-
షాకింగ్.. భారత్లోకి ప్రవేశించిన పాకిస్తాన్ విమానం.. 10 నిమిషాల పాటు..
న్యూఢిల్లీ: పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్లైన్స్(పీఐఏ) విమానం భారత గగనతలంలోకి ప్రవేశించడం కలకలం రేపింది. ఈ విమానం భారత్లో దాదాపు 10 నిమిషాల పాటు ప్రయాణించి 141 కిలోమీటర్లు చక్కర్లు కొట్టినట్లు తెలుస్తోంది. మే 4న రాత్రి జరిగిన ఈ ఘటనకు సంబంధించి ఓ మీడియా సంస్థ నివేదికలో వెల్లడించింది. పీకే248 అనే పీఐఏ విమానం మస్కట్ నుంచి తిరిగి పాకిస్తాన్కు మే4న రాత్రి 8 గంటల సమయంలో చేరుకుంది. అలామా ఇక్బాల్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టులో ల్యాండ్ కావాల్సి ఉంది. అయితే భారీ వర్షం కారణంగా విమానం ల్యాండ్ అయ్యే పరిస్థితి లేదు. పైలట్ ల్యాండ్ చేసేందుకు ఎంత ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. దీంతో విమానాన్ని కొద్దిసేపు గాల్లో తిప్పాలని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ పైలట్కు సూచించారు. అయితే భారీ వర్షం కారణంగా దారితప్పిన పైలట్ విమానాన్ని భారత గగనతలంలోకి తీసుకొచ్చాడు. ఈ సమయంలో గంటలకు 292 కిలీమీటర్ల వేగం, 13,500 అడుగల ఎత్తులో అది ప్రయాణించింది. బధానా పోలీస్ స్టేషన్ పరిధి గగనతలం మీదుగా భారత్లోకి వచ్చింది. భారత పంజాబ్లోని తరన్ సాహిబ్ , రసూల్పూర్ ప్రాంతాల్లో దాదాపు 140 కిలోమీటర్లు గాల్లో చక్కర్లు కొట్టింది. ఈ సమయంలో విమానాన్ని 20వేల అడుగులకుపైగా ఎత్తులో ఉంచాడు పైలట్. ఏడు నిమిషాల పాటు అటు ఇటు తిప్పాడు. ఆ తర్వాత భారత పంజాబ్లోని జాగియాన్ నూర్ మహమ్మద్ గ్రామం మీదుగా విమానం తిరిగి పాకిస్తాన్ చేరుకుంది. ఆ తర్వాత పాక్ పంజాబ్లోని డొనా మబ్బోకి, ఛాంట్, ధుప్సారి కాసుర్, ఘఠి కలంజార్ ప్రాంతాల్లో ప్రయాణించి తిరిగి మళ్లీ భారత గగనతలంలోకి వచ్చింది. మళ్లీ మూడు నిమిషాలు చక్కర్లు కొట్టిన అనంతరం భారత పంజాబ్లోని లఖా సింఘ్వాలా హిథార్ గ్రామం మీదుగా తిరిగి పాక్ చేరుకుంది. ఈ సమయంలో విమానం 23,000 ఎత్తులో ప్రయాణించింది. అయితే ఈ ఘటనకు భారత అధికారులు అధికారికంగా ధ్రువీకరించాల్సి ఉంది. చదవండి: టెక్సాస్ కాల్పుల ఘటన.. హైదరాబాద్ యువతి మృతి -
నారీ శక్తితో గణతంత్రం వచ్చే ఏడాది మహిళలతోనే రిపబ్లిక్ డే పరేడ్
న్యూఢిల్లీ: భారత గణతంత్ర దినోత్సవ పరేడ్ అంటే మన దేశ త్రివిధ బలగాల శక్తిని ప్రపంచానికి చాటడమే. యుద్ధ శకటాలు, విమానాల విన్యాసాలు, కొత్త ఆయుధాల ప్రదర్శన ఇలా పరేడ్ అంటే కదనరంగంలో మన సత్తా ఎంతో ప్రదర్శించడమే. అలాంటి పరేడ్ను వచ్చే ఏడాది మహిళా శక్తితో నిర్వహించడానికి కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. నింగి నేలా నీరు అంతా మాదే అంటూ నినదిస్తున్న మహిళల భాగస్వామ్యం ఇటీవల కాలంలో త్రివిధ బలగాల్లో పెరుగుతోంది. యుద్ధభూమిలోకి అడుగు పెట్టడానికి కూడా మహిళలు సై అంటున్నారు. కేంద్ర బలగాల్లో మహిళల భాగస్వామ్యాన్ని మరింతగా ప్రోత్సహించడం కోసం 2024 జనవరి 26న కర్తవ్యపథ్లో జరగనున్న రిపబ్లిక్ డే పరేడ్ను కేవలం మహిళలతో నిర్వహించాలని రక్షణ శాఖ ఫిబ్రవరిలో ప్రతిపాదించింది. దీనిపై ఫిబ్రవరిలో రక్షణ శాఖ కార్యదర్శి ఆధ్వర్యంలో త్రివిధ బలగాల అధిపతులతో ఒక సమావేశం కూడా జరిగిందని ఆదివారం రక్షణ శాఖ వర్గాలు వెల్లడించాయి. త్రివిధ బలగాల్లోని మహిళా అధికారులే రిపబ్లిక్ డే కవాతుని నడిపిస్తారని ఆ సమావేశం నిర్ణయించింది. ఈ విషయాన్ని వివిధ ప్రభుత్వ శాఖలకి కూడా సమాచారం అందించారు. రక్షణ , హోం సంస్కృతి పట్టణాభివృద్ధి శాఖలు సంయుక్తంగా దీనిని ఎలా అమలు చేయాలో చర్చిస్తున్నట్టు రక్షణ శాఖ వర్గాలు తెలిపాయి. ఈ ఏడాది రిపబ్లిక్ డేలో నారీ శక్తి థీమ్ను ప్రధానంగా చేశారు. కేరళ, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట, త్రిపుర రాష్ట్రాలు నారీశక్తి థీమ్తో శకటాలు రూపొందించాయి. ఇక వచ్చే ఏడాది అందరూ మహిళలతోనే పరేడ్ సాగనుంది. -
యుద్ధ విమానం స్వదేశీ గర్జన!
సాక్షి, విశాఖపట్నం: రక్షణ పరిశోధన సాంకేతిక రంగంలోకి ప్రైవేట్ సంస్థలను ఆహ్వానిస్తున్నట్లు డీఆర్డీవో చైర్మన్ సమీర్ వి.కామత్ తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్పేస్ పాలసీలో భాగంగా రక్షణ రంగంలో ప్రధానంగా స్పేస్ టెక్లో ప్రైవేట్ పరిశ్రమలు, పరిశోధన సంస్థలకు అవకాశాలు కల్పించినట్లు వివరించారు. విశాఖలో ని నేవల్ సైన్స్ అండ్ టెక్నలాజికల్ లేబొరేటరీ (ఎన్ఎస్టీఎల్)లో గురువారం ప్రారంభమైన కండిషన్ మానిటరింగ్ జాతీయ సదస్సులో పాల్గొనేందుకు వచ్చిన ఆయన ‘సాక్షి’తో పలు అంశాలపై మాట్లాడారు. అంతరిక్ష పరిశోధనలపై దృష్టి స్పేస్ పాలసీలో భాగంగా పరిశోధనలపై దృష్టి సారించాం. ముఖ్యంగా రక్షణ శాఖతో పాటు అంతరిక్ష పరిశోధనలపై దృష్టి పెట్టాం. రాకెట్ లాంచింగ్, శాటిలైట్స్ అభివృద్ధి.. ఇలా ఎలాంటి హద్దులు లేకుండా ప్రైవేట్ సంస్థలు ముందుకు రావచ్చు. దీనిద్వారా అగ్రదేశాలతో పోటీ పడే స్థాయికి వేగంగా చేరుకుంటాం. అంతరిక్ష ఆధారిత నిఘా, అంతరిక్ష పరిస్థితులపై మన అవగాహన సామర్థ్యాలు మెరుగుపడుతున్నాయి. అంకుర సంస్థలకు ప్రోత్సాహం రక్షణ రంగంలో స్టార్టప్స్ని ప్రోత్సహిస్తున్నాం. డిఫెన్స్ సిస్టమ్, టెక్నాలజీపై పని చేస్తున్న స్టార్టప్స్కు ప్రాధాన్యమిస్తున్నాం. పరిశోధన అభివృద్ధి(ఆర్ అండ్ డీ) బడ్జెట్లో 25 శాతం వరకూ పరిశ్రమలు, స్టార్టప్స్, విద్యారంగానికి కేంద్ర ప్రభుత్వం కేటాయించడం శుభ పరిణామం. అందుకే స్టార్టప్స్, ఎంఎస్ఎంఈలకు అవకాశాలు కల్పిస్తున్నాం. 17 వేల అడుగుల ఎత్తు వరకు ‘యూఏవీ’ మానవ రహిత వైమానిక వాహనం (యూఏవీ)పై ప్రధానంగా దృష్టి సారించాం. ఇందుకోసం గైడెన్స్ కిట్, సీట్ ఎజెక్షన్ సిస్టమ్, పైరోటెక్నిక్ కాట్రిడ్స్ అభివృద్ధి చేసే పనిలో ఉన్నాం. ‘యూఏవీ తపస్’ కోసం 180 హెచ్పీ సామర్థ్యం కలిగిన ఇంజన్ను దేశీయంగా అభివృద్ధి చేశాం. దీని ద్వారా యూఏవీ 17 వేల అడుగుల ఎత్తువరకూ ఎగరగలదు. 