-
చంబల్ నదిలో 900 చిరు మొసళ్ల సందడి
మొసలి... ఈ పేరు వినగానే మనకు దాని రూపం గుర్తుకు వచ్చి, మనసులో భయం కలుగుతుంది. భారీ మొసలి రూపాన్ని పక్కన పెడితే, చిరు మెసలిని చూసినప్పుడు ఎంతో కొంత ముచ్చటేస్తుంది. మరి వందల సంఖ్యలో చిరు మొసళ్లు ఒకేసారి కనిపిస్తే..ఆసియాలోని అతిపెద్ద మొసళ్ల అభయారణ్యం ఉత్తరప్రదేశ్లోని ఆగ్రా జిల్లా బాహ్లో ఉంది. ఇక్కడ ఇప్పుడు వందలకొద్దీ చిరు మొసళ్లు సందడి చేస్తున్నాయి. మహుశాల, నంద్గావాన్, హత్కాంత్ ఘాట్ల మీదుగా సుమారు 900 చిరు మొసళ్లు భారీ మగ మొసళ్లను అనుసరిస్తూ చంబల్ నదికి చేరుకున్నాయి.అటవీ రేంజ్ నుండి వస్తున్న శబ్ధాన్ని విన్న అటవీ శాఖ అధికారుల బృందం చంబల్ నది సమీపానికి చేరుకుంది. అక్కడి దృశ్యాన్ని చూసిన అటవీశాఖ అధికారులు ఆశ్చర్యపోయారు. మొసళ్లు పిల్లలను కనే ప్రక్రియ దాదాపు వారం రోజుల పాటు కొనసాగుతుంది. అటవీశాఖ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం అంతరించిపోయే స్థితికి చేరుకున్న మొసలి జాతిని 1979 నుండి చంబల్ నదిలో సంరక్షిస్తున్నారు. ఈ నది మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల గుండా పాలి (రాజస్థాన్) మీదుగా ప్రవహిస్తుంది.2008లో బాహ్, ఇటావా, భింద్, మోరెనాలలోని చంబల్ నదిలో వందకుపైగా మొసళ్లు మృతి చెందాయి. ఆ సమయంలో మొసళ్ల మృతికి గల కారణాలను తెలుసుకునేందుకు విదేశీ నిపుణులను సంప్రదించాల్సి వచ్చింది. అప్పట్లో లివర్ సిర్రోసిస్ వ్యాధి కారణంగా మొసళ్లు చనిపోయాయని గుర్తించారు. అయితే ఆ తరువాత నుంచి మొసళ్ల సంఖ్య పెరుగుతూ వచ్చింది. తాజా లెక్కల ప్రకారం చంబల్ నదిలో 2,456 మొసళ్లు ఉన్నాయి. -
ఆగ్రాలో మరో అద్భుతం: భర్త జ్ఞాపకార్థం ఎర్ర తాజ్మహల్
ఆగ్రా అనగానే అందరికీ ముందుగా గుర్తుకు వచ్చేది అందమైన తాజ్ మహల్. ఈ ప్రేమ చిహ్నాన్ని చూసేందుకు ప్రపంచం నలుమూలల నుంచి జనం ఆగ్రాకు తరలి వస్తుంటారు. మొఘల్ చక్రవర్తి షాజహాన్ తన భార్య ముంతాజ్ కోసం ఈ తాజ్ మహల్ నిర్మించారు. అయితే ఆగ్రాలో మరో తాజ్ మహల్ కూడా ఉంది. దీని వెనుక కూడా ఒక ఓ ప్రేమకథ ఉంది. ఓ భార్య తన భర్త జ్ఞాపకార్థం రెడ్ తాజ్ మహల్ నిర్మించారు. ఈ తాజ్ మహల్ ఎర్ర ఇసుకరాయితో నిర్మించారు. ఇది తెల్లని తాజ్ మహల్ను పోలివుంటుంది. అయితే పరిమాణంలో తాజ్మహల్ కన్నా చిన్నదిగా ఉంటుంది.ఈ ఎర్ర తాజ్ మహల్ ఆగ్రాలోని ఎంజీ రోడ్డులో గల రోమన్ క్యాథలిక్ స్మశానవాటికలో ఉంది. ప్రముఖ చరిత్రకారుడు రాజ్కిషోర్ శర్మ పుస్తకం ‘తవారిఖ్-ఎ-ఆగ్రా’లో రాసిన వివరాల ప్రకారం భారతదేశం బ్రిటిష్ పాలనలో ఉన్నప్పుడు, వారి సైన్యం దేశంలోని వివిధ ప్రాంతాల్లో విడిది చేసింది. అదే సమయంలో ఆగ్రా కోట భద్రత కోసం జాన్ విలియం హాసింగ్ అనే డచ్ అధికారిని ఇక్కడ నియమించారు. నాడు అతనితో పాటు అతని భార్య ఆలిస్ హాసింగ్ కూడా ఆగ్రాకు వచ్చారు. ఆ భార్యాభర్తల మధ్య ఎంతో ప్రేమ ఉండేది.వారు తాజ్మహల్ను చూసి తెగ సంబరపడిపోయారు. దీంతో ఆ దంపతులు తమలో ఎవరు ముందుగా ఈ లోకాన్ని విడిచి వెళతారో వారి జ్ఞాపకార్థం మరొకరు తాజ్మహల్ను నిర్మించాలని నిర్ణయించుకున్నారు. జాన్ హాసింగ్ 1803, జూలై 21న మృతి చెండారు. దీంతో అతని భార్య.. భర్త జ్ఞాపకార్థం ఆగ్రాలోని రోమన్ క్యాథలిక్ శ్మశానవాటికలో రెడ్ తాజ్ మహల్ను నిర్మించారు. -
ఆగ్రాలో మరో ‘వాహ్ తాజ్’.. పర్యాటకులు క్యూ
ఆగ్రా అనగానే అందరికీ ముందుగా తెల్లని పాలరాతి కట్టడం తాజ్ మహల్ గుర్తుకు వస్తుంది. అయితే ఇదే ప్రాంతంలో తాజ్కు పోటీనిస్తూ, దానినే పోలిన మరో పాలరాతి భవనం ఉందని తెలిస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. ఇది ఆధ్యాత్మిక పర్యాటకులకు ఆలవాలంగా ఉంది.తాజ్ మహల్కు 12 కి.మీ. దూరంలోని స్వామి బాగ్ వద్ద రాధాస్వామి సత్సంగ్ శాఖ వ్యవస్థాపకుని సమాధి స్థలంలో నిర్మించిన అద్భుత భవనం మరో తాజ్గా పేరొందుతోంది. స్వచ్ఛమైన తెల్లని పాలరాయితో నిర్మితమైన ఈ భవనం పర్యాటకులను అమితంగా అలరిస్తోంది. దీనిని చూసిన పర్యాటకులు ఇది తాజ్మహల్కు పోటీ అని అభివర్ణిస్తున్నారు. మొఘలుల స్మారక కట్టడాలకు ప్రసిద్ధి చెందిన ఈ నగరంలో ఈ ‘తాజ్’ మరో ఆకర్షణగా నిలిచింది.రాజస్థాన్లోని మక్రానా నుండి తెచ్చిన తెల్లటి పాలరాయితో రూపొందిన ఈ 193 అడుగుల ఎత్తయిన ఈ నిర్మాణం భారతదేశ ఖ్యాతిని మరింతగా పెంచుతుందనడంలో సందేహం లేదు. రాధాస్వామి శాఖ వ్యవస్థాపకులు పరమ పురుష్ పూరన్ ధని స్వామీజీ సమాధి స్థలంలో ఈ భవనం నిర్మితమయ్యింది. ప్రతిరోజూ పెద్ద సంఖ్యలో పర్యాటకులు ఈ సమాధి స్థలిని సందర్శించేందుకు వస్తుంటారు. ఇక్కడి అద్భుత కళాకృతులను చూసి ఆశ్చర్యపోతుంటారు. ఇక్కడ ఫోటోగ్రఫీని అనుమతించరు.రాధాస్వామి అనుచరుల కాలనీ మధ్య ఈ భవనం ఉంది. ఉత్తరప్రదేశ్, పంజాబ్, కర్ణాటక తదితర రాష్ట్రాలతో పాటు విదేశాలలో లక్షలాది మంది రాధాస్వామి అనుచరులు ఉన్నారు. 1904లో అలహాబాద్కు చెందిన ఒక ఆర్కిటెక్ట్ చేతుల మీదుగా ఈ భవన నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. భవనం కొంతమేరకు నిర్మాణం పూర్తయ్యాక ఆగిపోయింది. అయితే 1922లో తిరిగి నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. అయితే ఇక్కడ జరిగే పనులన్నీ హస్త కళాకారుల నైపుణ్యంతో కూడినవే కావడం విశేషం. పైగా వీరు మూడు తరాలుగా ఈ పనుల్లో నిమగ్నమవుతున్నారు. బంగారు పూతతో ఈ భవన శిఖరాన్ని అద్భుతంగా తీర్చిదిద్దారు. ఈ శిఖరం తాజ్మహల్ కన్నా పొడవైనది కావడం విశేషం. -
