-
వేతన జీవులకు గుడ్న్యూస్: ఈపీఎఫ్ వడ్డీని పెంచిన కేంద్రం
వేతన జీవులకు ఊరట కలిగించే నిర్ణయాన్ని తీసుకుంది కేంద్ర ప్రభుత్వం. 2023 ఆర్థిక సంవత్సరానికి గానూ ఈపీఎఫ్ వడ్డీ రేటును 8.15 శాతంగా కేంద్ర ఆర్థిక శాఖ నోటిఫై చేసింది. ఈ మేరకు 8.15 శాతం వడ్డీ రేటును కేంద్ర ప్రభుత్వం ఆమోదించినట్లుగా ఈపీఎఫ్ఓ ఓ సర్క్యలర్ విడుదల చేసింది. ఈపీఎఫ్ పథకం- 1952లోని 60 (1) పేరా కింద ప్రతి సభ్యుని ఖాతాలో 2022-23 ఆర్థిక సంవత్సరానికి గానూ వడ్డీని జమ చేసేందుకు కేంద్ర ప్రభుత్వ ఆమోదాన్ని తెలియజేసిందని కేంద్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ తెలియజేసినట్లు ఈపీఎఫ్ఓ సర్క్యులర్లో పేర్కొంది. దీని ప్రకారం గత ఆర్థిక సంవత్సరంలో చందాదారుల పీఎఫ్ ఖాతాల్లో జమ చేసిన పీఎఫ్ మొత్తానికి 8.15 శాతం వడ్డీని ఈపీఎఫ్ఓ సభ్యుల ఖాతాల్లో జమ చేస్తుంది. ఇంతకు ముందు 2021-22 ఆర్థిక సంవత్సరానికి 8.10 శాతం చొప్పున వడ్డీని ఈపీఎఫ్ఓ జమ చేసింది. కేంద్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ నేతృత్వంలోని ఈపీఎఫ్ఓ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ 23 ఆర్థిక సంవత్సరానికికి గానూ 8.15 శాతం వడ్డీ రేటును గత మార్చి 28న సిఫార్సు చేసింది. ఈ సిఫార్సును అనుసరించి, వడ్డీ రేటును ఆర్థిక శాఖ ఆమోదించి నోటిఫై చేయాలి. అప్పుడే సభ్యుల ఖాతాల్లో జమ అవుతుంది. సాధారణంగా, వడ్డీ రేటును ఆర్థిక శాఖ ద్వారా ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో తెలియజేస్తుంది. 2023 సంవత్సరానికి సంబంధించిన నోటిఫికేషన్ కోసం చందాదారులు ఇప్పటి వరకు వేచి చూశారు. ఎంప్లాయీస్ ప్రావెడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ అనేది దేశంలోనే అతిపెద్ద రిటైర్మెంట్ ఫండ్ మేనేజర్. ఇందులో 70.2 మిలియన్ల మంది ఉద్యోగులు, 0.75 మిలియన్ల కంపెనీలు సొమ్ము జమ చేస్తున్నారు. సబ్స్క్రైబర్ల పాస్బుక్ని పన్ను పరిధిలోకి వచ్చే, పన్నేతర విరాళాలుగా విభజించాల్సి రావడంతో తలెత్తిన సాఫ్ట్వేర్ సమస్యల కారణంగా 22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వడ్డీ జమ ఆలస్యమైంది. 2021-22లో రూ. 2.5 లక్షల కంటే ఎక్కువ కాంట్రిబ్యూషన్లపై వచ్చే పొదుపు ఆదాయంపై ప్రవేశపెట్టిన ఆదాయపు పన్ను దీనికి కారణం. -
పాక్ ప్రధానికి వినబడేలా.. మోదీ స్ట్రాంగ్ మెసేజ్