2028లో తొలి దేశీయ యుద్ధ విమానం ఎగరనుంది మేక్ ఇన్ ఇండియాలో భాగంగా మన సాయుధ బలగాల్లో చాలా వ్యవస్థలు స్వదేశీ పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోనున్నాయి. ఇందులో భాగంగా ఎల్సీఏ ఎంకే–2 ఇండక్షన్కు సిద్ధమవుతున్నాం. జీఈఎఫ్ 414 ఇంజన్తో కూడిన ఏఎంసీఏ (అడ్వాన్స్డ్ మీడియమ్ కంబాట్ ఎయిర్క్రాఫ్ట్) ఫేజ్–1 యుద్ధ విమానాన్ని 2028లో ఎగురవేసేందుకు వడివడిగా అడుగులు వేస్తున్నాం. ఇది పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో తయారవుతోంది. దీనికి సంబంధించి అనుమతుల కోసం వేచి చూస్తున్నాం. ఎలైట్ క్లబ్లో చేరడం గర్వకారణం ఇటీవల ‘సీ బేస్డ్ ఎండో అట్మాస్ఫియరిక్ ఇంటర్సెప్టర్ మిసైల్’ తొలి వి మాన ప్రయోగం విజయవంతం కావడంతో రక్షణ సామర్థ్యాల విషయంలో మన దేశం చరిత్రాత్మక మైలురాయిని అధిగవిుంచింది. నేవల్ బాలిస్టిక్ మిసైల్ డిఫెన్స్ (బీఎండీ) సామర్థ్యంలో అగ్రదేశాల సరసన నిలిచి ఎలైట్ క్లబ్ ఆఫ్ నేషన్స్లో చేరడం గర్వకారణం. యుద్ధనౌకలు, ఉపరితలం నుంచి బాలిస్టిక్ క్షిపణులను నిలువరించే సామర్థ్యాన్ని భారత్ అభివృద్ధి చేసింది. అంతకుముందే భూ ఆధారిత క్షిపణి ప్రయోగాన్ని విజ యవంతంగా నిర్వహించాం. ఈ జంట విజయాలతో సుదూర అణు క్షిపణులు, హైపర్ సోనిక్ మిసైల్స్, గ్లైడర్స్, శత్రు విమానాల్ని అడ్డుకోగల సామర్థ్యాన్ని మన దేశం సొంతం చేసుకుంది. -
గాల్లో విమానంలో అనూహ్య ఘటన
బెంగళూరు: మద్యం మత్తులో విమానం అత్యవసర ద్వారం తెరిచేందుకు యత్నించిన ఓ ప్రయాణికుడిని సీఐఎస్ఎఫ్ అదుపులోకి తీసుకుంది. ఢిల్లీ నుంచి బెంగళూరు వస్తున్న ఇండిగో విమానంలో శుక్రవారం ఈ ఘటన చోటుచేసుకుంది. యూపీలోని కాన్పూర్కు చెందిన ప్రతీక్(30) ఇండిగోకు చెందిన 6ఈ308 ఢిల్లీ–బెంగళూరు విమానం 18ఎఫ్ సీట్లో కూర్చున్నాడు. విమానం బయలుదేరిన కొద్దిసేపటికి మత్తులో ఉన్న ప్రతీక్ తోటి ప్రయాణికుల పట్ల అమర్యాదకరంగా ప్రవర్తించాడు. అంతటితో ఆగక అత్యవసర ద్వారం తెరిచేందుకు రాగా సిబ్బంది అతడిని వారించారు. వినిపించుకోకపోవడంతో అతడ్ని బలవంతంగా కూర్చోబెట్టారు. విమానం బెంగళూరుకు చేరుకున్నాక పైలట్ అతడిని సీఐఎస్ఎఫ్ సిబ్బందికి అప్పగించారని ఇండిగో ఒక ప్రకటనలో తెలిపింది. ప్రతీక్పై ఐపీసీ సెక్షన్లు 290, 336లతోపాటు ఎయిర్క్రాఫ్ట్ చట్టంలోని 11(ఏ) కింద కేసులు నమోదు చేసి, అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. -
రూ.6,828 కోట్లతో 70 శిక్షణ విమానాలు
న్యూఢిల్లీ: భారత వైమానిక దళం(ఐఏఎఫ్) కోసం రూ.6,828 కోట్లతో 70 హెచ్టీటీ–40 బేసిక్ శిక్షణ విమానాల కోనుగోలుకు రంగం సిద్ధమైంది. ఈ విమానాలను కొనుగోలు చేయడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ(సీసీఎస్) బుధవారం ఆమోదం తెలియజేసింది. రానున్న ఆరేళ్లలో ఈ విమానాలు ఐఏఎఫ్కు అందనున్నాయని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ట్విట్టర్లో వెల్లడించారు. హెచ్టీటీ–40 విమానాలను ప్రభుత్వ రంగంలోని హిందూస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్(హెచ్ఏఎల్) ఉత్పత్తి చేయనుందని భారత రక్షణ శాఖ తెలియజేసింది. తక్కువ వేగంతో నడిచే ఈ విమానాలతో వైమానిక దళం సిబ్బందికి మెరుగైన శిక్షణ ఇవ్వొచ్చని పేర్కొంది. హెచ్టీటీ–40 విమానాల తయారీలో హెచ్ఏఎల్ సంస్థ ప్రైవేట్ పరిశ్రమలను కూడా భాగస్వాములను చేయనుంది. దీనివల్ల 100కుపైగా సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల్లో 1,500 మందికి ప్రత్యక్షంగా, 3,000 మందికి పరోక్షంగా ఉపాధి లభిస్తుందని అంచనా. -
ఆకాశాన్ని ఖాళీ చేయిస్తున్న రష్యా.. విమానాలన్నీ వెనక్కి.. ఏం జరుగుతోంది?
మాస్కో: రష్యా ఆకాశమార్గాన్ని ఖాళీ చేయిస్తోంది. సెయింట్ పీటర్స్బర్గ్లోని పుల్కోవో విమానాశ్రాయాన్ని తాత్కాలికంగా మూసివేసింది. ఇక్కడకు చేరుకోవాల్సిన విమానాలన్నింటినీ తిరిగి వెనక్కి పంపింది. ఫ్లైట్ రాడార్ వెబ్సైట్ దీన్ని వెల్లడించింది. దీంతో రష్యా ఏం చేయబోతుందని సర్వత్రా చర్చనీయాంశమైంది. అయితే సెయింట్పీటర్స్బర్గ్ గగనతలంలో గుర్తు తెలియని వస్తువు (అన్ఐడెంటిఫైడ్ ఫ్లయింగ్ ఆబ్జెక్ట్- UFO)ను గుర్తించినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. దీన్ని గమనించిన తర్వాతే ప్రభుత్వం అప్రమత్తమై ఆకాశమార్గాన్ని ఖాళీ చేయించినట్లు సమాచారం. ఈ విమానాశ్రాయానికి చేరుకోవాల్సిన విమానాలనకు వెనక్కి పంపించి.. యుద్ధ విమానాలకు రంగంలోకి దించినట్లు తెలుస్తోంది. గుర్తు తెలియని వస్తువు గురించి తెలుసుకునేందుకు రెండు యుద్ధ విమానాలను రష్యా గగనతలంలోకి పంపినట్లు అక్కడి మీడియా సంస్థలు తెలిపాయి. ఆ వస్తువు ఏంటో కనిపెట్టేందుకు దాదాపు 100 యుద్ధవిమానాలను సెయింట్పీటర్స్బర్గ్ విమానాశ్రయంలో మోహరించినట్ల సమాచారం. అయితే ఇటీవలి కాలంలో గుర్తు తెలియని వస్తువులు గగనతలంలో కన్పించడం కలకలం రేపడం తెలిసిందే. చైనాకు చెందిన భారీ బెలూన్లు అమెరికా ఆకాశంలో నిఘా వహించడం చర్చనీయాంశమైంది. వీటిని అగ్రరాజ్యం కూల్చివేసింది. ఉక్రెయిన్తో యుద్ధం చేస్తున్న రష్యా ఆకాశంలో ఇప్పుడు యూఎఫ్ఓ కన్పించడం అనుమానాలకు తావిస్తోంది. ఇది ఏలియన్ల పనా? లేక ఇతర దేశాల పనా? అనే చర్చ కూడా మొదలైంది. పుతిన్ సొంత నగరం.. అయితే రష్యా గగనతలంలో కన్పించింది ఓ భారీ డ్రోన్ అని అక్కడి మీడియా సంస్థలు పేర్కొన్నాయి. ఇది నాటో దేశాల పని అయ్యి ఉంటుందని అనుమానం వ్యక్తం చేశాయి. రష్యా అధ్యక్షుడు వ్లాదిమీర్ పుతిన్ సొంతనగరం అయిన సెయింట్ పీటర్స్బర్గ్కు ఈ డ్రోన్ దగ్గరగా ఉండటంతో అధికారులు అప్రమత్తమై ముందు జాగ్రత్త చర్యగా యుద్ధ విమానాలను మోహరించారు. ఈ ఎయిర్పోర్టుకు 180 కిలోమీటర్ల దూరంలోనే భారీ డ్రోన్ కన్పించింది. చదవండి: అనుకున్నదొక్కటి.. అయినది ఒక్కటి! -
నాసా విద్యుత్ విమానం వచ్చేస్తోంది