Viral Video: స్కూల్కు ఆలస్యంగా వచ్చిందని.. టీచర్పై ప్రిన్సిపాల్ దాడి
విద్యాసంస్థల్లో టీచర్లు, లెక్చరర్లు, ప్రిన్సిపల్స్ సభ్యత మరచి ప్రవర్తిస్తున్నారు. విద్యార్ధులు, తోటి ఉపాధ్యాయులపై దాడికి పాల్పడిన ఘటనలు ఎక్కువగా వెలుగులోకి వస్తున్నాయి. ఇటీవల ఉత్తర ప్రదేశ్లోని ఓ ప్రభుత్వ పాఠశాలలో హెడ్మిస్ట్రెస్ ఫేషియల్ చేయించుకుంటున్న వీడియో తీసినందుకు టీచర్పై దాడి చేసిన నిర్వాకం మరవక ముందే రాష్ట్రంలో ఆగ్రాలో మరో ఘటన చోటుచేసుకుంది.ఆగ్రాలో పాఠశాలకు ఆలస్యంగా వచ్చారనే నెపంతో ఓ ప్రిన్సిపల్-టీచర్పై దాడికి పాల్పడింది. బూతులు తిడుతూ, దుస్తులు చెరిగేలా భౌతిక దాడికి దిగింది. సీగానా గ్రామంలోని ప్రీ-సెకండరీ స్కూల్ టీచర్ గుంజన్ చౌదరి పాఠశాలకు ఆలస్యంగా వచ్చారని ప్రిన్సిపాల్ గొడవకు దిగింది. అంతేగాక టీచర్పై దాడి చేసింది. ఈ ఘర్షణలో ఇద్దరు వస్త్రాలు చిరిగిపోయాయి.అంతటితో ఆగకుండా నోటికి కూడా పని చెప్పారు. బూతులు తిట్టుకుంటూ కొట్టుకున్నారు. అక్కడే ఉన్న తోటి టీచర్లు వీరిని అడ్డుకునే ప్రయత్నం చేసినా ఫలితం లేదు. ప్రిన్సిపల్ డ్రైవర్ విడదీసే ప్రయత్నం చేసినా.. చివరికి టీచర్తో అతడు కూడా అసభ్యకరంగా ప్రవర్తించాడు.ఈ తతంగాన్నంతా అక్కడే ఉన్న కొందరు తమ కెమెరాల్లో చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్టు చేయగా అదికాస్తా ప్రస్తుతం వైరల్గా మారింది.A Principal in Agra beat up a teacher this bad just because she came late to the school. Just look at her facial expressions. She's a PRINCIPAL 😭 @agrapolice pic.twitter.com/db8sKvnNvs— Deepika Narayan Bhardwaj (@DeepikaBhardwaj) May 3, 2024 -
Vijay prakash kondekar: పట్టువదలని విక్రమార్కుడు
విజయ ప్రకాశ్ కొండేకర్. తెల్లగడ్డం, తెల్లని దోతీ, భుజంపై కండువా, ఒంటిపై అంగి కూడా లేకుండా కనిపిస్తాడు. కానీ పట్టు వదలని విక్రమార్కుడనే పదబంధానికి నిలువెత్తు రూపం. మహారాష్ట్రలోని పుణేకు చెందిన ఈయన స్థానిక సంస్థల నుంచి లోక్సభ దాకా ఇప్పటికి ఏకంగా 25 సార్లు పోటీ చేశారు. దశాబ్దాలుగా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తూనే ఉన్నారు. మహారాష్ట్ర రాష్ట్ర విద్యుత్ బోర్డు నుంచి 1980ల్లో రిటైరయ్యారు. ‘బూటు గుర్తునే గెలిపించండి’ అని రాసున్న ప్లకార్డును ఓ బండిపై పెట్టుకుని కాలినడకన ప్రచారం చేస్తుంటారు. నగర వీధుల్లో అతడిని కొందరు పట్టించుకోకుండా వెళ్తే మరి కొందరు సెలీ్ఫలు తీసుకుంటారు. సోషల్ మీడియాలో ఉచితంగా ప్రచారం దొరికిందంటూ సంతోషిస్తారాయన. గెలిచే అవకాశం లేదని తెలిసినా ప్రచారం కోసం పూరీ్వకుల భూమి, ఇల్లు అమ్మేశాడు. ఎప్పటికైనా ప్రధాని కావాలన్నది ఆయన కలట. దాన్ని నిజం చేసుకోవడానికి ఎన్ని సార్లైనా పోటీ చేస్తూనే ఉంటానంటారు కొండేకర్. ఆయన కంటే ఘనుడు మరొకరున్నారు. ఆయనే కె.పద్మరాజన్. గిన్నిస్ రికార్డు కోసం 170 కంటే ఎక్కువ ఎన్నికల్లో పోటీ చేశారు. గత లోక్సభ ఎన్నికల్లో రాహుల్గాంధీపైనే బరిలో దిగారు! అలాగే యూపీలోని ఆగ్రా జిల్లాకు చెందిన 78 ఏళ్ల హస్నురామ్ అంబేద్కరి ఇప్పటిదాకా ఏకంగా 98సార్లు ఎన్నికల్లో తలపడ్డారు. ఈసారి కూడా ఆగ్రా, ఫతేపుర్సిక్రీ స్థానాల్లో నామినేషన్ వేస్తున్నారు. ఆ రెండింట్లోనూ ఓడి సెంచరీ కొడతారట! ‘నీ భార్యే నీకు ఓటేయదు. ఇతరులెలా వేస్తారు’ అంటూ ఓ బీఎస్పీ నేత అవమానించడంతో విజయం కోసం కాకుండా ఓట్ల కోసం ఆయన ఇలా పోటీ చేస్తూనే ఉన్నారు!! -
ఆకర్షిస్తున్న ఆగ్రా మెట్రో.. 4 రోజుల్లో 1.22 లక్షల మంది ప్రయాణం!
ఉత్తరప్రదేశ్లోని ఆగ్రాకు వచ్చే పర్యాటకులు మెట్రో ప్రయాణాన్ని భలేగా ఎంజాయ్ చేస్తున్నారు. ఆగ్రా మెట్రో ప్రారంభించిన ఈ నాలుగు రోజుల్లో లక్ష మందికి పైగా ప్రయాణికులు దీనిలో ప్రయాణించారు. మెట్రో ప్రారంభమైన నాలుగో రోజు (ఆదివారం) ఆగ్రా మెట్రోలో అత్యధికంగా 39, 616 మంది ప్రయాణికులు ప్రయాణించారు. ఈ వివరాలను అధికారులు మీడియాకు తెలిపారు. ఉత్తరప్రదేశ్ మెట్రో రైల్ కార్పొరేషన్ డిప్యూటీ జనరల్ మేనేజర్ (పబ్లిక్ రిలేషన్స్) పంచనన్ మిశ్రా మీడియాతో మాట్లాడుతూ ‘గడచిన నాలుగు రోజుల్లో 1,22,000 మంది ప్రయాణికులు ఆగ్రా మెట్రోలో ప్రయాణించారు. ఆదివారం ఒక్కరోజే అత్యధికంగా 39,616 మంది ప్రయాణించారు. మెట్రో స్టేషన్ లేదా రైలులో ప్రయాణికులు మర్చిపోయిన 12 బ్యాగులను మెట్రో సిబ్బంది గుర్తించారు. వీటిని సంబంధీకులకు తిరిగి అప్పగించాం’ అని తెలిపారు. 2024, మార్చి 7 నుంచి ఆగ్రాలో మెట్రో సేవలు ప్రారంభమయ్యాయి. ఆగ్రా మెట్రో కారిడార్ ప్రారంభంతో, మెట్రో రైలు నెట్వర్క్కు అనుసంధానమైన దేశంలోని 21వ నగరంగా ఆగ్రా అవతరించింది. ఆగ్రా మెట్రో ప్రారంభంతో నగరంలోని 21 లక్షల మంది ప్రజలు ఈ సేవలను అందుకుంటున్నారు. దీనికితోడు ప్రతి సంవత్సరం సుమారు 60 లక్షల మంది ఆగ్రాను సందర్శించడానికి వస్తుంటారు. వీరు కూడా మెట్రో సేవలను ఉపయోగించుకుంటున్నారు. -
ఆగ్రా మెట్రో ప్రత్యేకతలివే..