న్యూఢిల్లీ: ఉగ్రవాదం అనేది ఒక ప్రాంతానికే కాదు.. యావత్ ప్రపంచ శాంతికి ప్రమాదకారి. అలాంటి ఉగ్రవాద కట్టడిలో ద్వంద్వ వైఖరి అసలు పనికిరాదు. సీమాంతర ఉగ్రవాదానికి మద్దతు ఇచ్చే దేశాలను విమర్శించడానికి కూటమి వెనుకాడకూడదు.. అంటూ భారత ప్రధాని నరేంద్ర మోదీ గట్టి సందేశం ఇచ్చారు. మంగళవారం జరిగిన షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్(SCO) సదస్సులో(వర్చువల్)కి భారత్ అధ్యక్షత వహించింది. మన దేశం తరపున ప్రధాని మోదీ ఈ సదస్సులో ప్రసంగించారు. ఈ భేటీలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్, పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ తదితరులు పాల్గొన్నారు. అలాగే.. కజకస్థాన్, కిర్గిజిస్తాన్, తజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్, ఇరాన్(కొత్త సభ్యదేశంగా చేరింది) ప్రతినిధులు సైతం పాల్గొన్నారు. ఎస్సీవో సదస్సులో ప్రసంగించిన ప్రధాని మోదీ.. నిర్ణయాత్మకమైన చర్యల ద్వారా ఉగ్రవాదం, టెర్రర్ ఫైనాన్సింగ్లకు అడ్డుకట్ట వేయాలని పిలుపు ఇచ్చారాయన. పరస్సర సహకారంతోనే ఇది సాధ్యమవుతుందని సభ్య దేశాలను ఉద్దేశించి పేర్కొన్నారాయన. ఉగ్రవాదంపై సమిష్టింగా మనమంతా కలిసి పోరాడాల్సిన అవసరం ఉంది. ఈ విషయంలో ద్వంద్వ వైఖరి ఏమాత్రం సరికాదంటూ దాయాది దేశం పాక్కు చురకలంటించారాయన. ఇక ఇదే వేదిక నుంచి ప్రపంచం ఎదుర్కొంటున్న పలు సంక్షోభాలు.. సమస్యలపైనా ప్రధాని మోదీ చర్చించారు. 1996లో చైనా, కజకస్తాన్, కిర్గిజిస్తాన్, రష్యా, తజికిస్తాన్ల పంచ దేశాల కూటమితో షాంగై ఫైవ్ ఆవిర్భవించింది. దానికి కొససాగింపుగా ఏర్పడిందే SCO. ప్రస్తుతం ఇందులో తొమ్మిది సభ్య దేశాలు ఉన్నాయి. 2005 నుంచి షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్లో పరిశీలన దేశంగా భారత్ కొనసాగుతూ వస్తోంది. అయితే.. 2017లో ఆస్తానాలో జరిగిన సదస్సు ద్వారా పూర్తి సభ్యత్వ దేశంగా భారత్ మారింది. ఇదీ చదవండి: ఒకే ఫొటో.. అంత మందికి ఎలాగబ్బా? -
రూ.8.7 లక్షల కోట్లు.. 2.7 కోట్ల యూనిట్ల వాహనాలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: గత ఆర్థిక సంవత్సరంలో భారత్లో అన్ని విభాగాల్లో కలిపి తయారయ్యాయి. వీటి విలువ అక్షరాలా రూ.8.7 లక్షల కోట్లు. ఈ విలువలో 57 శాతం వాటా (రూ.5 లక్షల కోట్లు) ప్యాసింజర్ వాహనాలదేనని మేనేజ్మెంట్ కన్సల్టింగ్ సర్వీసెస్ కంపెనీ ప్రైమస్ పార్ట్నర్స్ నివేదిక వెల్లడించింది. ప్యాసింజర్ కార్ల