కేంబ్రిడ్జ్: గగనతలంలో భారీ స్థాయిలో కర్భన ఉద్గారాలను వెదజల్లే చిన్న విమానాలకు చరమగీతం పాడేందుకు అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా నడుం బిగించింది. వాయుకాలుష్యం లేని అధునాతన విద్యుత్ విమానాన్ని సిద్ధంచేస్తోంది. ఈ ప్రయోగాత్మక విమానానికి ఎక్స్–57 అని నామకరణం చేసింది. ఈ ఏడాదే ఈ బుల్లి విమానం గగనతల అరంగేట్రం చేయనుంది. దీనిని 14 ప్రొపెల్లర్లను అమర్చారు. ఇటలీ తయారీ టెక్నామ్ పీ2006టీ నాలుగు సీట్ల విమానానికి ఆధునికత జోడించి లిథియం అయాన్ బ్యాటరీలతో పనిచేసేలా కొత్త ఎలక్ట్రిక్ ఏరోప్లేన్ను సిద్ధంచేస్తున్నారు. సాధారణంగా ఉండే రెండు రెక్కలకే అటు నుంచి ఇటు చివరిదాకా సమ దూరంలో ఎక్కువ బ్యాటరీలు, చిన్న మోటార్ల కలయితో ప్రొపెల్లర్లను ప్రయోగాత్మక డిజైన్లో అమర్చడం విశేషం. ప్రయాణసమయంలో ప్రొపెల్లర్తో పనిలేనపుడు వెంటనే దాని బ్లేడ్లు వెనక్కి ముడుచుకుంటాయి. దీంతో వేగం తగ్గే ప్రసక్తే లేదు. కొత్త డిజైన్ ప్రొపెల్లర్లతో శబ్దకాలుష్యం తక్కువ. ఎక్కువ సాంద్రత ఉండే గాలిలోనూ అత్యంత వేగంగా దూసుకెళ్లేలా 11 బ్లేడ్లతో ప్రొపెలర్లను రీడిజైన్ చేశారు. ప్రొపెల్లర్లతో జనించే అత్యంత అధిక శక్తి కారణంగా ఈ విమానాలకు పొడవాటి రన్వేలతో పనిలేదు. అత్యల్ప దూరాలకు వెళ్లగానే గాల్లోకి దూసుకెళ్లగలవు. ప్రస్తుతానికి 200 కిలోమీటర్లలోపు, గంటలోపు ప్రయాణాల కేటగిరీలో దీనిని ప్రవేశపెట్టాలని యోచిస్తున్నారు. -
ఫూల్స్ని చేయడం ఆపేయండి! వీడియో కాల్లో పుతిన్ ఫైర్
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ వీడియో కాల్లో ఉప ప్రధాని డెనిస్ మంటురోవ్పై సీరియస్ అయ్యారు. దేశ పౌర సైనిక విమాన ఒప్పందం విషయంలో జాప్యం చేస్తున్నందుకు మంటురోవ్పై పుతిన్ మాటల తుటాలు పేల్చారు. ఈ మేరకు బుధవారం రష్యా ప్రభుత్వ టెలివిజన్ ప్రసారంలో.. ప్రభుత్వాధికారల సమావేశంలో జరిగిన ఒక వీడియో కాల్లో పుతిన్ వాణిజ్య, పరిశ్రమల మంత్రి, ఉప ప్రధాని మంటురోవ్పై విరుచుకుపడ్డారు. 2023 ఏడాదికి సంబంధించి పౌర సైనిక విమాన ఒప్పందాలను ఒక నెలలోపు పూర్తి చేయాలని గట్టిగా హెచ్చరించారు. వాస్తవానికి రష్యా విమానాయన సంస్థ ఏరోప్లాట్తో దాదాపు 175 బిలియన్ల రూబిళ్లు(రూ. 21 వేల కోట్లు) విలువైన ఒప్పందాలు ఏర్పాటు చేసే బాధ్యత మంటురోవ్పై ఉంది. ఐతే సైనిక విమాన కాంట్రాక్ట్లు ఏవి సిద్ధంగా లేకపోవడంతోనే పుతిన్ తీవ్ర అసహనానికి గురైనట్లు అధికారికి వర్గాల సమాచారం. దీనికి మీరు చాలా వ్యవధి తీసుకుంటున్నారంటూ తిట్టిపోశారు. సాధ్యమైనంత తొందరగా పూర్తి చేయాలని గట్టిగా నొక్కిచెప్పారు. అయినా మీరు ఇప్పటివరకు ఏ ఎంటర్ప్రైజెస్తో ఎలాంటి ఒప్పందాలు చేసుకోలేదన్న విషయం తనకు తెలసునంటూ సీరియస్ అయ్యారు. ఒకవేళ ఒప్పందాలు పూర్తి అయితే గనుక ఎప్పుడూ సంతకాలు చేశారో చెప్పగలరా! అని గట్టిగా నిలదీశారు. ముందు మీరు అందర్నీ ఫూల్స్ని చేయడం ఆపేయండి అంటూ ఉపప్రధాని మంటురోవ్కి గట్టిగా చురకలంటించారు. బాగా ఉత్తమంగా ప్రయత్నించాలని చూడొద్దు, ప్రస్తుత పరిస్థితులను అర్థం చేసుకుని సాధ్యమైనంత తొందరగా.. కేవలం ఒకనెలలోపే ఈ ఒప్పందాలను పూర్తి చేసేలా ప్రయత్నించండి అంటూ పుతిన్ డిప్యూటి ప్రధాన మంత్రి మంటురోవ్కి గడువు కూడా ఇచ్చారు. దీనికి ఉప ప్రధాని మంటూరోవ్ పుతిన్కి సమాధానం ఇస్తూ..అందుకు సంబంధించిన ఆర్డర్లు సిద్ధంగానే ఉన్నాయని, తొందరగా పూర్తి చేసేందుకు తనవంతుగా ప్రయత్నం చేస్తానని చెప్పారు. ఐతే రష్యా ప్రతినిధి డిమిత్రి పెస్కోవ్ మాత్రం అధ్యక్షుడి పుతిన్కి మంటురోవ్ పనితీరుపై ఎలాంటి ఫిర్యాదుల లేవని క్రెమ్లిన్ మీడియాకి చెప్పాడం గమనార్హం. Russian aviation industry didn't receive a single contract to produce a passenger plane in 2022. pic.twitter.com/9xwHYTBC3X — Anton Gerashchenko (@Gerashchenko_en) January 11, 2023 (చదవండి: క్రిమియాకు ఎందుకంత క్రేజ్? ) -
అమెరికా విమానాన్ని ఢీ కొట్టబోయిన చైనా యుద్ధ విమానం
బీజింగ్: దక్షిణ చైనా సముద్రంపై అమెరికా, చైనా మధ్య మళ్లీ ఉద్రిక్తతలు తలెత్తాయి. అమెరికా నిఘా విమానాన్ని చైనాకు చెందిన యుద్ధ విమానం దక్షిణ చైనా సముద్ర జలాలపై దాదాపుగా ఢీ కొట్టబోయింది. చైనా జెట్ అత్యంత ప్రమాదకరంగా దూసుకు రావడంతో అమెరికా నిఘా విమానం పైలట్ చాకచక్యంగా వ్యవహరించి ముప్పుని తప్పించారు. ఇది డిసెంబర్ 21న జరిగిందని అమెరికా ఇండో ఫసిఫిక్ కమాండ్ వెల్లడించింది. ‘‘అమెరికా వైమానిక దళానికి చెందిన ఆర్సీ–135 దక్షిణ చైనా సముద్రంపై ప్రయాణిస్తుండగా చైనా జే–11 ఫైటర్ జెట్ కేవలం 6 మీటర్ల (20 అడుగులు) దూరంలోకి వచ్చింది. దాదాపుగా ఢీకొట్టినంత పనయింది. దక్షిణ చైనా సముద్రంపై అంతర్జాతీయ గగనతలంలో మేం యథావిధిగా చట్టబద్ధంగా కార్యకలాపాలు నిర్వహిస్తూ ఉంటే చైనా ఇలా యుద్ధ విమానాలతో సవాల్ విసురుతోంది’’ అంటూ నిందించింది. 2001లో చైనా చేసిన ఇలాంటి పని వల్ల ఆ దేశ విమానం కుప్పకూలి పైలట్ దుర్మరణం పాలయ్యాడని గుర్తు చేసింది. దక్షిణ చైనా సముద్రంపై చైనాకు ఎలాంటి హక్కు లేదని అంతర్జాతీయ న్యాయస్థానం తీర్పు ఇచ్చినా డ్రాగన్ దేశం వెనక్కి తగ్గడం లేదు. అక్కడ అమెరికా యుద్ధ విమానాలను, నౌకలను మోహరిస్తూ విస్తృతంగా కార్యకలాపాలు నిర్వహించడం దానికి మింగుడు పడడం లేదు. అమెరికా తన నిఘా కార్యకలాపాలతో చైనాకు పెనుముప్పుగా మారిందని ఆ దేశ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి వాంగ్ వెన్బిన్ ఆరోపించారు. దక్షిణ చైనా సముద్రం విషయంలో రాజీపడే ప్రసక్తే లేదన్నారు. తమ సార్వభౌమాధికారాన్ని కాపాడుకునేందుకు ఎలాంటి చర్యలైనా చేపడతామని స్పష్టం చేశారు. -
ఎయిర్ ఇండియా మరో భారీ కొనుగోళ్లు..200 బోయింగ్ విమానాలకు ఆర్డర్?
ప్రముఖ దేశీయ ఏవియేషన్ దిగ్గజం ఎయిర్ ఇండియా..అమెరికా విమానాల తయారీ సంస్థ బోయింగ్ నుంచి 200 విమానాలు కొనుగోలు చేసేలా ఆర్డర్ పెట్టినట్లు సమాచారం. వాటిలో బోయింగ్ 737 మాక్స్ జెట్ విమానాలు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఇరు సంస్థల మధ్య కొనుగోలు చర్చలు జరుగుతుండగా..త్వరలో వాటికి ముగింపు పలకునున్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. అయితే ఎయిర్ ఇండియాతో విమానాల కొనుగోలు ఒప్పందంపై బోయింగ్ అధికార ప్రతినిధి నిరాకరించారు. టాటా సన్స్ ఎయిరిండియా ప్రతినిధులు స్పందించలేదు. కాగా, అంతర్జాతీయ రూట్లలో బోయింగ్ 787 డ్రీమ్ లైనర్ జెట్ విమానాలు, ఎయిర్ బస్ ఎస్ఈ ఏ350 విమానాల కొనుగోలుపై ఎయిర్ ఇండియా దృష్టి సారించింది. బోయింగ్ 777 విమానాలను లీజ్కు తీసుకునే యోచనలో ఉన్నట్లు సమాచారం. -
ఎలక్ట్రిక్ విమానం వచ్చేసింది
-
Alice: ప్రపంచంలో తొలి ఎలక్ట్రిక్ విమానం ఎగిరింది