ఆగ్రాలోని తాజ్ మహల్ను చూసేందుకు వెళ్లేవారు ఇకపై అక్కడి మెట్రోలో సిటీనంతా చుట్టేయచ్చు. ఆగ్రాలో మెట్రో సేవలు గురువారం(2024, మార్చి, 7) నుంచి ప్రారంభం కానున్నాయి. డిజిటల్ మాధ్యమం ద్వారా ఆగ్రా మెట్రోను బుధవారం ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. సీఎం యోగి ఆదిత్యనాథ్ జెండా ఊపి మెట్రో ప్రయాణాన్ని ప్రారంభించారు. ఆగ్రా మెట్రో రైలు తాజ్ ఈస్ట్ గేట్ నుండి మంకమేశ్వర్ మెట్రో స్టేషన్ వరకు నడుస్తుంది. దీని దూరం ఆరు కిలోమీటర్లు. ప్రస్తుతానికి ఆరు స్టేషన్లలో మెట్రో నడుస్తుంది. మార్చి 7 నుంచి సామాన్య ప్రజలు మెట్రోలో ప్రయాణించవచ్చు. ఆగ్రా మెట్రో ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు రాకపోకలు సాగించనుంది. ఆగ్రా మెట్రో ప్రత్యేకతలివే.. #WATCH | West Bengal: Prime Minister Narendra Modi flags off metro railway services from Kavi Subhash Metro, Majerhat Metro, Kochi Metro, Agra Metro, Meerut-RRTS section, Pune Metro, Esplanade Metro- Kolkata. pic.twitter.com/2s8mNCjUiX — ANI (@ANI) March 6, 2024 ఆగ్రా మెట్రో గంటకు 90 కి.మీ వేగంతో నడుస్తుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సాయంతో స్టేషన్లను పర్యవేక్షిస్తారు. ప్రయాణికులెవరైనా 20 నిమిషాల కంటే ఎక్కువసేపు స్టేషన్లో నిలబడితే అలారం మోగుతుంది. మొదటి దశ 6 మెట్రో స్టేషన్లు.. తాజ్ ఈస్ట్ గేట్, కెప్టెన్ శుభమ్ గుప్తా మెట్రో స్టేషన్, ఫతేబాద్ రోడ్, తాజ్ మహల్, ఆగ్రా ఫోర్ట్ మంకమేశ్వర్ టెంపుల్ ఒక మెట్రో స్టేషన్ మధ్య ప్రయాణానికి రూ.10, చివరి స్టేషన్ను రూ.60గా చార్జీలను నిర్ణయించారు. ఒక కోచ్లో 60 సీట్లు ఉంటాయి. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు మెట్రోలో రాకపోకలు సాగించవచ్చు. -
ఇవాళ నుంచే తాజ్ మహోత్సవ్ ప్రారంభం!
ప్రపంచంలోని ఏడు వింతల్లో ఒక్కటైన తాజ్ మహల్ని జీవితంలో ఒక్కసారైన చూడాలని ప్రతీ ఒక్కరూ అనుకుంటారు. ఆగ్రాలో ఉండే ఈ కట్టడాన్ని వీక్షించేందుకు దేశం నలుమూలల నుంచి పర్యాటకులు తరలివస్తుంటారు. దీన్ని ప్రేమకు చిహ్నంగా భావిస్తారు. ఎవరైనా ఆగ్రా ప్రయాణానికి వెళ్లాలనుకుంటే మాత్రం ఇక్కడ ప్రతి ఏడాది జరిగే తాజ్ మహోత్సవ్ (Taj Mahotsav 2024)న్ని అస్సలు మిస్సవ్వరు. తాజ్ మహోత్సవ్ ప్రతి ఏడాది ఫిబ్రవరి నెలలో జరుగుతుంది.ఈ ఏడాది ఈ ఉత్సవం ఫిబ్రవరి 17న ప్రారంభమై ఫిబ్రవరి 27 వరకు కొనసాగనుంది. పర్యాటకుల కోసం ఈసారి వివిధ సాంస్కృతిక కార్యక్రమాల వీక్షణతోపాటు హాట్ ఎయిర్ బెలూన్ రైడ్ వంటివి ఏర్పాటు చేయడం విశేషం. ఎన్ని రోజులు జరుగుతుందంటే.. ఈ ఏడాది తాజ్ మహోత్సవం ఫిబ్రవరి 17 నుంచి ప్రారంభమవుతున్నాయి. తాజ్ మహోత్సవ్ అనేది 10 రోజుల పాటు జరిగే వార్షిక కార్యక్రమం.సరిగ్గా ఇది ఫిబ్రవరి 27న ముగుస్తుంది. ఈసారి ప్రత్యేకతలు... ఈ ఏడాది తాజ్ మహోత్సవ్లో ఎన్నో ప్రత్యేకతలు కనిపిస్తాయి. ఈసారి యమునా మహా ఆరతి తాజ్ మహోత్సవ్లో కనిపించనుంది. యమునా నది ఘాట్లపై తాజ్ మహోత్సవం సందర్భంగా మహా ఆరతి కార్యక్రమం నిర్వహిస్తారు. దీంతో పాటు పర్యాటకుల కోసం గాలిపటాల పండుగ, గజల్ కార్యక్రమాలు కూడా నిర్వహించనున్నారు. వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు.. తాజ్ మహోత్సవ్ సందర్భంగా నిర్వహించే సాంస్కృతిక కార్యక్రమాలను చూడటం ఒక విభిన్నమైన ఆనందాన్ని కలిగిస్తుంది. ప్రతిరోజు సాయంత్రం ప్రసిద్ధ కళాకారులు ఇక్కడ ప్రదర్శనలు ఇస్తారు. తాజ్ కమిటీ, ఉత్తర్ ప్రదేశ్ టూరిజం శాఖ సంయుక్తంగా ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తాయి. తాజ్ మహల్ తూర్పు ద్వారం సమీపంలోని శిల్పగ్రామ్లో ఈ వేడుకలు నిర్వహించనున్నారు. తాజ్ మహోత్సవ్లో భారతీయ సంగీతం, నృత్యానికి సంబంధించిన వివిధ రకాలను చూసే అవకాశం లభిస్తుంది. ఇక్కడకు వచ్చి కథక్, భరతనాట్యం, క్లాసికల్, సబ్-క్లాసికల్ గానం, భోజ్పురి గానం, అవధి గానం, ఖవ్వాలి, భజన్ సంధ్య, బ్రజ్ జానపద పాటలు, జానపద నృత్యాలు, వేణువు, సరోద, సితార్, తబలా, పఖావాజ్, రుద్రవీణ మొదలైనవి వాయించడం ఆస్వాదించవచ్చు. తాజ్ మహోత్సవ్లో ప్రముఖ బాలీవుడ్ కళాకారులు కూడా ప్రదర్శన ఇస్తారు. ఇందులో గజల్ సింగర్, ఖవ్వాలి, సింగర్, స్టాండప్ కామెడీ, తదితర ఈవెంట్లను కూడా నిర్వహిస్తారు. ఇవీ కాకుండా ఇంకా దేశం నలుమూలల నుండి వచ్చే వందలాది మంది కళాకారులు తమ అద్భుతమైన శిల్ప కళా, హస్త కళా నైపుణ్యాలను ఇక్కడ ప్రదర్శనలో ఉంచుతారు. ఇక్కడ చాలావరకు ప్రాంతీయ ప్రత్యేకతలు కలిగిన అన్నీ కళాఖండాలు ఒకేచోట కొలువుదీరుతుండటం విశేషం. ఇందులో ఈశాన్య రాష్ట్రాల నుంచే వచ్చే కళాకారులు వెదురు బొంగుతో తయారు చేసిన బొమ్మలు ప్రదర్శనలో ఉంచుతారు. ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ వంటి ప్రాంతాల నుంచి వచ్చేవారు రాతి శిల్పాలు, అలాగే జమ్మూ కశ్మీర్ నుంచి వచ్చేవారు తివాచీలు, షాలువాలు, స్వెటర్ల వంటివి ప్రదర్శనకు ఉంచుతారు. ఇక్కడ హస్తకళా కళల ప్రదర్శన, దుకాణాలు, రుచికరమైన ఆహారం కోసం ఫుడ్ జోన్ తదితరాలు పర్యాటకులు ఎంతగానో ఆకర్షిస్తాయి.తాజ్ మహోత్సవ్ ప్రవేశ టికెట్ రూ. 50. విదేశీ పర్యాటకులు ఐదేళ్లలోపు పిల్లలకు ప్రవేశ రుసుము లేదు. Glimpses of Taj Mahotsav: A Cultural Extravaganza in the Heart of Agra. Celebrating 33 years in 2024 Experience India's rich arts, crafts, music, cuisine. With 400 artisans showcasing woodwork, stone carving, mesmerizing performances, delicious food. 17th to 27th Feb, 2024. pic.twitter.com/TU4yAvWB9C — Taj Mahal (@TajMahal) February 15, 2024 (చదవండి: తరతరాలకు సరిపడ సంపదలో అత్యుత్తమ దేశం ఇదే! భారత్ ఎన్నో స్థానంలో ఉందంటే..) -
శ్రీరాముని గుర్తుగా అక్బర్ ఏం చేశాడు?