విభాగంలో మధ్య, పూర్తి స్థాయి ఎస్యూవీలు, ఉప విభాగాలు సగ భాగం కంటే అధికంగా కైవసం చేసుకున్నాయి. విలువలో కాంపాక్ట్ ఎస్యూవీల వాటా 25 శాతం ఉంది. లగ్జరీ కార్లు 13 శాతం వాటాతో రూ.63,000 కోట్లు నమోదు చేశాయి. వినియోగదార్లు చవక చిన్న కార్లు, సెడాన్లను ఇష్టపడటం లేదు. అందుకే ఇటువంటి కార్ల వాటా మొత్తం విలువలో తక్కువగా ఉంది. తక్కువ ధరలో లభించే వాహనాల నుంచి ఫీచర్ రిచ్ వైపు కస్టమర్లు మళ్లుతున్నారని చెప్పడానికి ఈ గణాంకాలు నిదర్శనం. పరిమాణం కంటే విలువ పెరుగుదల వేగంగా జరుగుతోందని నమ్ముతున్నాము’ అని నివేదిక వివరించింది. టూ–వీలర్లు 2 కోట్లు.. ప్రైమస్ పార్ట్నర్స్ నివేదిక ప్రకారం.. భారత్లో ద్విచక్ర వాహనాల ఉత్పత్తి దాదాపు చైనా స్థాయిలో ఉంది. ఇక్కడి తయారీ ప్లాంట్ల నుంచి ఏటా 2 కోట్ల యూనిట్ల ద్విచక్ర వాహనాలు వెలువడుతున్నాయి. ఉత్పత్తి అయిన మొత్తం వాహనాల్లో పరిమాణం పరంగా 77 శాతం వాటా టూ–వీలర్లదే. మొత్తం వాహనాల్లో కమర్షియల్ వెహికిల్స్ 10 లక్షల యూనిట్లు ఉంటాయి. వీటిలో 2 టన్నుల లోపు సామర్థ్యంగల నాలుగు చక్రాల చిన్న క్యారియర్లు, ట్రాక్టర్ ట్రైలర్స్, టిప్పర్స్ సైతం ఉన్నాయి. వీటి విలువ రూ.1.7 లక్షల కోట్లు. కమర్షియల్ వెహికిల్స్ వాటా మొత్తం పరిమాణంలో 4 శాతం, విలువలో 19 శాతం కైవసం చేసుకుంది. గత ఆర్థిక సంవత్సరం నాటికి ఆటోమొబైల్ రంగం 1.9 కోట్ల మందికి ఉపాధి కల్పించింది’ అని వివరించింది. భారీ పెట్టుబడులు.. భారత్లో ద్విచక్ర, త్రిచక్ర వాహన విభాగాల్లో ఈవీలు ఎక్కువగా అమ్ముడవుతున్నాయి. ‘భారతీయ ఈవీ పరిశ్రమ చైనా, యూఎస్, ఈయూ వంటి అగ్ర దేశాల కంటే వెనుకబడి ఉంది. దేశంలో భారీ పెట్టుబడులు జరిగాయి. రాబోయే కొద్ది సంవత్సరాలలో దేశం తన ఈవీ విభాగాన్ని గణనీయంగా పెంచడానికి సిద్ధంగా ఉందని ఇది గట్టిగా సూచిస్తుంది. భారత్లో ఆటోమొబైల్ పరిశ్రమలో అపూర్వమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి. అనేక అంశాలు పరిశ్రమను పునర్నిర్మిస్తున్నాయి. ఈవీలు, ప్రత్యామ్నా య ఇంధనం, ఎలక్ట్రానిక్ విడిభాగాల వినియోగంలో పెరుగుదల, షేర్డ్ వెహికల్ రెంటల్స్/క్యాబ్ సర్వీస్ల వంటి అంశాలు భారతీయ ఆటోమొబైల్ రంగంలో పరివర్తనకు కారణమవుతున్నాయి’ అని నివేదిక పేర్కొంది. -
ఒకే బంతికి రెండు రివ్యూలు ధోనిని మించిపోయిన అశ్విన్..!
-
అమెరికాలో మినీ ఐపీఎల్ షెడ్యూల్ విడుదల..!
-
పుజారాకు షాక్ పాండ్యకు ప్రమోషన్..!