ఎలక్ట్రిక్ విమానాల విభాగంలో సంచలనం నమోదైంది. ‘ఆలిస్’ అనే తొలి ఎలక్ట్రిక్ విమానం గగన వీధుల్లో విహరించింది. కొన్ని నిమిషాల తర్వాత నిర్ధేశించిన ప్రదేశానికి చేరింది. ప్రపంచ దేశాల్లో ఎలక్ట్రిక్ వెహికల్స్ విప్లవం జోరందుకుంది. పర్యావరణ పరిరక్షణ, ఖర్చు తగ్గించుకోవడం, మారుతున్న కొనుగోలు దారులు, ప్రయాణికుల అభిరుచులకు అనుగుణంగా ఆటోమొబైల్ సంస్థలు ఎలక్ట్రిక్ కార్లు, బైకులను తయారు చేస్తున్నాయి. ఇప్పుడు ఆటోమొబైల్ రంగంతో పాటు ఏవియేషన్ రంగానికి చెందిన సంస్థలు సైతం ఎలక్ట్రిక్ విమానాల్ని తయారు చేసేందుకు మొగ్గుచూపుతున్నాయి. తాజాగా ఇజ్రాయిల్కు చెందిన ఏవియేషన్ క్ట్రాఫ్ట్ సంస్థ ప్రపంచంలోని తొలి ఎలక్ట్రిక్ ఎయిర్క్రాఫ్ట్ ‘ఆలిస్’ను ప్రపంచానికి పరిచయం చేసింది. ఆ విమానానికి ట్రయల్స్ నిర్వహించింది. టెస్ట్ రన్లో 8 నిమిషాల పాటు ప్రయాణించింది. ఆ తర్వాత అమెరికా, వాషింగ్టన్లోని గ్రాంట్ కౌంటీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ (MWH)లో సక్సెస్ ఫుల్గా ల్యాండ్ అవ్వడంపై ఏవియేషన్ రంగానికి చెందిన నిపుణులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఆలిస్ ప్రత్యేకతలు ఎలక్ట్రిక్ విమానం ఆలిస్లో 9 మంది ప్రయాణించవచ్చు. కనిష్ట వేగం 260 kats (Knots True Airspeed) తో గంటకు 480 కేఎంపీఎహెచ్ వేగాన్ని చేరుకోగలదు. ఇది 250 నాటికల్ మైళ్ళు (400 కి.మీ) వరకు పరిధిని కలిగి ఉండి..సుమారు రెండు గంటల వరకు గాలిలో ఉండగలదు. ఈ విమానం గరిష్టంగా 2,500 పౌండ్ల (సుమారు 1,100 కిలోలు) పేలోడ్ తో ఎగరగలదు. కాస్త భిన్నంగా సాధారణ విమానాల కంటే ఆలిస్ను భిన్నంగా తయారు చేశారు. విమానం ముందుకు వెళ్లడానికి ఉపయోగపడే ప్రొపెల్లర్స్ ఇందులో మూడు ఉంటాయి. ఒక ప్రొపెల్లర్ విమానం వెనక భాగంలో ఉంటే, మిగతా రెండు, చెరో రెక్కకు అమరి, విమానం ముందుకు వెళ్లేందుకు తోడ్పడతాయి. ఇదో చరిత్ర ఈ సందర్భంగా ఏవియేషన్ ఎయిర్ క్ట్రాఫ్ట్ ప్రెసిండెంట్, సీఈవో గ్రెగరీ డేవిస్ మాట్లాడుతూ.. ఏవియేషన్ రంగంలోనే ఇదొక హిస్టరీ. మేం పిస్టన్ ఇంజిన్ నుండి టర్బైన్ ఇంజిన్ కు వెళ్ళినప్పటి నుండి విమానంలో ప్రొపల్షన్ టెక్నాలజీ మార్పును చూడలేదు. 1950వ దశకంలో ఇలాంటి కొత్త టెక్నాలజీని మీరు చివరిసారిగా చూశారు' అని పేర్కొన్నారు. -
చినూక్ హెలికాప్టర్లను అర్థాంతరంగా నిలిపేసిన అమెరికా.. భారత్ ఆందోళన
వాషింగ్టన్: చినూక్ హెలికాప్టర్ల సేవలను అర్థాంతరంగా నిలిపివేసింది అమెరికా సైన్యం. ఇంజిన్లో మంటలు చెలరేగే ప్రమాదముందని ఆకస్మికంగా ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో ఒక్క చినూక్ హెలికాప్టర్ కూడా నింగిలోకి ఎగరకుండా నేలకే పరిమితమయ్యాయి. అయితే అమెరికా నుంచి దిగుమతి చేసుకున్న చినూక్ విమానాలను భారత వాయుసేన విరివిగా వినియోగిస్తోంది. ఈ నేపథ్యంలో వీటి సేవలను నిలిపివేయడంపై ఆందోళన వ్యక్తం చేసింది. దీని గురించి వివరణ ఇవ్వాలని అమెరికాకు లేఖ రాసింది. 70 చినూక్ హెలికాప్టర్లను పరిశీలించిన తర్వాత అందులోని ఓ భాగం వల్ల ఇంజిన్లో మంటలు సంభవించే ముప్పు ఉందని అమెరికా ఆర్మీ మెటిరీయల్ కమాండ్ సూచించింది. దీంతో ముందు జాగ్రత్త చర్యగా వీటి సేవలను నిలిపివేశారు అధికారులు. గతంలో పలుమార్లు ఈ హెలికాప్టర్ ఇంజిన్ నుంచి మంటలు వచ్చి చిన్న చిన్న ప్రమాదాలు జరిగాయి. కానీ ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. చినూక్ హెలికాప్టర్లను లాజిస్టిక్ సేవలలో ఎక్కువగా ఉపయోగిస్తారు. వందల టన్నుల బరువును ఇవి మోయగలవు. వీటిని తాత్కాలికంగా నిలిపివేసిన తరుణంతో అమెరికా సైన్యానికి వస్తు రవాణాలో సవాళ్లు ఎదరుయ్యే పరిస్థితి కన్పిస్తోంది. ఈ ఆంక్షలు ఎప్పటివరకు అమలులో ఉంటాయి అనే విషయంపై కూడా స్పష్టత లేదు. చదవండి: ప్రచ్ఛన్న యుద్ధానికి ముగింపు పలికిన సోవియట్ యూనియన్ నేత మృతి -
అలారంలోనే సాంకేతిక లోపం.. హడలిపోయిన ప్రయాణికులు
కొయంబత్తూర్: విమానంలో ఏదైనా సాంకేతిక లోపం ఉంటే ముందుగా అలారం మ్రోగడం సర్వ సాధారణంగా జరుగుతూ ఉంటుంది. అటువంటిది అలారంలోనే సాంకేతిక సమస్య తలెత్తి అది మ్రోగితే ఇక అంతే విమాన సిబ్బందిలో, ప్రయాణికుల్లో ఒకటే టెన్షన్ మొదలవుతుంది. విమానం అత్యవసరంగా ల్యాండ్ అయ్యే వరకూ ఏం జరుగుతుందో అనే ఒకటే భయం ఉంటుంది. అలారంలో సాంకేతిక సమస్య తలెత్తి అత్యవసరంగా విమానాన్ని ల్యాండ్ చేయాల్సిన ఘటన శుక్రవారం చోటు చేసుకుంది. బెంగళూరు నుంచి 92 మంది ప్రయాణికులతో బయల్దేరిన గో ఫస్ట్ విమానాన్ని తమిళనాడులోని కొయంబత్తూర్లో అత్యవసరంగా ల్యాండ్ చేశారు. కొయంబత్తూర్లో ఎయిర్పోర్ట్ అధికారులు పర్మిషన్ తీసుకుని ల్యాండ్ చేయాల్సి వచ్చింది. విమానం ల్యాండ్ అయ్యే క్రమంలో ఎటువంటి ఇబ్బంది లేకుండా జరిగింది. అప్పటికే ఫైర్ ఫైటర్స్ అక్కడికి చేరుకుని ఉన్నారు. ఆ తర్వాత విమానాన్ని ఇంజనీర్లు తనిఖీ చేయగా ఎటువంటి సమస్య లేదని తేల్చారు. కాగా, అలారం ఎందుకు మోగింది అంటే అందులో ఏదో సాంకేతిక సమస్య రావడంతో అలా జరిగిందని ఇంజనీర్లు స్పష్టం చేశారు. విమానంలో ఎటువంటి ఇబ్బంది లేదని, అలారంలో ప్రాబ్లం వల్లే ల్యాండ్ చేయాల్సిన అవసరం వచ్చిందని ఎయిర్పోర్ట్ అధికారి ఒకరు తెలిపారు. విమానంలో ఉండే ట్విన్ ఇంజన్స్ ఓవర్ హీట్కు గురైనప్పుడు అలారం మ్రోగడంతో అలర్ట్ అవుతారు విమాన సిబ్బంది. కానీ ఇక్కడ విమానంలో ఎటువంటి సమస్య లేకుండానే అలారం మ్రోగడం ఏంటా అనేది సదరు ఇంజనీర్లకే తెలియాలి. గతవారం గో ఫస్ట్ విమానం టేకాఫ్ అయిన కొద్ది నిమిషాల్లోనే పక్షి తాకడంతో విమానాన్ని తిరిగి అహ్మదాబాద్కు రప్పించిన సంగతి తెలిసిందే. -
‘చైనా పదే పదే ఇలా ఎందుకు చేస్తుందో చెప్పలేను’