ఆదర్శ పురుషునిగా పేరొందిన శ్రీరామునిపై మొఘల్ చక్రవర్తి అక్బర్ తన భక్తిని చాటుకున్నాడని చరిత్ర చెబుతోంది. శ్రీరాముని నాణాన్ని రూపొందించడమే కాకుండా పర్షియన్ భాషలోకి రామాయణాన్ని అనువదింపజేశాడు. మొఘలుల కాలంలో అక్బర్ చక్రవర్తిపై రాముని ప్రభావం అధికంగా ఉంది. నాటికాలంలో అక్బర్ ఆగ్రాలోని ఫతేపూర్ సిక్రీ ప్యాలెస్లో ఎర్ర ఇసుకరాయిపై శ్రీరాముని ఆస్థానం చెక్కించాడు. అక్బర్ తల్లి హమీదా బాను బేగం ఉండే మరియమ్ మహల్లో ఒక స్తంభంపై శ్రీరాముని ఆస్థానంతోపాటు, హనుమంతుని చిత్రం కనిపిస్తుంది. అక్బర్ తల్లి హమీదా బాను బేగం రామాయణ, మహాభారత ఇతిహాసాలను అమితంగా ఇష్టపడేవారని అందుకే ఆమె నివాసభవనంలో శ్రీరాముడు, శ్రీకృష్ణుని చిత్రాలు కనిపిస్తాయని మాజీ ఏఎస్ఐ డైరెక్టర్, పురావస్తు శాస్త్రవేత్త పద్మశ్రీ కేకే ముహమ్మద్ తెలిపారు. తన తల్లి ఆసక్తిని గమనించిన అక్బర్ రామాయణం, మహాభారతాలను పర్షియన్ భాషలోకి అనువదింపజేశారని చరిత్ర చెబుతోంది. అక్బర్ తల్లి నివాస భవనంలో శ్రీకృష్ణుడు వేణువు వాయిస్తున్న పెయింటింగ్ కూడా కనిపిస్తుంది. -
వారికి శ్రీరాముడు ‘మామ’? బంధుత్వం ఎలా కలిసింది?
ఆ గ్రామంలోనివారికి శ్రీరాముడు మామ అవుతాడు. దీని వెనుక ఒక పురాణ కథనం కూడా ఉంది. ఆగ్రాలోని రుంకటా పరిధిలోని సింగనా గ్రామంలో శృంగి మహర్షి ఆశ్రమం ఉంది. అయోధ్యలో 22న శ్రీరాముని ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం జరగనున్న సందర్భంగా శృంగి మహర్షి ఆశ్రమంలోనూ వేడుకలు నిర్వహిస్తున్నారు. శృంగి మహర్షి అలనాడు దశరథ మహారాజు ఆహ్వానం మేరకు అయోధ్యకు వెళ్లి పుత్రకామేష్టి యాగం చేశాడు. సింగనా గ్రామ ప్రజలు శ్రీరాముడిని ముద్దుగా మామ అని పిలుచుకుంటారు. శ్రీరాముడిని వారు మామగా పిలవడానికి కారణం ఉంది. దశరథ మహారాజు కుమార్తె శాంతకుమారికి శృంగిమహర్షితో వివాహం జరిగింది. శ్రీరాముని సోదరి శాంతకుమారి వివాహానంతరం ఈ ప్రాంతానికి వచ్చినందున వారు శ్రీరామునితో బంధుత్వం ఏర్పరుచుకుని, మామా అని సంబోధిస్తుంటారు. సింగన గ్రామంలో యమునా నది ఒడ్డున శృంగి మహర్షి ఆశ్రమం ఉంది. కుమారుడు పుట్టాలనే కోరికతో శృంగి ఋషి ఆశ్రమానికి ఎవరైనా వస్తే వారి కోరిక నెరవేరుతుందని స్థానికులు చెబుతుంటారు. శృంగి మహర్షి అయోధ్యకు వెళ్లి, పుత్రకామేష్టి కోసం యాగం చేసిన దరిమిలా రామలక్షణ భరత శత్రుఘ్నలు జన్మించారు. శృంగి మహర్షి ఆశ్రమానికి చెందిన మహంత్ నిరంజన్ దాస్ మాట్లాడుతూ, ఈ ఆశ్రమంలో శృంగి మహర్షి తపస్సు చేశారని, ఈ శృంగి మహర్షి తపోభూమి ఎంతో శక్తివంతమైనదని అన్నారు. అయోధ్యలో జనవరి 22న శ్రీరామ విగ్రహ ప్రతిష్ఠాపన వేడుకలు జరగనున్న సందర్భంగా శృంగి మహర్షి ఆశ్రమంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. గ్రామంలోనివారంతా తమ ఇళ్లలో దీపాలు వెలిగించనున్నారు. -
Video: ఆగ్రా రహదారిపై రోడ్డు ప్రమాదం.. కోళ్ల కోసం ఎగబడ్డ జనం
లక్నో: ఉత్తరప్రదేశ్లోని ఆగ్రా ఎక్స్ప్రెస్పై బుధవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. పొగమంచు కారణంగాపలు వాహనాలు ఒకదానికి ఒకటి డీకొట్టాయి. ఈ ఘటనలో దాదాపు 12 వాహనాలు (ట్రక్కు, కారులు, బైక్లు) ధ్వసంమయ్యాయి. ఒకరు మృతి చెందగా మరికొంతమందికి గాయాలవ్వగా వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సహయక చర్యలు ప్రారంభించారు. క్రేన్ ద్వారా ధ్వంసమైన వాహనాలను తొలగించి రోడ్డును క్లియర్ చేశారు. అయితే ఇక్కడి వరకు బాగానే ఉన్నా అప్పుడే ఒక విచిత్ర దృశ్యం కంటపడింది ప్రమాదానికి గురైన వాహనాల్లో ఒకటి బ్రాయిలర్ కోళ్లను తరలిస్తున్న ట్రక్కు కూడా ఉంది. ఇంకేముంది... ప్రమాదం గురించి కానీ, అక్కడ జరిగిన విధ్వంసం గురించి కానీ పట్టింపు లేకుండా పలువురు వాహనదారులు, స్థానికులు ట్రక్కునుంచి కోళ్ల కోసం ఎగబడ్డారు. కోళ్లను ఎత్తుకెళ్లకుండా ట్రక్కు డ్రైవర్ అడ్డుకున్నా.. ఫలితం లేకుండా పోయింది. In UP's Agra, a lorry carrying chickens met with an accident in a road pile up due to dense fog. Commuters can be seen grabbing chickens and fleeing from the spot. Some bundled them in sack. pic.twitter.com/hBUaFCjj7g — Piyush Rai (@Benarasiyaa) December 27, 2023 కొందరు ఒకటి రెండు కోళ్లను చేతుల్లో పట్టుకొని వెళ్లగా.. మరికొందరు దొరికినకాడికి దొరికినట్లు పదుల కొద్ది కోళ్లను సంచులో వేసుకొని మరీ పరుగులు పెట్టారు. దీంతో రోడ్డు ప్రమాదం కారణంగా నేడు అనేక కుటుంబాలకు మంచి చికెన్ విందు భోజనం దొరికినట్లైంది. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇదిలా ఉండగా రెండు లక్షల యాభై వేల రూపాయల విలువ చేసే కోళ్లు ఉన్నాయని, తనకు తీవ్ర ఆర్థిక నష్టం వాటిల్లిందని ట్రక్కు డ్రైవర్ సునీల్ కుమార్ తెలిపాడు. జేవార్ పోలీస్ స్టేషన్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. Chicken thief gang became active after the accident on #YamunaExpressway in #Agra 😇🤣👇#DelhiFog #DelhiNCR #AnanyaPanday #Encounter #RubinaDilaik #AUSvPAK #Ennore_GasLeak pic.twitter.com/AiYlNrjOyJ — Robert Lyngdoh (@RobertLyngdoh2) December 27, 2023 -
దట్టమైన పొగమంచు.. పదుల సంఖ్యలో వాహనాలు ఢీ
లక్నో: పొగమంచు కారణంగా ఉత్తరప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగ్రా-లక్నో ఎక్స్ప్రెస్వేలోని ఉన్నావ్ సమీపంలో పదుల సంఖ్యలో వాహనాలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా.. దాదాపు 25 మంది తీవ్ర గాయాలపాలయ్యారు. పొగమంచు కారణంగా డబుల్ డెక్కర్ బస్సు అదుపుతప్పి డివైడర్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సు వెనక వస్తున్న వాహనాలు ఒకదాకొకటి ఢీకొన్నాయి. ఈ ఘటనలో దాదాపు 25మంది గాయపడ్డారు. ఒకరు మృతి చెందినట్లు సమాచారం. పొగమంచుతో దారి సరిగా కనిపించని కారణంగానే బస్సు ప్రమాదానికి గురైందని స్థానికులు తెలిపారు. ఢిల్లీ సహా ఉత్తరప్రదేశ్, బిహార్, పంజాబ్లలో పొగమంచు తీవ్రత అధికంగా ఉంది. దట్టమైన పొగమంచు కారణంగా ఢిల్లీలోని సఫర్జంగ్లో 50 మీటర్లకు దృశ్యమానత(విజిబిలిటీ) పడిపోయింది. పంజాబ్లోని అమృత్సర్ విమానాశ్రయంలో విజిబిలిటీ 0 కి పడిపోయింది. దీంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పొగమంచులో వాహనాలను అధిక వేగంతో ప్రయాణించవద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇదీ చదవండి: ఢిల్లీని కమ్మేసిన పొగమంచు.. వాహనదారులకు అవస్థలు -
బతికే ఉన్నా మహా ప్రభో...దీనానాథ్ దీన గాథ!