-
రక్త సారథులు.. ప్రాణ వారధులు
మదనపల్లె సిటీ : రక్తం ఎంత విలువైందో అందరికీ తెలిసిందే. ఒక యూనిట్ రక్తంతో ఒకరి ప్రాణాలే కాపాడొచ్చు. అత్యవసర సమయంలోనే కాదు... పలువురు వ్యాధిగ్రస్తులకు పక్షం రోజులకోసారి రక్తం ఎక్కించాల్సిందే. లేకపోతే వారి ప్రాణాలకే ప్రమాదం. కరోనా సమయంలో తలసేమియా, సికల్సెల్ వ్యాధిగ్రస్తులు, గర్భిణులకు ఒక యూనిట్ దొరకడం ఎంత కష్టంగా మారిందో చూశాం. ఆరోగ్యకరమైన వ్యక్తి ప్రతి మూడు, ఆరు నెలలకు ఒకసారి రక్తదానం చేయవచ్చుని వైద్యనిపుణులు చెబుతూనే ఉన్నారు. అయినా చాలా మంది వెనకడుగు వేస్తున్నారు. రక్తమిస్తే అనారోగ్యం పాలవుతామని అపోహ పడుతున్నారు. దీంతో రక్తనిల్వల కొరత ఎప్పుడూ ఏర్పడుతూనే ఉంది. బ్లడ్బ్యాంకు నిర్వాహకులు శిబిరాల నిర్వహణ, దాతల కోసం తరచూ పలు సంస్థలను కోరుతూనే ఉన్నారు. అయినా స్పందన అంతంత మాత్రమే లభిస్తోంది. కొంత మంది దాతలు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారు. రక్తదానం చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇలాంటి వారు పలువురికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు. బుధవారం ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా ‘సాక్షి’ ప్రత్యేక కథనం. ఇవ్వడమే కాదు.. ఇప్పిస్తారు రక్తం ఇవ్వడమే కాదు. అవగాహన కల్పించి ఇతరులతో ఇప్పించడం కూడా గొప్ప విషయమే. ఈ విషయంలో రెండో కోవకు చెందుతారు అబూబకర్సిద్దిక్. మదనపల్లె పట్టణంలో హెల్పింగ్మైండ్స్ సంస్థను ఏర్పాటు చేశారు. తరచూ రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేస్తారు. అంతే కాకుండా అత్యవసర సమయంలో ఎవరైనా ఫోన్ చేస్తే వారికి రక్తం ఇస్తారు. ఇప్పటి రకు 38 సార్లు రక్తదానం చేశారు. సంస్థ తరఫున పదేళ్లలో సుమారు 18 వేల మందితో రక్తదానం చేయించారు. చిరు వ్యాపారి.. రక్తదానంలో మేటి మదనపల్లె పట్టణానికి చెందిన హర్షద్అలీ చిరు వ్యాపారం చేస్తూ జీవిస్తున్నాడు. స్నేహితుడు అనారోగ్యం పాలవడంతో ఓ గ్రూపు రక్తం అవసరం కావడంతో దొరకపోవడం వల్ల ఇబ్బందులు పడ్డాడు. అప్పటి నుంచి రక్తంతో ఎవరూ ఇబ్బందులు పడకూడదని రక్తదానం చేస్తున్నారు. ఇప్పటి వరకు 44 సార్లు రక్తదానం చేశారు. ఆపద వస్తే .. వాలిపోతాడు స్వర్ణకారుడిగా పని చేస్తూ స్వచ్ఛందంగా సేవలు అందిస్తున్నాడు మదనపల్లె పట్టణానికి చెందిన ఢంకనాచారి. ఆపదలో ఉన్న వారికి రక్తదానం చేసే తృప్తిలో ఎక్కడా ఉండదని నమ్మిన యువకుడు. బ్లడ్ బ్యాంకులో తన ఫోన్ నంబర్ ఇచ్చాడు. అత్యవసరమైతే ఫోన్ చేస్తే చాలు రక్తదానం చేస్తున్నాడు. ఇప్పటి వరకు 45 సార్లు రక్తదానం చేసి అందరి మన్ననలు పొందాడు. చదువుకుంటూ.. రక్తదాతగా మదనపల్లె పట్టణం నీరుగట్టువారిపల్లెకు చెందిన పుష్ప