Chinese aircraft breached the Indian perceived LAC: భారత్-చైనా మధ్య 16వ రౌండ్ అత్యున్నత స్థాయి సైనిక చర్చలు ఆదివారం ప్రారంభమయ్యాయి. ఈ మేరకు ఐఏఎఫ్ చీఫ్ ఎయిర్ మార్షల్ వీఆర్ చౌదరి మాట్లాడుతూ....వాస్తవ నియంత్రణ రేఖ(ఎల్ఏసీ) అంతటా గగనతలంలో వైమానిక దళాలు నిరంతరం పర్యవేక్షిస్తాయని చెప్పారు. ఏదైనా చైనా విమానం భారత గగనతలానికి కొంచెం దగ్గరగా వచ్చినట్లు గుర్తించిన వెంటనే తగిన చర్యలు తీసుకుంటామని అన్నారు. ఐతే జూన్ చివరి వారంలో ఒక చైనీస్ విమానం భారత్ వాస్తవ నియంత్రణ రేఖను దాటి కొన్ని నిమిషాలపాటు ఘర్షణ ప్రాంతాల మీదుగా ఎగిరిందని తెలిపారు. భారత్ రాడార్ సాయంతో ఆ యుద్ధ విమానాన్ని గుర్తించామని ఆ విమానాన్ని అడ్డుకున్నట్లు కూడా వివరించారు. చైనా విమానాలు వాస్తవ నియంత్రణ రేఖ వద్దకు వచ్చినప్పుడల్లా.. తమ వైమానిక కార్యకలాపాలను అప్రమత్తం చేసి తగిన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఐతే చైనీయుల ఇలా పదేపదే ఎందుకు చేస్తున్నారనే విషయంపై సరైన వివరణను ఇవ్వలేనని చౌదరి అన్నారు. ఈ క్రమంలోనే తూర్పు లడఖ్లోని వాస్తవాధీన రేఖ వెంబడి ఘర్షణ ప్రాంతాల్లో తలెత్తుతున్న సమస్యలను పరిష్కరించే రీత్యా ఈ 16వ రౌండ్ అత్యున్నత స్థాయి సైనిక చర్చలు జరుగుతున్నాయి అని చెప్పారు. ఈ చర్చలు భారత్ వాస్తవాధీన రేఖ వైపున ఉన్న చుషుల్ మోల్డో ప్రాంతంలో ఉదయం 9:30 గంటలకు ప్రారంభమయ్యాయని తెలిపారు. గతంలో భారత సైన్యం, చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ(పీఎల్ఏ) మధ్య 15వ రౌండ్ చర్చలు మార్చి 11న దాదాపు 13 గంటల పాటు జరిగింది. ఐతే ఈ చర్చలు ఫలించలేదు. ఈ మేరకు ప్రభుత్వం చేపట్టిన అగ్నిపథ్ పథకం గురించి కూడా ఐఎఎఫ్ చీఫ్ మాట్లాడారు. దీనికి సంబంధించి దాదాపు 7.5 లక్షల దరఖాస్తులను స్వీకరించామన్నారు. ఇది సాయుధ దళాల్లో చేరేందుకు యువతలో ఉన్న ఆసక్తిని తెలియజేస్తోంది. డిసెంబర్లో శిక్షణ ప్రారంభించేలా.. ఎంపిక ప్రక్రియను సకాలంలో పూర్తి చేయడం ఒక పెద్ద సవాలు అని చెప్పారు. పైగా ఈ ఏడాది ఎయిర్ఫోర్స్ డే పరేడ్ను చండీగఢ్లో నిర్వహించనున్నట్లు చౌదరి తెలిపారు. (చదవండి: ప్రజలకు తక్షణ ఉపశమన కార్యక్రమాలు అందించాలి) -
ఏరోస్పేస్ వ్యాలీగా హైదరాబాద్
శంషాబాద్: టెక్నాలజీ హబ్గా మారిన హైదరాబాద్ ఏరోస్పేస్ వ్యాలీగా కూడా ఎదుగుతోందని ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ చెప్పారు. నూతన పారిశ్రామిక విధానంతో పరిశ్రమల స్థాపనకు రాష్ట్ర సర్కారు పెద్దపీట వేస్తోంద న్నారు. గురువారం జీఎంఆర్ హైదరాబాద్ ఏరోస్పేస్ పార్క్లో ఫ్రాన్స్కు చెందిన విమాన రంగ ఉత్పత్తుల సంస్థ శాఫ్రాన్ ఎలక్ట్రికల్ అండ్ పవర్, ఎయిర్క్రాఫ్ట్ ఇంజిన్ ఫెసిలిటీ కేంద్రాలను ఆయన ప్రారంభించారు. వైమానిక రంగంలోని నిర్వహణ, మరమ్మతుల రంగంలో కేవలం దేశంలోనే కాకుండా మధ్యప్రాచ్య దేశాలకు హైదరా బాద్ కేంద్ర బిందువుగా మారుతుందని ధీమా వ్యక్తం చేశారు. శాఫ్రాన్ సంస్థ ప్రారంభించ బోయే నిర్వహణ, మరమ్మతుల కేంద్రం (ఎంఆర్ఓ) అంతర్జాతీయంగా హైదరాబాద్ను మరో స్థానానికి తీసుకెళ్తుందని కేటీఆర్ చెప్పారు. విమాన ఇంజన్లకు వైర్ హార్నెస్లను శాఫ్రాన్ ఎలక్ట్రికల్ అండ్ పవర్ ఫ్యాక్టరీ ఉత్పత్తి చేస్తుంది. అలాగే, కీలకమైన లీప్ ఇంజన్ల కోసం క్లిష్టమైన ఏరో ఇంజన్ భాగాలను శాఫ్రాన్ ఎయిర్క్రాఫ్ట్ ఇంజన్ ఫ్యాక్టరీ తయారు చేస్తుంది. ఫ్రాన్స్కు నేరుగా విమానాలు నడవాలి రాష్ట్రంలో ఇప్పటికే పరిశ్రమలు కొనసాగిస్తున్న పెట్టుబడిదారులు మరిన్ని పరిశ్రమలు పెడుతు న్నారంటే వారే తెలంగాణకు బ్రాండ్ అంబాసి డర్ వంటి వారని సీఎం కేసీఆర్ అనేక సందర్భాల్లో చెప్పినట్లు మంత్రి కేటీఆర్ గుర్తుచేశారు. హైదరాబాద్–ఫ్రాన్స్కు మధ్య నేరుగా విమా నాలు కూడా నడవాలని కేటీఆర్ ఆకాంక్షించారు. రాష్ట్ర ప్రభుత్వ విధానాలతో అంతర్జాతీయ స్థాయి కంపెనీలు అడుగుపెట్టడంతో ఉపాధి కూడా మెరుగవుతోందని చెప్పారు. సర్కారు యువతను టీవర్క్, వీహబ్, స్టార్టప్ కేంద్రాలతో ప్రోత్సహిస్తోందన్నారు. హైదరాబాద్ విమానాశ్ర యం కూడా అనేక అంశాల్లో అగ్రస్థానంలో నిలిచిందని పేర్కొన్నారు. త్వరలోనే ఎంఆర్ఓ సీఎఫ్ఎం, లీప్ ఇంజిన్ల కోసం అతిపెద్ద నిర్వ హణ మరమ్మతుల కేంద్రాన్ని (ఎంఆర్ఓ) త్వరలో హైదరాబాద్లో ప్రారంభించనున్నట్లు శాఫ్రాన్ గ్రూప్ సీఈఓ ఒలివియర్ ఆండ్రీస్ ప్రకటించారు. ఏరోస్పేస్, రక్షణ రంగాల్లో మరో కొత్త అధ్యాయంగా నిలుస్తుందన్నారు. మేకిన్ ఇండియాలో భాగంగా 2025 నాటికి 200 మిలి యన్ డాలర్ల పెట్టుబడులు పెట్టాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో రవాణ శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్, శాఫ్రాన్ ఎయిర్క్రాఫ్ట్ ఇంజిన్ సీఈఓ జీన్పాల్ అలరీ, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యరద్శి జయేశ్ రంజన్ తదితరులున్నారు. -
గురి కుదిరేనా! మరో రంగంపై ముఖేష్ అంబానీ కన్ను!
ఆసియాలో అత్యంత సంపన్నుడైన ముకేశ్ అంబానీ ఏవియేషన్ రంగంపై కన్నేశారు. బెంగళూరు కేంద్రంగా రిలయన్స్ సబ్సిడరీ సంస్థ 'సాంఖ్యసూత్ర ల్యాబ్స్' ఆధ్వర్యంలో విమానాల డిజైన్లను తయారు చేస్తున్నారు. 2019లో రిలయన్స్ ఇండస్ట్రీస్ రూ.216కోట్ల పెట్టుబడితో సాంఖ్యసూత్ర ల్యాబ్స్ సంస్థకు చెందిన 83శాతం వాటాను సొంతం చేసుకున్నారు. ఈ కంపెనీ హై ఫిడిలిటీ ఏరోడైనమిక్స్, మల్టీఫిజిక్స్ సిమ్యులేషన్ సాఫ్ట్వేర్ను డెవలప్ చేస్తోంది. అంటే సులభంగా తక్కువ బడ్జెట్లో ఎయిర్ క్ట్రాఫ్ట్లను డిజైన్ చేస్తుంది. డిజైన్లు రక్షణ రంగానికి ఉపయోగపడనున్నాయి. ఈనేపథ్యంలో బెంగళూరులో హాల్ మేనేజ్మెంట్ అకాడమీ ఆధ్వర్యంలో ఏరో కాన్-2022 జరిగిన సెకండ్ ఎడిషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఏరో స్పేస్ కాన్ఫరెన్స్ జరిగింది. కాన్ఫిరెన్స్లో పైలెట్ల అవసరం లేకుండా ఆటోమెటిక్ సిస్టమ్ (అటానమస్ ఎయిర్ బర్న్ సిస్టమ్) ద్వారా విమానాల్ని ఎలా నియంత్రించాలి. ఆ రంగానికి ఎదురయ్యే సవాళ్లు, అందులో అవకాశాల వంటి అంశాలపై చర్చించింది. ఈ సందర్భంగా ఆ సంస్థ తయారు చేసిన సాఫ్ట్వేర్ను ప్రదర్శించింది. అదే సమయంలో ఈ ఏడాది అక్టోబర్ నెలలో సాంఖ్యసూత్ర ల్యాబ్స్ నుంచి ఓ కొత్త ప్రొడక్ట్ విడుదల కానున్నట్లు సంకేతాలిచ్చింది. అయితే ఆ ప్రొడక్ట్ ఏంటనేది బహిర్గతం కాలేదు. "ఖచ్చితమైన, నమ్మకమైన విమాన డిజైన్ల రూప కల్పన కోసం ఉపయోగించే విండ్ టన్నెల్ వంటి ఖరీదైన ప్రయోగాలు ఎక్కువ సమయం తీసుకునే ప్రయోగాల అవసరాన్ని సమర్థవంతంగా తగ్గిస్తాయి. అంతేకాదు తాము డిజైనింగ్ టూల్స్ కోసం ఫిజిక్స్, మ్యాథమెటిక్స్, కంప్యూటర్ సైన్స్లను ఉపయోగిస్తున్నట్లు కాన్ఫరెన్స్లో సాంఖ్యసూత్ర ల్యాబ్స్ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ వినయ్ కరివాలా అన్నారు. -
రాకేష్ ఝున్ఝున్వాలా టార్గెట్ ఇదే: 'ఆకాశ'..ఫస్ట్ లుక్!