బతికి ఉండగానే చనిపోయినట్టు ప్రకటించిన, ఫించను ఆపివేసిన ఘటన వార్తల్లోనిలిచింది. దీంతో నేను బతికే ఉన్నాను( మై జిందా హూం) అని రాసి ఉన్న ప్లకార్డు పట్టుకుని నిరసనకు దిగారు. ఆగ్రాలో 70 ఏళ్ల వృద్ధుడు దీనానాథ్ యాదవ్కు చేదు అనుభవం ఎదురైంది. ఇండియా టుడే కథనం ప్రకారం ఆగ్రా చీఫ్ డెవలప్మెంట్ ఆఫీసర్ (CDO) కార్యాలయ ఉద్యోగులు ప్రభుత్వ రికార్డుల్లో దీనానాథ్ యాదవ్ చనిపోయినట్టుగా ప్రకటించారు. దీంతో పెన్షన్ఆగిపోయింది. విషయం తెలుసుకున్న దీనానాథ్ సంబంధిత అధికారులను కలిసాడు. గత ఎనిమిది నెలలుగా జిల్ల మెజిస్ట్రేట్ కార్యాలయం చుట్టూ తిరుగుతూనే ఉన్నాడు.. అయినా ఫలితం లేదు. దీంతో నేను బతికే ఉన్నాను అనిరాసి వున్న ప్లకార్డు మెడలో వేలాడదీసుకుని నిరసనకు దిగాడు .దీంతో స్పందించిన జిల్లా మేజిస్ట్రేట్ యాదవ్ అందించిన పత్రాలను పరిశీలించి షాక్ అయ్యారు. విచారణ జరపాల్సింగా సంబంధిత అధికారులకు ఆదేశించారు. అటు తనకు జరిగిన అన్యాయంపై మాట్లాడిన దీనానాథ్ తాను సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నానని, ప్రతిరోజూ పొలానికి వెళ్తానని, గత రెండేళ్లుగా వృద్ధాప్య పింఛను కూడా తీసుకుంటున్నానని వాపోయాడు. అయితే ఈ ఏడాది మార్చిలో పింఛను ఆగిపోయిందని, తొలుత గ్రామ కార్యదర్శిని, ఆ తరువాత సీడీవో కార్యాలయాన్ని సంప్రదించగా సంతృప్తికర సమాధానం రాలేదని తెలిపారు. నెలల తరబడి పెన్షన్ నిలిచిపోవడంతో పాటు, భవిష్యత్తులో మరిన్ని చట్టపరమైన సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలోఈ నిరసనకు దిగినట్టు వెల్లడించారు. ఇది ఇలా ఉంటే ఉత్తరప్రదేశ్లో ప్రభుత్వ రికార్డులలో బతికి ఉన్నవారిని చనిపోయినట్టు ప్రకటించడంలాంటి ఘటనలు చాలానే ఉన్నాయనీ, ఇలాంటి బాధితులు వందలాది మంది ఉన్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. -
పెళ్లిలో రసగుల్లా కోసం కొట్లాట.. ఆరుగురికి తీవ్రగాయాలు!
యూపీలోని ఆగ్రాలో ఒక విచిత్ర ఉదంతం వెలుగులోకి వచ్చింది. దీనిని విన్నవారంతా కడుపుబ్బా నవ్వుకుంటున్నారు. ఇక్కడి శంషాబాద్ పోలీస్స్టేషన్ పరిధిలో జరిగిన ఒక వివాహ వేడుకలో రసగుల్లా విషయమై ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. కర్రలతో కొట్టుకునేంత వరకూ వివాదం దారితీసింది. ఈ గొడవలో ఒక మహిళతో సహా ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నయాబన్స్ రోడ్డు సమీపంలోని సంతోషి మాత దేవాలయం దగ్గర ఒక వివాహ వేడుకలో విందు జరిగింది. ఈ సందర్భంగా రసగుల్లా తినే విషయంలో ఇరువర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. అది పరస్పరం కొట్టుకునేవరకూ దారితీసిందని పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జ్ అనిల్ శర్మ తెలిపారు. క్షతగాత్రులందరినీ వైద్య చికిత్స కోసం ఆస్పత్రికి తరలించినట్లు ఆయన తెలిపారు. విందు ఏర్పాటు చేసిన గౌరీశంకర్ శర్మపై కేసు నమోదు చేశామని, ఈ వివాదంపై విచారణ చేస్తున్నామన్నారు. ఇది కూడా చదవండి: హిమాచల్లోనూ సొరంగ ప్రమాదం.. ఎప్పుడంటే.. -
దారుణం: హోటల్ ఉద్యోగినిపై సామూహిక అత్యాచారం
లక్నో: ఉత్తరప్రదేశ్లోని ఆగ్రాలో అమానవీయ ఘటన జరిగింది. హోటల్లో పనిచేసే యువతిపై ఐదుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితురాలికి మద్యం తాగించి, ఆమెపై కిరాతకంగా దాడి చేశారు. యువతిని గదిలోకి లోక్కెళుతున్న వీడియో ఒకటి బయటకు రావడంతో విషయం వెలుగులోకి వచ్చింది. శనివారం రాత్రి తాజ్గంజ్ పోలీస్ స్టేషన్కి ఓ యువతి కాల్ చేసి రోదిస్తూ విషయం తెలిపింది. పోలీసులు హుటాహుటిన సంఘటన ప్రదేశానికి వెళ్లారు. అప్పటికే గాయాలపాలైన యువతి దారుణాన్ని పోలీసులకు తెలిపింది. యువతి హోటల్లో ఏడాదిన్నరగా ఉద్యోగిగా పనిచేస్తోంది. శనివారం అర్ధరాత్రి యువతి స్నేహితురాలు బలవంతంగా ఆమెకు మద్యం తాగించారు. మద్యం మత్తులో వారితోపాటే ఉన్న మరో నలుగురు యువకులు బాధితురాల్ని ఓ గదిలోకి లాక్కెళ్లే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఓ యువతి కాపాడండి అంటూ కేకలు పెడుతున్న ఓ వీడియో పోలీసులకు చిక్కింది. అత్యాచారయత్నాన్ని ప్రతిఘటించిన తనపై ఆ యువకులు దాడి చేశారని బాధితురాలు తెలిపింది. గాజు గ్లాస్తో తలపై కొట్టారని వాపోయింది. ఇంతకు ముందు తీసిన తన అభ్యంతరకర వీడియోను బయటపెడతామని బెదిరించినట్లు పోలీసులకు తెలిపింది. ఈ కేసులో నలుగురు యువకులు, ఓ మహిళను పోలీసులు అరెస్టు చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. బాధితురాల్ని వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రిలో చేర్పించినట్లు వెల్లడించారు. ఇదీ చదవండి: మరోసారి నోరు జారిన ఎస్పీ నేత.. ఏమన్నారంటే.. -
బ్రహ్మ కుమారి ఆశ్రమంలో కలకలం.. ఇద్దరు మహిళల మృతి
ఆగ్రాలోని బ్రహ్మ కుమారి ఆశ్రమంలో కలకలం రేగింది. శుక్రవారం (నవంబర్ 10) రాత్రి ఇద్దరు మహిళలు (సిస్టర్స్) మృతి చెందారు. వారు ఆత్మహత్య చేసుకున్నట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. మృతుల దగ్గర సూసైడ్ నోట్స్ లభ్యమయ్యాయి. ఆశ్రమానికి చెందిన నలుగురు సిబ్బంది పేర్లు అందులో ఉన్నాయి. వారే తమ చావుకు కారణమని మృతులు పేర్కొన్నారు. పోలీసుల కథనం ప్రకారం.. చనిపోయిన ఇద్దరు మహిళలకు, వారి బంధువులకు మధ్య విభేదాలు ఉన్నాయి. వారు బ్రహ్మ కుమారి సంస్థ నుంచి రూ. 25 లక్షలతో పారిపోయి పొరుగున ఉన్న మధ్యప్రదేశ్లోని గ్వాలియర్లో ఉన్న మరొక ఆశ్రమానికి వెళ్లారు. బ్రహ్మకుమారి ఆశ్రమంలో ఇద్దరు మహిళలు చనిపోయినట్లు సమాచారం అందిన వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నట్లు ఖేరాఘర్ ఏసీపీ మహేష్ కుమార్ తెలిపారు. ఆ మహిళలు ఆత్మహత్య చేసుకున్నట్లు అనుమానిస్తున్నామని, మృతుల దగ్గర సూసైడ్ నోట్లు లభ్యమయ్యాయని చెప్పారు. మృతుల దగ్గర నుంచి సూసైడ్ నోట్లు, మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకుని మృతదేహాలను పోస్టుమార్టానికి తరలించినట్లు పేర్కొన్నారు. దర్యాప్తు కొనసాగుతోందని, ఇందుకోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు ఆయన వివరించారు. -
టీచర్పై గన్తో కాల్పులు జరిపి వార్నింగ్.. 40 సార్లు కాలుస్తా అంటూ..
లక్నో: ఉత్తరప్రదేశ్లో ఇద్దరు విద్యార్థులు రెచ్చిపోయారు. తమ స్కూల్కు చెందిన టీచర్పై గన్తో కాల్పులు జరిపి.. 39 సార్లు కాల్పులు జరుపుతామని వీడియోలో బెదిరించారు. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. దీనికి సంబంధించిన వీడియో వైరల్ కావడంతో ఆ ఇద్దరు యువకులను పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. వివరాల ప్రకారం.. ఉత్తరప్రదేశ్లోని ఆగ్రా జిల్లాలో ఇద్దరు విద్యార్థులు ఒక టీచర్పై తుపాకీతో కాల్పులు జరిపారు. ఖండౌలీ పోలీస్ స్టేషన్ పరిధిలోని మలుపూర్లో సుమిత్ సింగ్ అనే వ్యక్తి ఒక కోచింగ్ సెంటర్ నిర్వహిస్తున్నాడు. అతడి కోచింగ్ సెంటర్లో చదివిన ఇద్దరు విద్యార్థులు గురువారం ఆ టీచర్ను బయటకు పిలిచారు. వెంట తెచ్చిన గన్తో ఆయన కాలుపై కాల్పులు జరిపారు. అనంతరం అక్కడి నుంచి పారిపోయారు. కాలికి బుల్లెట్ గాయమైన టీచర్ను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. Video 1: Two students shot their teacher outside coaching in Agra,UP. Uploaded a video bragging about the shooting Video 2: We were inspired by videos of Lawrence Bishnoi. Please bail me out Those who consider Lawrence Bishnoi a hero have unknowingly made their children… pic.twitter.com/oHouUPysQG — journalist Miku (@snehasismiku) October 6, 2023 ఈ సందర్భంగా సదరు విద్యార్థులు తాము గ్యాంగ్స్టర్లమని నినాదాలు చేశారు. ఇక, ఆ యువకులు.. టీచర్పై ఇంకా 39 సార్లు కాల్పులు జరుపుతామని వీడియోలో బెదిరించారు. మరోవైపు టీచర్ కాలుపై కాల్పులు జరిపి పారిపోయిన విద్యార్థులు అనంతరం ఒక రీల్ చేశారు. వీడియోలో ‘ఆరు నెలల తర్వాత తిరిగి వస్తా. ఆ టీచర్ను 40 సార్లు కాల్చుతా, ఇంకా 39 బుల్లెట్లు మిగిలి ఉన్నాయి’ అని ఒక విద్యార్థి అందులో పేర్కొన్నాడు. కాగా, ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ నేపథ్యంలో ఆ ఇద్దరు యువకులను పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. టీచర్పై కాల్పులతోపాటు బెదిరింపు వీడియోపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇది కూడా చదవండి: ప్లీజ్ ఆదుకోండి.. హరిరామజోగయ్య పేరిట వీహెచ్కు ఫోన్ చేసి.. -
‘రాధాస్వామి’ గురువు ఎవరు? సత్సంగిలు ఏమి చేస్తుంటారు?
యూపీలోని ఆగ్రాలో గల రాధాస్వామి దయాల్బాగ్ శాఖ ఆమధ్య భూముల ఆక్రమణలకు పాల్పడిందనే ఆరోపణలు వినిపించాయి. కాగా రాధాస్వామి దయాల్బాగ్ శాఖలోని సత్సంగిలు తమదైన సత్సంగంలో ఉంటూ, లోకవ్యవహారాలకు దూరంగా ఉంటారు. ఈ వర్గానికి చెందిన గురువు కూడా ప్రచారానికి దూరంగా ఉంటారు. అతని గురించిన వివరాలు చాలా తక్కువగా కనిపిస్తాయి. ప్రస్తుతం సత్సంగ్కు గురువుగా వ్యవహరిస్తున్న డాక్టర్ ప్రేమ్ శరణ్ సత్సంగి ఐఐటీ పాసౌట్. విదేశాల్లోని ప్రముఖ విశ్వవిద్యాలయాల్లో ఉన్నత విద్యనభ్యసించారు. పీహెచ్డీ పూర్తి చేశారు. డాక్టర్ ప్రేమ్ శరణ్ సత్సంగి ఈ శాఖకు ఎనిమిదవ గురువు. ప్రేమ్ శరణ్ 2002 నుంచి గురువుగా వ్యవహరిస్తున్నారు. ఐఐటీ బనారస్ నుండి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో డిగ్రీ పొందిన తర్వాత ఆయన కొన్ని సంవత్సరాల పాటు అమెరికా, యూరప్లలోని ప్రముఖ విద్యా సంస్థలలో పనిచేశారు. డాక్టర్ ప్రేమ్ శరణ్ నిరంతరం తెల్లని దుస్తులలో కనిపిస్తారు. సరళత, క్రమశిక్షణతో కూడిన జీవితాన్ని గడుపుతారు. దానినే ఇతరులకూ బోధిస్తారు. ప్రతిరోజూ దయాల్బాగ్ అనుచరులను కలుసుకుంటుంటారు. దేశం నలుమూలల నుండి వచ్చిన సత్సంగిలు దయాల్బాగ్లో ఉంటారు. ఇక్కడ ఎవరికీ కులం ప్రస్తావన ఉండదు. సత్సంగి అనేది ఇంటిపేరుగా ఉంటుంది. ఇక్కడ నివసిస్తున్న చాలా మంది సత్సంగిలు ఉన్నత విద్యావంతులు. వీరు అర్హతలకు తగిన విధంగా పలు చోట్ల పనిచేస్తుంటారు. ఇది కూడా చదవండి: ఐఎఎఫ్హెలికాప్టర్ అత్యవసర ల్యాండింగ్ -
జువెనైల్ హోమ్లో అమానుషం.. పిల్లలను చెప్పుతో కొట్టిన అధికారి..
లక్నో: ఉత్తరప్రదేశ్లో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. జువెనైల్ హోమ్లో పిల్లలకు రక్షణ కల్పించాల్సిన ఓ ప్రభుత్వ అధికారి చిన్నారులపై అమానుషంగా ప్రవర్తించింది. బాల ఖైదీలుగా హోమ్లోకి వచ్చిన పిల్లలకు మంచి బుద్దులు, సత్ప్రవర్దన అలవాటు చేయాల్సిన ఓ మహిళా అధికారి తన బాధ్యతలు మరిచి వారిపై చేయి చేసుకుంది. చిన్న పిల్లలనే కనికరం లేకుండా కర్కశంగా కొట్టింది. ఈ ఘటన ఆగ్రాలో చోటుచేసుకుంది. మహిళా సూపరింటెండెంట్ చిన్నారులను కొడుతున్న దృశ్యాలు జువెనైల్ హోమ్లోని సీసీటీవీ ఫుటేజీలో రికార్డయ్యాయి. ఈ వీడియో సోమవారం వెలుగులోకి వచ్చింది. ఇందులో ఓ గదిలో ఆరుగురు చిన్నారులు బెడ్స్ మీద పడుకొని ఉన్నారు. అక్కడికి వచ్చిన సూపరిండెండ్ పాల్ ఇతర ఉద్యోగులు చూస్తుండానే ఒక్కసారిగా ఓ చిన్నారిపై దాడి చేసింది. చెప్పుతో పదే పదే చెంపదెబ్బలు కొట్టింది. మిగతా పిల్లలను కూడా తిడుతుండటం వీడియోలో కనిపిస్తుంది. అదే జువెనైల్ హోమ్లో నుంచి మంగళవారం మరో వీడియో బయటకు వచ్చింది. ఇందులో మళ్లీ సూపరిండింట్ ఏడేళ్ల వయస్సున్న ఓ అమ్మాయి చేతులు, కాళ్లు మంచానికి కట్టేసి పడుకోబెట్టింది. విడిపించుకనేందుకు ఆమె ప్రయత్నించినా సాధ్యపడలేదు. మంచం కిందకు జారిపోతుంది. ఈ రెండు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారడంతో అధికారి ప్రవర్దనపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.. జువెనైల్ హోమ్లో చిన్నారుల భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తూ.. సందరు సూపరింటెండెంట్ను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. In #Agra's govt run children shelterhome (Pachkuiyaan), Poonam Lal, the center superintendent was caught slapping a girl with slippers. Earlier she was booked for abetment to suicide in #Prayagraj district in 2021 after a 15-yr-old girl allegedly killed her self in shelter home pic.twitter.com/JE5V56jR7l — Arvind Chauhan 💮🛡️ (@Arv_Ind_Chauhan) September 12, 2023 రెండు ఘటనలపై ఉన్నతాధికారులు దర్యాప్తు జరిపారు. క్రూరంగా వ్యవహరించిన హోమ్ సూపరింటెండెంట్ పూనమ్ పాల్ను అధికారులు విధుల నుంచి సస్పెండ్ చేశారు. అంతేగాక కొన్ని రోజుల క్రితం ఆ హోమ్లో ఓ చిన్నారి ఆత్మహత్యకు సైతం ప్రయత్రించింది. కాగా పూనమ్ పాల్ గతంలోప్రయాగ్ రాజ్లో పనిచేసింది. అక్కడ కూడా పిల్లలపట్ల ఇంతే క్రూరంగా వ్యవహరించారని అధికారుల విచారణలో తేలింది. The department of woman and child development #UttarPradesh has suspended the accused superintendent Poonam Pal based on the investigation of #Agra DM. pic.twitter.com/jnLIxQtiQq — Arvind Chauhan 💮🛡️ (@Arv_Ind_Chauhan) September 12, 2023 ఆగ్రా డివిజన్ కమీషనర్ రీతూ మహేశ్వరి మాట్లాడుతూ.. ఈ సంఘటనలతో సంబంధం ఉన్న హోమ్ సూపరింటెండెంట్ పూనమ్ పాల్,ఇతర సిబ్బందిని సస్పెండ్ చేసినట్లు తెలిపారు. ఆమెపై ఎఫ్ఐఆర్ ఫైల్ అయ్యిందని కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా మేజిస్ట్రేట్ను ఆదేశించామని పేర్కొన్నారు. -
ఇంటి తవ్వకాల్లో పురాతన బాక్సు.. తెరిచి చూడగానే..