తిరుపతిలో ఫుడ్ టెక్నాలజీ కోర్సు చదువుతోంది. రక్తదానం చేయడం వల్ల ప్రాణాలు కాపాడవచ్చునని తెలుసుకుంది. ఎవరికికై నా ఆపద వస్తే చాలు రక్తదానం చేస్తుంది. ఇప్పటి వరకు ఆరు సార్లు రక్తదానం చేసింది. రక్తదానం చేయడమే కాకుండా సహ విద్యార్థినులకు రక్తదానం గురించి అవగాహన కల్పిస్తుంది. స్ఫూర్తి ప్రదాత శివాజీ డిగ్రీ చదువుతూ రక్తదానం చేస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు మదనపల్లె పట్టణం నీరుగట్టువారిపల్లెకు చెందిన శివాజి. వివేకా ఆశయ ఫౌండేషన్ తరచూ నిర్వహించే రక్తదాన శిబిరాలు ఏర్పాటులో సహాయ, సహకారాలు అందిస్తున్నాడు. ఇప్పటి వరకు 11 సార్లు రక్తదానం చేశారు. రక్తదానం గురించి విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నారు. సాఫ్ట్వేర్ ఇంజినీర్గా పని చూస్తూ.. సాఫ్ట్వేర్ ఇంజినీర్గా పని చేస్తూ సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నాడు మదనపల్లె పట్టణం నీరుగట్టువారిపల్లెకు చెందిన శివ. ఉద్యోగం చేస్తూ రక్తదాన శిబిరాలు నిర్వహిస్తే స్వచ్ఛందంగా రక్తదానం చేస్తున్నారు. ఇప్పటి వరకు ఆరు సార్లు రక్తదానం చేశారు. -
2023లో టాప్ 10 ఇన్స్టాగ్రామ్ ఫాల్లోవర్స్
-
మిస్వరల్డ్ పోటీలకు వేదికగా భారత్.. ఎంపిక జరుగుతుందిలా..
న్యూఢిల్లీ: ఈ ఏడాది జరగనున్న ప్రపంచ సుందరి ఎంపిక పోటీలకు భారత దేశం వేదికగా నిలవనుంది. ఈ మేరకు గురువారం ఢిల్లీలో జరిగిన ఓ మీడియా సమావేశంలో మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్ చైర్ పర్సన్, సీఈవో జూలియా మోర్గే ప్రకటన చేశారు. అప్పుడెప్పుడో 1996లో.. ప్రపంచంలోని అందగత్తెలంతా ఒకచోట చేరి తమ అందచందాలతో హొయలొలికిస్తూ, తెలివితేటలను ఇనుమడింపజేస్తూ ఆయా దేశాల కీర్తి పతాకాలను రెపరెపలాడించే భిన్నమైన వేదిక. అయితే ఈసారి జరగబోయే పోటీలకు వేదికగా నిలవనుంది భారత దేశం. గతంలో 1996లో ప్రపంచ సుందరి పోటీలకు వేదికగ నిలిచిన భారత్ సరిగ్గా 27 సంవత్సరాల తర్వాత మరోసారి ఈ పోటీలకు ఆతిధ్యమివ్వనుంది. ఈ పోటీల్లో మిస్ ఇండియా వరల్డ్ సినీ శెట్టి భారత దేశానికి ప్రాతినిధ్యం వహించనున్నారు. ఇదే విషయాన్ని ఢిల్లీ మీడియా సమావేశంలో స్పష్టం చేశారు మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్ ఛైర్ పర్సన్, సీఈవో జూలియా మోర్లే. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ.. ఈసారి పోటీలను భారతదేశంలో నిర్వహించడం చాలా సంతోషకరం. నవంబర్ నెలలో జరగబోయే 71వ ప్రపంచ సుందరి పోటీలకు సంబంధించిన వేదికతో పాటు తేదీ వివరాలు ఇంకా ఖరారు కావాల్సి ఉంది. మొతం 130 దేశాలకు చెందిన సుందరీమణులు ఈ పోటీల్లో పాల్గొననున్నారని తెలిపారు. పోటీల్లో భాగంగా సుందరీమణులు ప్రతిభా పాటవాలు, సేవాతత్వ దృక్పధం, క్రీడా ప్రతిభ తోపాటు ఇతర అంశాల్లో కూడా రౌండ్లవారీగా పోటీ పడతారు. మిస్ వరల్డ్ గా ఎంపికయ్యే సుందరీమణి మార్పునకు రాయబారిగా వ్యవహరించనున్నారు కాబట్టి ఈ అంశాలన్నిటినీ స్పృశించి ప్రపంచ సుందరిని ఎంపిక చేయడం జరుగుతుందని అన్నారు జూలియా. ఈ కార్యక్రమంలో 2022 ప్రపంచ సుందరి కరోలినా బియెలావ్ స్కా కూడా పాల్గొని.. నా చేతులతో నా వారసురాలికి ఈ కిరీటం ధరింపజేయడానికి ఎదురుచూస్తున్నానని సాంప్రదాయానికి ప్రతిరూపమైన భారత్లో ఈ పోటీలు జరగడం సంతోషంగా ఉందన్నారు. ఇది కూడా చదవండి: భారత విద్యార్థులకు భరోసానిచ్చిన కెనడా ప్రధాని -
పాకిస్థాన్ లేకుండానే ఆసియా కప్ ఇండియా ఆలా చేస్తే పాకిస్థాన్ కి బారి నష్టమే..!
-
చెన్నైVS గుజరాత్
-
నవీన్ ఉల్ హుక్ కి ఎటకారం ఎక్కువే ..
-
మీ కోసమే వచ్చా.. సల్లు భాయ్కి ప్రపోజ్ చేసిన అమ్మాయి!
బాలావుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ బీటౌన్తో పాటు టాలీవుడ్లోనూ పరిచయం అక్కర్లేని పేరు. ఇటీవలే బుట్టబొమ్మ పూజా హేగ్డేతో కలిసి కిసీ కా భాయ్.. కిసీ కీ జాన్ అంటూ ప్రేక్షకులను అలరించాడు. అయితే ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద అభిమానులను అంతగా మెప్పించలేకపోయింది. అయితే ప్రస్తుతం ఆయన దుబాయ్లో జరుగుతున్న ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ అవార్డులు(ఐఫా) అవార్డుల కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇప్పటివరకు పెళ్లి చేసుకోని బాలీవుడ్ స్టార్ హీరోకు ఈవెంట్లో ఓ మహిళా అభిమాని ఊహించని ప్రశ్నతో సర్ప్రైజ్ ఇచ్చింది. (ఇది చదవండి: దానివల్లే శాకుంతలం సినిమాకు కలెక్షన్స్ రాలేదు: పరుచూరి) మీరు నన్ను పెళ్లి చేసుకుంటారా? అంటూ సల్మాన్ఖాన్కు ప్రపోజ్ చేసింది ఓ అభిమాని. 'సల్మాన్ ఖాన్ నిన్ను ఇష్టపడుతున్నా. ఈ విషయం చెప్పేందుకే హాలీవుడ్ నుంచి ఇక్కడి దాకా వచ్చా. నిన్ను చూసిన క్షణంలోనే ప్రేమలో పడ్డా' అంటూ తన ప్రేమను వెల్లడించింది. దీనికి సల్మాన్ ఖాన్ చమత్కారంగా సమాధానమిచ్చారు. మీరు షారుక్ ఖాన్ గురించి మాట్లాడుతున్నారా? అంటూ జోక్ చేశారు. (ఇది చదవండి: సారా- గిల్ డేటింగ్ రూమర్స్.. అంతలోనే విడిపోయారా?) లేదు.. మిమ్మల్నే ప్రేమిస్తున్నాను.. పెళ్లి చేసుకుంటారా? అని మరోసారి అడగ్గా.. మీరు 20 ఏళ్ల నన్ను కలిసి ఉండాల్సిందని సరదాగా బదులిచ్చారు. కాగా.. సల్మాన్ఖాన్కు గతంలో పలు బ్రేకప్ స్టోరీలు ఉన్న విషయం తెలిసిందే. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన తన ప్రేమ కథల గురించి మాట్లాడారు. View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) -
రూ.2 వేల నోటు: జూన్ బ్యాంకు హాలిడేస్ లిస్ట్ చూస్తే షాకవుతారు!