సామాజిక, ఆర్థిక నేపథ్యంతో సంబంధం లేకుండా అతి తక్కువ ధరకే విమాన ప్రయాణ సౌకర్యం కల్పించేందుకు స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్ రాకేష్ ఝున్ఝున్ వాలా ఆకాశ ఎయిర్ పేరుతో విమాన సంస్థను ప్రారంభించారు. తాజాగా ఆ సంస్థకు చెందిన విమానాల ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రాకేష్ ఝున్ఝున్ వాలాకు చెందిన ఆకాశ ఎయిర్ విమాన సేవలు ఈ ఏడాది జులై నుంచి అందుబాటులోకి రానున్నాయి. అయితే ఇప్పుటి వరకు ఆకాశ ఎయిర్ విమానాలు ఎలా ఉండబోతున్నాయి. వాటి కోడ్ ఏంటనే విషయాలో వెలుగులోకి రాలేదు. ఈ నేపథ్యంలో ఆకాశ ఎయిర్ తన సంస్థకు చెందిన విమాన రూపు రేఖల్ని ప్రజలకు పరిచయం చేసింది. విమానం ఆకారం, కలర్స్తో పాటు కోడ్లను వివరిస్తూ కొన్ని ఫోటోల్ని ట్వీట్ చేసింది. విమానాలకు కోడ్ ఏంటీ! దేశాన్ని బట్టి ఆయా సంస్థలకు చెందిన విమానాలకు కొన్ని కోడ్లు ఉంటాయి. ఉదాహరణకు..ఎయిర్లైన్కు 'క్యూపీ', ఇండిగో కోడ్ '6ఈ',గో ఫస్ట్ 'జీ8',ఎయిర్ ఇండియాకు 'ఏఐ' అని ఉంది. ఆకాశ ఎయిర్ సైతం తమ విమానాల కోడ్ ఏంటనేదీ రివిల్ చేసింది. కాంట్ కీప్ క్లైమ్! సే టూ హాయ్ అంటూ ఆకాశ ఎయిర్ విమానం కోడ్ 'క్యూపీ- పీఐఈ'! ట్వీట్లో పేర్కొంది. Coming soon to Your Sky! ✈️#AvGeek pic.twitter.com/nPpR3FMpvg — Akasa Air (@AkasaAir) May 23, 2022 ఆకాశ ఎయిర్ సీఈవో వినయ్ దుబే తాము ముందుగా ప్రకటించిన సమయానికే ఆకాశ ఎయిర్ విమాన సర్వీసులు ప్రారంభం అవుతాయి. జున్ 2022కంటే ముందుగా ఫస్ట్ ఎయిర్ క్రాప్ట్ డెలివరీ అవుతుంది. జులై 2022 నాటికి ఆకాశ ఎయిర్ కమర్షియల్ ఆపరేషన్ను ప్రారంభింస్తామని ఆకాశ ఎయిర్ సీఈవో వినయ్ దుబే తెలిపారు. బోయింగ్తో ఒప్పందం రాకేష్ ఝున్ఝున్ వాలా ఆకాశ ఎయిర్ విమానాల్ని తయారు చేసేందుకు అమెరికాకు చెందిన విమానాల తయారీ సంస్థ బోయింగ్తో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఝున్ఝున్ వాలా గతేడాది నవంబర్ 26,2021న బోయింగ్ సంస్థతో 72 మ్యాక్స్ విమానాల్ని కొనుగోలు చేశారు. వీటితో పాటు 72బోయింగ్ 737మ్యాక్స్ ఎయిర్ క్రాప్ట్లు కూడా ఉన్నాయి. ఆ సంస్థ మొత్తం విమానాల్ని తయారు చేసి ఆకాశ ఎయిర్కు అప్పగించనుంది. ఇందులో భాగంగా బోయింగ్ కంపెనీ తొలి ఎయిర్ క్రాప్ట్ ను ఏ ఏడాది జున్ నాటికి ఆకాశ ఎయిర్కు అందించనుంది. Can’t keep calm! Say hi to our QP-pie! 😍#AvGeek pic.twitter.com/sT8YkxcDCV — Akasa Air (@AkasaAir) May 23, 2022 సాధ్యమేనా! కాంపిటీషన్, ఫ్లైట్ల నిర్వహణతో పాటు పెరిగిపోతున్న ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్, కరోనా కారణంగా ప్రపంచ దేశాల్లో విమానాల రాకపోకలపై ఆంక్షలు విధించడంతో పాటు ఇతర కారణాల వల్ల గడిచిన 10ఏళ్లలో పెద్ద సంఖ్యలో ఆయా విమాన సంస్థలు తమ సర్వీసుల్ని పూర్తిగా రద్దు చేశాయి. పదుల సంఖ్యలో విమానాలు ప్రభుత్వం ఆధీనంలో సేవలందిస్తున్న ఎయిర్ ఇండియా సైతం నష్టాలకు తట్టుకోలేక టాటా కంపెనీకి అమ్మేసింది. రతన్ టాటా ఎయిర్ ఇండియా కొనుగోలు చేయడంతో కష్టాల నుంచి గట్టెక్కితే మిగిలిన సంస్థలు అప్పుల ఊబిలో కూరుకుపోయి.. కార్యకాలాపాల్ని నిలిపివేశాయి. వాటిలో వాయిదూత్ ఎయిర్ లైన్స్, సహార ఎయిర్ లైన్స్, ఎండీఎల్ ఆర్ ఎయిర్లైన్స్, డక్కన్ ఎయిర్ వేస్ లిమిటెడ్, దర్బంగా ఏవియేషన్, దమానియా ఎయిర్ వేస్, గుజరాత్ ఎయిర్ వేస్, ఎయిర్ కోస్టా, ఎయిర్ కార్నివాల్, జెట్ ఎయిర్ వేస్, ఎయిర్ మంత్రా, కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్లు ఉన్నాయి. సుమారు రూ.66వేల కోట్లు ఈ క్రమంలో రాకేష్ ఝున్ఝున్వాలా 'ఆకాశ ఎయిర్' బ్రాండ్ కింద ఎస్ఎన్వీ ఏవియేషన్ ప్రైవేటు లిమిటెడ్ సంస్థను ఏర్పాటు చేశారు. నవంబర్ 16న ఆ కంపెనీ 72 బోయింగ్ 737 మ్యాక్స్ విమానాల్ని ఆర్డర్ చేసింది. ఈ ఒప్పందం విలువ దాదాపు 9 బిలియన్ డాలర్లు(సుమారు రూ. 66 వేల కోట్లు) గా ఉంది. అయితే ఇండస్ట్రీలో నిలదొక్కుకొని అప్పుల్లో కూరుకుపోవడంతో పెద్ద సంఖ్యలో ఏవియేషన్ సంస్థలు సర్వీసుల్ని నిలిపివేస్తే..ఇప్పుడు ఆకాశ ఎయిర్తో కొత్త విమాన సర్వీసుల్ని ప్రారంభించడం కత్తి మీద సామేనని మార్కెట్ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. చదవండి👉రాకేష్ ఝున్ఝున్వాలా టార్గెట్ అదే, రూ.66వేల కోట్లతో..! -
‘మాక్స్డోమ్’ మళ్లొచ్చింది
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్కు సంబంధించిన విమానం ‘ఇల్యుమిష్ ఐఎల్–80 మాక్స్డోమ్’(విపత్తు సమయంలో వాడేది) తాజాగా వార్తల్లోకి వచ్చింది. తాజాగా మాస్కో చుట్టూ ఈ విమానం చక్కర్లు కొట్టడంతో అందరి దృష్టి దీనిపై పడింది. ఆకాశంలో ఎగిరే ‘క్రెమ్లిన్’(రష్యా అధ్యక్ష భవనం) అంటుంటారీ విమానాన్ని. అణు యుద్ధం లాంటివి సంభవించినప్పుడు రష్యాను పాలించడం దగ్గర్నుంచి విమానం నుంచే అణు దాడికి ఆదేశాలిచ్చేందుకు అవసరమైన ఏర్పాట్లన్నీ ఇందులో ఉన్నాయి. ఉక్రెయిన్, రష్యా యుద్ధ సమయంలో ఈ విమానం కనబడటంతో ఉత్కంఠ నెలకొంది. అసలీ విమానం విశేషాలేంటో తెలుసుకుందామా.. ►సోవియట్ కాలానికి చెందిన ఈ విమానానికి అవసరమైన ఇంధనాన్ని ఆకాశంలోనే నింపుకోవచ్చు. ఇందుకోసం కాక్పిట్ కింద ఏర్పాటు ఉంది. ►విమానంలో నుంచే రష్యాను పరిపాలించేందుకు, ఏదైనా యుద్ధం జరుగుతున్నప్పుడు ఆకాశంలో నుంచే మిలిటరీకి ఆదేశాలు జారీ చేయొచ్చు..అంతేకాదు.. అణు దాడికి ఆదేశాలిచ్చేందుకు కూడా ఏర్పాట్లు ఉన్నాయి. ►కాక్పిట్కు తప్ప విమానానికి ఇంకెక్కడా కిటికీలు ఉండవు. ►విమానంలో ముఖ్యమైన భాగం జ్వెనో–ఎస్. ఇందులో అత్యాధునిక కమ్యూనికేషన్ గది ఉంది. విమానంపైన ముందు భాగంలో ఏర్పాటు చేసిన శాటిలైట్ యాంటెన్నాల సాయంతో ఇది పని చేస్తుంది. ►సముద్రంలోని సబ్మెరైన్లలో (బాలిస్టిక్ క్షిపణులను కలిగి ఉండేవి) ఉన్న అధికారులకు ఆదేశాలు ఇచ్చేందుకు వెరీలో ఫ్రీక్వెన్సీ యాంటెన్నా వ్యవస్థ కూడా ఉంది. ►1987లో తొలి విమానం తయారైంది. మొత్తం 4 తయారు చేశారు. 2008లో ఈ విమానాలను ఆధునీకరించారు. జ్వెనో–ఎస్ రెండో వెర్షన్ను తయారు చేశారు. దీన్ని రెండు విమానాల్లో ఏర్పాటు చేశారు. ►విమానం పొడవు 60 మీటర్లు, రెక్కల పొడవు 48 మీటర్లు ఉంటుంది. ►గంటకు 850 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లగలదు. ఒకసారి ఇంధనం నింపాక 3,600 కిలోమీటర్లు వెళ్లగలదు. 2010 నుంచి కనిపించలే రెండో ప్రపంచ యుద్ధం ముగిశాక ఆ విజయానికి గుర్తుగా ఏటా జరిగే కార్యక్రమంలో ఈ విమానం కనిపిస్తుండేది. అయితే 2010 నుంచి కనిపించకుండాపోయింది. తాజాగా మళ్లీ కనిపించి వార్తల్లో నిలిచింది. ఉక్రెయిన్, రష్యా యుద్ధం నేపథ్యంలో పశ్చిమ దేశాలకు హెచ్చరికలు పంపేందుకే ఈ విమానాన్ని పుతిన్ మళ్లీ బయటకు తెచ్చారని అనుకుంటున్నారు. అయితే దీనిపై రష్యా రక్షణ శాఖ స్పందించింది. మే 9న విక్టరీ డే పరేడ్లో విమానం కనిపించనుందని, అందులో భాగంగా రిహార్సల్స్ చేసేందుకే మాస్కో చుట్టూ చక్కర్లు కొట్టిందని వెల్లడించింది. – సాక్షి, సెంట్రల్ డెస్క్ -
Russia-Ukraine War: ఉక్రెయిన్కు మరిన్ని ఆయుధాలు
కీవ్: ఉక్రెయిన్పై దాడిలో రష్యా అమానవీయంగా ప్రవర్తిస్తుందన్న నివేదికల నేపథ్యంలో ఉక్రెయిన్కు మరిన్ని ఆయుధాలివ్వాలని నాటో కూటమి దేశాలు గురువారం నిర్ణయించాయి. రష్యా దారుణాలు నిజమేనని జర్మనీ నిఘా సంస్థ ధృవీకరించినట్లు కథనాలు వచ్చాయి. అయితే ఒక కూటమిలాగా ఉక్రెయిన్కి సాయం చేయడానికి నాటో నిరాకరించింది. సభ్యదేశాలు విడిగా యాంటీ ఎయిర్క్రాఫ్ట్, యాంటీ ట్యాంక్ తదితర ఆయుధాలు, ఔషధాలు ఇచ్చేందుకు అంగీకరించాయి. కూటమిలో ఏ దేశం ఎలాంటి సాయం చేయనుందనే వివరాలు తెలిపేందుకు సెక్రటరీ జనరల్ స్టోల్టెన్బర్గ్ నిరాకరించారు. ఉక్రెయిన్కు ఆధునిక ఆయుధాలు అందిస్తామని, అక్కడ యుద్ధం కొత్త దశకు చేరుతోందని బిట్రన్ వ్యాఖ్యానించింది. అంతకుముందు రష్యా దాడిని ఎదుర్కొనేందుకు తమకు ఆయుధ సహకారం అందించాలని పాశ్చాత్య దేశాలను, నాటోను ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి డిమిత్రో కులెబా కోరారు. నాటో విదేశాంగ మంత్రులతో చర్చలకు ఆయన బ్రసెల్స్ వచ్చారు. ఆయుధాలందిస్తే రష్యా తదుపరి లక్ష్యంగా మారతామని నాటో దేశాల్లో కొన్ని భయపడుతున్నాయి. ఇప్పటికే పలు దేశాలు ఉక్రెయిన్కు అనేక ఆయుధాలను అందించాయి. అయితే విమానాలు, ట్యాంకుల్లాంటి ఆయుధాలను ఇవ్వలేదు. తమకు మిస్సైల్స్, సాయుధవాహనాలు, డిఫెన్స్ సిస్టమ్స్ కావాలని కులెబా కోరుతున్నారు. జర్మనీ లాంటి దేశాలు తమకు మరింత వేగంగా సాయం అందించాలన్నారు. కీవ్, చెర్నిహివ్ ప్రాంతాల నుంచి రష్యా 24 వేల మంది సైనికులను ఉపసంహరించుకుందని, వీరిని తూర్పు ప్రాంతంలో యుద్ధానికి సన్నద్ధం చేస్తోందని అమెరికా అధికారి ఒకరు చెప్పారు. లుహాన్స్క్, డొనెట్సెక్ ప్రాంతాల్లాగే డోన్బాస్లో కూడా కొన్ని ప్రాంతాలను ఉక్రెయిన్ నుంచి విడగొట్టాలన్నది పుతిన్ యత్నంగా నిపుణులు అభివర్ణిస్తున్నారు. తూర్పు ప్రాంతంపై రష్యా సేనలు దృష్టి పెడుతున్న వేళ అక్కడి నుంచి త్వరగా వెళ్లిపోవాలని స్థానికులను ఉక్రెయిన్ ప్రభుత్వం కోరింది. రష్యాపై ఆంక్షల రూపంలో ఒత్తిడి పెంచుతామని జీ7 దేశాలు ప్రకటించాయి. హక్కుల మండలి నుంచి రష్యా సస్పెన్షన్ మానవహక్కుల సమాఖ్య నుంచి రష్యాను సస్పెండ్ చేసే తీర్మానానికి ఐరాస ఆమోదం లభించింది. ఈ తీర్మానంపై ఐరాస జనరల్ అసెంబ్లీలో గురువారం ఓటింగ్ జరిగింది. రష్యా సస్పెన్షన్కు అనుకూలంగా 93 ఓట్లు, వ్యతిరేకంగా 24 ఓట్లు వచ్చాయి. ఓటింగ్కు భారత్ దూరంగా ఉంది. ఐరాస శాశ్వత సభ్యదేశాల్లో ఇంతవరకు ఏ దేశం కూడా ఐరాస అనుబంధ విభాగాల నుంచి సస్పెండ్ కాలేదు. -
వంటనూనెతో నింగిలోకి..
