కైరా చేసే వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. ‘జిస్ వక్త్ తుమ్హారే సాథ్ హోతి హమ్ ఉస్ వక్త్ బద్నామి కా బీ డర్ నహీ లగ్తా’ ‘దస్ సాల్ పహ్లే తుమ్హరే నామ్ కా దియా జలాయ థా మైనే. ఉసే ఆజ్ తక్ బుజ్నే నహీ దియా’... ఇలా ‘దేవదాస్’ సినిమాలోని ‘పారు’ పాపులర్ డైలాగ్లతో ‘వావ్’ అనిపించింది కైరా ఖన్నా. ‘డైలాగుల నుంచి ఎక్స్ప్రెషన్ వరకు అద్భుతం’ ‘అద్భుతమైన యాక్టింగ్ స్కిల్స్ ఉన్న కైరాకు బాలీవుడ్లో బ్రైట్ ఫ్యూచర్ ఉంది’... అంటూ నెటిజనులు కైరా ఖన్నాపై ప్రశంసల వర్షం కురిపించారు. -
ఐశ్వర్యారాయ్ గురించి అడగగానే విక్రమ్ రియాక్షన్