సాక్షి,ముంబై: ప్రతీ నెల చివరి వారంలో తదుపరి నెలలోని పండుగలు, బ్యాంకు హాలిడేస్పై ఆసక్తి ఉంటుంది. అందులోనూ పెద్ద నోటు రూ.2 వేల రీకాల్ నేపథ్యంలో జూన్ నెలలో బ్యాంకుల సెలవులకు మరింత ప్రాధాన్యత నెలకొంది. జూన్లో ఏకంగా 12 రోజులు బ్యాంకులు మూతపడనుండటం ఒక విధంగా నోట్ల మార్పిడికి ప్రయత్నిస్తున్న ఖాతాదారులకు షాకింగ్ అనే చెప్పాలి. (ఐపీఎల్ 2023: ముంబై ఇండియన్స్ ద్వారా అంబానీల సంపాదన ఎంతో తెలుసా?) రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటన ప్రకారం ప్రజలు తమ వద్ద ఉన్న రూ. 2 వేల నోట్ల మార్పిడికి, డిపాజిట్లకు గడువు సెప్టెంబర్ 30తో ముగియనుంది. ఈ నేపథ్యంలో రెండు , నాలుగు శనివారాలు, ఆదివారాలతో కలిపి జూన్ నెలలో మొత్తం 12 రోజుల సెలవుల వివరాలు మీకోసం.. జూన్ నెలలో బ్యాంకుల సెలవులు జూన్ 4: ఆదివారం జూన్ 10: రెండో శనివారం జూన్ 11: ఆదివారం జూన్ 15: రాజా సంక్రాంతి కారణంగా మిజోరం, ఒడిశాలో బ్యాంకులకు సెలవు జూన్ 18: ఆదివారం జూన్ 20: రథయాత్ర ఒడిశా, మణిపూర్లో సెలవు జూన్ 24: చివరి, నాలుగో శనివారం జూన్ 25: ఆదివారం జూన్26: త్రిపురలో మాత్రమే సెలవు జూన్ 28: ఈద్ ఉల్ అజా, మహారాష్ట్ర, జమ్మూ కశ్మీర్, కేరళల బ్యాంకులకు సెలవు జూన్ 29: బక్రీద్ దేశవ్యాప్తంగా సెలవు జూన్ 30: రెమ్నా ఈద్-ఉల్-అజా మిజోరం, ఒడిశాలో సెలవు. ఇదీ చదవండి: మరో 9 వేల మందికి పింక్ స్లిప్స్ సిద్ధం: రూ 2 వేల కోట్ల డీలే కారణమా? Neuralink మనిషి మెదడులో చిప్ ప్రయోగాలు: మేము సైతం అంటున్న ట్వీపుల్ -
అదే LSG కొంప ముంచింది ఇకనయినా కళ్ళు తెరవండి
-
ఫైనల్ బెర్త్ ఎవరిది..
-
ఫైనల్ కి వెళ్ళేది ఏవరు.. ప్రెజర్ లో GT జోష్ లో MI
-
నవీన్ ఉల్ హక్ కి చెంపపెట్టులా కోహ్లి పై LSG ట్వీట్
-
ధోని గురించి ఆఒక్క మాటతో టచ్ చేసిన హర్దిక్ పాండ్య,
-
పీక్స్ కి చేరిన ధోని రవీంధ్ర జడేజా గొడవలు...మధ్యలో ఏంట్రీ ఇచ్చిన జడ్డు వైఫ్
-
రింకూ సింగ్ పై గౌతమ్ గంభీర్ పోస్టు వైరల్
-
కోహ్లి కన్నీళ్లు పెట్టిన వేళ డ్యుప్లెసిస్ వ్యాఖ్యలు
-
CSK సక్సెస్ ఫార్మలా చెప్పిన ధో ని
-
కర్ణాటక ఎగ్జిట్ పోల్స్
-
ఐపీల్ లో ప్లే ఆఫ్ కు చేరుకునేది ఎవరు?