వంట నూనెల ధరలు ఆకాశాన్నంటుతున్న వేళ... ప్రపంచంలోనే అతిపెద్ద ప్యాసింజర్ విమానం జెట్ఇంధనంతోకాకుండా వంటనూనెతో నింగిలోకి ఎగిరింది. అది ఎప్పుడు ఎక్కడ టేకాఫ్ అయింది... ఇదెలా సాధ్యమనే ఆసక్తికర విషయాలేంటో తెలుసుకుందాం... –సాక్షి, సెంట్రల్ డెస్క్ సూపర్ జంబో విమానం ఎయిర్బస్ ఏ–380 వంటనూనెతో ఆకాశంలోకి ఎగిరి మూడు గంటలపాటు చక్కర్లు కొట్టింది. ఈ విమానం ఇటీవల ఫ్రాన్స్లోని టౌలూస్ బ్లాగ్నక్ విమానాశ్రయంలో వంటనూనెతో తయారుచేసిన సస్టెయినబుల్ విమాన ఇంధనాన్ని (ఎస్ఏఎఫ్) 27 టన్నుల వరకు నింపుకుని టేకాఫ్ అయింది. మూడు గంటల తర్వాత నైస్ విమానాశ్రయంలో విజయవంతంగా ల్యాండయింది. ఈ విమానం 100 శాతం ఎస్ఏఎఫ్తో నింగిలోకి ఎగరడం ఇదే తొలిసారి కావడం విశేషం. కొవ్వులు, ఇతర వ్యర్థాలతో.. హరిత, మునిసిపల్ వ్యర్థాలు,కొవ్వులతో తయార య్యే ఈ ఎస్ఏఎఫ్ ఇంధనం దాదాపు 80 శాతం కా ర్బన్డయాక్సైడ్ను తగ్గిస్తుంది. ఏవియేషన్ పరిశ్రమ 2050 నాటికల్లా కర్భన ఉద్గారాలను జీరో లక్ష్యంగా పెట్టుకోగా,యూకే ప్రభుత్వం 2030 నాటికి 10 శా తం ఎస్ఏఎఫ్ను వినియోగించాలని లక్ష్యంగా పెట్టుకుంది. గత ఏడాదికాలంలో ఏ380తోపాటు మూడు విమానాలు 100 శాతం వంటనూనెతో నింగిలోకి ఎగిరాయి. 2021 మార్చిలో ఏ350, అక్టోబర్లో ఏ319నియో విమానాలు ఇలా ఎఫ్ఏఎఫ్తో చక్కర్లు కొట్టాయి. ధర ఐదు రెట్లు ఎక్కువ... సంప్రదాయ విమాన ఇంధనంతో పోలిస్తే ఈ హరిత జెట్ ఇంధనం ధర ఐదు రెట్లు ఎక్కువగా ఉంటుంది. ఈ ఇంధనాన్ని వాడితే విమాన టికెట్ల ధరలు కూడా ఎక్కువ అవుతాయని, అయితే ప్రభుత్వాలు సబ్సిడీలిచ్చి ఆదుకుంటే ధరలు పెంచాల్సిన అవసరం ఉండదని విశ్లేషకులు అంటున్నారు. 2030 నాటికి 13 హరిత విమాన ఇంధనం ప్లాంట్లను నెలకొల్పాలని యూకే ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఒక్కో ప్లాంట్కు సుమారు రూ.2,280 కోట్లు వ్యయమవుతుంది. ఎస్ఏఎఫ్ వినియోగం పెరిగిందంటే జీరో కర్భన ఉద్గారాల లక్ష్యానికి చేరువవుతున్నట్లే అని ఎయిర్బస్ సంస్థ పేర్కొంది. తమ విమానాలన్నింటిని 50శాతం ఎస్ఏఎఫ్–కిరోసిన్ మిశ్రమంతో నడిపేందుకు అనుమతి ఉందని చెప్పింది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఏడాదికి 200 బిలియన్ లీటర్ల విమాన ఇంధనం అవసరం అవుతుండగా, గత ఏడాది 10–12 కోట్ల లీటర్ల ఎస్ఏఎఫ్ మాత్రమే ఉత్పత్తి అయిందని అంతర్జాతీయ వైమానిక సంస్థ ఐఏటీఏ అంచనావేసింది. ఇది మొత్తం డిమాండ్లో 0.05 శాతం మాత్రమేనని చెప్పింది. శిలాజ ఇంధనాలతో పోలిస్తే ఇలాంటి జీవఇంధనాలతో కాలుష్యం తక్కువగా ఉంటుంది. అందుకే ఎస్ఏఎఫ్ వాడకాన్ని పెంచాలని వైమానిక సంస్థలు ప్రణాళికలు వేస్తున్నాయి. ఎలా మారుస్తారు? మనం వాడుతున్న వంటనూనెను అలాగే విమాన ఇంధనంగా వాడలేం. వాడిన వంటనూనెకు కొన్నిరకాల మిశ్రమాలు కలిపి కొంత ప్రాసెస్ చేసి జీవఇంధనంగా మారుస్తారు. జీఎఫ్ కమ్యూనికేషన్స్ సంస్థ ప్రకారం వాడిన ఆలివ్, కనోలా నూనెలు దీనికి బాగా పనికొస్తాయి. ఎందుకంటే అవి తాజా నూనె కన్నా కూడా బాగా చిక్కగా ఉంటాయి. విమాన ఇంధనంగా మార్చేందుకు ముందుగా వాడిన నూనెను వడబోసి అందులో ఉన్న వ్యర్థాలను తొలగిస్తారు. తర్వాత దాన్ని 70ఫారన్హీట్ వరకు వేడిచేస్తారు. తర్వాత కొంచెం ఆల్కహాల్, సోడియం క్లోరైడ్ తదితరాలను జతచేస్తారు. ఈ మిశ్రమంతో రెండు రకాల ఉత్పత్తులు అంటే మీథైల్ ఈస్టర్, గ్లిసరిన్ తయారవుతాయి. బయోడీజిల్ (జీవఇంధనం) రసాయన నామం మీథైల్ ఈస్టర్. గ్లిసరిన్ను సబ్బులతోపాటు చాలారకాల ఉత్పత్తుల తయారీకి వాడతారు. -
సంచలనం, వంట నూనెతో అద్భుతం..కుకింగ్ ఆయిల్తో కాస్ట్లీ విమానం నడిపారు!