ఉత్తరప్రదేశ్లోని ఆగ్రాలో ఒక పురాతన ఇంటి తవ్వకాలు స్థానికంగా కలకలం రేపాయి. గతంలో ఈ ఇంటిలో ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ నరేష్ అగర్వాల్ ఉండేవారు. తాజాగా ఈ ఇంటి తవ్వకాల్లో మానవ అస్థిపంజరాలు లభించాయి. అయితే ఇవి ఎవరివనే విషయం ఇప్పటి వరకూ వెల్లడికాలేదు. కాగా ఇంటి తవ్వకాల్లో అస్థిపంజరాలు లభించాయని తెలియగానే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆ ఇంటిని సీల్ చేశారు. అస్థిపంజరాలను పరిశీలనకు ల్యాబ్కు పంపారు. ఇంటిలో అస్థిపంజరాలు దొరికాయన్న విషయం స్థానికంగా దావానలంలా వ్యాపించింది. దీంతో అవి ఎవరివంటూ స్థానికంగా చర్చలు జరుగుతున్నాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం డాక్టర్ నరేష్ అగర్వాల్ ఈ ఇంటిని అశోక్ అగర్వాల్ అనే వ్యక్తికి విక్రయించారు. తాజాగా అశోక్ అగర్వాల్ ఈ ఇంటిని పడగొట్టి నూతన భవనం నిర్మించే ప్రయత్నంలో ఉన్నారు. ఈ నేపధ్యంలో ఇంటి కూల్చివేతలు జరుగుతుండగా, కూలీలకు ఒక పెద్ద పురాతన బాక్సు లభించింది. ఆ బాక్సుకు ఉన్న తాళం బద్దలుగొట్టి లోపల ఏముందో చూసి, హడలెత్తిపోయారు. బాక్సులోపల మానవ అస్థిపంజరాలు ఉండటంతో వారు భయపడిపోయారు. పనులను ఎక్కడివక్కడ వదిలేసి అక్కడి నుంచి పారిపోయారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆ బాక్సును పరిశోధనాశాలకు తరలించారు. అక్కడి నుంచి రిపోర్టు రాగానే దర్యాప్తు చేపడతామని పోలీసులు తెలిపారు. అలాగే ఇంటి యజమానిని విచారిస్తున్నామన్నారు. ఇది కూడా చదవండి: అమెరికా అధ్యక్షులపై స్మార్ట్ గాడ్జెట్ల నిషేధం ఎందుకు? -
దొంగల తెలివి మామూలుగా లేదు.. 3 రోజుల్లోనే రాష్ట్రాలు దాటించేశారు..
సాక్షి, శ్రీకాకుళం: పలాసలో దొంగిలించిన బైక్ రూపు రేఖలు మార్చి మూడు రోజుల్లోనే రాష్ట్రాలు దాటించేసిన ఘటన పలాసలో చోటు చేసుకుంది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనకు సంబంధించి బైక్ యజమాని తెలిపిన వివరాల మేరకు.. పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలో శానిటేషన్ విభాగంలో పనిచేస్తున్న ఉదయ్శంకర్ పాత్రో మే 27న తన బండిని పోగొట్టుకున్నారు. పరిసర ప్రాంతాల్లో ఎంతగా గాలించినా ప్రయోజనం లేకపోయింది. అక్కడకు మూడు రోజుల తర్వాత ఆగ్రాకు యాభై కిలోమీటర్ల దూరంలో ఉన్న ఫతియాబాద్ పోలీసుల నుంచి ఆయనకు ఫోన్ కాల్ వచ్చింది. అక్కడ వాహన తనిఖీల్లో పోలీసులకు ఓ బండి దొరికిందని, ఇంజిన్ వివరాలను పరిశీలిస్తే పలాసకు చెందిన బైక్ అని నిర్ధారణ జరిగిందని వారు చెప్పారు. అయితే ఆ వాహనం ఫొటోలు చూసి ఉదయశంకర్ పోల్చుకోలేకపోయారు. తన బండి అలా ఉండదని చెప్పేశారు. కానీ అక్కడి పోలీసులు మాత్రం ఇంజిన్ వివరాలు మీ పేరు మీదే ఉన్నాయని స్పష్టం చేశారు. ట్యాంక్ కవర్ చింపేసి, అద్దాలు తీసేసి రూపురేఖలు మార్చేశారని వివరించారు. దీంతో ఆయన వెంటనే ఫతియాబాద్ వెళ్లి వాహనాన్ని పరిశీలించి అక్కడి పోలీసులకు సీ–బుక్ చూపించడంతో వివరాలన్నీ సరిపోయాయి. దీంతో ఆయనకు ష్యూరిటీపై బైక్ను తిరిగి అప్పగించారు. బైక్ దొంగతనాలు చేస్తున్న దొంగలు తెలివి మీరిపోయారని, రెండు మూడు రోజుల్లోనే బైక్ రూపురేఖలు మార్చేసి లారీలు ఎక్కించి రాష్ట్రాలు దాటించేస్తున్నారని బాధితుడు తెలిపారు. వాహనదారులు జాగ్రత్తగా ఉండాలని చెప్పారు. చదవండి: AP: కేఆర్ సూర్యనారాయణకు హైకోర్టులో ఎదురుదెబ్బ -
బీజేపీ ఎంపీకి బిగ్ షాక్.. రెండేళ్ల జైలు శిక్ష విధించిన కోర్టు
BJP MP Ramshankar Katheria.. లక్నో: ఉత్తరప్రదేశ్లో అధికార బీజేపీకి ఊహించని షాక్ తగిలింది. బీజేపీ ఎంపీకి కోర్టు రెండేళ్ల జైలు శిక్ష విధించింది. అయితే, ఆయన లోక్సభకు అనర్హుడయ్యే అవకాశం కూడా ఉంది. అయితే, సదురు ఎంపీకి ఓ వ్యక్తిపై దాడి కేసులో కోర్టు జైలు విధించడం విశేషం. వివరాల ప్రకారం.. ఉత్తరప్రదేశ్లోని ఇతావా నియోజకవర్గానికి చెందిన బీజేపీ ఎంపీ, మాజీ కేంద్ర మంత్రి రామ్ శంకర్ కటారియాకు ఆగ్రా కోర్టు రెండేళ్ల జైలు శిక్ష విధించింది. ఒక వ్యక్తిపై దాడి చేసిన కేసులో కటారియాకు కోర్టు రెండేళ్లు జైలు శిక్ష విధిస్తూ శనివారం తీర్పును వెల్లడించింది. ఈ నేపథ్యంలో లోక్సభ నుంచి అనర్హత వేటు పడే అవకాశమున్నది. కాగా, 2011లో ఆగ్రాలోని విద్యుత్ సరఫరా కంపెనీ మేనేజర్పై తన అనుచరులతో కలిసి దాడి చేశారు. నాడు ఆగ్రా ఎంపీగా ఉన్న ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇక, 12 ఏళ్ల నాటి దాడి కేసుపై ఆగ్రా కోర్టు విచారణ జరిపింది. రామ్ శంకర్ కటారియాను దోషిగా నిర్ధారించింది. రెండేళ్లు జైలు శిక్షతోపాటు రూ.50,000 జరిమానా విధించింది. ఇదిలా ఉండగా.. కోర్టు తీర్పుపై బీజేపీ ఎంపీ రామ్ శంకర్ స్పందించారు. కోర్టు తీర్పును గౌరవిస్తానని తెలిపారు. అయితే రెండేళ్ల జైలు శిక్షపై పైకోర్టులో అప్పీల్ చేస్తానని చెప్పారు. దీనికి సంబంధించిన న్యాయ విధానాలను పరిశీలిస్తున్నట్లు వెల్లడించారు. ఇదిలా ఉండగా.. రామ్ శంకర్ కటారియా నవంబర్ 2014 నుండి జూలై 2016 వరకు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ సహాయ మంత్రిగా పనిచేశారు. షెడ్యూల్డ్ కులాల జాతీయ కమిషన్ చైర్పర్సన్గా కూడా పనిచేశారు. అతను పార్లమెంటు స్టాండింగ్ కమిటీ ఆఫ్ డిఫెన్స్ మరియు కన్సల్టేటివ్ కమిటీ, హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖలో సభ్యుడుగా కొనసాగారు. #WATCH | "...I appeared before the court normally. Court has given a decision against me today. I respect the court, I have the right to appeal and I will exercise it," says BJP MP Ramshankar Katheria #RamshankarKatheria pic.twitter.com/QVmx8pfcAX — NewsMobile (@NewsMobileIndia) August 5, 2023 ఇది కూడా చదవండి: గుజరాత్లో బీజేపీకి షాక్.. జనరల్ సెక్రెటరీ ప్రదీప్ గుడ్ బై -
ఆగ్రాలో మరో దారుణం.. అపస్మారక స్థితిలో ఉన్న వ్యక్తిపై మూత్ర విసర్జన