సీట్లు నిండినా..గల్లా ఖాళీ అవుతుంది ఇదీ ప్రస్తుతం విమానయాన పరిస్థితి. అందుకే విమానాయన సంస్థలు ఆవ నూనె, వంట నూనెతో విమానాల్ని నడిపేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టాయి. మంచి ఫలితాల్ని రాబడుతున్నాయి. తాజాగా 496 మంది ప్రయాణించే కాస్ట్లీ విమానం 'ఎయిర్ బస్ ఏ380'లో వంటింట్లో వాడే వంట నూనె ఫ్యూయల్గా ఉపయోగించారు. ఎలాంటి ప్రమాదం లేకుండానే విమానం నిర్దేశించిన ఎయిర్పోర్ట్లో విజయవంతంగా టేకాఫ్ అయ్యింది. ప్రస్తుతం ఈ అంశం ప్రపంచ వ్యాప్తంగా సంచలనంగా మారింది. గాలి నుంచి కాదు ఆవ మొక్క నుంచి ఇంధనం ఐదేళ్ల క్రితం గాలి నుంచి విమానం ఇంధనం తయారవుతుందని అనడంతో విమానయానం కష్టాలు ఇక తీరిపోయినట్లేనని భావించారు. ఎందుకంటే అసలు విమానయానం కష్టాలన్నీ ఇంధనం వల్లనే జరుగుతున్నాయి. నానాటికి పెరిగిపోతున్న చమురు ధరలతో..వాటి ఖర్చు ఆకాశం నుంచి అంతరిక్షం దాటుతోంది. దాంతో ఆల్ట్రనేటీవ్ ఫ్యూయల్ వైపు అందరూ ఆశగా ఎదురు చూశారు. కానీ అదెందుకో కార్యచరణకు నోచుకోలేదు. కానీ గతేడాది భారత శాస్త్రవేత్త,జార్జియా యూనివర్సిటీ ప్రొఫెసర్ పునీత్ ద్వివేదీ బృందం ఆవాల మొక్క ద్వారా విమానం ఇంధనం తయారవుతుందనగానే ఆశలు చిగురించాయి. బ్రాసికా కేరినాటా రకం ఆవాల మొక్కల నుంచి తీసే నూనెతో విమానం ఇంధనం తయారు చేయోచ్చని పునీత్ ద్వివేది తెలిపారు. ద్వివేదీ గత 4 సంవత్సరాలుగా దీనిపై పరిశోధనలు చేస్తుండగా..ఈ ప్రాజెక్టును15 మిలియన్ల డాలర్లతో అమెరికా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ చేపట్టింది. వంట నూనెతో అద్భుతాలు ఈ నేపథ్యంలో సీఎన్ఎన్ కథనం ప్రకారం.. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన విమాన ప్రయాణాన్ని ఎతిహాద్ ఎయిర్వేస్కు చెందిన ఎయిర్ బస్ ఏ380 ఫ్లైట్ను ఫ్రాన్స్లో ట్రయల్స్ నిర్వహించారు. సంచలనం ఏంటంటే ఈ విమానంలో వంటింట్లో వాడే వంటనూనె ( ఇది సస్టైనబుల్ ఏవియేషన్ ఫ్యూయల్(saf అని కూడా పిలుస్తారు)ను ఉపయోగించడం. ఈ విమానం రోల్స్ రాయిస్ ట్రెంట్ 900 ఇంజన్ సాయంతో మార్చి 25న టౌలౌస్లోని బ్లాగ్నాక్ విమానాశ్రయం నుండి బయలుదేరింది. మార్చి 29న టౌలౌస్ నుండి నైస్కు వెళ్లేందుకు అదే నూనెను ఉపయోగించి ఏ380 ప్లైట్ను మరో ట్రైల్ నిర్వహించారు. ఈ టెస్ట్లో విమానం టేకాఫ్, ల్యాండింగ్ సమయంలో ఇంధన పనితీరు బాగున్నట్లు గుర్తించారు. ఫ్రాన్స్కు చెందిన టోటల్ ఎనర్జీస్ సంస్థ ఫ్రాన్స్కు చెందిన టోటల్ ఎనర్జీస్ సంస్థ 'హైడ్రోప్రాసెస్డ్ ఎస్టర్స్, ఫ్యాటీ యాసిడ్స్' లేదా హెచ్ఈఎఫ్ఏ నుండి ఈ ప్రత్యేకమైన కుకింగ్ ఆయిల్ను తయారు చేసింది. ఇక్కడ ఆసక్తికర విషయం ఏంటంటే ఈ ఆయిల్ను విమానాల్లో ఉపయోగించడం ఇదే తొలిసారి కాదు. మార్చి2021లో వైడ్ బాడీ ఏ 350 ఫ్లైట్లో, గత అక్టోబర్లో ఏ319 నియో అనే విమానంలో ఈ ఆయిల్ను ఫ్యూయల్గా ఉపయోగించారు. తాజాగా కాస్ట్లీ విమానం ఏ380 లో ఉపయోగించి టెస్ట్ ట్రయల్స్ ను విజయవంతంగా పూర్తించారు. కాగా ఎయిర్బస్ యాజమాన్యం తన విమానాలన్నింటిలో ఈ కుకింగ్ ఆయిల్ను ఉపయోగించేందుకు సర్టిఫికేట్ పొందాలని చూస్తుంది. అప్పటి వరకు ప్రయోగాలు కొనసాగిస్తామని ఆ సంస్థ ప్రతినిధులు చెబుతున్నారు. చదవండి: ఈ విమానంలో జర్నీ బాగా కాస్ట్లీ గురూ! -
ఆకాశంలో లివింగ్ రూమ్
విమానాల్లో బిజినెస్ క్లాస్ అంటేనే కాస్త పర్సనల్ స్పేస్ ఎక్కువగా ఉంటుంది. ఇబ్బంది లేకుండా, సౌకర్యవంతంగా, ప్రశాంతంగా ప్రయాణించేలా సీట్లు, ఇతర సౌకర్యాలుంటాయి. కానీ అచ్చం ఇంట్లో లివింగ్ రూమ్లోనే ఉన్నామా అనిపించేలా క్యాబిన్ డిజైన్ చేస్తే! టీవీ, కర్టెన్లు, కార్పెట్లు, ఇతరత్రా ప్రత్యేక సౌకర్యాలుంటే! ఇలాంటి అద్భుతమైన క్యాబిన్లను సియాటెల్కు చెందిన డిజైన్ కంపెనీ టియాగ్యు, టెస్లా, ఒక్లహోమాకు చెందిన ఎయిరోస్పేస్ కంపెనీ నోర్డామ్ కలిసి రూపొందించాయి. ఈ డిజైన్కు‘ఎలివేట్’ అని పేరు పెట్టాయి. దీనికి సంబంధించిన ఫొటోలను తాజాగా విడుదల చేశాయి. జర్మనీలోని హాంబర్గ్లో ఈ ఏడాది జూన్లో జరిగే ఎయిర్క్రాఫ్ట్ ఇంటీరియర్స్ ఎక్స్పోలో ఈ డిజైన్లను ప్రదర్శించనున్నాయి. తక్కువలో ఎక్కువగా.. అద్భుతమైన వాల్ అటాచ్మెంట్స్, పెద్ద బెడ్ సైజు, లివింగ్ స్పేస్, వస్తువులు పెట్టుకునేందుకు స్థలం లాంటివి ప్రతి ప్రయాణికుడికి ఉండేలా డిజైన్ చేయడం ఇదే తొలిసారని ‘ఎలివేట్’ డిజైనర్లు తెలిపారు. ఈ ఇంటీరియర్కు విమానంలో ఎక్కువ స్థలం అవసరం ఏమీ ఉండదని, సీట్లు తగ్గించుకోవాల్సిన అవసరమూ రాదని చెప్పారు. పైగా డిజైన్లో వాడినవన్నీ తక్కువ బరువున్నవేనని వివరించారు. దీని వల్ల విమానంపై భారంపడదని, ఎక్కువ ఇంధనం ఖర్చవదని తెలిపారు. చిన్న విమానాల్లో కూడా ఎలివేట్ క్యాబిన్లను సులువుగా ఏర్పాటు చేసుకోవచ్చన్నారు. అందమైన క్యాబిన్లతో ప్రయాణికులకు అద్భుతమైన అనుభూతిని అందించడానికి.. ఎక్కువ స్థలం ఉండేలా, సౌకర్యవంతంగా అనిపించేలా, ప్రైవసీ ఉండేలా ఎలివేట్ను డిజైన్ చేశామని చెప్పారు. – సాక్షి సెంట్రల్ డెస్క్ -
ఉక్రెయిన్ నుంచి మరో 14 మంది తెలుగు విద్యార్థుల రాక
సాక్షి ముంబై: ఉక్రెయిన్లో చదువుకుంటున్న విద్యార్థులను తీసుకువస్తున్న మరో ప్రత్యేక విమానం గురువారం ఉదయం ముంబైకి చేరుకుంది. వందకుపైగా విద్యార్థులు ఈ ప్రత్యేక విమానంలో ముంబైకి చేరుకోగా వీరిలో తెలంగాణకు చెందిన తొమ్మిది మంది, ఆంధ్రప్రదేశ్కు చెందిన అయిదుగురు విద్యార్థులు ఉన్నారు. వీరికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నోడల్ అధికారి వి.రామకృష్ణ, తెలంగాణ ప్రభుత్వ అధికారులు డాక్టర్ ఎ.శరత్ (పంచాయితీ రాజ్ కమిషనర్), లాల్శంకర్ చవాన్ (ఐపీఎస్)తోపాటు ముంబై కస్టమ్స్ అసిస్టెంట్ కమిషనర్ ఎం.నాగరాజ్ అన్నివిధాలా సహకారమందించారు. నవీముంబైలోని తెలుగు కళాసమితి ప్రధాన కార్యదర్శి మాదిరెడ్డి కొండారెడి, ఎన్జీఓ సంస్థ పదాధికారులు కూరపాటి నరేష్, దోర్నాల రాజు, సురేష్కూడా విమానాశ్రయానికి వచ్చి విద్యార్థులను కలిశారు. ముంబైకి వచ్చిన తెలంగాణ విద్యార్థులు: అభిజిత్సింగ్ నేగి (హైదరాబాద్), గోపగల్ల ప్రణయ్ (హైదరాబాద్), ఎం.ఈసాద్అలీ బేగ్ (హైదరాబాద్), పాటిల్ అక్షయ్ విజయ్కుమార్ (హైదరాబాద్), డి.పవన్కళ్యాణ్ (హైదరాబాద్), కె.సిద్దువినాయక్ (హైదరాబాద్), బి.కార్తీక్ నాయక్ (నిజామాబాద్), కె.సొలొమొన్∙రాజ్ (కరీంనగర్), ఐ.కార్తికేయ (హైదరాబాద్) -
శిక్షణ విమానం శకలాల తరలింపు
పెద్దవూర: శిక్షణ విమానం కూలి ట్రైనీ మహిళా పైలట్ దుర్మరణం చెందిన ప్రదేశాన్ని ఆదివారం ఢిల్లీ నుంచి వచ్చిన ఏఏఐబీ(ఎయిర్క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో) టీం అధికారులు అమిత్కుమార్, దినేష్కుమార్, కెప్టెన్ భవానీశంకర్లతో పాటు, హైదరాబాద్ నుంచి వచ్చిన డీజీసీఏ(డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్) అధికారులు పరిశీలించారు. ఉదయం 8.15కు వచ్చిన ప్రత్యేక బృందం మధ్యాహ్నం 2 గంటల వరకు విచారణ చేపట్టింది. ఎయిర్క్రాఫ్ట్ పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. శకలాలను ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా రైట్బ్యాంకులోని ఫ్లైటెక్ ప్రైవేట్ ఏవియేషన్ అకాడమీకి తరలించారు. డీజీసీఏ బృందంలో డీజీసీఏ డైరెక్టర్ సురేందర్ టోపో, అసిస్టెంట్ డైరెక్టర్ శివ ఉన్నారు. రిపోర్ట్ ఆధారంగా కేసు విచారణ –వై. వెంకటేశ్వరరావు, డీఎస్పీ మిర్యాలగూడ తుంగతుర్తి గ్రామ సమీపంలో ఫ్టైటెక్ ప్రైవేట్ ఏవియేషన్ అకాడమీకి చెందిన ఎయిర్ క్రాఫ్ట్ చాపర్ శనివారం కూలిపోయి ట్రైనీ మహిళా పైలట్ మృతి చెందిన ఘటనలో ఢిల్లీలోని ఏఏఐబీ, హైదరాబాద్కు చెందిన డీజీసీఏ అధికారుల బృందాలు ఆదివారం విచారణ చేశాయి. శకలాలను స్వాధీనం చేసుకుని వాటిని విశ్లేషించి రిపోర్ట్ తయారు చేసి ఇస్తామన్నారు. వారిచ్చే రిపోర్ట్ ఆధారంగా తర్వాత విచారణ చేస్తాం.