లక్నో: మధ్యప్రదేశ్లో ఇటీవల ఓ వ్యక్తి గిరిజనుడిపై మూత్రం పోసిన సంఘటన మరువక ముందే ఆగ్రాలో అలాంటి మరో సంఘటన చోటుచేసుకుంది. అపస్మారక స్థితిలో రోడ్డు పక్కన నిద్రిస్తున్న ఉన్న ఓ వ్యక్తిపై మూత్రం పోస్తూ వీడియో తీసుకున్నాడు మరో ప్రబుద్ధుడు. మానవత్వానికి కళంకంగా నిలిచే సంఘటనలు ఒకదాని వెంట మరొకటి చోటు చేసుకంటూనే ఉన్నాయి. సమాజంలో ఇప్పటికీ వివక్షలు చాపకింద నీరులా ప్రబలుతూనే ఉన్నాయి. మొన్న మధ్యప్రదేశ్లో ఓ వ్యక్తి అమానుషంగా గిరిజనుడిపై మూత్రం పోసిన ఘటన సంచలనంగా మారిన విషయం తెలిసిందే. స్వయంగా ముఖ్యమంత్రే రంగంలోకి దిగడంతో సదరు నిందితుడు కటకటాల పాలవడమే కాకుండా అతని ఇల్లు కూడా నేలమట్టం చేశారు. ఒకపక్క ఇటువంటి చర్యలపై చట్టాలు కఠినంగా వ్యవహరిస్తున్నప్పటికీ కొంతమంది వాటిని ఖాతరు చేయడం లేదు. మధ్యప్రదేశ్ ఉదంతం గురించి తెలిసి కూడా ఆగ్రాలో ఓ వ్యక్తి రోడ్డు పక్కన నిద్రిస్తున్న మరో వ్యక్తిని కాలితో నిర్దాక్షిణ్యంగా తన్నుతూ ముఖం మీద మూత్రం పోశాడు. దీన్ని అతని స్నేహితుడు వీడియో తీశాడు. వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు వెంటనే రంగంలోకి దిగి మూత్రం పోసిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. మరో వ్యక్తి పరారీలో ఉన్నాడని వెతుకులాట కొనసాగుతోందని తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఈ వీడియో ఇప్పటిది కాదని మూడు నాలుగు నెలల క్రితం వీడియో అని ఇప్పుడు వైరల్ అయ్యిందని చెబుతూ మూత్రం పోసిన వ్యక్తిని ఆదిత్యగా, వీడియో తీసిన వ్యక్తి అటుస్ గా గుర్తించినట్టు తెలిపారు. నిందితుడిపై హత్యాయత్నం కేసు నమోదు చేసినట్టు తెలిపారు. వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి ఇది కూడా చదవండి: చైనాపై నమ్మకం సన్నగిల్లింది.. అజిత్ ధోవల్ -
Video: ఆగ్రాలో దారుణం.. టూరిస్ట్ను వెంబడించి.. ఇనుపరాడ్లతో దాడి
లక్నో: ఉత్తర ప్రదేశ్లో ఘోర ఘటన వెలు గుచూసింది. ఆగ్రాలోని తాజ్మహల్ను చూసేందుకు వచ్చిన ఓ పర్యాటకుడిపై స్థానిక యువకులు విచక్షణారహితంగా దాడి చేశారు. పర్యాటకుడిని వెంబడించి మరీ కర్రలు, ఇనుపరాడ్లతో చితకబాదారు. ఇదంతా మంగళవారం ఉదయం జరగ్గా.. దాడికి సంబంధించిన దృశ్యాలు ఓ షాప్లోని సీసీటీవీ ఫుటేజీలో రికార్డయ్యాయి. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్గా మారింది. న్యూఢిల్లీకి చెందిన ఓ వ్యక్తి తాజ్మహల్ చూసేందుకు ఆదివారం ఆగ్రా వచ్చాడు. ఈ క్రమంలో తాజ్గంజ్ ప్రాంతంలోని బసాయ్ చౌకీ వద్ద కారులో వెళ్తుండగా పక్కన నడుచుకుంటూ వెళ్తున్న భక్తులను తన వాహనం తాకింది. పర్యాటకుడు కారు ఆపి వాళ్లకు క్షమాపణలు చెప్పాడు. అయినా వారు వినిపించుకోకుండా దుర్భాషలాడుతూ దాడికి దిగారు. వారి నుంచి తప్పించుకునేందుకు భయంతో అతడు దగ్గర్లోని ఓ స్వీట్ షాప్లోకి పరుగెత్తాడు. అతన్ని వెంబడించిన దుండగులు షాప్లోకి చొరబడి కర్రలు, ఇనుప రాడ్లతో దాడికి తెగబడ్డారు. తప్పు అయ్యింది, క్షమించాలని వేడుకున్నా వదల్లేదు. కొంత సమయం పాటు అతన్ని చితకబాది అక్కడి నుంచి వెళ్లిపోయారు. Video from Agra . Tourist Beaten by Locals. #shameful #SeemaHaider #KiritSomaiya #Agra #DelhiFloods pic.twitter.com/zuXq7qdwLN — देश सर्वप्रथम (@deshsarvpratham) July 18, 2023 దీనిపై పోలీసులు స్పందిస్తూ.. ఈ ఘటనలో ఐదుగురు నిందితులను అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. తమలో ఒకడిని కారుతో ఢీ కొట్టాడన్న కారణంతోనే దాడి చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. మరోవైపు నిందితులపై కఠిన చర్యలు తీసకోవాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. తాజ్మహల్ గొప్ప పర్యటక ప్రాంతమని, దీనిని చూసేందుకు రోజు వేలల్లో టూరిస్టులు వస్తుంటారని, ఇలాంటి ఘటనలు జరగకుండా చూడాలని కోరారు. చదవండి: సరిహద్దులు దాటిన ‘కృష్ణ’ ప్రేమ.. బంగ్లాదేశ్ నుంచి రహస్యంగా వచ్చి.. पर्यटक के साथ मारपीट से संबंधित वायरल वीडियो का स्वत: संज्ञान लेकर, #थाना_ताजगंज पुलिस द्वारा तत्काल अभियोग पंजीकृत कर, 03 टीमों का गठन करते हुए, 05 आरोपियों को हिरासत में लिया गया है व अन्य आरोपियों की गिरफ्तारी हेतु लगातार प्रयास किया जा रहा है। pic.twitter.com/yoyjGb6J3d — POLICE COMMISSIONERATE AGRA (@agrapolice) July 17, 2023 -
కుక్కను కారులోనే వదిలి తాజ్మహల్ చూసి వచ్చారు.. తిరిగొచ్చి చూస్తే..
ఆగ్రా: తాజ్మహల్ సందర్శించడానికి వెళ్లిన ఒకతను తన వెంట పెంపుడు కుక్కను కూడా తీసుకెళ్లి కారులోనే వదిలి వెళ్లడంతో ఆ వేడికి ఊపిరాడక చనిపోయిన సంఘటన ఆగ్రాలో చోటు చేసుకుంది. వేసవి సెలవుల్లో హర్యానా నుండి తాజ్మహల్ని సందర్శించడానికి వెళ్లిన ఒక పెద్దమనిషి కార్లో తనతో పాటు తన పెంపుడు కుక్కను కూడా తీసుకుని వెళ్ళాడు. తాజ్మహల్ అందాలను ఆస్వాదించే సమయంలో అడ్డుగా ఈ శునకం ఎందుకు అనుకున్నాడో ఏమో పాపం ఆ మూగ జీవిని కారులోనే బంధించి పార్కింగ్ చేసి వెళ్ళిపోయాడు. ఆ వ్యక్తి తాజ్మహల్ అందాలను తనివితీరా ఆస్వాదించి తిరిగొచ్చి చూసే సరికి కారులో తన పెంపుడు కుక్క విగతజీవిగా కనిపించింది. కారులో బంధించిన ఆ కుక్క గంటల తరబడి పార్కింగ్లో ఎండ వేడిమికి తట్టుకోలేక ఊపిరాడక చనిపోయింది. భగభగ మండే ఎండలను మనుషులే తట్టుకోలేకపోతుంటే పాపం ఆ మూగజీవం ఏం భరిస్తుంది? వేసవితాపానికి విలవిలలాడి ప్రాణాలు విడిచింది. ఈ సంఘటన తాలూకు హృదయవిదారకమైన వీడియోని ట్విట్టర్లో పోస్ట్ చేసిన ఒకాయన.. పెంపుడు జంతువులను చేరదీయడం చేతకాకపొతే వాటిని పెంచుకునే ప్రయత్నం చేయకండి అని హితవు పలికాడు. A dog died due to heat and suffocation as his owners left him in their parked car to visit Taj Mahal. If you can’t treat your pets properly then don’t adopt them. https://t.co/4ZI7iMj6n1 — Rishi Bagree (@rishibagree) July 3, 2023 ఇది కూడా చదవండి: టైటాన్ విషాదం: నా భర్త, బిడ్డ చివరి రోజులు తలచుకుంటే..